చెట్లు విలువ ఎంత..?

సమాజానికి,పర్యావరణానికి సేవ చేస్తు మానవ జాతికి ఆక్సిజన్‌,సూక్ష్మపోషకాలు ఇతరాత్ర విలువైన సంపదను అందిస్తున్న మన వారసత్వవృక్షాలు అభివృద్ధిపేరుతో గొడ్డలి వేటుకు బలైపో తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఐదు రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం కోసం 356 చెట్లను నరికేశారు.దీనిపై ఓఎన్జీఓ సుప్రింకోర్టును ఆశ్రయించారు.ఆకేసును విచారించిన కోర్టు,నిషికాంత్‌ ముఖర్జీ (టైగర్‌ ఎన్విరాన్‌ మెంట్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌),సోహంపాండ్యా (కార్యదర్శి)లతో ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈకమిటీ కోర్టుకు నివేదించిన నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడిరచారు.డబ్బు చెట్లను పెంచదుని తెలిపింది.చెట్టు యొక్క ఈద్రవ్య మదింపును నిపుణుల బృందం ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.
ఒకచెట్టు ధరను దాని వయస్సుతో గుణించి రూ.74,500గా నిర్ణయించింది.చెట్ల మదింపుపై మార్గదర్శకాలను రూపొందించడానికి ఒక నివేదికలో ఒక చెట్టు ద్రవ్య విలువను ప్యానెల్‌ పేర్కొంది.ఒక వారసత్వ వృక్షం పౌరసమాజానికి,పర్యావరణానికి సేవచేస్తుందని,ఆక్సిజన్‌,సూక్ష్మపోషకాలు, కంపోస్ట్‌, బయో-ఎరువులతో సహా వివిధ గణనలపై దాని విలువను చేరుకోవచ్చని నిపుణుల కమిటీ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఎబోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది.ప్రాజెక్టుల కారణంగా నరికివేయబడుతున్న ఈ చెట్ల ఆర్థిక,పర్యావరణ విలువ అధికం.2021లో దాఖలు చేసిన నివేదిక బహిరంగపరిచారు.ఇది భారతదేశంలో మొదటిసారి జరిగింది.
అన్ని ఖర్చులను చెట్టు యొక్క మిగిలిన వయస్సుతో కలిపి గుణిస్తే,ప్రస్తుత సందర్భంలో 100సంవత్సరాలలో,మొత్తం చెట్టు సంవత్సరానికి రూ.74,500అవుతుంది. ఇందులో ఒక్క ఆక్సిజన్‌కే ఏడాదికి రూ.45వేలు,ఆ తర్వాత బయోఫెర్టిలైజర్ల ధర రూ.20వేలు.సూక్ష్మపోషకాలు,కంపోస్ట్‌ ఖర్చులను జోడిరచడంద్వారా,జీవించేచెట్లు వాటిని నరికివేయబడుతున్న ప్రాజెక్టుల ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొనడం విశేషం.హైవే ప్రాజెక్టులకోసం చెట్లను నరికివేయడానికి బదులు, ట్రాఫిక్‌,రవాణా మౌలికసదుపాయాలను సులభతరం చేయడానికి ఇప్పటికే ఉన్న జలమార్గాలు, రైలు మార్గాలను ఉపయోగించడంవంటి ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు మొదట ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించాలని కూడా కమిటీ సూచించింది. చెట్లను నరికితే మొదటి ప్రయత్నంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని తరలించడమే కాకుండా చెట్లనునరికివేస్తే ఆస్థలంలో ఐదు మొక్కలు నాటితే సరిపోదని కమిటీ స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ప్యానెల్‌ ముందు సమర్పించిన నివేదిక బాధిత రైతులకు భూమి,చెట్లకు ముఖ్యంగా ఫలాలను ఇచ్చే చెట్లకు న్యాయమైన నష్టపరిహారాన్ని కోల్పోయినందున వారికి సహాయకరంగా ఉండవచ్చు అని నిపుణల నివేదిక భావించింది.
అయితే జీ`20పేరుతో విశాఖాని సుందరంగా తీర్చిదిద్దడానికి అనేక వృక్షాలను విచాక్షణ రహితంగా నరికేశారు.దేశంలోనే పేరుగాంచిన ఆంధ్రా విశ్వవిశ్వవిద్యాలయంలో శతాబ్దల సంవత్స రాలకుపైగాఉన్న వారసత్వ వృక్షాలను సైతం నరికేశారు.అదేవిధంగా షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీలో నిర్మిస్తున్న హైవే రహదారి నిర్మాణం కోసం దట్టమైన అడవిలో ఉండే వేలాది వృక్షాలను నరికివేయడం గమనార్హం.సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం..గుత్తేదారు కంపెనీ, అటవీ అధికారుల నుండి ఖర్చులను పరిపాలన ఇప్పుడు గుర్తించగలదా?నిపుణుల నివేదికను పరిశీలిస్తే ఇప్పటి వరకూ ఇక్కడ ఎంతో వారసత్వ సంపద గల విలువైన వృక్షాలను కోల్పోయాం అనేది తెలుస్తోంది.ఇప్పటికైనా ప్రభుత్వ పరి పాలన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో ముందుండాలి.ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాల్సిన అవశ్యకత ఉంది.!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది..!

భారతదేశంలోని ధనవంతులైన 70లక్షల మంది పేదవారు 80కోట్లకు సమానం. మరో మాటలో చెప్పాలంటే,ఎగువ0.5శాతం మంది భారతీయులు దిగువన ఉన్న 57శాతం మందితో సమానంగా సంపాదిస్తారు.ఈసంఖ్యలు వివాదాస్పదంగా ఉండవచ్చు. ప్రపంచ అసమానత ల్యాబ్‌లోని ప్రముఖ అసమానత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ,అతని సహచరుల అంచనాల ఆధారంగా ప్రముఖ సీనియర్‌ ఎకనామిక్‌ అనలిస్ట్‌ ఔనింద్యో చక్రవర్తి రూపొం దించారు.
199లో భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్తఆర్థిక సంస్కరణల్లో సరళీకరణ, ప్రపంచీకరణ మరియు ప్రైవేటీకరణ ప్రవేశపెట్టింది.ఈసంస్కరణలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను తెరవడం,దేశానికి ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగామారిన కొన్ని పరిమితులను తొలగించేందుకు ఇది దోహద పడిరది.ఇదిదేశంలో ప్రైవేట్‌రంగం విస్తరించడానికి మరియు ఆర్థికవృద్ధికి దోహదం చేసింది. ఈనేపథ్యంలోనే నూతన ఆర్ధికసరళీకరణ విధానాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇంటర్నేషనల్‌ మోనార్టింగ్‌ ఫండ్‌(ఐఎంఎఫ్‌),వరల్డ్‌ బ్యాంక్‌లు అప్పటి నుంచి వీటిని తమ గుప్పెట్లోకి వచ్చాయి.
దాని ముందర మనకు సోషలిస్టు విధానం ఉండేది. 30 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తోంది.కానీ డేటా పరిశీలిస్తే0.5శాతం జనాభ ధనికవర్గానికే చెందు తుంది. సంపాదనలో 80కోట్ల మంది పేదవారి సంపాదనతో సమానం అని డేటా చెబుతుందని ఔనింద్యోచక్రవర్తి ద్వారా తెలుస్తోంది.దీనబట్టి పరిశీలస్తే,ముప్పైయేళ్ల క్రితం ప్రవేశపెట్టిన సరళీకరణ విధానం ధనవంతులకే ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.ఆలాగే ప్రపంచంలో అభివృద్ధి చెందినదేశాల కంటే అత్యంతపేదగా పరిగణించబడే బురుండి,మడగాస్కర్‌.ఈ రెండుదేశాల సగటు ఆదాయాలు భారతదేశంలోని రెండు జనాభా విభాగాల సగటు ఆదా యాలతో దాదాపు సమానంగా ఉంటాయి.ఎందుకంటే ఇక్కడ పేదరికం ఎక్కువ..ఆదాయం తక్కువ.
2022లో బురుండిలో సగటు ఆదాయం సుమారు వి1,750 (ూూూ).భారత దేశంలో దిగువన ఉన్న42శాతం మంది పెద్దలు దానికంటే తక్కువ సంపాదించారు దాదాపు వి1,720 (ూూూ).అదే సంవత్సరంలో మడగాస్కర్‌లో సగటు ఆదాయం సుమారు వి3,065 (ూూూ).భారతదేశంలో దిగువన ఉన్న52శాతం మంది పెద్దలు దాని కంటే తక్కువ సంపాదించారు.దీనర్థం దాదాపు58కోట్ల మంది భారతీయులు(ఈపెద్దలపై ఆధార పడిన పిల్లలతోసహా) ప్రపంచంలోని అత్యంత పేదదేశమైన బురుండిలో సగటు వ్యక్తివలే పేదలు.మడగాస్కర్‌లోని ప్రజల సగటు స్థాయికి ఆదాయపరిమితిని పెంచితే,73కోట్ల మంది భారతీయులు అంతకంటే దిగువన ఉన్నట్టు డేటాద్వారా తెలుస్తోంది.
అయితే దేశరాజ్యాంగం మాత్రం ఒకసోషలిస్టు విధానాన్ని స్థాపించేదిగా ఉంది.కానీ ఆర్ధిక విధానంమాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మారుతోంది.అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది.ఆర్ధిక విధానాలను రూపొందించే సమయంలో పాలకులు ఇలాంటి అంశాలపై దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు తయారుకు భలోపేతం చేసినవాళ్లం అవుతాం.-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

ఒరిశా రైలు ప్రమాదానికి బాధ్యులెవరు?

దేశంలో మనుషుల ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్కలేదు.రైలు,రోడ్డు,ఆకాశమార్గాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల భద్రత పరిరక్షణ చేపట్టడంలేదు. మానవ తప్పిదం కారణంగా ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదదుర్ఘటనలో దేశవ్యాప్తంగా పెనువిషాదాన్ని నింపింది.గూడ్స్‌,ట్రైన్‌ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశించిందని,మూడు రైళ్ల ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని రైల్వే అధికారులు చెబుతున్నారు.ఇది మొత్తం ఎలక్ట్రికల్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ తప్పిదాలు వల్లనే ఇంత ఘోరం జరిగిందని అధికారులు తేలిగ్గా చెప్పడం వారి భాద్యతారాహిత్యానికి, భద్రతచర్యల లోపాలకు నిదర్శనం.
రైలు ప్రమాద దుర్ఘాటనలో తన ఇద్దరు సోదరులను కోల్పోయిన ఒరిశా వాసి మనోజ్‌ దాస్‌ సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తపరిచారు.‘‘ఈ రకమైన తప్పిదాలు రైల్వేశాఖలో చాలావరకు జరుగుతున్నాయి. మొత్తం సంఘటనలో చాలా తప్పించుకోదగిన తప్పులు ఉన్నాయి. దీంట్లో ఎవరినీ నిందించడం లేదు కానీ మన దేశంలోని సో కాల్డ్‌ సిస్టమ్‌ యొక్క అజాగ్రత్త కారణంగా దేశంలో బహుజనుల సమస్యల పట్ల అజ్ఞానం,ఉదాసీనత స్పష్టంగా కన్పిస్తోంది. విషాదానికి దారితీసిన కొన్ని ‘‘సాంకేతిక లోపాలు’’ ఇక్కడ ఉన్నాయి.వీటిలో ఏవీ పూర్తిగా యాదృచ్ఛికంగా కనిపించవు.
ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ అనేది సిగ్నల్‌లను సరికాని క్రమంలో మార్చకుండా నిరోధించడానికి ఒక భద్రతా చర్య. మార్గం సురక్షితమని నిరూపించబడినంత వరకు ఇది రైలును కొనసాగించడానికి అనుమతించదు. ఇనుప ఖనిజంతో కూడిన గూడ్స్‌ రైలు అప్పటికే ఆగిపోతున్న లూప్‌ లైన్‌ గుండా వెళ్లడానికి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మొదట గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబడిరది.ఈ మార్గంలో ఇలాంటి సిగ్నలింగ్‌ వైఫల్యాలు కొత్త కాదు.కానీ అన్ని తెలిసిన గతంలో ఈ వైఫల్యాల నుండి నేర్చుకోవడానికి నిరాకరించారు.
దాదాపు 1400మంది ప్రయాణికులతో యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌ సమ యం కంటే 3గంటలు ఆలస్యంగా బయలుదేరింది.సరైన సమయంలో,సాయంత్రం4గంటలకు బాలాసోర్‌ గుండా వెళితే,ఢీకొనడాన్ని సులభంగా నివారించవచ్చు.ఆలస్యానికి హంతకులు కాకపోతే మరెవరు బాధ్యులు?ప్రాణాలతో బయటపడిన కొద్దిమందితో ఫోన్‌లో మాట్లాడి,చాలా మంది రైళ్లలో కూర్చున్న వారి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు.72సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న జనరల్‌ బోగీల్లో రెండు రైళ్లలోఒక్కొక్కరికి 200మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఘర్షణ జరిగినప్పుడు నిలబడి ఉన్నారు.ఈ రైళ్ల రద్దీకి జవాబుదారీ ఎవరు? అవును,ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోని నాటి ప్రభుత్వమే..నా సోదరుల మృతిపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు కూడా..వాస్తవాలను దాచిపెడుతున్న పెయిడ్‌ మీడియా.తమరాజకీయ నాయకుల ముఖాన్ని కాపాడండి. కానీ దేశంలోని మతిమరుపు పౌరులమైన మనమే ఈసంఘటనను మరచిపోయి ప్రశ్నించడాన్ని జాతీయ వ్యతిరేకతగా పరిగణిస్తాము.’’అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్నచిన్న భద్రత లోపాలు కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.ఉదాహరణకు హెల్మేట్‌,సీటుబెల్టు,పెట్టుకొని ప్రయాణించక పోవడం ప్రమాదాలకు మరో కారణం.రహదారిపై ప్రయా ణించేటప్పుడు లైప్ట్‌ సైడ్‌ వెళ్లాల్సిన వాహనచోదకులు రైట్‌సైడ్‌ వెళ్తూ ప్రమాదాలకు గురవు తున్నా రు.దీంతోపాటు అతివేగం నియంత్రణ లేకపోవడం.వాహనాలను ఓవర్‌ టేక్‌ చేస్తూ అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదాలకు పిలుపులుగా మారుతున్నాయి.ఇవన్నీ యాధృచ్ఛకంగా జరుగుతున్న చిన్నచిన్న భద్రత లోపాలే.దేశంలో భద్రతకు ప్రధమ ప్రాధాన్యతమివ్వడం లేదు. రోడ్డు,రైలు మార్గాల భద్రతపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.అతివేగం,మానవ తప్పిదాల వల్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతను పాటించాలి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

గిరిజనాభివృద్ధి జరగాలంటే.. స్థానిక వనరుల వినియోగించాలి

గిరిజనప్రజలైన..సామాజికకార్యకర్తలైన ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నిజమైన గిరిజనాభివృద్ధి జరగాలంటే ఏజెన్సీలో నిక్షేపమైన వనరులు స్థానిక గిరిజనులే వినియోగించు కొనేలా వారికే రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలి.స్థానిక వనరుల వినియోగంపై గిరిజనులను చైతన్యవంతులను చేసేలా చర్యలు చేపట్టాలి. ఐదవషెడ్యూల్‌ ఏరియాలో నివసించే గిరిజనులకు ప్రధానజీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు.గతంలో ప్రతీగిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూవస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో,గిరిజనుల హక్కులపట్ల చైతన్యం కలిగించి,గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘ టించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు,పర్యావరణ పరిరక్షణ,వారిహక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. అయినా పీసాచట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి,రాజ్యాంగానికి విరుద్దంగా,వారి వనరులపై గిరిజనేతరుల పెత్తనం సాగుతూనే ఉంది. ఫలితంగా పచ్చని పొలాలపై మైనింగ్‌ చిచ్చు రగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎండీసీ) మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య 2006 నుంచి ప్రచ్ఛన్నయుద్దం జరుగుతూనే ఉంది.
ఈ వివాదాల నేపథ్యంలో నిమ్మలపాడు కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ఏపీఎండీసీ,జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం ఏప్రిల్‌ 19న ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును స్థానిక గిరిజనులు వ్యతిరేకించారు. గిరిజనాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్దింటే సమత జడ్జెమెంట్‌ ప్రకారం స్థానికులకే లీజులు అప్పగించాలంటూ గిరిజనులు ముక్తకంఠంతో నినాదించారు. నిజానికి గిరిజనుల ఆవేదనకు అర్ధముంది. సమత తీర్పును ప్రభుత్వంగానీ,ఏపీఎండీసీ అధికార యంత్రాంగం గానీ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.ఆతీర్పు పూర్తిగా చదివితే మైనింగ్‌ తవ్వకాలపై సమత జెడ్జి మెంట్‌ వ్యతిరేకం కాదని అర్ధమౌతోంది.రాజ్యాంగబద్దంగా గిరిజన ప్రాంతానికి చెందిన వనరులు గిరిజనులకే చెందాలని, ఒకవేళ వనరులు వెలికితీస్తే గిరిజనులను సొసైటీలుగా ఏర్పాటు చేయించి,వారికే లీజులు ఇవ్వాలని ఆతీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కోంది.ఈతీర్పును అర్ధం చేసుకోకుండా గిరిజన బినామీల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లీజులు ఇవ్వడానికి ఏపీఎండీసీ మొగ్గు చూపుతోంది.
పదహారేళ్ల నుంచి స్థానిక గిరిజన సొసైటీలకు లీజులు ఇవ్వకుండా ఏపీఎండీసీ స్థానికేతర గిరిజనులకే లీజులు ఇవ్వడంపై కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామాల గిరిజన ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈప్రాంతంలో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. వారి అమయకత్వం కారణంగా వనరుల దోపిడికి గురవుతునే ఉన్నారు. ఈ మూడు గ్రామాల మధ్య 125 ఎకరాల్లో విలువైన కాల్సైట్‌ గనులు ఉన్నాయి. వీటిలో సుమారు పాతిక ఎకరాల్లో అత్యంత విలువైన కాల్సైట్‌ ఉంది.వీటిని చేజిక్కించుకోవడానికి మైనింగ్‌ మాఫియా ఏపీఎండీసీ అండతో మూడు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దోపడి వ్యవస్థకు స్వస్తిపలికి ఏపీఎండీసీ అధికార్లు రాజ్యాంగనీతిని అనుసరించాలి.నిజమైన గిరిజనాభివృద్ధిని సాధించాలంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్థానిక వనరులను వినియోగించి అభివృద్ధి చేయాలి.పీసా,సమత జడ్జెమెంట్‌ స్పష్టం చేసిన తీర్పును అర్ధం చేసుకొని షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉన్న వనరులు స్థానికులకే హక్కు కలిగేలా చర్యలు తీసుకోవాలి.వారి వనరులు వారికే చెందేలా గిరిజన సొసైటీలుఏర్పాటు చేయించి,గిరిజనులకు లీజులు ఇచ్చిప్రొత్సహించాలి. అప్పుడే గిరిజన ప్రజలు ఆశించిన నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ దశగా ఏపీఎండీసీ,రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.!-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్

ఎస్టీల గుర్తింపులో తొందరపాటు సరికాదు !

బోయ,వాల్మీకి,బెంతు ఒరియాలను షెడ్యూల్‌ తెగలు(ఎస్టీలు)గా గుర్తించాలని తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి.బోయలు, వాల్మీకులు మరియు బెంథో ఒరియాల నుండి వచ్చిన ప్రాతినిధ్యాలపై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిని పరిశీలించడానికి ఒక వ్యక్తి కమిషన్‌ను ఏర్పాటు చేసింది మరియు ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా,వారిని ఏపీ ఎస్టీల జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు గిరిజన సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.సాధారణ కోర్సులో, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏ(9) ప్రకారం అవసరమైన షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌తో ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సంప్రదింపులు జరిపి ఉండాలి. ఇప్పటి వరకు అలాంటి సంప్రదింపులు జరగిన దాఖలాలు కన్పించలేదు.రాష్ట్రం నియమించిన కమిషన్‌ ఈఅంశంపై తమ అభిప్రాయాలను కోరలేదని,రాష్ట్ర ప్రభుత్వం తమను ఎప్పుడూ విశ్వాసంలోకి తీసుకోలేదని గిరిజన సంఘాల ప్రతినిధులు వాదిస్తున్నారు.
ఐదవ షెడ్యూల్‌లోని పారా4కింద ఏర్పాటైన గిరిజన సలహా మండలి పరిగణలోకి తీసు కున్న అభిప్రాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని తెలుస్తోంది.ఎస్సీ,ఎస్టీలజాబితాల సవరణపై జస్టిస్‌ లోకూర్‌ నేతృత్వంలోని కేంద్ర సామాజిక భద్రత విభాగం 1965లో నియమించిన అడ్వైజరీ కమిటీ,ఆదివాసీల సమూహాన్ని వర్గంగాగుర్తించాలా? వద్దా? అనే విషయాన్ని గుర్తించేందుకు అవసరమైన కొన్ని లక్షణాలను సూచించింది.కొత్త సమూహాలను షెడ్యూల్డ్‌ తెగలలో సభ్యులుగా చేర్చాలని స్థానిక రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిడిని పరిగ ణనలోకి తీసుకున్నారు. అయితే దీనిని పరిశీలించడానికి రాష్ట్రం ఆదివాసీల సంస్కృతి గురించి తెలిసిన బయటి నిపుణులతో ఒకకమిటీని ఏర్పాటు చేయడం సముచితంగా ఉండేది.ఈ నేపథ్యంలో,షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌(ఎన్‌సీఎస్‌టీ)ఈ విషయంలో జోక్యాన్ని కోరే స్వేచ్ఛ గిరిజన తెగలకు ఉంది.ఎన్‌సీఎస్‌టీ వన్‌ మ్యాన్‌ కమీషన్‌ నివేదికను వృత్తిపరంగా ఆదివాసీల సంస్కృతి,జీవితాల గురించి తెలిసిన బయటి ప్రముఖ నిపుణుల బృందానికి సూచించమని గిరిజనతెగలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోతున్నాయి.ఈ విషయంలో కనీసం గిరిజన సలహా మండలి(టీఏసీ) అభిప్రాయాలు తీసుకున్న దాఖలులేవు.
ఏదైనా తుదినిర్ణయం తీసుకునే ముందు ఏస్టీ జాబితాలో కొత్త సమూహాలను చేర్చడం వలన వారి అవకాశాలపై నిస్సందేహంగా ప్రభావం చూపుతుంది కాబట్టి, రాష్ట్రం స్థానిక ఆదివాసీ సంఘాల ప్రతినిధులను విశ్వాసంలోకి తీసుకోవడం కూడా అంతే అవసరం. 1965లో లోకూర్‌ కమిటీ సంప్రదించిన రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ ప్రస్తుత ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆదివాసీ తెగలంతా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.ఏస్టీల జాబితాలో ఏదైనా సమూహాన్ని చేర్చాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342(1) (రాజ్యాంగం (మొదటి సవరణ) చట్టం,1951 ద్వారా సవరించబడిన ప్రకారం)రాష్ట్రపతి ఉత్తర్వులు పొందడంచాలా అవసరం.దీనిపై ఎన్‌సిఎస్‌టి పరిశీలించిన అభిప్రా యాలను కోరాలని కేంధ్ర ఇంధన వనరులశాఖ విశ్రాంతి ముఖ్యకార్యదర్శి ఇ.ఎ.ఎస్‌.శర్మ ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను విడిగా అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338ఏలో 9వ అంశం ప్రకారం జాతీయ షెడ్యూల్‌ తెగల కమిషన్‌ను సంప్రదించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల విషయంలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరాదు. ఆదివాసీలుకాని వారిని ఎస్టీలుగా గుర్తించడంవల్ల తమ హక్కులకు హాని కలిగే అవకాశముందని గిరిజనులు పెద్దఎత్తున ఆందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వారి ప్రతినిధులతో సంప్రదింపలు జరిపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

అవంతరాల వలయంలో..విశాఖ స్మార్ట్‌సిటీ

భారతదేశం 2015లో స్మార్ట్‌ సిటీ మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 100 నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,ఆర్థికవృద్ధిని పెంచడం దీని లక్ష్యం.నగర/పట్టణ ప్రాంతాల్లోని సామాజిక-ఆర్థిక,పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో స్మార్ట్‌ సిటీ మిషన్‌ సొసైటీలకు సహాయపడుతుంది.2016లో,20 నగరాల మొదటి జాబితాను ప్రకటించారు దేశ్యాప్తంగా అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌,పూణే,కోయంబత్తూర్‌,జబల్‌పూర్‌, జైపూర్‌, సూరత్‌, గౌహతి,చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, ఇండోర్‌,భోపాల్‌,ఉదయపూర్‌,లూథియానా,కాకినాడ,బెల్గాం,షోలాపూం,భువనగిరి మొత్తం20 నగరాలున్నాయి.
ఇవి సిటీ పౌరులకు సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. డేటాను సేకరించేందుకు వివిధ ఎలక్ట్రానిక్‌ పద్ధతులు,సెన్సార్లు ఉపయోగించబడతాయి. అందుకున్న డేటా అంతర్భాగం చెత్త సేకరణ,వినియోగ సరఫరా,ట్రాఫిక్‌ కదలిక,పర్యావరణ నిర్వహణ,సామాజిక సేవల నిర్వహణలో కార్యాచరణ మెరుగుదలకు సహాయపడతాయి. అలాగే కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్‌,గవర్నెన్స్‌,రవాణావ్యవస్థ,భద్రత కోసం మెరుగైన నిఘా,స్మార్ట్‌ మౌలిక సదుపాయాలు,మెరుగైన ఉద్యోగావకాశాలు,సౌకర్యవంతంగా జీవించే ప్రతి ఇతర సౌకర్యాలు కల్పిస్తాయి.
వాస్తవానికి స్మార్ట్‌ సిటీ అంటే ప్లానింగ్‌ పక్కాగా ఉండాలి.కానీ ఎక్కడ ఏం జరుగుతుందో..ఏ పని ఎటు వెళ్తుందో తెలియక తికమకపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మరెక్కడో కాదు ఏపీలో కీలక నగరమైన విశాఖపట్నంలోనే.స్మార్ట్‌సిటీలో నిరుపేదలు జీవించే పరిస్థితులు లేకుండా పోతుంది. నగరానికి జీవనోపాధి పొట్టకూటి కోసం వచ్చే వలసవాదులు,బీక్షాటన చేసే బిక్షగాళ్లకు సరిjైున సదుపాయాలు లేక రోడ్డుజంక్షన్లవద్దనే భిక్షాటన చేయడం శోచనీయం.వీటికి చట్టాలున్నా శూన్యంగానే ఉంది. మరోపక్క చెత్త,చెదారం,ఆహార వ్యర్ధాలు విచ్చలవిడిగా పడేయడంవల్ల నగరమంతా అస్తవ్యస్థంగా మారుతోంది. స్మార్ట్‌సిటీ అంటే చెత్తరీసైక్లింగ్‌కు అధిక ప్రాధాన్యత కల్పించాలి.కానీ ఆపరిస్థితి విశాఖలో కన్పించడం లేదు.స్మార్ట్‌సిటీ అంటే కేవలం మెయిన్‌ రోడ్లుకు మరమ్మతులు,డివైడర్ల మధ్య పూల మొక్కలు,ప్రగహారీగోడలకు రంగులు వేయడమేనా?నగరాన్ని ఆనుకొని ఉన్న మురికివాడలు,గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ లింక్‌ రోడ్డు నిర్మిణాలు ఎక్కడ జరుగుతున్నాయి? పచ్చని చెట్లు నరికేసి మొదళ్లు,మోడులకు రంగులు వేయడం అవసరమా?.అలాగే ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రకటనలకే పరిమితమైయ్యింది.నగర నడిబొడ్డునఉన్న ఎన్నో షాపింగ్‌ మాల్స్‌,దుకాణాల్లోను ప్లాస్టిక్‌ తాండవి స్తోంది.దీంతో నగరపరిసరాలన్నీ ప్లాస్టిక్‌మయంగా మారింది.పరిశ్రమల నుంచి వెలువడే కాలు ష్యకారకాలు,వాహన శబ్దకాలుష్యాలు నగరాన్ని రాజ్యమేలు తున్నాయి.

జగనన్న ఇళ్లు స్థలం పేరుతో నగరంలో జీవిస్ను నిరుపేదలను3040కిలోమీటర్ల దూరంలో అభయారణ్యాల మధ్య నగరం నుంచి గెంటేశారు. వీరంతా నగరంలో చిన్నచితక పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నిరుపేదలే.ఇప్పుడంతా వారు నిర్వాసితులయ్యారు. ఉన్నచోటనే నిరుపేదలకు ఉపాధి,ఇతర మౌళిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీ పేరుతో పేదలను నగరం నుంచి గెంటేయడం ఎంతవరకు సమాంజసం. ఇక ఇంటర్నెట్‌ ఆఫ్‌థింగ్స్‌,పబ్లిక్‌ సేఫ్టీ,స్మార్ట్‌ మొబిలిటీ,పెరిగిన టూరిజం,సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,ఫిజికల్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నగరాన్ని స్మార్ట్‌ సిటీలుగా మార్చడాన్ని సులభతరం చేస్తాయి.కానీ నగరాన్ని ఆనుకొని స్మార్ట్‌సిటీలో విలీనమైన దబ్బంద గ్రామంలో ఇప్పటికీ సెల్‌ఫోన్‌ సిగ్నిల్‌ రావడం లేదు.దీనివల్ల అనేక మంది నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు సక్రమంగా పొందలేకపోతున్నారు.

ఈనెల 28,29,30తేదీల్లో జరిగే జీ20సదస్సుకు కోసం జీవీఎంసీ రూ.150కోట్లతో నగరాన్ని సుందరీకరణ చేస్తుంది కానీ అస్తవ్యస్థంగా పడి ఉన్న చెత్త,ప్లాస్టిక్‌ సేకరణలో మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తోంది.సేకరించిన చెత్త,ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం శాస్త్రీయమైన రీసైక్లింగ్‌ పద్దతులను పాటించి పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాల్సిన అవశ్యకత ఎంతైనాఉంది.అప్పుడే స్మార్ట్‌సిటీ ప్రయోజనాలు ప్రజలకు సమకూరుతాయి. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్

ప్లాస్టిక్‌ ముప్పు..ఎప్పుడో కనువిప్పు..!

రోజూ అన్ని అవసరాల కోసం ఓచిన్న గిరిజన గ్రామం నుంచి నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉదయం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవసరాలకోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం.ఆశ్చర్యమేమంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిటల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తంభద్రపరచే సంచులు,ఇంజక్షన్‌సీసాలు,సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. పర్యావరణం,ప్రజారోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నా.. ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహనఉన్నాకూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూ అదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని కుగ్రామాలే కాకుండా టూరిజం,సందర్శన, కాఫీతోటలు,విహారయాత్రి స్థలాలు ప్లాస్టిక్‌మయంగా మారుతున్నాయి. ఇలా నింగి,నేల,నీరులోరేణువులుగా మారుతూ ఆరోగ్యానికి పెనుసవాల్‌ విసురుతున్నాయి.
నేను ఏజెన్సీప్రాంతానికి వచ్చినప్పుడు ప్లాస్టిక్‌గ్రామాల్లో గిరిజనులు తమ అవసరాల కోసం దాచుకొనే నగదును పూర్వం వెదురు బొంగుల్లో దాచుకునేవారు.నేడు ఆపరిస్థితి భిన్నంగా మారింది. ప్లాస్టిక్‌ సంచుల్లో చుట్టుకొని నగదును దాచుకుంటున్నారు.ఆనాడు ప్లాస్టిక్‌ అంటే సారా ప్యాకెట్లులే కన్పించేవి.ఇప్పుడు విచ్చలవిడిగా అన్నీరకాల నిత్యావసర సరకులు,ఆఖరికి టీ,ఆహారపదార్ధాలు ప్లాస్టిక్‌ సంచులనే దర్శనమిస్తున్నాయి.ప్లాస్టిక్‌లేనిదే జీవితం నడవడం లేదనే స్థాయికి పేరుకు పోయింది. పాస్టిక్‌తో పాటు చెత్త పేరుకుపోతోంది. నేను1997వరకు పాడేరులో నివాసము ఉన్నప్పుడు చెత్త,ప్లాస్టిక్‌ ఎక్కడబడితే అక్కడ డంప్‌ చేసేవారు. అయితే డపింగ్‌ చేసే చెత్త,ప్లాస్టిక్‌ విషయంలో శాస్త్రీయపద్దతిని పాటించడం లేదు.శాస్త్రీయపద్దతిలో చెత్తను వినియోగించడమనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవశ్యకత ఉంది.ఇది పర్యావరణానికి,మానజీవితానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.లేకపోతే చెత్త విస్తరించి వర్షకాలంలో వాగులు,గెడ్డలు,డ్రైయినేజీల్లో పొంగి ప్రవహించినప్పుడు ఆ చెత్త జలాశాయాల్లోకి చేరి త్రాగు,సాగునీటిని కలుషితం చేస్తుంటాయి.దీనిద్వారా కేవలం గిరిజనప్రాంతాలే కాకుండా మైదాన ప్రాంతాల్లో తాగునీటి వనరులు కలుషితంగా మారే ప్రమాదం పొంచిఉంది.ఇప్పటికే తాటిపూడి, మేగాద్రిగెడ్డ,రైవాడ,ఏలేరు కాలువ,వంటి జలాశాయల నుంచి నగరానికి,మైదాన ప్రాంతానికి తరలిస్తున్న త్రాగు,సాగునీటివనరుల్లో చెత్త,ప్లాస్టిక్‌ చేరి కలుషితమవుతున్నాయి.ఈ నీటినే నగర/పట్టణ ప్రాంతాల ప్రజలు మంచినీళ్లుగా తాగుతున్నారు.
మైదాన ప్రాంతాల నుంచి ఈ మిగుల జలాలు సముద్రంలోకి చేరుతున్నాయి. ఆ జలాలతో ప్లాస్టిక్‌,చెత్తచెదారాలు సముద్రంలోకి చేరి జీవరాశులు కాలుష్యానికి గురవుతున్నాయి.ఇటీవల ఓ పరిశోధనలో తిమింగలం కడుపులో ప్లాస్టిక్‌ సంచులు కన్పించినట్లు తెలిపింది.కేవలం ప్లాస్టిక్‌ మాత్రమే కాదు..చెత్త కూడా ప్రజల జీవిన విధానానికి హానికలిగిస్తోంది.వీటి నియంత్రణకు ప్రభుత్వం సరిjైున శాస్త్రీయ పద్దతులు అవలంబించాలి.మన అవసరాలను తీర్చుకునే క్రమంలో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించడమనే ఆలోచన లేదు. పర్యావరణానికి భంగం కలుగకుండా ఈభూగోళాన్ని తర్వాత తరాలకు అందించే దృష్టితో,సమకాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించుకోవాలనే ఆలోచనాలేదు.
ప్రభుత్వం వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చింది.వీటిలో ఏప్రిల్‌ 2022లో ప్రవేశపెట్టబడిన ప్లాస్టిక్‌ పన్ను ప్రతిపాదన కూడా ఉంది. ఈపన్ను కింద ప్లాస్టిక్‌లో వస్తువులను ప్యాకింగ్‌ చేస్తే దానికి పన్ను విధించబడుతుంది. దీంతోపాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. రీసైక్లింగ్‌ ఆధారిత పరిష్కారాలు ఈ కార్పొరేట్‌,శాసనవిధానాలపై విశ్లేషణ ఈకంపెనీలు రీసైక్లింగ్‌ ఆధారిత పరిష్కారాలను ఇష్టపడ తాయని నిర్ధారించింది. అయినప్పటికీ పరిస్థితులు షరామామూలే.చెత్తలో పలురకాలు ఉన్నాయి. వాటిని విభజించి రీసైక్లింగ్‌ చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.! – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

అడవితల్లికి గర్భశోకం

ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆదినుంచి పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం 1878లో అడవులపై ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆంక్షల విధింపుతో అసంబద్ద సంప్రదాయం ప్రారంభమైంది.దాన్ని వ్యతిరేకిస్తూ విప్లవవీరుడు అల్లూరి సీతారామారాజు ఆదివాసులకే అడవిపై హక్కుకోసం పోరాటం చేశారు. తర్వాత 1932లో జమీందారు వ్యవస్థ హాయంలో ప్రముఖ సామాజికవేత్త రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ విశాఖ మన్యప్రాంతాన్ని సందర్శించి అమాయక గిరిజనులు దోపిడికి గురవుతున్నట్లు గుర్తించారు. ఆతర్వాత ఐఎఫ్‌ఎస్‌ అధికారి రెబ్బాప్రగడ కృష్ణారావు అటవీ సంరక్షణ అధికారిగా చింతపల్లి,మినుములూరు,అనంతగిరి,పాడేరు,మారేడిమిల్లి వంటి గిరిజనప్రాంతాల్లో విధులునిర్వర్తించారు. ఆయన హాయంలోనే కాఫీతోటలు పెంపకాన్ని ప్రవేశ పెట్టి జీవనప్రమాణాలు మెరుగుపరిచారు.నేను చిన్నప్పటి నుంచే నాన్నగారితోకలసి ఆదివాసుల జీవనవిధానాలతో మమేకమ య్యాను. తరాలుగా అడవితల్లినీడలో బతుకుతున్న అటవీభూములపై హక్కుమాత్రం వారికి ఎండ మావిగానే మిగిలాయని గుర్తించాను. ఈనేపథ్యంలోనే సమత పుట్టికొచ్చింది.గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు పరిరక్షణపై గత ముప్ఫైరెండేళ్ల నుంచి పోరాడుతుంది. విశాఖమన్యంలో బాక్సైట్‌,ఖనిజనిక్షేపాలు ప్రైవేటు కంపెనీలకు ధారతత్తం చేసినవైనాన్ని గుర్తించి అటుప్రభుత్వం,ఇటు ప్రైవేటు బహుళజాతికంపెనీలకు వ్యతిరేకంగాపోరాడిరది.ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు,హక్కులు నిర్వీర్యమైపోతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిగా గిరిజనుల హక్కులను పునరుద్దరిస్తూ సర్వోన్నత (న్యాయస్థానం) సుప్రింకోర్టు చరిత్రాత్మకమైన1997లో సమత తీర్పు నిచ్చింది. నేడు ఈతీర్పుఫలితంగా భారతదేశంలోని షెడ్యూల్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు రక్షణ గా నిలిచింది.స్థానికులైన గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడిరది. సామా జిక,ఆర్ధిక న్యాయం కోసంపోరాడే ఆదివాసులకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన సమత తీర్పు ఎంతో మనో నిబ్బరం కలిగించింది.ఈతీర్పును ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు యథాశక్తి ప్రయత్నాలు సాగిస్తూనే వస్తోంది.అధికారంలోఉన్న ప్రభుత్వంఅటవీ సంపద మొత్తం కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడానికి రక్షణ చట్టాలను సవరించడం తీరని అన్యాయం.
అడవులతో గిరిజనులకు పెనవేసుకుపోయిన అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాలకులు చేయని ప్రయత్నమంటూ లేదు. అమాయకాదివాసుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పొందుపరిచన సూత్రావళి స్పూర్తిని మన పాలకులు అడ్డంగా విస్మరిస్తున్నారు. అడవులు,ఆదివాసులు అధికంగాఉన్న ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీషఘడ్‌,ఒరిస్సా,జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భారీ పరిశ్ర మల ఏర్పాటుకు,ఖనిజతవ్వకాలకు విచ్ఛలవిడిగా లాకులెత్తుతున్నారు.ఆస్మదీయుల,పెట్టుబడిదార్ల జేబులు నింపే కార్యక్రమాన్ని చేపట్టి ఆదివాసుల అగ్రహానికి గురవుతున్నారు.అడవులవృద్ధి,పరిరక్షణద్వారా ఒనగూడే ఆర్ధికప్రయోజనాలను గిరిజనులకు చేర వేయాలంటూ స్వాతంత్య్రానంతరం నిర్ధేశించుకున్న లక్ష్యాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ,తీసుకునే ప్రతినిర్ణయమూ సామాన్యునికి ఎంతోకొంత ఉప శమనం కలిగించాలి.వారి సమస్యలకు పరిష్కారంచూపాలి. కానీ,నేడు గిరిజన సంక్షేమం,అడువుల పరిరక్షణ పేరిట పాలకులు చేపడుతున్న చర్యలు ఆదివాసులకు న్యాయం చేయడం లేదు సరికదా..,వారి ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అటవీ వనరులను అయినవారికి దోచిపెట్టడానికి,ప్రకృతి వనరుల పరిరక్షణపేరిట నిధులుస్వాహాలు,సర్కారీ పెద్దలుతెగబడుతున్న నైచ్యం నేడు బహిరంగ రహాస్యం.తమకు నిలువ నీడలేకుండా పాపం చేస్తున్నదెవరో గ్రహించలేనంతటి అమాయకత్వంలో ఈనాటి గిరిజనులులేరు.వారుఅన్నీ చూస్తున్నారు. అర్ధం చేసుకుంటున్నారు. అక్రమార్కులకు వంతపాడుతూ అడవి బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న పెద్దలు తీరు మార్చుకోవాల్సిన తరుణమిది!- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్ 

వివాదాస్పద సంస్కరణలు`అటవీ చట్టం సవరణలు

భారత దేశంలో అధికంగా నివసించే ఆదివాసీ ప్రాంతాల్లో అపారమైన వనరులు,గనులు, ఖనిజాలు,నీటివనరులు సమృద్ధిగా నిక్షిప్తమై ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే! దేశంలో ఉన్న అటవీ పరివాహక ప్రాంతాలన్నీ గిరిజన జీవనవిధానంతో ముడిపడి ఉంది.ఎన్ని వనరులున్నా అక్కడ నివసించే గిరిజనుల పరిస్థితుల్లో మార్పులేదు.భారత రాజ్యాంగంలో గిరిజన,దళిత తెగలకు రక్షణ కవచం లాంటి చట్టాలను పొందిపరిచాయి.రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకొనేందుకు జాతీయ ఎస్టీ కమిషన్‌ కూడా ఏర్పాటైంది.ఇన్ని వ్యవస్థలున్నప్పటికీ గిరిజనులు అన్యాయానికి గురవు తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలు,జిల్లాలు విభజన నేపథ్యంలో వారి జీవితాలు ఛిన్నాభిన్నమైంది.వలస పక్షుల్లా విలవిలలాడుతున్నారు.పాలకుల స్వార్ధ రాజకీయాలకు బలైపోతున్నారు.
ఆదివాసీల జీవనవిధానం అడవితో ముడిపడిఉంది.అయితే అడవిలోసంస్కరణల అలజడి.. చట్టంలో కీలక మార్పులు జోరందుకున్నాయి.94 ఏళ్ల చరిత్ర గల భారతీయ అటవీ చట్టం1927 (ఐఎఫ్‌ఏ) సవరణలకు ఉపక్రమించారు. ఈచట్టం అన్నీ రకాల వ్యవస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అటవీ సంరక్షణ నియమాలు2022 పేరుతో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలపై తీవ్రమైన ప్రభావంచూపుతోంది.కోట్లాది మంది గిరిజనులను అడవుల నుంచి గేంటేసి పరిస్థితులు దాపురించనున్నాయి. అడవులు,అటవీ సందపను బదలాయింపు చేస్తే అటవీ సంక్షరక్షణ చట్టం(1980)లో కఠినంగా నిబంధనలున్నాయి. ఈ నిబంధనలను తొంగలోకి తొక్కి అటవీ సంపదను కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు పాలకులు కుట్రపన్నుతున్నారు. ఈ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా గిరిజ నులు వ్యతిరేకిస్తున్నా పాలకులు పెడచెవినపెడుతున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే అడవులపై ఆధారపడ్డ కోట్లాదిమంది గిరిజనులు బలవంతంగా గెంటివేతకు గురవుతారు. ముఖ్యంగా షెడ్యూల్‌ ప్రాంతాల్లో విలువైన మైనింగ్‌,ఖనిజ సంపదను అంబానీ,ఆదాని వంటి కార్పొరేట్లకు కట్ట బెటేందుకు ఈబిల్లును తీసుకొస్తున్నదని గిరిజన తెగలు భావిస్తున్నాయి. అటవీ భూమిని పరిశ్రమల పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టాలంటే 1980చట్టంలో అనేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతబిల్లులో ఆనిబంధనలన్నింటిని సరళతరం చేస్తూ సింగిల్‌ విండో విధానం ద్వారా కేంద్ర క్యాబినేట్‌ ఆధ్వర్యంలో వేసిన ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ అనుమతి అవసరం. ఈ నిబం ధనలు బదలాయించాలంటే జాతీయ ఎస్టీ కమిషన్‌(ఎన్‌ఎస్‌టీ) అనుమతులు తప్పనిసరి. ఎన్‌ఎస్‌టీ అనేది ఆర్టికల్‌338ఎ ప్రకారం ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ అధికారం. ఆ ఆర్టికల్‌లోని క్లాజ్‌(9) ప్రకారం యూనియన్‌,ప్రతి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ తెగలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై కమిషను సంపద్రించాల్సిన అవశ్యకత ఉంది.రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా,కమిషన్‌ సూచనలను అంగీకరించాలి.ఒక వేళ కమీషన్‌తో విభేదించాలని అనుకుంటే దానికి గలకారణాలను స్పష్టంగా పేర్కొనాలి.కమిషన్‌ అధికారిక నిబంధనలకు ధీటుగా బిల్లుతోపాటు పార్లమెంటు ముందు ఉంచాల్సిన అవసరం ఉంచాలని ఇప్పటికే పలువురు మేథావులు,గిరిజన సంస్థలు,సంఘాలు రాష్ట్రపతికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే! ఈ పరిస్థితిల్లో అడవి బిడ్డలకు అండగా ఉన్నట్టు కనబడే ఈ చట్టం,వాస్తవానికి వారికిఅడవి తల్లికి మధ్య ఉన్న బంధాన్ని పావుగా ఉపయోగించుకుంది.ఫలితంగా ఇన్నేళ్లూ వారు అభివృద్ధికి దూరంగా ఉండిపోయారనే వాదనలున్నాయి. ప్రైవేటు సంస్థల హక్కులను పెంచే దిశగా ఉండటం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇవేమీ ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రయత్నం అడవి బిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్,థింసా 

ప్లాస్టిక్‌ రహితం..ఇంకెంత దూరం.?

దశాబ్దాలుగా ప్లాస్టిక్‌ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో.. కళ్లకు కడుతూనే ఉంది. నిషేధిస్తున్నా మంటూ ప్రభుత్వాలు ప్రకటించటం..ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రజారోగ్యం బలి అవుతోంది.అటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పుపొంచి ఉంటోంది. ఇలా నిత్య జీవన విధానం ఫాస్టిక్‌ మయంగా మారింది.రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది.
మొన్నటి వరకు సముద్రాలు,నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి మాట్లాడు కున్నాం, కానీ ఇప్పుడు మానవ శరీరంలోకి చేరుతోన్న ప్లాస్టిక్‌ గురించి మాట్లాడుకునే రోజులువచ్చాయి. మనుషుల రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. తల్లి పాలల్లో దీని అవశేషాలున్నట్లు గుర్తించడం విశేషం. ప్లాస్టిక్‌,కాలుష్యం అధికమై వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. మంచుకొండలు కరిగిపోయి సముద్రంనీటిమట్టం పెరిగిపోతుంది. అకాలతుఫాన్లు ప్రభావంతో యావత్తు ప్రపంచ దేశాలు అతాలకుతలమై పోతున్నాయి.
జశీఅటవతీవఅషవ శీట ్‌ష్ట్రవ ూaత్‌ీఱవం (కాన్ఫెరెన్స్‌ఆఫ్‌ ద పార్టీస్‌)దీనినే షార్ట్‌గా (కాఫ్‌) జూఅని పిలుస్తారు. ప్రతిఏటా197 దేశాలను ఒకచోట చేర్చే సదస్సు ఇది.వాతావరణ మార్పులు,దాని ద్వారా ఏర్పడే సమస్యల గురించి ఈ సదస్సు ప్రధానంగా చర్చిస్తుంది.వాతావరణ మార్పులపై యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగే కన్వెన్షన్‌ ఇది. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ప్రపంచంలోని ప్రతిదేశం,ప్రతి భూభాగం అంగీకరించి సంతకం చేసిన అంతర్జాతీయ ఒప్పందం కాప్‌.ఇలాంటి సదస్సలు ఇప్పటి వరకు 26 జరిగాయి. కాఫ్‌సదస్సుల్లో ఎన్నినిర్ణయాలు తీసుకున్నా ఏదేశం కూడా అమలు పర్చడంలో నిర్లక్ష్యవైఖరి అవలంబించడం శోచనీయం.
అంతర్జాతీయంగా మానవజాతిని అవహిస్తున్న ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో బాన్‌ చేయాల్సిన అవసశ్యకత ఎంతైనా ఉంది.ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నమని ప్రగాల్బలు పలికే దేశాలు,రాష్ట్రాలు కేవలం ముక్కుబడిగానే అమలు చేస్తున్నాయి తప్పా కఠినమైన వైఖరిని అవలంబించడం లేదనే అందరికీ తెలిసిన విషయమే.ఎందుకంటే ప్రతివ్యక్తి జీవితంతో ప్లాస్టిక్‌ ముడిపిడి ఉంది.దీని నియంత్రణకు చట్టాలు,ప్రభుత్వాలున్నాయి.ఐక్య రాజ్య సమితి సైతం పదేపదే హెచ్చరిస్తూనే ఉంది.అయినా మానవ జాతిలో మార్పులురావడం లేదు. కంటికి కనిపించని సూక్ష్మమైన ప్లాస్టిక్‌ రేణువులు పీల్చేగాలి,చెత్తా ప్లాస్టిక్‌ అంతా డ్రైనేజీ,సముద్రాలు,చెరువులు,నదులు..ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపో తున్నాయి. ఫలితంగా యావత్తు మానవ శిశువులతోపాటుగా,జంతువులు,పక్షులు,జలచరాలు,కీటకాలు అన్ని చనిపోతున్నాయి.ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యవర్థాలను భూమిపై పడేయడంతో అవి భూమిలో కరిగిపోకుండా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.
రెండు దశాబ్దాల క్రితం తూర్పు కనుమల్లో గిరిజన ప్రాంతాలు ప్రకృతి అందాలో ఆహ్లాదక రంగా ఉండేది. ప్రస్తుతం నేడుకొండకోనల్లోను ప్లాస్టిక్‌భూతం అవహించింది.రోజువారీ వాడి పారేసిన వస్తువులు,భూమిలో పూర్తిగా కరిగిపోవడం,పచ్చని పొలాలపై దీని ప్రభావం పడుతోంది. రైతులు పండిరచే పంటలు దిగుబడి తగ్గిపోతోంది. ప్లాస్టిక్‌ నియంత్రణపై పరిపాలనలో మార్పులు రావాలి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గాలంటే దీని తయారి పరిశ్రమలను శాశ్వతంగా నియంత్రించాలి. అందుకు ప్రభుత్వాలు నిర్ధిష్టమైన,కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు పర్చాలి.అలాగే పంచాయితీ స్థాయిలో ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని రూపుదిద్దేలాచర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ రహిత సమాజంగా తీర్చిదిద్దాలి. ఇలాంటి మార్పును ప్రజలు సైతం స్వాగతించకపోతే,కాలుష్యం,ప్లాస్టిక్‌ మానవ జీవితాన్ని మరింతగా కృంగదీసి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి.- రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్. 

1 2 3 4