మైదాన గిరిజ‌నుల‌కు మ‌ర‌ణ శాస‌నం

నాన్‌ షెడ్యూల్‌ ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతాల్లో విలీనం చేయాలని మైదాన ప్రాంత గిరిజనులు చేస్తున్న ఉద్యమం ఉధృతం అవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి వారు చేస్తున్న ఉద్యమాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన నేపధ్యంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరి స్తున్నారు. ఈనేపధ్యంలో ఏపీలో మైదాన ప్రాంతాల్లో ఉన్న సుమారు 800 గిరిజన గ్రామాలను విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతే కాకుండా విశాఖ జిల్లా నాతవరం మండలంలో ఉన్న నాలుగు మైదాన ప్రాంత పంచాయితీలను విశాఖ మెట్రో పాలిటిన్‌ రీజయన్‌ డవలప్‌మెంట్‌ అధారిటీ (వీఎం ఆర్‌డీఏ)లో విలీనం చేశారు. వాటిని షెడ్యూల్‌ ప్రాంతాల్లో కలపాలని కూడా ఆ ప్రాంత గిరిజనులు డిమాండ్‌ చేస్తూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలసి వినతిపత్రాలు అందజేయడం జరుగుతుంది. ఫలితంగా మైదాన ప్రాంత గిరిజనుల గోడును గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.పుష్పశ్రీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంత శాసన సభ్యులు, పాడేరు ఎమ్మేల్యే కె. భాగ్యలక్ష్మీ,అరకు ఎమ్మెల్యే సిహెచ్‌. ఫాల్గుణ, శ్రీకాకుళం, విజయనగరం గిరిజన నియోజకవర్గాల శాసనసభ్యులు కలసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మ్మోహన్‌ రెడ్డికి తెలియజేశారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎన్ని ఉద్యమాలు చేసినా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో నాన్‌షెడ్యూల్‌ ఏరియా గిరిజనుల జీవనవిధానం మరణశాసనంగా మారింది. అడవినే నమ్ముకొని బ్రతుకుతున్న తాము ఆదివాసులమే అని చెప్పుకుంటున్నా పట్టించుకోని నాధుడు కరవయ్యారు. – సైమన్‌ గునపర్తి ఒకపక్క జిల్లాలు పునర్విభజన కార్యక్రమం ముమ్మ రంగా సాగుతున్నప్పటికీ మైదాన ప్రాంతాలు విలీనం ఒక్క కొలిక్కి రాకపోవడం, ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీని ఇవ్వకపోవడంతో ఆ ప్రాంత గిరిజనులు ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తూన్నారు. ఈవిషయంపై అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి పార్లమెంటు సమావేశాల్లో మార్చి 28న పార్లమెంటు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల తరబడి మైదాన ప్రాంత మండలలో జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను 5వ షెడ్యూల్‌ పరిధిలోకి తీసుకు రావాలని ఉన్న ప్రధానమైన డిమాండును మార్చి 28న పార్లమెంట్లో గళమెత్తి వినిపించారు.దేశంలో 5వ షెడ్యూల్‌ పరిధిలో ఉన్న అనేక రాష్ట్రాలో ఇదే పరిస్థి ఉందని మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 50శాతంపైగా గిరిజనులు నివసిస్తున్న గ్రామలు మైదానప్రాంత మండలలో ఉండటం వల్లన ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులు వారి జీవనం కొనసాగించడం కష్టతరమైన తరుణంలో వారికి ఐటిడిఏ నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో మరింత వెనకబడిపోతున్నారని కావున వారినీ దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ నుంచి అన్ని రకాల సహాయ సహకారలు అందేరీతిలో రాజ్యాంగ భద్రత కల్పించవలసిందిగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీ అర్జున్‌ ముండాను అరకు ఎంపీ కోరారు. నాన్‌ షెడ్యూల్‌ ఏరియాల్లో గిరిజనులకు హక్కులు ఎందుకు లభించట్లేదు?
వాళ్లంతా గిరిజనులు. రాజ్యాంగపరంగా గుర్తింపు పొందినా సరే.. వాళ్లకు ఏజెన్సీలో ఉన్న రాయితీలు అందడం లేదు. కనీసం రిజర్వేషన్లు కూడా వర్తించడం లేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కుల్ని కోల్పోతున్న గిరిపు త్రుల దుస్థితి ఇది. గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా, కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికార్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండటమే.
ఏజెన్సీ, షెడ్యూల్డ్‌ ఏరియా అంటే…
బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు, ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత, ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు. అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌1874 అమల్లోకి తెచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమి తులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్షణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ప్రభుత్వం నోటిఫై చేసిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందుతారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చట్టం అమలు చేసే ప్రక్రియలో గిరిజనుల ఆచార, సంప్రదాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయిదో షెడ్యూల్‌ లో ఉన్న గిరిజన ప్రాంతాలను తొలగించడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ‘‘షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజ నులకు…హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంది. షెడ్యూల్డ్‌ ఏరియా గ్రామాల్లో ఆదివాసి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలని చెప్పే 1/70వంటి చట్టాలు అమ లులో ఉంటాయి. అదే నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో అయితే గిరిజనుల భూముల్ని ఎవరైనా కొనవచ్చు, అమ్ముకోవచ్చు. ఈ భూ ములపై సివిల్‌ కోర్టుల్లో కేసులు కూడా వేయ వచ్చు’’ అని నాన్‌-షెడ్యూల్డ్‌ గిరిజనుల సంఘం గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే సబ్‌ ప్లాన్‌ నిధులు షెడ్యూల్డ్‌ ఏరియాకే వర్తిస్తా యని, గ్రామసభలకు అధికారాలిచ్చే పీసా చట్టం లాంటివి అమల్లో ఉంటాయని గంగరాజు వెల్లడిరచారు. మైనింగ్‌ అనుమతులు ఇవ్వాల న్నా గ్రామసభల అనుమతి కావాల్సిందేని ఆయన తెలిపారు. ‘’నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో పీసా చట్టం, గ్రామ సభల అనుమతులతో పని లేదు. ఇలా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజనులు రాజ్యంగం కల్పించిన హక్కులను, రక్షణను పొందలేకపోతున్నారు’’ అన్నారు.
షెడ్యూల్డ్‌ ప్రాంతంగా మారాలంటే…
విశాఖపట్నంలోని నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ప్రాంతాల్ని వీఎంఆర్డీఏలో చేర్చడాన్ని తప్పు పడుతూ గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏవైతే షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు అర్హతలున్న గ్రామాలను ఏజెన్సీలో కలిపేందుకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని రావికమతం మండలం తహాశీల్దార్‌ కనకరావు చెప్పారు. ‘‘రావికమతం మండలంలో నాన్‌ -షెడ్యూల్డ్‌ ఏరియాలో 33రెవెన్యూ గ్రామా లున్నాయి. ఎస్టీ జనాభా 50శాతంకంటే ఎక్కువ ఉన్నగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చవచ్చంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నాం. జనాభాతో పాటు అక్షరాస్యత, సమీప షెడ్యూల్డ్‌ ప్రాంతం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసు కోవాలని ప్రభుత్వ గైడ్‌ లైన్స్‌ లో ఉంది. రావిక మతం మండలంలో 5 గ్రామాల్లో 50శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నారు’’ అని కనకరావు చెప్పారు.
‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’
రాజ్యాంగంలో ఆర్టికల్‌ 244(1) ఆర్టికల్‌, అయిదవ షెడ్యూల్‌ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు విఫలమయ్యారని ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ అన్నారు. గిరిజనుల హక్కులు,సంక్షేమం,నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాల అంశాలను ప్రస్తావిస్తూ…తెలంగాణా సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు.‘‘ప్రాజెక్టుల విషయంలో పీసా, అటవీ హక్కుల చట్టాల కింద గ్రామ సభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభుత్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్‌ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతా ల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడు తున్నారు. ప్రభుత్వాలు గిరిజనే తరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ విష యాలను గుర్తించి, మీరు తగిన చర్యలను తక్షణమే తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో మైదాన ప్రాంతంలో వున్న 13 మండలాలను విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ)లో విలీనం చేయడం తో కొత్త వివాదానికి తెరలేచింది. ఏజెన్సీకి ఆనుకుని మైదాన ప్రాంతంలో వున్న గిరిజన గ్రామాలను వీఎంఆర్‌డీలో చేర్చడంపై గిరిజ నులు భగ్గు మంటున్నారు. తమ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలన్న రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని వాపోతున్నారు.జిల్లాలో మొత్తం 43 రెవెన్యూ మండలాలు వుండగా వీటిల్లో 19 మండలాలను గతంలోనే వీఎంఆర్‌డీఏ పరిధిలో చేర్చారు. తాజాగా ఏజెన్సీలోని 11 మండలాలు మినహా మైదాన ప్రాంతంలో మిగిలిన 13 మండలాలను కూడా వీఎంఆర్‌డీఏలో విలీనం చేశారు. అయితే జిల్లాలో ఏజెన్సీకి ఆనుకుని వున్న మైదాన ప్రాంతంలోని నాతవరం నుంచి దేవరాపల్లి వరకు ఎనిమిది మండలాల్లో 113 రెవెన్యూ గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో లక్షా 60 వేల మంది గిరిజనులు నివాసం వుంటున్నారు. ఈ గ్రామాలు నాన్‌ షెడ్యూల్డు ఏరియాలో వుండడంతో ఐటీడీఏ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు.
షెడ్యూల్‌ ఏరియాలో కలిపితే ఎంతో మేలు
గిరిజన జనాభా ఎక్కువ ఉన్న నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలోని గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపితే గిరిజనులకు ఎంతో మేలు జరుగు తుందని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్య లక్ష్మి, శెట్టి ఫాల్గుణ అన్నారు. 50శాతం కంటే ఎక్కువ గిరిజనులు నివసిస్తున్న నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు ఐటిడిఎ పిఒ గోపాలకృష్ణ రోణంకి ఆధ్వర్యంలో ఐటిడిఎ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నుంచి నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న గిరిజనులు తమ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని కోరుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారికి అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఐటిడిఎ పిఒ గోపాలకృష్ణ మాట్లాడుతూ గిరిజనుల కోసం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగిందని, 2011 జనాభా ప్రకారం 50 శాతం పైగా గిరిజన జనాభా ఉన్న గ్రామాలను 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో చేర్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. అర్హత కలిగిన గ్రామాలను గుర్తించి గ్రామసభల ద్వారా తీర్మానాలను తమ కార్యాల యానికి సమర్పించాలని నాన్‌ షెడ్యూల్‌ మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలను ఆదేశించారు.

పోలవరం ముందుకు సాగేనా..?

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో మెలిక పెట్టింది. మరోసారి సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహించాలని రాష్ట్రానికి షరతు విధించింది. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంపీలు బ్రహ్మానంద రెడ్డి, సత్యవతి, రెడ్డప్పలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిస్వేస్వర్‌ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌ తయారు చేయాల్సిందేనని నిబంధన విధించినట్లు జల్‌శక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు షెడ్యూల్‌ చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. పోలవరం నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15668 కోట్ల వరకే తమ బాధ్యత అని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 14336 కోట్లు మాత్రమే అని.. దీనిలో రూ. 12311 కోట్లు కేంద్రం రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని తెలిపారు. అలాగే రూ. 437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. కేంద్రం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కేంద్రం కొత్త మెలికపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెకు నిర్వా సతుల కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఒకపక్క ప్రధాన ప్రాజెక్టు ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు ఇంతవరకు మొదలెట్టలేదు. స్పిల్‌వే సుమారుగా పూర్తయింది. కానీ ఇంకా కొన్ని గేట్లు అమర్చాలి. ఎగువ కాఫర్‌డ్యామ్‌ గ్యాప్‌లను పూర్తి చేసి,ఇప్పటికే అక్కడ కొంత నీటిని నిల్వ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్టు ఏస్థాయిలో కదులు తుందో చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే నిధు లు కొరత.ఇటీవల కేంద్రం మంజూరు చేసిన రూ. 320 కోట్లు తిరిగివెళ్లిపోయాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టు సంగతి ఎలా ఉన్నా పోలవరం ముంపు గ్రామాల నుంచి బయటకు వచ్చిన వారికి ఇంకా రావలసిన సౌకర్యాలు ఇవ్వలేదు.
కొందరికి పునరావాస కాలనీలు నిర్మిం చారు. కానీ వారికి మనిషి ఒక్కరికి రూ.6.66 లక్షల వంతున రావలసిన సొమ్ము కూడా పూర్తిగా ఇవ్వలేదు.భూమికి భూమి ఇవ్వలేదు. అటు దేవీ పట్నం,మడుపల్లి,కె.వీర వరం తదితర గ్రామాలను గత జూన్‌లోనే ఖాళీ చేయించారు. కానీ ఇంత వరకూ వాళ్లకు కాలనీలు నిర్మించలేదు. పరిహార మూ పూర్తిగా ఇవ్వలేదు. ఇళ్ల పట్టాలు మాత్రం ఇచ్చారు. కానీ అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. పైగా అక్కడ పట్టాలు ఇవ్వడానికి సేకరించిన భూ మి యజమానికి సైతం ఇంకా డబ్బు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో నిర్వాసితులంతా, ఏజెన్సీలోని మిగతా ప్రాంతాల్లోనూ,గోకవరం వంటి ప్రాంతా ల్లోనూ అద్దె ఇళ్లలో ఉంటున్నారు. బలవంతంగా ఖాళీ చేయించిన అధికారులు కనీసం వాళ్లకు ఇళ్ల సౌకర్యం కూడా కల్పించలేదు. ఒక్కో కుటుంబం రూ.3వేల నుంచి అయిదు వేల వరకు అద్దె ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. అక్కడ అడవిని, పొలాలను వదిలిరావడంతో వారికి జీవనోపాధి కూడా లేదు. పునరావాస కాలనీల్లో ఉంటున్న ప్రజల పరిస్థితీ దయనీయంగా ఉంది. పనులు లేకపస్తులు ఉం టున్నారు. ఈనేపథ్యంలో వారంతామళ్లీ తమ గ్రామాలకు వెళ్లి ఏదొక విధంగా బతుకుదామనే నిర్ణయానికి వచ్చారు. దేవీపట్నం, మడుపల్లి గ్రామ ప్రజలు ఇప్పటికే రెవెన్యూ అధికార్లకు ఈ విషయం చెప్పారు.ఈనేపథ్యంలోనే తమ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ దేవీపట్నం సర్పంచ్‌ కుంజం రాజా మణి ఆధ్వర్యంలో గోకవరం మండలం కృష్ణుని పాలెంలో నిరశన దీక్ష కొనసాగిస్తుండగా,33వ రోజుకు చేరుకుంది.నిర్వాసితులు మాట్లాడుతూ ఇటీ వల మొదలెట్టినట్టు మొదలెట్టి, పనులు ఆపేసిన ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు, ఎందుకు మా బతుకులతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకూ ఆగుతాం,ఈలోగా పరిహారం ఇచ్చి,ఇళ్లను చూపించకపోతే తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోతామని దేవీపట్నం,పూడుపల్లికి చెందిన నిర్వాసితులు అల్టిమేటం ఇచ్చారు. వాస్తవానికి దేవీ పట్నం మండలంలో పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలు 44.అందులో 18గ్రామాలకు పునరావాసం కల్పించి అధికారులు ఖాళీ చేయిం చారు.కానీ వారికి కూడా ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు. ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా చూపించలేదు. కొండమొదలు ప్రాంతంలోని 11 గ్రామాలప్రజలు అధికారుల మాట బేఖాతర్‌ చేశా రు. తమకు అన్ని పరిహారంతోపాటు భూమికి భూమిఇచ్చి,కాలనీలు నిర్మించిన తర్వాతే వస్తామని ఖరాఖండీగా చెప్పారు.మిగతా గ్రామాలను మా త్రం నయోనో భయానో ప్రభుత్వం ఖాళీ చేయిం చింది. ఎంత దారుణమంటే గత ఏడాది జూన్‌ తర్వాత వరద సమయంలో వరదతో ఊళ్లన్నీ మునిగిపోతే కనీస వరద సహాయం కూడా చేయ లేదు.ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి కావడం 32 మీటర్ల ఎత్తువరకూ వరద నీరు రావడంతో ఊళ్లన్నీ వరద గోదావరిగా మారిపోయాయి. దీంతో చాలామంది ఊళ్లు ఖాళీ చేశారు.
ఇక ప్రభుత్వ అధికారులు ఎవరినీ తిరిగి గ్రామాలకు వెళ్లనీయలేదు. దీనితో దిక్కులేని బతుకు బతుకుతున్నారు. ఇంతవరకూ పరిహారం అందక పోవడం,పునరావాస కాలనీలు కూడా పూర్తి కాక పోవడంతో,అసలు ఈప్రాజెక్టు పరిస్థితి అర్థం కాక, తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోవడానికి ప్రజ లు సిద్ధమవుతున్నారు. ఒకగ్రామంకదిలిందంటే మిగతా వారు కూడా కదిలే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పోలవరంకథ మళ్లీ మొదటికి వస్తుందేమోననే అను మానం ఉంది.
నిర్వాసితులకు ఏ సమస్యా రానివ్వం
పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితుల త్యాగం మరవలేనిదని, అందుకు అనుగుణంగా గతంలో తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోపక్క అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో రూ.488 కోట్లతో 3,905 ఇళ్లతో నిర్మిస్తున్న ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ, తూర్పుగోదావరి జిల్లా దేవీ పట్నం మండలం ఇందుకూరు-1 పునరా వాస కాలనీలను కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. పోల వరం ప్రాజెక్టుకోసంఎంతో మంది గిరిజనులు తమ గ్రామాలను,గృహాలను ఖాళీచేసి ప్రాజెక్టు నిర్మా ణానికి త్యాగం చేశారన్నారు. ప్రస్తుతం వారి కోసం గృహ నిర్మాణాలు చకచకా సాగుతున్నాయని, ప్రతి ఒక్కరికీ మంచి గృహ వసతి,పునరావాసం కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్వాసితులకు ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను అమలు చేసేందుకు కేంద్రంతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకు కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖ రరెడ్డి గతంలో ఇచ్చిన రూ.1.50లక్షల నష్టపరి హారానికి మరో రూ.3.50లక్షలపరిహారాన్ని అద నంగాఅందించేందుకుచర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగత ప్యాకేజీకి సంబంధించి కేంద్రం రూ.6.80 లక్షలకు అదనంగా మరో రూ.3.20 లక్షలు కలిపి మొత్తంరూ.10లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటా మని చెప్పారు.‘పునరావాస పనులపై జిల్లా కలెక్టర్లు, ఆర్‌అండ్‌ఆర్‌ అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది.కాలనీలో పర్యటించినప్పుడు నిర్వాసి తులు కొన్ని సమస్యలు చెప్పారు. వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపుతుండటం సంతోషం. మిగిలిన అన్ని సమస్యల పరిష్కారానికి మరింత చొరవ తీసుకోవాలి’ అని సూచించారు.
గిరిజనులతో మాటామంతి
నిర్వాసితుల సమస్యలు ఆలకిస్తూ వారికి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి షెకావత్‌ల పర్యటనసాగింది. ఇందు కూరు-1 కాలనీ ముఖద్వారంవద్ద గిరిజనులు వారికి నుదుట బొట్టుపెట్టి, గిరిజన సంప్రదా యంగా కొమ్ములతో తయారు చేసిన తలపాగాలను ధరింపచేసి అభిమానాన్ని చాటుకున్నారు. కాసేపు వాటిని తలపై ఉంచుకుని సీఎం, కేంద్ర మంత్రి కాలనీలో నడుచుకుంటూ గిరిజనులను ఆనందింప చేశారు. కాలనీలో అభివృద్ధి కార్యక్రమాల గురించి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ ఆదిత్యవారికి వివరించారు. కాలనీలోఉన్న ఏను గులగూడెంకు చెందిన తురసం లక్ష్మి ఇంటికి వెళ్లి మంచంపై కూర్చుని ఇంట్లో ఉన్న వారితో కాసేపు ముచ్చటించారు. సీఎం ఆఇంటిని ఆసాంతం పరిశీ లించారు. ఫొటో గ్యాలరీని తిలకించారు. కాలనీ లో ఉన్న 350ఇళ్లలో 40 మినహా మిగిలిన ఇళ్లల్లోకి నిర్వాసితులు అంతా వచ్చేశారని, భూమికి భూమిగా 161ఎకరాలు 87మంది నిర్వాసితులకు అంద జేసినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ సీఎంకు వివరించారు. అనం తరం సీఎం, కేంద్ర మంత్రి లబ్ధిదారులతో ముఖా ముఖి నిర్వహించారు. వారు చెప్పిన సమస్యలను ఓపిగ్గా విన్నారు. మధ్యలో కేంద్రమంత్రి కల్పించు కుం టూ.. సొంత గ్రామ అనుభూతిని ఈ కాలనీలో పొందుతున్నారా.. అని ప్రశ్నించగా, లబ్ధిదారులు చాలా బాగుందని చెప్పారు. అనంతరం అందరి వినతులు స్వీకరించి అక్కడి నుంచి ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇళ్లు బావున్నాయి: షెకావత్‌ ప్రశంసలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అవసరతను గుర్తించి, ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు కదిలారని కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. ఏపీవిభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోం దన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌, ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల ఢల్లీిలో సుదీర్ఘంగా చర్చించారని, త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్త య్యేలా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు.నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తా మని స్పష్టం చేశారు.అంతకు ముందు సీఎం, కేంద్ర మంత్రి..నిర్వాసితులు లక్ష్మీకాంతం, వెంకట స్వామి గృహాలను ప్రారంభించి, వసతులను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితులకు అన్ని వస తులతో కూడిన గృహాలను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌ నిర్మిస్తున్నారని అభినందించారు. ‘పునరా వాస కాలనీలో మౌలిక వసతులు చాలా బాగున్నా యి. నిర్వాసితులు మాదృష్టికి తెచ్చిన ఉపాధి, ఇతర సమస్యలను ఎలా పరిష్కరించాలని ముఖ్య మంత్రి జగన్‌, నేను మాట్లాడుకున్నాం. ఈ ప్రాజెక్టు కోసం ఏసహకారం కావాలని రాష్ట్రం అడిగినా సహాయ పడతాం.మరోసారి ఇక్కడికి వస్తాను’ అని చెప్పారు. నిర్వాసితుల డిమాండ్స్‌
ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పెంచి రూ. పది లక్షలు ఇవ్వాలని.(దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 244 జీ. ఓ. ను తేవడమే కాకుండా,500 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది.) ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకే జీకి అర్హులుగా గుర్తించి సర్వేలో ఉన్న వారు మర ణించి నట్లయితే ఆ సొమ్మును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని. సర్వే రిపోర్టులో ఉన్న 18 సం.లు నిండిన ఆడపిల్లలపేర్లు పెండ్లి చేసుకు న్నారని తొలగించారని, వారికి కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌ ఓఎఫ్‌ఆర్‌ చట్ట ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు,భూమికి భూమిఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా చాలా మంది గిరిజ నులు నుండి సేకరించిన భూమికి భూమి,నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పునరావాస కాలనీలలో చాలా సమస్యలు అసం పూర్తి గా ఉన్నాయి.చట్టప్రకారం 25రకాల సౌక ర్యాలు పూర్తి చేయాలనీ డిమాండ్‌ చేస్తున్నారు.
నిర్ణీతగడువులోగాపోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యం : కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్య మని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్ల మెంటరీ సమావేశాల్లో రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించిప్రశ్నించారు. దీనిపై కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు లిఖిత పూర్వకంగా సమాధాన మిచ్చారు. 2022 ఏప్రిల్‌ నాటికి పోలవరం ప్రాజెక్టుపూర్తి కావాల్సి ఉందని… అయితే సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం, పునరా వాసం తో పాటు కరోనావల్ల కూడాజాప్యం జరిగిం దని బిశ్వేశ్వర్‌ తెలిపారు.డ్యామ్‌ స్పిల్‌ వే చానల్‌ పనులు 88శాతం,అప్రోచ్‌ చానల్‌ ఎర్త్‌ వర్క్‌ పనులు73 శాతం, పైలట్‌ చానల్‌ పనులు34శాతం మాత్రమే పూర్తయ్యా యని చెప్పారు.
అయితే ‘‘పోలవరం ప్రాజెక్టును 2018 మార్చి నాటికేపూర్తి చేస్తాం. రాసిపెట్టుకో..’’ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట లివి. 2016 మార్చి 10న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ లో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘తొందరెందుకు కన్నా! 2021 డిసెంబర్‌ 1కే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్‌లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తాం’’ ఈ మాటలు ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీ లోనూ,వెలుపలా చెప్పినవి. 2020 డిసెంబర్‌లో ఆయన ఇలాంటి ప్రకటనలు చేశారు.ఈ ఇద్దరు మంత్రులుచెప్పినమాటలూ అమలుకి నోచు కోలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. ప్రాజెక్టులో కీలక పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం కేంద్రమే అందించాలి. పార్లమెంట్‌ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు అదే సమాధానం చెప్పా రు. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’అని ఎద్దేవా చేశారు.- జి.ఎన్‌.వి.సతీష్‌

యుద్దంతో ధ‌రాఘాత‌కం

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు రష్యా దళాల స్వాధీనంలోకి వచ్చాయి. ప్రస్తుతం రాజధాని కీవ్‌ని వశం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడు తున్నారు. ఐతే, దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. కానీ ఈ చర్య వల్ల రష్యాతో పాటు ప్రపంచానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ధరల పెరుగు దల ప్రపంచ దేశాలకు మోయరాని భారంగా మార నుంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకు తలమ య్యాయి. దానికి ఇప్పుడు ఈ యుద్ధం తోడైంది. క్రూడాయిల్‌ ధరలు అనూహ్యంగా పెరిగి బ్యారెల్‌ 100 డాలర్లకు చేరింది. ఈ స్థాయికి పెరగటం గత ఎనిమిదేళ్లలో మళ్లీ ఇదే. మన దేశంపై కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మార్చి 7న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరగవచ్చంటున్నారు.
రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు జర్మనీ, అమెరికా వంటి ప్రధాన ఉత్పాదక దేశాల నుంచి చేసుకునే దిగుమతులు చాలా తక్కువ. కానీ ఈ రెండు దేశాలు అనేక ఉత్పత్తులకు ముడి పదార్థాలు సమకూరుస్తాయి. కావాల్సిన ఇందనాన్ని అందిస్తాయి. చాలా ఐరోపా దేశాలు రష్యా ఇందనంపై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ చమురు మార్కెట్‌లో రష్యా ఆధిపత్యం నడుస్తోంది. ఇది రెండో అతిపెద్ద చమురు ఎగు మతిదారు. ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యాది మూడో స్థానం. యూరప్‌, ఆసియా దేశాలలో దాదాపు సగం దేశాలు ముడి చమురు అవసరాలకు రష్యాపై ఆధారపడ్డాయి. గ్యాస్‌ మార్కెట్‌పై రష్యా భారీ ప్రభావం చూపుతున్నందున పరిస్థితి క్లిష్టంగా మారొచ్చు. చమురు, గ్యాస్‌లో మాత్రమే కాకుండా బొగ్గు, అణుశక్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి, ముడి చమురుతో పాటు, గ్యాస్‌ ధరలు కూడా ఎప్పుడైనా ఆకాశాన్ని తాకొచ్చు. ఒకవైపు చలికాలం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకు పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ- స్విఫ్ట్‌ నుంచి రష్యాను తొలగించడానికి యూరోపియన్‌ దేశాలు ఇష్టపడకపోవడానికి కారణం కూడా రష్యా దగ్గర ఉన్న ఈ గ్యాస్‌. ఐనా,ఈ యుద్ధం వల్ల జర్మన్‌ సహకారంతో రష్యా నిర్మిస్తున్న??కొత్త బాల్టిక్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పనులను నిరవధికంగా నిలిపి వేయక తప్పలేదు. మరోవైపు, కరోనా మహ మ్మారి కారణంగా గ్లోబల్‌ గ్యాస్‌ నిల్వలు పూర్తిగా తగ్గిపోవటంతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. దానికి తాజా పరిణమాలు తోడవటం వల్ల వినియోగదారులు, పరిశ్రమ లపై మోయరాని భారం పడుతుంది.చాలా సప్లయ్‌ చెయిన్లకు గ్యాస్‌ ప్రాథమిక అసవరం. కనుక గ్యాస్‌ సరఫరా నిలిచిపోతే భారీ ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది. 2021 శీతా కాంలో మొదటిసారి గ్యాస్‌ ధరలు పెరిగినపుడు ఇంధన వ్యయం భరించలేక బ్రిటన్‌లోని ఎరు వుల ఫ్యాక్టరీ మూతపడ్డాయి. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ కొరతకు దారితీసింది. వైద్య ప్రక్రియల నుంచి ఆహారం తాజాగా ఉంచడం వరకు అన్నింటికీ ఇది అవసరం. కాబటటి పెరుగుతున్న చమురు, గ్యాస్‌ ధరల వల్ల ఇలాంటి పరిణామాలకు ఆస్కారం ఉంది. మరోవైపు, ప్రస్తుతం గోధుమల ధర పదమూ డేళ్లలో అత్యధిక స్థాయికి చేరాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు ఆసియా, మధ్యప్రాచ్య వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ప్రధాన సరఫరాదారులు. ప్రపంచం లోని గోధుమల వ్యాపారంలో పాతిక శాతం వాటా ఈ రెండు దేశాలదే. మొక్కజొన్న అమ్మ కాలలో 20 శాతం, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో ఎగుమతుల్లో 80 శాతం వాటాను ఈ రెండు దేశాలు పంచుకుంటున్నాయి. వ్యవసాయరంగం ఇప్పటికే సంక్షోభంలో పడిరది. పలు అగ్రశ్రేణి ధాన్యం వ్యాపార సంస్థలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. తాజా పరిణమాలతో ఈ రంగం మరింత పడిపోతుంది. ఉక్రెయిన్‌-రష్యా యుధ్దం రవాణా రంగంపై కూడా గణనీయ మైన ప్రభావం చూపనుంది. ఇప్పటికే, కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఈయుద్ధం ఈ రంగంలో మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా సముద్ర రవాణా,రైలు సరుకు రవాణాపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2011నుంచి చైనా, ఐరోపా మధ్య స్థిరమైన రైలు సరుకు రవాణా సంబంధాలు ఉన్నాయి. ఆసియా,యూరప్‌ సరుకు రవాణాలో దీని పాత్ర తక్కువే అయినా ఇటీవల ఇతర రవాణా మార్గాలకు అంతరాయం కలిగినపుడు ఇది చాలా ఆదుకుంది. దాని అవసరం ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. ఐతే,తాజా సంక్షోభం దీనిపై తీవ్ర ప్రభావం చూపనుంది.మరోవైపు, రష్యా దండయాత్రకు ముందే ఓడ యజ మానులు నల్ల సముద్రం షిప్పింగ్‌ రూట్లను నిలిపివేశారు. నల్ల సముద్రంలో కంటైనర్‌ షిప్పింగ్‌ అనేది ప్రపంచ స్థాయిలో సాపేక్షంగా ఉత్తమ మార్కెట్‌. దీనిని రష్యా దళాలు కట్‌ చేస్తే ఉక్రెయిన్‌ ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే చాలా ఎక్కువ గా ఉన్న సరుకు రవాణా ధరలు మరింత పెరగవచ్చు.ఇది ఇలావుంటే,సైబర్‌ దాడులు ప్రపంచ సరఫరా గొలుసులను లక్ష్యంగా చేసుకో వచ్చనే ఆందోళన కూడా ఉంది. నేడు వాణి జ్యం ఎక్కువగా ఆన్‌లైన్‌ లోనే జరుగుతోంది కాబట్టి కీలకమైన షిప్పింగ్‌ లైన్‌లు, మౌళిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి. లోహ పరిశ్రమపై కూడా ఈ యుద్ధం విశేష ప్రభావం చూప నుంది. ఎందుకంటే నికెల్‌, రాగి,ఇనుము ఉత్పత్తిలో రష్యా ,ఉక్రెయిన్‌ ప్రపంచంలోనే అగ్రగాములు. నియాన్‌, పల్లాడియం,ప్లాటినం వంటి ఇతర ముఖ్యమైన ముడి పదార్థాల ఎగుమతిలో కూడా ఇవి ముందున్నాయి. రష్యాపై ఆంక్షల భయంతో ఈ లోహాల ధరలు పెరిగాయి. పల్లాడియం విషయానికే వస్తే గత డిసెంబర్‌ నుంచి దాని ట్రేడిరగ్‌ ధర ఔన్సుకు 2,700 డాలర్లు పెరిగింది. ఆటోమోటివ్‌ ఎగ్జాస్ట్‌ సిస్టమ్స్‌, మొబైల్‌ ఫోన్లు, డెంటల్‌ ఫిల్లిం గ్‌ల వరకు ప్రతిదానిలో పల్లాడియంను ఉపయో గిస్తారు. తయారీరంగంతో పాటు నిర్మాణ రంగంలో ఉపయోగించే నికెల్‌,రాగి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అమెరికా, యూరోప్‌ , బ్రిటన్‌ ఏరోస్పేస్‌ పరిశ్రమలు కూడా రష్యా టైటానియంపై ఆధారపడి ఉన్నాయి. దాంతో,బోయింగ్‌,ఎయిర్‌బస్‌ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ప్రత్యామ్నాయ సరఫరాదారులను సంప్రదించినట్టు తెలుస్తోంది. మైక్రోచిప్‌లపై కూడా తాజా సంక్షోభం ప్రభా వం చూపనుంది. కరోనా కారణంగా గత ఏడాది మొత్తం మైక్రోచిప్‌ల కొరత వేదించింది. ఈ సంవత్సరం ఆ కొరత తీరుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో యుద్దం వచ్చిపడటంతో ఆ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆంక్షలలో భాగంగా రష్యా మైక్రోచిప్‌ల సరఫరాను నిలిపివేస్తామని అమెరికా ప్రకటి చింది. కానీ మైక్రోచిప్‌ ఉత్పత్తిలో ముఖ్యమైన నియాన్‌, పల్లాడియం, ప్లాటినంల కీలక ఎగుమతిదారులుగా రష్యా, ఉక్రెయిన్లు ఉన్నప్పు డు అది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న. చిప్‌ లితోగ్రఫీలో ఉపయోగించే నియాన్‌లో దాదాపు 90 శాతం రష్యా లోనే లభిస్తుంది. చిప్‌ తయారీదారుల వద్ద ప్రస్తుతం రెండు నుండి నాలుగు వారాలకు సరిపడ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య వల్ల ఏదైనా దీర్ఘకాలిక సరఫరా అంతరాయం ఏర్పడితే అది సెమీకండక్టర్లు, వాటిపై ఆధారపడిన ఉత్పత్తు లపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఆందోళనలో రైతులు
రైతులు పండిరచిన ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రైతులకు అన్యా యం జరగకుండా చూస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రకటనలు నీటి మూటలు గానే మిగిలిపోతున్నాయి. పండిరచిన ధాన్యానికి మద్దతు ధర లభించకపోగా ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయిని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు కల్లాల్లో ఉన్న ధాన్యం ఎప్పుడు విక్రయించకుంటామోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, దళారులు వారి ఆదాయాన్ని చూసుకుంటున్నారే తప్ప రైతుల కష్టాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా పురుగు మందులు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ గిట్టుబాటు ధర మాత్రం రైతులకు అందడం లేదు. పలువురు మిల్లర్లు, దళారులు మాత్రం పక్క రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది ఎక్కువగా ధాన్యం పండిరదని, అందువల్ల గిట్టుబాటు కావడం లేదనే పుకారును సృష్టిస్తున్నారు. దీంతో ధాన్యానికి మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు, సాధారణ ప్రజలు-కార్మికులు, రైతులు మార్కెట్‌ నుండి అధిక ధరలకు అదే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అధిక ధరల ద్వారా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? నిజమైన ఉత్పత్తి దారులకు, రైతులకు కాదు. కార్పొరేట్లు, పెద్ద భూస్వామ్య వర్గం ఆధిపత్యం చెలాయించే బడా వ్యాపా రులకు, రుణదాతలకు చేరుతుంది. వీరే చిన్న రైతుల నుంచి చౌక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారే మార్కెట్‌ను, ఉత్పత్తులను నియంత్రిస్తారు. మోడీ నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు లేకుండా విధించిన ఆకస్మిక లాక్‌డౌన్‌ ప్రజలపై అనేక రకాల కష్టాలను తెచ్చిపెట్టింది. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రమజీవుల ఆదాయం బాగా తగ్గిపోయింది. మన దేశ సంపదను ఉత్పత్తి చేసే కోట్లాది మంది కార్మి కులు ఆకలితో కొట్టు మిట్టాడుతున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకు తున్నాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితమే ఇది. ఆహారం, ఇంధనం, వస్తువుల అధిక ధరలు…సరఫరా వైపు అడ్డంకులు రిటైల్‌ మరియు టోకు స్థాయి ద్రవ్యోల్బణం రేటులో ప్రతిబింబిస్తాయి. బియ్యం, వంటనూనెలు, పప్పులు, కూర గాయలు, గుడ్లు తదితర నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. వంట నూనెల ధర 60శాతం వరకు పెరుగుదలను చూసింది. రైతులు తమ పంపుసెట్లు, ట్రాక్టర్లకు వినియోగించే డీజిల్‌ ధర పెరగడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. సబ్సిడీలో భారీగా కోత విధించడంతో వంటగ్యాస్‌ ధర పెరిగింది. 2019-20లో వంట గ్యాస్‌కు మొత్తం ప్రత్యక్ష నగదు సబ్సిడీ రూ.22,635 కోట్లు. ఇది ఇప్పుడు రూ.3,559 కోట్లకు (ఫిబ్రవరి 2021 వరకు) తగ్గింది. దీంతో మొత్తం భారం వినియోగదారులపైనే పడిరది. పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాలు మరి యు ఇతర పన్నుల భారీ భారం ఈ ధరల పెరుగుదలపై ప్రధానంగా ఉంది. గత మూడేళ్లలో అంటే 2018నుంచి మోడీ నేతృ త్వంలోని బిజెపి ప్రభుత్వం ఇంధన పన్నుల ద్వారా రూ.8లక్షల కోట్లు ఆర్జించింది. 2020-21లో రూ. 3.71లక్షల కోట్లు ఆర్జించింది. పైగా ఈ కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యో గాలు, ఆదాయాలను కోల్పోయారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు, వివిధ ఇన్‌పుట్‌ల ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతాయి. సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.33, లీటర్‌ డీజిల్‌పై రూ.32 వుంది. అనేక రాష్ట్రాల ఎన్నికలలో బిజెపికి ఎదురు దెబ్బలు తగిలిన తరువాత, ధరల పెరుగు దలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికాక, మోడీ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, లీటర్‌ డీజిల్‌పై రూ.10 కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని నామమాత్రంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇది కేవలం టోకెన్‌ తగ్గింపు మాత్రమే, ఇది ప్రజలకు పెద్దగా ఉపశమనం కలిగించదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, టీకాల కార్య క్రమానికి డబ్బులు కావాలి కాబట్టి పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గించలేమని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి చేసిన వాదన అవాస్తవం. ఇది అశాస్త్రీయమైనది కూడా. అనేక ఇతర పన్ను మినహాయింపులు, రాయితీలతో పాటు కార్పొరేట్‌ పన్నులను తగ్గించడం ద్వారా మోడీ ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీలను వెనక్కి తీసుకోవడం ద్వారా కలిగే ఆదాయ నష్టాన్ని…కార్పొరేట్‌ పన్ను రేటును 2019కి ముందు స్థాయికి పునరుద్ధరించడం ద్వారా తిరిగి పొందవచ్చు. అతి సంపన్నులపై సంపద పన్ను విధించడంద్వారా తగినంత ఆదాయాన్ని పొందవచ్చు. కానీ మోడీ ప్రభు త్వం అలాంటిదేమీ చేయడానికి సుముఖత చూపడం లేదు. ఎందుకంటే అది స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు అసంతృప్తి కలిగి స్తుంది. అందుకే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా కోట్లాది మంది ప్రజలను బాధిస్తోంది. ధరల పెరుగుదలపై నియంత్రణను అమలు చేసేం దుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. బదులుగా,నిత్యావసర వస్తువుల చట్టాన్ని నిర్వీ ర్యం చేయడానికి చర్యలు తీసుకుంది. అధిక ధరలతో సామాన్యులు అల్లాడుతుంటే కార్పొరేట్లకు సూపర్‌ లాభాలు వచ్చేలా చేయడమే దీని ఉద్దేశం. ఒకవైపు ప్రభుత్వం ధరల పెరుగుదలను సులభతరం చేసే విధానాలను అవలంబిస్తోంది. మరోవైపు, కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఉద్యోగాలు, ఆదాయాలను కోల్పోయిన కార్మికులకు, ఇతర శ్రామికులకు ఎటువంటి ఉపశమనం అందిం చడానికి నిరాకరిస్తోంది. మహమ్మారి కాలంలో పేద వర్గాల కార్మికుల వాస్తవ ఆదాయాలు బాగా తగ్గాయి. దానివల్ల, మన దేశ సంపదను సృష్టించే కోట్లాది మంది కార్మికులు, శ్రమ జీవులు నేడు ఆకలి,పేదరికం లోకి నెట్టబడ్డారు. ప్రపంచ ఆకలి సూచీలో 2020లో 94వ స్థానంలో వున్న భారత్‌ 2021లో 101వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల కంటే దిగువన ఉంది. ఆకలి పెరిగిందంటే దేశంలో మనకు సరిపడా తిండి లేనందువల్ల కాదు. ప్రపంచ ఆకలి సూచీలో మన స్థానం పడిపోతున్నప్పుడు, దేశంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి.1సెప్టెంబర్‌ 20 21న, ఎఫ్‌.సి.ఐవద్ద 50.2మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల ధాన్యం ఉచిత పంపిణీ కోసం ఈ నిల్వలను విడుదల చేయడం వల్ల నిరుపేదల ఆహార అవసరాలు తీరుతాయి. ధరలు కూడా తగ్గుతాయి. అందుకుగాను 26.2 మిలియన్‌ టన్నులు అవసరం. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం, ప్రముఖ ఆర్థికవేత్తల సిఫార్సుల్లో స్థిరమైన ఈ డిమాండ్‌ ఉన్నప్పటికీ, బిజెపి ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. బదులుగా, ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ధాన్యాలు, చెరకును ఉపయోగించేందుకు పథకం వేసింది ! ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు,సాధారణ ప్రజలు-కార్మికులు, రైతులు మార్కెట్‌ నుండి అధిక ధరలకు అదే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అధిక ధరల ద్వారా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? నిజమైన ఉత్పత్తిదా రులకు, రైతులకు కాదు. కార్పొరేట్లు, పెద్ద భూస్వామ్య వర్గం ఆధిపత్యం చెలాయించే బడా వ్యాపారులకు, రుణదాతలకు చేరుతుంది. వీరే చిన్న రైతుల నుంచి చౌక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారే మార్కెట్‌ను, ఉత్పత్తులను నియంత్రిస్తారు. స్పెక్యులేటివ్‌-ఫ్యూచర్‌ ట్రేడిరగ్‌లో మునిగి పోతారు. ఇది ధరల పెరుగుదలకు మరొక ప్రధాన అంశం.ధరల పెరుగుదల ద్వారా ప్రజలపై మోయలేని భారాలు మోపడాన్ని మనం ఇక సహించలేం.
పెట్రో బాంబు!
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు దౌడు తీస్తున్నాయి. 2014 తరువాత ముడి చమురు అత్యధిక ధర (బ్యారెల్‌ దాదాపుగా 100 డాలర్లు)కి చేరింది. ఐతే, ఏరోజుకా రోజు ధరలు పెరిగే మన దేశంలో 110 రోజుల నుండి ఒక్క పైసా ధర కూడా పెరగలేదు. బ్యారెల్‌ ధర 82 డాలర్లు ఉన్నప్పుడు మన దేశంలో చివరిసారిగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ తరువాత నాలుగు నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగకపోవడానికి కారణం ఎన్నికల రాజకీయాలేనన్నది సర్వ విదితం. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ముడి చమురు ధర ఒక డాలరు పెరిగితే దేశంలో ఒక లీటరు పెట్రోలు, డీజల్‌పై 45 నుండి 50 పైసలు పెరుగుతుందని, ఎన్నికల కారణంగా ధరలు నియంత్రించిన గత 110 రోజుల్లో ఆయిల్‌ కంపెనీలు కోల్పోయిన మొత్తాన్ని కూడా కలుపుకుంటే ఈ పెరుగుదల 10 రూపాయల వరకు ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఈ విశ్లేషణలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఖండిర చడం లేదు. దీనిని బట్టే రానున్న రోజుల్లో ధరాభారం ఖాయమనే స్పష్టమౌతోంది. అంత ర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి తాజాగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది ఇటీవల పరిణామం. అంతకన్నా ఆయిల్‌ ఉత్పత్తి చేసే దేశాల ధనకాంక్షే అసలు కారణం. ఉక్రెయిన్‌ మీద రష్యా యుద్ధాన్ని ప్రారంభిస్తే, అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తుందని, అదే జరిగితే ముడిచమురు సరఫరాలో కొరత ఏర్పడు తుందన్న అంచనాల ఆధారంగా ప్రస్తుతం ధరలను పెంచుతున్నారు. తమకు యుద్ధం చేసే ఉద్దేశ్యమే లేదని, ఇప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న రష్యా ప్రకటనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే ఈ ప్రచారం సాగుతోంది. ముడి చమురు కోసం ప్రపంచం రష్యా మీదనే ఆధారపడి లేదు. పెట్రోలియం ఉత్పత్తిలోఆ దేశంది మూడవ స్థానం.అమెరికా, సౌదీ అరేబియాలు మొదటి రెండు స్థానాలో ఉన్నాయి. నిజంగానే చమురు ఉత్పత్తితో సమస్యలు ఏర్పడితే ఇతర దేశాలు తమ సరఫరాలను పెంచవచ్చు. కానీ,రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్లకు అదనంగా ఒక్క బ్యారెల్‌ను కూడా ఉత్పత్తి చేయబోమని ఒపెక్‌ దేశాలు ప్రకటించడం దేనికి నిదర్శనం? నిజానికి, బ్యారెల్‌ ధరను వంద డాలర్లకు చేర్చాలని ఈ దేశాలు ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్నాయి. తాజా సంక్షోభాన్ని దానికి అవకాశంగా వాడుకున్నాయి. ఇప్పుడు నెలకొన్న పరిస్థితే ధరల పెరుగుదలకు కారణమైతే యుద్ధ వాతావరణం మారి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ధరలు తగ్గుతాయా? ప్రస్తుతం ఊహల మీద ఆధారపడి ధరలను పెంచివేసిన ఆయిల్‌ ఉత్పత్తి చేసే దేశాలు అలా తగ్గించడానికి ఒప్పుకుంటాయా? ఈ ప్రశ్నకు సమాధానమేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశానికి వస్తే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో భాగంగా అప్పటివరకు ఇరాన్‌తో ఉన్న ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకున్నాం. స్థిరమైన ధరకే చమురును అమ్మడానికి, మన కరెన్సీలో చెల్లింపులను స్వీకరించడానికి సిద్ధపడినా, ఇరాన్‌తో ఒప్పందాన్ని కాలదన్నుకున్నాం. దానికి బదులు బేషరతుగా సౌదీ నుండి పెట్రో ఉత్ప త్తులను కొంటున్నాం. దీనివల్ల దేశానికి నష్టం జరుగుతుందని, ధరలు పెరుగుతాయని అప్పట్లోనే వామపక్షాలు హెచ్చరించాయి. వామపక్షాల హెచ్చరికల్లోని వాస్తవాలు పెట్రో ఉత్పత్తులతో పాటు వివిధ రంగాల్లో ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి. అయినా పాలక వర్గాల ఆలోచనల్లో మాత్రం ఏమాత్రం మార్పు లేకపోగా అమెరికాకు మరింతగా సాగిల పడటానికే మోడీ ప్రభుత్వం సిద్ధమౌ తోంది. సామాన్యుడు చెల్లించే పెట్రో ధరల్లో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఇంత పన్నుల భారం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. మూలధరతో పన్నుల శాతం ముడిపడి ఉండ టంతో ధరలు పెరిగే కొద్ది పన్నుల రూపంలో జమ అయ్యే మొత్తం పెరుగు తుంది. అందులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు వీలుగా పన్ను బదులు సర్‌చార్జీ లను పెంచుతూ పోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇలా ప్రజల్ని కొల్లగొట్టి దానిని రాయితీల రూపంలో కార్పొరేట్లకు దోచిపెడు తోంది. ప్రజా క్షేమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రో ధరలను నియం త్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీనికోసం రాష్ట్రాలు నష్టపోకుండా పన్నుల విధానంలో అవసరమైన మార్పులు చేయాలి. ప్రజలను ధరాఘాతం నుండి ఆదుకోవాలి. లేకపోతే, దాని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి సామాన్యులకు గుదిబండ అవుతుంది. రోజువారీ నిత్యా వసరాల ధరలు వాటంతటవే పెరగవు. సామాన్య ప్రజల ఖర్చుతో బడా వ్యాపార-పెద్ద భూస్వామ్య తరగతి లాభాల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వమే పూనుకుంటోంది. ఇది నేటి పాల కుల నిజ స్వరూపం. ధరలు తగ్గించాలని, ప్రజలకు ఉపశమనం కల్పించాలని సిఐటియు, ఇతర కేంద్ర కార్మిక సంఘాలు పోరా డుతున్నాయి. కాబట్టి…ప్రభుత్వాన్ని మనం డిమాండ్‌ చేద్దాం. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌)ను సార్వత్రీకరించాలి. పిడిఎస్‌ కింద 14 నిత్యావసర వస్తువులను అందించాలి.
ఆహార ధాన్యాల స్పెక్యులేటివ్‌-ఫ్యూచర్‌ ట్రేడిరగ్‌పై నిషేధం విధించాలి. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తక్షణం తగ్గించాలి.విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ప్రభుత్వ సంస్థల ద్వారా పేదలం దరికీ ఉచిత విద్య, ఆరోగ్య సేవలు అందిం చాలి. ఆదాయ పన్ను చెల్లించని కుటుం బాలకు నెలకు రూ. 7500 అందివ్వాలి. ఆహార,ఆరోగ్య సంబంధిత సహాయాన్ని అందించాలి. నయా ఉదారవాద ఎజెండాకు కట్టుబడి…మోడీ ప్రభు త్వం కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టడాన్ని కార్మిక వర్గం అనుమతించదు. శ్రమజీవులు ఉమ్మడి పోరు ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పైడిమాండ్లను సాకారం చేసుకోగలరు. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను ఎత్తివేయాలంటూ బిజెపి ప్రభుత్వం మెడలు వంచిన చారిత్రాత్మక రైతు పోరాట విజయం నుండి మనం నేర్చుకునే పాఠం ఇది. –సైమన్‌ గునపర్తి

సవరణల పేరిట…. జీవవైధ్యానికి తూట్లు !

‘‘మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపా డేవి అడవులే. అటువంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతు న్నాయి ఇది ఒకదేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ అడవుల తరుగుదల ఏర్పడుతూ ఉంది. వీటిని కాపాడుకోలేకపోతే భూతాపం వలన ఏర్పడే ప్రమాదాన్ని ఈ సృష్టిలోగల ప్రతీజీవి అనుభవించ వలసి వస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశం కూడా ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో తీర్మా నాలు చేసుకుంటూ హామీలు ఇస్తూ వస్తున్నది. అయితే ఎన్ని సదస్సులు జరిగిన తీర్మానాలు చేసినా వాస్తవంలో మాత్రం భూతాపాన్ని తగ్గించి ప్రాణ వాయు వును అందించే అడవులు మాత్రం క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి. ఫలితంగా పర్యావర ణం కాలుష్య భరితం అవుతూ ఉంది. మానవుని స్వార్థ పూరిత చర్యలు వల్లనే ఈఅడవులు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా తరిగిపోతున్నాయి అనేది నిర్వి వాదాంశం’’
భూతాపం, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకోవడానికి సహజసిద్ధమైన అత్యుత్తమ పరిష్కారం అడవుల పరిరక్షణ.మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపాడేవి అడవులే. అటు వంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతు న్నాయి ఇది ఒక దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ అడవుల తరుగు దల ఏర్పడుతూ ఉంది.వీటిని కాపాడుకోలేకపోతే భూతా పం వలన ఏర్పడే ప్రమాదాన్ని ఈసృష్టిలోగల ప్రతీ జీవి అనుభవించవలసి వస్తుందిఅనే సత్యాన్ని మనం గ్రహించాలి.దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశం కూడా ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో తీర్మానాలు చేసుకుంటూ హామీలు ఇస్తూ వస్తున్నది.అయితే ఎన్ని సదస్సులు జరిగిన తీర్మానాలు చేసినా వాస్తవంలో మాత్రం భూతాపాన్ని తగ్గించి ప్రాణ వాయువును అందించే అడవులు మాత్రం క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి.ఫలితంగా పర్యావరణం కాలుష్య భరితం అవుతూ ఉంది.మానవుని స్వార్థపూరిత చర్యలు వల్లనే ఈఅడవులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా తరిగిపోతున్నాయి అనేది నిర్వివాదాంశం. వంట చెరకు, కలప స్మగ్లింగ్‌, చెట్ల నరికివేత, పట్టణీకరణ, ఆక్రమణ, అటవీ భూములు వ్యవసాయ భూములుగా మార్పు, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యకలాపాల వలన అరణ్యాలు నానాటికీ కుదించుకుపోతున్నాయి.బ్రిటీష్‌ వారి కాలంలోనే ఈ అటవీ పరిరక్షణకై మన దేశంలో 1927వ సంలో అటవీచట్టం పురుడు పోసుకోవడం జరి గింది.దాని కొనసాగింపుగా మనదేశంలో 1980 వ సంలో అడవుల పరిరక్షణకై పటిష్ట చట్టాన్ని రూపొందించాం. ఎట్టి పరిస్ధితులలో కూడా అడవు లను ఆటవీయేతర ఉత్పత్తి కార్యక్రమాలకు ఉపయో గించకూడదని చట్టంలో స్పష్టంగా పేర్కొ న్నాం. 1988 మరియు 1996వ సంలో ఈ చట్టానికి సవరణలు తీసుకు వచ్చి అటవీ భూముల పరిరక్షణ మరింత రక్షణ కల్పించాం. అయితే ఆస్ఫూర్తి వాస్త వంలో మాత్రం కనపడటం లేదు అనడానికి ప్రతీ ఏటా మన దేశంలో క్షీణిస్తున్న అడవులే ప్రధాన సాక్ష్యం. సవరణ చట్టంలో 1927 నాటికి వేటిని అడవులుగా నిర్వచించామో వాటినే ప్రస్తుతం అడ వులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్దారించ డానికి సిద్ధం అయ్యింది. ప్రయివేట్‌ భూముల విష యంలో నెలకొన్న అడవుల విషయంలో మినహా యింపు దిశగా ప్రభుత్వం ఆలోచనచేస్తూ ఉంది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అటవీ ఆస్తులకు సంబం దించి ఒక కేసు విచారణలో మాత్రం అటవీ చట్టం దశ దిశ మార్చే తీర్పును ప్రకటించింది.అది ఏమి టంటే అటవీ భూమి అయినా కాకపోయినా, ప్రయివేటు భూములైనా. ఏ ప్రాజెక్టు – కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నదైనా అడవి అడవే, పైన చెప్పినవి అన్నీ కూడా సదరు చట్ట పరిధిలోకే వస్తాయి. అలాంటి ఏ భూమి వినియోగ మార్పిడికైనా అనుమతులు తప్పనిసరి అని తీర్పులో పేర్కొంది.ఈ తీర్పు ఫలితంగా భూయాజమాన్య హక్కులతో నిమిత్తం లేకుండా.. అడవులు, చెట్లు, మొక్కలు, ఇతర పచ్చదనం అభివృద్ధి పరుస్తున్న వ్యవసాయేతర కార్యకలాపాలన్నీ అటవీ చట్ట పరిధిలోకి వచ్చాయి.దీనివలన పచ్చదనం కొంత వరకు పెరిగింది అనడంలో సందేహం లేదు. పర్యావరణ వేత్తలకు ఇది శుభవార్తగా నిలిచింది. అయితే ప్రభుత్వాలకు మాత్రం ఇది మింగుడు పడని విషయంగా మారింది. ఎందుకంటే ఈ తీర్పు ద్వారా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్ర మాలకు అటవీ అనుమతులు కానీ పర్యావరణ అనుమతులు మరింత కఠినమై అడ్డుగా నిలుస్తున్నా యి. ఈపరిస్ధితిని గమనించిన ప్రభుత్వాలు ఆ చట్టపరిధి నుండి బయట పడే మార్గాలపై అన్వేషిం చడం మొదలు పెట్టాయి.చట్టాన్ని నీరు గార్చే యజ్ఞా నికి శ్రీకారం చుట్టాయి.దీనికై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత అటవీ చట్టానికి కొత్తగా సవరణలు చేపట్టి అటవీ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు ఆరం భం అయ్యాయి.దీనిని ఆచరణలోకి తీసుకురావ డానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం 1988 అటవీ సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలను చేయడానికి సిద్ధం అయ్యింది. దీనిని అమలు పరచే బాధ్యత తీసుకోవడానికి కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది. మారుతున్న ఆర్ధిక అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత అటవీ చట్టానికి సవరణలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఈప్రతిపాదనలో పేర్కొ న్నారు.. ఈవిషయమై కేంద్రం అటవీ చట్ట సవరణ చేయడానికి 14 అంశాలను ప్రతిపాదించారు.ఈ సవరణల ప్రధానలక్ష్యం ఇప్పటి వరకు రక్షిత అటవీ చట్టాల పరిధిలో ఉన్నభూములను ఆచట్ట పరిది óనుంచి తప్పించి అనుమతుల ఇబ్బంది లేకుండ చేసుకోవడం. ఎందుకంటే జాతీయ రహదారులు, రైల్వే రవాణా,ప్రాజెక్టులనిర్మాణం విషయంలో అటవీ చట్టపరిధిలో ఉండే భూముల నుండి మరి యు పర్యావరణ అనుమతులు రావడంచాలా క్లిష్టతరం అవుతూ ఉంది.దానితో పాటు వాటి నిర్మాణ వ్యయాలు కూడా రోజురోజుకి పెరిగి పోయి అభివృద్ధి పనులు నిలచి పోతున్నాయని ప్రభుత్వ వాదన. దానిని దృష్టిలో ఉంచుకునే ప్రభు త్వం అటవీ చట్టాన్ని నీరుగార్చే యత్నాలు మొదలు పెట్టింది.దీనికి దేశ భద్రత..దేశ రక్షణ అనే అంశాలను ముడిపెట్టి సవరణ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం దేశ సరిహద్దులు వెంబడి అవస్ధాపన వసతులు కల్పించడానికి నిర్దేశిత ప్రాజెక్టులు చేపట్టడానికి అటవీ మరియు పర్యావరణ అనుమ తులు ఆటంకం కలిగిస్తున్నాయి ఇటువంటి వాటిలో జాప్యం అనేది సరి హద్దు దేశాల నుండి ముప్పుకు అవకాశం కలిగిస్తుంది.కనుక అటువంటి వాటి కోసం ఆ ఆభూములను చట్ట పరిధి నుండి మినహా యించాలిఅనే ప్రతిపాదన ఒకటి.దేశ భద్రత దృష్ట్యా ప్రజల నుండి రాజకీయ పక్షాల నుండి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదని దీనిని ప్రధానంగా ప్రభుత్వం చూపించింది.
అంతర్జాతీయ సరిహద్దుల్లో దేశ భద్రత – వ్యూహాత్మక మౌలిక వసతుల కోసం అటవీ భూముల్ని బదలాయించాల్సి వస్తే అనుమతులు అక్కర్లేదు అనేది ఈ సవరణ ప్రధాన లక్ష్యం.ఇకపోతే దీనికి అనుబంధంగా రైల్వేలు,హైవే అథారిటీ, ఇతర రవాణా సంస్థలు 1980కి పూర్వం పొందిన భూముల్ని అటవీ చట్టం నుండి మినహాయించడం, ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్‌ పక్క చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాల్ని ఈ పరిధి నుంచి తప్పించటం, నివాస ఇతర ప్రాజెక్టు అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మాణాలు అనుమతించడం, స్థలయా జమాన్య హక్కులు బహుళ రికార్డుల్లో నమోదై అటవీ – రెవెన్యూ, ఇతర విభాగాల మధ్య వివాదం ఉంటే, సదరు ఆ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడం వంటి వాటిని సవరణలుగా ప్రతిపా దిస్తూ అటవీచట్టాన్ని నీరు గార్చడానికి రంగం సిద్ధం అయ్యింది.అంతకన్నా ముఖ్యంగా చమురు సహజవాయువు వెలికితీతలో నేడు ఆధునిక సాంకే తిక పరి జ్ఞానం ఎంతగానో లభించింది. దానిని ఉపయోగించుకుని అడవులకు నష్టం కలగకుండా అడవుల వెలుపల భూమికి రంధ్రాలు చేసి వాటి ద్వారా అడవులలో చమురు సహజ వాయువల అన్వేషణ చేసుకునే అవకాశం పొందటానికి చట్ట సవరణ అవసరంఅని ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రభుత్వం.ఇలా లభించిన భూమి అంతా అటవీ యేతర అవసరాలకు వినియోగించాలి అన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం..ఒకవిధంగా చూస్తే ఈ చట్టానికి సవరణలు లేకుండానే ప్రతీ యేటా మన దేశం సమారు 13 వేల చ.కి.మీ. అటవీ భూమిని కోల్పోతోంది అని ఒక అంచనా. ప్రస్తుతం మన దేశంలో సుమారు ఆరుకోట్ల 49లక్షల హె క్టార్ల భూమి మాత్రమే అటవీ ప్రాంతం కింద ఉన్నట్లు గణాంకలు చెబుతున్నాయి.ఈ సవరణ చట్టం కానీ అమలులోనికి వస్తే మరింత అటవీ భూభాగం హరించుకు పోతుంది అనడంలో సందేహం లేదు. జాతీయ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని చట్టానికి కొన్ని సవరణలు చేసి మినహాయింపులు ఇస్తున్నాం అని ప్రభుత్వం చెబుతూ ఉన్నా ఆచరణలో ఈ సవరణలు కార్పొరేట్‌ వర్గాల వారి ప్రయోజనాలకే అన్నది వాస్తవం.ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెడు తున్న మానిటైజేషన్‌లో భాగంగా రోడ్డు, రైల్వే, అవస్ధాపన సౌకర్యాల కల్పన ఏర్పాటు అనేవి పూర్తి గా కార్పొరేట్‌ వర్గాల చేతుల్లోనికి వెడతాయి.దీనితో పాటు దేశ వ్యాప్తంగా అవస్ధాపన సౌకర్యాల కోసం లక్ష కోట్ల రూపాయలతో కేంద్రం పీ.ఎం.గతి శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఈ పనులు కూడా కార్పొరేట్‌ వర్గాల వారికే దక్కుతాయి.అయితే వీటి ఏర్పాటులో వారికి పర్యావరణ అనుమతుల ఇబ్బందులు లేకుండా చేయడానికే ప్రభుత్వం అటవీ చట్టానికి సవరణలు చేయడానికి ముందుకు వచ్చింది అని పర్యావరణవేత్తల అభిప్రాయం. ఈ సందర్భంలో ప్రస్తుత అటవీ చట్టం ద్వారా వారికి పర్యావరణ అనుమతులు పొందడం కష్టం అవు తాయి.వారికి ఇబ్బంది కలిగించకుండా సానుకూ లత కలుగ చేయటానికే ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టడానికి సిద్ధం అయ్యింది అని పర్యావరణ వేత్తల అభి ప్రాయం.కేవలం వారి ప్రయోజనాల కోసం అటవీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం సమం జసం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అటవీ చట్టాలకు ఇన్ని మినహాయింపులు ఇస్తూ కూడా అడవులను 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు. ప్రస్తు తం మనదేశంలో ఉన్న22 శాతం అడవులు కూడా ఈ మినహాయింపుల పర్వంద్వారా మరింత అడ వుల విస్తీర్ణం అంతరించి పోవడం తధ్యం. దేశ సరిహద్దులులో అత్యంత ఆవశ్యకమైన రక్షణ భద్రత లు కోసం మినహాయింపు కోరడంలో తప్పు లేదు.వాటిని ఎవరూ అభ్యంతర పెట్టరు కూడా. అయితే ఇటువంటి దేశభద్రత అనే అంశాన్ని చూపిం చి భవిష్యత్‌లో మరెన్నో మినహా యింపులు చేసు కుంటూ పోతే రక్షిత అటవీ చట్టం నిర్వీర్యం కాక తప్పదు ఆదిశగానే ప్రభుత్వాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి కూడా. తప్ప నిసరి పరిస్ధితులలో అటవీ భూములను ఉపయోగిస్తే అదే పరిమా ణంలో అడవులు పెంచాలి అనేది చట్ట నియమం.. కానీ మనం నరుకుతూ పోవడమే తప్ప పెంచిన దాఖలాలపై శ్రద్ధ చూపడం లేదు.ఎందుకంటే ఏడు దశాబ్దాల పైగా మనం వన సంరక్షణ ధ్యేయంగా వన ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం కానీ ఈ కృషితో అటవీ విస్తీర్ణాన్ని ఏమాత్రం పెంచలేక పోయాం అనేది మాత్రం కఠిన సత్యం.ఒక విధంగా చెప్పాలంటే పచ్చదనం విషయంలో స్వచ్చంద సంస్ధలు స్దానిక ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ చూపిస్తు న్నాయి.మొత్తం మీద ఈఅటవీచట్ట సవరణ ఫలా లు అన్నీ కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేవే! కొత్త అడవుల పెంపకం పక్కన పెడితే ఇటువంటి సవర ణలు వలన ఉన్న అడవికి ముప్పు వాటిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రతిపాదిం చిన అటవీ చట్ట సవరణలను పర్యావరణ వేత్తలు.. స్వచ్చంద సంస్ధలు పౌరులు ఖండిరచవలసిన సమయం ఆసన్నమయ్యింది.ఈ విషయమై మన మౌనంగా ఉంటే అది భావితరాల వారికి శాపంగా పరిణమిస్తుంది.(లెక్చరర్‌ ఇన్‌ ఎకనామిక్స్‌.. ఐ.పోలవరం)
పర్యావరణ చట్ట మార్పులు ఔషధ కంపెనీల కోసమా ?
జీవ వైవిధ్యచట్టానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల పుణ్య మా అని ఎలాంటి అనుమతులు లేకుండానే పేటెంట్‌ హక్కు లు పొంది…స్థానిక గిరిజనులకు పరిహారాన్ని ఇవ్వనక్కర్లేకుండా దేశీయ కంపెనీలకేగాక విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఇక మీదట మన అరుదైన వృక్ష సంపదపై మాన్‌ శాంటో వంటి బహుళజాతి కంపెనీలకు పేటెంటు హక్కులు లభిస్తే బిటీ కాటన్‌ వలె మన వ్యవసాయం వారి ఆధీనంలోకి పోయే ప్రమాదం వుంది. ప్రస్తు తం అమలులో వున్న జీవ వైవిధ్య చట్టానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖా మంత్రి గత పార్లమెంటు సమావేశాల్లో కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఇవేగనక అమలు లోకి వస్తే…అరణ్య ప్రాంతాల్లో వున్న అరుదైన ఔషధ మొక్కలను,మూలికలను, గిరిజన, రైతు బాహళ్యం అనాదిగా సాగు చేసుకొనే విత్తనాలను,పంట రకాలను వినియోగించు కొనేందు కుగాను ఇకపై ఎటువంటి ప్రభుత్వ సంస్థల అను మతులు లేకుండానే ప్రైవేటు భారత, విదేశీ ఔషద కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.
మరోవైపు ఈసవరణలను పర్యావరణవే త్తలు, శాస్త్రవేత్తలు,గిరిజన,రైతుసంఘాల ప్రతి నిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విశిష్ట లక్షణాలు కల్గిన ఔషధ మొక్కలు, విలువైన పంటల రకాలు పట్టణీకరణ, వాతావరణ మార్పులు, అక్రమ రవాణా కారణంగా ఇప్పటికీ వేగంగా అంతరించి పోతున్నాయి. వీటిలో చాలా మొక్కలు ఆయుర్వేదం, వ్యవసాయంలో ఉపయోగించాలే తప్ప మార్కెట్‌లో ఇతర ‘’వ్యాపార వస్తువులు’’గా పరిగణించరాదు. ఒకవేళ ఆవిధంగా చేసినట్లయితే, ఔషధ కంపెనీల మితిమీరిన వినియోగంతో అరుదైన వృక్ష సంపదను లాభాలకోసం కోల్పోవాల్సి వస్తుంది. దాంతో అటు పర్యావరణానికి ఇటు గిరిజనులు, రైతుల జీవనో పాధికి తీవ్రమైననష్టం వాటిల్లుతుందని వారు హెచ్చ రిస్తున్నారు.హిమాలయ,ఈశాన్య ప్రాంతాల పశ్చిమ, తూర్పు కనుమల్లోను, గుజరాత్‌ లోని అరణ్యాల్లో కొండకోనల్లో అనేకవృక్షాలు, ఎన్నో ఔషధ మొక్కలు న్నాయి. మనం తరచూ వినియోగించే క్రోసిన్‌, సింకోరా (మలేరియా) తదితర అల్లోపతి ఔషధాలు మన దేశంలోని అరుదైన చెట్ల బెరళ్లు,వేళ్లు, మూలి కల నుండి పొందిన సహజ రసాయనాల ఆధారం గా రూపొందించినవే. ఢల్లీి లోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐ.సి.ఎ.ఆర్‌) విత్తన బ్యాంకులో 96వేల బియ్యం రకాలు భద్రపర్చబడినవంటే ఆశ్చ ర్యం కలుగక మానదు. గతంలో వరిలో బంగారు తీగలు,అక్కుళ్ళు వగైరా రకాలు ఏ కిరాణా దుకా ణానికి వెళ్ళినా లభించేవి. కానీ ఈనాడు వరిలో సైతం మూడు లేక నాలుగు రకాలు మించి సాగు కావటం లేదు. అమృతపాణి, చక్రకేళి దాదాపుగా అంతరించిపోయాయి. పంటలు, వివిధ మొక్కల రకాలు తగ్గి ప్రకృతి నుండి అదృశ్యం కావటాన్నే కుంచించుకుపోతున్న‘జీవ వైవిధ్యం’గా పేర్కొం టారు. మొక్కల్లోని వైవిధ్యం మానవుని ఆరోగ్యానికే (పోషక విలువలకు) కాక పర్యావరణానికి, సృష్టిలో మనుషుల,పక్షుల,జంతువుల,మనుగడకు అత్యావ శ్యకం. అమృతపాణి అరటిపళ్లు, ‘తైమ్‌’, ‘అతిబాల’ వంటి మొక్కలు ప్రకృతి నుండి అదృశ్యమైతే ముందు తరాల వారికి కనీసం అవి మ్యూజియంలో కూడా కానరాని పరిస్థితి దాపురిస్తుంది. ఈవిలువైన సం పదను ముందు తరాల అవసరాలను సంరక్షించు కోవాలి. వీటి పరిరక్షణకు ‘’జీవ వైవిధ్య చట్టం-2002’ కొన్ని చర్యలు చేపట్టింది. వీటిని సక్రమంగా వినియోగించుకోవటానికి కేంద్రంలో ఒకసంస్థ (నేష నల్‌ బయోడైవర్సిటీ అథారిటీ) ఏర్పాటైంది. వివిధ రాష్ట్రాల్లో బయోడైవర్సిటీ బోర్డులు నిర్వహింప బడ్డాయి. ఆరు సంవత్సరాల క్రితం హైదరా బాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు’ అనేక విలువైన సూచనలు చేసింది. ఏదైనా ఔషధ సంస్థ,కంపెనీ,ఆహారశుద్ధి పరిశ్రమ, దేశీ, ఆయు ర్వేద, యునానీ వైద్యులు…అరణ్యాలు, కొండల్లోని అరుదైన మొక్కల్ని వ్యాపారరీత్యా పొందాలంటే ప్రభుత్వ బయోడైవర్సిటీ సంస్థల నుండి తప్పక అనుమతులు పొందాలి. ఈవృక్ష సంపదను, వన మూలికలను సాగు చేస్తూ, సంరక్షించే ఆ ప్రాంత గిరిజనులకు…ప్రతిఫలంగా కొంత రుసుమును చెల్లించాలి. పొందిన లాభాల్లో కొంత భాగం గిరి జనుల సంక్షేమానికి (స్థానికంగా వారికి పాఠ శాలలు,ఆస్పత్రులు వగైరా నెలకొల్పటానికి) విని యోగించాలి.అనాదిగా గిరిజనులకు వృక్ష సంప దపైనున్న జ్ఞానాన్ని పరిరక్షించాలి. ఇది మానవాళి నాగరికతలో అంతర్భాగం.దేశంలోని వివిధ అర ణ్యాలు,గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 20కోట్ల మంది గిరిజనులు,గ్రామీణ పేదలు అటవీ ఉత్ప త్తుల, వన మూలికలు, ఔషధ పంటల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు.వామపక్షాల ఒత్తిడి మేరకు నాటి యు.పి.ఎ ప్రభుత్వం ఆదివాసి, గిరిజనులకు ఈ ఉత్పత్తులు అనుభవించటానికి గాను, పోడు తదితర భూములపై పరిమితంగానైనా కొన్ని హక్కులు కల్పించింది. ఐక్యరాజ్య సమితి నిర్వ హించిన ‘’నగోయా’’ పర్యావరణ సదస్సు సూచించిన నిబంధనావళి లోని ఆర్టికల్‌ 5 ప్రకారం అటవీ ఉత్పత్తులు, ఔషధ, అరుదైన పంట రకాల విని యోగం ద్వారా లభించే లాభాలను విధిగా గిరిజన, ఆదివాసీ, రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఈనిబంధనల కు మన పార్లమెంటు గతంలో చట్టపరంగా హక్కులు కల్పించింది.
కాగా 2016లో ఉత్తరాఖండ్‌ లోని ‘’దివ్య’’ ఆయుర్వేద కంపెనీ హిమాలయాల్లోని అడవుల నుండి పెద్దసంఖ్యలో అనేకఅరుదైన ఔషధ మొక్క లను ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా చౌర్యం చేసింది. విశేషమేమంటే దివ్య ఫార్మసీ ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్తగా మారిన వివాదాస్పద రామ్‌ దేవ్‌ బాబాకు చెందిన ఔషధ సంస్థ. ‘జీవ వైవిధ్య చట్టం-2002’ను అతిక్రమించి అరుదైన ఔషధ మొక్కలను ప్రభుత్వ సంస్థల అనుమతులు లేకుండా పరిశ్రమల్లో వినియోగించి,తద్వారా లభించిన లాభాల్లో భాగాన్ని స్థానిక గిరిజనులకు ఇవ్వడానికి నిరాకరించినందుకు ఉత్తరఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వ్యాజ్యం వేసింది. ఈఉల్లంఘనను తీవ్ర మైనదిగా పరిగణిస్తూ హైకోర్టు దివ్యఫార్మసీపై జుర్మానా విధిస్తూ ఆపరిశ్రమ నిర్వహణకు సంబం ధించి కఠినమైన షరతులు విధించింది. ఈ చర్యను జీర్ణించుకోలేని రామ్‌దేవ్‌ బాబా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి…ప్రైవేటు ఔషధ పరిశ్రమలు, ఆయుష్‌ సంస్థలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఔషధ మొక్కలను పొందటానికి వీలుగా…జీవ వైవిధ్య చట్టం-2002కితూట్లు పొడిచే సవరణలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఇరవై సంవత్స రాల్లో భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన వేప, పసుపు, వంగ, బాస్మతి వరి, బంగినపల్లి రకాలపై మేధోసం పత్తి హక్కులు(పేటెంట్లు) పొంది…వాటిని తస్కరిం చేందుకు ఔషధ,ఆహార బహుళజాతి విదేశీ కంపెనీలు ప్రయత్నించాయి. మన ప్రజా సంఘాలు, సంస్థలు చేసిన ఒత్తిడి మేరకు…ఈ‘జీవ వైవిధ్య చట్టం-2002’ సహకారంతో… భారత ప్రభుత్వం దీర్ఘకాలం పోరాడి ఈ సంపదను విదేశీ కంపెనీలు కాజేయకుండా రక్షించుకోగల్గింది.
జీవ వైవిధ్య చట్టానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణల పుణ్యమా అని ఎలాంటి అనుమతులు లేకుండానే పేటెంట్‌ హక్కులు పొం ది…స్థానిక గిరిజనులకు పరిహారాన్ని ఇవ్వనక్కర్లే కుండా దేశీయ కంపెనీలకేగాక విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఉదాహరణకు రైతులకు ఎంతో పంట నష్టం కలిగిస్తున్న అగ్గి తెగులును తట్టుకొనే వరి వంగడాలను రూపొందిం చాలంటే క్రాసింగ్‌ కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలకు తూర్పు కనుమల్లోని ఛత్తీస్‌గఢ్‌ అడవుల నుండి కొన్ని కొండజాతి వరిరకాలు అవసరం అవుతా యి. ఇక మీదట మన అరుదైన వృక్ష సంపదపై మాన్‌శాంటో వంటి బహుళజాతి కంపెనీలకు పేటెం టు హక్కులు లభిస్తే బిటీ కాటన్‌ వలె మన వ్యవసాయం వారి ఆధీనంలోకి పోయే ప్రమా దం వుంది. అందుకే దేశ ఆహార భద్రతకు, పర్యా వర ణానికి, గిరిజనుల, రైతుల ప్రయోజనాలకు హని కల్గించే ఈచట్ట సవరణలను వెనక్కి తీసు కోవాలి. పలువురు శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, జన విజ్ఞాన వేదిక ఇటీవల నిర్వహించిన అంత ర్జాల సదస్సుద్వారా పార్లమెంటరీ స్థాయీ సంఘా న్ని ఇదే కోరాయి.
(వ్యాసకర్త :డా.సోమమర్ల,ఐసిఎఆర్‌ ఎన్‌.బి.పి.జి.ఆర్‌లోప్రిన్సిపల్‌సైంటిస్ట్‌` న్యూఢల్లీి ) -రుద్రరాజు శ్రీనివాసరాజు

భిన్న‌త్వంలో ఏక‌త్వం..మాన‌వ వాదం

మనం ఉన్నది గురుత్వాకర్షణ శక్తి ఉన్న గ్రహం మీద! పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పక కింద పడా ల్సిందే!! తప్పదు.. వస్తువులైనా,మనుషులైనా, కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద ఉన్నవారిని,పైకి లేచిన వారినీ, పైకి లేచి కింద పడినవారినీ, అందరినీ! ప్రపంచంలోని అన్యా యాన్ని చూస్తూ ఉండకూడదు.అది మన వెలు గుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకో గూడదు.. సహించగూడదు. ఆలక్షణమే మనం బతికి ఉన్నామని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం! అదే మానవత్వ ఆకర్షణ శక్తి!
భిన్న మతాలు, భిన్న సంస్కృతులు సంగమించే పవిత్రభూమి భారతదేశం.బౌద్ధ,జైన,సిక్కు మతాలు అవసరానుగుణంగా సమయ సంద ర్భాలననుసరించి ఈ దేశంలో ఉద్భవిం చాయి. అంతేకాదు.. విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజంలను కూడా భారతదేశం స్వాగతించి అక్కున చేర్చుకున్నది. ఆ పరమే శ్వరుడు ఏకత్వంలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాలా ఇష్టపడతాడు. లేకుంటే సృష్టిలో తాను ఒకే కులాన్ని, ఒకే మతాన్ని ఏర్పరచి ఉండేవాడు. కానీ అలా చేయలేదే! కనుక భగవంతుని సంకల్పం మేరకే ఈనాడు ప్రపంచంలో ఇన్ని మతాలు, విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాదులు, జీవన విధానాలు, సంస్కృతులు, సాంప్ర దాయాలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నవారంతా ఒకే మతానికి చెందిన వారైతే అన్ని సమస్యలూ పరిష్కార మవుతాయని ఎవరైనా భావిస్తే పొరపాటు అవుతుంది. సత్యదూరమే అవుతుంది. ఊహాజనితమైనదై, వాస్తవికతకు దూరంగా జరిగినట్లవుతుంది. ఇపుడు మానవాళి ముందున్న ప్రధాన సమస్య భిన్నమతాలు కాదు. నిజమైన సమస్యలు పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, కరువు కాటకాలు మొదలైనవి. ఇవి మతాలు పరిష్కరించే సమస్యలు కావు. భిన్నత్వమనేది కేవలం మత సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కాదు. భగవంతుడు సృష్టి చేసినపుడు పిల్లి, కుక్క, నక్క ఉంటే చాలనుకోలేదు.84 లక్షల జీవరాసులను సృష్టిం చాడు. ఒకచోట రాత్రి,ఒకచోట పగలు, ఒక ప్రాం తంలో వేడి, మరో చోట ఎండ ఉన్నాయి. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకేరకంగా లేవు. అంటే వైవిధ్యం సృష్టి ధర్మం. ఈ వైవిధ్యంలో,భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.వైవిధ్యభరితమైన సృష్టికి మూలం, కర్త, కర్మ, క్రియ అన్నీ భగవం తుడే. భగవంతుని ఒక రూపానికి, నామానికి పరిమితం చేయకుండా సృష్టి, స్థితి లయలకు కారణభూతమైన విశ్వ చైతన్య శక్తిగా మనం గ్రహించగల్గితే సమస్యలుండవు. మానవ దేహానికి చైతన్యం ఉన్నంత సేపు ఆశరీరం శివం. అంటే మంగళకరం. దేహం నుండి చైతన్యం వెలుపలకు వెళ్లిపోతే శ్వాస ఆగిపోతుంది. చలనరహితమవుతుంది. అప్పుడు ఆశరీరాన్ని ఫలానా వారి పార్థివ శరీరమంటాం.ఒక శరీరానికి ఈ చైతన్యం ఎటువంటిదో సకల జగత్తుకూ అలా ఆధారభూతమైనది విశ్వ చైతన్య శక్తే. ఇదే విశ్వమంతటా నిండి నిబిడీకృతమైన ఏకత్వం. మనకు కంటికి కన్పించే, చెవికి విన్పించే అంశాలలో మాత్రమే భిన్నత్వం. కానీ నిత్య సత్యమైనది, భిన్నత్వంలోనున్న ఏకత్వమే (విశ్వ చైతన్య శక్తి). ఏకత్వం నుండే భిన్నత్వం ఆవిర్భవించింది. తుదకు భిన్నత్వమంతా ఏకత్వంలో సంలీనమవుతుంది. ఈనాడున్న అన్ని మతాలనూ మనం ఈ రీతిగానే చూడాలి. ఆరాధనా పద్ధతులను, ఆచారవ్యవహారాలను ఈ రకంగానే అవగాహన చేసుకోవాలి. అన్ని మతాలలో ఉన్న ఏకత్వం ఏమిటంటే.. అవన్నీ కూడా ఉత్తమమైన జీవన విధానాన్నే ప్రబోధిస్తాయి. మానవతా విలువలకే ప్రాధాన్యమిస్తాయి. శాంతి సామరస్యాలనే వాంఛిస్తాయి. పరోపకారం, క్షమ, త్యాగనిరతినే అభిలషిస్తాయి. భేదమంతా సృష్టిని, సృష్టి యందున్న భిన్నత్వాన్ని, భిన్నత్వంలో గల ఏక త్వాన్ని అర్థం చేసుకోలేని సగటు మనిషి మదిలోనే ఉంది.ధనవంతుడు సముద్రం లాంటివాడు. సముద్రంలో ఎన్ని నీళ్ళున్నా ఒక్కడి దాహం కూడా తీరదు. ధనవంతుడు కూడా తీర్చలేడు. సంస్కార వంతుడు బావి లాంటివాడు. బావి తన దగ్గరున్న కొద్ది నీళ్ళతో అందరి దాహం తీరుస్తుంది. అదే మానవత్వం! మా’నవ’ వాదానికి మరో నిర్వచనం అక్కరలేదు. జాతి, మత, ప్రాంతీయ, వర్గ,వర్ణ విభజనలు చూడకుండా బావి అందరి దాహం తీరుస్తుంది. ఇది మా బావి అనీ, అది మీ బావి అని మానవత్వంలేని వారు బావుల్ని, చెరువుల్ని విభజించుకున్నారు. అది మళ్ళీ వేరే విషయం. సరే.. అక్క పెండ్లికి మంచి బహుమతి ఇద్దామని ఇద్దరు చెల్లెళ్ళు కష్టపడి, అతి కష్టం మీద ఐదువేలు దాచిపెట్టుకున్నారు. ఇంతలో ఫేస్‌బుక్‌ ద్వారా కరీంనగర్‌లోని న్యూ ఎస్టీ కాలనీలోని బత్తిని అంజవ్వ గురించి తెలుసుకున్నారు. ఆమె భర్త చనిపోయాడు. చిన్న పాప ఉంది. ఆమెకు కాలేయవ్యాధి – విషయం తెలుసుకున్న ఆ ఆడపిల్లలు వారు దాచి పెట్టుకున్న డబ్బు వెంటనే అంజవ్వకు పంపారు. స్వార్థాన్ని వదులుకుని ఇతరులకు సహాయపడటమే మానవత్వం. ఇలాంటి సంఘటనలు అరుదుగా అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. బొంబాయి వాసి అమన్‌, రహదారిపై నాలుగు రోజుల పాప ఏడుపు విన్నాడు. నిర్మానుతష్యమైన ప్రదేశం… ఏం చేయాలో తోచక పాపను తనతో తీసుకెళ్ళాడు. అయితే ఆ పసిగుడ్డును పెంచేది ఎలాగో అతనికి తెలియదు. వెంటనే ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. అందులో పోలీసులు తనను ఆదుకోవాలని అభ్యర్థించాడు. విషయం పోలీసులకు చేరింది. వాళ్ళు వెంటనే స్పందించి,వచ్చి..పాపను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. తర్వాత బాలల అనాథాశ్రయంలో చేర్పించారు. అబద్దాలతో సోషల్‌ మీడియాను కలుషితం చేస్తున్నవారి సంఖ్య చాలా పెద్దది. అయినా, నిజాల్ని నిజంగా బయటికి తెచ్చే వారి సంఖ్యను మనం పెంచుకుని, ఒక ఉద్యమంగా చేసుకోవాలి. కరోనా కాలంలో ఒక సంఘటన జరిగింది. అది మానవ వాదానికి బలాన్నిచ్చింది. అనంతపురంలో ఒక బ్రాహ్మణుడు కరోనాతో చనిపోయాడు. చూడటానికి కానీ, అంత్య క్రియలు జరిపించడానికి గానీ అతని బంధు మిత్రులూ, స్నేహితులు ఎవరూ రాలేదు. రంజాన్‌ ఉపవాసంలో ఉన్న కొందరు ముస్లింలు అక్కడికి వచ్చారు. ఎవరి నుండీ ఏ స్పందనా రాకపోవడంతో వారే పాడె ఏర్పాటు చేశారు. పాడె మోశారు. అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం ముందు మతం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుందని ప్రకటించకనే ప్రకటించారు. కొన్ని జీవన సత్యాల్ని మనం పిల్లలకు, యువకులకు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి తెలుసకోవడానికి మనతరంలో సగం జీవితం అయిపోయింది కదా?తర్వాత తరాలకు అంత సమయం ఎందుకు పట్టాలి? మన తరం వారు చాలా ఆలస్యంగా నేర్చుకున్నవి రాబోయే తరాలు సత్వరం నేర్చుకోవాలి. దానివల్ల సమాజ పురోగతి వేగం పుంజుకుంటుంది. మానవత్వానికి సంబంధించిన విషయాలు ఊరికే మూర్ఖులతో వాదిస్తూ సమయం వృధా చేసుకోగూడదు. వాళ్ళకు వాళ్ళ మత విశ్వాసాలు, భ్రమలే ముఖ్యం. వాటిని నిలబెట్టుకోవడానికి అడ్డ దిడ్డంగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు. మనోభావాలు దెబ్బతిన్నాయని బూతులు మాట్లాడుతుంటారు..తప్పించి, నిజాలేమిటో, వాస్తవాలేమిటో వారెంత మాత్రమూ పట్టించుకోరు. 2014 అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పాసయి జ్యోతి అనే అమ్మాయి అసిస్టెంట్‌ ఇన్‌కంటాక్స్‌ కమిషనర్‌ ఉద్యోం సంపాదించింది. ఆ అమ్మాయి 2013లో కంప్యూటర్‌ సైన్సులో డిగ్రీ తీసుకుని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసింది. కూతురు ఉద్యోగం సంపాదించిన విషయం తెలుసుకుని ఆమె తండ్రి సోబెరన్‌ ఆనందంలో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఒక జీవిని,ఒక జీవితాన్ని నిలబెట్టిన మానవత్వపు విజయరేఖ అతని కళ్ళలో కనిపించింది. అతిసామాన్యుడే అయినా, ఎంతో మంది గొప్పవాళ్ళకంటే గొప్పవాడు.. సొబెరన్‌! అతను తోపుడు బండిపై కూర గాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టం మీద కూతుర్ని చదివించి పెద్ద చేశాడు. అతను గతాన్ని గుర్తు చేసుకుని ఓమాట చెప్పాడు. ‘’నాకు చెత్తకుండీలో అమ్మాయి దొరకలేదు. బొగ్గు గనిలో ఒక వజ్రం దొరికింది’’ అని! ఆమె ఎవరి బిడ్డో అతనికి తెలియదు. కానీ, తల్లీ,దండ్రీ అన్నీతానై ఒక ప్రాణిని బతికించాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాడు. అందుకు, అందరూ అతణ్ణి అభినందించాల్సిందే! కొన్నేళ్ళ క్రితం బండి తోసుకుంటూ వెళుతున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశంలో చెత్తకుప్పమీద ఏడుస్తూ ఒక ఆడశిశువు కనిపించింది. వెనకా, ముందూ ఏమీ ఆలోచించకుండా పరుగెత్తి ఆశిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే! భారతీయ సమాజంలో ఆదరణ లేక, అవకాశాల్లేక… అవకాశాలివ్వక… ఎన్నో జాతులు శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలి! మానవత్వాన్ని మేల్కొల్పాలి!! ఒక కూరలమ్ముకుని బతికే వాడికి ఉన్న ఔదార్యం ప్రభుత్వాలకూ, కార్పొరేట్లకూ లేకపోతే ఎలా?చాలా మంది సీతాసాహూ అనే మహిళ పేరు విని ఉండకపోవచ్చు. ఒకప్పుడు విన్నా, మరిచిపోయి ఉండొచ్చు. మన మీడియా ఇలాంటి వారిని పట్టించుకోదు కదా? సీతాసాహూ ఈ దేశానికి రెండు ప్రత్యేక ఒలంపిక్‌ మెడల్స్‌ తెచ్చిన మహిళ. జీవిక కోసం ప్రస్తుతం పానీపురి అమ్ముకుని బతుకుతూ ఉంది. కొందరికి అప్పనంగా ప్రజల సొమ్ము కోట్లకు కోట్లు కట్టబెట్టే మన ప్రభుత్వాలకు కళ్ళూ, చెవులూ రెండూ లేనట్టేనా? ఉత్త పుణ్యానికి భారతరత్న పొంది కోట్లకు కోట్లు సంపాదించిన ఓ క్రికెట్‌ ఆటగాడి పేరు చెబితే.. దేశం యావత్తూ గుర్తుపడుతుంది. అతనేమో ఉచితంగా వచ్చిన తన ఫరారీ కారుకు రాయితీ కావాలని ప్రభుత్వానికి అర్జీపెట్టుకుంటాడు. అలాంటి వారిని నెత్తిన మోసే ప్రభుత్వాలు సీతా సాహూ లాంటివారిని ఎందుకు పట్టించుకోవూ? ఇలాంటి అంశాలు ఎత్తి చూపడం ఎందుకంటే దేశంలో అసమానతలు, వివక్షలు ఉండకూడదని! దీనికి జస్టిస్‌ చంద్ర చూడ్‌ 2018 ఆగస్టు30న ఒక మంచి వివరణ ఇచ్చారు..‘’ప్రజాస్వామ్యానికి అసమ్మతి అనేది ఒక ‘సేఫ్టీవాల్వు’ లాంటిది. దాన్ని అనుమతించకపోతే,ఏకంగా ప్రజాస్వామ్య ప్రెజర్‌ కుక్కర్‌ పేలిపోతుంది!’’ అని. కేవలం మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా జరగని చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. కరోనా వ్యాక్సిన్‌లు అందరితో కలిపి కాకుండా,తమ ‘అగ్రవర్ణం’ వారికి విడిగా వేయాలని కొందరు డిమాండ్‌ చేస్తారు. ఆసుపత్రిలోని పేషంట్లు కొందరు, తమ ‘కులపోడి’ రక్తమే కావాలని డిమాండ్‌ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ 1.24లక్షల మంది విద్యార్థులకు కులం లేదు. కేరళ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులు తాము ఏ కులానికీ, ఏమతానికీ చెందమని స్పష్టం చేశారు.’ప్రతి సంవత్సరం ఇలాంటి చిన్నారుల సంఖ్య తమ రాష్ట్రంలో గణ నీయంగా పెరుగుతూ ఉందని’’ అసెంబ్లీలో కేరళ విద్యామంత్రి సి. రవీంద్రనాథ్‌ ప్రకటిం చారు. దేశంలో ఈ మార్పు ఎంతో ఆశాజ నకంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వా లకు స్ఫూర్తినిస్తోంది. కులం-మతం కాలమ్స్‌ వదిలేసి విద్యార్థులు ఇస్తున్న డిక్లరేషన్‌ సంచల నం సృష్టిస్తోంది. ముందు ముందు ఆ కాలమ్స్‌ అప్లికేషన్లలో ప్రింట్‌ చేయకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం! నార్వేలో ఒక మంచి పద్ధతి వాడుకలో ఉంది. ఉదాహరణకు ఒక మహిళ మరో ఇద్దరిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్ళిందనుకుందాం. ముగ్గురికి మూడు మీల్స్‌ అని డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఆమె ఇతర నిస్సహాయులకు సహాయపడాలను కుంటే… మరో రెండు భోజనాలకు అదనంగా డబ్బు చెల్లిస్తుంది. ‘’ఫైవ్‌ మీల్స్‌, టూ సస్పెండెడ్‌’’ అని అంటుంది. ఐదు భోజనాలకు డబ్బు చెల్లించి, మూడు మాత్రమే తీసుకుంటుంది. ఎవరైనా అతిదీన స్థితిలో ఉండి, డబ్బు చెల్లించి భోజనం చేయలేని వాళ్ళు వచ్చి అడిగితే… ఆ రెస్టారెంట్‌ వాళ్ళు వారికి భోజనం పెడతారు! ‘ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌’ అని అడిగిన వారికి ‘’ఎనీ సస్పెండెడ్‌ కాఫీ’’ అని అడిగిన వారికి రెస్టారెంట్‌ సహకరిస్తుంది. అదేదో దానం చేస్తున్నట్టు కాక, కస్టమర్స్‌ గౌరవభావంతో డొనేట్‌ చేస్తారు. అంతే గౌరవభావంతో రెస్టారెంట్‌వాళ్ళూ, పేదలకు అందిస్తారు. మానవీయ విలువలు గల హుందాతనంతో.. అలా ముక్కూ మొహం తెలియకుండా కూడా గౌరవభావంతో చేసే ఆ సహాయం ఎంత గొప్పది? ‘డబ్బులు అదనంగా వస్తున్నాయి కదా? వెనకేసుకుందాం’ అనే వ్యాపార ధోరణీ, కక్కుర్తీ ప్రదర్శించకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే మంచి మనసు కూడా రెస్టారెంట్‌ యాజమాన్యానికి ఉంటుంది. విషమ పరిస్థితులు ఎదురై ఆర్థికంగా దిగజారిన వారు కూడా, మానసికంగా కృంగిపోక – హుందాగా ‘ఎనీ సస్పెండెడ్‌ మీల్స్‌’ అని అడగడమే కాదు, తాము కూడా ప్రయోజకులై – సస్పెండెడ్‌ కాఫీ, టిఫిన్‌, మీల్స్‌కు డబ్బు చెల్లించాలని ఉబలాట పడతారు కూడా! అందుకే తెలుగు కవి ఆలూరి బైరాగి అంటారు…‘’కత్తిరించిన ఒత్తులే / వెలుగు తాయి దివ్యంగా-బాధా దగ్ధకంఠాలే పలుకు తాయి శ్రావ్యంగా’’ అని! అందుకే మనకిప్పుడు ఎవరి అవసరం ఉందో తెలుసా? ఈ సమా జంలో ఆర్థిక, సాంఘిక, ప్రాంతీయ అసమా నతలు ఉండకూడదని మానవ జాతి అంతా ఒకటే అని నినదిస్తూ రచనలు చేసే రచయితలు కావాలి. గళమెత్తే గాయకులు కావాలి. ఆ భావాన్ని ప్రతిబింబించే చిత్రకారులూ, శిల్పులూ కావాలి. ఆచరణలో పెట్టగల కార్యకర్తలు, సమాజ సేవకులూ కావాలి! ‘సేవ’ అనే ముసుగు ధరించి రాజకీయాలు చేసే ముసుగు వీరులు వృథా! వృథా!! సమా జాన్ని పాతరాతి యుగంలోకి ఈడ్చుకు పోయే ప్రభుత్వాలు అంతకన్నా వృథా. వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ నిధులు పనితీరు
వినియోగం

ప్రభుత్వం 2015లో డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ ఫండ్స్‌ (డీఎంఎఫ్‌)పథకాన్ని మైనింగ్‌-బాధిత వర్గాలతో ప్రయోజనం-భాగస్వామ్య పథకంగా ప్రవేశపెట్టింది.ఈపథకం కింద, మైనింగ్‌ కంపెనీలు 2015కి ముందు మంజూరు చేసిన లీజులకు రాయల్టీ మొత్తంలో 30శాతం,2015 తర్వాత వేలం యంత్రాంగంద్వారా మంజూరు చేయబడిన లీజుల ద్వారా పది శాతం చెల్లి స్తాయి. ఈనిధులు ప్రధాన మంత్రి ఖనిజ్‌ క్షేత్ర కళ్యాణ్‌ యోజనకి అనుసం ధానించబడిన లాభాపేక్షలేని మరియు స్వతంత్ర ట్రస్టులు. మైనింగ్‌ ప్రభావిత సంఘాలు మరియు పర్యావరణం కోసం ఇది వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ నిధులలో కనీసం 60 శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు వినియోగించాలి. ఈ గమనిక యుటిలైజేషన్‌ ఇండెక్స్‌ ద్వారా భారతదేశంలోని టాప్‌ 12 మైనింగ్‌ రాష్ట్రాలలో సేకరణ, కేటాయింపు మరియు వ్యయ విధానాలను విశ్లేషిస్తుంది. సేకరణ నిష్పత్తికి కేటాయింపు మరియు సేకరణ నిష్పత్తికి వ్యయం మరియు అధిక-ప్రాధాన్య ప్రాంతాలకు (డీఎంఎఫ్‌) కేటాయింపు శాతం,ప్రాధాన్యతా ప్రాంతాలలో విస్తరించడం వంటి గుణాత్మక సూచికలు వంటి పరిమాణాత్మక సూచికలపై రాష్ట్రాలను విశ్లేషిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది మరియు అన్ని సూచికలలో ఇతర రాష్ట్రాల కంటే నిలకడగా మెరుగ్గా ఉంది. మైనింగ్‌ అనేది తయారీ రంగాలకు ముడిసరుకును అందించే ముఖ్యమైన ప్రాథమిక రంగం. మైనింగ్‌ కార్యకలాపాలు స్థానిక కమ్యూనిటీలకు ఉపాధి అవకాశాలు మరియు అవస్థాపన సౌకర్యాలను అందజేస్తుండగా, ఇవి ప్రతికూల పర్యావరణ, ఆరోగ్యం,జీవనోపాధి ప్రభావాలతో సహా ప్రతికూల బాహ్య ప్రభావాలకు కూడా దారితీయవచ్చు (ఆంటోసి, రుస్సు, టిక్కీ, 2019). గిరిజనఅటవీ-నివాస వర్గాలతో సహామైనింగ్‌ ప్రభావిత వర్గాల సంక్షేమాన్ని భారత ప్రభుత్వం గుర్తిం చింది.అందువల్ల గనులు మరియు ఖని జాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) కింద మార్చి 2015లో డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌ (డీఎంఎఫ్‌) నిధిని ప్రవేశపెట్టింది. సవరణ చట్టం 2015. సవరణ చట్టం 2015లోని సెక్షన్‌ 9మైనింగ్‌ కార్యకలాపాల వల్ల ప్రభావి తమైన ప్రతి జిల్లాలో (డీఎంఎఫ్‌)నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది. (డీఎంఎఫ్‌) పథకం కింద, మైనింగ్‌ కంపెనీలు 2015కి ముందు మంజూరు చేసిన లీజులకు రాయల్టీ మొత్తంలో 30 శాతం మరియు 2015 తర్వాత వేలం యంత్రాంగం ద్వారా మంజూరు చేయబడిన లీజుల ద్వారా పదిశాతం చెల్లిస్తాయి. మైనింగ్‌ సంబంధిత కార్యకలాపాల ద్వారా ప్రభా వితమైన వ్యక్తులు మరియు ప్రాంతాల ఆసక్తి మరియు ప్రయోజనం కోసం పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2015). (డీఎంఎఫ్‌)ఫండ్‌ స్థానిక కమ్యూ నిటీలను సహజ వనరుల ఆధారిత అభివృద్ధి పర్యావరణ పరిరక్షణలో సమాన భాగస్వా ములుగా గుర్తిస్తుంది. మైనింగ్‌-ప్రభావిత కమ్యూనిటీలతో ప్రయోజనం-భాగస్వామ్యానికి ఫండ్‌ ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ఇది ఏదైనా నిర్దిష్ట పథకం లేదా పని ప్రాంతంతో ముడిపడి ఉండని ఒక ప్రత్యేక నిధి,ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఇది ముగియదు. బదు లుగా, ఉపయోగించని నిధులు సంవత్సరాలుగా పేరుకుపోతాయి. ప్రస్తుతం, భారతదేశంలోని 22 రాష్ట్రాల్లోని 600 మైనింగ్‌ ప్రభావిత జిల్లాల్లో (డీఎంఎఫ్‌)నిధులు ఏర్పాటు చేయ బడ్డాయి. లాభాపేక్ష లేని ట్రస్టులు ఈ నిధులను నిర్వహిస్తాయి. ప్రతి జిల్లాకు ప్రత్యేక ట్రస్ట్‌ ఉంది.ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సెప్టెంబరు 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఖనీజ్‌ క్షేత్ర కళ్యాణ్‌ యోజనని ప్రకటించింది. పథకం మొత్తం లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2017)
(ఎ) మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ ప్రాజెక్టులు/ కార్యక్రమాలను అమలు చేయడం. ఈ ప్రాజెక్ట్‌లు/కార్యక్రమాలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ప్రస్తుత కొనసాగుతున్న పథకాలు/ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాయి.
(బి) మైనింగ్‌ జిల్లాల్లోని ప్రజల పర్యావరణం, ఆరోగ్యం మరియు సామాజిక-ఆర్థికాలపై మైనింగ్‌ సమయంలో మరియు తరువాత ప్రతికూల ప్రభావాలను తగ్గించడం/ తగ్గించడం.
(సి) మైనింగ్‌ ప్రాంతాలలో బాధిత ప్రజలకు దీర్ఘకాలిక స్థిరమైన జీవనోపాధిని నిర్ధారించడం.
(డీఎంఎఫ్‌)చట్టంలోని సెక్షన్‌ 20 ప్రకారం, అన్ని రాష్ట్రాలు నియమాలలో చేర్చుతాయి. దీని ప్రకారం, (డీఎంఎఫ్‌)లు తమ తమ జిల్లాల్లోని అమలు చేస్తారు. (ఎ) తాగునీటి సరఫరా, (బి) పర్యావరణ పరిరక్షణ,కాలుష్య నియంత్రణ చర్యలు, (సి) ఆరోగ్య సంరక్షణ, (డి) విద్య, (ఇ) సంక్షేమం వంటి వాటితో సహా, డిఎంఎఫ్‌ నిధులలో కనీసం 60శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు వినియోగించబడుతుంది. మహిళలు మరియు పిల్లలు, (ఎఫ్‌) వృద్ధులు వికలాంగుల సంక్షేమం, (జి) నైపుణ్యాభివృద్ధి మరియు (హెచ్‌) పారిశుధ్యం. మిగిలిన నిధులను ఇతర ప్రయోజనాల కోసం వినియోగిస్తారు: (ఎ) భౌతిక మౌలిక సదుపాయాలు, (బి) నీటిపారుదల, (సి) ఇంధనం మరియు వాటర్‌షెడ్‌ అభివృద్ధి మరియు (డి) మైనింగ్‌ జిల్లాల్లో పర్యావరణ నాణ్యతను పెంపొందించడానికి ఏవైనా ఇతర చర్యలు.మార్చి 2020లో, కేంద్ర ప్రభుత్వం (డీఎంఎఫ్‌)నిధులకు సంబంధించి అదనపు సూచనలను జారీ చేసింది.30శాతం నిధులను కోవిడ్‌-19కి సంబంధించిన ఖర్చుల కోసం ఉపయోగించవచ్చని మార్గదర్శకాలు సూచిం చాయి. సవరణ చట్టం 2021 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు (డీఎంఎఫ్‌)రాజ్యాంగం,విధులను నిర్దేశిస్తూనే ఉండగా, కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల కూర్పు మరియు వినియోగానికి సంబం ధించి దిశానిర్దేశం చేయవచ్చు. జూలై 12, 2021న, కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేసింది, (డీఎంఎఫ్‌) ఫండ్‌ నుండి ఏదైనా ఖర్చులకు ఎలాంటి అనుమతి లేదా ఆమోదం రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర స్థాయి ఏజెన్సీ ద్వారా జరగదు’’ (గనుల మంత్రిత్వ శాఖ, 2021`ప).2015 సెప్టెంబర్‌ 2021 మధ్య (డీఎంఎఫ్‌)నిధుల కోసం రూ.53,830 కోట్లు సేకరించబడ్డాయి. బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి దాదాపు 39శాతం (రూ.20,766 కోట్లు), బొగ్గు మరియు లిగ్నైట్‌ కాకుండా ఇతర ప్రధాన ఖనిజాల నుండి 50శాతం (రూ. 27, 108 కోట్లు),మిగిలిన వాటి నుండి సేకరించ బడిరది. మైనర్‌ ఖనిజాల నుండి 11శాతం (రూ. 5,956 కోట్లు) (మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, 2021). భారతదేశంలో ముఖ్యమైన మైనింగ్‌ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గోవా, గుజ రాత్‌, జార్ఖండ్‌,కర్ణాటక,మధ్యప్రదేశ్‌, మహా రాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌,తమిళనాడు,తెలంగాణ. ఈ అగ్ర12 మైనింగ్‌ రాష్ట్రాలు దేశంలోని మొత్తం (డీఎంఎఫ్‌)సేకరణలో 96.4శాతం వాటా కలిగి ఉన్నాయి. అగ్ర 12 మైనింగ్‌ రాష్ట్రాలు సేకరించిన, కేటాయించిన మరియు ఖర్చు చేసిన మొత్తాలను ఇలా ఉన్నాయి. మొదటి నాలుగు రాష్ట్రాలు-ఒడిశా (రూ. 14,934 కోట్లు),ఛత్తీస్‌గఢ్‌ (రూ. 7,651 కోట్లు), జార్ఖండ్‌ (రూ.7,393 కోట్లు), రాజ స్థాన్‌ (రూ. 5,468 కోట్లు) దేశంలోని మొత్తం డిఎమ్‌ఎఫ్‌ వసూళ్లలో దాదాపు 66శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఒడిశా (77శాతం), రాజస్థాన్‌ (82 శాతం) మరియు కర్ణాటక (85 శాతం)(డీఎంఎఫ్‌)ఫండ్‌లో ఎక్కువ భాగం ప్రధాన ఇంధనేతర ఖనిజాల నుండి వచ్చిన ప్పటికీ,జార్ఖండ్‌ తన (డీఎంఎఫ్‌)లో 78శాతం బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి సేకరిస్తుంది (మూర్తి 2). బొగ్గు మరియు లిగ్నైట్‌ నుండి అధిక(డీఎంఎఫ్‌)సేకరణ ఉన్న ఇతర రాష్ట్రాలు తెలంగాణ (89శాతం),మహారాష్ట్ర (88 శాతం),మధ్యప్రదేశ్‌ (70 శాతం),ఛత్తీస్‌గఢ్‌ (54శాతం).ఒడిశాలో అత్యధికంగా రూ.14, 934 కోట్ల డీఎంఎఫ్‌ వసూళ్లు ఉండగా, అందులో కేవలం 50శాతం మాత్రమే ఖర్చు చేసింది. మరోవైపు,ఛత్తీస్‌గఢ్‌ రూ.7,651 కోట్లు వసూలు చేసి 68శాతం ఖర్చుచేసింది. నాలుగు రాష్ట్రాలు ఒడిశా,తెలంగాణ,గుజరాత్‌ ,కర్ణాటక (డీఎంఎఫ్‌)నిధుల సేకరణ కంటే ఎక్కువ మొత్తాన్ని కేటాయించాయి. అయితే, నిధుల కేటాయింపు తప్పనిసరిగా వాస్తవ వ్యయంలోకి అనువదించబడదు. ఉదాహరణకు, ఒడిశా అత్యధిక మొత్తాన్ని కేటాయించగా, అది 49 శాతం మాత్రమే ఖర్చు చేసింది. అదేవిధంగా, కర్ణాటక దాని %ణవీఖీ% సేకరణకు దాదాపు 1.26 రెట్లు కేటాయించింది, అయితే దాని కేటాయించిన నిధులలో 31 శాతం మాత్రమే ఖర్చు చేసింది (మొత్తం సేకరణలో 39 శాతం).సెక్షన్‌ 1లో పేర్కొన్నట్లుగా, మార్గదర్శకాలు కనీసం 60 శాతం(డీఎంఎఫ్‌) నిధులను అధిక ప్రాధాన్యత గల ప్రాంతాల్లో ఉపయోగించాలని సూచిస్తున్నాయి. అయిన ప్పటికీ, అధిక ప్రాధాన్యత మరియు ఇతర ప్రాధాన్యత ప్రాంతాలలో పంపిణీ నిర్దేశించబడలేదు. డేటా,ఇతర సమాచారం లేకపోవడంతో,కొన్నింటిపై వినియోగాన్ని కేంద్రీకరించడం కంటే ప్రాధాన్యతా ప్రాంతా లలో సమానమైన పంపిణీ ఉత్తమమని మేము భావిస్తున్నాము. (డీఎంఎఫ్‌)నిధుల వినియోగాన్ని అంచనా వేయడానికి ఒక మంచి కొలమానం వ్యయానికి సంబంధించిన వివిధ రంగాలలో వైవిధ్యం యొక్క గుణకం (ప్రామాణిక విచలనం సగటు ద్వారా విభజించబడిరది). వైవిధ్యం యొక్క తక్కువ గుణకం మెరుగైన పంపిణీని సూచిస్తుంది. 12 అగ్ర మైనింగ్‌ రాష్ట్రాల్లో 10 (డేటా లభ్యత సమస్యలు)లో రంగాల వారీగా కేటాయింపుల పంపిణీని టేబుల్‌ 3 చూపు తుంది. జార్ఖండ్‌ తన(డీఎంఎఫ్‌)నిధులలో అత్యధిక భాగాన్ని అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు (89 శాతం) కేటాయించింది. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రం అధిక-ప్రాధాన్య ప్రాంతాలు మరియు ఇతర ప్రాధాన్యతా ప్రాంతాలలో వైవిధ్యం యొక్క పేలవమైన గుణకాన్ని చూపుతుంది.
లక్ష్యాలు
త్రాగునీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, పర్యా వరణ పరిరక్షణ మరియు పరిరక్షణ, స్త్రీలు మరియు శిశు సంక్షేమం, వృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి మరియు పారిశుధ్యం (మినిస్ట్రీ) వంటి అధిక ప్రాధాన్యతా రంగాలకు (డీఎంఎఫ్‌)నిధిలో కనీసం 60 శాతం కేటాయించాలని సూచిస్తుంది. మైన్స్‌, 2015%ప). మిగిలిన నిధిని భౌతిక మౌలిక సదుపాయాలు, నీటి పారుదల,శక్తి అభివృద్ధి మరియు మైనింగ్‌ ప్రాంతాల పర్యావరణ నాణ్యతను పెంపొం దించడానికి ఏవైనా ఇతర చర్యలతో సహా ఇతర ప్రాధాన్యతా రంగాలకు ఉపయోగించ వచ్చు. (డీఎంఎఫ్‌)యుటిలైజేషన్‌ ఇండెక్స్‌ అనేది ఫండ్‌ ఎంత బాగా ఖర్చు చేయబడిరదో అంచనా వేయడానికి పరిమాణాత్మక,గుణాత్మక చర్యల మిశ్రమంగా గణించబడుతుంది. ఒక రాష్ట్రం లేదా జిల్లా మొత్తం (డీఎంఎఫ్‌) కేటాయింపు వ్యయం (డీఎంఎఫ్‌)వినియోగం యొక్క పరిమాణాత్మక సూచిక అయితే, వివిధ ప్రాధాన్యతా రంగాలలో గుణాత్మక వ్యాప్తిని విశ్లేషించడం కూడా అంతే ముఖ్యం. కొన్ని రాష్ట్రాలు లక్ష్యాలను సాధించడంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలు వాటి ఖర్చుల పరిమాణం మరియు నాణ్యతలో కూడా విభిన్నంగా ఉంటాయి. అయితే, అన్ని రాష్ట్రాలు,జిల్లాలకు నవీకరించబడిన మరియు సంబంధిత డేటా అందుబాటులో లేదు. అందు బాటులో ఉన్న డేటా ఆధారంగా, ప్రస్తుత అధ్యయనం ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గుజరాత్‌, జార్ఖండ్‌,కర్ణాటక,మహారాష్ట్ర,ఒడిషా,రాజస్థాన్‌, తమిళనాడు,తెలంగాణ వంటి పది రాష్ట్రాలకు (డీఎంఎఫ్‌)ని గణిస్తుంది.
మెథడాలజీ
12అగ్రశ్రేణి మైనింగ్‌ రాష్ట్రాలలో10,అంటే ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌,గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక,మహారాష్ట్ర,ఒడిశా,రాజస్థాన్‌, తమి ళనాడు మరియు తెలంగాణలలో వ్యయ విధా నాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర స్థాయి సూచిక ప్రయత్నిస్తుంది. ఈ రాష్ట్రాలు ఐదు వేర్వేరు సూచికలపై విశ్లేషించబడ్డాయి సేకరణ నిష్పత్తికి కేటాయింపు,సేకరణ నిష్పత్తికి వ్యయం వంటి పరిమాణాత్మక సూచికలుబీ మరియు (సి) అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలపై కేటాయింపుల వాటా, (డి) అధిక-ప్రాధాన్య ప్రాంతాలలో కేటాయింపుల వ్యాప్తి మరియు (ఇ) ఇతర ప్రాధాన్య ప్రాంతాలలో కేటాయిం పుల వ్యాప్తి వంటి గుణాత్మక సూచికలు. ఇతర రెండు రాష్ట్రాలు, అంటే గోవా,మధ్యప్రదేశ్‌, అవసరమైన డేటా అందుబాటులో లేనందున సూచిక చేయబడలేదు. పరిమాణాత్మక సూచికలకు 50 శాతం బరువు ఇవ్వబ డుతుంది-మూడిరట ఒక వంతు కేటాయింపు/సేకరణ మరియు మిగిలిన మూడిరట రెండు వంతుల వ్యయం/సేకరణ. కేటాయింపు డేటా ఉద్దేశాలను సూచిస్తున్నప్పుడు, వ్యయాలు పూర్తి చేయబడిన పనిని సూచిస్తాయి మరియు అందు వల్ల కేటాయింపు/సేకరణ కంటే ఖర్చు/సేకరణకు అధిక బరువు కేటాయించబడుతుంది. మిగిలిన 50 శాతం మూడు గుణాత్మక సూచికల మధ్య సమానంగా విభజించబడిరది. ప్రతి రాష్ట్రం యొక్క తుది స్కోర్‌ను లెక్కించడానికి ఈ ఐదు సూచికల సగటు ఉపయోగించబడుతుంది. బరువు రేఖాచిత్రం టేబుల్‌4లో ఇవ్వబడిరది.
(డీఎంఎఫ్‌)ఇండెక్స్‌ అధ్యయనం సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ (జూజుూ) సస్టైనబుల్‌ మైనింగ్‌ అట్రాక్టివ్‌నెస్‌ ఇండెక్స్‌ (చద్దా,కపూర్‌,శివమణి, 2021) ఫ్రేజర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కెనడా) ద్వారా మైనింగ్‌ కంపెనీల వార్షిక సర్వే (స్టీడ్‌మ్యాన్‌, యునిస్‌, అలియాక్‌బారి, 2020) మరియు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (చీజAజుR) ద్వారా స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పొటెన్షియల్‌ ఇండెక్స్పరిమాణాత్మక మరియు గుణాత్మక సూచికల మధ్య బరువు పంపిణీని అనుకరించడం ద్వారా వెయిటింగ్‌ రేఖాచిత్రం వైవిధ్యత కోసం తనిఖీ చేయబడిరది. పరిమా ణాత్మక సూచికల బరువును 60 శాతానికి పెంచడం మరియు గుణాత్మక సూచికలను 40 శాతానికి తగ్గించడం ఫలితాల క్రమాన్ని ప్రభా వితం చేయలేదు. ఇంకా, పరిమాణాత్మక సూచికల బరువును 40 శాతానికి తగ్గించడం మరియు గుణాత్మక సూచికలను 60 శాతానికి పెంచడం ద్వారా ఇదే విధమైన అనుకరణ అసలైన సమాన-బరువుల ఫలితాల క్రమాన్ని వక్రీకరించలేదు. అందువల్ల, పరిమాణాత్మక మరియు గుణాత్మక సూచికల మధ్య సమాన బరువులు ఎంపిక చేయబడ్డాయి.
డేటా సోర్సెస్‌
మునుపటి విభాగంలో పేర్కొన్న ఐదు సూచికలపై వివిధ ద్వితీయ మూలాల ద్వారా డేటా సేకరించబడిరది. ఈ మూలాల్లో కేంద్ర రాష్ట్ర స్థాయిల నుండి ప్రభుత్వ డేటా ఉంటుం ది. టేబుల్‌ 5 ఈ మూలాల యొక్క వివరణా త్మక జాబితాను అందిస్తుంది. ఆరు రాష్ట్రాలు తమ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ (ణవీG) వెబ్‌సైట్‌లో తాజా డేటాను కలిగి న్నాయి. అయితే, నాలుగు రాష్ట్రాలకు, నవంబర్‌ 2019 నాటికి రంగాల వారీగా కేటాయిం పులను అందించే సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనా మిక్‌ ప్రోగ్రెస్‌ నివేదిక (శల్య,2020) నుండి డేటా ఉపయోగించబడిరది.
సేకరణ నిష్పత్తికి కేటాయింపు
ఈ నిష్పత్తి సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్రాల దీర్ఘకాలిక ఉద్దేశాలకు ముఖ్యమైన సూచిక. అధిక నిష్పత్తి సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణ యొక్క మెరుగైన కేటాయింపును సూచిస్తుంది. సెక్షన్‌ 2లో పేర్కొన్నట్లుగా, కర్ణాటక తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో 125శాతం కేటాయించగా,గోవా మొత్తం సెం టర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో32శాతం మాత్రమే కేటాయించింది.
సేకరణ నిష్పత్తికి వ్యయం
సేకరణ నిష్పత్తికి వ్యయం అనేది రాష్ట్ర నిజ-సమయ వ్యయ నమూనాల సూచిక. అధిక నిష్పత్తి మెరుగైన ప్రస్తుత/కొనసాగుతున్న పనితీరును సూచిస్తుంది. కర్ణాటక తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో 125 శాతం కేటాయించింది, అయితే దాని మొత్తం సేకరణలో 39 శాతం మాత్రమే వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది. %ణవీఖీ% సేకరణలో దాదాపు 98 శాతం కేటాయించినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో అత్యధిక శాతం (68శాతం) ఖర్చు చేసింది.
అధిక-ప్రాధాన్య ప్రాంతాలకు మొత్తం కేటాయింపుల శాతం
రాష్ట్రాలు,జిల్లాలు వాటి సంబంధిత కేటాయిం పులు,వ్యయ నమూనాల ఆధారంగా నేరుగా గ్రేడ్‌ చేయబడి ఉండవచ్చు. అయితే, అదే సమయంలో, వారి కేటాయింపు నమూనాల గుణాత్మక అంశాలను సంగ్రహించడం ముఖ్యం. ఉదాహరణకు,గుజరాత్‌ తన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ప్రోగ్రెస్‌ సేకరణలో దాదాపు 82 శాతం అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు కేటాయించగా, తమిళనాడు అత్యల్ప శాతం (54శాతం) అధిక ప్రాధాన్యత గల ప్రాంతాలకు కేటాయించింది. ఈనియమాలకు కట్టుబడి ఉండడాన్ని సంగ్రహిం చడంలో మాకు సహాయపడుతుంది,ఇది కనీసం 60శాతం అధిక ప్రాధాన్యతగల ప్రాంతాలపై ఖర్చు చేయబడుతుందని పేర్కొంది.- (రాజేష్‌ చద్దా /ఇషితా కపూర్‌)

పాఠ‌శాల చుట్టూ సామాజిక ఉద్య‌మాన్ని నిర్మిద్దాం..!

ఓవైపు మనమంతా 23 శాతం ఫిట్‌మెంట్‌ వద్దని, మెరుగైన పిఆర్‌సి కావాలనే డిమాండ్లతో పోరాటం చేస్తూ వున్నాం. మరొకపక్క ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతున్నది. కనుక ‘మాకు ఊరు బడి వుండాల’నే తల్లిదండ్రులను కదిలించి వారితో కలిసి ఉద్యమించాలి. ప్రాథమిక పాఠశాల యథాతథంగా వుంచాలి. సమాంతర మీడియంలను కొనసాగించాలి. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి…అనే డిమాండ్లతో సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. ఇందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొందాం.
పిఆర్‌సిలో అన్యాయం జరిగితే రోడ్డు మీదకు వచ్చి ప్రతిఘటించింది ఉపాధ్యాయులు. పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కు లను ఊడగొడతూ, కొత్త హక్కుల మాట ఎత్తకుండా చేస్తూ ఎందరికో విద్యా పునాది వేసిన ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. పాఠశాల చుట్టూ సామాజిక ఉద్య మాన్ని నిర్మించాలి. ప్రాథమిక పాఠశాల-ప్రభుత్వ వైఖరి వచ్చే20ఏళ్ళ తరువాత పోటీ పరీక్షలకు విద్యార్థు లను సిద్ధంచేసేలా ఒకటవ తరగతిలోనే బీజం వేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. 96 శాతం మంది తల్లులు తమ బిడ్డలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలని కోరుతున్నారు.అందువల్ల ప్రీప్రె ౖమరీ నుండి ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతు న్నామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి అను గుణంగా విద్యాశాఖ వేగంగా చర్యలు తీసుకుం టున్నది.రాష్ట్రంలో పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠ శాలలు1010వుండగా,40లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 16827. 30లోపువున్న ప్రాథమికోన్నత పాఠశాలలు 1531. వంద లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 483.వీటన్నింటిలో46,769మంది ఉపాధ్యా యులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30వుండవలసి వుండగా1:16 మాత్రమే వుందని, అలాగే ప్రాథమి కోన్నత పాఠశాలల్లో 1:35 కి బదులుగా 1:7.8 వుందని, ఉన్నత పాఠశాలల్లో 1:40కు బదులుగా 1:24 మాత్రమే వుందని చెబుతున్నారు. కనుక ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సవరించాలి. అలాగే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను ప్రత్యామ్నాయ పాఠశాలలుగా మార్చి విద్యా వలంటీర్లతో నడిపితే ఎలా వుంటుందో ఆలోచన చేస్తున్నారు. ఈగణాం కాలను పరిగణ లోకి తీసుకొని మే 30,2020న సర్క్యులర్‌172తీసుకొచ్చారు. మూడు రకాల పాఠ శాల వ్యవస్థను ముందుకుతెచ్చి ప్రాథమిక పాఠశా లల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, ఎమ్మెల్సీల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆరురకాల పాఠశాలల వ్య వస్థను ముందుకు తెచ్చి, ఉన్నత పాఠశాలకి 500 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగుతులను మాత్రమే విలీనం చేస్తామని చెప్పారు. గతంలో సర్క్యులర్‌ 172కి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కనుక దానిని యథాతథంగా అమలు చేయడం లేదని తాత్కాలికంగా వెనక్కి తగ్గినా,తర్వాత ఆర్‌.సి.నెం.151 (18-10-20 21) ఉత్త ర్వులు ఇచ్చి దూకుడుగా తాము అనుకున్న విధానాల అమలుకు సిద్ధమయ్యారు. విద్యా హక్కు చట్టానికి భిన్నంగా జీవో 85 తీసుకొచ్చారు.ఈ ఉత్తర్వులలో ఎన్‌ఇపి 2020ని, ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని ఉటంకిస్తూ…1,2 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా చూడాలని, ఒకే మీడియంను పరిగణలోకి తీసుకోవాలని, వారానికి 30 నుండి 32 గంటల బోధన సమయం వుండాలని,45 పిరియడ్స్‌ వుండాలని…ప్రాథ మికోన్నత పాఠశాలలో 35లోపు విద్యార్థులున్న చోట, అలాగే 75లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠ శాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు ఎందరు వున్నారో లెక్క తేల్చాలని,20లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠ శాలల్లో పనిచేస్తూ ఉన్నతవిద్య అభ్యసించిన ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలు విలీనం అయ్యే ఉన్నత పాఠశాలల్లో సరిపడా గదులు లేకపోతే ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి బోధించాలని, 3కిమీ లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల సారాంశంగా ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ అస్తవ్యస్ధంగా వున్నదని, 3వ తరగతి నుండే సబ్జెక్ట్‌ బోధన, నాణ్యమైన విద్య అందించాలని, అంగన్‌వాడీతో కలిపి 1,2 తరగతులకు పునాది విద్య అందిస్తామని చెబుతున్నారు. పాఠశాల వ్యవస్థ ఎందుకు బలహీనంగా వుందో అధ్యయనం చేసి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రయత్నం చేయకుండా పాఠశాల వ్యవస్ధను మాయం చేయడానికి చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించాలి.
సమాధానం లేని ప్రశ్నలు దేశంలో ఏరాష్ట్రంలో లేని 3-10 తరగతుల వ్యవస్థను ఆంధ్ర ప్రదేశ్‌లో ఎందుకు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చేసిన ఇలాంటి ప్రయోగం విఫలం అయ్యింది కదా! 1-5 తరగతుల విద్యార్థి సామర్థ్యాలు,6-10 తరగతుల సామర్థ్యాలు వేరువేరుగా వుంటాయి కదా. పిరియడ్స్‌ వ్యవస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధన నుండి దూరం చేస్తుంది కదా! ప్లే స్కూల్‌గా వున్న అంగన్‌వాడీ కేంద్రాలలోకి 1,2 తరగతుల పిల్లలను చేర్చడం చదువు నేర్పడానికేనా? ‘ఒక్క పాఠశాల మూసివేయం. ఒక పోస్టు తగ్గించం’ అని ప్రభుత్వం చెబుతూ 1:30 నిష్పత్తిని ముందుకు తీసుకురావడాన్ని ఎలా చూడాలి? పునాది విద్యను నేర్పే ప్రాథమిక పాఠశాలను విడదీసిన తరువాత విద్యార్థికి చదువు దూరం కాదా! 1 కిమీలో పాఠశాల వుండాలనే ప్రాథమిక విద్యా హక్కు చట్టం నిబంధనకు ప్రస్తుత ఉత్తర్వులు విరుద్ధం కాదా! ఎన్‌ఇపి 2020 లోని 8వ తరగతి లోపు మాతృభాషలో విద్య అనేది ఎందుకు విస్మరించారు. ఎన్‌ఇపి 2020లో 3,4,5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడదీయాలని ఎక్కడైనా వుందా! తమ నివాస ప్రాంతాలలో స్కూలు లేకపోతే… దూరం పోలేని, దూరం పంపించడానికి ఇష్టపడని విద్యార్థులు పాఠశాలకు దూరం కారా! ఇప్పటికే ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి పాఠశాల వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా మరిన్ని ఉపాధ్యాయ పోస్టులను మిగులుగా చూపించడానికి చేసే ప్రయత్నం కాదా! ఒకే మీడియం వల్ల ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు మిగులుగా మారిపోతే, 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం వల్ల వచ్చే ఎస్‌జిటి ఉపాధ్యాయులకు పదోన్నతులు రావు కదా! మొత్తం విద్యార్థులు, మొత్తం ఉపాధ్యాయులను పరిగణ లోనికి తీసుకొని ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని నిర్ధారించడం అశాస్త్రీయం కదా! ఉన్నత పాఠశాలల్లో సెక్షన్ల వారీ ఉపాధ్యాయుల సంఖ్యను కేటాయించాలి కదా! ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకపోగా… విప్లవాత్మకమైన మార్పులను మీరు అంగీకరించాలని చెబుతున్నారు. ఐనా ‘ఒక్క సంవత్సరం ఆగండి. మా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తాయ’ని చెబుతున్నారు.
ఏం జరగబోతున్నది ?
75 సంవత్సరాలుగా ప్రజలందరికి అమ్మ ఒడి లాంటి ప్రాథమిక వ్యవస్థ కనుమరుగవుతుంది. విద్యార్థులు లేక కొన్ని, విలీనం వల్ల అన్ని ప్రాథమిక పాఠశాలలతో పాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొన్ని మాయమవుతాయి. ఉపాధ్యాయుల సంఖ్య (సుమారు 54 వేలు) తగ్గిపోతుంది. 1-2 తరగతుల విద్యార్థులకు నాణ్యమైన బోధన వుండదు. ఇప్పటికే బడి బయట వున్న విద్యార్థులకు తోడు మరింత మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారు.
ఏం చేయాలి ?
ఓవైపు మనమంతా 23శాతం ఫిట్‌మెంట్‌ వద్దని, మెరుగైన పిఆర్‌సి కావాలనే డిమాండ్లతో పోరాటం చేస్తూ వున్నాం. మరొకపక్క ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతున్నది. కనుక ‘మాకు ఊరు బడి వుండాల’నే తల్లిదండ్రులను కదిలించి వారితో కలిసి ఉద్యమించాలి. ప్రాథమిక పాఠశాల యథాతథంగా వుంచాలి. సమాంతర మీడియంలను కొనసాగించాలి. ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి…అనే డిమాండ్లతో సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. ఇందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొందాం. వ్యాసకర్త : యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు- ఎన్‌. వెంకటేశ్వర్లు

విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!

ఇటీవల కాలంలో నిర్వహించిన రోదసి విహార యాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ కుబేరులైన జెఫ్‌ బెజోస్‌, రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ తాము రూపొందించిన స్ప్రేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా రోదసి విహార పర్యటనకు వెళ్లివచ్చారు. మరో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా తన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ద్వారా రోదసి విహార యాత్ర నిర్వహించాడు. చూడడానికి సైంటిఫిక్‌ అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ రోదసి విహార యాత్రలు అనే కాన్సెప్ట్‌ పెరిగితే పర్యావరణానికి పెద్ద హాని జరగనుంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఉన్న ఒక్క శాతం ప్రజలు పర్యావర ణానికి తీవ్ర హాని చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది విడుదల చేసే కర్బన ఉద్గారాల కన్నా ఈ ఒక్క శాతం ధనవంతులు విడుదల చేసే కర్బన ఉద్గారా లు రెండిరతలు అధికంగా ఉన్నాయి. తాజా రోదసి విహార యాత్రలు కూడా అత్యంత ధనవంతులు మాత్రమే చేయగలరు. వీరి వినోదం, ఉల్లాసం కోసం జరపబోయే పర్యాటక యాత్రలు ప్రపంచ మానవాళికి ప్రళయంలా మారనున్నాయి.

Read more

ఆరోగ్యం రాజ్యాంగ హ‌క్కు కావాలి

రాజ్యాంగ పరమైన ఆరోగ్య హక్కువల్ల, వెంటనే ఆర్థిక పరమైన రక్షణ లభిస్తుంది. అధికపెట్టు బడివల్ల, కుటుంబ పొదుపు, ఉద్యోగ అవకాశాలు ఒక వైపు,సుదూర భవిష్య త్తులో,ఉద్వేగపూరితమైన, మానసిక పరమైన,సామాజిక పరమైన రక్షణ విషయం లో ప్రజలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని గమనించ గలం. ప్రపంచంలోని,చిన్న,పెద్ద దేశాలు కూడా మహమ్మారి నుండి కోలుకోవ డానికి,విధాన నిర్ణయాలలో,పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో అనేక చర్యలు చేపడు తున్నాయి. భారత దేశం ఈ విషయంలో వెనుకబడరాదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్భంధ విద్య నిస్సందేహంగా విలువైన వారసత్వాలలో ఒకటి. ధైర్యమైన నాయక త్వానికి నిజమైన నిదర్శనం.మానవునికి ఉన్న పరిమితమైన జ్ఞాపక శక్తి, తరచుగా మన సమిష్టిబాధల నుండి ఉపశ మనం పొందడానికి ఉపకరిస్తుంది. కానీ, బాధల నుండి నేర్చుకునే గుణపాఠాలు మరింత కీలకమైనవి. నోవెల్‌ కరోనావైరస్‌ మహమ్మారి ఫలితంగా,మన ప్రజలు వ్యక్తిగతంగా,సమిష్టిగా ఎదుర్కొంటున్న విషాదకరమైన పరిస్థితులను దృష్టిలోఉంచుకుని, ముందు చూపుతో అవసర మైన గుణపాఠాలను తీసు కోవడం మన నాయ కత్వం యొక్క నైతిక బాధ్యతకావాలి. దీని నుండి తీసుకోవాల్సిన గుణపాఠం ఏమంటే ‘అందరికీ ఆరోగ్య హక్కు’ అవసరాన్ని గుర్తిం చడం. కరోనా మహమ్మారి మన ఆరోగ్య రక్షణ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది.ఈ సమస్యను మనం నిర్లక్ష్యం చేయడంగానీ,నేర్చుకో కుండా ఉండడంగానీ చేయలేము.

Read more

నోబెలే గుర్తించింది..
మరి పాలకులు…?

ఏసేవకైనా,శ్రమకైనా ప్రపంచ గుర్తింపులో అత్యంత ప్రసిద్ధి గాంచినది నోబెల్‌ బహుమతి. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ప్రకటించిన నోబెల్‌ బహుమతులో ఆర్థిక శాస్త్రం మరియు శాంతికి ప్రకటించిన నోబెల్‌ బహుమతి ఇటు కార్మిక వర్గానికి అటు భావవ్యక్తీ కరణకు పరిత పించే అభ్యుదయ వాదులకు ఒకఊరట నిచ్చింది. లాభాలు పెంచుకోవడం కోసం వేతనాల కోతనే మరమౌష ధంగా భావించే పెట్టు బడిదారీవర్గానికి ఈసారి ప్రసాదించిన నోబెల్‌ బహుమతి యొక్క అంత రార్థం ఒక సమా ధానం. కనీస వేతనాల పెరు గుదల కొత్త ఉపాధి అవకాశాలను తగ్గించదని నిరూపిస్తూ చేసిన రీసెర్చ్‌కుగానూ ఈ ఏడు అర్థశాస్త్ర నోబెల్‌ బహుమతి ఇవ్వడం జరిగింది. తక్కువ వేతనా లను ఇవ్వడం ఎక్కువ పనిగం టలు పని చేయించు కోవడం వంటివే అధిక లాభాలకు ఆధా రాలుగా భావించే యాజమా న్యాలకు ఇది ఒక కనుపిప్పు కలిగించాలి. ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈఏడాది ముగ్గురిని వరించింది. అమె రికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించగానే అనేకులకు ఆశ్చర్యమేసింది.అయితే ఇందులో సగం పురస్కా రాన్ని డేవిడ్‌ కార్డ్‌కు ఇవ్వగా..మిగతాసగాన్ని జాషువా,గైడో పంచుకోనున్నారు. కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్‌ అందించారు. ఇక ఆర్థిక శాస్త్రానికి సంబం ధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇచ్చారు. సామాజిక శాస్త్రాల్లో ఒక్కోసారి చాలా పెద్దపెద్ద ప్రశ్నలు ఎదురవు తుంటాయి.ఉపాధి,ఉద్యోగుల వేతనంపై వలస విధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఓవ్యక్తి సుదీర్ఘ విద్య అతని భవిష్యత్తుపై ఏ మేరకు పనిచేస్తుంది? వలసవిధానం తగ్గడం,వ్యక్తి సుదీర్ఘకాలం చదువుకోకపోవడం ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది?ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం.అయితే ఈ ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధాన మివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్‌, జాషువా,గైడో రుజువు చేశారు.అయితే ఏ దేశ ప్రభుత్వాలైనా, ఏ రంగంలోనైనా ఇలాంటి పరిశోధనలను గుర్తించడమే కాక వాటిని తమ విధానాల్లో భాగం చేసుకున్నప్పుడే ఆర్థిక అసమానతల తొలగింపు సులభమౌతుంది. భారత దేశంలో కనీస వేతనాల చట్టం1948 లోనే తయారు చేయబడిరది. కానీ ఇది చట్టపరమైన బైండిరగ్‌ ఏమీ కాదు. కనీస వేతనాలు చెల్లించనందుకు ఇంత వరకు ఎవరినీ చట్టం శిక్షించడం లేదు. అయితే ఈ చట్టం ప్రకారం కార్మిక సంఘాలు పోరాటం చేయడం మూలాన రాష్ట్రాలు కంపెనీల యాజమాన్యాలు కొంతవరకు కనీస వేతనాలు చెల్లించడానికి చర్చలు మాత్రం జరిపుతాయి కానీ అమలుకు చిత్తశుద్ది లేదు. కనీస వేతనాలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మరియు ఒక రంగానికి మరో రంగానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. షెడ్యూల్డ్‌ కంపెనీలకు, రిజిస్టర్డ్‌ కంపెనీలకు మరియు రిజిష్ట్రేషన్‌ చేయబడని కంపెనీలలో కూడా కనీస వేతనాలు వ్యత్యాసాలతో కొనసాగు తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రిజిస్ట్రేషన్‌ పొందిన కంపెనీల్లో కూడా కింది స్థాయిలోని ఎక్కువ శాతం ఉద్యోగులు ఎలాంటి మస్టర్‌ లేకుండా డైలీ వేజ్‌ వర్కర్లుగా పని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ అదే కంపెనీలో పని చేస్తున్న వారి కన్నా తక్కువ వేతనం చెల్లించబడుతుంది. ఇది అనేక సందర్భాలలో కార్మిక సంఘాల సర్వేలలో బయట పడిరది. ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. అయితే భారతదేశంలో రిజిస్ట్రేషన్‌ చేయబడినవి, షెడ్యూల్లో లేని సూక్ష్మ, మధ్య తరగతి మరియు సీజనల్‌ ఇండస్ట్రీ లే ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి చోట దోపిడీ మరింత ఎక్కువగా ఉన్నది. మన దేశంలో అత్యంత ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఈ రకమైన దోపిడీయే. కనీస వేతనాల చెల్లింపు నుండి సంఘటిత రంగం కూడా చాలా తెలివిగా తప్పించుకుంటున్నది. కాంట్రాక్టీకరణల ద్వారా నియమించుకున్న ఉద్యోగులకు సదరు కాంట్రాక్టర్‌ ఎంత వేతనాలు చెల్లిస్తున్నారో విధిగా తెలుసుకోవలసిన బాధ్యత పని తీసుకుంటున్న సంస్థకు ఉన్నది. ప్రావిడెంట్‌ ఫండ్‌, ఈ.ఎ.ఐ వంటివి చెల్లిస్తున్నాడా లేదా చెక్‌ చేయవలసింది కూడా కంపెనీయే. కాంట్రాక్టర్‌ కూడా తను ఏ ఏ హెడ్స్‌ కింద ఇస్తున్నాడో తెలుపవలసిన బాధ్యత ఉన్నది. అయితే ఇవన్నీ పేపర్‌ వరకే పరిమితమై బ్యాంకు క్రెడిట్‌ మరోలా ఉన్నదని కాంట్రాక్టీ కరణల ద్వారా నియమించబడుతున్న ఉద్యోగు లందరూ వాపోతుంటారు. దీనికి కాంట్రాక్టర్‌ ఇచ్చే సమాధానం ఏమంటే- ట్రైనింగు, యూని ఫామ్‌,రిఫ్రెషర్‌ ట్రైనింగ్‌ మరియు ఇతర మెయింటేనెన్సులు వంటివన్నీ మినహాయించు కున్న తర్వాత ఆ విధంగా చెల్లించవలసి వస్తుందని. దీనిలో నిజానిజాలు ఎంత ఉన్నా నష్టపోయేది కార్మికుడే. కనీస వేతనాలు అమలు కోసం రాష్ట్రాల పరిధిలో వేజ్‌ బోర్డులు అని నామకరణం చేయబడ్డాయి కానీ ఇవి నామ మాత్రంగానే ఉన్నాయి. నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి- కూడు,గూడు,గుడ్డతో పాటు విద్య, వైద్యం, మరియు ఎంటర్టైన్మెంట్‌ సదుపాయాల కోసం లెక్కించి,ఆస్థానిక పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించడం అవి అమలు జరిగేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఇది ఈ దేశమంతా అందని ద్రాక్షే. 2020లో భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన వివరాల ప్రకారం జాతీయ సగటు కనీస వేతనం కేవలం 293 రూపా యలే! కేరళ రాష్ట్రం 670రూపాయలతో మొదటి స్థానంలో వుండగా 453రూపయలతో జమ్ముకాశ్మీర్‌,438 రూపాయలతో తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో వున్నవి. అత్యల్పం మధ్యప్రధేశ్‌ రాష్ట్రంలో 205రూపాయలు చెల్లించబడగా గుజరాత్‌ బీహారుల్లో వరుసగా 233 మరియు267 గా వున్నవి.భారత దేశ టెలికాం రంగంలో సంస్కరణలను ప్రతిపాధించి నప్పుడు శ్యాంపిట్రోడా గారు కంపెనీ సి.ఈ.ఓ జీతాన్ని కంపెనీలోని అత్యధిక జీతానికన్నా మూడిరతలు చేయడం ద్వారా క్రింది స్థాయి వుద్యోగులను మరింత పిండగలరని చెప్పారు. ఈ సూత్రం వంటబట్టించుకున్న రిలయన్స్‌ జియో క్రింది స్థాయి వర్కర్లకు చాలీచాలని భృతి ఇస్తూ లాభాలు గడిస్తున్నది!. అయితే ఉద్యోగు లను పిండుకోవడం కాదు, క్రింది స్థాయి వేతనాల్లో పెరుగుదల మార్కెట్‌నూ పరుగులు పెట్టించగలదనీ ఆర్థిక మాంద్యానికి సమాధా నాలుగా సూచించినప్పుడు కీన్స్‌ అనే ఆర్థిక వేత్త కూడా అభిప్రాయపడ్డారు. కనీస వేతనాల పెరుగుదల ఉపాధి లేమికీ లాభాల్లో తగ్గుద లకూ దారి తీయదని సాక్షాత్తు ప్రపంచ ప్రసిద్ది నోబెల్‌ నిర్వహాకులే గుర్తించినందుకు మన పాలకులూ ఆ దిశగా ముందడుగు వేయాలి.

Read more
1 3 4 5 6 7 11