ధరల మోత

దేశంలో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ధరల భారాన్ని మోయలేక పోతున్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజల్‌ ధరల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిరదిం. దీనికితోడు చమురు కంపెనీలు గ్యాస్‌ ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. మే డే కానుకగా వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ బండపై 104 రూపాయలను వడ్డించింది.19 కేజీల వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై ఈభారం మోపింది. నెలవారీ సమీక్షలో భాగంగా,ఒకేసారి 104 రూపా యలను పెంచేసింది. దీంతో నగరం లో కమర్షియ ల్‌ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2563కు చేరింది.గతంలో దీని ధర రూ.2460గా ఉండేది. ఇక దేశ రాజధాని ఢల్లీిలో ఈ ధర రూ.102.05 పైసలు పెరగడంతో సిలిండర్‌ రూ.2355కు చేరుకుంది. అలాగే, ముంబైలో రూ.2329.50 గాను, కోల్‌కతాలో రూ.2477.50గాను, చెన్నైలో రూ.2508కు చేరుకుంది.
సామాన్యులపై పెనుభారం
ఒకటి కాదు రెండుకాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి%ౌౌ% ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుం డటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. సంపాదన అంతంత మాత్రంగానే ఉండటం ధరలు పెరిగి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కొనేదెలా, తినేదెలా అంటూ తలలు పట్టుకుంటు న్నారు.. రెక్కలు ముక్కలు చేసుకున్నా కుటుంబానికి మూడుపూటల భోజనం పెట్టే పరిస్థితులు కనిపిం చడం లేదు.. గ్యాస్‌నుండి మొదలుకుని విద్యుత్తు చార్జీలు, పెట్రో ధరలు. నిత్యవసర వస్తువుల ధర ఇలా చెప్పుకుంటూపోతే లీస్టు పెద్దదిగానే ఉం టుంది. ధరల పెంపు మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే తమ కుటుంబానికి మూడుపూటలతిండి పెట్రో పరిస్థి తులు.. అదే ఒకరే పనిచేస్తే వారి కష్టాలు చెప్పనక్కర లేదు.
మరో కొన్నిరోజుల్లో విద్యుత్తు చార్జీల మోత..
మరో కొన్ని రోజుల్లో విద్యుత్తు చార్జీల మోతమోగనుంది. ఏప్రిల్‌ 1వ తేదీనుండి చార్జీలు పెంచుతూ విద్యుత్తు రెగ్యులరేటరీ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఉగాదిపండగకు ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి. గృహ కనెక్షన్లకు సంబం ధించి యూనిట్‌పై 50పైసలు వాణిజ్య సంస్థలపై యూనిట్‌పై రూపాయి చొప్పున భారం మోపను న్నారు.అసలే వేసవి కాలం కావడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్యాన్లు, కూలర్లు వినియోగిస్తుండగా ధనవంతులు మాత్రం ఏసీలు వినియోగిస్తున్నారు. ఎండలు ముదరడంతో వీటి వినియోగం పెరిగింది. అసలే ఎండకాలంలో విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తాయి. దీనికితోడు పెంచిన చార్జీలు జతకా వడంతో బిల్లుల మోత మోగనుంది. పెంచిన విద్యు త్తు చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీనుండి అమలులోకి రానుంది. ఉగాది పండగ కంటే ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి.
పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు..
నాలుగుమాసాలపాటు పెట్రో ధరలు పెరగలేదు. అందరూ హమ్మయ్యా అని ఊపిరిపీల్చు కున్నారు.దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యం లో పెట్రో ధరలు పెంచలేదనే విమర్శలు ఎదుర్కొం టోంది కేంద్రం. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వరుసబెట్టి పెట్రో ధరలు పెంచుతోంది. ఏడురోజు లుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏడురోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.4 పైనే భారం పడుతోంది. తాజాగా సోమవారం రోజు లీటర్‌ పెట్రోల్‌పై 50 పైసలు వడ్డించారు. డీజిల్‌పై 35 పైసల భారం మోపారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌కు రూ.112.71కిచేరగా డీజిల్‌ లీటర్‌కు రూ. 99. 07 చేరింది. పెట్రోధరలు ఇలాగే పెరిగితే మాత్రం రెండుమూడురోజుల్లో డీజిల్‌ధరలు సెంచరీ దాటి పోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామా న్యులపై పెట్రో భారంఎక్కువగా కనిపిస్తోంది. నేడు అందరి వద్ద ద్విచక్రవాహనాలు ఉన్నాయి. మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా కార్లు వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాత కార్ల కొనుగోలు ఎక్కువగా జరిగింది. ద్విచక్ర వాహనం డబ్బులకు పాత కారు రావడంతో చాలామంది కార్లు కొనుగోలు చేశారు. వీరందరిపై భారం పడుతోంది. గతంలో మాది రిగా రోజురోజుకు పెట్రో వడ్డన చేస్తుండటంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. ఇదేమి భారమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏడురోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రేకు పడుతుందనే నమ్మ కంతో ప్రజలున్నా ఇప్పట్లో సాధ్యమయ్యే అవకా శాలు లేవనే ప్రచారం కూడా సాగుతోంది.
నిత్యవసర వస్తువుల ధరల పెంపు..
నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పప్పులు నూనె ధరలు ఒక్క సారిగా పెరిగిపోయాయి. ఎక్కువగా వినియోగించే వస్తువుల ధరలు పెరిగిపోవడంతో వెనకా ముందుచూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో నూనెప్యాకెట్‌ రూ.210 దాటిపోయింది. విడతల వారీగా కాకుండా ఒకేసారి ధర పెరగడంతో ఇబ్బందిపడాల్సిన పరిస్థి తులు నెలకొన్నాయి. గ్యాస్‌ ధరలతోపాటు నూనె ధరలు కూడా పెరిగిపోవడంతో మహిళలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నూనె ధరలే కాకుండా ఇతర నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపో యాయి. కరోనా సీజన్‌ ప్రారంభమైన తరువాత నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. పెరుగుతూ పోతున్నాయి తప్పిస్తే ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల ధరలు మరింతగా పెరిగి పోయాయి. నూనె ధరలు సలసల మరుగుతుం డటంతో వెనకాముందు చూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతోపాటు చికెన్‌ ధరలు కూడా పెరిగిపో యాయి. వేసవి కాలంలో చికెన్‌ ధర రూ.200 లోపే ఉండేది.. ప్రస్తుతం రూ.280నుండి రూ. 300 వరకు ధర పలుకుతోంది.
ఆర్టీసీ బాదుడే బాదుడు
నాలుగేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. కనీస చార్జీని రూ.5 నుంచి రూ.10కు చేశారు. గతంలో కనీస చార్జీని రూపాయి లోపు పెంచేవారు. చిల్లర సమస్య లేకుండా ఉం డేందుకు కనీస చార్జీని రెట్టింపు చేశామని చెప్పిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఉదాహరణకు గన్నవరం నుంచి విజయవాడ వచ్చే పల్లె వెలుగు బస్సులో 2019లో చార్జీ రూ.20 ఉండేది. ఇప్పుడు రూ.35 కు పెంచారు. సిటీ ఆర్డినరీ బస్సులో 2019లో రూ.25గా ఉన్న చార్జీని రూ.40కు పెంచారు. ఇలాజనాల జేబుల్లో నుంచి అదనంగా రూ.1500 కోట్లు లాగేస్తున్నారు.
ఇసుకలోనూ దోపిడీ
గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇచ్చింది. వాహనాల అద్దె ఖర్చు మాత్రం భరిం చాల్సి వచ్చేది. ఇప్పుడు ఇసుకను కోట్లు కొల్లగొట్టే వ్యాపారంగా మార్చేశారు. ప్రస్తుతం ఇసుక రేటు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. పల్నాడు జిల్లా సర్సరావుపేటలో టన్ను ఇసుక ధర రూ.800 వరకు ఉంది. రవాణా ఖర్చులు అదనం. వైసీపీ పెద్దలు జిల్లా వారీగా కాంట్రాక్టుకు ఇచ్చి దోచుకుం టున్నారనే ఆరోపణలున్నాయి.
పప్పు, పంచదార కట్‌
కేరళ ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా14రకాల నిత్యావసరాలను పంపిణీ చేస్తోం ది.ఉప్పు,పప్పు,చింతపండు,మిరపకా యలు కూడా ఇస్తోంది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం పండ గొస్తే రేషన్‌ దుకాణాల ద్వారా నెయ్యి, బెల్లం సహా 14 రకాల వస్తువులు పంపిణీ చేసేది. జగన్‌ సర్కార్‌ వచ్చాక పరిస్థితి మారిపోయింది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ను కేవలం అప్పుల కోసం వాడు కుంది. పేదలకు చౌకధరకు బియ్యం, ఇతర వస్తు వులు అందించడానికి ప్రభుత్వం ఏటా ఆ కార్పొ రేషన్‌కు రూ.3,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా సబ్సిడీ సొమ్ము ఇవ్వలేదు.పైగా కార్పొరేషన్‌కు గ్యారెంటీ ఇచ్చి, ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్ల రుణం తీసుకుంది. ఇప్పుడు దాని ద్వారా అప్పులు చేసే అవకాశం లేకపోవడంతో పూర్తిగా వది లేసింది. రేషన్‌లో ఇచ్చే పప్పు, పంచదారను 75 శాతం మేర జగన్‌ ప్రభుత్వం ఆపేసింది. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు, కార్మికులతో పాటు చిరుద్యోగులు, మధ్యతరగతి వర్గాల వారికి ధరలు భారంగా మారాయి. నలుగురు సభ్యులున్న చిన్న కుటుంబానికి పాలు, పెరుగు, కిరణా సరుకులు, కూరగాయలు, బియ్యం తదితర నిత్యావసరాలకు గతంలో నాలుగేళ్ల క్రితం రూ.6 వేలు ఖర్చు కాగా.. ఇప్పుడు రూ.10 వేలు దాటిపో తోంది. రూ.500పెట్టి కూరగాయలు కొంటే వారం రోజులు కూడా రావడం లేదని జనం వాపోతు న్నారు. ఇక వంట గ్యాస్‌, ఇంటి అద్దె తదితరాలు కలిపితేఖర్చు తడిసి మోపెడవుతోంది. గృహ అవస రాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌ సిలిండరు ధరరూ.1200కు చేరువైంది.దీంతో నెలవారీ ఇంటి బడ్జెట్‌ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దేశంలోనూ ఇదే పరిస్థితులు
ఈ ధరాభారం మోయలేక సామా న్యుల నడ్డి విరుగుతున్నది. అసలు ధరలు ఆకాశాన్ని ఎందుకు అంటుతున్నాయన్నది మీ మధురస్వరం నుండి వినాలన్న సామాన్యుల ఎదురు చూపులు ఫలించేదెన్నడు? సంవత్సరానికి ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లోకి వేస్తామన్న రూ.1.5 లక్షలు, వ్యవసాయాన్ని రెండిరతల లాభం వచ్చేటట్లు చేస్తానన్న ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదంటే ఈ మాటలు మీ మనుసులో నుండి వచ్చినవి కావా ? దేశాన్ని విశ్వగురువును చేస్తానన్నారే! అలాంటిది ప్రపంచ ఆహార సూచిక లో 101వ స్థానానికి చేరి జనం పెడుతున్న ఆకలి కేకలు, పెరిగిపోతున్న నిరుద్యోగం,దేశం వంద లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన వైనం… ఇవేవీ మీ మనసులోని మాటల జాబితాలో స్థానం సంపా దించుకోలేదే ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమం ఈ ఏప్రిల్‌ 30 నాటికి 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుం టుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ నాయకు డూ ఇలాంటి గొప్ప ప్రయోగం చేయలేదని బిజెపి అనుకూల మీడియా,ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల మేధా వులు కీర్తి ప్రవచనాలు చేస్తున్నారు. టి.వి చర్చల్లో పాల్గొంటున్న పాలక అనుకూల పారాయణులు యథాశక్తి తమ పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు తన మనసులోని మాట చెబుతున్నారా అనే సందేహం ప్రతి భారతీయుడిలో (అదానీ, అంబానీ లాంటి వారు మినహా) కలుగుతుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా మీడియా సమావేశం జరపలేదు కాబట్టి. ఎన్నికల ముందు చెప్పింది, నేడు చేస్తున్నది వేరు కాబట్టి. తొమ్మిదేళ్ల నాడు చెప్పినదానికి, చేసినదానికి పొంతన లేదు కాబట్టి. ప్రధాని మనసులో మాటను ప్రజలు వినడం కాదు, దేశ ప్రజల మనసులో మాటను ప్రధాని వినాలి.
బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో విజయదశమి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత వుంది. ఆ రోజున ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సరిగ్గా అలాంటి విజయదశమి నాడు 2014 అక్టోబర్‌ 3న ‘ప్రధాని మనసులోని మాట’ కార్యక్రమాన్ని మోడీ ప్రారం భించారు. అంటే ఇది పక్కాగా ఆర్‌ఎస్‌ఎస్‌ మనసు లో నుండి పుట్టిన కార్యక్రమం. ఇప్పటి వరకు ప్రధాని మాట్లాడిన 99 ఎపిసోడ్‌లలో అనేక చిన్న చిన్న విషయాలను కూడా మహా నాటకీయంగా చెప్పారు.కర్ణాటకలో సులగిట్టి నరసమ్మ మంత్ర సానిగా ఎందరో గర్భిణీలకు సేవలందించిన విషయం గురించి ప్రధాని మన్‌ కి బాత్‌లో చెబు తుంటే… పేదలకేమో మంత్రసానులు, సంప న్నులకు కార్పొరేటు ఆసుపత్రులు అన్న మీ నీతి అర్థంకాలేదు. విజయనగరం జిల్లాలోని ద్వార పూడి పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు రాత్రిపూట చదువు చెబుతున్న విషయం చెబుతుంటే నూతన విద్యావిధానం పేరుతో అత్యధికమంది పేదలను చదువులకు దూరం చేసే ఎత్తుగడ మీ మనసులో వుందని అనుకోలేదు. న్యూజిలాండ్‌లో ఎంపీగా ఎన్నికైన గౌరవ్‌ శర్మ అనే ప్రవాస భారతీయుడు సంస్కృతం లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం పలుకు తుంటే రానున్న రోజుల్లో ప్రాచీనకాలం నాటి వేదాధ్యయనం తప్పనిసరి చేస్తారని గుర్తించలేక పోయాము. ఆసియాలో తొలి మహిళా లోకో పైలట్‌ సురేఖ యాదవ్‌ గురించి చెప్పినప్పుడు గుజరాత్‌లో బిల్కిస్‌ బానో, ఉన్నావోలో మైనర్‌ అమ్మాయి, ఢల్లీి నగరంలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచా రాల గురించి ఎందుకు మాట్లాడలేదన్న భారతీ యుల సందేహాలను మీ నూరవ మన్‌ కి బాత్‌ లో తీరుస్తారని ఆశించవచ్చా!- (వి.రాంభూపాల్‌)

చట్టాల అమలు సక్కగా లేక..

ప్రభుత్వాలు ప్రజలకు చట్ట బద్ధ పాలన అందించడమంటే ఏంటి? రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్య భావనకు ప్రాతిపదికలు. వీటి ఆధారంగా చట్ట సభల్లో ఆమోదించే చట్టాలు, ప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు విడుదల చేసే జీవోలు, వాటి అమ లుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, ప్రభుత్వాలు అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌ లో కేటాయించడం, ఆయా శాఖల మెరుగైన పని తీరుకు మానవ వనరులను, మౌలిక సదుపాయాలను సమకూర్చడం- ఇవన్నీ సుపరిపాలన కిందకు వస్తాయి. పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా, సమా జంలో ప్రజలందరినీ సమానంగా చూసే వైఖరిని పాలకులు కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యనిర్వాహక సిబ్బంది పథకాల అమలులో అవినీతికి, లంచగొండితనానికి పాల్పడకుండా పారదర్శకత కలిగి ఉండటం వల్ల ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ సాధారణ సూత్రాలను ఇప్పుడు తెలంగాణాలో ఆశించడం ఎంతో కష్టమైపోయింది.
పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో పరిపాలన అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై పోయింది. రాష్ట్ర సచివాలయం, వివిధ స్థాయిల్లో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రమై పోయి కేవలం ‘ప్రగతి భవన్‌’ మాత్రమే పరిపాలనా కేంద్రంగా మిగిలింది. ఈ లక్షణం మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కూడా కనిపి స్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ పరిపాలనా ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ లో నిర్దేశించిన కేంద్ర, రాష్ట్రాల మధ్య బాధ్యతల, హక్కుల విభజనకు కూడా వ్యతిరేకం. స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలను కట్టబెట్టిన 73,74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకం. షెడ్యూల్‌ ప్రాంతాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన షెడ్యూల్‌ 5కు వ్యతిరేకం. ఆదివాసీల గ్రామ సభలకు అత్యున్నత అధికారాలను ఇచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
ఆహార భద్రతా చట్టం
పార్లమెంట్‌లో,రాష్ట్ర అసెంబ్లీ లోనూ ఆమోదించిన చట్టాలకు విలువ లేకుండా పోయింది. చట్టాలు ఆమోదించాక కూడా వాటి అమలుకు మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం, నిర్ధిష్ట కాలపరిమితి విధించకపోవడం చూస్తున్నాం. ఫలితంగా వీటి అమలు వల్ల లబ్ధిదారులుగా ఉండాల్సిన ప్రజలు హక్కులు అందక,ఆర్థికంగా కూడా నష్ట పోతున్నారు. దేశ పార్లమెంటు ఆమోదిం చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం,విద్యా హక్కు చట్టం,ఆహార భద్రతా చట్టం ఇందుకు పెద్ద ఉదా హరణలు. ఆహార భద్రతా చట్టం ప్రకారం,ఆహార ధాన్యాల పంపిణీని కేవలం బియ్యం, గోధుమలకే పరి మితం చేసి, ఫుడ్‌ బాస్కెట్‌ విస్తరించడం లేదు. చిరు ధాన్యాలను కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ లో చేర్చాలని చట్టం నిర్దేశిస్తున్నా, తెలంగాణ రాష్ట్రం దాన్ని అమలు చేస్తలేదు. ఫలితంగా ప్రజలకు పౌష్టిక ఆహారం అందడం లేదు. దీంతో జొన్న,కొర్ర,రాగి సహా చిరుధాన్యాలు పండిరచే రైతులకు కనీస మద్ధతు ధరలు దొరకట్లేదు. ఆహార భద్రతా చట్టం రాష్ట్ర నియమాల ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయక పోవడంతో, అర్హులం దరికీ 35 కిలోల బియ్యం అందడం లేదు.
అటవీ హక్కుల చట్టం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం జాబ్‌ కార్డ్‌ పొందిన ప్రతి కుటుంబానికి100 రోజుల పని హక్కుగా కల్పించాలి. కానీ ఇప్పటికీ ఒక్కో కుటుంబ సగటు పని దినాలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 50కి మించడం లేదు. అంటే మిగిలిన 50 రోజుల వేతనాన్ని( రోజుకు రూ.175 సగటు వేతనం అనుకున్నా, ఏడాదికి రూ.8,750 ) ఒక్కో కుటుంబం నష్ట పోతున్నది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన గత 17 ఏండ్లలో ప్రతి సంవత్సరం గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఇలాంటి ఆర్థిక నష్టమే జరుగుతున్నది. 2005 అటవీ హక్కుల చట్టం అమలు తీరు కూడా ఇలాగే ఉంది. 2005 డిసెంబర్‌13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు, 75 ఏండ్లకు పైగా అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీయేతరులకు ఈ చట్టం ప్రకారం వ్యక్తిగత, సాముదాయక పట్టాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ చట్టం చేసి 17 ఏండ్లు గడుస్తున్నా లక్షలాది ఆదివాసీ కుటుంబాలకు ఇంకా అటవీ హక్కుల పట్టాలు జారీ చేయలేదు. ఉదాహరణకు తెలంగాణలో ఒక ఆదివాసీ కుటుంబం 4 ఎకరాలు సాగు చేసుకుంటుంటే, రైతు బంధు పథకం కింద ఆ కుటుంబానికి సీజన్‌ కు రూ. 20,000 పెట్టుబడి సాయం అందాలి. అంటే 2018 ఖరీఫ్‌ నుంచి 2022-2023 రబీ నాటికి10 సీజన్లకు ఆ కుటుంబానికి రూ.2,00,000 రైతు బంధు సాయం అందకుండా పోయిందన్నమాట. ఒక ఆదివాసీ కుటుంబానికి ఇది చాలా పెద్ద మొత్తం. వడ్డీ లేని పంట రుణాలు, సబ్సిడీ విత్తన పథకాలు, పంటల బీమా, ఇన్‌ పుట్‌ సబ్సిడీలు, ప్రభుత్వాలు సేకరించే పంటలకు కనీస మద్దతు ధరలు ఈ కుటుంబానికి అందకపోవడం వల్ల జరిగే నష్టాన్ని కలిపి లెక్కవేస్తే, పోడు వ్యవసాయం చేసే ఆదివాసీ కుటుంబాలు పట్టాలు అందక ఎంత నష్ట పోతున్నాయో అర్థం అవుతుంది.
రుణ విముక్తి చట్టం అమలు చేయక
తెలంగాణా రాష్ట్రంలో 1973 భూ సంస్కరణల చట్టం అమలై ఉంటే, గ్రామీణ పేద కుటుంబాలకు సాగు భూమి హక్కుగా దక్కేది. ఆ కుటుంబాల ఆర్థిక స్థితి కూడా మెరుగయ్యేది. కౌలు రైతులకు కౌలు ధరల భారం తగ్గేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి అందించే అన్నిసహాయ పథకాలు అంది ఉండేవి. ఈ చట్టం అమలు కాకపోవడం వల్ల, ఆ కుటుంబాలకు జరిగిన ఆర్థిక నష్టం లెక్క వేస్తే, తప్పకుండా అది లక్షల్లోనే ఉం టుంది. రాష్ట్రంలో 93 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోయాయని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా నివేదిక స్పష్టం చేసింది. 2016 లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన వ్యవసాయ కుటుంబాల రుణ విముక్తి చట్టాన్ని, చట్టం స్ఫూర్తితో రుణ విముక్తి కమిషన్‌ కు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌ గా, పూర్తి స్థాయిలో అయిదుగురు సభ్యులను నియమించి స్వతంత్రంగా పని చేయనిస్తే, వ్యవసాయ కుటుంబాలకు ఎంతో కొంత రుణాల భారం నుంచి విముక్తి లభించేది. కానీ మన ముఖ్యమంత్రి చట్ట సవరణ చేసి తన పార్టీ నాయకులతో కమిషన్‌ ను నియమించడం వల్ల, కమిషన్‌ స్వతంత్రంగా పని చేయలేక పోతున్నది. ఫలితంగా రుణాల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది. ఇవన్నీ స్పష్టం చేస్తున్న అంశం ఒక్కటే. ప్రభుత్వాల పని తీరు ప్రజాస్వామికంగా ఉండాలి. చట్టాలు, జీవో లు సరిగా అమలవ్వాలి. అప్పుడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగం.
విద్యాహక్కు చట్టం ఎక్కడ?
2010 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం అమలు తీరు కూడా రాష్ట్రంలో నాసి రకంగా ఉన్నది. తల్లిదం డ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆకాంక్షతో ప్రైవేట్‌ స్కూళ్లకు లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్న ఒక కుటుంబం ఏడాదికి సగటున రూ. 60 వేల చొప్పున పిల్లల చదువుపై ఖర్చు పెడుతుందనుకున్నా, ఈ పదేండ్లలో కనీసం ఆ కుటుంబం చదువుపై రూ.6 లక్షలు ఖర్చుపెట్టిందన్న మాట. నిజంగా విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు పడి ఉంటే, రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుం బాలన్నీ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకే పంపే వారు. సర్కారు బడుల్లో టీచర్ల రిక్రూట్‌?మెంట్‌?చేపట్టి, వాటిల్లో సౌలత్‌?లు కల్పించి, మధ్యాహ్న భోజనం సరిగా అమలు చేసి, తమిళనాడు తరహాలో ఉదయం పూట పిల్లలకు బ్రేక్‌ ఫాస్ట్‌ లాంటి పథకం అమలు చేసి ఉంటే, పేద, మధ్యతరగతి కుటుం బాలపై ఆర్థిక భారం బాగా తగ్గి ఉండేది. — వ్యాసకర్త : రైతు స్వరాజ్య వేదిక

కొత్త బిల్లుతో అడవులకు ముప్పు

అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధన లను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్‌సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మక ప్రాజెక్టులకు అనుమతులను ఫాస్ట్‌ట్రాక్‌ లో అందించే పేరుతో నిబంధనలను మార్చనున్న ఈ బిల్లు వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనలో ఉంది. ఈ వివాదాస్పద బిల్లుకు సంబం ధించి ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి.
పర్యావరణ,అటవీమంత్రిత్వశాఖ నుం చి ముందస్తు అనుమతులు లేకుండా అటవీ ప్రాం తంలో అటవీయేతర కార్యకలాపాలు జరుపకుండా అటవీ సంరక్షణ చట్టం-1980 నిషేధిస్తుంది. ఈచట్టంలో మార్పులను తాజా బిల్లు ప్రతిపాది స్తున్నది. అటవీ ప్రాంతానికి చట్టం ఇస్తున్న నిర్వచ నంలో మార్పు తేవటం ద్వారా, కొన్ని ప్రాజెక్టులకు చట్టం నుంచి మినహాయింపును ఇవ్వటం ద్వారా ఈ మార్పులను బిల్లు ప్రతిపాదిస్తున్నది. దీనిపై 19 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న జేపీసీ అధ్యయనం చేయనుంది. అయితే,ఈబిల్లువల్ల అటవీసంరక్షణచట్టం బలహీన పడుతుందని నిపుణులు ఇప్పటికే ఆందోళన వెలి బుచ్చుతున్నారు. మొత్తమ్మీద అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తీసుకొచ్చే కేంద్రం ప్రతిపాదన వివాదాస్పదమవుతున్నది.
చట్టం సుస్పష్టం
అటవీ ప్రాంతాన్ని అటవీయేతర పను ల కోసం వాడుకోవటంపై ‘అటవీ సంరక్షణ చ ట్టం-1980’ ఆంక్షలను విధించింది. 1927 నాటి భారత అటవీచట్టం ప్రకారం నోటిఫై చేసిన అడవు లకు 1996 వరకూ ఈచట్టం వర్తించింది. కానీ, ఆ ఏడాది డిసెంబరులో సుప్రీంకోర్టు టీఎన్‌ గోద వర్మన్‌ కేసులో తీర్పునిస్తూ.. నిఘంటు అర్థం ప్రకారం అడవులను పోలిఉండే అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొంది. యాజమాన్యంతో సంబంధం లేకుండా,ఏప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాటికైనా ఇది వర్తిస్తుందని తెలిపింది.
అటవీ సంరక్షణ చట్టం ప్రకారం..
అటవీ ప్రాంతాలను ఉపయోగించుకునే ఏ ప్రాజెక్టుకైనా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, తాజాగా తీసుకొచ్చిన బిల్లు అటవీ చట్టం వర్తింపుపై ఉన్న ‘అస్పష్టతలను’ తొలగించి, 1996 కు ముందున్న స్థితిని తీసుకొస్తుందని చెబుతున్నారు. 25అక్టోబర్‌ 1980 తర్వాత రికార్డయిన డీమ్డ్‌ అడవులకు కూడా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందని అంటున్నారు.డీమ్డ్‌ అటవీ ప్రాంతాల్లో భూ విని యోగం, అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారు లను సుప్రీంకోర్టుతీర్పు నియంత్రిస్తున్నందున చట్టం లో మార్పులు అవసరం అవుతున్నాయని కేంద్ర అటవీ,పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. అందుకే ఈ బిల్లును తీసుకొచ్చామన్నా రు.కానీ,పర్యావరణ నిపుణుల అభిప్రాయం వేరుగా ఉంది.
దేశంలోని అటవీ ప్రాంతాలకు
ఈ బిల్లు తీసుకొచ్చే మార్పులు విఘాతంగా మారుతాయని, ముఖ్యంగా 1850ల నుంచి 1970ల వరకు ప్రభుత్వ రికార్డుల్లో నమో దైన అడవుల విషయంలో ఈ ప్రమాదం ఉందని ‘విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ’ అనే మేధోసంస్థకు చెందిన దేబదిత్యో సిన్హా తెలిపారు. సరైన విధంగా సరిహద్దులను నిర్ణయించకపోవటం వల్ల, అవినీతి కారణంగా భారీ ఎత్తున అటవీ ప్రాంతాలు అటవీ చట్టం కింద నమోదు కాలేదని,ఈ నష్టాన్ని అక్కడి తో నిలిపివేయటానికి, మరింత నష్టం జరుగకుండా చూడటానికి సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడిరదని పేర్కొన్నారు.
‘వ్యూహాత్మక ప్రాజెక్టులకు’ మినహాయింపులు
తాజా బిల్లు ప్రకారం..రైల్వే లైన్లు, రోడ్ల వెంబడి ఉండే అటవీ భూముల్లో 0.1హెక్టార్ల వరకు అటవీ అనుమతుల నుంచి మినహాయింపు లభిస్తుంది.నియంత్రణ రేఖకు,వాస్తవాధీన రేఖకు 100 కిలోమీటర్ల లోపు చేపట్టే ప్రాజెక్టులకు (ఉదాహరణకు రోడ్ల నిర్మాణం వంటి వాటికి) కూడా జాతీయ భద్రత కోణంలో మినహాయింపు ఉం టుంది. రక్షణశాఖకు సంబంధించిన ప్రాజెక్టులు, క్యాంపులకు 10 హెక్టార్ల వరకు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 5హెక్టార్ల వరకు మినహా యింపు ఉంటుంది. అటవీయేతర భూముల్లో ఉన్న వృక్షాల తొలగింపునకు కూడా బిల్లు మార్గం సుగమం చేస్తుంది.
విపక్షాల స్పందన
బిల్లును ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ ఎంపీ, ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ,పర్యావరణం,అడవులపై ఏర్పాటైన స్థాయీసంఘం’ చైర్మన్‌ జైరాం రమేశ్‌ రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌కు ఒక లేఖ రాశారు. ‘ఈ బిల్లు పూర్తిగా మాస్థాయీ సంఘం పరిధిలోకి వచ్చే అంశం. ఈ బిల్లును సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటితో కలిసి సమగ్రంగా, అన్ని కోణాల్లో పరిశీలించే వాళ్లం.కానీ, కావాలనే మాకు ఆ అవకాశం ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం బిల్లును జేపీసీకి సిఫార్సు చేసింది. ప్రతిపక్ష సభ్యులే లేని జేపీసీ పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందనటంలో సందేహం లేదు’ అంటూ ఆ లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా అటవీ సంరక్షణ చట్టంలో మార్పులు తేనున్న బిల్లుతో అటవీ ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. తదుపరి పార్లమెంటు సమావేశాల తొలివారంలోపు జేపీసీ తన నివేదికను సమర్పిం చాలని గడువు విధించారు. అప్పటికి ఈ అంశంపై మరింత రగడ నెలకొనే అవకాశమే కనిపిస్తున్నది. రిజర్వ్‌ ఫారెస్ట్‌లలోని వన్యప్రాణుల ఆవాసాలు మరియు జీవవైవిధ్యం రక్షిత ప్రాంతాలకే పరిమితం కావు. స్థానిక సమాజాలకు పర్యావరణ మరియు జీవనోపాధి సేవలను కూడా అందజే స్తాయని గమనించడం ముఖ్యం.
విమర్శ
వర్గీకరణ అస్పష్టంగా ఉంది మరియు పర్యావరణవేత్తల ప్రకారం అడవులు మరియు వన్యప్రాణులను దెబ్బతీసే కార్యకలాపాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. ప్రతిపాదిత మినహా యింపులు 2006అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘి స్తున్నాయని పేర్కొంటూ అటవీ హక్కుల సంఘాలు కూడా బిల్లును వ్యతిరేకించాయి.ఈ మినహాయిం పులు ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఏజెన్సీల కోసం అటవీ మళ్లింపులను సులభతరం చేస్తాయని మరియు అటవీ సంరక్షణ చట్టం మరియు అటవీ హక్కుల చట్టం రెండిరటినీ ఉల్లంఘిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
కొత్త బిల్లు అడవికి, ప్రజలకు ముప్పు
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు (ఖీజAదీ)లోక్‌సభలో ప్రవేశపెట్టబడిరది. ఇది 1980 అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించాలని లక్ష్యంగా పెట్టు కుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కఠినమైన మార్గదర్శకాలను అందిస్తుంది..ఏర్పాటు చేసిన విధానాల ప్రకారం, బిల్లులు స్టాండిరగ్‌ కమి టీకి పంపబడ తాయి. ప్రస్తుత సందర్భంలో,దీనిని సైన్స్‌,టెక్నాలజీ, పర్యావ రణం మరియు అడవు లపై పార్లమెంటరీ స్టాం డిరగ్‌ కమిటీకి పంపాలి.బదులుగా,ఇది సూచించ బడిరది.
నష్టాల పాలవుతున్న పేదలు
ప్రభుత్వాలు ప్రజలకు చట్టబద్ధ పాల న అందించడమంటే ఏంటి?రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్యభావనకు ప్రాతిపదికలు. వీటి ఆధా రంగా చట్ట సభల్లో ఆమోదించే చట్టాలు, ప్రభుత్వా లు ఎప్పటికప్పుడు విడుదల చేసే జీవోలు, వాటి అమలుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన, ప్రభుత్వాలు అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌ లో కేటాయించడం, ఆయా శాఖల మెరుగైన పని తీరుకు మానవ వనరులను, మౌలిక సదుపా యాలను సమకూర్చడంఇవన్నీ సుపరిపాలన కిందకు వస్తాయి. పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా, సమాజంలో ప్రజలందరినీ సమా నంగా చూసే వైఖరిని పాలకులు కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యనిర్వాహక సిబ్బంది పథకాల అమలులో అవినీతికి, లంచగొండితనానికి పాల్పడ కుండా పారదర్శకత కలిగి ఉండటం వల్ల ప్రజల కు ఎక్కువ మేలు జరుగుతుంది. ఈ సాధారణ సూత్రాలను ఇప్పుడు తెలంగాణాలో ఆశించడం ఎంతో కష్టమైపోయింది.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన..
పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఆచరణలో పరిపాలన అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై పోయింది. రాష్ట్ర సచివాలయం, వివిధ స్థాయిల్లో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రమై పోయి కేవలం ‘ప్రగతి భవన్‌’ మాత్రమే పరిపా లనా కేంద్రంగా మిగిలింది. ఈ లక్షణం మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కూడా కనిపిస్తున్నది. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ పరిపాలనా ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతి రేకం.రాజ్యాంగం 7వ షెడ్యూల్‌ లో నిర్దేశిం చిన కేంద్ర,రాష్ట్రాల మధ్య బాధ్యతల,హక్కుల విభజ నకు కూడా వ్యతిరేకం. స్థానిక సంస్థలకు విస్తృత అధికారాలను కట్టబెట్టిన 73,74రాజ్యాంగ సవర ణలకు వ్యతిరేకం. షెడ్యూల్‌ ప్రాంతాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన షెడ్యూల్‌ 5కు వ్యతిరేకం. ఆదివాసీల గ్రామ సభలకు అత్యున్నత అధికా రాలను ఇచ్చిన పీసా, అటవీ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.
అడవుల నరికివేతతో భవితకు ప్రమాదం!
అడవుల పరిరక్షణ విషయంలో ప్రపం చ దేశాల వేదికలపై భారతదేశ ప్రతినిధులు ఇచ్చే హామీలు ఆశాజనకంగా కనిపిస్తున్నా.. దశాబ్దా లుగా క్షేత్రస్థాయిలో విధానాలు, చట్టాల అమలు తీరు అందుకు విరుద్ధంగా ఉంటోంది. పాలనా వ్యవస్థలు అడవిని ఒక ఆర్థిక వనరుగా పరిగణించి పరిరక్షణ, వాణిజ్య లాభాలపై గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా వనాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం నామమాత్రం అవుతోంది.అదే రకంగా కొన్ని దశాబ్దాలుగా వేగంగా క్షీనిస్తున్న అడువులతో మానవాళి భవిత ప్రమాదంలో పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వనాలు వినాశానానికి గురవుతున్నాయని అంచనా. అడవులు క్షీణించడం మూలంగా జీవనోపాధులు,జలవనరులుతోపాటు వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తుపాన్లుఉ,భారీ వర్షాలు,వరదలు వంటి విఫత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. అడవుల పరిరక్షణకు నడుం కడుతున్నామంటూ ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నా,విధానాల అమలు మాత్రం లోపభూయిష్టంగా ఉంటోంది.
వ్యాసకర్త : సామాజిక కార్యకర్త,అటవీపరిరక్షణ నిపుణులు`న్యూఢల్లీి- (సిమ్రిన్‌ సిరుర్‌)

ఓటే ఆయుధం..ఒకటై సాగుదాం!

అన్ని అంశాలు పాఠాలు చెప్తాయి. చారిత్రక అంశాలు గుణపాఠాలు నేర్పిస్తాయి’ ఇది తెలంగాణ ప్రజలను చైతన్యపరచిన మేధావి డాక్టర్‌ జయశంకర్‌ ఒక సందర్భంలో చెప్పిన, చాలా విలు వైన మాట. ఆ చరిత్ర లను అర్థం చేసుకున్న పాలకులు పాఠాలు నేర్చుకొని చిరంజీవులుగా మానవ జాతి ఉన్నన్నాళ్లూ కీర్తింపబడు తారు. ఆ విధంగా పాఠాలు నేర్చుకోక కొందరు నియం తలుగా మారి ప్రజా కంటకులుగా గుర్తింపబడు తారు. వారిని తలచుకున్నప్పుడల్లా జనాలకు ఏవగింపు తప్ప ఇంకో భావం కలగదు. అంటే వారు జీవించిలేక పోయినా సామాన్య జనాలు తిట్టుకుంటారు. ఇప్పుడు నడుస్తున్న భారత రాజకీయా ల్లో ఈ దేశ చరిత్రలోంచి నాయకులు నేర్చుకోవలసిన పాఠాలేమిటో చూద్దాం!
గత వెయ్యేండ్లలో అత్యంత అధికారం కలిగి,ఎక్కువకాలం పాలించిన మొఘ లు సామ్రాజ్య చరిత్రను గమనిస్తే ఒక విస్మయం కలిగే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్‌ గాంధీని జైల్లో పెట్టినా, బెయిల్‌ మీద విడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగు తుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రెస్‌ మీద ప్రేమ ఉండక్కరలేదు.నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. మొదటి పాలకుడు బాబర్‌, తర్వాత హుమాయూన్‌, అక్బర్‌,జహంగీర్‌, షాజహాన్‌లకంటే ఎక్కువ భూభాగాన్ని 55ఏండ్లు ఔరంగజేబు పాలించాడు. మరి ఆయన మరణం తర్వాత కొన్నేండ్లలోనే మొఘల్‌ సామ్రాజ్యం చిన్నాభిన్న మైంది.ఏపాలకుడూ నిల దొక్కుకోలేక పోయాడు. దీనికి చాలా బలమైన కారణాలున్నాయి.

  1. ప్రజాభిమానం పాలకుడికి అతిముఖ్యమైన బలం అని ఔరంగజేబు గుర్తించకపోవటం. 2. ఆయన మత మౌఢ్యం,ఇతర మతాల పట్ల ద్వేషం, ఆలోచనాపరులైన ప్రజలను ఆవంశానికే శత్రువులుగా చేయటం.
  2. దేశ చరిత్ర బట్టి ఐక్యత కోసం అందరినీ సమ దృష్టితో చూడాలన్న అంశం ఔరంగజేబు గుర్తించక పోవడం.
  3. దాదాపు ఆరు దశాబ్దాలు తన పరిపాలనే ఉన్నా, అత్యాశతో యుద్ధాలు చేసి,కోశా గారం లోని ధనాన్ని ప్రజల సౌకర్యాల కోసం, దేశ ప్రగతి కోసం కాకుండా, తాను శత్రువు లనుకున్న వారిని అణచివేయటానికి ఖర్చు చేయటం.
    ఈ నాలుగు బలమైన కారణాలతో,శతాబ్దాలు పాలించినా, మొఘలు సామ్రాజ్య పతనం కేవలం ఐదు దశాబ్దాలలో జరిగిపోయింది. అంటే దేశాన్ని, ప్రజలను ప్రేమతో కాకుండా ద్వేషంతో,మౌఢ్యంతో ఎంతకాలం పాలించినా ఆ నియంతలకు ఓటమి తప్పదన్నది చారిత్రక సత్యం.
    ఇప్పుడు మన దేశాన్ని కేంద్రం నుంచి పాలిస్తున్న బీజేపీ విధానాలతో పైన చెప్పిన అంశా లు పోలిక కలిగి ఉండటం సుస్పష్టంగా కనిపి స్తుంది. రెండుసార్లు కేంద్రంలో మెజారిటీ సాధించి పరిపాలిస్తున్నా, అధినాయకులిద్దరూ కడుపు నిండా అన్నం తిని కంటినిండా నిద్రపోతున్నారా అన్నది అనుమానాస్పదమే! ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏవో ఒకఎన్నికలు ప్రతిఏడాదీ, రెండేం డ్లకు జరుగుతూనే ఉంటాయి. మరి ఒక రాష్ట్రంలో గెలవగానే,ఇక తర్వాత వేరే రాష్ట్రంలో వచ్చే ఎన్ని కల సన్నాహాలతో, ప్రత్యర్థులను ఓడిరచాలనే పట్టుద లతో 24గంటలూ అదే ఆలోచనాధోరణితో, ఆచర ణతో ఉండే వీరికి మరిదేశ పరిపాలనకు సమయం చిక్కటం లేదు. మనది ప్రజాస్వామ్యం కాబట్టి,ఓట్ల ద్వారా గెలుపోటములు నిర్ణయింపబడుతాయి కాబట్టి,రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఇప్పు డు ఆలోచనలో పడుతున్నారు, తొమ్మిదేండ్ల సమ యం ఒక్క రంగాన్నైనా ఉద్ధరించటానికి సరిపోదా అని. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గతంలో దేశ ప్రజలకు ఎంత చేయాలో అంత చేయలేదన్నది కఠిన సత్యం. కానీ వారు ఈ విధంగా ప్రజా జీవి తాన్ని అతలాకుతలం చేయలేదన్నది కూడా నిజం. అక్బర్‌,షాజహాన్‌,జహంగీర్‌ కూడా పరిపాలించినా, వారు జన జీవనానికి అడ్డుపడలేదు.కాంగ్రెస్‌ ప్రభు త్వం అంతే.మరి వారి కంటే ఎక్కువ కాలం పరిపా లించిన ఔరంగజేబు ఎందుకు ప్రజాగ్రహాన్ని మూట కట్టుకున్నాడు? సరిగ్గా ప్రస్తుత ప్రధానమంత్రి ఇలాగే శృతి మించి ప్రవర్తిస్తున్నాడు. ఒక తప్పు కప్పుకో వటానికి ఇంకొకటి, ఒక సంచలనాన్ని మరుగు పరచటానికి ఇంకొకటి! ప్రజాగ్రహాన్ని మరల్చత తటానికి పుల్వామా దాడులు, ఆత్మీయ మిత్రుడి కష్టాన్ని కుంభకోణాన్ని దాచటానికి విపక్ష నాయకుడి బహిష్కరణ! నిజానికి నరేంద్ర మోదీ గారి ప్రసం గాలు ఒకసారి టీవీలల్లో ప్రసారం చేస్తే, ఆయన మంత్రులు,అనుయాయులు కాంగ్రెస్‌ నేతలని, ముఖ్యంగా నెహ్రూ కుటుంబసభ్యులని, దేశంలోని మహిళలను ఎంత అవమానించారో ప్రజలకు తెలు స్తుంది. మరి వారి మాటలను కూడా విచారించి శిక్షలు వేయాలి కదా! మాటలే కాదు, వారి అత్యా చారాలు, హత్యలకు కూడా రాజ్యాంగంలో శిక్షలే లేవు. మరి విపక్ష నాయకుడు అన్న దాంట్లో తప్పే ముంది? నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ నిన్న బయట పడ్డారు. మన ప్రధాని అదానీని రక్షిస్తూ, ఇవాళ బయటపడ్డారు. చేసే పనుల మీద సీబీఐ విచారణ వేస్తే తేలిపోతుంది కదా! అయితే, విపక్ష నాయకుడి రాజకీయ ఎన్నికల బహిష్కరణను ఇంకో కోణం నుంచి కూడా పరిశీ లించవచ్చు. ఆధునిక చరిత్రలో గుర్తుకొచ్చే ఇద్దరు నియంతల ప్రవర్తన, అనుసరిం చిన విధానాలు గమ నిస్తే వాటిలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ఇటలీని పరిపాలించిన నియంత బెనిటో ముస్సోలినీ, జర్మనీని ఏలిన అధినేత అడాల్ఫ్‌ హిట్లర్‌ సమకాలీ కులు,29 జూలై 1883లో పుట్టిన ముస్సోలినీ తన అరాచక పాలనను 1925 నుంచి 1945 దాకా సాగించాడు. తన10వ ఏటనే స్కూలులో ఒక బాలుడిని కత్తితో పొడవటంతో మొదలైన అతడి క్రూరత్వం,ఫాసిస్టు పార్టీ పెట్టి చివరిదాకా దాష్టీకాలు సాగించాడు. అలాగే, 1883 ఏప్రిల్‌ 20న పుట్టిన అడాల్ఫ్‌ హిట్లర్‌ నాజీ పార్టీ అధినేతగా 1933 నుంచీ 1945 దాకా నియంతృత్వ పాలన సాగించాడు. లక్షల మందిని క్రూరంగా చంపిం చాడు. అయితే వీరిద్దరి ఉదాహరణల నుంచి నేర్చుకునే పాఠం ఒక్కటే. పాలితుల పట్ల ప్రేమఉండి వారిలో ఒకడిగా చరిం చి దేశానికి ప్రగతి సాధించేవాడికి ఉన్న ప్రశాంత జీవనం నియంతగా మారి,క్రూరమైన రీతుల్లో ప్రవర్తించి,ముఖ్యంగా తనను విమర్శించే వాళ్లు బతికి ఉండొద్దనే పద్ధతులు పాటించినవారికి ఉండదు. వారు పులి మీద స్వారీ చేస్తున్నట్టే! కొద్దిగా పరిస్థితి మారితే వారు సృష్టించు కున్న విధానాలే వారిని అధఃపాతా ళానికి తొక్కేస్తా యి.మహా ఘోరమైన జీవితం చూడవలసి వస్తుంది. అసహ నం,అధికారదాహం, విపక్షాల పట్ల కక్ష, విపరీత మైన వివక్ష, పక్షపాత ధోరణి ఉన్న నియం తలు చాలాకాలం మనలేరు. పదవిలో కొనసాగ లేరు. అంతేకాదు, తమ అధికార బలం, ప్రజాభి మానం తగ్గుతున్నదన్న అనుమానం కలిగిన కొద్దీ ఒకదాని మీద ఒకటి తప్పులు చేస్తారు. అవే వారిని పదవీచ్యుతులను చేసే ఆయుధాలు. ఇప్పుడు రాహుల్‌గాంధీ బహిష్కరణ,శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు. ప్రధానిలో ఒకరకమైన భయం మొదలైందన్న నిజానికి నిదర్శనం. ఎందుకంటే ఎంత బీజేపీ రెండు సార్వత్రిక ఎన్నికలు గెలిచినా, కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు ఒకటి నికరంగా దేశంలో ఉన్నది. ఇప్పుడు మోదీ భయం ప్రతిపక్షాలు తప్పిదారి కాంగ్రెస్‌తో కలిశాయంటే, బీజేపీ పని ఖతమైపోతుంది. ప్రజలు ఈ విషయం ఆలోచిం చాలి.ఇప్పుడు ఏంజరుగుతుంది?రాహుల్‌ గాంధీ ని జైల్లో పెట్టినా,బెయిల్‌ మీదవిడిచి పెట్టినా, ప్రియాంకా గాంధీ సహించి ఊరుకుంటుందా? హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? పైగా ప్రజలందరూ ప్రభుత్వాలు ఏమి చేసినా భజన చేసేవాళ్లే ఉండరు కదా! ఆలోచన పెరుగు తుంది. దానితోటే ఆవేశం కలుగుతుంది. వారికి ఉన్న ఒకే ఒక్క ఆయుధమైన ఓటుతో సరైన పాఠం చెప్తారు. అలా చేయటానికి కాంగ్రె స్‌ మీద ప్రేమ ఉండక్కరలేదు.నియంతృత్వ పోకడల పట్ల విముఖత చాలు. ఇదే జరిగిన రోజు బీజేపీ చరిత్ర ముగిసి నట్టే! ఆధునిక నియంతలు ముస్సోలినీ,హిట్లర్‌ రెండురోజుల తేడాతో జీవితం చాలించడం చారి త్రక సత్యం. మోదీ-షా ద్వయం తప్పు మీద తప్పు చేసి అధికారం కోల్పోవటం దానిని చరిత్రలో లిఖిం చటం మన కండ్ల ముందే జరుగుతుంది. – (కనకదుర్గ దంటు)

ఏది భారత జాతీయత ?

దేశంలో గత కొంత కాలంగా జాతీ యత పేరు మీద కుహనా జాతీయవాదం వెర్రి తలలు వేస్తోంది. ప్రభుత్వ ప్రాయోజిత భావజా లాన్ని వ్యతిరేకించే వారు, ప్రశ్నించేవారు దేశ ద్రోహులుగా ముద్రించబడుతున్నారు.దేశ సామా జిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న అంశాలపట్ల ప్రభుత్వ ప్రాయోజిత నిపు ణులు,మేధావుల అభిప్రాయాలకు భిన్నంగా స్వ తంత్ర అభిప్రాయాలు కలిగి ఉండటం రాజద్రో హంగా మారిపోయింది. ఈ పరిణామాలన్నింటి వెనక దండలో దారంలాగా కొనసాగుతున్న అం శం జాతీయత గురించిన చర్చ. పాలక వర్గాల అభిప్రాయాలే సర్వసాధారణంగా ప్రజాభిప్రా యాలుగా చెలామణీ అవుతాయన్న మార్క్స్‌ సూత్రీ కరణ తాజా పరిణామాల నేపథ్యంలో మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రాయోజిత ప్రసార మాధ్యమాలు (ఎంబెడెడ్‌ జర్నలిజం) ఏకశిలా సదృశమైన ఉన్మత్త హిందూత్వమే నిజమైన జాతీ యత అని నమ్మించ చూస్తున్నాయి. సమ్మిళిత సాంస్కృతిక సామాజిక పునాదులు కలిగిన భారతీ యతకు ప్రత్యామ్నాయంగా ప్రచారంలో పెడుతు న్నాయి.
నిజానికి భారతీయ జాతీయత అంటే ఏమిటన్న విషయాన్ని నిర్ధారించే కోణంలో చారి త్రక పరిశోధనలు లేకపోవటంతో పాచిపళ్ల దాసుడు పాడిరదే పాటగా మారింది. ఈ కాలం లో ఉన్మత్త హిందూత్వ శక్తులు రాజ్యాంగ పునా దులుపై సాగిస్తున్న విధ్వంసక దాడికి మరింత పదును పెట్టిన సందర్భంగా తాజాగా భారత జాతీయ అన్న భావనపై సాగుతున్న దాడిని చెప్పుకోవచ్చు.ఈ నేపథ్యంలో భారతీయత గురిం చి ప్రజాతంత్ర రాజ్యాంగం అందించిన అవగా హనకు నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శ నం అయిన ఆరెస్సెస్‌ ముందుకు తెస్తున్న అవగా హనకు మధ్య ఉన్న విభజన రేఖను అర్థం చేసుకో లేకపోతే మరో తరం మతోన్మాదులు ప్రేరేపించే భావోద్వేగాలకు బలికాక తప్పని పరిస్థితి కనిపి స్తుంది. చారిత్రక పరిశీలన కోణం నుండి చూసిన పుడు ఆధునిక ప్రపంచ చరిత్ర, ఆధునిక జాతీయ రాజ్యాలచరిత్ర,పెట్టుబడిదారీ వ్యవస్థదాని పరిణా మ చరిత్ర విడదీయ రానంతగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. చారిత్రక పరిణామ క్రమం లో దేశం ప్రాథమికంగా భౌగోళిక యూని ట్‌గా మొదలవుతుంది. వివిధ భౌగోళిక ప్రాంతాల మధ్య నిర్దిష్టంగా స్పష్టంగా గుర్తించ గలిగిన సంస్కృతి, ఆచారవ్యవహారాలూ భాషలూ ఇతర ప్రమా ణాలుగా ఉంటాయి. అందువల్లనే ఉన్నత పాఠశాల స్థాయిలో రాజ్యం గురించిన పరిచయ పాఠ్యాం శాల్లో రాజ్యానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ప్రభుత్వం, భాష, ప్రజలు, నిర్దిష్టమైన సరిహద్దులు అని నిర్వచించారే తప్ప మరే ప్రమాణం గురించీ ప్రస్తావించలేదు. అదేవిధంగా సాంఘిక శాస్త్రాల అధ్యయనంలో ప్రభుత్వాలు (ప్రభుత్వానికి నాయ కత్వం వహిస్తున్న వారి)అనుసరించే విధి విధా నాలు పద్ధతులు ప్రాతిపదికన రాజ్యాలను నాల్గు తరగతులుగా విభజించారు. అవి కూడా నియం తృత్వ రాజ్య వ్యవస్థలు, పోలీసు రాజ్యం, సంక్షేమ రాజ్య, సోషలిస్టు రాజ్య వ్యవస్థలుగా చెప్పుకుం టున్నాము.వీటిలో ఎక్కడా రాజ్య వ్యవస్థలను మతా ల ప్రాతిపదికన,సంకుచిత లక్ష్యాల కోసం రూ పొందించిన నిర్వచనాల ప్రాతిపదికన నిర్వచిం చలేదు.19వ శతాబ్దం ముగింపు నాటికి లౌకిక నిర్వచనం ప్రకారమే జాతీయతను నిర్దారించటం ప్రమాణంగా ఉంది. పాశ్చాత్య దేశాలన్నీ పైన చెప్పిన నాలుగు లక్షణాల ప్రాతిపదికనే సరిహద్దు లు విభజితం అయినట్టు యూరోపియన్‌ దేశాల చరిత్ర మనకు విదితం చేస్తుంది. యూరోపియన్‌ జాతీయవాదం పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణతో పాటు సంఘటితం అవుతూ వచ్చింది. దేశంలో ఉన్న అంతర్గత శతృవును గుర్తించి వారిని అస్థిత్వ పరంగా రాజకీయంగా సైద్ధాంతికంగా ఒంటరి పాటు చేసే క్రమంలో యూరోపియన్‌ జాతీయత క్రోడీకరించబడిరది. ఈ క్రమంలోనే పెట్టుబడి దారీ దేశాలు తమ మార్కెట్‌ అవసరాలు తీర్చు కునే నేపథ్యంలో వలసవాదాన్ని ఆశ్రయించటం తో జాతీయతకు సరికొత్త వ్యాఖ్యానం తెరమీదకు వచ్చింది. వర్ధమాన దేశాల్లో తెరమీదకు వచ్చిన జాతీయభావాలు బాహ్య శతృవుకు వ్యతిరేకంగా అంతర్గతంగా వైవిధ్య భరితమైన ప్రజా సమూ హాలను ఏకం చేసే క్రమంలో ముందుకొచ్చిన జాతీయత. ఈ విధంగా చూసినపుడు యూరోపి యన్‌ జాతీయ నిర్దిష్ట వర్గాలను, సామాజిక తరగ తులను,మత విశ్వాసాలను వెలివేసింది (ఎక్స్‌క్లూ జివ్‌) జాతీయత కాగా వర్ధమాన దేశాల జాతీ యత సకల సామాజిక తరగతులు, మత విశ్వాసాలు,వర్గాలను సంలీనం చేసుకునే (ఇన్‌ క్లూజివ్‌) జాతీయత అన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. యూరోపియన్‌ దేశాల్లో పెల్లుబుకిన జాతీయత ఆయా దేశాలను పదేపదే విచ్ఛిన్నం చేస్తూ పునరేకీకరణ గావిస్తూ షుమారు రెండు వందల ఏండ్ల రక్తసిక్త యూరప్‌కు తెరతీ సింది. దీనికి భిన్నంగా వర్ధమాన దేశాల్లో సంఘటి తమైన జాతీయత సుమారు వందేండ్ల వర్తమాన చరిత్రలో శాంతియుత సహజీవనానికి పునాదులు వేసింది.ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇంత దీర్ఘకా లం వర్థమాన దేశాల్లో అంతర్గత శాంతియుత పరిస్థితులు కొనసాగటం ఇదే ప్రథమమం అని చెప్పటం అతిశయోక్తి కాదు.
భారత రాజ్యాంగం, భారత జాతీయత రెండూ స్వాతంత్య్రోద్యమ పోరాట నేపథ్యంలో రాటుదేలిన వైవిధ్య భరితమైన రాజకీయ సామాజిక మేధోమధనం ఫలితం. యూరోపియన్‌ జాతీయత సంఘటితమయ్యే క్రమంలో పాలకవర్గాలు,మార్కెట్‌ కీలక పాత్ర పోషిస్తే భారత జాతీయ సంఘటితం కావటంలో ప్రజలు, ప్రజా పోరాటాలు, ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ అంశంగా మారిన వలసవా దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజా పోరాటాలు కీలక పాత్ర పోషించాయి. ఈ ప్రజా పోరాటాలు దేశ రాజకీయ వ్యవస్థ ముందు ఉంచిన ఆశలు, ఆశయాలు, లక్ష్యాల సాధనతో పాటు యూరోపి యన్‌ తరహా జాతీయతకు భిన్నంగా విలక్షణమైన సమ్మిళితమైన భారత జాతీయతను పాలకవర్గాలు అంగీకరించాల్సిన పరిస్థితి కల్పించింది. భారత రాజ్యాంగం కొన్ని మౌలిక విషయాలను ప్రత్యేకించి నిర్వచించకుండా వదిలేసింది.జాతీయత అంటే ఏమిటి?ఇండియా దట్‌ ఈజ్‌ భారత్‌ అన్న పదబం ధం అటువంటి మౌలిక విషయాల్లో ఒకటి. అంత మాత్రాన రాజ్యాంగ పరిషత్‌ ఈఅంశాలను తడమ లేదు అనుకుంటే పొరపాటు. అప్పటికే సర్వాంగీకృత అభిప్రాయాలను వ్యక్తీకరించేవిగా ఈ పదబంధాలు ఉన్నందున వాటి గురించి ప్రత్యేకంగా చర్చించ లేదు. కానీ వాటిని విపులీకరిస్తూ వివిధ అధికరణా ల్లో ప్రస్తావనలు వదిలారు.
భారత భూభాగంపై జన్మించి నివశి స్తున్న పౌరులందరు భారతీయులే అని పౌరసత్వాన్ని ధృవీకరించింది.తద్వారా భారత జాతీయత భారత దేశంలో నివశించే వారందరి ఉమ్మడి జాతీయత పర్యవసానం అని చెప్పకనే చెప్పింది. అంతేకాదు. దేశంలో నివసిస్తున్న వైవిధ్యభరితమైన సామాజిక ఆర్థిక తరగతులు,మతవిశ్వాసాలకు చెందిన వారిని గుర్తించటమే కాక వారి అస్థిత్వాన్ని రాజ్యాం గం అంగీకరించింది. అందువల్లనే అటువంటి బలహీను లైన తరగతులందరికీ అవసరమైన రక్షణలు కూడా కల్పించాలని,స్వాతంత్య్రోద్యమ పర్యవసానంగా సంఘటితమైన భారత జాతీయతను కాపాడుకోవా లంటే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అన్ని తరగ తుల ప్రజల మనోభావాలు,ఆశలు,ఆశయాలు నెరవేర్చుకునేందుకు రాజ్యాంగం ద్వారా కనీస హామీ ఇవ్వాలని రాజ్యాంగ పరిషత్‌ నిర్ణయించింది. అందువల్ల భారత రాజ్యాంగంలో ప్రస్తావన లేని కోణాలు భారత జాతీయతలోనూ లేవు. స్వతంత్ర భారతదేశంఎన్నో వేర్పాటువాద ఉద్యమాలను తట్టు కుని అధిగమించి జాతీయ సమైక్యతా సమగ్రతలను కాపాడుకుంటూ తన ఉనికిని కొనసాగించుకుంటూ వచ్చింది.రాజ్యాంగం ఆరెస్సెస్‌ కోరుకుంటున్న మను వాద వ్యవస్థ, కుల వ్యవస్థను తిరుగులేని విధంగా దెబ్బ తీసింది.కుల వ్యత్యాసాలు,మత విశ్వాసాలతో నిమిత్తంలేకుండా రాజ్యంగం భారతదేశంలో జన్మిం చిన వారందరికీ సమాన హక్కులు,అవకా శాలు, ఓటింగ్‌ హక్కులు ప్రసాదించింది.ఇటు వంటి పరిమిత ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ స్థానంలో సార్వ త్రిక ఓటుహక్కును మొదటిగా అందరికీ అందిం చింది ఫ్రెంచి విప్లవం.ఈ విప్లవం స్ఫూర్తిగా నాటి వలస దేశాలన్నింటిలోనూ ఈ నినాదం పోరాట నినాదంగా మారింది.ఫ్రాన్స్‌,అమెరికా వంటి దేశా ల్లో సార్వత్రిక ఓటు హక్కు 1960 దశకం నాటికి గానీ చట్టబద్ధం కాని పరిస్థితుల్లో భారత రాజ్యాం గం 1947నాటికే సార్వత్రిక ఓటుహక్కును రాజ్యాం గ బద్ధం చేసింది.ఈ విధంగా సార్వత్రిక ఓటు హక్కు ఇవ్వటాన్ని నాడే ఆరెస్సెస్‌ వ్యతిరేకించింది. కుల మత ప్రాంత విద్వేషాలతో దేశాన్ని రక్తసిక్తం చేసే మనువాద సంస్కృతినే జాతీయతగా దేశం మీద రుద్దేందుకు శతాబ్ద కాలం నుంచీ ప్రయత్ని స్తూనే ఉంది.అటువంటి సంఘపరివారం స్వదేశీ ముసుగులో భారతదేశాన్ని యూరోపియన్‌ దేశాల తరహాలో ఉన్మాదపూరిత జాతీయతవైపు నెడుతున్న వాస్తవాన్ని గత ఐదేండ్లలో జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దేశీయంగా రూపొందిన జాతీ యత పునాదులు సంఘపరివారానికి అక్కర్లేదు. విదేశీ నమూనాలో ఉన్న ఉన్మాద భరిత జాతీయతే దానికి ముద్దు. అందుకే సమీకృత, ప్రజాతంత్ర భారత జాతీయతను కాపాడేందుకు కంకణ బద్ధులైన వారంతా ఈ ఎన్నికల్లో ఉన్మాద జాతీయ వాదానికి ప్రతినిధులుగా ఉన్న బీజేపీ, దాని మిత్రు లను ఓడిరచటం జాతీయ కర్తవ్యంగా ఎంచు కోవాలి. వ్యాసకర్త : విశ్లేషకులు,సీనియర్‌ పాత్రికేయులు) – (కొండూరు వీరయ్య)

మళ్లీ గెలిస్తే రాజ్యాంగానికి ముప్పే

ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి తలెత్తితే మనదేశంలో ప్రజాస్వామ్యం పని ముగిసినట్లేనని మనం భావించాలి.
భారత రాజ్యాంగం మత తటస్థతను,మత సమానత్వాన్ని బోధిస్తుంది. కానీ ఇవ్వాళ.. ఈ రెండూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి.బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? అనేది ఆలోచించాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా మోదీ హయాం మొదలైన తర్వాత ముస్లింలను భయభ్రాంతులను చేస్తూ జరుగుతున్న దాడులు ఆకస్మిక ఘటనలు కావు’ అని చెబుతున్నారు ప్రొఫెసర్‌ అశుతోష్‌ వర్షిణీ. ఈ అత్యంత ప్రమాదకర ధోరణిని భారతీయులు అడ్డుకోకపోతే, మోదీ మూడోసారి ప్రధాని పదవిని చేపడితే భారత రాజ్యాంగం ఉనికికే భంగం వాటిల్లే పెను ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు.హార్వర్డ్‌, మిషిగన్‌ విశ్వవిద్యాలయాల మాజీ అధ్యాపకుడిగా ఆయన పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీలో రాజనీతిశాస్త్ర అధ్యాప కుడిగా పని చేశారు.‘ది వైర్‌’ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్ధార్థ భాటియాతో జరిపిన సంభాషణలో అశుతోష్‌ పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఈమధ్య కాలంలో దేశంలో అనేక చోట్ల మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరిగిపోయాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువ. ఈ హింసా కాండ, దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహి స్తున్నది. ఢల్లీి జహంగీర్‌పురాలో శ్రీరామనవమి సందర్భంగా కత్తులు, కటారులు గాల్లో తిప్పు తూ, పిస్తోళ్లు పేలుస్తూ మసీదుల ముందు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పట్టపగలు ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగటం గమనార్హం.
దేశంలో మత ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది.1950ల నుంచి 1995 దాకా దేశంలో 1,180 మతపరమైన అల్లర్లు జరిగాయి. సుమారు 7,173 మంది చనిపోయారు. సుమారు ఎందుకంటే..మత ఘర్షణల్లో చనిపోయిన వారి లెక్క ఎప్పుడూ సరిగ్గా ఉండదు. అధికారిక లెక్క ఒకటి ఉంటే, వాస్తవసంఖ్య భిన్నంగా ఉంటుంది. మతఘర్ష ణలు చోటుచేసుకున్న చోట పోలీసుల తటస్థ తపై అనుమానాలు ఉంటున్నాయి. మరో పరిణామం ఏమంటే..ఈ ఘర్షణలు కొత్త రూపం తీసుకోవటం. మతఘర్షణలు వ్యవస్థీకృత కార్యక్రమంగా మారుతున్నాయి. 1984లో ఢల్లీిలో జరిగిన సిక్కుల ఊచకోత, 2002లో గుజరాత్‌లో ముస్లింల హత్యాకాండ వీటికి ఉదాహరణ. ఈ రెండిరటిలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా బాధ్యతల నుంచి దూరం జరిగిన తీరు కనిపిస్తుంది. అదింకా పెరిగిపోయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీ సులు, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలు మరిచి మతఘర్షణల్లో పూర్తిగా ఒక వర్గానికే కొమ్ముకాసింది. కొన్ని చోట్ల ప్రభుత్వ యంత్రాం గమే ముస్లిం వ్యతిరేకతలో భాగస్వామ్యం కావ టం ఒక కొత్త పరిణామం.ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. ఉదాహరణకు..కర్ణాటకలో ‘హిజాబ్‌’ అంశాన్ని చూడవచ్చు. హిందూ దేవాలయాల ముందు ముస్లింలు దుకాణాలు నిర్వహించ వద్దంటూ వారి జీవన ఆర్థిక హక్కుపై దాడి చేసి దాన్ని దూరం చేశారు. వీటన్నింటిపై కేంద్రం ఏమీ మాట్లాడదు. ఇదింకా ముందుకు పోయి,ఢల్లీిలో సిక్కులు దుకాణాలు నిర్వహించ వద్దని,వారి దుకాణాల్లో ఎవరూ కొనుగోళ్లు చేయవద్దని శాసించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. 1984 ఢల్లీి అల్లర్ల సమయంలో నేను ప్రత్యక్షంగా చూశాను.సిక్కులపై దాడులు రాజ్యం అండతోనే జరిగాయి.కానీ అప్పుడు రాజ్యం.. ట్యాక్సీలను సిక్కులు నడుపరాదని అనలేదు. అలాగే సిక్కులు హిందూ దేవాల యాల ముందు మిఠాయిలు,పూలు అమ్మరాదని హుకుం జారీ చేయలేదు.సిక్కులు తలపాగా లాగా ధరించే ‘పగిడి’ని హిజాబ్‌లాగా వివాదం చేయలేదు. 1984కు ఇప్పటికీ గుణాత్మక మార్పు ఇదే. ఇప్పుడు జరుగుతున్న వాటిని గమనిస్తుంటే..ఈ పరిణామాలన్నీ రాబోయే ప్రమాదానికి సంకేతాలు. హిజాబ్‌ను వద్దని అన్నవాళ్లు సిక్కుల పగిడిని కూడా వద్దంటారా? బొట్టు పెట్టుకోవటాన్నీ, కొన్ని విద్యాసంస్థల్లో ధోతి కట్టుకోవటాన్ని కూడా తప్పుపట్టి నియం త్రిస్తారా? భారత రాజ్యాంగం మత తటస్థతను, మత సమానత్వాన్ని బోధిస్తుంది. కానీ ఇవ్వాళ.. ఈ రెండూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడు కోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు ఎందుకు ఎక్కువ జరుగు తున్నాయి? అనేది ఆలోచించాలి. హిందూ జాతీయవాదం తొలి నుంచీ తాత్వికం గానే కొన్ని ప్రజా సమూ హాలను జాతి వ్యతిరేక మైనవిగా ప్రకటించింది. ఆ ప్రజలు ఇక్కడే పుట్టినా,వారి పవిత్ర స్థలాలు భారత్‌లో లేవు కాబట్టి, వారి జాతీయత ఈ దేశానికి చెందినది కాదంటున్నారు. దేశంలో 14 శాతం ఉన్న ముస్లింలు, 2శాతం ఉన్న క్రిస్టి యన్లను పరాయివారుగా ప్రకటిస్తున్నారు. వాటిక న్‌ను, మక్కాను పవిత్రస్థలంగా భావించేవారు నిజమైన భారతీయులు కాదంటున్నారు. మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ‘1200 ఏండ్ల బానిసత్వం వీడిరది’ అని వ్యాఖ్యానించారు. దేశంలో 1920ల్లోనే హిందు త్వానికి పురుడు పోసిన వారు కూడా ఆ కాలం లో సరిగ్గా ఇదే మాట చెప్పటం గమనార్హం. ఈ క్రమంలోంచే..శతాబ్దాల కిందట హిందు వులపై ముస్లిం రాజుల దాడికి ప్రతీకారంగా ఇప్పుడు వారిపై దాడి చేయాలనే వాదాన్ని అమలు చేస్తున్నారు.1947లో మతం పునాదిగా రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత భారత్‌ లో హిందువులే ప్రధానమని, మిగతావారు ద్వితీయ శ్రేణికి చెందుతారని వారు అంటు న్నారు. హిందూత్వవాదులు,బీజేపీ నేతలు విశ్వసించేది ఏమంటే..కొన్ని వర్గాల వారిని అణచివేత ద్వారానే అదుపులో పెట్టగలమని. వీరి సిద్ధాంతకర్తలు కూడా ‘ముస్లింలకు సామాన్యుల భాష అర్థం కాదు. వారికి బలప్రయోగం ద్వారానే ఏదైనా అర్థం చేయించగలం. చరిత్ర ఇదే చెప్తున్నది’ అని ఆనాడే అన్నారు. అలాగే..‘వారు (ముస్లింలు) ఆనాడు బలప్రయోగం ద్వారానే మనలను ఓడిరచి ఆధిపత్యం సాధించారు. ఇప్పుడు హిందువులకు సమయం వచ్చింది. వారిని ఆ విధంగానే నియంత్రించి ఆధిపత్యం సాధిం చాల’ని ప్రబోధించారు. సరిగ్గా దాన్నే ఇప్పుడు బీజేపీ, హిందూత్వ వాదులు అమలు చేస్తు న్నారు. కాబట్టి వీటిని ఏదో కాకతాళీయంగా జరిగిన, జరుగుతున్న ఘటనలుగా చూడవద్దు. వీటిని ప్రయత్నపూర్వకంగా, పద్ధతి ప్రకారంగా జరుగుతున్న దాడులుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిందుత్వవాదులు కొత్తదశలోకి ప్రవేశించారు. దేశంలోని హిందువులు ప్రథమ శ్రేణి పౌరులని, మిగతావారిని ద్వితీయ శ్రేణిగా చెప్తున్నారు. రాజ్యాంగపరంగా అంబేద్కర్‌ చెప్పిన వాటిని కూడా తిరస్కరిస్తున్నారు. మనుషులంతా సమానం అన్నదాన్నే కాదు, మతాలన్నీ సమానమే అనటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. హిందూత్వం పేరుతో రాజ్యాంగాన్నే గుర్తించనివారు..రాజ్యాంగాన్ని అమలుచేసే అధిపతులుగా మారారు. ఎన్నికల ద్వారా పార్లమెంటు, అసెంబ్లీల్లో మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఏ రాజ్యాంగ విలువల పునాదులపై మన ప్రజాస్వామ్యం మనగలిగిందో, ఆ రాజ్యాం గం పైనే దాడికి దిగుతున్నారు. బీజేపీ విజయం రాజ్యాంగ పరమైన సమస్య మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య సంక్షోభానికీ అది కారణమవు తుంది. దేశంలో 11రాష్ట్రాలు ఇప్పటికీ వారి ఆధీనంలో లేవు. అందులో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఉన్నాయి. యూపీలో రెండోసారి అధికారాన్ని నిలుపుకొన్నా, గతంలో మాదిరిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించటం అంత సులువు కాదు. అయితే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఎదుర్కొనగలవా? పంజాబ్‌, బెంగాల్‌, మహారాష్ట్ర, బీహార్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే రాజకీయ శక్తి ఏది? అన్నది ప్రధానమైనది. అలాగే, బీజేపీని ఎదు ర్కోబోయే రాజకీయశక్తికి ఎవరు నేతృత్వం వహించాలి అన్నది క్లిష్టమైనది. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి 19శాతం ఓటు బ్యాంకుఉన్నది. మిగతా పార్టీలన్నీ రెండు, మూడు శాతం ఓట్లే కలిగి ఉన్నాయి. తృణముల్‌ కాంగ్రెస్‌ 3.3 శాతం,డీఎంకే 2.7శాతం,ఆమ్‌ ఆద్మీ పార్టీ 2 శాతం ఓట్లు కలిగి ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీని నిలువరించే శక్తి సమకూరు తుంది. ఒకవేళ మూడోసారి మోదీ అధికా రంలోకి వస్తే..రాజ్యాంగం ఉనికే ప్రశ్నార్థక మవుతుంది. 2024లో మోదీ గెలుపుతో ఆ ప్రమాదం పొంచి ఉందనటంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇక్కడే మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఒక రాజనీతి శాస్త్రవేత్తగా, రాజకీయ పరిశీల కుడిగా.. మెజారిటీ వర్గం రాజకీయ ఆధిపత్యం సాధిస్తే సంభవించే పరిణామాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. శ్రీలంక, మలేషి యా గురించి తెలుసుకోవాలి. సింహళీయుల ఆధిపత్యం గల రాజ్యంగా శ్రీలంక అవతరిం చింది. ఆ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు లేవు. ద్వితీయ పౌరులుగా పరిగణిం చబడిన తమిళులపై తీవ్ర వివక్ష, అణచివేత కొనసాగాయి. ఫలితంగా తమిళులు తిరగ బడ్డారు. 20ఏండ్ల పాటు శ్రీలంక అంతర్యు ద్ధంలో మునిగి పోవాల్సి వచ్చింది. అదే మలేషియా ఒక మెజారిటీ వర్గం ఆధిపత్యం వహించే విధంగా ఏర్పడలేదు.అక్కడ మైనా రిటీలుగా ఉన్న చైనీయులను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడలేదు. జాతి సమానత్వం పాటించారు. దీంతో అక్కడ జాతిపరమైన పోరాటాలు ప్రజ్వరిల్లలేదు. దీన్నిబట్టి, మెజారిటీవాద ఆధిపత్య రాజకీయాధికారం దీర్ఘకాలంలో తీవ్రమైన అంతర్యుద్ధాలకు, హింసకు కారణమవుతుందని అర్థమవుతున్నది. అణచివేత కారణంగా ఒకవేళ భారతీయ ముస్లింలు ద్వితీయశ్రేణితో రాజీపడితే.. అది కనిష్ఠ స్థాయి ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది. కానీ, వారు అణచివేతను ధిక్కరించి సంఘ టితమైతే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. శ్రీలంకను తలపిస్తాయి. దేశంలో ముస్లింలంతా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై లేరు. మూలమూలలా విస్తరించి ఉన్నారు. భౌగోళికం గా అనేక దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్న భారత్‌లో ముస్లింలలో అలజడి,అసంతృప్తి ఊహించని ఫలితాలకు దారితీస్తుంది.ఇక్కడే ఇజ్రాయిల్‌, పాకిస్థాన్‌ గురించి కూడా చెప్పు కోవాలి. ఈ దేశాల్లో మైనారిటీ వర్గాలకు సమాన స్థాయి, గౌరవం ఇవ్వలేదు. తమను తాము యూదు, ముస్లిం దేశాలుగా అవి ప్రకటించుకున్నాయి. కానీ, భారతదేశం తననుతాను ఒక మతదేశంగా కాకుండా లౌకికదేశంగా ప్రకటించుకుంది. దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉంటాయని రాజ్యాంగం హామీ ఇచ్చింది. కాబట్టి మైనారిటీ వర్గాల రక్షణ, భద్రత అనేది ప్రభుత్వం పైనున్న రాజ్యాంగ పరమైన బాధ్యత. ఇప్పటిదాకా పౌరుల హక్కుల రక్షణకు మన రాజ్యాంగం హామీగా నిలిచింది. అందుకే దేశవాసులకు ఇప్పటికీ రాజ్యాంగంపై ఎనలేని విశ్వాసం ఉన్నది. ఈ మధ్యన కార్యనిర్వాహక, రాజకీయ వర్గాల ఆధిపత్యంలో న్యాయవ్యవస్థను నిష్క్రియా పరత్వం చేసే ప్రయత్నం జరుగుతున్నది. నా వ్యక్తిగత ఆలోచనాదృక్పథం చెబుతున్న దేమంటే.. న్యాయవ్యవస్థ ఎన్ని సమస్యలు ఎదురైనా సానుకూల శక్తుల దన్నుతో అది నిలబడుతుంది. అలాంటి శక్తులను పక్కకు జరిపి 1975,76 లోలాగా రాజ్యాంగాన్ని అతిక్రమించటం అంత సులువు కాకపోవచ్చు. అయితే రాజ్యాంగ విధ్వంసం ఎంతదాకా పోతుంది, ఏమవుతుందన్నది ఆందోళన కలిగించేదే. అన్ని విషయాలూ`గిరిగీసినట్లుగా జరుగకపోవచ్చు. అయితే ఆశావహ దృక్పథం ఎప్పుడూ అస్పష్టం,బలహీనం కాబోదు. మన దేశం ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ వచ్చింది. గత 70 ఏండ్లుగా ప్రజాస్వామ్య దివిటీగా ప్రపంచంలో వెలుగొందుతున్నది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి గాంచింది. కొన్ని శక్తుల అవాంతరాలతో ఇంతటి ఘనచరిత్ర మసకబారుతుందా,దారి తప్పుతుందా? ప్రఖ్యాత అంతర్జాతీయ ‘ప్రజా స్వామ్య అధ్యయన సంస్థలు’ ఫ్రీడం హౌజ్‌,వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌-స్వీడన్‌..భారత్‌లో దిగజారిన ప్రజాస్వామ్యం పరిస్థితులను తెలియజెప్పాయి. ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రజాస్వామ్యంతో తీవ్రంగా ఘర్షణ పడుతున్న పరిస్థితి నెలకొన్నది.విస్తృతార్థంలో చెప్పుకోవాలంటే.. ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు. రెండు ఎన్నికల మధ్య కాలంలో జరిగే సామాజిక ఆచరణే ప్రజాస్వామ్యం.ఆ ఐదేండ్ల కాలంలో రాజ్యాంగ నియమాలను ప్రభుత్వం ఎలా అమలు చేసిందన్నదే ప్రజాస్వామ్యం. కాబట్టి, మనది చైతన్యవంతమైన ప్రజాస్వా మ్యమని అనలేం. మనది చైతన్యవంతమైన ఎన్నికల ప్రజాస్వామ్యం మాత్రమే. కానీ, రాజ్యాంగ ప్రజాస్వామ్యం మాత్రం రోజు రోజుకీ బలహీనపడుతున్నది.
‘పౌరులకు హక్కుల కన్నా విధులు ముఖ్యం’ అని ఆ మధ్య ప్రధాని మోదీ ప్రకటించారు. గతంలో హిందూత్వ సిద్ధాంతకర్తలు కూడా..‘హక్కులు దేశాన్ని బలహీనపరుస్తాయి. బాధ్యతలు బలోపే తం చేస్తాయి’ అనే అన్నారు. వాస్తవానికి దీంట్లో ఉన్న అసలు విషయం ఏమిటంటే.. ప్రజలకు హక్కులు లేకుండా చేయటం.దాని గురించి ప్రశ్నించనివ్వకుండా నోరు నొక్కటం.మోదీ కూడా ప్రజల హక్కులను అణచివేస్తూనే, తాను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొం టున్నారు. ఇదంతా హిందూత్వ భావజాల కార్యాచరణలో భాగమేనని అర్థం చేసుకోవాలి. మనం పేపర్లు చదువుతాం.టీవీ చూస్తాం. వాట్సాప్‌ సరేసరి. వీటి ప్రభావం చాలా పెద్దది. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా స్పందిస్తున్నాం. మనదేశంలో మన చుట్టూ జరుగుతున్న వాటిపై కూడా భారతీయులు సరిjైున విధంగా స్పందిస్తారనే ఆశ, నమ్మకం నాకున్నది. గతంలో ఈ దేశ ప్రజానీకం దాటి వచ్చిన అవరోధాలను బట్టి, నేడు కూడా వారు విజయం సాధిస్తారనే విశ్వాసం నాకు న్నది’.ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి తలెత్తితే మనదేశంలో ప్రజాస్వామ్యం పని ముగిసినట్లేనని మనం భావించాలి.- వాసకర్త : ప్రముఖ పాత్రికేయులు,రాజకీయ విశ్లేషకులు (నమస్తే తెలంగాణ సౌజన్యంతో..)- (అశుతోష్‌ వర్షిణీ)

గీతం న్యాయ అవగాహన సదస్సు

భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులు,బాధ్యతలు పౌరులకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి తెలిపారు. భారత ప్రభుత్వన్యాయ మంత్రిత్వ శాఖ,న్యాయ విభాగం,గీతం స్కూల్‌ ఆఫ్‌ లా మరియు భోపాల్‌లోని న్యాయగంగ ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న న్యాయ అవగాహన సదస్సు మార్చి 9న గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. నీ సదస్సును రవి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన న్యాయ విద్యార్థులను ఉద్దేశించిప్రాధిమికంగా పౌరుల తెలుసుకోవలసిన న్యాయ పరమైన అంశాలు, పౌరుల బాధ్యతలు అనే అంశంపై సమత స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకులు రవి రెబ్బాప్రగడ ప్రసంగించారు.స్వేచ్ఛా,స్వాతంత్య్రపు హక్కు,మతస్వాతంత్య్ర హక్కు లాంటి సంప్రదాయ హక్కులతోపాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు,పీడనాన్ని నిరోధించే హక్కు,విద్యా,సాంస్కృతిక హక్కులు సైతం ప్రాధమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి అని అన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదని తెలియజేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాధమిక హక్కులుపేర్కొంటున్నాయని గుర్తిచేశారు. తర్వాత సమత సుప్రీం కోర్టు సాధన,ఆదివాసీల వనరులు పరిరక్షణ కోసం సమత చేసిన కృషి,ఐదోవ షెడ్యూల్‌లో గిరిజనుల వనరులు,భూమి హక్కుల పరిరక్షణకు జడ్జెమెంట్‌ ఏవిధంగా కాపాడు తుందనే అంశాలను విద్యార్థులకు వివరించారు. తర్వాత న్యాయ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నివృత్తి చేశారు. మధ్యాహ్నాం జరిగిన సదస్సులో సిబిఐ విశ్రాంతి ఐపిఎస్‌ అధికారి వి.వి.లక్ష్మి నారాయణ సైబర్‌ నేరాలు వాటిని నియంత్రించే చట్టాలు అనే అంశంపై ప్రసంగించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ లా డైరక్టర్‌ ప్రొఫెసర్‌ అనితారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సంర్భంగా న్యాయ అవగాహన పై వివిధ నినాధాలు, సచిత్ర అంశాలతో ఎగ్సిబిషన్‌తో పాటు న్యాయ అంశాలపై క్విజ్‌ పోటీ నిర్వహించారు. సమకాలీన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విద్యార్ధులు ప్రదర్శించిన వీధినాటిక ప్రజలను చైతన్య పరిచేదిగా ఉంది. న్యాయ వృత్తిలో పాటించాల్సిన మెలకవులపై విద్యార్ధులకు ప్రాక్టికల్‌ అనుభవాన్ని అందించడంతో పాటు, వాదోపవాదాలపై న్యాయస్థానంలో వృత్తి నైపుణ్యాన్ని పెంచటానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని గీతం స్కూల్‌ ఆఫ్‌ లా డైరక్టర్‌ ప్రొఫెసరన బి.అనితారావు తెలిపారు. కార్యక్రమంలో గీతం స్కూల్‌ ఆఫ్‌ లా అధ్యాపకులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. – ` సైమన్‌ గునపర్తి

విద్యావంతుల విజ్ఞతనే సవాలు చేస్తారా?

‘ఈ శాసనమండలి ఎన్నికలు సెమీ ఫైనల్స్‌’… ఈ మాటలు అన్నది వైఎస్సార్‌సిపి అగ్రనేతల్లో ఒకరైన వై.వి.సుబ్బారెడ్డి.జగన్‌ కూడా తమ పార్టీ శ్రేణులను ఈ ఎన్నికలలో సర్వశక్తులూ ఒడ్డి పని చేయమని ఆదేశించారు. శాసన మండలిలో ప్రతీ రెండేళ్ళకూ మూడో వంతు స్థానాలు ఖాళీ అవుతూంటాయి. వాటిని భర్తీ చేసేందుకు ఎన్నికలు జరుగుతూంటాయి. ఈ ఎన్నికల్లో ఓటు చేసేవారు సాధారణ ఓటర్లు కారు. కొన్నింటికి కేవలం ఎమ్మెల్యేలే ఓటర్లు. కొన్నింటికి స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే ఓటర్లు. కొన్నింటికి ఉపాధ్యాయులే ఓటర్లు. మరికొన్నింటికి పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేయించుకున్న పట్టభద్రులు పది లక్షలమంది సుమారుగా ఉంటారు.ఈ విధం గా చాలా పరిమితమైన పరిధిలో ఓటర్ల అభి ప్రాయాలు వ్యక్తం అయ్యే ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ ఎలా అవుతాయి? అదే ఏవో కొన్ని శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా లేక లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా అక్కడ అన్ని తరగతులకూ చెందిన ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ శాసన మండలి ఎన్ని కలలో ఆ విధంగా వ్యక్తం కాదు. అయినా వైసిపి నేతలు అతిగా హడావుడి చేస్తున్నారు. ఏమిటి కారణం? వీటిలో ఎమ్మెల్యే కోటా లోని సీట్లు ప్రస్తుతం శాసనమండలిలో ఉన్న బలా బలాలను బట్టి అన్నీ వైఎస్సార్‌సిపి కే దక్కు తాయి. స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావలసిన స్థానాలూ ఆ పార్టీకే దక్కుతాయి. ఇక గవర్నర్‌ నామినేట్‌ చేసేవి ఎటూ పాలకపార్టీ సిఫార్సు ఆధారంగానే భర్తీ అవుతాయి గనుక అవీ అధికార పార్టీవే. ఇక మిగిలిపోయినవి రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానాలు, మూడు పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలు. వీటి విష యంలో వైసిపి ఈ మారు ఎందుకింత ఉలికి పడుతోంది? పట్టభద్రుల స్థానాల్లో కూడా రాజకీయ పార్టీలు పోటీ పడవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పనవసరం లేదు. కాని అధికారంలో ఉన్న పార్టీ హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే ఓటర్లు గౌరవిస్తారు కాని ఇలా అన్ని విలువలనూ గాలికి వదిలి చౌకబారుతనంగా,అడ్డగోలుగా దిగజారిపోతే ఆ విద్యావంతులు,మేధావులు అయిన ఓటర్లు ఈసడిరచుకుంటారన్న కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోవడం చూస్తే కొంత జాలీ,కొంత ‘అది’కలుగుతోంది.
కనీస విద్యార్హతలు కూడా లేనివారిని ఓటర్లుగా చేర్చేశారు. అంటే అచ్చంగా విద్యావంతు లైనవారే ఓటర్లుగా ఉంటే తాము గెలవడం సాధ్యం కాదు అని అధికార పార్టీ ఎన్నికలకు ముందే ఒప్పేసుకుందన్నమాట! అబ్బే, అటు వంటిదేమీ కాదు అని వైసిపి చెప్పదలచుకుంటే అర్హత లేని ఓటర్ల పేర్లు తొలగించడంలో తామే ముందుండి వ్యవహరించి వుండాలి. ఎందుకు అలా చేయలేకపోయింది? కనీస స్థాయిలో కూడా నైతిక స్థైర్యం లేని దుస్థితిలో ఆ పార్టీ ఎందుకుంది? వలంటీర్ల వ్యవస్థ స్థాయిలో మొదలుపెట్టి అత్యున్నత స్థాయి అధికారుల వరకూ అందరి అధికారాలనూ ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎంతో ప్రఖ్యాతి కల ఆంధ్రా యూనివర్సిటీకి ఉపకులపతి హోదాలో ఉండడం అంటే ఎంత ప్రతిష్టా త్మకమైన విషయం! అటువంటి స్థానంలోని వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ అధికారపార్టీ అభ్యర్ధికి ప్రచారం నిర్వహించా రంటే వైసిపి దిగజారుడు అధ:పాతాళానికి పోయిందని వేరే చెప్పాలా? అధికార పార్టీ తరఫున కులసంఘాల పేరుతో ప్రచారం జరిగిపోతోంది. డబ్బు విచ్చలవిడిగా వెదజల్లి, కానుకల పేరుతో ప్రలోభపెట్టి ఓటర్లను లొంగదీసుకోవాలన్న పథకాలు అమలులో పెడుతున్నారు. అంటే ఓటర్ల విద్యాస్థాయి పట్ల, వారి మేధో స్థాయి పట్ల పాలక పార్టీకి ఎంత గౌరవం ఉందో తెలిసిపోతూనే వుంది. 2007లో శాసనమండలి పునరుద్ధరణ జరిగింది. అందుకు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చొరవ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో గాని, ఆ తర్వాత గాని ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలలో అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ జోక్యం చేసుకోబోదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల పట్ల, సమా జంలోని విద్యావంతుల పట్ల, వారి అభిప్రా యాల పట్ల తనకెంతో గౌరవం ఉందని, తమ పార్టీని విమర్శించినా,వాటిని సలహాలుగానే స్వీకరిస్తానని ఆయన అన్నారు. ఆ కాలంలో ఎమ్మెల్సీలుగా పని చేసిన మాబోటివారు చెప్పిన సలహాలను అన్నింటినీ ఆయన అమలు చేశాడని చెప్పను. చాలా సలహాలను ఆయన అమలు చేయలేదు కూడా. కాని సలహాలను, సూచన లను, విమర్శలను వినే సహనాన్ని ఆయన ప్రదర్శించారు. ఆ రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకుని తిరుగుతూ, ఆయన పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్న వైసిపికి, ఆ పార్టీ అధినేతకు మాత్రం ఆ అధినేతకున్న సహనంలో వెయ్యో వంతు కూడా లేదు.2019లో అధికారం చేపట్టాక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి నేరుగా ఎన్నిసార్లు సమావేశాలు జరిపారు? ఎన్నిసార్లు వారి అభిప్రాయాలను విన్నారు? ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉం డాలంటారు. ఇదేనా ఆదర్శం?ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు జగన్‌ ప్రభు త్వంలోని ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులను కలుసుకోడానికి గాని, వారి వినతి పత్రాలను స్వీకరించడానికి గాని సిద్ధంగా లేరు. జగన్‌ హయాంలో ఒక్కటంటే ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా జరగలేదు. విద్యార్థి, యువజన,మహిళా,నిరుద్యోగ సంఘాల ప్రతి నిధులను ఒక్కసారి కూడా చర్చలకు పిలిచింది లేదు. రైతుల గురించి చాలా కష్టపడిపోతు న్నట్టు ప్రకటించుకునే ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సంఘాలతోగాని, రైతుకూలీ సంఘాలతో గాని, దళిత సంఘాలతోగాని ఎప్పుడైనా, ఎక్కడైనా ముఖాముఖి చర్చలు జరిపిందా? ఇది కూడా గత ప్రభుత్వం మాదిరి ముందస్తు అరెస్టుల ప్రభుత్వమే తప్ప ముందస్తు చర్చల ప్రభుత్వం ఎంతమాత్రమూ కాదన్న సంగతి అందరికీ తేటతెల్లం అయిపోయింది. అదానీలకు, అంబానీలకు రాష్ట్రంలోని పరిశ్రమ లను, భూములను కట్టబెట్టే పనిలో చాలా జోరుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది. అందుకే రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కు ను ప్రైవేటుపరం చేస్తానని మోడీ ప్రభుత్వం ప్రకటించినా,అసెంబ్లీలో ఒక తీర్మా నాన్ని చేయడం మినహా ఇక చేసిందేమీ లేదు.రాష్ట్ర ప్రజానీకపు మనోభావాలను ప్రతిబిం బించే విధంగా ఒక అఖిల పక్ష బృందాన్ని ఎందుకు ఢల్లీి తీసుకుపోలేక పోయారు? ఎందుకు అన్ని సందర్భాలలోనూ బిజెపికి అనుకూలంగా పార్లమెంటులో వైసిపి ఎంపీలు ఓటు చేస్తు న్నారు? విద్య, వైద్యం,విద్యుత్తు, ముని సిపల్‌ తదితర రంగాలలో మోడీ ప్రభుత్వం ఏం చెప్తే దానికల్లా తలాడిరచి అమలు చేస్తు న్నారు. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్వయంప్రతిపత్తి ఏమిటి? ఇదిగో ఇటువంటి విషయాలను శాసనమండలిలోను, వెలుపల లేవనెత్తుతున్నారు గనుకనే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలంటే అధికార పార్టీకి అంత అక్కసు, గుండెల్లో అంత గుబులు. అందుకే కక్షగట్టి ఈ పిడిఎఫ్‌ అభ్యర్ధులు ఎలాగై నా గెలవకూడదన్న దుగ్ధతో అన్ని విలువలకూ తిలోదకాలిచ్చేశారు. అడ్డగోలు దోవలు తొక్కుతు న్నారు.వైసిపి,దాని అధినేత ఒక్క విషయం మరిచిపోయినట్టు ఉన్నా రు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా ఉద్యమాలు వచ్చిన తర్వాతనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.ఆతర్వాత భారత రాజ్యాంగం వచ్చిం ది. ఆతర్వాతనే ఈ అసెంబ్లీ, పార్లమెంటు వచ్చాయి. ఎమర్జెన్సీ వంటి అత్యం త నిరంకుశ చర్యలనూ ఓడిరచనది ప్రజాఉద్య మాలే. చివరికి సైనిక పాలన పెట్టినా, దానిని కూల దోసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పా లంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం. ప్రజాఉద్యమాలను, ప్రజా సంఘాలను అణగదొక్కజూసిన ప్రతీ నాయకుడూ కాలగర్భంలో కలిసి పోయాడు. కాని ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే వున్నాయి. అవి ప్రజ ల్లోంచి, ప్రజల కోసం పుట్టుకొచ్చినవి. అధికార దాహం లోంచి పుట్టినవి కావు. వాటి ప్రతినిధు లు శాసనమండలిలో సభ్యులుగా ఉండడం శాసన మండలికే గౌరవాన్ని ఇచ్చింది, ఇస్తుంది. డబ్బు పంచిపెట్టకుండా, కానుకలు పంచిపెట్ట కుండా, కులం,మతం వంటి అంశాల ప్రస్తా వనలు తేకుండా,ప్రచారార్భాటానికి పోకుండా ఓటర్ల విజ్ఞత మీద సంపూర్ణ గౌరవంతో తాము గెలిస్తే ఆ ఓటర్ల వాణిని శాసనమండలిలో బలంగా వినిపిస్తామని మాత్రమే హామీ ఇస్తూ ఓట్లిమ్మన మని అడగగలిగే నైతిక స్థైర్యం ఉన్నది కేవలం ఒక్క పిడిఎఫ్‌ అభ్యర్ధులకు మాత్రమే. గెలిచాక తాము ముందస్తుగా ప్రకటించిన విధానాలకు, విలువలకు పూర్తిగా కట్టుబడి నిస్వార్ధంగా, నిజాయితీగా పనిచేస్తూ మాట దక్కించుకోగలుగు తున్నదీ పిడిఎఫ్‌ అభ్యర్ధులు మాత్రమే. ప్రజాస్వా మ్య విలువలను, ప్రజా తంత్ర వ్యవస్థను బలం గా నిలుపు కోవాలంటే ఈ తరహా ప్రజాప్రతి నిధులే కావాలి అని ఓటర్లు భావించేలా వ్యవహరిస్తున్నదీ పిడిఎఫ్‌ అభ్యర్ధులు మాత్రమే. పిడిఎఫ్‌ అభ్యర్ధుల మీద కక్ష గట్టి వ్యవహరిం చడం అంటే అది ప్రజాస్వా మ్యానికి ద్రోహం చేయడమే. అటు వంటి ద్రోహానికి పాల్పడు తున్న వైసిపికి ఈ ‘సెమీ ఫైనల్స్‌’’లో గట్టిగా గుణపాఠం నేర్పడానికి మన రాష్ట్రంలోని విద్యావంతులకు, మేధావులకు వచ్చిన మంచి అవకాశం మార్చి 13న జరగ బోయే ఉపాధ్యా య,పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికలు. ఈ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసు కుందాం.! (వ్యాసకర్త : పిడిఎఫ్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ (ప్రజాశక్తి సౌజన్యంతో..)- (ఎం.వి.ఎస్‌.శర్మ)

విజయవంతంగా గ్లోబల్‌ సమ్మిట్‌ `2023

విశాఖ ఆంధ్ర యూనివర్శిటీ క్రీడా మైదానంలో మార్చి 3,4వ తేదీల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల సమ్మిట్‌లో 378 ఎంవోయూలు జరిగాయని సీఎం జగన్‌ ప్రకటించారు. మొత్తం రూ.13 లక్షల41వేల 734కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు పరిశ్రమలు ఆసక్తి చూపినట్టు పేర్కొ న్నారు. దీని వల్ల 6లక్షల 9వేల 868 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ 2023కి పరిశ్రమల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశశాల నుంచి ప్రపంచస్థాయి సంస్థలు తరలివచ్చారు.
పరస్పర ప్రయోజనాల దిశగా….
రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేయడం, మరియు పెట్టుబడులు పెట్టేవారికి సహకారం అందించడంలో మా ప్రభుత్వం ఆలోచనా దృక్పథానికి ఇవాళ ప్రారంభం అవుతున్న యూనిట్లు ప్రతిబింబంలా నిలుస్తాయి. ఇవాళ యూనిట్లు ప్రారంభిస్తున్న వారంతా మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టబడిదారులకు ఆహ్వానం పలకడమే కాదు, వారికి మార్గనిర్దేశం చేయడంలో, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో, నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ లభిస్తుంది. వ్యాపారాల్లో ఉండే నష్టతరమైన క్లిష్టతలను తగ్గించడంలో మరియు, మీ పెట్టుబడులను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. దీనివల్ల పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా మీకేకాదు, రాష్ట్రానికి కూడా పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై మీరు నమ్మకాన్ని ఉంచి, ఈ సదస్సు ను అద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పారిశ్రామికవేత్తల పెట్టుబడులుతో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుం దన్నారు. అనుకూలమైన వాతావరణం ఏర్పాటుకు ఇది దోహదపడు తుందన్నారు. తన పాలనలో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని చెప్పారు జగన్‌. అనేక రంగాలకు తాము ఇచ్చిన ప్రధాన్యత ఆర్థిక వ్యవస్థను కాపాడాయి అన్నారు. వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పాటు చేశామ న్నారు. బ్రాడ్‌ బాండ్‌, ఇంటర్నెట్‌ అందరికీ అందించామన్నారు. పదిహేను రంగాను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నట్టు చెప్పారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముంద డుగు వేస్తోందన్నారు సీఎం జగన్‌ తెలిపారు. కీలక సమయంలో ఈ సమ్మిట్‌ నిర్వహించా మన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పథకాలు ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులేస్తోందని వివరించారు.‘‘అపారమైన సానుకూల దృక్పథంలో ప్రారంభించిన సమిట్‌లో రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడు పెట్టేందుకు 6,09,868 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 378 ఎంవోయూలు చేసుకున్నాం. ఒక్క ఎనర్జీ సెక్టార్‌లోనే 1,90,268 మందికి ఉపాధి కల్పించే రూ.8,84,823 కోట్ల పెట్టుబడులకు 40 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ సెక్టార్‌లో రూ.25,587 కోట్ల పెట్టుబడితో 56 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవి 1,04,442 మందికి ఉపాధిని కల్పిస్తాయి. పర్యాటక రంగంలో 30,787 మందికి ఉపాధి కల్పించే రూ.22,096 కోట్ల పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.’’ గణనీయమైన పెట్టుబడులకు అవకాశశం ఉన్న రంగాల్లో పునరుత్పాదక ఇంధన రంగం ఒకటి అని గట్టిగా చెప్పగలను. నిబద్ధత గ్రీన్‌ ఎనర్జీ కోసం ప్రయత్నిస్తూ భారత్‌కు గణనీయమైన సహకా రాన్ని అందిస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.14 ఇండస్ట్రీయల్‌ ఫెసిలిటీస్‌ను రిమోట్‌ ద్వారా సీఎం ప్రారంభించారు. రూ.3, 841 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లు 9,108 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాయి. ఈ సమ్మిట్‌ సందర్భంగా 100 మందితో 15 సెక్టార్లపై సెషన్‌లు నిర్వహించారు. ఏపీలో ఉన్న అడ్వాంటేజ్‌లను తెలియజేశారు. ఇందులో ఆటోమొబైల్‌ సెక్టార్‌,హెల్త్‌కేర్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా,అగ్రి ప్రాసెసింగ్‌ టూరిజం మొదలైనవి ఉన్నాయి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్‌తో సహకారం కోసం అవకాశాలను అన్వేషించడానికి నెదర్లాండ్స్‌, వియత్నాం, ఆస్ట్రేలియాతో సమావేశాలు నిర్వహించారు. రిలయన్స్‌ గ్రూపు, ఆదానీ గ్రూప్‌,ఆదిత్య బిర్లా గ్రూప్‌, రెన్యూ పవర్‌, అరబిందో గ్రూప్‌, డైకిన్‌, ఎన్టీపీసీ,ఐఓసీఎల్‌, జిందాల్‌ గ్రూప్‌, మోండలీస్‌,పార్లీ, శ్రీ సిమెం ట్స్‌ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.ఈ సందర్భంగా వారికి ధన్యవా దములు. మిమ్మల్ని అందర్నీ కలుసుకునే ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులందరికీ మేం ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మీరు మాకు చాలా చాలా ముఖ్యమైన వారు. మా రాష్ట్రం బలాలు, మేము కల్పించే విభిన్న అవకా శాలను, వ్యాపార రంగంలో స్నేహపూర్వక వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన పోటీ, ఆవిష్కరణల విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను మీకు తెలియ జేయాలనుకుంటున్నాను. మీ భాగస్వామ్యం ద్వారా స్థిరమైన, దీర్ఘకాలిక వృద్ధి సాధించడం పట్ల మేం సంకల్పంతోనే ఉన్నాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ యూనిట్లు, పోర్ట్‌ ఆధారిత మౌలిక సదుపాయాలు,మెడ్‌టెక్‌ జోన్‌, టూరిస్ట్‌ హాట్‌ స్పాట్‌లతో విశాఖపట్నం అత్యంత బలమైన బలమైన ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు సీఎం జగన్‌. విశాఖపట్నం కేవలం పారిశ్రా మిక రంగంలో బలమైన నగరమే కాకుండా, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిందనని.. ఇక్కడ ఈ సదస్సును నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది మన దేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం అని.. ఈ ఏడాది సెప్టెంబరులో ఒన్‌ఎర్త్‌, ఒన్‌ ఫ్యా మిలీ, ఒన్‌ ఫ్యూచర్‌ ‘‘ఒకే భూమి, ఒక కుటుం బం, ఒక భవిష్యత్తు’’ అనే థీమ్‌తో జీ-20 సదస్సును నిర్వహిస్తోందన్నారు. మార్చి చివరి వారంలో జరిగే జీ-20 వర్కింగ్‌ కమిటీ సమా వేశాలకు విశాఖ నగరం కూడా ఆతిథ్యం ఇస్తోందని తెలిపారు. రెండు రోజుల సదస్సులో కనిపించిన అద్భుతమైన ఆశావాదం రాష్ట్రంలో వ్యాపార వాతావరణాన్ని మరింత అను కూలం గా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘ఎంఒయు దశ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులను త్వరితగతిన గ్రౌండిరగ్‌ చేయాలని పారిశ్రామికవేత్తలకకు సీఎం అభ్యర్థించారు. దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రెండ్రోజుల సమ్మిట్‌ ద్వారా రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు 353 ఎంవోయూలు కుదిరాయి. దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్ని సదస్సుకు హాజరయ్యేలా చేయడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ముఖ్యంగా అంబానీ,కరణ్‌ అదానీ, జిఎమ్మార్‌, పునీత్‌ దాల్మియా,ప్రీతారెడ్డి,సజ్జన్‌ భజాంక్‌, హరిమో హన్‌ బంగూర్‌,జిందాల్‌,నవీన్‌ మిట్టల్‌, మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ కృష్ణా ఎల్లా,కుమార మంగళంబిర్లా వంటివారు స్వయంగా తరలివచ్చారు. ఇంత మంది ప్రముఖులు ఒకేరోజు ఒకేసారి ఒకే వేదిక పంచుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 50 వేల కోట్ల పెట్టుబడుల్ని స్వయంగా ముకేష్‌ అంబానీ ప్రకటించడమే కాకుండా..ప్రధాని నరేంద్రమోదీ, సీఎం వైఎస్‌ జగన్‌లపై ప్రశంసలు కురిపించడం సమ్మిట్‌కు హైలైట్‌ అయింది. ముకేష్‌ అంబానీ స్వయంగా విశాఖ సదస్సుకు హాజరు కావడమే కాకుండా..తన సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న 15 మంది సభ్యులతో ప్రత్యేక విమానంలో చేరుకోవడం మరో విశేషం.– జిఎన్‌వి సతీష్‌

సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టిద్దాం..!

దశాబ్దాల పోరాటం..అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానంఈ ఏడాది మహిళలందరం.. ఈక్విటీని స్వీకరించ గలగాలి. ఇది మనం చెప్పేది..రాసేది మాత్రమే కాదు. మనం ఆలోచించవలసిన, తెలుసుకోవలసిన, విలువైన స్వీకరించవలసిన విషయం. ఈక్విటీ అంటే… సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడం. మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత ప్రభావ పరిధిలో ఈక్విటీకి చురుకుగా మద్దతు ఇవ్వవచ్చు మరియు స్వీకరించవచ్చు.ఈక్విటీని స్వీకరించడానికి మీ స్నేహితులు, కుటుంబం,సహ చరులు మరియు సంఘాన్ని ప్రోత్సహించండి.. ర్యాలీ చేయండి… సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మనం కలిసి పని చేద్దాం..! మనమందరం కలిసి సమాన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడగలము. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఎల్లప్పుడూ ఈక్విటీని కలిగి ఉండేలా అందరం ఆలింగనం చేద్దాం! ఈనెల 8నఅంత ర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. డాక్టర్‌.దేవులపల్లి పద్మజ
ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధిం చు కున్న విజయమిది.రాజకీయంగా, ఆర్ధికం గా,సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిల బడిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగ తాలు తప్పడం లేదు. నిజమే..మహిళా దినోత్స వం సాధించుకోవ డానికి పలు దేశాల్లోని మహి ళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. పోరాడి అంరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక్క రోజుల్లో సాధ్యం కాలేదు.ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించు కున్న విజయమిది. ఆకాశంలో సగం..అన్నింటా సగం అనే మహిళలకు అన్నిచోట్ల ఇబ్బందులే ఎదురవు తున్నాయి. పురుషాధ్యికత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్ధిక,రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదు. నాడు చికాగోలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంర్జాతీయ మహిళాది నోత్సవంగా మారిపోయింది. వివిధ దేశాల్లో ప్రభు త్వాలు ఈరోజును ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. రాజకీయాల్లో రిజర్వేషన్‌,ఆస్తిహక్కుకల్పించినా లైంగిక దాడులు మాత్రం పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి.
ప్రత్యేక దినంగా మహిళలు తమ బాధలు,సమస్యలను చర్చించు కోవడానికి,నలుగురితో పంచుకోవడానికి ఒకరోజు ఉండాలని నిర్ణయించారు.ఆరోజును మహిళా దినో త్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో 1908 మే 3న సమావేశం నిర్వహిం చారు.1910ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్‌హాగన్‌లో జరిగింది.
ఇది నాంది
అమెరికాలోని కొంతమందితో ప్రేరణ పొందిన జర్మన్‌ సామ్యవాద లూయీస్‌ జియట్జ్‌ మహిళలు ఏటా మహిళా దినోత్సవం నిర్వహించాలని తీర్మానం చేశారు. దీనిని జర్మన్‌ సామ్యవాద క్లారాజెట్కిన్‌ సమర్ధించారు.17 దేశాల నుంచి హాజరైన 100మంది మహిళలు ఓటు, సమాన హక్కు,సాధించడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని భావించారు. 1911మార్చి 19న పదిలక్షల మందికిపైగా ఆస్ట్రియా, డెన్మా ర్క్‌, స్విట్జర్లాండ్‌ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వ హించారు. ఇందులో ఓటుహక్కు..ప్రభుత్వ పద వులు కావాలని డిమాండ్‌ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు.
1914 మార్చి 8 నుంచి
మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో చేశారు.1914నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవాల తీరుతెన్నులు,ఉత్యమాలపై 1980 ప్రాంతంలో చరిత్రకారిణి రినీ కోట్‌ పరిశోధన చేశారు.
మహిళలు పోరాటాలు..విజయాలు
1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వ హించి ఓటు హక్కు కావాలని తీర్మానం చేశారు. 1918లోగాని మహిళలకు అక్కడ ఓటు హక్కు లభించలేదు.1917లో (గ్రెగెరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం మార్చి8)సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ మహిళలు మొదటి ప్రపంచ యుద్దం,రష్యాలో ఆహార కొరత నివారించాలని కోరారు. ఆ రోజే వస్త్ర పరిశ్రమ లోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరిక లను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నినదించారు.మార్చి8న అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెనిక్‌, అలెగ్జాండర్‌, కొలెవ్టైల్‌లు వ్లాదిమిర్‌ లెనిన్‌ను ఒప్పించారు. కానీ అది 1965 నాటికదాకా అమల్లోకి రాలేదు. చైనా లో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రక టించినా సగం సెలవు రోజుగా పేర్కొన్నారు. 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్స వానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు, ప్రపంచశాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపు నిచ్చింది. అమెరికా 1994లో అంతర్జా తీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది.
మహిళల లక్ష్యాలు
– నాయకత్వం,రాజకీయాల్లో అవకాశాలు్చ ఆర్ధిక స్వాలంబన
– మహిళలపై హింస నివారణ
– శాంతి,భద్రత
– మానత్వం
– జాతీయ ప్రణాళిక,పరిపాలనలో సమానత్వం
– యువతకు ప్రాధాన్యం
– దివ్యాంగులైన మహిళలు,బాలికలకు అవకాశాలు
భారత్‌లో మహిళా హక్కుల ఉద్యమం
భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్‌లో అన సూయ సారాబాయ్‌ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. మహిళలను సంగటితం చేసిన వారిలో సుశీలా గోపాలన్‌,విమలా రణదివే,కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌,అహల్య రంగ్నేకర్‌,పార్వతీకృష్ణన్‌ ఉన్నారు. మహిళల ఉద్యంతో కార్మికుల పనివేళలు, వేతనాలపై చట్టాలను చేశారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న సరోజిని నాయుడు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవం ప్రకటనలు
-1996మహిళాల గతం గుర్తించడం,భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేయడం -1997మహిళలుశాంతి

-1998మహిళలు,మానవహక్కులు
– 1999మహిళలపై హింసలేని ప్రపంచం -2000శాంతికి మహిళలను సమన్వయ పర్చడం
– 2001మహిళలు,శాంతి,పోరాటాల నిర్వహణ -2002నేటిఆఫ్గన్‌ మహిళ,నిజాలు,అవకా శాలు
– 2003లింగ సమానత్వం -2004మహిళలు,హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌
– 2005లింగ సమానత,భద్రమైన భవిష్యత్తు నిర్మాణం -2006మహిళలు,నిర్ణయాలు
– 2007మహిళలు,బాలికలపై హింసలో శిక్ష తప్పించుకోకుండా చూడడం -2008మహిళలు,అమ్మాయిలు,పరిశోధన
– 2009మహిళలపై హింసకు వ్యతిరేకం -2010సమాన హక్కులు,సమాన అవకాశాలు
– 2011మహిళలు పనిచేసేందుకు అవకా శాలు,విద్య,శిక్షణ,శాస్త్రసాంకేతిక రంగాల్లోకి ప్రవేశం -2012గ్రామీణ మహిళల సాధికారత, పేదరికం ఆకలి నిర్మూలన
– 2013మహిళలపై హింస నివారణకు కార్యాచరణ -2014అన్నింటా మహిళల పురోగతి
– 2015మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడం -20162030నాటికి అంతరిక్షంలో 5050,లింగ సమానత్వం -2017పని ప్రదేశంలో మహిళలు,2030కి సమానత్వం
– 2018గ్రామీణ,పట్టణ ప్రాంత మహిళల్లో మార్పు -2019మార్పు సాధించేందుకు ప్రయత్నం
– 2020పురుషులతో సమానంగా హక్కులు -2021కోవిడ్‌19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం -2022మహిళల సమానత్వం,కార్యచరణ
– 2023`సమ్మిళిత ప్రపంచాన్ని స్వీకరించడం మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏపక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’అన్న స్వామి వివేకానంద మాటలు మరో సారి స్మరిస్తూ..‘జయహో… జనయిత్రి’ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తు లకు శుభాకాంక్షలు.‘అన్నీ మారుతున్నాయి. మహిళలపట్ల మనఆలోచనా ధోరణి తప్ప’. అవును ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలం దుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మనప్రగతికి మూలం.ఇదే నినా దంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయం గా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటోప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నా రు.విద్య,వైద్యం,వ్యాపారాలు,రాజకీయాలు,క్రీడలు, బ్యాంకింగ్‌,అంతరిక్షం,టెక్నాలజీ వంటిపలు రంగా ల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకం.రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది స్త్రీ శక్తి. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. ‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదు గుళికలనే మింగించింది. ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురి అవుతూనే ఉంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతలను సవాలు చేస్తూ సాగిపోతున్న స్త్రీలపై దారుణ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ఎంతటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిర్వీర్యమైపోతున్నాయి. ఇందుకు కారణాలలేమిటో గుర్తించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అవరోధాలను అధిగమిస్తూ అడుగు ముందుకేయాలి. జయహో… జనయిత్రీ.అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2022 మార్చి 8న ఈ దినోత్సవ వేడుకలు 111 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళా దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, హక్కుల కోసం ప్రారంభమైంది.

1 2 3 8