మైదాన గిరిజ‌నుల‌కు మ‌ర‌ణ శాస‌నం

నాన్‌ షెడ్యూల్‌ ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతాల్లో విలీనం చేయాలని మైదాన ప్రాంత గిరిజనులు చేస్తున్న ఉద్యమం ఉధృతం అవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి వారు చేస్తున్న ఉద్యమాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన నేపధ్యంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరి స్తున్నారు. ఈనేపధ్యంలో ఏపీలో మైదాన ప్రాంతాల్లో ఉన్న సుమారు 800 గిరిజన గ్రామాలను విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతే కాకుండా విశాఖ జిల్లా నాతవరం మండలంలో ఉన్న నాలుగు మైదాన ప్రాంత పంచాయితీలను విశాఖ మెట్రో పాలిటిన్‌ రీజయన్‌ డవలప్‌మెంట్‌ అధారిటీ (వీఎం ఆర్‌డీఏ)లో విలీనం చేశారు. వాటిని షెడ్యూల్‌ ప్రాంతాల్లో కలపాలని కూడా ఆ ప్రాంత గిరిజనులు డిమాండ్‌ చేస్తూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కలసి వినతిపత్రాలు అందజేయడం జరుగుతుంది. ఫలితంగా మైదాన ప్రాంత గిరిజనుల గోడును గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.పుష్పశ్రీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంత శాసన సభ్యులు, పాడేరు ఎమ్మేల్యే కె. భాగ్యలక్ష్మీ,అరకు ఎమ్మెల్యే సిహెచ్‌. ఫాల్గుణ, శ్రీకాకుళం, విజయనగరం గిరిజన నియోజకవర్గాల శాసనసభ్యులు కలసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మ్మోహన్‌ రెడ్డికి తెలియజేశారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎన్ని ఉద్యమాలు చేసినా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో నాన్‌షెడ్యూల్‌ ఏరియా గిరిజనుల జీవనవిధానం మరణశాసనంగా మారింది. అడవినే నమ్ముకొని బ్రతుకుతున్న తాము ఆదివాసులమే అని చెప్పుకుంటున్నా పట్టించుకోని నాధుడు కరవయ్యారు. – సైమన్‌ గునపర్తి ఒకపక్క జిల్లాలు పునర్విభజన కార్యక్రమం ముమ్మ రంగా సాగుతున్నప్పటికీ మైదాన ప్రాంతాలు విలీనం ఒక్క కొలిక్కి రాకపోవడం, ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీని ఇవ్వకపోవడంతో ఆ ప్రాంత గిరిజనులు ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తూన్నారు. ఈవిషయంపై అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి పార్లమెంటు సమావేశాల్లో మార్చి 28న పార్లమెంటు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల తరబడి మైదాన ప్రాంత మండలలో జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను 5వ షెడ్యూల్‌ పరిధిలోకి తీసుకు రావాలని ఉన్న ప్రధానమైన డిమాండును మార్చి 28న పార్లమెంట్లో గళమెత్తి వినిపించారు.దేశంలో 5వ షెడ్యూల్‌ పరిధిలో ఉన్న అనేక రాష్ట్రాలో ఇదే పరిస్థి ఉందని మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 50శాతంపైగా గిరిజనులు నివసిస్తున్న గ్రామలు మైదానప్రాంత మండలలో ఉండటం వల్లన ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులు వారి జీవనం కొనసాగించడం కష్టతరమైన తరుణంలో వారికి ఐటిడిఏ నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో మరింత వెనకబడిపోతున్నారని కావున వారినీ దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ నుంచి అన్ని రకాల సహాయ సహకారలు అందేరీతిలో రాజ్యాంగ భద్రత కల్పించవలసిందిగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీ అర్జున్‌ ముండాను అరకు ఎంపీ కోరారు. నాన్‌ షెడ్యూల్‌ ఏరియాల్లో గిరిజనులకు హక్కులు ఎందుకు లభించట్లేదు?
వాళ్లంతా గిరిజనులు. రాజ్యాంగపరంగా గుర్తింపు పొందినా సరే.. వాళ్లకు ఏజెన్సీలో ఉన్న రాయితీలు అందడం లేదు. కనీసం రిజర్వేషన్లు కూడా వర్తించడం లేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కుల్ని కోల్పోతున్న గిరిపు త్రుల దుస్థితి ఇది. గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా, కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికార్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉండటమే.
ఏజెన్సీ, షెడ్యూల్డ్‌ ఏరియా అంటే…
బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు, ఆచారాలు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామాలను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత, ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు. అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌1874 అమల్లోకి తెచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమి తులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్షణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ప్రభుత్వం నోటిఫై చేసిన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందుతారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా చట్టం అమలు చేసే ప్రక్రియలో గిరిజనుల ఆచార, సంప్రదాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయిదో షెడ్యూల్‌ లో ఉన్న గిరిజన ప్రాంతాలను తొలగించడం, లేదా కొత్తగా ఏర్పాటు చేయడం వంటి వాటిపై అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ‘‘షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉంటున్న గిరిజ నులకు…హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుంది. షెడ్యూల్డ్‌ ఏరియా గ్రామాల్లో ఆదివాసి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆదివాసీల మధ్య మాత్రమే జరగాలని చెప్పే 1/70వంటి చట్టాలు అమ లులో ఉంటాయి. అదే నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో అయితే గిరిజనుల భూముల్ని ఎవరైనా కొనవచ్చు, అమ్ముకోవచ్చు. ఈ భూ ములపై సివిల్‌ కోర్టుల్లో కేసులు కూడా వేయ వచ్చు’’ అని నాన్‌-షెడ్యూల్డ్‌ గిరిజనుల సంఘం గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే సబ్‌ ప్లాన్‌ నిధులు షెడ్యూల్డ్‌ ఏరియాకే వర్తిస్తా యని, గ్రామసభలకు అధికారాలిచ్చే పీసా చట్టం లాంటివి అమల్లో ఉంటాయని గంగరాజు వెల్లడిరచారు. మైనింగ్‌ అనుమతులు ఇవ్వాల న్నా గ్రామసభల అనుమతి కావాల్సిందేని ఆయన తెలిపారు. ‘’నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో పీసా చట్టం, గ్రామ సభల అనుమతులతో పని లేదు. ఇలా నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న గిరిజనులు రాజ్యంగం కల్పించిన హక్కులను, రక్షణను పొందలేకపోతున్నారు’’ అన్నారు.
షెడ్యూల్డ్‌ ప్రాంతంగా మారాలంటే…
విశాఖపట్నంలోని నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ప్రాంతాల్ని వీఎంఆర్డీఏలో చేర్చడాన్ని తప్పు పడుతూ గిరిజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఏవైతే షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు అర్హతలున్న గ్రామాలను ఏజెన్సీలో కలిపేందుకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించామని రావికమతం మండలం తహాశీల్దార్‌ కనకరావు చెప్పారు. ‘‘రావికమతం మండలంలో నాన్‌ -షెడ్యూల్డ్‌ ఏరియాలో 33రెవెన్యూ గ్రామా లున్నాయి. ఎస్టీ జనాభా 50శాతంకంటే ఎక్కువ ఉన్నగ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చవచ్చంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తున్నాం. జనాభాతో పాటు అక్షరాస్యత, సమీప షెడ్యూల్డ్‌ ప్రాంతం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసు కోవాలని ప్రభుత్వ గైడ్‌ లైన్స్‌ లో ఉంది. రావిక మతం మండలంలో 5 గ్రామాల్లో 50శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్నారు’’ అని కనకరావు చెప్పారు.
‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’
రాజ్యాంగంలో ఆర్టికల్‌ 244(1) ఆర్టికల్‌, అయిదవ షెడ్యూల్‌ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు విఫలమయ్యారని ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ అన్నారు. గిరిజనుల హక్కులు,సంక్షేమం,నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాల అంశాలను ప్రస్తావిస్తూ…తెలంగాణా సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు.‘‘ప్రాజెక్టుల విషయంలో పీసా, అటవీ హక్కుల చట్టాల కింద గ్రామ సభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభుత్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్‌ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతా ల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడు తున్నారు. ప్రభుత్వాలు గిరిజనే తరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ విష యాలను గుర్తించి, మీరు తగిన చర్యలను తక్షణమే తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో మైదాన ప్రాంతంలో వున్న 13 మండలాలను విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ)లో విలీనం చేయడం తో కొత్త వివాదానికి తెరలేచింది. ఏజెన్సీకి ఆనుకుని మైదాన ప్రాంతంలో వున్న గిరిజన గ్రామాలను వీఎంఆర్‌డీలో చేర్చడంపై గిరిజ నులు భగ్గు మంటున్నారు. తమ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలన్న రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని వాపోతున్నారు.జిల్లాలో మొత్తం 43 రెవెన్యూ మండలాలు వుండగా వీటిల్లో 19 మండలాలను గతంలోనే వీఎంఆర్‌డీఏ పరిధిలో చేర్చారు. తాజాగా ఏజెన్సీలోని 11 మండలాలు మినహా మైదాన ప్రాంతంలో మిగిలిన 13 మండలాలను కూడా వీఎంఆర్‌డీఏలో విలీనం చేశారు. అయితే జిల్లాలో ఏజెన్సీకి ఆనుకుని వున్న మైదాన ప్రాంతంలోని నాతవరం నుంచి దేవరాపల్లి వరకు ఎనిమిది మండలాల్లో 113 రెవెన్యూ గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో లక్షా 60 వేల మంది గిరిజనులు నివాసం వుంటున్నారు. ఈ గ్రామాలు నాన్‌ షెడ్యూల్డు ఏరియాలో వుండడంతో ఐటీడీఏ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు.
షెడ్యూల్‌ ఏరియాలో కలిపితే ఎంతో మేలు
గిరిజన జనాభా ఎక్కువ ఉన్న నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలోని గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపితే గిరిజనులకు ఎంతో మేలు జరుగు తుందని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్య లక్ష్మి, శెట్టి ఫాల్గుణ అన్నారు. 50శాతం కంటే ఎక్కువ గిరిజనులు నివసిస్తున్న నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలిపేందుకు ఐటిడిఎ పిఒ గోపాలకృష్ణ రోణంకి ఆధ్వర్యంలో ఐటిడిఎ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నుంచి నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న గిరిజనులు తమ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలని కోరుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారికి అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఐటిడిఎ పిఒ గోపాలకృష్ణ మాట్లాడుతూ గిరిజనుల కోసం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగిందని, 2011 జనాభా ప్రకారం 50 శాతం పైగా గిరిజన జనాభా ఉన్న గ్రామాలను 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో చేర్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. అర్హత కలిగిన గ్రామాలను గుర్తించి గ్రామసభల ద్వారా తీర్మానాలను తమ కార్యాల యానికి సమర్పించాలని నాన్‌ షెడ్యూల్‌ మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలను ఆదేశించారు.