శ్రీ రవీంధ్రుని స్మరణలో..

భారత దేశానికి జాతీయ గీతాన్ని అం దించిన కవి,రవీంద్రనాథ్‌ ఠాగూర్‌(మే 7,1861-ఆగస్టు7,1941).ఠాగూర్‌గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని అందుకున్నాడు. నోబెల్‌ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేబేంద్రనాథ్‌ ఠాగూర్‌,శారదా దేవి దంపతులకు పదమూడు మంది సంతానంలో చిన్నవాడైన రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌1861 మే 7న జన్మించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రాథమిక విద్య మొత్తం ఇంట్లోనే.. కానీ సాహిత్య ప్రతిభ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. తన రచనలతో తక్కువ కాలంలోనే గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఆయన కవిత్వంలో అధిక ప్రతిభను కనబర్చారు. రవీంద్రనాథ్‌ రాసిన కవితా సంకలనం గీతాంజలి 1910లో పబ్లిష్‌ అయ్యింది. ఇది సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతిని గెలుచుకుంది. ఠాగూర్‌ అనేక ఇతర ముఖ్యమైన రచనల్లో మానసి(1890), సోనార్‌ తారి (1894), గితి మాలయ(1914),రాజా(1910),పోస్టాఫీసు (1912) మొదలైనవి ఉన్నాయి.రవీంద్రనాథ్‌ ఠాగూ ర్‌ ఎన్నో చిత్రాలను గీశారు. ఆయనకు సంగీతంపై ఆసక్తి ఉండడంతో కొన్నిపాటలు రాసి వాటికి సంగీ తం కూడా అందించారు.జాతీయస్వాతంత్య్రో ద్యంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బ్రిటీష్‌ సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.జలియన్‌ వాలా బాగ్‌ మారణకాండకు నిరసనగా అతడికి బ్రిటీష్‌ అధికారులు ఇచ్చిన ‘నైట్‌హుడ్‌’ బిరుదును కూడా తిరిగి ఇచ్చేశారు. జాతీయ భావాలు అధికంగా ఉన్న రవీంద్రుడు అనేక హిందూ మేళాలో దేశ భక్తి గీతాలను పాడేవారు.తన పాటలద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తట్టిలేపేవారు. బ్రిటీషర్లు బాల గంగాధర్‌ తిలక్‌ ను బంధించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. బెంగాల్‌ విభజనను వ్యతిరేకించారు.
మనం జాతీయ గీతంగా పిలుచుకునే ‘జనగణమణ’ను ఆయనే రచించారు.‘వందే మాత రం’ గేయాన్ని1896లో జరిగిన కాంగ్రెస్‌ సదస్సులో తొలిసారిగా ఆలపించారు.దీనిని బక్రించంద్ర చటర్జీ రచించారు.స్వాతంత్య్ర అనంతరం ఈ రెండిరటిలో దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని పెద్ద చర్చ జరిగింది. కానీ 1950 సంవత్సరం జనవరి 24వ తేదీన ‘జనగణమణ’ను జాతీయ గీతంగా ప్రకటించారు.1913 సంవత్సరంలో రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ తన కవితా రచన ‘గీతాం జలి’కిసాహిత్యంలో నోబెల్‌ బహుమతిని అందు కున్న మొదటి భారతీయుడు,అలాగే మొదటి యూరోపియనేతరుడు కూడా ఆయనే. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పిల్లల కోసం శాంతినికేతన్‌ అనే విశ్వవిద్యా లయాన్ని స్థాపించారు.దీనిని విశ్వభారతి విశ్వ విద్యాలయం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ప్రాచీన గురుకుల విద్యను అందించేవారు.
భారత జాతీయ గీతం-జన గణ మన, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించారు. బ్రిటీష్‌ రాజ్‌లో జార్జ్‌ ప్రశంసలతో జాతీయ గీతాన్ని కంపోజ్‌ చేశా రానే ఆరోపణలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ జాతీయ గీతం‘అమర్‌ సోనార్‌బంగ్లా’ కూడా ఆయన స్వరకల్పన చేసిందే. శ్రీలంక జాతీయ గీతం ‘శ్రీలంక మాత’కూడా ఠాగూర్‌సృష్టి నుండి ప్రేరణ పొం దింది. దీన్ని రచించిన ఆనంద్‌ సమర్కూన్‌ రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌తో శాంతినికేతన్‌లో నివసించారు. ఆనంద్‌ సమర్కూన్‌ ఒకసారి మాట్లాడుతూ ఠాగూర్‌ స్కూల్‌ ఆఫ్‌ కవిత్వం తనని బాగా ప్రభావితం చేసిందని చెప్పారు. ఠాగూర్‌ కవిత్వం సంగ్రహావ లోకనం అందులోని ఒక పేరాలో కనిపిస్తుంది. ‘జనగణమన అధినాయక జయహే’ అనే మన జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రుడు ప్రపం చానికంతటికీ ఎత్తయిన హిమాలయములో వున్న మానస సరోవరంలో వికసించిన పద్మం. ఆ పద్మ మే కవీంద్రుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.మేరు పర్వ తంలా పెరిగి తారల తాకునట్టి కీర్తి కిరీటం అలంక రించిన విశ్వకవి. హిందువుల మానసిక సౌంద ర్యాన్ని చూపించిన గీతాంజలి సృష్టికర్త మన రవీం ద్ర కవి. విశ్వ భారతి నిర్మాతసత్యం,శివం,సుం దరం త్రిగుణాత్మక తత్త్వగీతిగీతాంజలి. ఈ లోకా నికి ముముక్షువు వంటి కవి మన రవీంద్రుడు. ద్వంద్వాతీత, కళాసంపత్తి, సహితానాం భావము కలిగిన కవి. వీరు ప్రకృతి ప్రేమికులు. సమయము దొరికినప్పుడు తోటల్లోను,బహిరంగ ప్రదేశాల లోను విహరిస్తూ ప్రకృతిని ఆరాధించేవారు. చిన్నతనంలో వీరికి చదువుపై పెద్దగా మక్కువ ఉండేదికాదు. నిరాడంబరుడు. తన ఊహలకు కలలో రెక్కలు తొడిగి వాటిపై విహరిస్తూ, విచిత్ర లోకంలో గడిపేవాడు. విశ్వంలోని విచిత్రాలను తెలుసుకోవాలనే కుతూహలముతో ఉండేవారు. వారు పాఠశాలలోని చదువు కంటే, ఇంటిలోనే విధ్యాభ్యాసము చేయుటకు ఇష్టపడేవారు. సమ యపాలన అన్న అమిత మక్కువ. చదువవలసిన అంశాలను పద్దతి ప్రకారము అభ్యసించెడివారు. గణితము,చరిత్ర,భూగోళశాస్త్రము,సంస్కృత వ్యాకర ణము ఇష్టంగా చదివెడివారు.ప్రతి దినము వ్యాయా మము చేసెడివారు. చిత్రలేఖనము, సంగీతము, పుస్తక పఠనములపై ఇష్టపడేవారు. అనేక నాటకా లను వీక్షించేవారు. మాతృభాషపై ఎనలేని గౌరవ ము. రచనా వ్యాసంగముపై కూడా వారికి పట్టు అమితము.వారు అనేక వ్యాసాలు, పద్యాలు, విమర్శ లు వ్రాసేవారు.అవి వివిధ పత్రికలలో ప్రచురితమ య్యేవి.కాళిదాసు, షేక్సుఫియరు మొదలుగు వారి రచనలపై అభిరుచిని కలిగి వుండేవారు.కాని చదు వుల నిమిత్తమై ఇంగ్లండులోనిఒకపబ్లిక్‌ స్కూలు లోచేరి,అక్కడి ప్రొఫెసర్‌ మార్లేగారు ఆంగ్ల ఉప న్యాసములు విని, ఆంగ్ల సాహిత్యముపై మక్కువ పెంచుకున్నారు.18 నెలలు విధ్యాభ్యాసము కొరకు లండన్‌లో గడపినా తన మనసుకు నచ్చిన విధ్య ఏదీ పొందలేదు. ఎటువంటి విద్యార్హతలతో తిరిగి రాలేదు. తండ్రి సహాయముతో అనేక భక్తి గీతాలను ప్రచురించారు. రవీంద్రుడు ‘‘భగ్న హృదయము’’, ‘‘నిర్గరేర్‌ స్వప్నభంగ’’,ప్రభాతసంగీత’’ అనే కావ్యాలను రచించారు.రవీంద్రునికి అమితిమైన పేరు ప్రఖ్యా తులు తెచ్చిన రచన ‘‘గీతాంజలి’’.బెంగాలీ భాషలో రచించిన కొన్ని భక్తిగీతాలను ఆంగ్లములోనికి అనువదించి పొందుపరిచారు.ఈ రచన అనేక ప్రపంచభాషలలోనికి అనువదింపబడినది. నిరా శా, నిస్పృహలను దూరం చేస్తూ,సకల సృష్టిని ప్రేమ భావముతో చూచే శ్రమ తత్త్వాన్ని ముఖ్యాంశముగా గల గీతాంజలి నోబెల్‌ బహుమతిని సాధించినది. విశ్వకవిగా గుర్తింపబడినారు. ఆనాటి నుంచి వారి రచనలు విశ్వవ్యాపితమైనాయి.ఒక్క చిటికె కాల పరిమితిలో అయినా నీ సమీపంలో సేదదీరుటకు అనుమతి ఇవ్వమని భక్తిభావంతో భగవంతుని వేడుకున్న రవీంద్రునిలో ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ప్రకృతిని తన స్నేహితుడుగా తలుస్తూ చక్కని భావ ప్రకటన ఈ కవితలో కనపడుతుంది.
తాను చిన్నతనంలో ప్రకృతి ఒడిలో పెరిగిన విధంగా,పిల్లలందరూ తమ బాల్యాన్ని ప్రకృతి సహజీవనంతో గడిపితే మానసిక వికా సానికి దోహదం చేస్తుందని నమ్మేవారు. అందుకు అనుగుణంగా కలకత్తా నగరంలో ‘శాంతి నికేతము’ స్థాపించారు. ఇది పూర్వకాలపు గురుకులాన్ని పోలి వుండేది. విధ్యార్థులు బయట పచ్చికపై కూర్చుని విద్యను అభ్యసించెడివారు.ఇందులో చేరిన విధ్యా ర్థులు క్రమశిక్షణకు మారుపేరుగా పెరిగేవారు. ఉదయం మేల్కాంచినప్పటి నుండి, తిరిగి రాత్రి నిద్రించు వరకు చేయవలసిన దిన చర్యలను పద్దతి ప్రకారం ఆచరించే విధంగా విధి విధానాలను రూపొందించారు. వ్యాయామము, శుభ్రత పాటిం చుట, శాకాహార భోజనము,కాలినడక, పెద్దలను గురువులను గౌరవించుట,సత్యమునే పలుకుట, చెడు పనులను చేయకుండుట, ఆరోగ్య పరిరక్షణ మొదలగు ఉన్నత లక్షణాలను నేర్పుతూ నేటికీ క్రమ శిక్షణతో ముందుకు కొనసాగుతున్న గురుకులం శాంతినికేతనము.గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అని నమ్మిన రవీంద్రుడు, గ్రామాభ్యుదయానికి కూడ తమ వంతుగా గంగాతీరంలో‘శ్రీనికేతన్‌’ స్థాపిం చారు. పరమత సహనాన్ని ప్రబోధించారు. ప్రపం చము ఆనందమయమనీ, మనసుతో అనుభవిం చెడివారికి అవగతమౌతుందని భావించెడివారు. ఉన్నతమైన జాతీయ భావాలు ప్రదర్శించెడివారు. వీరి భావనలకు జవహర్‌లాల్‌ నెహ్రూ ముగ్ధుల య్యెడివారు.బెంగాల్‌ విభజనను తీవ్రంగా వ్యతి రేకించారు. ఈ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. బకింగ్‌ చంద్రచటర్జీ రచించిన ‘వందేమాతరం’జాతీయ గేయంగా గుర్తింపు పొం దగా, రవీంద్రుడ రచించిన ‘జనగణమన’ జాతీయ గీతంగా గుర్తింపు పొందాయి. భారత రాజ్యాంగ ములో వీటికి సమాన ప్రతిపత్తి కల్పించారు. శ్రీ రవీంద్రులు మనకు స్వాతంత్య్రము వచ్చునాటికి మన మధ్య లేకపోవటం తీరనిలోటు. ఆయన రచించిన జాతీయగీతాన్ని నిత్యం మనము ఆలాపి స్తున్నాము. వీరు రచించిన పుస్తకాలలో అనేక ఉత్తమ ప్రభోధాత్మక భావాలు ఉండేవి. ‘చెడుగా ఆలోచించే గుణం సగం సమస్యలకు కారణం’, ‘ఎక్కడవ్ఞినం స్వేచ్చగా మనగలుగుతుందో’,‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో’, ‘ప్రేమించే వ్యక్తికి దండిరచే అధికారం కూడా వుంటుంది’, ‘మూఢత్వ ము మరణానికి దారితీస్తుంది’,‘గడచిన ప్రతీ రోజు నుండి మనము కొత్త విషయాలు నేర్చుకోవాలి’, ‘వైఫల్యాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి’ వంటి సూక్తులు మనకు వీరి రచనలలో కనబడతాయి. వీరు తత్త్వదర్శి,దార్శినికులు శ్రీరవీంద్రనాథ్‌ ఠాగూర్‌.ఆయనన నిధి.వారి మాటలను అనుసరిం చుట మన విధి.రెండవ ప్రపంచ యుద్ధ సమ యంలో మానసింగా కృంగిపోయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌,ఏవైద్యానికి కోలుకోలేదు. వారు భారతదేశ మును శోకసంద్రములో ముంచి 1942, ఆగస్టు 7వ తేదీన పరమపదించారు. `జై భారత్‌-(డా.దేవులపల్లి పద్మజ)

విద్వేషాలలో సమిధలవుతున్న మహిళలు

మహిళలకు విలువ ఇవ్వని ఈ మనువాద పాలకులు అధికార పీఠాలు పొందారు. కడుపులో చేయిపెట్టి తిప్పినట్లు ప్రతి నిముషం ఎక్కడో ఒకచోట ఆడపిల్ల ఆర్తనాదం. దీనిని ఆపాలని మొత్తుకుం టున్నాం. ఆలకిం చడంలా? వదిలేద్దామా? వదిలేస్తే మనం బతగ్గలమా? రక్షణ ఉందా? మన బతుకుల కోసం మన బిడ్డల బతుకుల కోసం కదలాలి. బహు రూపాలలో. వంటరిగా కాదు. సమూహంగా. పాలకులకు చెవికెక్కే వరకు. వారు చెవినెక్కించుకోకపోతే గద్దె దించేందుకు.
మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటన భారతీయ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వెన్నులో వణుకు పుట్టించింది. స్త్రీలను గౌరవిస్తాం. మన భారతీయ సంస్కృతి ఇది అని చెప్పుకునే చోట…ఇంతగా బరి తెగించి బహిరంగంగా మహిళలను నగ్నంగా ఊరేగించే దుర్మార్గం ఏరకంగా సాగింది?‘’న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’’ అంటూ కాలి కింద చెప్పు మాదిరి అణిచివేయాలనేదుర్మార్గపు సాంస్కృతిక నేపథ్యం దీనికి కారణం కాదా? ఈ దుర్మార్గపు సంస్కృతిని ముసుగులా వేసు కున్న పురుషాధిపత్యభావజాలాన్ని, భూస్వామ్య ప్రవృత్తిని మూలాలకంటా ఛేదించాల్సిన అవ సరాన్నిమణిపూర్‌ ఘటనలు వెలుగులోకి తెచ్చా యి.ఆర్‌.ఎస్‌.ఎస్‌ సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటూ కాలం చెల్లిపోయిన భూస్వామ్య పురుషాధిపత్యాన్ని పున:ప్రతిష్టించే ప్రయత్నం చేస్తున్నది.బిజెపి అధికారంలోకి వచ్చేవరకు తన భావజాలాన్ని జనం మీద రుద్దడానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు పెద్దగా అవకాశం దొరకలేదు. చాప కింద నీరు మాదిరి పని చేస్తున్నా కోరలు పెరగలేదు.కానీ నయవంచక బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడంతో వారి ఎజెండాను అత్యంత చురుగ్గా అమలు చేయడం ప్రారం భించారు. తమ మిత్రులైన క్రోనీ క్యాపిటలిస్టుల లాభాల కోసం భూస్వామ్య సంస్కృతిని జోడిరచి మరీ ఈదేశంలో దళితులపై, ఆదివాసీలపై, వెన కబడిన శూద్ర తరగతులపై బుల్డోజర్‌ నడిపిస్తు న్నది. ఈ బడుగు బలహీనులను అణిచివేసేందుకు, సమస్త వనరులను కబ్జా చేసేందుకు పూనుకున్నది. కాశ్మీర్‌ భూభాగాన్ని క్రోనీ క్యాపిటలిస్టులకు అప్ప జెప్పేందుకు 370ఆర్టికల్‌నిరద్దు చేయడం చూశాం. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు ఓ ముస్లిం బాలికపై గుడిలో అత్యాచారానికి తెగబడడం గుర్తుండే వుం టుంది. అక్కడ భూమిని కబ్జా చేసేం దుకే మైనారిటీ తెగకు చెందిన ఆచిట్టితల్లిని చిది మివేశారు. నేడు మణిపూర్‌ కొండల్లో ఉన్న విలువైన ఖనిజ సంపద కోసం రావణ కాష్టం రగిలించారు.
ఆజ్వాలల్లో ఆడపిల్లలు సమిధలవు తున్నారు. ఒకరా? ఇద్దరా? ముగ్గురా? ఎందరు? లెక్కలు తేలాల్సి ఉంది. అసలు తేలుతాయా? అన్నది ఈరోజు అందరూ అడుగుతున్న ప్రశ్న. ఈ ఘటనలు చోటుచేసుకున్న రెండు నెలల వరకు, వీడియో వెలుగులోకి వచ్చేవరకు, సుప్రీంకోర్టు హెచ్చరికచేసే వరకు ప్రధానికి తెలియదా? తెలుసని ఈదేశ ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు.తెలియ డం మాత్రమే కాదు, వాటికి ప్రధాని, ఆయనను నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆమోదం కూడా ఉందని. ఆమోదం లేదా?దీనికి వారు సమాధానం చెప్ప గలిగే ఖలేజా ఉందా?బిల్కిస్‌ బానో మన ఆడప డుచు.పోరాడి గెలిచింది.ఏం చేశారు? ఆగస్టు 15 అమృతోత్సవాల సంబరాల్లో నిందితులకు స్వేచ్ఛని చ్చారు. పైగా ఏమన్నారు? బ్రాహ్మణులు-సంస్కార వంతులు. అంటే ఏమిటి అర్థం. ఇతర కులాలకు చెందిన వారు సంస్కారవంతులు కారనా! అత్యాచా రానికి పాల్పడిన వారు సంస్కారవంతులెలా అవు తారు? ‘ఈ దేశంలో స్త్రీ బ్రాహ్మణులకు మొదటి హక్కు.స్త్రీకి స్వతంత్రత లేదు’-అని మనుధర్మం చెప్తుంది. దాన్నే వీరు తమ చేతల్లో చూపిస్తున్నారు. సంఫీుయుల ప్రకారం కోర్టులు మను ధర్మాన్ని తప్ప ఐపిసిని అనుసరించకూడదు.హత్రాస్‌లో కోర్టు ఆ మనుధర్మాన్నే పాటించింది. ఎవరైనా చని పోయి నప్పుడు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తుంటాం. అయితే అవి అందరికీ లేవు.దళితులకు అసలే లేవు.అందుకే మనీషా వాల్మీకిని అర్థరాత్రి దహనం చేశారు. ప్రజాప్రతినిధి సింగార్‌ అత్యాచారం చేసిన కేసులో జైలుకు వెళ్ళాడు. కానీ బిజెపి నాయకత్వం పూలదండలతో స్వాగతించి భుజాన మోశారు. రెజ్లర్లు మన బిడ్డలు.కఠోర దీక్షతో విజయాలను ముద్దాడిన ప్రియపుత్రికలు.ఈదేశ ప్రతిష్టను ప్రపం చ పటంలో నిలబెట్టిన ఆడపిల్లలు.భద్రంగా కాపా డుకోవాల్సిన బిడ్డలు. తమ మీద లైంగిక దాడి జరిగిందని,న్యాయం చేయమని వారు రోడ్డెక్కినా ప్రధాని మోడీ మాట్లాడలేదని మన దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు.ఔరా!ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తమ సొంత పార్టీ మనిషిని మోడీ వెన కేసుకొస్తున్నాడేమని ఆశ్చర్యపోయారు అమాయకపు ప్రజలు. స్త్రీలు నో అంటే నో అనే అర్థమని అమితా బ్‌ బచన్‌ సినిమాలో చెప్తే మాకేంటి? మేం కోరుకున్న మహిళ మాచెంత ఉండాల్సిందే! అనే ధోరణే దీనికి కారణం కాదా.ఈ రోజు గుంటూరులో ఓరమ్య, విశాఖలో ఓవరలక్ష్మి, విజయవాడలో ఓ దీపిక… ఇలా ఎన్నిపేర్లని చెప్పుకోవాలి?ఆడపిల్లను కోరుకు న్నప్పుడు కాదంటే చంపటం ఈభావజాలం వల్లే కదా! మహిళలకు విలువ ఇవ్వని ఈ మనువాద పాలకులు అధికార పీఠాలు పొందారు. కడుపులో చేయిపెట్టి తిప్పినట్లు ప్రతినిముషం ఎక్కడో ఒకచోట ఆడపిల్ల ఆర్తనాదం. దీనిని ఆపాలని మొత్తుకుం టున్నాం.ఆలకించడంలా? వదిలేద్దామా? వదిలేస్తే మనం బతగ్గలమా? రక్షణ ఉందా? మన బతుకుల కోసం మనబిడ్డల బతుకుల కోసం కదలాలి. బహు రూపాలలో. వంటరిగాకాదు. సమూహంగా పాల కులకు చెవికెక్కే వరకు. వారు చెవి నెక్కించుకోకపోతే గద్దె దించేందుకు. మహిళల రక్షణ కోసం ఆర్తితో, ఆవేదనతో,ఆగ్రహంతో మహిళా సంఘం ఓ బృహ త్తర కార్యక్రమం చేపట్టింది. మహిళా సంఘాలు కలిసి రూపొందించిన కోర్కెల పత్రాన్ని ప్రజల ఎజెండాగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల రక్షణ కోసం నేడు పోరాట గడ్డ ఉక్కు నగరం విశాఖ నుండి ఒకయాత్ర, హిం దూపురం నుండి మరో యాత్ర ప్రారంభమైంది. హింస లేని సమాజంకోసం అన్ని జిల్లాల్లోనూ విస్తృ తంగా ప్రచార సభలు జరగనున్నాయి. ఆగస్టు 8న విజయవాడలో జరగనున్న బహిరంగ సభ నుంచి మహిళా రక్షణకోసం చేయిచేయి కలిపి నడుద్దాం.ఈ మహఉద్యమంలో భాగస్వాముల మవుదాం. మనువాద రాచరిక సంస్కృతిని, దానిని కాపాడే వారిని నిలదీద్దాం.వెలివేద్దాం.
ఇవి డిమాండ్లు …
జు మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయ నం చేయటానికి, చర్యలు తీసుకోవడా నికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో కమి షన్‌ ఏర్పాటు చేయాలి.
జు మహిళలపై హింసను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మహిళా సంఘాలు స్వచ్ఛం ద సంస్థలను ఆహ్వానించి కార్యాచరణను రూపొందించాలి.
జు మహిళలకు,చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
జు నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠినమైన శిక్షలు విధించాలి. చెరుకుపల్లి మండలంలో అమర్నాథ్‌ హత్య కేసును ఫాస్ట్‌ ట్రాక్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి.
జు ప్రభుత్వం మీడియా మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలి.హింస,అశ్లీలత, అసమాన తలను ప్రేరేపించే చలనచిత్రాలు,టీవీ సీరి యల్స్‌,ఇంటర్నెట్‌కార్యక్రమాలను నిషేధిం చాలి.
జు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌లపై చర్యలు ఉండాలి.
జు కాలేజీల్లో,పని ప్రదేశాల్లో వేధింపులను నిరో ధించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి,అమలు చేయాలి.
జు అన్ని విద్యాలయాల్లో లింగ సమానత్వాన్ని పెంపొందించే సిలబస్‌ను రూపొం దించా లి.బాలబాలికల మధ్య స్నేహపూర్వక అవ గాహనను కల్పించాలి.
జు పాఠశాలల్లో శారీరక దారుఢ్యాన్ని పెంచే ఆటలు, ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలు… అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
జు వన్‌ స్టాప్‌ సెంటర్లు, హెల్ప్‌ లైన్లు ఉమ్మడిగా సమన్వయంతో పని చేసే ఏర్పాటుచేయాలి. తగిన సిబ్బందిని నియమించాలి.ఏ నెలకా నెల జీతాలు చెల్లింపు చేయాలి.
జు మద్యం, మత్తు పదార్థాలను నియంత్రిం చేందుకు చర్యలు చేపట్టాలి. మండలానికి ఒక మద్యం షాపును మాత్రమే అనుమ తించాలి.
జు మద్యం,మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రభుత్వం విస్తృతప్రచారం చేయాలి.మద్యం మీద వస్తున్న ఆదాయంలో కనీసం ఒక్కశాత మైనా మద్య నియంత్రణకు కేటాయించాలి.
జు బాల్య వివాహాల నిరోధానికిగాను బాలిక లకు నిర్బంధ విద్య 19 సంవత్సరాల వరకు పెంచాలి.
జు ఒంటరి మహిళలకు, వారి కుటుంబాల్లోని పిల్లలకు అదనపు రక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
జు అనాథ బాలలు, ఆడపిల్లలు ఉన్న హాస్టళ్లలో, గెస్ట్‌ హౌస్‌లో పురుష సిబ్బంది ఉండరాదు.
జు పోలీసులకు జండర్‌ సెన్సిటివిటీ పెంచడా నికి క్రమబద్ధంగా శిక్షణ కార్యక్రమాలు ఉండాలి.సక్రమంగా లేని పోలీసు ఆఫీసర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
జు మహిళల సమానత సాధనకు చర్యలు ము మ్మరం చేయడం ద్వారానే హింసను కూడా అరికట్టడం సాధ్యమవుతుంది. కనుక అన్ని రంగాల్లో సమానత సాధనకు ప్రభుత్వం పూనుకోవాలి.
జు బాధితుల పునరావాసం కోసం కంపెన్సేషన్‌ ఇవ్వవలసిన నిధులను నెలలోగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
జు ఉపాధి గ్యారంటీ పథకాలు రూపొందించి అమలు చేయాలి. పెద్ద సంఖ్యలో ఉన్న అసంఘటిత మహిళా కార్మికులకు కార్మిక చట్టాలు అమలు పరిచేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
జు ప్రతివారం ఒకప్రాంతంలో మండల అధికా రులు మహిళల హక్కులను వివరిస్తూ అమలుకు పూనుకునే విధంగా ప్రచారం, కార్యాచరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి.
జు మహిళలకు విద్య,రక్షణ, ఉపాధి భద్రత కల్పించేందుకు రాజ్యాంగ విలువలను కాపాడే పద్ధతులను అమలు చేసేందుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి అమలు చేయాలి. వ్యాసకర్త:ఐద్వా రాష్ట్ర కార్యదర్శి

ప్రభం జనం ఆపుదాం..!

దేశమంటే మట్టి కాదోయ్‌…దేశమంటే మనుషులోయ్‌…! మహాకవి గేయానికి ఆధునిక కాలంలో మరో మాట కలుపవచ్చు. మనుషులంటే వనరులోయ్‌…!! అని. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అవరోధం అనేది ఒకప్పటి మాట. ఇపుడు మానవ వనరులే చోదకశక్తిగా ప్రగతిశీలత కనబరు స్తున్న దేశం మనది. ప్రగతిఎక్కడుంటే మానవ వనరులు అక్కడికి పరుగులు తీస్తాయి. అక్షరాస్యత, వృత్తి నైపు ణ్యం, గతిశీలత ఉన్న జనాభా విశాఖ అభివృద్ధికి ఆయువుపట్టు. అయితే పెరిగిన జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం అవసరం. జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కథనం… ప్రపంచ జనాభాదినోత్సవం (జూలై11)సంద ర్భం గా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకా రం భారత్‌వచ్చే ఏడాది1.4బిలియన్ల (140 కోట్లు) జనాభాతో చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినదేశంగా అవతరించ నుం ది.ఈనివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్‌ నాటికి 800 కోట్లకు చేరనుంది. కానీ, ప్రస్తుతం జనాభా పెరుగుదల, గతంలో ఉన్నంత వేగంగా లేదు.1950తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగాఉన్నప్పటికీ, 2080ల నాటికి 10.4బిలియన్ల(1040కోట్లు)కు చేరుకుం టుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని నమ్ముతు న్నారు. కానీ, ప్రపంచ జనాభా పెరుగుదల అసమా నంగా జరుగుతోంది.వచ్చే 30ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50శాతానికి పైగా కేవలం 8దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిరచింది. కాంగో,ఈజిప్ట్‌, ఇథియోపి యా,భారత్‌,నైజీరియా,పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌, టాంజా నియా దేశాల్లోనే ఈఅధిక జనాభా రేటు నమోదవు తుందని చెప్పింది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశా లు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తిరేటు ప్రతీ మహిళకు సగటు న 2.1 కంటే తగ్గిపోయింది.61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం1శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.
ప్రపంచంలోనే అతి తక్కువ సంతానో త్పత్తి రేటు ఉన్న దేశాల్లోచైనా కూడా ఒకటి. చైనా లో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభా లో క్షీణత ప్రారంభమవుతుందని చైనా ప్రకటిం చింది.దేశంలో ‘ఒకేబిడ్డ’అనే విధానాన్ని విడిచి పెట్టి,ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా అనుకున్నదానికంటే వేగంగా తగ్గు తోంది.భారత్‌లో జనాభా పెరుగుతూనే ఉన్నందున, కచ్చితంగా చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించ నుంది.జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి.సైన్స్‌,మెడిసిన్‌ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగు దలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాలరేటు తగ్గిపోవడంతోపాటు,ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండనుంది.కానీ, దీని ప్రకారం జనాభాలో 65ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10శాతంగా ఉండగా,2050 నాటికి16శాతానికి పెరుగు తుంది.ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.
జనాభా దినోత్సవం నేపపథ్యం ఇదీ..
ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కులు వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా దినోత్సవం,2023 ఇతివృత్తం ఏమిటంటే,‘‘హక్కులు,ఎంపిక చేసుకునే అవకాశాలే సమాధానం.జననాలరేటు పెరగడం లేదా తగ్గడం, ప్రజలందరి సంతానోత్పత్తి ఆరోగ్యానికి, హక్కులకు ప్రాధాన్యమివ్వడంలోనే మారుతున్న సంతానోత్పత్తి సామర్థ్య రేట్లకు పరిష్కారం ఉంది.’’యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏ రోజున ప్రపంచ జనాభా 500కోట్లకు చేరుతుందని అంచ నా వేస్తారో,ఆరోజున (1987 జూలై 11న) దీనిని జరపాలని నిర్ణయించింది. దీనిని కొనసాగించాలని 1990లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మా నం చేసింది. అధిక జనాభా ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపింది. కుటుంబ నియంత్రణ, పౌర హక్కులు, పేదరికం, మానవాళిపై అధిక జనాభా చూపే ప్రభావం గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉప యోగపడతాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారతదేశం నిలి చింది.అధిక జనాభా కారణంగా కోవిడ్‌-19 మహమ్మారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2030 ఎజెం డా అనేది ఆరోగ్యవంతమైన భూమండలంపై ప్రజ లందరికీ మెరుగైన భవిష్యత్తుకు ప్రపంచ బ్లూప్రింట్‌ అని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటో నియో గుటెరస్‌ అన్నారు. జనాభా వృద్ధి, వృద్ధాప్యం, వలసలు,పట్టణీకరణ సహా జనాభా ధోరణులతో ఈమిషన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుర్తిస్తు న్నట్లు తెలిపారు.
జనభాతో పాటు సమస్యలు ఎక్కువే..!
ఇక ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పెరుగుతున్న జనాభాతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గత 32 ఏళ్లుగా జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. జనాభాతో పాటే తద్వారా వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. భారత్‌నే తీసుకుంటే ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 2100నాటికి మనదేశంలో జనాభా 1450 మిలియన్‌ తాకుతుందని అంచనా వే సింది.1950లో ఉన్న జనాభా 2100 నాటికి చైనా జనాభాను కూడా భారత్‌ దాటుతుందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తన నివేదికలో వెల్లడిరచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్న 10దేశాల్లో ఒక్క ఆఫ్రికా దేశాలే ఐదుగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‌లోనే ఇక ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా దాదాపు 83 మిలియన్‌ పెరుగుతోంది. ఇక 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6బిలియన్‌ మార్కును తాకుతుందని చెప్పడంలో ఎలాంటి సం దేహం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే ప్రపంచ భూభాగంలో కేవలం 2శాతం భూమిని మాత్రమే కలిగి ఉండే భారత దేశం… ప్రపంచ జనాభా విషయానికొచ్చేసరికి దాదాపు 16 శాతం జనాభా మనదేశమే అకామొడేట్‌ చేయడం విశేషం. ఇక భారత్‌లో 35శాతం జనాభాబీహార్‌,ఉత్తర్‌ ప్రదేశ్‌,మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నట్లు సమాచారం. అత్యధిక జనాభా ఉండటం వల్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధానమైన సమస్య పేదరికం అని వెల్లడిస్తున్నారు.
2050 నాటికి స్త్రీ, పురుషుల జనాభా సమానం
2050 నాటికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా.2020లో, 1950 తర్వాత మొదటిసారిగా,జనాభా పెరుగు దల రేటు సంవత్సరానికి 1శాతం కంటే తక్కువగా పడిపోయింది. ఇది రాబోయే కొన్ని దశాబ్దాల్లో, ఈ శతాబ్దం చివరి వరకు మందగించడం కొనసా గుతుందని అంచనా వేసింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో,అంతర్జాతీయ వలసలు జనాభా మార్పులో ప్రధాన అంశంగా మారాయి. 2010, 2021మధ్య పది దేశాలు1మిలియన్‌ కంటే ఎక్కువ వలసదారుల నికర ప్రవాహాన్ని అనుభవించాయని అంచనా వేయబడిరది.ఈదేశాలలోచాలా వరకు,ఈ ప్రవాహాలు తాత్కాలిక శ్రామిక కదలికల కారణం గా ఉన్నాయి, అవి పాకిస్థాన్‌ (2010-2021లో -16.5 మిలియన్ల నికర ప్రవాహం), భారతదేశం (-3.5 మిలియన్లు),బంగ్లాదేశ్‌(-2.9 మిలియన్లు), నేపాల్‌ (-1.6మిలియన్లు),శ్రీలంక(-1 మిలియన్‌). జనాభా రెట్టింపుతో వనరులపై తీవ్ర ప్రభావం46 అతితక్కువ అభివృద్ధి చెందిన దేశాలు (ూణజు) ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఉండనున్నాయి.అనేక మంది 2023,2050 మధ్య జనాభాలో రెట్టింపు అవు తుందని అంచనా వేయబడిరది, వనరులపై ఇది అదనపు ఒత్తిడిని, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ూణGం) సాధనకు సవాళ్లను విసిరింది.జనాభా, స్థిరమైన అభివృద్ధి మధ్య సంబంధాన్ని వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఇతర ప్రపంచ పర్యావరణ సవాళ్ల నేపథ్యం లో పరిగణించాలని యూఎన్‌ నివేదిక పేర్కొంది. జనాభా పెరుగుదల పర్యావరణ నష్టానికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చుబీ అయితే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు లేదా పరిగణించ బడిన కాలపరిమితి, అందుబాటులో ఉన్న సాంకేతి కత,జనాభా,సామాజిక,ఆర్థిక సందర్భాలపై ఆధార పడిదాని ఆవిర్భావ సమయాన్ని వేగవంతం చేయ వచ్చు.-జిఎన్‌వి సతీష్‌

అంతర్ధానమవుతున్న మాతృభాషలు

మనిషి తన తల్లికి ఎంత దగ్గరగా ఉంటాడో మాతృ భాషకు కూడా అంత దగ్గరగా ఉంటాడు. పిల్ల వాడు, తన భాషా సామర్ధ్యాన్ని తల్లి నుండి నేర్చుకుం టాడు. ఏతల్లీ కూడా అప్పుడే పుట్టిన పిల్లాడికి ఎలాంటి వ్యాకరణ నిబంధనల్ని బోధించదు. అయినా,తన తల్లి పెదాల కదలికలు, ఆమె అభినయా లను గమనించడం ద్వారా,ఆమె మాటల ధ్వని, ఆమాటల కూర్పును గ్రహిం చడం ద్వారా ఆపిల్లాడు అంత సంక్లిష్టమైన నిబంధనల్ని వంట బట్టించుకుంటాడు.పిల్లలు భాషలను పాఠశాలలో నేర్చుకుంటారనే ఒక విస్తృతమైన తప్పుడు అభిప్రా యం ఉంది.అది మాతృభాషేతర భాషల విషయం లో వాస్తవం కావచ్చు.ద్వితీయ, తృతీయ లేక ఇతర భాషల్ని వ్యాకర ణం,అనువాదంద్వారా నేర్చు కోవా ల్సి ఉంటుంది. కానీ పిల్లవాడు మూడు సంవత్స రాల వయసొచ్చే సమయా నికి మాతృభాష లోని దాదాపు అన్ని సంక్లిష్టతలను నేర్చుకోవడానికి అను గుణంగా మెదడు నిర్మితమై ఉంటుంది. లేఖనం (రాత) అనేది వేరే అంశం. కొన్ని లక్షల సంవత్స రాల మానవ జాతి చరిత్రలో, లేఖనం అనేది ఏడు వేల సంవత్సరాల క్రితమే వ్యక్తీకరణకు, సమా చారాన్ని అందించే,జ్ఞాపకాలను నిల్వ చేసే సాధనం గా మారింది. భాష అంటే ప్రాథమికంగా మాట్లాడ టం.లేఖనం ద్వారా తరాల మధ్య సుదీర్ఘ కాలం పాటు భాషాపరమైన సంబంధ బాంధ వ్యాలకు అవకాశం ఇవ్వడం భాషకుండే అదనపు లక్షణం.
నాబాల్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మాతృభాష కాని ఇతర అనేక భాషలను వారాంతపు సంతల్లో జనసమూహాలు మాట్లాడడం స్వయంగా విన్నాను. అప్పట్లో రేడియో అనేది మా గ్రామంలో ఓకొత్త యంత్ర పరికరం. ఇంట్లోకి కొత్త రేడియో సెట్‌ రావడంతో నేను ఎంతో ఆసక్తిగా స్టేషన్లను కదిలిస్తుండేవాడ్ని.వారాంతపు సంతల్లో వినని అనేక భాషల్ని రేడియోలో విన్నాను. దీంతో అసలు ఈ ప్రపంచంలో ఇంకా ఎన్ని భాషలు ఉన్నాయో తెలు సుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది.1970లో ఒక విశ్వవిద్యాలయం విద్యార్థిగా భారతీయ భాషలపై జనగణనకు సంబంధించిన చిన్న పుస్తకాన్ని చూశా ను.దానిలో 109భాషల జాబితా ఉంది. ఆ జాబి తాలో చివరన ఃఃఅన్ని ఇతర భాషలు అని ఉంది. అంటే 108భాషల కన్నా ఎక్కువ భాషలు ఉన్నా యనే దానికి ఇదొక సూచిక. ఇంతకన్నా ముందుగా జనాభా లెక్కల్లో మరికొన్ని వివరాలు తెలుసు కోవాలనే ఉద్దేశంతోయూనివర్సిటీ లైబ్రరీలో 1961 జనాభా గణాంకాల కోసం వెతికాను. ఆ గణాం కాలలో నేను దిమ్మతిరిగే విషయాలను గమనిం చాను.ఆజాబితాలో 1652 భాషల్ని తమ మాతృ భాషగా భారతీయులు పేర్కొన్నారు. పైన ఉదాహ రించిన భాషల గణాంకాలకు సంబంధించి రెండు రకాల సంఖ్యల్ని పోల్చితే 10 సంవత్సరాల కాలం లో (అంటే 1961-1971మధ్య కాలంలో) భారత దేశం మొత్తం 1544 భాషల్ని కోల్పోయింది. భాషా గణనను మామూలు అంక గణితం ద్వారా విభజిం చలేం.దానికి శిక్షణ పొందిన భాషా పండితుల పరిశీలన అవసరం ఉంటుంది. అందువలన భారతీ య జనగణన రిజిస్ట్రార్‌ దగ్గర పని చేస్తున్న భాషా పండితులు, విద్యావిషయక నిష్ణాతుల సాహిత్యం లో నమోదుచేయబడిన మాతృభాషల పేర్లు (జనా భా లెక్కల సమయంలో ప్రజలు చెప్పినవి) ఏమైనా ఉన్నాయేమోనని అందుబాటులో ఉన్న గ్రంథాల యాలలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. అందువల్ల సాధారణంగా భాషకు సంబంధించిన గణాంకా లను చివరగా ప్రకటిస్తారు.
1971 భాషా గణనకు, భాషా గణాం కాల ప్రకటన మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ యుద్ధం జరిగింది.తరువాత కాలంలో బంగ్లాదేశ్‌గా మారి న తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ నుండి భాషా సమస్య పైనే విభజనను కోరింది. భారత ప్రభుత్వం భాషా వైవిధ్యం గురించి ఆందోళన చెంది,భాషల సంఖ్యను తగ్గించే మార్గాలను వెతికే నిర్ణయం చేసి వున్నట్లైతే, అది సహజమేనని భావిం చాలి.అందుకుగాను ప్రభుత్వం ఃఃపది వేల (భాషను మాట్లాడే వారి సంఖ్య) సంఖ్యఃః పరిమితిని విధిం చింది.ఈసంఖ్యా పరిమితికి ఎలాంటి శాస్త్రీయమైన పునాది లేదు. ఒక భాషను భాషగా పరిగణించా లంటే ఆ భాషను మాట్లాడేవారు కేవలం ఇద్దరుంటే చాలు.1970 ప్రాంతంలో 1544మాతృ భాషలు ఆకస్మికంగా మౌనం వహించాయా? కచ్చితంగా కాదు.అవికొద్ది జనాభా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో కొనసాగాయి.
ప్రభుత్వం కృత్రిమంగా విధించిన సీలింగ్‌ కారణంగా వాస్తవానికి ఎన్నిభాషలు అంత ర్ధానయ్యాయో తెలుసుకోవాలంటే1971 జనగణ నను 2011జనగణనతో పోల్చి చూడాలి. ప్రజలు తమ మాతృభాషగా పేర్కొన్న భాషల్ని లెక్కించ డానికి అదే జనగణన పద్ధతిని అనుసరించగా భారతదేశంలో ప్రజలు 1369 భాషలను మాట్లా డుతున్నట్లు 2011జనగణన నిర్ధారించింది. రెండు సంఖ్యలను పోల్చి చూడడం ద్వారా 1961 నుండి 2011వరకు…అంటే50 సంవత్సరాల్లో (1,652 -1,369¸283)283 భాషలు అంతరించి పొయ్యా యనే నిర్ధారణకు ఎవరైనా రావచ్చు. అంటే సంవ త్సరానికి సగటున నాలుగు లేక ఐదు భాషలు లేదా ప్రతీ రెండు లేక మూడు నెలలకొక భాష అంతరించినట్టు అర్థం చేసుకోవాలి. గతంలో ఓ వెయ్యి సంవత్సరాల పాటు అంతర్ధానమైనఃః భాషలు ఉనికిలో ఉన్నాయనే విషయాన్ని పరిగణన లోకి తీసుకుంటే, భారత దేశంలో భాషల అంత ర్ధానరేటు గుండెలు అదిరిపోయే విధంగా ఉంది. జనగణనమాతృభాషలనే మాటను ఉపయోగించి నప్పుడు,వాటిలో చిన్న లేదా అల్ప సంఖ్యాక భాష లు మాత్రమే కాక అధిక సంఖ్యాక భాషలు కూడా ఉన్నాయనే విషయం ఎవరికైనా అంత తేలిగ్గా స్ఫురణకు వస్తుందనుకోలేం.
భారతదేశ ప్రజలు మాట్లాడిన వివిధ భాషల వివరాలు దశాబ్దాలవారీగా చూస్తే, 1961 లో బంగ్లా మాట్లాడేవారు మొత్తంజనాభాలో 8.17 శాతం ఉండగా అర్ధశతాబ్దం తరువాత వారి సంఖ్య8.03శాతానికి తగ్గింది. మొత్తం జనాభాలో మరాఠీ భాష మాట్లాడేవారి సంఖ్య 7.62 శాతం నుండి 6.86శాతానికి, తెలుగు మాట్లాడేవారు 8.16 శాతం నుండి 6.70 కి, తమిళం మాట్లాడే వారి సంఖ్య మరీ దారుణంగా6.88శాతం నుండి 5.70శాతానికి దిగజారింది. వాస్తవానికి హిందీ భాష తరువాత ఎక్కువగా మాట్లాడే మొదటి ఎని మిది భాషలు-బంగ్లా,మరాఠీ, తెలుగు,తమిళం, గుజరాతీ,ఉర్దూ,కన్నడం,ఒడియా మొత్తం జనాభా లో 2011జనగణన ప్రకారం 42.37శాతం కాగా హిందీ ఒక్కటే 43.63శాతంగా నమోదైంది. హిందీ మాట్లాడేవారి సంఖ్య ఎప్పుడూ పెరుగు తూనే ఉంది.1961లో36.99శాతంగా నమోదైన హిందీ మాట్లాడే వారిసంఖ్య 2011నాటికి మొత్తం జనాభాలో 43.63శాతానికి పెరిగింది. హిందీ, సంస్కృతం,గుజరాతీ భాషలను మినహాయిస్తే మిగి లిన గుర్తించబడిన అన్ని భాషల అంతర్ధానం కొన సాగుతూనే ఉందని 2011జనగణన తెలియ జేస్తుంది.196లో సంస్కృత భాషను మాతృభాషగా పేర్కొన్న వారిసంఖ్య 2,212 మంది కాగా 2011 లెక్కల్లో ఆ సంఖ్య 11రెట్లు పెరిగింది. అంటే ఆ సంఖ్య 24,821కి పెరిగింది. 2011లో జరిగిన భాషా గణన వివరాలను 2018లో ప్రకటించారు. తమిళ భాష ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవభాషగా ఉంది.కన్నడం,మరాఠీ భాషలు సుమా రు రెండు వేల సంవత్సరాలుగా,మలయాళం, బంగ్లా, ఒడియా భాషలు కూడా దాదాపు 1000 సంవత్సరాలుగా జీవభాషలుగా ఉంటున్నాయి. సంస్కృతం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా జీవభాషగా లేకుండా నిలిచిపోయింది.దీనికి భిన్నంగా 17వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్‌ భాష అందరి అంగీకారం పొందింది. దీనిని మాట్లాడే వారిసంఖ్య జనగణనలో 2,59, 878గా చూపబడిరది.ఇంగ్లీష్‌ దినపత్రికల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. భారతదేశంలో ఏడులక్షల గ్రామాల్లో, రెండు వేలనగరాలు, పట్ట ణాల్లో ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠశాలలు నిర్వహించ బడుతున్నాయి.ఇంగ్లీష్‌ టీవీఛానళ్ల రేటింగ్‌ పాయిం ట్లు కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఇంగ్లీష్‌ మాట్లాడే వారి సంఖ్య (సంస్కృతం మాట్లాడే వారి సంఖ్యకు భిన్నంగా) పెరుగుతుండడం నిజమే అని తెలుస్తుంది.
విచారకరమైన నిర్ధారణ ఏమంటే భారతీయులు మాట్లాడే అల్పసంఖ్యాక, అధిక సంఖ్యాక భాషలన్నీ (హిందూత్వ భావజాలాన్ని అనుసరించేవారు ఇష్టపడే భాషలను మినహాయిస్తే) నేడు వాటి ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.మన రాజ్యాంగంలో పేర్కొన్న ట్లుగా బహు భాషలు మాట్లాడే వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న భారత దేశానికి ఇది మంచిది కాదు.(ఫ్రంట్‌లైన్‌ సౌజన్యంతో).
` వ్యాసకర్త:ఒబైడ్‌ సిద్ధిఖీ చైర్‌ ప్రొఫెసర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌,బయోలాజికల్‌ సైన్సెస్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, బెంగళూరు
-గణేష్‌ దేవీ

అనుకున్నంతగా..వానల్లేవు

వేసవిలో పంట చేతికొచ్చే సమయానికి వద్దన్నా రెండు దఫాలుగా రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చిన వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే వానాకాలం సీజన్‌ నెలన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవకపోవడం గమనార్హం. ఎండాకాలం యాసంగిలో వద్దన్నా కురిసిన బారీ వర్షాలు అదే వానాకాలం వచ్చే ముఖం చాటేయడంతో ఆరుతడి పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల రాక కోసం తెలుగు రాష్ట్రాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
స్తారు నుంచి భారీవర్షాలు లేక కంది,సోయా, మిర్చి,వేరుశనగ మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు రెండాకుల దశలోనే ఉన్నాయి. ఆశిం చిన స్థాయిలో వర్షాలు లేక మొలకదశలోనే పత్తి ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈఏడాది రాష్ట్రంలోదాదాపు50లక్షలకు పైగా ఎకరాల్లో పత్తిసాగవుతుందని వ్యవసా యశాఖ అంచనా వేసింది.కాని వర్షాలు ముఖం చాయే టడంతో అడపదడపావాన లకు కొన్ని జిల్లాల్లో రైతులు విత్తనాలు వేశారు. ఇప్పటికీ దాదాపు 20లక్షల ఎకరాల్లో వర్షాలు పడితే పత్తినాటేం దుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.సాధారణం గా ఏటావర్షాకాలం ఆరంభంలో కురిసే వర్షా లతోనే రైతులు ఆతరుడి పంట విత్తనాలు వేస్తారు.వర్షాలు కురుస్తాయోమోనన్న ఆశతో ఈసారి కూడా రోహిణిలోనే పత్తివిత్తనాలు నాటారు. అయితే జూన్‌ నెలలో ఆరుతడి పంటలకు కావాల్సి నంతగా వర్షాలు కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తం గా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. చెదురు ముదురు చినుకులకే విత్తనాలు విత్తినా అవి మొలకె త్తేందుకు, మొలకెత్తినా ప్రాణం పోసుకుని ఎ దిగేందుకు సరిపడా వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం జులై మొదటి వారం గడిచిపోయినా కూడా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వానాకాలం పంట లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గతే డాది ఇదే సమయానికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైంది. కాని ఈ ఏడాది జులై రెండో వారంవచ్చినా వరుణుడు కరుణించడం లేదు. సాధారణంగా జూన్‌ నెలతలో 144.1మీమీ. వర్షపాతం కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో కేవలం 66.9 మి.మీ. వర్ష పాతం అది కూడా మూడు, నాలుగు జిల్లాల్లోనే కురిసింది.దాదాపు 77.2మి.మీ లోటు వర్షపాతం జులైలో నమోదయింది. వర్షాలు పడక పత్తి మొక్క లు ఎండిపోతుండడంతో రైతులు కూలీలను పెట్టి మరి బిందెలు, ట్యాంకర్లతో మొక్కమొక్కకూ నీటిని పోస్తున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయని ఆవదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడం లేదు. దీంతో కనీసం బోరు, బావినీటితోనైనా ఆరుతడి పంటలను కాపాడుకు నేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏటా మాదిరిగా జూన్‌ నెలలో వర్షాలు కురిస్తే పత్తి మొక్కలు జులై రెండో వారంకల్లా మొక్క ఎదగడంతోపాటు కొమ్మలు పెట్టే దశలో ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తు పెరగాల్సి ఉంది.కాని ఈ సారి నెలన్నర వానాకాలం సీజన్‌ గడుస్తున్నా పత్తి మొక్కలు ఇంకా రెండాకుల దశ లోనే ఉన్నాయి. మొక్క ఎదుగుదల ఆశించిన స్థాయి లో లేకపోతే కొమ్మలు రాకపోతే కాత తగ్గి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మరో రెండు వారాలు వర్షాలు కురవకపోతే ఆత ర్వాత కురిసినా పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతు లు చెబుతున్నారు.
ఏ పంట..ఎప్పుడు వేసుకోవాలంటే!
వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవు తున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధ మవు తున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవా లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒకరకమే సాగు చేస్తూ అన్న దాతలు నష్టపోతు న్నారు. అయితే అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవ డంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడుసాగు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? అనే అంశాలపై నిపుణుల
సూచనలు, సలహాలు.
మొక్కజొన్న : మొక్కజొన్న పంటకాలం 110 నుంచి 120 రోజులు ఉంటుంది.జూన్‌ 15 నుంచి జూలై 15లోపు విత్తనాలు విత్తుకోవాలి.మొక్కజొన్న సున్నితమైన పంట. నీరు ఎక్కువ ఉన్నా, తక్కువున్నా తట్టుకోదు.కాండం తొలుచు పురుగుతో తీవ్ర నష్టం జరుగుతుంది. పంటసాగు చేసిన 30రోజుల లోపు కాండం తొలుచు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.30రోజులు గడిచిన తర్వాత దాని ప్రభా వం పంటపై అంతగా ఉండదు. కాండం తొలుచు పురుగు ఉధృతికి జూలై చివరివారం నుంచి ఆగస్ట్‌ లో వాతావరణ అనుకూలంగా ఉంటుంది.జూన్‌ లో మొక్కజొన్న సాగు చేయడంవల్ల పంటకాలం 30రోజులుదాటి పురుగు ప్రభావం అంతగా ఉండదు.ఆలస్యంగా సాగు చేస్తే కాండం తొలుచు పురుగుతో నష్టపోవాల్సి వస్తుంది.రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 లోపు విత్తనాలు వేయాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపు పంట చేతికొస్తుంది.
పెసర :పెసర పంట కాలం 60నుంచి 75 రోజులు ఉంటుంది.జూన్‌ 15నుంచి జూలై 15లోపు సాగు చేయాలి. ఆగస్టు 25 వరకు పంట చేతికొస్తుంది. ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండ డంతో పెసర పంట నష్టపోయే ప్రమాదం ఉం టుంది.జూన్‌ 20లోపు సాగు చేస్తే ఆగస్టు 10లోపు పంట చేతికి వస్తుంది.రబీలో సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 30లోపు సాగు చేయాలి నవంబర్‌ 20 నుంచి జనవరి 15వరకు పంట చేతికొస్తుంది. పత్తి : పత్తి సాగును వీలైనంత వరకు తగ్గించాలి. పత్తి సాగుకు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధర లేకపోవ డంతో పత్తి సాగు రైతులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్ల రేగడి భూమిలో పత్తి సాగు చేసే రైతులు 60 నుంచి 70మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వా త పత్తి గింజలు విత్తుకోవాలి. జూన్‌ 20 నుంచి జూలై 20వరకు పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల రసం పీల్చుపురుగులు ఉధృతితక్కువగా ఉంటుంది.
కంది : కంది పంట కాలం 6 నెలలు. జూన్‌ 20 నుంచి జూలై చివరి వారం వరకు సాగు చేసు కోవాలి. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15 వరకు పంట చేతికొస్తుంది. సకాలంలో కంది సాగు చేయ డం వల్ల జనవరిలో రెండో పంటగా పెసర సాగు చేసుకొవచ్చు.నీటి వసతి ఉన్న రైతులు కందిలో అంతర పంటగా సోయాబీన్‌, మొక్కజొన్న సాగు చేయడంవల్ల అధికలాభాలు సాధించవచ్చు. సోయాచిక్కుడు : సోయా చిక్కుడు పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది. పెసరతో పోలిస్తే సోయా చిక్కుడు వర్షాలను తట్టుకునే అవకాశం ఉంటుంది. నీటి వనరు ఉన్న రైతులు జూన్‌ 20 నుంచి జూలై 10వరకు సాగు చేయాలి. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 20 వరకు పంట చేతికొస్తుంది. సోయాచిక్కుడు సకాలంలో సాగు చేయడం వల్ల రెండో పంటగా వేరుశెనగ,మూడో పంటగా వేసవి లో పెసరను సాగు చేసుకోవచ్చు.
మిరప : మిరప పంట కాలం ఏడు నెలలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకుని సెప్టెంబర్‌లో నాటు వేసుకోవాలి. నకిలీ విత్తనాలు ఖరీదు చేసి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. గుర్తింపు పొందిన డీలరు వద్ద విత్తనాలతో పాటు తప్పనిసరి గా రశీదు తీసుకోవాలి. మిరప సాగుచేసే రైతులు తొలకరి వర్షాలు కురియగానే తక్కువ కాలంలో చేతికొచ్చే పెసర రకాలను సాగు చేసి దాని తర్వాత మిరప సాగు చేసుకొవచ్చు.
వరి : దీర్ఘకాలిక వరి రకాలకు సంబంధించి జూన్‌ మొదటి వారం నుంచి చివరి లోపు నారు పోసు కోవాలి. పంటకాలం 135 నుంచి 150 రోజులు ఉంటుంది.అక్టోబర్‌ 31నుంచి నవంబర్‌ 20 లోపు పంట చేతికొస్తుంది. మధ్యకాలిక రకాల నారును జూన్‌ 20 నుంచి జులై 10లోపు పోసుకోవాలి. పంటకాలం125 నుంచి 135 రోజులు. నవంబర్‌ 5నుంచి 25లోపు పంట చేతికొస్తుంది. వానకా లంలో సాగుచేసిన పంటసకాలంలో చేతికి రావ డంతో నవంబర్‌లో వేసవి వరి సాగు చేయడానికి వీలుంటుంది. వానకాలం ఆలస్యం చేయడం వల్ల యాసంగి కూడా ఆలస్యమౌతున్నది.ఏప్రిల్‌లో వడ గండ్ల వర్షాలకు వేసవిలో సాగుచేసిన వరి నష్టపో వాల్సి వస్తున్నది. మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికొస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించొచ్చు. నేరుగా పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలను జూన్‌ 20 నుంచి అక్టోబర్‌15లోపు సాగుచేయాలి.మధ్య కాలిక రకాలను జూన్‌ 20నుంచి జూలై 10లోపు సాగు చేయాలి. అక్టోబర్‌ చివరి వారం నుంచి నవంబర్‌ మొదటి వారంలో పంట చేతికొస్తుంది.
కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి
రైతులు పంటలను కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి.ఏపంటలను ఎప్పుడు సాగు చేయాల నేది పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే వేసుకో వాలి.కాలానుగుణంగా సాగుచేయడం వల్ల మంచి దిగుబడులు పొందడమే కాకుండా రోగాల ప్రభావం తగ్గుతుంది.ఏ పంటలను సాగు చేయా లన్న విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకుండా గుర్తిం పు పొందిన డీలర్‌ వద్దే కొనుగోలు చేసి రశీదును తప్పక తీసుకోవాలి.
ఖరీఫ్‌ సన్నద్ధత ఏదీ?
ఈమారు తొలకరి పలకరింపు ఆలస్య మైంది. జూన్‌ మూడవవారానికీ వర్షాల్లేక ఏరు వాక కదల్లేదు. ఖరీఫ్‌ సేద్యానికి అదను పదును తప్పేలా ఉంది.తుపాన్లు,వరదలు,అకాల వానలు, వర్షాభావం నిరుడు ఖరీఫ్‌ రైతుల ఉసురు తీశా యి. పంటలకు ధర సమస్య తిష్ట వేసింది. ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉండనే ఉన్నాయి. ఈ తడవైనా ఖరీఫ్‌ పంటలు వేయబోతే ఆదిలో హంసపాదులా నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. సీజన్‌లో 21 రోజులు గడిచినా మబ్బు జాడలేదు. ఆ ప్రాం తం ఈ ప్రాంతం అని లేకుండా అధిక ఉష్ణోగ్రత లు, వడగాలులు, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికి పడాల్సిన సాధారణ వర్షంలో 61శాతానికిపైన తక్కువ పడిరది. చిత్తూరు మినహా అన్ని జిల్లాలూ 50-80 శాతం వర్షపు లోటు ఎదుర్కొంటున్నాయి.ఎ.పి.లో 679 మండ లాలుండగా 527 చోట్ల తక్కువ వర్షం పడిరది. 11 మండలాల్లో చినుకు లేదు.
మో91మండలాల్లో మాత్రమే నార్మల్‌, అంతకంటే కొంచెం వర్షం కురిసింది.ఈగణాం కాలు ప్రభుత్వానివి.క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వ్యవసాయ రాష్ట్రం ఎ.పి.కి ఖరీఫ్‌ కీలకమైనది కాగా రానురా ను రైతులకు సీజన్‌ భారంగా కష్టం గా తయారైం దని సాగు లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది నిర్ణయించుకున్న సాధారణ సాగు విస్తీర్ణంలో ఐదు న్నర లక్షలఎకరాల్లో విత్తనం పడక బీడు పడ్డాయి. రబీలోనూ పది లక్షల -ఎకరాల్లో పంట ల్లేక ఖాళీ పడ్డాయి. క్రమేపి సాగు తగ్గుతుండ టంతో నిర్ణయించుకునే నార్మల్‌ సాగు అంచనాలూ తగ్గిపోతున్నాయి.ఉదాహరణకు నిరుడు ఖరీఫ్‌ కంటే ఈ సారి ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు పడిపోయింది. ఒక్క సంవత్స రంలో అన్నేసి లక్షల ఎకరాల తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలో వేరుశనగ విస్తీర్ణం తగ్గి పత్తి, ఇతర వాణిజ్య పంటలు పెరుగుతున్నా యి. ధాన్యాగారాలైన గోదావరి,కృష్ణా,పెన్నా డెల్టా లలో వరి కుదించుకుపోయి ఆక్వా, ఇతర కమర్షి యల్‌ క్రాప్స్‌ వేస్తున్నారు. ఈ ధోరణులు ప్రభుత్వాల విధానాల పర్యవసానాలు. ఏపంట వేసినా పెట్టు బడులకు కనీస గ్యారంటీ లేనందున సేద్యం రైతు లకు జూదాన్ని తలపిస్తోంది. అందుకే తలో దిక్కు పోయి చేతులు కాల్చుకొని నష్టపోతున్నారు. చివరికి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులతో స్వంత వ్యవసాయం మాన్పించి కార్పొరేట్ల చెప్పుచేతల్లోకి చేర్చే కుట్ర జరుగుతోంది. ఇది రైతాంగానికి ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం.
ఖరీఫ్‌ సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వనట్లే కనిపిస్తోంది. పంటలేయా లంటే రైతులకు కావాల్సినవి అదనకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి, సాగు నీరు. వర్షాలు పడలేదు కాబట్టికానీ, లేకపోతే విత్తనాల కోసం వెదుకులాటే. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని మమ అనిపించారు. ఇండెంట్‌ బాగా తగ్గించారు. వరి, ఇతర పంటలదీ అదే తీరు.నిరుడు నకిలీ, కల్తీ మిర్చి విత్తనాలు, నారుతో రైతులు భారీగా నష్టపోయారు. పత్తి విత్తనాలూ అంతే. ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం అందలేదు. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌ మొదలుకాక ముందే చాలాచోట్ల నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. పట్టుకున్నది గోరంత, పట్టుకోకుండా చెలామణి అవుతున్నది కొండంత.పురుగు మందుల అక్ర మాలు చెప్పనలవికావు. నాణ్యత విషయంలో రాజీ లేదని ప్రభుత్వం హూంకరిస్తుండగా జరిగేది జరిగి పోతోంది. నిరుడు ఎరువుల సరఫ రాలో అస్తవ్య స్తత వలన అదనుకు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్‌ రుణాల లక్ష్యాలు వందకు వంద శాతం చేరాయంటున్నా కౌలు రైతుల పరపతి అధమస్తంగా ఉంది. కేంద్ర బీమా పథకంలో చేరడంతో ఖరీఫ్‌ బీమా ఇంకా అంద లేదు. అకాలవర్షాల బారిన పడ్డ రైతుల్లో చాలా మందికి పరిహారం దక్కలేదు. రైతు భరోసా చాలా మందికి పడలేదు.పి.ఎంకిసాన్‌ జాడ లేదు. కేలం డర్‌ ప్రకారం కాల్వలకు నీళ్లొదులుతు న్నామం టున్నా చివరి భూములకు అందట్లేదు. మరమ్మ తుల్లేక కాల్వల్లో తగినంత నీరు పారట్లేదు. రిపేర్లు లేక చిన్న వానలకే డ్రైన్లు పొంగి పొలాలపై పడుతు న్నాయి. శ్రీశైలం దగ్గరే రిపేర్లు లేవు. ప్రభుత్వం మాత్రం ఆర్‌బికెల జపం చేస్తోంది.ఏర్పాట్లు లేకుం డా ఖరీఫ్‌ సజావుగా సాగదు. ప్రభుత్వం ఖరీఫ్‌ సన్నద్ధతపై దృష్టి నిలపాలి.
వ్యాసకర్త : కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి-(దొంగరి నరేశ్‌)

మెస్రంల ఇలువేల్పు నాగోబా

‘‘ఆదివాసీల సంస్కృతి, వారసత్వ సంపదకు ప్రతిరూపంగా నిలిచే కెస్లాపూర్‌ నాగోబా జాతరకు తెలంగాణ ఆదివాసీ ప్రాంతంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది.జాతరకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి చేరుకున్న మెస్రం వంశస్థులు నాగోబాకు మొక్కులు చెల్లించు కున్నారు. 1946లో కెస్లాపూర్‌ జాతరను సందర్శించిన మానవ పరిణామ శాస్తవ్రేత్త హెమన్‌డార్ప్‌ సూచనతో అప్పటి నిజాం ప్రభుత్వం గిరిజనుల సమస్యల పరిష్కార వేదిక కోసం ప్రత్యేకంగా దర్బార్‌ను ప్రారంభించింది. గిరిజనుల చెంతకు అధికారులు,ప్రజా ప్రతినిధులే వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని అప్పటి ప్రభుత్వం సూచించింది.యధావిధిగా 72 ఏళ్ళ నుంచీ ఏటా గిరిదర్బార్‌ జరుగుతూ ఉంటుంది’’
తెలంగాణాలోని ప్రసిద్ధ ఆదివాసీ యుల క్షేత్రాలలో కేస్లాపూర్‌ ఒకటి.చరిత్ర రిత్యా, పౌరాణిక రిత్యా కూడా ఇదొక పవిత్ర క్షేత్రం. ఇది ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలం లోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉన్న మెస్రం వంశానికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇచ్చట ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయం.ఆదివాసీలు పుష్యమాసాన్ని పరమ పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ పుష్య మాసంలోఇచ్చట ప్రతి సంవత్సరం అతి పెద్ద జాతర జరుగుతుంది. ఈజాతర అమావాస్య రోజున ప్రారంభమవు తుంది.ఇది తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతరగా చెప్ప వచ్చు. లక్షల మంది జనసం దోహం మద్య అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు జరిగే ఈ ఆదివాసీల కుంభ మేళాకు భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అదివాసీ భక్తులు,మెస్రం వంశీయులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.
రూ.ఐదు కోట్లతో ఆలయం కట్టించారు
మెస్రం వంశస్తులు నాగోబాను తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు. నాగోబాను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని వీరి నమ్మకము. భారత దేశానికి స్వాతంత్య్రం రాకంటే పూర్వం నిజాం ప్రభుత్వకాలంలో తొలి సారిగా కేస్లాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న ఒక పుట్ట వద్ద 1942లో ఒక గుడిసెను నిర్మించి నాగోబా పూజలు చేయడం ప్రారంభిచారు.1956లో తొలి సారిగా నాగోబా దేవుడికి చిన్నగా గుడి కట్టారు.1995 లో సిమెంట్‌ ఇటుకలతో ఒక ఆలయాన్ని నిర్మించారు. కాలానికి అనుగు ణంగా ఆలయాన్ని భక్తుల తాకిడి,పెరిగే కొద్ది ప్రజాప్రతినిధులు,అధికారులు ప్రభుత్వ సహాకా రంతో 2000 లో ఆలయనిర్మాణం చేశారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌ గడ్‌,ఒడిషా మొదలగు రాష్ట్రల నుండి మెస్రం వంశస్తులతో పాటు ఆదివాసీలు,భక్తులు భారీ సంఖ్యలో నాగోభాను దర్శించు కోవడం జరుగు తుంది. మెస్రం వంశీ యుల కుటుంబాల సంఖ్య పెరగడం,వీరు ప్రతిసంవత్సరం సభలు సమా వేశాలు నిర్వహించి దేవాలయానికి సంబంధిం చిన ఆలయ నిర్మాణం గురించి 2011లో సంకల్పం పన్నారు.ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులను ఆలయ పీఠాధిపతి గ్రామ పటేల్‌ మెస్రం వేంకట్‌ రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా సరికొత్త ఆలోచనతో ఒక విశాలమైన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయా నికి వచ్చారు. ఇందుకోసంప్రతి మెస్రం ఇంటి నుండి ప్రతి సంవత్సరం ఐదు వేలు చోప్పున, ప్రభుత్వ ఉద్యోగులనుండి పది నుండి పదిహేను వేలు, సర్పంచులు జడ్పీటీసిలు, యంపీ టీసిలు, మండల అధ్యక్షులు ఇలా ప్రజా ప్రతినిధుల నుండి ఏడు వేలు చోప్పున ఇలా ఐదు సంవత్సరాలు చందాలు వసూలు చేసి నిధులు సమకూర్చారు. దాదాపు రూ.5 కోట్ల డబ్బులు జమచేసి 2017లో నాగోబా, సతీదేవత ఆలయ నిర్మాణం ప్రారంభించారు.
ప్రణాళికాబధ్ధంగా పనులు ప్రారంభం
దేశ చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం ఉండాలని కలలు కన్నారు సాకారం చేశారు.ఆధునిక సౌకర్యాలు,ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. నగరాల నుండి గ్రానైట్‌ రాళ్ళు తీసుకోవచ్చారు.నాగోబా ఆలయల నిర్మాణానికి, ఇంజినీర్లతో, తయారీ దారులతో సమావేశమై వారి సలహాలు సూచనలను పాటించారు. ఆలయానికి రాయిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించారు. ఆలయం చుట్టూ ప్రాకారం నాలుగు దిక్కులా గుడి రాజగోపురాల నిర్మాణం చేశారు. మండపం లోని ప్రతి రాతిస్థంభాలపై గోండ్వానా రాజ ముద్రను చెక్కిం చారు.ఆదివాసీల,ఆచార వ్వవహారాలను అబ్బుర పరిచే రితీలో అద్భుతమైన శైలిలో రాతి స్థంభాలను చెక్కించారు.నాగోబా విగ్రహాన్ని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ప్రాంతంలో లభించే ప్రత్యేకమైన శిలతో తయారు చేయించారు. ఆలయ గర్భగుడి ప్రధాన ముఖద్వారానికి ఇరువైపులా రెండు పాములు కలిసి ఏడు తలలు ఉండేలా చెక్కారు.
ఇలా ఆధునాతున హాంగులతో ఆలయాన్ని నిర్మించారు.ఆలయప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తిర్చిదిద్ది ఆలయం గోడలపై‘‘జై లింగో జై జంగో,’’జై గోండ్వానా’’ జై సేవా’’జై పెర్సాపేన్‌’’ చిహ్నాంతో అందంగా చెక్కిదిద్దారు, ప్రాంగణంలో ధ్వజస్థంభం,కోనేరు ఏర్పాటు చేశారు.గర్భగుడి ముఖ ద్వారానికి ఆంగ్ల అక్షరాలతో గోండిభాషలో దీనఖ్‌Gూుజు ునAవీఖచీ జుణపIR ూAణI్‌ఖRA హూునఖచీ దీన్‌ూఖR వీAజనహూ ఆని రాయించారు.తమ సంస్క్రతి సంప్రాదాయాలు చరిత్రను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మాణం గావించారు. టేకు కట్టెలతో నాగోబా ప్రచార రథం చాలా అందంగా అద్భతంగా తయారు చేసి ప్రచారం ప్రారంభించారు.భక్తుల సౌకర్యం కోరకు మరుగుదొడ్లు,స్నానపు గదులు నిర్మాణం చేశారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది.
నూతన ఆలయ ప్రారంభోత్సవం,విగ్రహ పునః ప్రతిష్ఠాపన
ఆదివాసీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన నాగోబా ఆలయం ప్రారంభోత్సవ వేడుకకు ముస్తాబైంది.సర్వాంగ సుందరంగా తయారైన ఆలయంలో నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని 2022 డిసెంబర్‌ నెల 12 నుండి 18 వరకు మొత్తం ఏడు రోజులు పాటు వేడుకలు తమ ఆచారా సాంప్రదాయం ప్రకారం ఆదివాసీ వేద పండితులు అయిన కొడప వినాయిక్‌ రావు మహారాజ్‌,పురుషోత్తం మహారాజ్‌ సమక్షంలో మంత్రోచ్చారణలతో నవగ్రహ పూజలు చేసి గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కలశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు సోయం బాపూరావు,జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌,కలెక్టర్‌ సిక్తా పట్నాయిక్‌ ఐఎఎస్‌,ఐటీడీఏ ప్రాజెక్టు ఆధికారి వరుణ్‌ రెడ్డి ఐఎఎస్‌,ఆసిఫాబాద్‌ శాసన సభ్యులు ఆత్రం సక్కు,చైర్మన్‌ కోవాలక్ష్మీ,మాజీ మంత్రి గోడం నగేష్‌,ఐటీడీఏ చైర్మన్‌ కనక కల్కేరావుతోపాటు మెస్రం వంశీయులు, జిల్లా ప్రజాప్రతినిదులు,ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధానకార్యదక్షులు,ఆదివాసీలు పాల్గొన్నారు. ఎందరెందరో దేశ విదేశ చరిత్రాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది.ఏడు రోజులు కూడా భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి విజయ వంతంగా పూర్తి చేశారు.
జాతర ప్రారంభం
ఈ జాతర పుష్యమాసంలో ప్రారంభమై నెలవంక కనిపించే రెండో రోజున మెస్రం వంశానికి చెందినవారు కేస్లాపూర్‌ గ్రామంలో సమావేశం నిర్వహించి నాగోబా దేవుని మొక్కి ఆ తర్వాత సిరికొండ మండలంలోని ఎన్నో తరతరాల నుంచి అంటే తాత ముత్తాతల కాలం నుండి కుండలు తయారు చేసి ఇచ్చే కుమ్మరి వద్దనుండి కుండలు తయారు చేసుకొని రావడం వీరి ఆచారం.వారు కూడా నియమ నిష్ఠలతో ఒకే ఆకారం గల మట్టి కుండలు తయారు చెయ్యడం విశేషం.ఆ తర్వాత మెస్రం వంశస్తులు పూజ కలశంతో పవిత్రమైన గోదావరి జలాలను నియమ నిష్ఠలు పాటిస్తూ క్రమశిక్షణతో కాలినడకన జన్నారం మండలం లోని కలమడుగు సమీపంలోని అస్తీన మడుగు లో పూజ చేసి పూజ నీరు తీసుకొని ప్రయాణం సాగిస్తారు.
ప్రత్యేక నైవేద్యం
కేస్లాపూర్‌ గ్రామానికి చేరి మహా వటవృక్షము వద్ద భాజాబజంత్రీలతో వారి పూర్వీకులకు ఖర్మకాండలు నిర్వహించి నాగోబాదేవునికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు.మెస్రం వంశ ఆడపడుచులు,మహిళలు,అల్లుళ్ళు అందరు ఆలయాన్ని శుబ్రపరిచి పూజ నిర్వహించి పెళ్లిఅయిన వధువును పరిచయ కార్యక్రమం నిర్వహిస్తారు.దినినే భేటింగ్‌ అంటారు.
వంద కిలోమీటర్లు కాలినడక
మెస్రం తెగకు చెందిన కోడళ్ళు ఎడ్లబండి వెనుకాల కాలినడకన బయలుదేరుతూ వెదు రుతో తయారుచేసిన కొత్త గుల్లలో పూజా సామాగ్రి తీసుకుని బండి వెనుకాల కాలినడకన కేస్లాపూర్‌ చేరుకుంటారు.వీరు ముఖం నిండా తెల్లని వస్త్రాలతో ముసుగు ధరించి నాగోబా పూజలో పాల్గొంటారు. కలశంలో తీసుకువచ్చిన శుద్ధమైన గంగాజలంతో నాగోబా దేవుని, మరియు ఆలయాన్ని శుభ్రపరిచి సంగీత వాయిద్యా పరీకరాలైన డోలు, తుడుం,పిప్రే, కాలికోమ్‌,మొదలగు భాజాబజంత్రీలు వాయిస్తూ దేవుని ప్రత్యేక పూజలు చేసి నవధాన్యాలు, పాలు, బెల్లం మరియు కొత్త తెల్లటి వస్త్రాన్ని పుట్టపైన ఉంచి గ్రామ పటేల్‌,కటోడా, దేవారి, మరియు కోత్వాల్‌ మొదలైన వారు పూజ నిర్వహిస్తారు.అదే రోజు సాక్షాత్తూ నాగోబా దేవుడు ప్రత్యేక్షమవుతాడు అని ఆదివాసుల నమ్మకం.ఈ కార్యక్రమంలో మెస్రం వంశస్తుల తో పాటు,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్గఢ్‌,కర్నాటక, జార్ఖం డ్‌,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మొద లగు రాష్ట్రాలకు చెందిన గిరిజనులు, గిరిజనే తరులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
స్థల పురాణం
ఈ ఆలయ నిర్మాణం,నాగోబా విగ్రహానికి సంబందించిన కథ,పూర్వం మెస్రం వంశానికి చెందిన నాగాయి మోతి అనే ఒక రాణికి కలలో ఒక పాము వచ్చినీ కడపున జన్మిస్తానని చేప్పి అదృశ్యం అయ్యాడట.ఆమె గర్భం దాల్చి కొన్ని నేలల తర్వాత ఆమె కడపున నిజంగా పాము (నాగోబా దేవుడు) జన్మించడంతో ఆపాముకు తన తమ్ముడి కూతురు గౌరిదేవితో వివాహం జరిపించి ఆ తర్వాత అందరు కలిసి తీర్థ యాత్రకు గోదావరి వెళ్ళగా ఆ పాము మనిషి రూపంలో మారిందట. ఆశ్చర్య పోయిన గౌరి దేవి అచటి నుండి కేస్లాపూర్‌ చేరుకుందట. అంతలోనే మళ్ళి ఆ మనిషి పాము రూపంలో గౌరి దేవిని వెతుక్కుంటూ కేస్లాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న పుట్టలో వెళ్ళిపోగా ఆ గ్రామ స్థులు ఆపుట్టకు పూజలు చేయడం మొదలు పెట్టారట, అలా మెస్రం వంశస్తులే అప్పటి నుండి ఆలయానికి ధర్మకర్తలుగా వుంటూ ఆలయాన్ని అభివృధ్ధి పరిచి పూజలు నిర్వహి స్తున్నారు.
కేస్లాపూర్‌లో దర్బార్‌
1941 సంవత్సరం నిజాం నవాబు కాలం నుండి ఆదివాసుల సమస్యలు-వాటి పరి ష్కారాల మీద కేస్లాపూర్‌ లో దర్బార్‌ నిర్వహిస్తు వస్తున్నారు, కాని గత 2019 సంవత్సరం నుండి కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో గిరిజన దర్బార్‌కు కళ తప్పింది. నిజాంనవాబు 1941లో ఆదివాసుల స్థితిగ తులు వారి సమస్యలను పరిష్కరించాలని ఇంగ్లాండ్‌ కు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌ డార్ఫ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించింది. ఆదివాసుల చారిత్రక విశేషాలను అధ్యయనం చెయ్యా లనుకున్న పరిశోధకులు,చరిత్ర నిపుణులు, ఉన్నతస్థాయి అధికారులు, విదేశీయులు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి నాగోబా దేవుని పూజా నిర్వహిస్తారు.శతాబ్దం నాటి పౌరాణిక ప్రమాణాలను బట్టి కేస్లాపూర్‌ నాగోబా దేవుని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తున్నది.కేస్లాపూర్‌ నాగేంద్రుడి పూజ అనంతరం మెస్రం తెగవారు ఉట్నూర్‌ మండలంలోని శ్యాంపూర్‌ కు చేరుకొని నందిశ్వరుని(బోడుందేవుడు) పూజ నిర్వహించి, తిరిగి కేస్లాపూర్‌ చెరుకోని అక్కడి నుండి వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు.ఈ ఆదివాసుల జాతరతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నార్నూర్‌ మండలోని ఖాందేవుని జాతర,బేల మండలం సదల్‌పూర్‌లోని భైరం దేవుని జాతర,తిర్యాని మండలంలోని దంతన్‌ పల్లి భీమ్యక్‌ జాతర, మందమర్రి మండలంలోని బొక్కలగూడ కోవామొకాషీ జాతర,సిర్పూర్‌ (యు) మండలంలోని మహాదేవుని జాతర , కెరామెరి జాతర మొదలగు జాతరలకు నిలం మన ఉమ్మడి ఆదిలాబాదు.
ఎలా చేరుకోవచ్చు
ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ జిల్లా నుండి గుడిహత్నూర్‌ మీదుగా బస్సులో లేదా ప్రయివేటు వాహానాలలో ముత్నూర్‌ చేరుకోవాలి. మంచిర్యాల,ఆసిఫాబాద్‌ జిల్లా వాసులు బస్సులో గాని ప్రయివేటు వెహీకిల్‌ లోగాని ఇంద్రవెల్లి మీదుగా ముత్నూర్‌ చేరుకోవాలి ముత్నూర్‌ నుండి కేస్లాపూర్‌ నాగోబా దేవాలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక, ఉపన్యాసకులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇంద్రవెల్లి ఆదిలాబాద్‌)`9491467715.-రాథోడ్‌ శ్రావణ్‌

5వ షెడ్యూల్‌లో నాన్‌ షెడ్యూల్డ్‌ ఆదివాసీలకు దిక్కేది?

వజ్రోత్సవ భారతావనిలో సమస్త ప్రజా నీకం అభివృద్ధి పేరుతో ముందుకు సాగు తుంటే రాజ్యాంగ రక్షణలు ఉండి అమలుకు నోచుకోని ఆదివాసీలు మరోపక్క అటవీ ఫలసాయంపై నిర్బం ధాన్ని ఎదుర్కొంటూ దుర్భర జీవితాన్ని గడుపుతు న్నారు. స్వాతంత్య్ర ఫలాలకు సుదూరంలో 5వ షెడ్యూల్డు హోదా పొందని ఆదివాసీ గూడేలు ఉమ్మడి రాష్ట్రంలో 805 దాకా ఉన్నాయి. అసలు వీరి జీవనానికి భరోసా ఏది? వీరికి కనీస హక్కు లేమిటి?వీరిపై పాలకులు వైఖరేమిటి ? ప్రజాస్వా మిక పాలనలో వీరికి ఏపాటి న్యాయం జరుగు తోంది? అనేవి సమాధానం లేని ప్రశ్నలు.- గుమ్మడి లక్ష్మీ నారాయణ
వాళ్లంతా గిరిజనులు.రాజ్యాంగపరం గా గుర్తింపుపొందినాసరే..వాళ్లకు ఏజెన్సీలోఉన్న రాయితీలు అందడంలేదు.కనీసంరిజర్వేషన్లు కూడా వర్తించడంలేదు. అభివృద్ధి విస్తరణలో తమ హక్కు ల్ని కోల్పోతున్న గిరిపుత్రుల దుస్థితి ఇది.గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నా,కొన్ని గ్రామాలు ప్రభుత్వ రికా ర్డులలో నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాల్లో నమోదై ఉం డటమే దీనికి కారణం.రాజ్యాంగంలో ప్రత్యేక హక్కు లున్నా,ఇలా ప్రభుత్వ రికార్డుల కారణంగా గిరిజ నులు ఆహక్కులను,చట్టాల నుంచి రక్షణను కోల్పో తున్నారు.మరి,కొన్ని గ్రామాలు ఏజెన్సీ ఏరియా రికార్డుల్లో ఎందుకు లేవు ?ఎవరు తొలగించారు, ఎందుకు తొలగించారు?
ఏజెన్సీ, షెడ్యూల్డ్‌ ఏరియా అంటే…
బ్రిటిష్‌ పాలనలో…గిరిజన తెగలు నివసించే అటవీ ప్రాంతాల్లో పరిస్థితులు,ఆచారా లు భిన్నంగా ఉన్నందున..కొండల్లో ఉండే గ్రామా లను షెడ్యూల్డ్‌ (నిర్దేశిత,ప్రత్యేక) ఏరియాలుగా పేర్కొన్నారు.అందుకోసం ూషష్ట్రవసబశ్రీవస ణఱర్‌తీఱష్‌ం Aష్‌-1874 అమల్లోకి తెచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి నియమితులైన ప్రభుత్వ ఏజెంట్‌ పర్యవేక్ష ణలో ఈ ప్రాంతాల్లో పరిపాలన జరిగేది. ఏజెంట్‌ పరిపాలనలో ఉన్న ప్రాంతాలు కావడంతో ఏజెన్సీ గా పిలవడం మొదలైంది. ఇప్పటికీ అదే పేరు కొనసాగుతోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజనగ్రామాలను అయిదో షెడ్యూ ల్‌లో చేర్చారు. అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసం ఉండే గ్రామాలను నాన్‌-షెడ్యూల్డ్‌ ఏరియాలు అం టారు.
2011జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 59,18,073 మంది గిరిజనులు ఉన్నారు.రాష్ట్ర జనాభాలో 6.6శాతం.షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసించే తెగలు 30.మైదాన ప్రాం తాలలో నివసించే తెగలు 5కలిపి మొత్తంగా 35 ఉన్నాయి. గిరిజనులలో 70శాతం మంది షెడ్యూ ల్డ్‌ ఏరియా ప్రాంతంలో నివసిస్తుండగా,మరో 30 శాతంమైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు. రాష్ట్రం లోని షెడ్యూల్డు ప్రాంతం31,485చ.కి.మీ. రాష్ట్రా లల్లోని ఉమ్మడి జిల్లాలపరిధిలో ఆదిలాబాద్‌, విజ యనగరం,వరంగల్‌,ఖమ్మం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,విశాఖపట్నం,శ్రీకాకుళం, మహ బూబ్‌ నగర్‌ (9)జిల్లాల్లోని 107మండలాల్లో షెడ్యూల్డ్‌ ప్రాంతము విస్తరించి యున్నది. వీటిలో 46మండలాల్లో పూర్తిగాను,61మండలాల్లో పాక్షి కంగాను ఆదివాసీలు నివసిస్తున్నారు. ఇందులో 5,948 గ్రామాలు రాష్ట్రపతి గెజిట్‌ లో గుర్తించబ డినవి. ఇంకా నాన్‌-షెడ్యూల్డు గ్రామాలుగా మిగిలి నవి 805. వీటికి షెడ్యూల్డ్‌ గుర్తింపు లేదు.1950 రాజ్యాంగ గెజిట్లో షెడ్యూల్డు గ్రామాలను గుర్తించే ప్రభుత్వ అధికారులు దట్టమైన అటవీ ప్రాంతా లలోకి వెళ్ళేమార్గం లేక గుర్తించలేదు. అది ఒక కారణమైతే, సాంకేతికలోపంగా భావించిన ప్రభు త్వం1980 దశకంలో అప్పటి ప్రభుత్వం గిరిజన జిల్లాల్లో సర్వేచేయించింది. ఆసర్వే ప్రకారం మిగిలిన గ్రామాలు
జిల్లాలు నాన్‌-షెడ్యూల్డు గ్రామాలు
ఆదిలాబాద్‌ 164
విజయనగం 170
వరంగల్‌ 87
ఖమ్మం 18
తూ.గోదావరి 44
ప.గోదావరి 10
విశాఖపట్నం 55
మహబూబ్‌ నగర్‌ 18
శ్రీకాకుళం 240
మొత్తం 805
ఈ 805 గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చమని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఫైలు పంపిం చినప్పటికీ ఆమోదం పొందలేదు. ఇలా 72 ఏళ్ల నిరీక్షణలో..రాష్ట్రంలో 78.24శాతం గ్రామాలకు నేటికి కరెంటు సౌకర్యం లేదు.68.8 శాతం గిరిజన విద్యార్థులు ప్రాధమిక విద్యలోను, ఉన్నత విద్యలోను వెనుకబడి ఉన్నారు. షెడ్యూల్డు ఏరియా విద్యార్థుల అక్షరాస్యత శాతం పురుషులది 17% మహిళలది 8.68% గా వున్నది. నేటికి 90శాతం గిరిజనులు కనీస వసతి సౌకర్యాలు లేక జీవిస్తున్నారు. 49 శాతం గిరిజనులు పౌష్టికాహార లోపంతో జీవిస్తు న్నారు.65% గిరిజనులు దారిద్య్రపు రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఆదివాసీ మహిళలలో ప్రతి 1000 మందికి 80మంది ప్రసవ సమయంలో బిడ్డతో సహాతల్లి కూడా మృత్యువాత పడుతున్నారు. రాష్ట్రం లో ప్రసవ సమయంలో చనిపోయో మహిళల సగటు 3.65%గా వుంది. శిశు మరణాల రేటు రాష్ట్రంలో53శాతంగా వుండగా,ఒక్క ఆదిలా బాద్‌ ఏజెన్సీలోనే 63శాతంగా వుంది. రాష్ట్రంలో 90 శాతం మంది ఆదివాసీ గిరిజనులు రక్తహీన తతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో 9జిల్లాల్లో ఆదివాసీల అభివృద్ధికై సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐ.టి. డి.ఏ) లు పనిచేస్తున్నా నేటికీ నాన్‌-షెడ్యూల్డు గూడే లకు ఐ.టి.డి.ఏ.ల నుండి ఆర్థిక ఫలాలు అందక సతమత మౌతున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాణంలో దేశం లోని ఆదివాసీల సామాజిక పరిస్థితిని మెరుగు పరుచుటకు ప్రత్యేక పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో గిరిజనులు కోసం నిర్దేశించిన 5వషెడ్యూల్‌లో ప్రత్యేక విధివిధా నాలు, షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలన విధానం రాజ్యాం గంలో షెడ్యూల్డు క్రింద పేర్కొనబడిన రాజ్యాంగ అధికరణం 244 వివరిస్తుంది. గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి విషయాలపై సలహా లు ఇచ్చేం దుకు గిరిజన శాసన సభ్యులతో కూడిన సలహా మండలి ఏర్పాటు జరుగుతుంది.పార్లమెంటు లేదా శాసనసభ్యులు చేసే చట్టాలు ఏజెన్సీ ప్రాంతాలలో అమలు చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్‌కు అధి కారం ఉంటుంది.గవర్నర్‌ ఆమో దించిన నిబంధ నలు రాష్ట్రపతి ఆమోదంపై అమ లులోకి వస్తాయి. గవర్నరును సంప్రదించిన తరు వాత ఏప్రాంతా న్నైనా షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. అలా ప్రకటించక పోవడం వలన సుమారుగా రెండు లక్షలమంది ఆదివాసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ,సంక్షేమ అభివృద్ధి ఫలాలను పొందలేక పోతున్నారు.1939 సంవత్సరాల ముందు షెడ్యూ ల్డు ప్రాంత ఆదివాసీ గిరిజనులు ఎలాంటి పరిస్థితు లలో ఉండే వారో స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లకు కూడా నాన్‌-షెడ్యూల్డు ఆదివాసీలు అదే స్థితిలో వున్నారు.నాన్‌ షెడ్యూల్డు ఆదివాసీ గిరిజనులకు స్వాతంత్య్రం ఇంకా రాలేదేమో?వారికి రాజ్యాం గం ఇంకా అమలు కావలసి వుంది. షెడ్యూల్డు ఏరియాలలో గత31సం.లుగా 805 గ్రామాలలో రెండులక్షల మంది ఆదివాసీలు తమ హక్కుల గురించి పాలకుల దృష్టికి తెచ్చినా ఫలించడం లేదు. 2005లో ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు కమిటీ సూచనలు (74)ఆమోదిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జి.ఓ.నెం.1049సహితం నాన్‌-షెడ్యూల్డు గ్రామాలను షెడ్యూల్డు ప్రాంతంలో కలపాలనే చూపుతున్నాయి. ఇన్నాళ్ళుగా 5వ షెడ్యుల్డు సాధన కమిటి మరియు వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు,సంస్థలు ఒత్తిడి తేగా కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మేల్కొంది. 2001 జనాభా వివరాలు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఫైలును తిరిగి రాష్ట్రగిరిజన సంక్షేమశాఖకు తిరిగి పం పింది. ఈలోగా ఎన్నోసార్లు మంత్రి మండలి సమా వేశాలు జరిగాయి. కానీ మన ప్రతిపాదన మాత్రం కేబినెట్‌ మంత్రిమండలి ఆమోదానికి పెట్టడం లేదు. ఎందుకంటే 5వషెడ్యుల్డులోని నాన్‌ -షెడ్యూ ల్డు గూడెంలలో అపారమైన ఖనిజ సంపద బొగ్గు నిక్షేపాలు, అల్యూమినియం బాక్సైట్‌, సున్నపురాయి గ్రానైట్స్‌, ఇసుక మొదలగు ఖనిజ సంపదతో నిండి వున్నాయి. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదివాసీ గూడేలను షెడ్యూల్డు ప్రాంతంగా గుర్తించినట్లయితే 5వషెడ్యూల్డు ఏరియాలోని ఆది వాసులకు సర్వహక్కులు ఉంటాయి గనుక అక్కడి ఖనిజ సంపదను వెలికి తీయాలంటే ఫెసా చట్టం ప్రకారం ఆదివాసీలతో గ్రామసభ నిర్వహించి ఆ సభల తీర్మానం పొందిన తరువాతనే ఖనిజాలను వెలికి తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రాజ్యం నాన్‌-షెడ్యూల్డు ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతంగా గుర్తించడంలేదని అనుకోవచ్చు. ఆదివా సీల సంక్షేమం కోసం పాటుపడవలసిన ఈ రాజ్యం ఆదివాసీల మనుగడను పూర్తిగా అంతం చేసే విధంగా వ్యవహరిస్తుంది. అంటే ఆదివాసీ ప్రజా నీకం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంకాదా? వారి పట్ల ఈ రాజ్యాంగానికి ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు ? 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ప్రధానంగా భూమి సమస్య షెడ్యూల్డు ఏరియాలో అమలయ్యే 1/70 వంటి చట్టాలు ఉన్నప్పటికి ఈ ప్రాంతాలలో 7.50 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమై ఉన్నది.
షెడ్యూల్డు హోదాలేని ప్రాంతాలలో ఆదివాసీ భూముల పరిస్థితి అగమ్యగోచరం. ఈ చట్టం అమలులో లేనందున ఆదివాసీలు నష్టపో తున్నారు. కొన్ని వేల ఎకరాల భూములు భూస్వా ముల చేతులలోకి వెళ్ళినవి. భూవివాదాలు సివిల్‌ కోర్టు పరిధిలోకి వస్తున్నందున భూస్వాములు, ధనికులు, గిరిజనేతరులు అమాయక ఆదివాసీలను కోర్టుల చుట్టూ తిప్పుతూ ఆర్ధికంగా దివాళా తీయి స్తున్నారు. ఇక రెవెన్యూ, పోలీసుల గురించి చెప్పన వసరం లేదు.నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోని భూమి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి.
‘ముఖ్యమంత్రులే ఉల్లంఘిస్తున్నారు’
రాజ్యాంగంలో ఆర్టికల్‌244(1) ఆర్టికల్‌, అయిదవ షెడ్యూల్‌ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయని, అయితే వీటిని అమలు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు విఫలమయ్యారని ఉమ్మడిరాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శిగా పని చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌శర్మ అభిప్రాయపడుతున్నారు.గిరిజనుల హక్కులు,సంక్షేమం,నాన్‌షెడ్యూల్డ్‌ ఏరియాల అంశా లను ప్రస్తావిస్తూ…తెలంగాణా సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు. ‘‘ప్రాజెక్టుల విషయంలో పీసా,అటవీ హక్కుల చట్టాల కింద గ్రామసభలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రెండు ప్రభు త్వాలు గిరిజనులకు ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా రెండు రాష్ట్రాలలో ప్రైవేట్‌ వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు గిరిజనేతరులతో కుమ్మక్కు అవుతున్నట్లు కనిపిస్తున్నది.ఈ విష యా లను గుర్తించి,మీరు తగినచర్యలను తక్షణమే తీసు కుంటారని ఆశిస్తున్నాను’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

  1. నిరుపేదలకు చెందవలసిన‘డి’పట్టాలు, ధనికులు భూస్వాములు పొందుతున్నారు.
  2. బంజరు భూములను ధనికులే ఆక్రమించు కుంటున్నారు.
  3. గిరిజనుల నుండి గిరిజనేతరుల చేతుల్లోకి పోతున్న క్రమం తనాఖా-స్వాధీనం ‘‘డి’’ పట్టా భూములు
  4. ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్నా పట్టాలు రాని భూములు.
  5. గిరిజనులకు పట్టాలు మంజూరైనా భూములు అప్పగించని కేసులు.
  6. గిరిజనుల పేరున ఇతరులు అనుభవిస్తున్న (సీలింగ్‌ బంజరు) భూములు.
  7. ఒక గిరిజనుడు సాగు చేస్తుండగా వేరొకరికి పట్టాలు మంజూరైన కేసులు.
  8. గిరిజనేతరుల భూములను సాగు చేస్తున్నా వర్తించని సాగు కౌలు హక్కులు.
  9. జిరాయితి భూమి సాగు చేస్తున్న రెవెన్యూ రికార్డులకు ఎక్కని గిరిజనులు.
  10. గిరిజనేతరులు తప్పుడు ఇంజక్షన్‌ డిక్రీలు తెచ్చి భూముల నుండి గిరిజనులను దౌర్జన్యంగా వెళ్లగొట్టేసే కేసులు.
  11. సర్వే స్టేట్మెంట్‌ వివాదాలు
    ఇలా చాలాభూవివాదాలు,నాన్‌-షె డ్యూల్డు గ్రామాలలో ఉన్నాయి. వీటిని పరిష్కరిం చుకోవాలంటే కోర్టు, రెవెన్యూ, పోలీస్‌ శాఖలపై అవగాహన ఉండాలి. ఇవేవి ఆదివాసీలకు తెలియ నందున గిరిజనేతరుల ఆధిపత్యం కొనసాగు తున్నది. భారత రాజ్యాంగంలో 5వషెడ్యూల్డు (1) పేరా ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాలన్నీ స్థానిక ఆదివాసీలచే భర్తీ చేయాలనిజి.ఓ.నెం.275 ను 1986లో తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవరిస్తూ 2000లో జనవరి 10న జి.ఓ.నెం.03 ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగా లన్నీ స్థానికఆదివాసీలకే రిజర్వు చేయబడుతు న్నాయి. కానీ నాన్‌-షెడ్యూల్డు ఏరియా ఆదివాసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో అన్యాయం జరుగు తోంది. విద్య,ఉద్యోగ అవకాశాలు లేక ఆదివా సీలు నిరాశ్ర యులవుతున్నారు.కాగాఈ జీవో 3 గిరిజనేత రుల కారణంగా 2020ఏప్రిల్‌ 20నుంచి సుప్రీం కోర్టులో స్టే విధించ బడిరది.
    అధికరణలు330,332,334 ప్రకారం పార్లమెంటు నుండి క్రింది స్థాయి వార్డు సభ్యుల వరకు షెడ్యూల్డు ఏరియాలో ఆదివాసీలకే చెందు తాయి. కానీ, నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోని వీరు పరుల పాలనలో మగ్గుతున్నారు. వీరు ప్రత్యేకమైన సంస్కృతి,ఆచార,సంప్రదాయాలు, జీవన విధానం కలిగినను స్థానికేతరుల పాలనలో దోపిడికి గురౌ తున్నారు. కేవలం అటవీ ఫలసాయం, పరస్పర వస్తు మార్పిడితో సహజీవనం సాగించే ఆదివా సీలు నేటికి నాన్‌-షెడ్యూల్డు ఏరియాలలోఉండడం, సవరించిన చట్టాల వల్ల అటవీ అధికారుల దౌర్జ న్యాలు పెరుగుతున్నాయి. అటవితల్లి గుండెల్లో జీవించే ఆదివాసులకు బతుకు భారం అవుతుంది. వారు షెడ్యూల్డు ఏరియా హక్కులకు నోచుకొనేది ఎప్పుడు?కనీసం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా సంఘాలు, మానవ హక్కుల, పౌరహక్కుల సంఘా లు, ప్రధాన ప్రతిపక్ష, రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు దీనినిగూర్చి మాట్లాడే పరిస్థితి లేదు. షెడ్యూల్డు హోదాకోసం నాన్‌-షెడ్యూల్డు ఏరియా గ్రామాల ఆదివాసీలు సంఘటితమై మరో చారిత్రక పోరాటానికి సన్నద్ధంకాకపోతే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకమే!-
    వ్యాసకర్త : ఆదివాసీ రచయితల వేదిక,సెల్‌ : 9491318409

ధరల మోత

దేశంలో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ధరల భారాన్ని మోయలేక పోతున్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజల్‌ ధరల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిరదిం. దీనికితోడు చమురు కంపెనీలు గ్యాస్‌ ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. మే డే కానుకగా వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ బండపై 104 రూపాయలను వడ్డించింది.19 కేజీల వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై ఈభారం మోపింది. నెలవారీ సమీక్షలో భాగంగా,ఒకేసారి 104 రూపా యలను పెంచేసింది. దీంతో నగరం లో కమర్షియ ల్‌ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2563కు చేరింది.గతంలో దీని ధర రూ.2460గా ఉండేది. ఇక దేశ రాజధాని ఢల్లీిలో ఈ ధర రూ.102.05 పైసలు పెరగడంతో సిలిండర్‌ రూ.2355కు చేరుకుంది. అలాగే, ముంబైలో రూ.2329.50 గాను, కోల్‌కతాలో రూ.2477.50గాను, చెన్నైలో రూ.2508కు చేరుకుంది.
సామాన్యులపై పెనుభారం
ఒకటి కాదు రెండుకాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి%ౌౌ% ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. సంపాదన అంతంత మాత్రంగానే ఉండటం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కొనేదెలా, తినేదెలా అంటూ తలలు పట్టుకుంటు న్నారు.. రెక్కలు ముక్కలు చేసుకున్నా కుటుంబానికి మూడుపూటల భోజనం పెట్టే పరిస్థితులు కనిపిం చడం లేదు.. గ్యాస్‌నుండి మొదలుకుని విద్యుత్తు చార్జీలు, పెట్రో ధరలు. నిత్యవసర వస్తువుల ధర ఇలా చెప్పుకుంటూపోతే లీస్టు పెద్దదిగానే ఉం టుంది. ధరల పెంపు మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే తమ కుటుంబానికి మూడుపూటలతిండి పెట్రో పరిస్థి తులు.. అదే ఒకరే పనిచేస్తే వారి కష్టాలు చెప్పనక్కర లేదు.
మరో కొన్నిరోజుల్లో విద్యుత్తు చార్జీల మోత..
మరో కొన్ని రోజుల్లో విద్యుత్తు చార్జీల మోతమోగనుంది. ఏప్రిల్‌ 1వ తేదీనుండి చార్జీలు పెంచుతూ విద్యుత్తు రెగ్యులరేటరీ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఉగాదిపండగకు ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి. గృహ కనెక్షన్లకు సంబం ధించి యూనిట్‌పై 50పైసలు వాణిజ్య సంస్థలపై యూనిట్‌పై రూపాయి చొప్పున భారం మోపను న్నారు.అసలే వేసవి కాలం కావడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్యాన్లు, కూలర్లు వినియోగిస్తుండగా ధనవంతులు మాత్రం ఏసీలు వినియోగిస్తున్నారు. ఎండలు ముదరడంతో వీటి వినియోగం పెరిగింది. అసలే ఎండకాలంలో విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తాయి. దీనికితోడు పెంచిన చార్జీలు జతకా వడంతో బిల్లుల మోత మోగనుంది. పెంచిన విద్యు త్తు చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీనుండి అమలులోకి రానుంది. ఉగాది పండగ కంటే ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి.
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు..
నాలుగుమాసాలపాటు పెట్రో ధరలు పెరగలేదు. అందరూ హమ్మయ్యా అని ఊపిరిపీల్చు కున్నారు.దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యం లో పెట్రో ధరలు పెంచలేదనే విమర్శలు ఎదుర్కొం టోంది కేంద్రం. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వరుసబెట్టి పెట్రో ధరలు పెంచుతోంది. ఏడురోజు లుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏడురోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.4 పైనే భారం పడుతోంది. తాజాగా సోమవారం రోజు లీటర్‌ పెట్రోల్‌పై 50 పైసలు వడ్డించారు. డీజిల్‌పై 35 పైసల భారం మోపారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌కు రూ.112.71కిచేరగా డీజిల్‌ లీటర్‌కు రూ. 99. 07 చేరింది. పెట్రోధరలు ఇలాగే పెరిగితే మాత్రం రెండుమూడురోజుల్లో డీజిల్‌ధరలు సెంచరీ దాటి పోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామా న్యులపై పెట్రో భారంఎక్కువగా కనిపిస్తోంది. నేడు అందరి వద్ద ద్విచక్రవాహనాలు ఉన్నాయి. మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా కార్లు వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాత కార్ల కొనుగోలు ఎక్కువగా జరిగింది. ద్విచక్ర వాహనం డబ్బులకు పాత కారు రావడంతో చాలామంది కార్లు కొనుగోలు చేశారు. వీరందరిపై భారం పడుతోంది. గతంలో మాది రిగా రోజురోజుకు పెట్రో వడ్డన చేస్తుండటంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. ఇదేమి భారమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏడురోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రేకు పడుతుందనే నమ్మ కంతో ప్రజలున్నా ఇప్పట్లో సాధ్యమయ్యే అవకా శాలు లేవనే ప్రచారం కూడా సాగుతోంది.
నిత్యవసర వస్తువుల ధరల పెంపు..
నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పప్పులు నూనె ధరలు ఒక్క సారిగా పెరిగిపోయాయి. ఎక్కువగా వినియోగించే వస్తువుల ధరలు పెరిగిపోవడంతో వెనకా ముందుచూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో నూనెప్యాకెట్‌ రూ.210 దాటిపోయింది. విడతల వారీగా కాకుండా ఒకేసారి ధర పెరగడంతో ఇబ్బందిపడాల్సిన పరిస్థి తులు నెలకొన్నాయి. గ్యాస్‌ ధరలతోపాటు నూనె ధరలు కూడా పెరిగిపోవడంతో మహిళలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నూనె ధరలే కాకుండా ఇతర నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపో యాయి. కరోనా సీజన్‌ ప్రారంభమైన తరువాత నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. పెరుగుతూ పోతున్నాయి తప్పిస్తే ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల ధరలు మరింతగా పెరిగి పోయాయి. నూనె ధరలు సలసల మరుగుతుం డటంతో వెనకాముందు చూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతోపాటు చికెన్‌ ధరలు కూడా పెరిగిపో యాయి. వేసవి కాలంలో చికెన్‌ ధర రూ.200 లోపే ఉండేది.. ప్రస్తుతం రూ.280నుండి రూ. 300 వరకు ధర పలుకుతోంది.
ఆర్టీసీ బాదుడే బాదుడు
నాలుగేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. కనీస చార్జీని రూ.5 నుంచి రూ.10కు చేశారు. గతంలో కనీస చార్జీని రూపాయి లోపు పెంచేవారు. చిల్లర సమస్య లేకుండా ఉం డేందుకు కనీస చార్జీని రెట్టింపు చేశామని చెప్పిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఉదాహరణకు గన్నవరం నుంచి విజయవాడ వచ్చే పల్లె వెలుగు బస్సులో 2019లో చార్జీ రూ.20 ఉండేది. ఇప్పుడు రూ.35 కు పెంచారు. సిటీ ఆర్డినరీ బస్సులో 2019లో రూ.25గా ఉన్న చార్జీని రూ.40కు పెంచారు. ఇలాజనాల జేబుల్లో నుంచి అదనంగా రూ.1500 కోట్లు లాగేస్తున్నారు.
ఇసుకలోనూ దోపిడీ
గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇచ్చింది. వాహనాల అద్దె ఖర్చు మాత్రం భరిం చాల్సి వచ్చేది. ఇప్పుడు ఇసుకను కోట్లు కొల్లగొట్టే వ్యాపారంగా మార్చేశారు. ప్రస్తుతం ఇసుక రేటు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. పల్నాడు జిల్లా సర్సరావుపేటలో టన్ను ఇసుక ధర రూ.800 వరకు ఉంది. రవాణా ఖర్చులు అదనం. వైసీపీ పెద్దలు జిల్లా వారీగా కాంట్రాక్టుకు ఇచ్చి దోచుకుం టున్నారనే ఆరోపణలున్నాయి.
పప్పు, పంచదార కట్‌
కేరళ ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా14రకాల నిత్యావసరాలను పంపిణీ చేస్తోం ది.ఉప్పు,పప్పు,చింతపండు,మిరపకా యలు కూడా ఇస్తోంది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం పండ గొస్తే రేషన్‌ దుకాణాల ద్వారా నెయ్యి, బెల్లం సహా 14 రకాల వస్తువులు పంపిణీ చేసేది. జగన్‌ సర్కార్‌ వచ్చాక పరిస్థితి మారిపోయింది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ను కేవలం అప్పుల కోసం వాడు కుంది. పేదలకు చౌకధరకు బియ్యం, ఇతర వస్తు వులు అందించడానికి ప్రభుత్వం ఏటా ఆ కార్పొ రేషన్‌కు రూ.3,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా సబ్సిడీ సొమ్ము ఇవ్వలేదు.పైగా కార్పొరేషన్‌కు గ్యారెంటీ ఇచ్చి, ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్ల రుణం తీసుకుంది. ఇప్పుడు దాని ద్వారా అప్పులు చేసే అవకాశం లేకపోవడంతో పూర్తిగా వది లేసింది. రేషన్‌లో ఇచ్చే పప్పు, పంచదారను 75 శాతం మేర జగన్‌ ప్రభుత్వం ఆపేసింది. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు, కార్మికులతో పాటు చిరుద్యోగులు, మధ్యతరగతి వర్గాల వారికి ధరలు భారంగా మారాయి. నలుగురు సభ్యులున్న చిన్న కుటుంబానికి పాలు, పెరుగు, కిరణా సరుకులు, కూరగాయలు, బియ్యం తదితర నిత్యావసరాలకు గతంలో నాలుగేళ్ల క్రితం రూ.6 వేలు ఖర్చు కాగా.. ఇప్పుడు రూ.10 వేలు దాటిపో తోంది. రూ.500పెట్టి కూరగాయలు కొంటే వారం రోజులు కూడా రావడం లేదని జనం వాపోతు న్నారు. ఇక వంట గ్యాస్‌, ఇంటి అద్దె తదితరాలు కలిపితేఖర్చు తడిసి మోపెడవుతోంది. గృహ అవస రాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌ సిలిండరు ధరరూ.1200కు చేరువైంది.దీంతో నెలవారీ ఇంటి బడ్జెట్‌ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దేశంలోనూ ఇదే పరిస్థితులు
ఈ ధరాభారం మోయలేక సామా న్యుల నడ్డి విరుగుతున్నది. అసలు ధరలు ఆకాశాన్ని ఎందుకు అంటుతున్నాయన్నది మీ మధురస్వరం నుండి వినాలన్న సామాన్యుల ఎదురు చూపులు ఫలించేదెన్నడు? సంవత్సరానికి ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లోకి వేస్తామన్న రూ.1.5 లక్షలు, వ్యవసాయాన్ని రెండిరతల లాభం వచ్చేటట్లు చేస్తానన్న ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదంటే ఈ మాటలు మీ మనుసులో నుండి వచ్చినవి కావా ? దేశాన్ని విశ్వగురువును చేస్తానన్నారే! అలాంటిది ప్రపంచ ఆహార సూచిక లో 101వ స్థానానికి చేరి జనం పెడుతున్న ఆకలి కేకలు, పెరిగిపోతున్న నిరుద్యోగం,దేశం వంద లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన వైనం… ఇవేవీ మీ మనసులోని మాటల జాబితాలో స్థానం సంపా దించుకోలేదే ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమం ఈ ఏప్రిల్‌ 30 నాటికి 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుం టుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నాయకు డూ ఇలాంటి గొప్ప ప్రయోగం చేయలేదని బిజెపి అనుకూల మీడియా,ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల మేధా వులు కీర్తి ప్రవచనాలు చేస్తున్నారు. టి.వి చర్చల్లో పాల్గొంటున్న పాలక అనుకూల పారాయణులు యథాశక్తి తమ పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తన మనసులోని మాట చెబుతున్నారా అనే సందేహం ప్రతి భారతీయుడిలో (అదానీ, అంబానీ లాంటి వారు మినహా) కలుగుతుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా మీడియా సమావేశం జరపలేదు కాబట్టి. ఎన్నికల ముందు చెప్పింది, నేడు చేస్తున్నది వేరు కాబట్టి. తొమ్మిదేళ్ల నాడు చెప్పినదానికి, చేసినదానికి పొంతన లేదు కాబట్టి. ప్రధాని మనసులో మాటను ప్రజలు వినడం కాదు, దేశ ప్రజల మనసులో మాటను ప్రధాని వినాలి.
బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో విజయదశమి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత వుంది. ఆ రోజున ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సరిగ్గా అలాంటి విజయదశమి నాడు 2014 అక్టోబర్‌ 3న ‘ప్రధాని మనసులోని మాట’ కార్యక్రమాన్ని మోడీ ప్రారం భించారు. అంటే ఇది పక్కాగా ఆర్‌ఎస్‌ఎస్‌ మనసు లో నుండి పుట్టిన కార్యక్రమం. ఇప్పటి వరకు ప్రధాని మాట్లాడిన 99 ఎపిసోడ్‌లలో అనేక చిన్న చిన్న విషయాలను కూడా మహా నాటకీయంగా చెప్పారు.కర్ణాటకలో సులగిట్టి నరసమ్మ మంత్ర సానిగా ఎందరో గర్భిణీలకు సేవలందించిన విషయం గురించి ప్రధాని మన్‌ కి బాత్‌లో చెబు తుంటే… పేదలకేమో మంత్రసానులు, సంప న్నులకు కార్పొరేటు ఆసుపత్రులు అన్న మీ నీతి అర్థంకాలేదు. విజయనగరం జిల్లాలోని ద్వార పూడి పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు రాత్రిపూట చదువు చెబుతున్న విషయం చెబుతుంటే నూతన విద్యావిధానం పేరుతో అత్యధికమంది పేదలను చదువులకు దూరం చేసే ఎత్తుగడ మీ మనసులో వుందని అనుకోలేదు. న్యూజిలాండ్‌లో ఎంపీగా ఎన్నికైన గౌరవ్‌ శర్మ అనే ప్రవాస భారతీయుడు సంస్కృతం లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం పలుకు తుంటే రానున్న రోజుల్లో ప్రాచీనకాలం నాటి వేదాధ్యయనం తప్పనిసరి చేస్తారని గుర్తించలేక పోయాము. ఆసియాలో తొలి మహిళా లోకో పైలట్‌ సురేఖ యాదవ్‌ గురించి చెప్పినప్పుడు గుజరాత్‌లో బిల్కిస్‌ బానో, ఉన్నావోలో మైనర్‌ అమ్మాయి, ఢల్లీి నగరంలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచా రాల గురించి ఎందుకు మాట్లాడలేదన్న భారతీ యుల సందేహాలను మీ నూరవ మన్‌ కి బాత్‌ లో తీరుస్తారని ఆశించవచ్చా!- (వి.రాంభూపాల్‌)

చట్టాల అమలు సక్కగా లేక..

ప్రభుత్వాలు ప్రజలకు చట్ట బద్ధ పాలన అందించడమంటే ఏంటి? రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్య భావనకు ప్రాతిపదికలు. వీటి ఆధారంగా చట్ట సభల్లో ఆమోదించే చట్టాలు, ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు విడుదల చేసే జీవోలు, వాటి అమ లుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, ప్రభుత్వాలు అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌ లో కేటాయించడం, ఆయా శాఖల మెరుగైన పని తీరుకు మానవ వనరులను, మౌలిక సదుపాయాలను సమకూర్చడం- ఇవన్నీ సుపరిపాలన కిందకు వస్తాయి. పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా, సమా జంలో ప్రజలందరినీ సమానంగా చూసే వైఖరిని పాలకులు కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యనిర్వాహక సిబ్బంది పథకాల అమలులో అవినీతికి, లంచగొండితనానికి పాల్పడకుండా పారదర్శకత కలిగి ఉండటం వల్ల ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ సాధారణ సూత్రాలను ఇప్పుడు తెలంగాణాలో ఆశించడం ఎంతో కష్టమైపోయింది.
పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో పరిపాలన అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై పోయింది. రాష్ట్ర సచివాలయం, వివిధ స్థాయిల్లో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రమై పోయి కేవలం ‘ప్రగతి భవన్‌’ మాత్రమే పరిపాలనా కేంద్రంగా మిగిలింది. ఈ లక్షణం మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కూడా కనిపి స్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ పరిపాలనా ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ లో నిర్దేశించిన కేంద్ర, రాష్ట్రాల మధ్య బాధ్యతల, హక్కుల విభజనకు కూడా వ్యతిరేకం. స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలను కట్టబెట్టిన 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం. షెడ్యూల్‌ ప్రాంతాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన షెడ్యూల్‌ 5కు వ్యతిరేకం. ఆదివాసీల గ్రామ సభలకు అత్యున్నత అధికారాలను ఇచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
ఆహార భద్రతా చట్టం
పార్లమెంట్‌లో,రాష్ట్ర అసెంబ్లీ లోనూ ఆమోదించిన చట్టాలకు విలువ లేకుండా పోయింది. చట్టాలు ఆమోదించాక కూడా వాటి అమలుకు మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం, నిర్ధిష్ట కాలపరిమితి విధించకపోవడం చూస్తున్నాం. ఫలితంగా వీటి అమలు వల్ల లబ్ధిదారులుగా ఉండాల్సిన ప్రజలు హక్కులు అందక,ఆర్థికంగా కూడా నష్ట పోతున్నారు. దేశ పార్లమెంటు ఆమోదిం చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం,విద్యా హక్కు చట్టం,ఆహార భద్రతా చట్టం ఇందుకు పెద్ద ఉదా హరణలు. ఆహార భద్రతా చట్టం ప్రకారం,ఆహార ధాన్యాల పంపిణీని కేవలం బియ్యం, గోధుమలకే పరి మితం చేసి, ఫుడ్‌ బాస్కెట్‌ విస్తరించడం లేదు. చిరు ధాన్యాలను కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ లో చేర్చాలని చట్టం నిర్దేశిస్తున్నా, తెలంగాణ రాష్ట్రం దాన్ని అమలు చేస్తలేదు. ఫలితంగా ప్రజలకు పౌష్టిక ఆహారం అందడం లేదు. దీంతో జొన్న,కొర్ర,రాగి సహా చిరుధాన్యాలు పండిరచే రైతులకు కనీస మద్ధతు ధరలు దొరకట్లేదు. ఆహార భద్రతా చట్టం రాష్ట్ర నియమాల ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయక పోవడంతో, అర్హులం దరికీ 35 కిలోల బియ్యం అందడం లేదు.
అటవీ హక్కుల చట్టం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం జాబ్‌ కార్డ్‌ పొందిన ప్రతి కుటుంబానికి100 రోజుల పని హక్కుగా కల్పించాలి. కానీ ఇప్పటికీ ఒక్కో కుటుంబ సగటు పని దినాలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 50కి మించడం లేదు. అంటే మిగిలిన 50 రోజుల వేతనాన్ని( రోజుకు రూ.175 సగటు వేతనం అనుకున్నా, ఏడాదికి రూ.8,750 ) ఒక్కో కుటుంబం నష్ట పోతున్నది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన గత 17 ఏండ్లలో ప్రతి సంవత్సరం గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఇలాంటి ఆర్థిక నష్టమే జరుగుతున్నది. 2005 అటవీ హక్కుల చట్టం అమలు తీరు కూడా ఇలాగే ఉంది. 2005 డిసెంబర్‌13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు, 75 ఏండ్లకు పైగా అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీయేతరులకు ఈ చట్టం ప్రకారం వ్యక్తిగత, సాముదాయక పట్టాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ చట్టం చేసి 17 ఏండ్లు గడుస్తున్నా లక్షలాది ఆదివాసీ కుటుంబాలకు ఇంకా అటవీ హక్కుల పట్టాలు జారీ చేయలేదు. ఉదాహరణకు తెలంగాణలో ఒక ఆదివాసీ కుటుంబం 4 ఎకరాలు సాగు చేసుకుంటుంటే, రైతు బంధు పథకం కింద ఆ కుటుంబానికి సీజన్‌ కు రూ. 20,000 పెట్టుబడి సాయం అందాలి. అంటే 2018 ఖరీఫ్‌ నుంచి 2022-2023 రబీ నాటికి10 సీజన్లకు ఆ కుటుంబానికి రూ.2,00,000 రైతు బంధు సాయం అందకుండా పోయిందన్నమాట. ఒక ఆదివాసీ కుటుంబానికి ఇది చాలా పెద్ద మొత్తం. వడ్డీ లేని పంట రుణాలు, సబ్సిడీ విత్తన పథకాలు, పంటల బీమా, ఇన్‌ పుట్‌ సబ్సిడీలు, ప్రభుత్వాలు సేకరించే పంటలకు కనీస మద్దతు ధరలు ఈ కుటుంబానికి అందకపోవడం వల్ల జరిగే నష్టాన్ని కలిపి లెక్కవేస్తే, పోడు వ్యవసాయం చేసే ఆదివాసీ కుటుంబాలు పట్టాలు అందక ఎంత నష్ట పోతున్నాయో అర్థం అవుతుంది.
రుణ విముక్తి చట్టం అమలు చేయక
తెలంగాణా రాష్ట్రంలో 1973 భూ సంస్కరణల చట్టం అమలై ఉంటే, గ్రామీణ పేద కుటుంబాలకు సాగు భూమి హక్కుగా దక్కేది. ఆ కుటుంబాల ఆర్థిక స్థితి కూడా మెరుగయ్యేది. కౌలు రైతులకు కౌలు ధరల భారం తగ్గేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అందించే అన్నిసహాయ పథకాలు అంది ఉండేవి. ఈ చట్టం అమలు కాకపోవడం వల్ల, ఆ కుటుంబాలకు జరిగిన ఆర్థిక నష్టం లెక్క వేస్తే, తప్పకుండా అది లక్షల్లోనే ఉం టుంది. రాష్ట్రంలో 93 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోయాయని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా నివేదిక స్పష్టం చేసింది. 2016 లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన వ్యవసాయ కుటుంబాల రుణ విముక్తి చట్టాన్ని, చట్టం స్ఫూర్తితో రుణ విముక్తి కమిషన్‌ కు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌ గా, పూర్తి స్థాయిలో అయిదుగురు సభ్యులను నియమించి స్వతంత్రంగా పని చేయనిస్తే, వ్యవసాయ కుటుంబాలకు ఎంతో కొంత రుణాల భారం నుంచి విముక్తి లభించేది. కానీ మన ముఖ్యమంత్రి చట్ట సవరణ చేసి తన పార్టీ నాయకులతో కమిషన్‌ ను నియమించడం వల్ల, కమిషన్‌ స్వతంత్రంగా పని చేయలేక పోతున్నది. ఫలితంగా రుణాల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది. ఇవన్నీ స్పష్టం చేస్తున్న అంశం ఒక్కటే. ప్రభుత్వాల పని తీరు ప్రజాస్వామికంగా ఉండాలి. చట్టాలు, జీవో లు సరిగా అమలవ్వాలి. అప్పుడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగం.
విద్యాహక్కు చట్టం ఎక్కడ?
2010 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం అమలు తీరు కూడా రాష్ట్రంలో నాసి రకంగా ఉన్నది. తల్లిదం డ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆకాంక్షతో ప్రైవేట్‌ స్కూళ్లకు లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్న ఒక కుటుంబం ఏడాదికి సగటున రూ. 60 వేల చొప్పున పిల్లల చదువుపై ఖర్చు పెడుతుందనుకున్నా, ఈ పదేండ్లలో కనీసం ఆ కుటుంబం చదువుపై రూ.6 లక్షలు ఖర్చుపెట్టిందన్న మాట. నిజంగా విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు పడి ఉంటే, రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుం బాలన్నీ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకే పంపే వారు. సర్కారు బడుల్లో టీచర్ల రిక్రూట్‌?మెంట్‌?చేపట్టి, వాటిల్లో సౌలత్‌?లు కల్పించి, మధ్యాహ్న భోజనం సరిగా అమలు చేసి, తమిళనాడు తరహాలో ఉదయం పూట పిల్లలకు బ్రేక్‌ ఫాస్ట్‌ లాంటి పథకం అమలు చేసి ఉంటే, పేద, మధ్యతరగతి కుటుం బాలపై ఆర్థిక భారం బాగా తగ్గి ఉండేది. — వ్యాసకర్త : రైతు స్వరాజ్య వేదిక

కొత్త బిల్లుతో అడవులకు ముప్పు

అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధన లను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్‌సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మక ప్రాజెక్టులకు అనుమతులను ఫాస్ట్‌ట్రాక్‌ లో అందించే పేరుతో నిబంధనలను మార్చనున్న ఈ బిల్లు వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉంది. ఈ వివాదాస్పద బిల్లుకు సంబం ధించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి.
పర్యావరణ,అటవీమంత్రిత్వశాఖ నుం చి ముందస్తు అనుమతులు లేకుండా అటవీ ప్రాం తంలో అటవీయేతర కార్యకలాపాలు జరుపకుండా అటవీ సంరక్షణ చట్టం-1980 నిషేధిస్తుంది. ఈచట్టంలో మార్పులను తాజా బిల్లు ప్రతిపాది స్తున్నది. అటవీ ప్రాంతానికి చట్టం ఇస్తున్న నిర్వచ నంలో మార్పు తేవటం ద్వారా, కొన్ని ప్రాజెక్టులకు చట్టం నుంచి మినహాయింపును ఇవ్వటం ద్వారా ఈ మార్పులను బిల్లు ప్రతిపాదిస్తున్నది. దీనిపై 19 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న జేపీసీ అధ్యయనం చేయనుంది. అయితే,ఈబిల్లువల్ల అటవీసంరక్షణచట్టం బలహీన పడుతుందని నిపుణులు ఇప్పటికే ఆందోళన వెలి బుచ్చుతున్నారు. మొత్తమ్మీద అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తీసుకొచ్చే కేంద్రం ప్రతిపాదన వివాదాస్పదమవుతున్నది.
చట్టం సుస్పష్టం
అటవీ ప్రాంతాన్ని అటవీయేతర పను ల కోసం వాడుకోవటంపై ‘అటవీ సంరక్షణ చ ట్టం-1980’ ఆంక్షలను విధించింది. 1927 నాటి భారత అటవీచట్టం ప్రకారం నోటిఫై చేసిన అడవు లకు 1996 వరకూ ఈచట్టం వర్తించింది. కానీ, ఆ ఏడాది డిసెంబరులో సుప్రీంకోర్టు టీఎన్‌ గోద వర్మన్‌ కేసులో తీర్పునిస్తూ.. నిఘంటు అర్థం ప్రకారం అడవులను పోలిఉండే అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొంది. యాజమాన్యంతో సంబంధం లేకుండా,ఏప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాటికైనా ఇది వర్తిస్తుందని తెలిపింది.
అటవీ సంరక్షణ చట్టం ప్రకారం..
అటవీ ప్రాంతాలను ఉపయోగించుకునే ఏ ప్రాజెక్టుకైనా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, తాజాగా తీసుకొచ్చిన బిల్లు అటవీ చట్టం వర్తింపుపై ఉన్న ‘అస్పష్టతలను’ తొలగించి, 1996 కు ముందున్న స్థితిని తీసుకొస్తుందని చెబుతున్నారు. 25అక్టోబర్‌ 1980 తర్వాత రికార్డయిన డీమ్డ్‌ అడవులకు కూడా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందని అంటున్నారు.డీమ్డ్‌ అటవీ ప్రాంతాల్లో భూ విని యోగం, అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారు లను సుప్రీంకోర్టుతీర్పు నియంత్రిస్తున్నందున చట్టం లో మార్పులు అవసరం అవుతున్నాయని కేంద్ర అటవీ,పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. అందుకే ఈ బిల్లును తీసుకొచ్చామన్నా రు.కానీ,పర్యావరణ నిపుణుల అభిప్రాయం వేరుగా ఉంది.
దేశంలోని అటవీ ప్రాంతాలకు
ఈ బిల్లు తీసుకొచ్చే మార్పులు విఘాతంగా మారుతాయని, ముఖ్యంగా 1850ల నుంచి 1970ల వరకు ప్రభుత్వ రికార్డుల్లో నమో దైన అడవుల విషయంలో ఈ ప్రమాదం ఉందని ‘విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ’ అనే మేధోసంస్థకు చెందిన దేబదిత్యో సిన్హా తెలిపారు. సరైన విధంగా సరిహద్దులను నిర్ణయించకపోవటం వల్ల, అవినీతి కారణంగా భారీ ఎత్తున అటవీ ప్రాంతాలు అటవీ చట్టం కింద నమోదు కాలేదని,ఈ నష్టాన్ని అక్కడి తో నిలిపివేయటానికి, మరింత నష్టం జరుగకుండా చూడటానికి సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడిరదని పేర్కొన్నారు.
‘వ్యూహాత్మక ప్రాజెక్టులకు’ మినహాయింపులు
తాజా బిల్లు ప్రకారం..రైల్వే లైన్లు, రోడ్ల వెంబడి ఉండే అటవీ భూముల్లో 0.1హెక్టార్ల వరకు అటవీ అనుమతుల నుంచి మినహాయింపు లభిస్తుంది.నియంత్రణ రేఖకు,వాస్తవాధీన రేఖకు 100 కిలోమీటర్ల లోపు చేపట్టే ప్రాజెక్టులకు (ఉదాహరణకు రోడ్ల నిర్మాణం వంటి వాటికి) కూడా జాతీయ భద్రత కోణంలో మినహాయింపు ఉం టుంది. రక్షణశాఖకు సంబంధించిన ప్రాజెక్టులు, క్యాంపులకు 10 హెక్టార్ల వరకు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 5హెక్టార్ల వరకు మినహా యింపు ఉంటుంది. అటవీయేతర భూముల్లో ఉన్న వృక్షాల తొలగింపునకు కూడా బిల్లు మార్గం సుగమం చేస్తుంది.
విపక్షాల స్పందన
బిల్లును ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ ఎంపీ, ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ,పర్యావరణం,అడవులపై ఏర్పాటైన స్థాయీసంఘం’ చైర్మన్‌ జైరాం రమేశ్‌ రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌కు ఒక లేఖ రాశారు. ‘ఈ బిల్లు పూర్తిగా మాస్థాయీ సంఘం పరిధిలోకి వచ్చే అంశం. ఈ బిల్లును సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటితో కలిసి సమగ్రంగా, అన్ని కోణాల్లో పరిశీలించే వాళ్లం.కానీ, కావాలనే మాకు ఆ అవకాశం ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం బిల్లును జేపీసీకి సిఫార్సు చేసింది. ప్రతిపక్ష సభ్యులే లేని జేపీసీ పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందనటంలో సందేహం లేదు’ అంటూ ఆ లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తేనున్న బిల్లుతో అటవీ ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. తదుపరి పార్లమెంటు సమావేశాల తొలివారంలోపు జేపీసీ తన నివేదికను సమర్పిం చాలని గడువు విధించారు. అప్పటికి ఈ అంశంపై మరింత రగడ నెలకొనే అవకాశమే కనిపిస్తున్నది. రిజర్వ్‌ ఫారెస్ట్‌లలోని వన్యప్రాణుల ఆవాసాలు మరియు జీవవైవిధ్యం రక్షిత ప్రాంతాలకే పరిమితం కావు. స్థానిక సమాజాలకు పర్యావరణ మరియు జీవనోపాధి సేవలను కూడా అందజే స్తాయని గమనించడం ముఖ్యం.
విమర్శ
వర్గీకరణ అస్పష్టంగా ఉంది మరియు పర్యావరణవేత్తల ప్రకారం అడవులు మరియు వన్యప్రాణులను దెబ్బతీసే కార్యకలాపాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. ప్రతిపాదిత మినహా యింపులు 2006అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘి స్తున్నాయని పేర్కొంటూ అటవీ హక్కుల సంఘాలు కూడా బిల్లును వ్యతిరేకించాయి.ఈ మినహాయిం పులు ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఏజెన్సీల కోసం అటవీ మళ్లింపులను సులభతరం చేస్తాయని మరియు అటవీ సంరక్షణ చట్టం మరియు అటవీ హక్కుల చట్టం రెండిరటినీ ఉల్లంఘిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
కొత్త బిల్లు అడవికి, ప్రజలకు ముప్పు
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు (ఖీజAదీ)లోక్‌సభలో ప్రవేశపెట్టబడిరది. ఇది 1980 అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించాలని లక్ష్యంగా పెట్టు కుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కఠినమైన మార్గదర్శకాలను అందిస్తుంది..ఏర్పాటు చేసిన విధానాల ప్రకారం, బిల్లులు స్టాండిరగ్‌ కమి టీకి పంపబడ తాయి. ప్రస్తుత సందర్భంలో,దీనిని సైన్స్‌,టెక్నాలజీ, పర్యావ రణం మరియు అడవు లపై పార్లమెంటరీ స్టాం డిరగ్‌ కమిటీకి పంపాలి.బదులుగా,ఇది సూచించ బడిరది.
నష్టాల పాలవుతున్న పేదలు
ప్రభుత్వాలు ప్రజలకు చట్టబద్ధ పాల న అందించడమంటే ఏంటి?రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్యభావనకు ప్రాతిపదికలు. వీటి ఆధా రంగా చట్ట సభల్లో ఆమోదించే చట్టాలు, ప్రభుత్వా లు ఎప్పటికప్పుడు విడుదల చేసే జీవోలు, వాటి అమలుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, ప్రభుత్వాలు అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌ లో కేటాయించడం, ఆయా శాఖల మెరుగైన పని తీరుకు మానవ వనరులను, మౌలిక సదుపా యాలను సమకూర్చడంఇవన్నీ సుపరిపాలన కిందకు వస్తాయి. పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా, సమాజంలో ప్రజలందరినీ సమా నంగా చూసే వైఖరిని పాలకులు కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యనిర్వాహక సిబ్బంది పథకాల అమలులో అవినీతికి, లంచగొండితనానికి పాల్పడ కుండా పారదర్శకత కలిగి ఉండటం వల్ల ప్రజల కు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ సాధారణ సూత్రాలను ఇప్పుడు తెలంగాణాలో ఆశించడం ఎంతో కష్టమైపోయింది.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన..
పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో పరిపాలన అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై పోయింది. రాష్ట్ర సచివాలయం, వివిధ స్థాయిల్లో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రమై పోయి కేవలం ‘ప్రగతి భవన్‌’ మాత్రమే పరిపా లనా కేంద్రంగా మిగిలింది. ఈ లక్షణం మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కూడా కనిపిస్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ పరిపాలనా ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతి రేకం.రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ లో నిర్దేశిం చిన కేంద్ర,రాష్ట్రాల మధ్య బాధ్యతల,హక్కుల విభజ నకు కూడా వ్యతిరేకం. స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలను కట్టబెట్టిన 73,74రాజ్యాంగ సవర ణలకు వ్యతిరేకం. షెడ్యూల్‌ ప్రాంతాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన షెడ్యూల్‌ 5కు వ్యతిరేకం. ఆదివాసీల గ్రామ సభలకు అత్యున్నత అధికా రాలను ఇచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
అడవుల నరికివేతతో భవితకు ప్రమాదం!
అడవుల పరిరక్షణ విషయంలో ప్రపం చ దేశాల వేదికలపై భారతదేశ ప్రతినిధులు ఇచ్చే హామీలు ఆశాజనకంగా కనిపిస్తున్నా.. దశాబ్దా లుగా క్షేత్రస్థాయిలో విధానాలు, చట్టాల అమలు తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది. పాలనా వ్యవస్థలు అడవిని ఒక ఆర్థిక వనరుగా పరిగణించి పరిరక్షణ, వాణిజ్య లాభాలపై గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా వనాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం నామమాత్రం అవుతోంది.అదే రకంగా కొన్ని దశాబ్దాలుగా వేగంగా క్షీనిస్తున్న అడువులతో మానవాళి భవిత ప్రమాదంలో పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వనాలు వినాశానానికి గురవుతున్నాయని అంచనా. అడవులు క్షీణించడం మూలంగా జీవనోపాధులు,జలవనరులుతోపాటు వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తుపాన్లుఉ,భారీ వర్షాలు,వరదలు వంటి విఫత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. అడవుల పరిరక్షణకు నడుం కడుతున్నామంటూ ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నా,విధానాల అమలు మాత్రం లోపభూయిష్టంగా ఉంటోంది.
వ్యాసకర్త : సామాజిక కార్యకర్త,అటవీపరిరక్షణ నిపుణులు`న్యూఢల్లీి- (సిమ్రిన్‌ సిరుర్‌)

1 2 3 9