చరిత్ర పాఠాల తొలగింపు

జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యార్థు లను తయారు చేయడమే విద్యావ్యవస్థ లక్ష్యం. కాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) జాతిలక్ష్యాలకు, రాజ్యాంగ సూత్రాలకు భిన్నం గా నిర్ణయాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే క్లస్టరైజేషన్‌, డిజిటలైజేషన్‌, విలీన ప్రక్రియలు, వృత్తి విద్యా కోర్సులలో ఎన్‌ఇపి అమలు వలన ఎటువంటి దుష్ఫరిణామాలను చవిచూస్తున్నామో అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలావుండగా సిలబస్‌లో, పాఠ్యాంశాలలో కూడా కేంద్రం జోక్యం పెరుగుతున్నది. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబం ధించి పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకాలలో చరిత్రకు సంబంధించిన చాప్టర్లను తొలగించారు.
భావి పౌరులకు దేశచరిత్ర తెలియ కూడదనే సరిగ్గా కోవిడ్‌ విపత్తు సమయంలో, వ్యవస్థ లేవీ పని చేయలేని విపత్కాల పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపి అమలుకు పూనుకుంది. విద్యా సంస్థలు కోల్పోయిన పనిదినాలను దృష్టిలో పెట్టు కుని విద్యార్థులపై భారం తగ్గించాలని 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ఎన్‌సిఇఆర్‌టి కూడా సూచిం చింది. ‘వేటిని తొలగించాలి? ఎవరి అభిప్రాయా లు తీసుకోవాలనే ప్రక్రియగాని, పారదర్శకతగాని లేదు.2021లోని సిలబస్‌ను తగ్గించేటపుడు విద్యా ర్థులపై భారాన్ని తగ్గించే విధంగా లేదు. పాలకుల భావజాల వ్యాప్తికి అడ్డంకిగా వున్న పాఠ్యాంశాలను తొలగించారు.కోవిడ్‌ విపత్తును అవకాశంగా మలు చుకుని, వారి ఎజెండా అమలుకు పూనుకున్నది. ఎన్‌ఇపి ముసాయిదాను విడుదల చేసినపుడు అది అమలైతే ఎటువంటి ప్రమాదాలు వస్తాయని ఊహించామో అవి నేడు విద్యారంగంలో జరిగి పోతున్నాయి.
నాడు తొలగించిన వాటిలో ముఖ్యమైనవి
లౌకికవాదం, ప్రజాస్వామ్యం,హక్కు లు,పౌరసత్వం,ఉద్యమాలు,జాతీయవాదం,ప్రాంతీ య అవసరాలు,స్థానిక సంస్థలు,ప్రభుత్వాలు,ఆహార భద్రత,పర్యావరణం,పంచవర్ష ప్రణాళికలు ఇతర దేశాలతో సంబంధాలు,అలీన విధానం,పర్యావ రణం,సహజవనరులు,భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొల గించారు.ఇవన్నీ మనదేశచరిత్ర,వారసత్వ సంపదకు సంబంధించిన అంశాలు. ఒక్క మాటలో చెప్పా లంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు, రాజ్యాంగ లక్ష్యాల సాధన, దేశ చరిత్రను పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో పాలకుల వైఫల్యాలకు సంబంధించిన ప్రపంచీకరణ విధానా లు,లింగ వివక్ష, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి తొలగించారు.
నేడు తొలగిస్తున్న పాఠ్యాంశాలు …
ఎన్‌ఇపి అమలు నేపథ్యంలో ఎన్‌సిఇ ఆర్‌టి రూపొందించిన కొత్త పుస్తకాలలో మహాత్మా గాంధీకి సంబంధించిన పలు పాఠ్యాంశాలను తొలగించారు. ప్రధానంగా తొలగించిన అంశా లివి.

థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2 (16వ,17వ శతాబ్దాలకు సంబంధించినది)

  1. పదకొండవ తరగతిలో సెంట్రల్‌ ఇస్లామిక్‌ ల్యాండ్స్‌, సంస్కృతుల ఘర్షణ
  2. పన్నెండవ తరగతి పౌరశాస్త్రంలో స్వాతంత్య్రం నుండి భారత రాజకీ యాలలో ప్రసిద్ధ ఉద్యమాల వరకు
  3. పన్నెండవ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి గాంధీజీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ పై విధించిన నిషేధానికి సంబంధిం చిన కొన్ని పేరాలనూ, అలాగే హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేపట్టిన కృషికి సంబంధించిన కొన్ని పేరాలను కూడా తొలగించారు.
  4. గతేడాది కర్ణాటక పాఠ్యపుస్త కాలతో ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించారు.
  5. సంఘసం స్కర్తలు పెరియార్‌, నారాయణ గురు,బసవడు వంటి ప్రముఖుల పాఠాలను తొలగించారు.
  6. పాఠ్యాంశాలే కాదు. సిబిఎస్‌ఇ సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో ‘గుజరాత్‌లో ముస్లింలపై దాడులు ఎవరు చేశారు?’ వంటి ప్రశ్నలు దేనికి సంకేతాలు?
    జాతీయోద్యమ స్ఫూర్తి అవసరం లేదా?
    జాతీయోద్యమ కాలంలోలౌకిక, ప్రజా స్వామ్యం,సార్వత్రిక విద్యకు డిమాండ్‌ పెరిగింది. కులమతాలకు అతీతంగా జాతిని ఐక్యం చేసే విద్య ను కోరుకున్నారు. సామాజిక దురాచారాలకు వ్యతి రేకంగా సంఘ సంస్కరణల ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉద్యమాలు సామాజిక మార్పులుకు దారితీశాయి.ఈ క్రమంలో ప్రగతిశీల శక్తులు, సం ఘాలు,వ్యక్తులు,సంస్కర్తలు ఏకమై బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన మన దేశ చరిత్ర మన బాలలకు, భావి పౌరులకు అవస రం లేదా?
    ప్రాణాలకు వెరవకుండా భగత్‌సింగ్‌ చేసిన అద్భుతమైన పోరాటం,త్యాగం దేశ ప్రజ లను కదిలించింది.క్విట్‌ ఇండియా, సహాయ నిరా కరణ ఉద్యమం వంటివి లక్షోపలక్షలుగా యువ తను,లాయర్లను,ప్రజలను, విద్యార్థులను జాతీయో ద్యమం లోకి ఆకర్షించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశవిభజనకు కుట్ర పన్నిన ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మతసంస్థల చర్యలను అంగీకరించని గాంధీజీ మత సామరస్యం కోసం హిందూ-ముస్లిం భాయిభాయి అంటూ విస్తృతంగా పర్యటించాడు. ఇవి నచ్చని హిందూత్వ శశ్తులకు ప్రతినిధి అయిన గాడ్సే…మహాత్ముడిని హత్య చేశాడు.
    మత రాజ్యం కోసం అవసరమైన ప్రయ త్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయీ కరణలో భాగంగా ఉద్దేశ పూర్వకంగానే ఎన్‌ఇపి ద్వారా గాంధీజీకి సంబంధించిన చరిత్ర ఘట్టాలను తొలగిస్తున్నది.ఎన్‌ఇపి అమలు కాకముందు పరిస్థితికి, అమలవుతున్న తరువాత పరిస్థితికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది.- (కె.విజయ గౌరీ/కె.శేషగిరి)

బాల సాహిత్యం..వికాసం..విజ్ఞానం

అనగనగా కథలు.. బాల్యంలో సృజనను పెంచే మాలికలు.. అమ్మమ్మ, బామ్మా.. తాతయ్యలు లేని చిన్న కుటుంబాల్లో చిన్నారుల చింత తీర్చేది బాలసాహిత్యమే. చిన్ననాడు చందమామ, బాలమిత్ర సాహిత్య పఠనంతో పెద్దయ్యాక సృజనాత్మక రచన చేస్తున్న వారెందరో.. పిల్లల పట్ల ప్రేమతో రాసినవే నాడూ నేడూ మేలైన కథలు.. భాషపై మమకారం పెంచేది బాల సాహిత్యమే.. కథనం ఎంత ముఖ్యమో.. బాలసాహిత్యంలో చిత్రానికీ సమప్రా ధాన్యం.. పిల్లల్ని ఆకట్టుకునేది కంటికింపైన బొమ్మలే! ఈ విషయంలో ప్రపంచ బాల సాహిత్యంపై సోవియట్‌ ప్రచురణలు చేసిన కృషి అద్వితీయం..
మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే వస్తాయి.బాల్యం నుండే మంచి సాహిత్యం అందిస్తే అలాంటి మంచి వ్యక్తిత్వం గల బాలలు తయార వుతారు. చందమామ అలాంటి సాహితీ సేద్యం చేసింది. దానివల్ల మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు బతికాయి. ఇప్పుడు చందమామ లేదు. బాలసాహితీ వేత్తలే ఆ బాధ్యత తీసుకోవాలి. బాల సాహిత్యంలో భాషా సం కరం లేని రచనలు వస్తాయి. తల్లిభాష తలెత్తుకుని తిరుగుతుంది.బాల సాహి త్యాన్ని ముందు పెద్దలు చదివి, పిల్లలతో చదివించాలి.బాలసాహితీ వేత్తలు రాసినంత మాత్రాన సరిపోదు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పనిగట్టు కుని బాలసాహిత్యాన్ని ప్రోత్సహించాలి.అలాచేస్తే పుస్తక పఠనం తగ్గదు. కొత్త విష యాలు,మంచి సంగతులు,జీవితానికి, భవిష్యత్తుకి పనికొచ్చే సూత్రాలు తెలుసు కుంటున్నామన్న అభిప్రాయం కలిగితేనే ఎవర్క్కెనా పుస్తకాలు చదువు తారు. బాల సాహితీవేత్తలు ఈ రహస్యం దృష్టిలో ఉంచుకుని,రచనలు చేయాలి.అప్పుడే ఆ రచనలు పంచతంత్రం, ఈసఫ్‌ కథల్లా దశాబ్దాల తరబడి నిలిచి పోతాయి. ఆధునిక విజ్ఞాన విషయాలనూ అతి సరళంగా, ఆసక్తికరంగా రాయాలి.అలా రాయాలంటే పిల్లల రచనలు చేసే వారికి నిబద్ధత ఉండాలి. పిల్లలపట్ల, వారి భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండాలి.వారే చరిత్రలో నిలిచిపోతారు. వారి రచనలు చిరంజీవులవుతాయి.- చొక్కాపు వెంకట రమణ,కేంద్ర బాల సాహిత్య,అకాడమీ పురస్కార గ్రహీత,
నేటి బాల సాహిత్యం
తెలుగు బాలసాహిత్యం తొలి నుంచి నీతులు ప్రధానంగా నడిచింది.కుమార శతకం, కుమారీ శతకం…నీతి కథా మంజరి వంటివి ప్రధానంగా చాలాకాలం బాల పఠనీయ సాహిత్యంగా ఉన్నాయి. నేటికీ పిల్లల కోసం చేసే రచనలు పిల్లల నడవడికను ప్రభావితం చేసేవి. నీతి ప్రధానంగా ఉండాలనే రచయితలే ఎక్కువశాతం. వినోద ప్రధానంగా పరమానందయ్య శిష్యులు, తెనాలి రామకృష్ణ కథలు మాత్రమే మిగిలాయి. అనువాద రచనల్లోనూ పిల్లల అద్భుత సాహస గాథలు ఎక్కువభాగం లేకపోవడం శోచనీయం. నేటి పిల్లలకు భాష ఒక సమస్య. కాగా వారి పాఠ్యాంశాల బరువు మరో సమస్యగా తయా రైంది. బాల సాహిత్యం చదివే పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. బడిలోని కథల పుస్తకాలను పిల్లల చేత చదివించే టీచర్లు మృగ్యమయ్యారు. బడి పిల్లల చేత కథలు రాయించి, సంకలనాలు తేవడం మంచి చొరవ అయినా ఆ కథలలో కొత్తదనం, ఊహలు లేకపోవడం పెద్దల సృజన లేమిని ప్రతిఫలి స్తోంది. చరవాణిలో పాఠాలు నేర్చుకునే స్థితిలో పిల్లలకు అద్భుత ఊహాలోకం పరిచయం చేయాల్సిన పని రచయితలది. మాట్లాడే పక్షులు, జంతువులు, నది, ఆకాశం, కొండ అన్నీ బాలలకు నచ్చేవే. వాటిని ఎలా అల్లగల మనేది రచయితల మేధకు పరీక్ష. అంత సమాచారాన్ని అందంగా అద్భుతంగా సాహ సాలతో తీర్చిదిద్దడం నేటి రచయితల బాధ్యత. పర్యావరణం, ప్రకృతి సంరక్షణ వంటివే నేటి అవసరం. ఏడో గదిలోకి తీసుకెళ్దాం!
చాలామందిలాగే నా బాల్యం ‘చందమామ’ బాలల పత్రికతో ముడిపడి ఉండేది. అప్పట్లో జానపద సీరియల్స్‌కి ‘చిత్రా’గారు, పౌరాణిక సీరియల్స్‌కి ‘శంకర్‌’గారు, చందమామ ముఖ చిత్రాలు వడ్డాది పాపయ్యగారు వేసేవారు. కథలో పాత్రలకు దీటుగా చిత్రాగారు తన కుంచెను రaళిపించేవారు. పిల్లల కథల పుస్త కాలలో కథల్నీ బొమ్మల్నీ విడివిడిగా చూడ లేము. ఉదాహరణకు రష్యన్‌, చైనా పిల్లల కథల పుస్తకాలలో పేజీ నిండుగా పెద్ద బొమ్మ ఉండి,దాని కింద రెండు లైన్ల కథ ఉంటుంది. దీనిని బట్టి బాలసాహిత్యంలో చిత్రకారుల పాత్ర ఎంత ఉందో అర్థమవుతోంది. బొమ్మలు చూస్తూ కథ చదవడం పిల్లలకు ఒక అద్భుత మైన అనుభూతి.పిల్లల కోసం బాలసాహిత్యం విరివిగా రావాలి.బాల సాహిత్యంలో ఎవరి పాత్ర ఎంత అనే ప్రశ్నే లేదు. చిత్రకారుడు, రచయిత తలుచుకుంటే ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పిల్లల సాహసగాథలు ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఉన్నాయి. తెలుగు పిల్లలు అడ్వెంచర్స్‌ కావాలంటే ఇంగ్లీష్‌ సాహిత్యం మీద ఆధారప డాలా? మన వాళ్ళకి మనం సాహస కథలు ఇవ్వలేమా?తిప్పి తిప్పి కొడితే మనకు ‘బుడుగు’ తప్ప వేరే క్యారెక్టర్‌ కనిపించదు.రకరకాల విచిత్ర జంతువులు,ఒంటి కన్ను రాక్షసులు, మాంత్రికులే కాదు రెక్కల గుర్రాలూ మనవే. ఏడు తలల నాగేంద్రుడు ఏగుహలో పడుకు న్నాడో అతనిని నిద్ర లేపండి. ఏనుగుని సైతం ఎత్తుకుపోయే గండ బేరుండాలు మనకు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పిల్లలు పాడైపొ యేదేమీ ఉండదు. మహా అయితే వారిలో సృజనశక్తి పెరుగుతుంది. తమ ఊహల్లో కొత్త లోకాలను చూడగలుగుతారు. ఇప్పుడు రాయక పోతే ఇకముందు పిల్లల కోసం ఏమీ ఉండదు. చెప్పినంత కాలం నీతి కథలు చెప్పాము. మన జానపద హీరోలను ఏడోగది లోకి మాత్రం వెళ్ళకు అంటే..ఏడో గదికే వెళ్ళి సాహసాలు చేయడమేకాక, రాకుమారినీ దక్కించుకొనేవారు. ఇప్పుడా రాకుమారుడికి ఏడోగది కరువైంది. మీరు చేయవలసిందల్లా ఆ ఏడోగది చూపిం చటమే.- చైతన్య పైరపు, ప్రసిద్ధ చిత్రకారులు
సామాజిక మాధ్యమంలోనూ..
బాలసాహిత్య విస్తృతికి, వికాసానికి సామాజిక మాధ్యమాలు ఎంతో దోహదపడు తున్నాయి. అందులో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ-బుక్స్‌, యూ ట్యూబ్‌ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బాలల వ్యక్తిత్వ వికాసాన్ని, విజ్ఞా నాన్ని అందించే అనేక కథలు, గేయాలు, పాట లను స్వయంగా రచయితలే ప్రచురించు కుంటు న్నారు. బాలసాహిత్యం కోసం గతం లోలా కష్ట పడాల్సిన అవసరం లేదు.కొన్ని బాల పత్రికలు ఆన్‌లైన్‌లో లింక్‌ ఓపెన్‌ చేసి, చదువు కునే అవకాశాన్ని కల్పించాయి. నేడు పిల్లలకు ఎలాగూ ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. అందువల్ల సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల మీద విద్యార్థులకు అవగాహన కలిగింది. ప్రతి బడిలోనూ కంప్యూటర్‌ ఉంది. యానిమేషన్‌ ద్వారా కథలు పిల్లలకు అందించాలి. కాకుంటే పిల్లలకు ఊహా ప్రపంచానికి దూరం చేస్తాం. వాట్సాప్‌ గ్రూపులు నడిపే రచయితలు బాలసాహిత్యం పిల్లలకు చేరువయ్యేలా చూడాలి.- సైమన్ గునపర్తి  

ఎస్టీ జాబితాలో బోయ,వాల్మీకులు

దళితులు క్త్రెస్తవ మతంలోకి మారినా వారికి ఎస్‌సి హోదా ఉండే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని,బోయ/వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని ప్రవేశపెట్టిన తీర్మానా లను శాసనసభ మార్చి 25న శుక్రవారం సభఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తీర్మానా లను ఆమోదించాలని కోరుతూ కేంద్ర ప్రభు త్వానికి పంపిస్తున్నట్లు సిఎం వైఎస్‌ జగన్‌మో హన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారినా ఎస్‌సి హోదా ఇవ్వాలను బిల్లును మంత్రి మేరుగ నాగార్జున ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వ్యక్తులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారని తెలి పారు. సిక్కు, భౌద్ద మతంలోకి మారిన వారితో సమానంగా పరిగణించేందుకు వారు అర్హులని చెప్పారు. హిందూ మతానికి చెందిన షెడ్యూ ల్డు కులాల వారు, క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డు కులాల వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని తెలిపారు. సమా జంలో అవమానాలు, వివక్షకు గురవుతున్నారని, ఒక వ్యక్తి మరొక మతంలోకి మారడం ద్వారా వీటిలో ఏదీ మారదని,ఒక వ్యక్తి ఏమతాన్ని ఆచరిం చాలనేది ఆ వ్యక్తి ఎంపిక అని,కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదని సిఎం పేర్కొన్నారు.
ఎస్‌టిల జాబితాలో బోయ,వాల్మీకులు
బోయ,వాల్మీకులను షెడ్యూల్‌ తెగల జాబితాలో చేర్చేందుకు తాము వేసిన వన్‌ మ్యాన్‌ కమిషన్‌ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. అనం తపురం,కర్నూలు,వైఎస్‌ఆర్‌ కడప,చిత్తూరు జిల్లాల్లో నివసిస్తున్న బోయ,వాల్మీకి వర్గాలను దాని అన్ని పర్యాయపదాలతోపాటు (వాల్మీకి, చుండినవాకులు, దొంగబోయ,దొరలు,గెంటు,గురికార,కళావతి బో యలను షెడ్యూల్డ్‌తెగల జాబితాలోచేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని సభ తీర్మానిం చింది. ఈ బిల్లును బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రవేశపెట్టారు. విజయవాడలో రూ.268 కోట్ల వ్యయంతో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 125అడుగుల విగ్ర హాన్ని, ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తు నుందుకు సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపాదించిన తీర్మా నాన్ని శాస నసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై రాష్ట్రంలోని గిరిజన సంఘాలు వ్యతి రేకిస్తూ నిరసనలు,ఆందోళనలు చేపట్టాయి.
బోయ,వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీల్లో చేర్చవద్దు : గిరిజన సంఘం
(ఎన్‌టిఆర్‌జిల్లా) :బోయ,వాల్మీకి, బెంతు, ఒరి యాలను ఎస్టీలలో చేర్చకూడదని రెడ్డిగూడెం తహశీల్దార్‌ కార్యాలయంలో గిరిజన సంఘం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.గోపిరాజు మాట్లాడుతూ..బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీలలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ కులాలను ఎస్టీలలో చేర్చెందుగాను రాష్ట్ర ప్రభుత్వం శ్యాముల్‌ ఏక సభ్య కమిషన్‌ని యమించిందని జీవో నెంబర్‌ 52ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 32లక్షల గిరిజ నులు నేటికీ నిరక్షరాస్యత, వెనుక బాటు తనం, నిరుద్యోగ సమస్య, అనారోగ్య సమస్యలతో ప్రతి నిత్యం సతమత అవుతుంటే ఓట్ల రాజకీయం కోసం గిరిజనులను మోసం చేయడం సరి కాదని కేంద్ర ప్రభుత్వం1965లో బిఎన్‌ లో కూర్‌ కమిటీ పేర్కొన్న ఏ5 ప్రమాణాలు వీరికి లేవని ఎస్టీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర గిరిజన నాయకుడు బి రమేష్‌ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శ్యాముల్‌ ఆనంద్‌ కుమార్‌ ఏకసభ్య కమిషనర్ని రద్దు చేయా లని లేని పక్షంలో రాష్ట్రంలోని గిరిజన సంఘాల విద్యార్థి సంఘాలు, గిరిజన ఉద్యోగుల సంఘాలు అన్నిటిని ఏకతాటిపై తెచ్చి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.రవి, అజ్మీర రాజు,బి.రాజా,బి.తావూరియా,బి.చిన్నబాల, బి. రంగా తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో..
బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్‌టి జాబి తాలో చేర్చొద్దని విశాఖలో జరిగిన గిరిజన సదస్సు డిమాండ్‌ చేసింది. బోయ వాల్మీకి సహ పలు సామాజిక తరగతులను ఎస్‌టి జాబితాలో చేర్చేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ విశాఖ లోని ఎంవిపి కాలనీలోగల గిరిజనభవన్‌లో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యాన గిరిజన సదస్సు జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపి మిడియం బాబూ రావు మాట్లాడుతూ గిరిజనుల చట్టాలు, హక్కులు పటిష్టంగా అమలు కాకపోవడంతో ఇప్పటికీ ఆదివా సీలు కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమంలోప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. తాజాగా ఎస్‌టి జాబితాలో ఇతర సామా జిక తరగతులను చేర్చేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఏసామాజిక తరగ తినైనా ఎస్‌టి జాబితాలో చేర్చాలంటే బిఎన్‌. లోకూర్‌ కమిటీ నిబంధనల ప్రకారమే జరగాలని తెలిపారు. ఆ తెగ జీవితం, ప్రత్యేక భాష, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాల పాటింపు, ఆర్థిక పరిస్థితి, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు మాత్రమే ఎస్‌టిగుర్తింపు ఇవ్వాల్సి ఉంటుం దన్నారు.కానీ, నేటి ప్రభుత్వం ఎస్‌టి జాబితా లో చేర్చాలనుకుంటున్న బోయ వాల్మీకులు అభివృద్ధి చెంది ఉన్నారని తెలిపారు. ఆదివాసీ తెగలతో వారికి ఎటువంటి సంబంధమూ, పోలికలూ లేవ న్నారు. వచ్చేఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఈ విధం గా చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా, సామాజికంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందిన సామా జిక తరగతులను ఎస్‌టి జాబితాలో చేర్చితే ఆది వాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతాయని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందన్నారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఇతర సామాజిక తరగతు లను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి గతంలో ప్రయ త్నించిన సందర్భంలో దీనిని వ్యతిరేకిస్తూ అప్పటి రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు తమ సంఘం వినతిపత్రం ఇచ్చిందని గుర్తు చేశారు. నేడు ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆదివాసీలకు ద్రోహం చేస్తూ బోయ వాల్మీకిలను, బెంతు ఒరియా లను ఎస్‌టి జాబితాలో చేర్చడానికి ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ జిఒ52ని జారీ చేసింద న్నారు. తక్షణమే ఆజిఒను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన వ్యతిరేక విధానాలను విడనాడాల న్నారు. నాన్‌ షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని, జిఒ నెంబర్‌ 3 రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయా లని డిమాండ్‌ చేశారు.- జిఎన్‌వి సతీష్‌

అమరశిల్పి..అంబేద్కర్‌

కుల,మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవిత కాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమా పేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కో కూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్ర మాలు ఇప్పటికీ చారిత్రా త్మకమైనవి. (ఏప్రిల్‌ 14) ఆ మహానుభావుడి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు యావత్‌ భారతావని నివాళులు అర్పిస్తోంది. – (కత్తి పద్మారావు)

అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్‌’ దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈనెల ఏఫ్రిల్‌ 14న డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు యావత్‌ భారతావని నివాళులు అర్పిస్తోంది.డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌..న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా భారతీయులకు పరిచయం చేయక్కర్లేని పేరు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరా టం చేసిన యోధుడాయన. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 1891లో ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబవాడేలో రామ్‌జీ,భీమా బాయి దంపతులకు జన్మించారు.తండ్రి రామ్‌ జీ బ్రిటీష్‌ భారతీయ సైన్యంలో సుబేదార్‌గా పని చేసేవారు. అంబేద్కర్‌ చిన్ననాటి నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. మెహర్‌ కులానికి చెందిన ఆయణ్ని అప్పట్లో పాఠశాల గది బయట కూర్చోపెట్టేవారు. ఇలా అగ్రకులాల వారి ఆధిపత్యపోరుని తట్టుకుని 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరారు.అక్కడ హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు.. ఈ వివక్షలన్నిం టినీ ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్‌ అత్యధిక మార్కులతో పాసయ్యారు. బీఏ ఉత్తీర్ణులైన అంబేద్కర్‌..ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ,లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు. ఎంఏ,పీహెచ్‌డీ,న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు.విదేశాలలో ఎకనామిక్స్‌లోడాక్టరేట్‌ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఇండియాకు తిరిగొచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టారు. ఇలాంటి సమస్యలను ఎదిరించాలంటే చదువొ క్కటే మార్గమని భావించారు. తనలా అంటరాని తనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని, చిన్నప్పటి నుంచే తనను తాను రక్షించుకోవడమే కాకుండా, అంటరానితనాన్ని నిర్మూలనకు సమరశంఖం మ్రోగించారు. అణగారిని వర్గంలోని ప్రజలకు అంబేద్కర్‌ చదువు చెప్పించి ప్రోత్సహించారు. ‘బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపిం చారు. అంటరానితనంపై పోరాటం చేశారు.. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని,మనుధర్మాన్ని వ్యతిరేకించారు.1927లో దళిత జాతుల మహా సభ జరిగింది..మహారాష్ట్ర,గుజరాత్‌ నుంచి కొన్ని వేలమంది వచ్చారు. మహత్‌ చెరువులోని నీటిని తాగడానికి వారికి అనుమతి లేకపోగా.. అంబేద్కర్‌ ఆచెరువులోని నీటిని తాగారు. చరిత్రలో అదో సంచలనం.
1931లో రౌండ్‌టేబుల్‌ సన్నాహాలు సంద ర్భంగా అంబేద్కర్‌ గాంధీజీని కలిశారు. తర్వా త స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు..దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. భారత రాజ్యాంగ పరిషత్‌ నియ మించిన రాజ్యాంగ సంఘానికి ఆయణ్ని అధ్యక్షు నిగా ఎన్నుకున్నారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసిన అంబేద్కర్‌ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. తరతరాలుగా బడుగు,బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేద్కర్‌.. వారి అభ్యున్నతకి రిజర్వే షన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. అంతేకాదు ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించారు. పారిశ్రామికీకారణ, వ్యవసా యాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు.అంబేద్కర్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఎంపికైన తర్వాత వారసత్వ,వివాహ చట్టాలలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయ త్నించిన హిందూ కోడ్‌ బిల్లు ముసాయిదాను పార్లమెం టులో నిలిపివేయడంతో..1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అంబేద్కర్‌ తన జీవితంలోని ముఖ్యాం శాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్‌ ఫర్‌ ఏ వీసా’లో రాసుకున్నారు. హిందూ సమాజం పట్ల ఆగ్రహించారు. హిందూసమాజ వినా శనాన్ని కోరుకోలేదు: భీమ్‌రావు తన జీవితంలో అస్పృశ్యత కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. పత్రికలద్వారా హిందువుల ఆలోచనా ధోరణిని మార్చటానికి ప్రయత్నిం చారు. నాసిక్‌ కాలారాం మందిర ప్రవేశంకోసం 18నెలలు శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు. అంబేడ్కర్‌ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికి వచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను,రాజ్యాంగంలో పొందు పరిచారు.
అంబేడ్కర్‌ జీవితంలోని లోతు తాత్త్వికమైంది భారతదేశాన్ని మనం పునర్నిర్మించాలను కున్నప్పుడు తప్పకుండా ఆయన రచనలను భారతీయ పునరుజ్జీవనానికి సమన్వయం చేసుకోక తప్పదు. భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఆర్థిక, సామాజిక సమత అట్టడుగు ప్రజలకు ప్రవహించాలంటే ఆయన అందించిన సిద్ధాంతాల ప్రమాణాలలోని తత్త్వాన్ని అందుకోవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ శిల్పంలో ఆయన అద్వితీయ పాత్రను వహించాడు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలోకి పెద్దది. చాలామంది భారత రాజ్యాంగాన్ని ఉపరితలం నుంచే చూసి ఇది విస్తృతమైనదనే అనుకుంటారు కాని, నిజానికి ఇది లోతైనది. ఈ లోతు అంబేడ్కర్‌ అధ్యయనం నుండే వచ్చింది. అంబేడ్కర్‌ ఆర్థిక,తాత్త్విక అధ్యయనం భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దింది.
అస్పృశ్యత మూలాల నిర్మూలన
మనుస్మృతిలో కొన్ని వర్ణాలవారిని చూడటమే నిషేధించబడిరది! మనిషిని మనిషిగా చూడ టమే నేరమనే ఈ అమానవ నిషేధాలను అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17తో తిప్పికొట్టారు. ఆయనలోని మహోన్నత సామాజిక,విప్లవ శక్తంతా ఆ ఆర్టికల్‌ నిర్మాణంలోనే వుంది. దీనికి బౌద్ధ సాహిత్య అధ్యయనం ఆయనకు ఎంతగానో తోడ్పడిరది. బౌద్ధాన్ని ఆయన వ్మాయంగానే కాక, తత్త్వ శాస్త్రంగా, సామాజిక జ్ఞానశాస్త్రంగా అధ్య యనం చేశారు. మనిషికి మనిషికి అడ్డువస్తున్న అన్ని సామాజిక అంతరాలను బౌద్ధం కూల్చి వేసింది. ఆ క్రమాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఒక మనిషి మరొక మనిషిని చూస్తే నేరం, తాకితే నేరం అనే దశ నుంచి ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించే సూత్రాలను ఆయన అవగాహన చేసుకున్నారు. అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేశారు. విధానాలను రూపొం దించారు. మనిషి పుట్టుకతోనే ఇతరులను అవమానించడమనే నేరస్థుడుగా జీవిస్తున్నాడని గుర్తుచేశారు. మనిషి అగ్రవర్ణుడుగా తన చుట్టూ అల్లుకుని ఉన్న ఆచార సూత్రాలన్నీ రాజ్యాంగం ప్రకారం నేరానికి దారితీస్తాయి. నేరమంటే ఏమిటి? ఇతరులను నిందించటం,అవమా నించటం,అపహాస్యం చేయటం,అణచివే యటం.మరి ఈ నేరాలు ఎవరు చేస్తున్నారు? రాజ్యం చేస్తుంది. వ్యక్తులు చేస్తున్నారు. సమాజ మూ చేస్తుంది. ఈ మూడిరటిని ఈ ఆర్టికల్‌ నిరోధిస్తుంది.
రాజ్యాంగంపై అంబేడ్కర్‌ జీవిత ప్రభావం
బాబాసాహెబ్‌ అంతిమ కోరిక ఏమంటే అడవిలో లేక ప్రశాంతవనంలో ఏర్పాటు చేయబడిన ఒక గ్రంథాలయంలో కూర్చొని యుగాల మహాసిద్ధాంత కారులతో, మహోపాధ్యాయులతో సంభాషించాలని. జ్ఞానజ్యోతిని కనుగొనే క్రమంలో అనంత రహస్యాలని వెతుక్కుంటూ సాగుతున్న ఆయన ఆలోచనల్ని ఎవరు ఊహించగలరు? ఆయన విద్యాదాహం అంతులేనిది. చదువుతోపాటు ఆయన కూడా పెరిగాడు. ఆయన జ్ఞానం ఆ నింగి సాక్షిగా దిగంతాలకు పాకింది.’’ అంబే డ్కర్‌ జీవితాంతం అవిశ్రాంతంగా అధ్యయనం చేశాడు. ఆయన చదువును గురించి ధనుంజయ్‌ కీర్‌ ఇలా రాశారు. ‘‘అంబేడ్కర్‌ ఉదయం చదువుతుండేవాడు. మధ్యాహ్నం, రాత్రి చదువుతుండేవాడు. రాత్రి గడిచి ఉదయమైనా చదువుతుండేవాడు. ప్రక్కనున్న ఇళ్లల్లో ఉదయాన్నే శబ్దాలు మొదలయ్యేవి. అప్పటికి కూడా ఆయన పుస్తకం చదువుతూ ఉండేవాడు. బాబా సాహెబ్‌ గంటల గణగణల మధ్య, బండ్ల గడగడ శబ్దాల మధ్య, పనిముట్ల దబదబ శబ్దాలమధ్య, మోటార్ల బరబర శబ్దాల మధ్య కూడా తనపనిలో తాను నిమగ్నమై ఉండేవాడు.అంబేడ్కర్‌ వ్యక్తిత్వ ముద్ర భారత రాజ్యాంగంపై బలంగా వుంది. ఆయన విదేశీ రాజ్యాంగాలనే గాక భారతదేశానికి పనికివచ్చే ప్రజాస్వామ్య లౌకిక అంశాలతోపాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, రాజ్యాంగంలో పొందు పరిచారు. ఆయనలోని గొప్పతనం ఆయన గొప్ప దేశభక్తుడు కావటమే. సాత్వికునిగా, సామరస్యునిగా ఆయన జీవించాడు. ప్రజలు అలా జీవించాలని కోరుకున్నాడు. భారతీయు లందరూ జ్ఞానులుగా రూపొందాలనేది ఆయన ఆకాంక్ష. అందుకు కావలసిన పునాదుల్ని భారత రాజ్యాంగంలో రూపొందించాడు. శిల్పిని వేరుచేసి శిల్పాన్ని చూడలేము. కవిని వేరు చేసి కవిత్వాన్ని పఠించలేము. భారత రాజ్యాంగం అర్థం కావాలంటే అంబేడ్కర్‌ని, అంబేడ్కర్‌ రచనల్ని ప్రతి భారతీయుడు చదవాలి.

చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు

పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్న పాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృ భాష లోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసి వేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే..అంత మంచిది. అంకెలు తెలి యని వాళ్లు కూడా తక్కువేమీ లేరు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా..ప్రతి క్లాస్‌లో ఇలాంటి పిల్లలు ఉన్నారని.. అసర్‌ రిపోర్ట్‌ తేల్చింది. దీంతో.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అంటూ ప్రభు త్వాలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తిదేనని తేలి పోయింది. ప్రాథమిక విద్యా ప్రమాణాలు ఇంత దారుణంగా పడిపోవటానికి కారణమేంటి?
దేశంలో..ఈమూల నుంచి ఆ మూలదాకా..ఏప్రభుత్వ పాఠశాలను తీసు కున్నా..ఇదే పరిస్థితులుఉన్నట్లు తేల్చింది అసర్‌ రిపోర్ట్‌. అక్కడో..ఇక్కడో ఎందుకు..మన తెలు గు విద్యార్థుల గురించే తెలుసు కుందాం. అందరి మాతృభాష తెలుగే అయినా.. కొంద రికి తెలుగు చదవడమే రావట్లేదు. ఇంకొం దరు..తెలుగు అక్షరాలను కూడా గుర్తు పట్టడం లేదు. పోనీ.. ఇంగ్లీషే మైనా ఇరగదీస్తున్నారా? అంటే..అదీ లేదు. తెలుగు చదవడంలో.. రెండురాష్ట్రాల విద్యా ర్థులు కొంత వెనుకబడి నట్లు తెలుస్తోంది. ప్రముఖ రీసెర్చ్‌ ఆర్గనై జేషన్‌..యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌..అసర్‌ రిలీజ్‌ చేసిన రిపోర్టులో..ఈ విష యాలు బయటపడ్డాయి. ఆ సర్వే ప్రకారం.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా చాలా మంది పిల్లలు..చదువులో బాగా వెనుకబడి పోయినట్లు తేలింది. దాదాపు ప్రతి తరగతిలోనూ తెలుగు కంటే ఇంగ్లీషులో విద్యార్థులు కొంత మెరుగ్గా ఉన్నారు.మూడో తరగతి స్టూడెంట్స్‌ విషయానికొస్తే..అక్షరాలు చదవగలుగుతున్నా.. పదాలు చదవలేకపోతున్నారు. పదాలు చదివే వాళ్లు..ఒక మోస్తరు వాక్యాలను, పేరాలను చద వలేని స్థితిలో ఉన్నారు. ఇక.. గణితం విషయాని కొస్తే.. మూడో తరగతి విద్యార్థు ల్లో చాలా మందికి అంకెలు కూడా గుర్తించలేక పోతున్నారు.99 దాకా అంకెలే తెలియడం లేదు. సగానికి సగం పిల్లలు.. తీసివేతలు చేయలేకపోతున్నారు.మెజారిటీ విద్యా ర్థులకు భాగాహారాలు ఎలా చేయాలో కూడా తెలి యడం లేదని.. అసర్‌ రిపోర్ట్‌ తేల్చింది. చివరికి.. ఎనిమిదో తరగతిలోనూ..అంకెలు గుర్తించలేని విద్యార్థులున్నారు.ఇంగ్లీషుపదాలుచదవలేక పోతున్న విద్యార్థులశాతం కూడా భారీగానే ఉంది. సులభ మైన పదాలు గుర్తించడంలోనూ పిల్లలు బాగా వెనుకబడిపోయారు.ఈజీ వర్డ్స్‌తెలిసినా.. సులభ మైన వాక్యాలు తెలియని పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. దీంతో.. ప్రభుత్వ పాఠశా లల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం..కొన్ని పాఠశాలలకే పరిమి తమైందని అర్థమవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. ప్రభు త్వాలు చెబుతున్నా.. చాలా మంది ప్రైవేటుగా ట్యూషన్లకు వెళ్తున్నారని తేల్చింది అసర్‌ రిపోర్ట్‌. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా..కనీసం 15 శాతం మంది విద్యార్థులు డబ్బులు చెల్లించి ట్యూషన్లలో పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఓవరాల్‌గా.. దేశం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో..30శాతానికి పైగా ప్రైవేట్‌ ట్యూష న్లు చెప్పించుకుంటున్నారని తేల్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం.. 2018తో పోల్చుకుంటే 2022లో దారుణంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లో 7లక్షల మంది విద్యార్థులతో సర్వే నిర్వహిం చారు.దాని ప్రకారం.. మూడో తరగతి విద్యా ర్థులు..రెండో తరగతి పాఠాలను తప్పుల్లే కుండా చదవగలిగే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు.5,8వ తరగతి విద్యార్థులు కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. మ్యాథ్స్‌ లోనూ చాలా మంది విద్యార్థులు వెనుకబడిపోయా రని తేలింది. సక్రమంగా లెక్కలు చేసే స్టూడెంట్స్‌.. ప్రతి క్లాసులో చాలా తక్కువగా ఉన్నారు. 2012, 2014,2016లో నిర్వహించిన సర్వేలతో పోలిస్తే.. గతేడాది చేసిన సర్వేలో..విద్యార్థులఅభ్యసన ప్రమా ణాలు బాగా పడిపోయాయ్‌. ప్రతిరోజూ పాఠ శాలలకు హాజరైన వారి సంఖ్య కూడా 72 శాతమే. నాలుగో వంతు మంది విద్యార్థులు.. ఏదో ఒక కారణంతో..స్కూళ్లకు వెళ్లడం లేదు. అయితే.. హాజరుశాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక..అతిచిన్న ఇంగ్లీష్‌ వాక్యాలను కూడా విద్యా ర్థులు చదవలేకపోతున్నట్లు సర్వేలో తేలిం ది.ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో..వేర్‌ ఈజ్‌ యువర్‌ హౌజ్‌,ఐ లైక్‌ టు ప్లే లాంటి వాక్యాలను చదివి.. అర్థం చెప్పలేని వారు 37శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 14శాతం బడుల్లో తాగునీటి సౌకర్యం లేదని, 20 శాతం పాఠశాలల్లో సదుపాయం ఉన్నా తాగునీరు లేదని అసర్‌ నివేదిక తెలిపింది. పద్నాలుగున్నరశాతం పాఠశాల్లో మరుగుదొడ్లు ఉన్నా..అవి నిరుపయోగంగా ఉన్నా యని తెలిపింది.20శాతం పాఠశాలల్లో లైబ్రరీ లు లేవని, 76శాతం స్కూళ్లలో కంప్యూటర్లు లేవని.. 19 శాతం బడుల్లో పీఈటీలు లేరని అసర్‌ నివేదిక వివరించింది.
ఉపాధ్యాయులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా ?
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్ధాయి కంటే మెరుగ్గా ఉన్నట్లు ఇటీవల విడుదలైన ‘అసర్‌ నివేదిక-2022’ తెలియజేసింది. పూర్వ ప్రాథమిక స్కూళ్లలో జాతీయ సగటుకు మించి ఎ.పిలో చిన్నారుల చేరిక వుండటం,బాలికల డ్రాపౌట్లు అతి తక్కువగా ఉండటం,ఆంగ్లం సామర్థ్యంలో జాతీయ సగటుకు మించి ఫలితాలుండడం మనం గమనించవచ్చు. జాతీయ సగటును మించి వున్నాం కదా అని సంతోషించేలోగా…ప్రైవేటు ట్యూషన్లకు డిమాండ్‌ పెరగడం కూడా నివేదికలో కన్పిస్తుంది. పైగా అభ్యసనా సామర్ధ్యం తీవ్రంగా ప్రభావిత మైందని ఈ నివేదిక తెలియజేసింది.కరోనా కార ణంగా దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు మూత పడడంతో అభ్యసనంలో గతంలో సాధించిన మెరుగుదల కూడా దెబ్బతిన్నట్టు నివేదిక పేర్కొంది. బాల బాలికల అభ్యసనా సామర్ధ్యం చదవడం లోనూ,గణితం(కూడిక, తీసివేత, గుణించడం, భాగించడం)లోనూ 2012 స్థాయికి దిగజారింది. కచ్చితంగా ఒకదశాబ్ద కాలంపాటు వెనక్కు పోయా మంటే కరోనా మహమ్మారి దెబ్బ తీవ్రత ఎంతలా వుందో విశదమవుతోంది. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎన్ని అతిశయోక్తులు చెప్పినా, ఈ ప్రమా ణాలు,ప్రాతిపదికలు, గణాంకాలు శాస్త్రీయంగా, హేతుబద్దంగా ఆసమాజ స్థితిని నిర్ధారిస్తాయి. సమాజంలో విద్యారంగం ఎలా ఉందనేది అటు వంటి ప్రమాణాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌ లోనూ అభ్యసన సామర్ధ్యాలు 2012 సంవత్సరం స్ధాయికి పడిపోవడాన్ని నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వం మాత్రం వినూత్న పథకాలతో విద్యావిప్లవం వచ్చిందని గొప్పగా ప్రకటించడం మనం చూస్తున్నాం. విద్యా కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్‌ వివరాలను,విద్యా ర్థులకు అందజేసిన సంక్షేమ పథకాలను,వాటి వల్ల బడిలో చేరినపిల్లల గూర్చి,మన బడి,నాడు-నేడు పథకంతో పాఠశాలల కార్పొరేట్‌ రూపాన్ని… గణాంకాలతో సహా ఆర్భాటంగా చెప్తారు. కానీ ఉపాధ్యాయుల నియామకాల గురించి మాత్రం స్పందించరు. ప్రతి సంవత్సరం డియస్సీ నిర్వహిస్తా మన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయరు. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచి పోయినా, ఇప్పటికీ మెగా డియస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారని ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. భారత పార్లమెంట్‌లో ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 50,277 టీచర్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యా యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. పైగా ఉన్న ఉపాధ్యాయులనే సర్దుబాటుచేసి, జీవో 117,124 లను అనుసరించి పాఠశాలలను విలీనం చేసి పాఠశాలల సంఖ్యను కుదించడం వేగంగా జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ లో డియస్సీ నియామకాలు జరిగి సుమారు 5 సంవత్సరాలు అయ్యింది. 2018లో అప్పటి ప్రభు త్వం 7000 పోస్టులతో నిర్వహించింది. ఈ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత విలీనం పేరుతో పాఠశా లల కుదింపు,ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తిని పెంచడం ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తగ్గిం చింది. గత ప్రభుత్వాల కాలంలో 1996,1998, 1999,2000,2001,2002,2003,2018 సంవత్సరాలలో వరుసగా డియస్సీలు నిర్వహించి లక్షా నలభై అయిదు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. అంటే ఇప్పుడు సర్వీసులో ఉన్న 70శాతం మంది ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో నియమింపబడినవారే. ఈ ప్రభుత్వ హయాంలో ఈ నాటికీ ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ కాలేదంటే వీరి చిత్తశుద్ధిని శంకించాల్సిందే. విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా అమ్మ ఒడి పథకం అమలు చేయడం, జగనన్న విద్యా కానుక పేరుతో ప్రతి విద్యార్ధికి మూడు జతల యూనిఫాం, స్కూలు బ్యాగ్‌,పాఠ్యపుస్తకాలతో పాటునోట్‌ పుస్తకాలు, బూట్లు,సాక్సులు,బెల్టు,ఇంగ్లీషుడిక్షనరీ,ఈ సంవత్స రం ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వడం, జగనన్న గోరుముద్ద నిజంగా విద్యార్థుల పాలిట వరం లాంటివే. పాఠశాల రూపురేఖల్ని మార్చడం, అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పన నిజంగా మెచ్చుకోదగినవే. కానీ విద్య కోసం బడ్జెట్‌ కేటాయిం పులు చూస్తే మాత్రం ఎక్కడో వుంటాం.ఢల్లీి ప్రభు త్వం 2022-23 సంత్సరానికి తమబడ్జెట్‌లో 23. 50శాతం కేటాయించి ప్రథమస్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 12.70శాతం కేటా యించి 21వస్థానంలోఉంది.
బడ్జెట్‌ కేటాయింపుల పరంగా చూస్తే మన ప్రభుత్వం విద్యారంగానికి ఎంత తక్కువ కేటాయించిందో మనం గమనించవచ్చు. రూ. వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలకు తగిన సౌకర్యాలు కల్పించి నూతన హంగులు సమకూర్చి నప్పటికీ విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులను నియమించకపోతే విద్యా నాణ్యత పెరిగేనా?విద్యా విప్లవం వచ్చేనా? కేంద్రం తీసు కొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం-2022ను దేశంలోనే అత్యుత్సాహంతో మొట్టమొదట అమలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.తరగతుల విలీ నంతో గ్రామగ్రామాన ప్రాథమిక పాఠశాలలు అల్లకల్లోలమయ్యాయి. ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పాఠశాలలను విలీనం చేసిన ప్రభుత్వం, మళ్ళీ పది మందికన్నా తక్కువ విద్యార్థులున్న పాఠ శాలల విలీనానికి పూనుకున్నది.
వ్యాసకర్త : ఎ.పి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి-(జిఎన్‌వి సతీష్‌/ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌)

అందరికీ అందాలి ఆహారం

మానవుని జీవితంలో ఆహారం ప్రాముఖ్యర గురించి అందరికీ తెలిసిందే. ఈ భూమిపై జీవి మనుగడ కొనసాగడానికి ఆహారం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. అలాగే ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించడం సాధ్యం కాదు.. జీవితంలో ఆహారం ప్రాముఖ్యతను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అయితే ఉత్పత్తి తగ్గుదల, ప్రభుత్వ విధానాలు, కోవిడ్‌-19 మహమ్మారి, పరిణామాలు, వాతావరణ మార్పులు, అసమానతలు, పెరుగుతున్న ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో సహా అనేక సవాళ్లు ప్రజలకు పౌష్టికాహారాన్ని దూరం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రభుత్వాలు ఈ ప్రతి సవాళ్లను ఎదుర్కొనే దిశగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. – ఉదయ్‌ శంకర్‌ ఆకుల
ఆహారం ప్రాథమిక మానవహక్కుగా పరిగణించబడుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ తొమ్మిది మందిలో ఒకరు దీర్ఘకాలిక ఆకలిని అనుభవిస్తున్నారు. ఇదే ప్రస్తుతం అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా. సంపన్నులు మరింత సంపన్నులుగా..పేదలు మరింత పేదలుగా మారుతున్న ఆర్థిక విధా నాలు అమలు జరుగుతున్న నేపథ్యం ఒక ముఖ్య కారణం.ఓ వైపు కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థి తులను తీవ్రంగా దెబ్బతీసింది. అనేక మంది ఉపాధి కోల్పోయి సరైన పోషకాహారం అందని పరిస్థితి. ఇదిలా ఉంటే ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గుదల, పోషకాహారం లోపం నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆహారాన్ని ఆదా చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవ సాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం మనముందున్న తక్షణ కర్తవ్యం. అయితే ఆహారం విలువ తెలియ జెప్పడంతో పాటు ప్రతి ఒక్కరికీ సరైన పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో, భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోపం సమస్యలను నిర్మూలిం చాలనేది కూడా ఈ వరల్డ్‌ ఫుడ్‌ డే ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) 1945లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. 1979 నుండి ఏటా అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆహారం విలువ ఏంటో చాటి చెప్పటానికే. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్‌ పాల్‌ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
గ్లోబల్‌ సమస్యగా..
గత మూడేళ్లుగా..‘సార్స్‌’..‘కరోనా’..‘మంకీ పాక్స్‌’..వంటి మహమ్మారులను ఎదుర్కొం టున్నాం..కానీ వీటన్నింటికన్నా ‘ఆకలి’ పెద్ద మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే అత్యంత పెద్ద మహమ్మారి ఇదే. మనిషి ఏం చేసినా ఈ ఆకలి తీర్చుకోటానికే. జానెడు పొట్ట నింపుకోవటానికి కాయకష్టం చేసే కూలీల నుంచి కోట్లకు పడగలెత్తినవారు కూడా ఆకలి తీరందే ఏ పనీ చేయలేరు.ఆ కడుపు నింపు కోవటానికే ఇన్ని పాట్లు. ఈ ఆకలి అనేక పేద దేశాల్లోనే కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం వెంటాడుతోంది.. అయితే అన్నిరకాల ఆహారం, ఇంకా చెప్పాలంటే మితిమీరి తినగలిగే వారు కొందరుంటే.. పట్టెడన్నం లేక ఆకలితో చనిపోయే దారుణ స్థితిలో అత్యధిక పేదలున్నారు. ఈ అసమానత సరికావాల్సి ఉంది. ఎయిడ్స్‌,మలేరియా,క్షయ వ్యాధుల వల్ల జరిగే మరణాల కంటే..ఆకలి వల్ల జరిగే మరణాల రేటే ఎక్కువగా ఉందనే విషయం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఈ మరణాల స్థాయి ఎంతగా ఉందంటే..ప్రతిరోజూ 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. అయితే ఓ పక్క పెరుగుతున్న జనాభా. మరోపక్క తగ్గుతున్న వ్యవసాయం. అసమా నతను పెంచే పాలకుల విధానాలు.. దీంతోనే అధికమవుతున్న ఆకలి చావులు. ఈ క్రమంలో 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలి యన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థి తుల్లో ఆహార ఉత్పత్తిని పెంచడం అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే కొంతలో కొంత ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు. కానీ వ్యవసాయం చేసే పద్ధతులు ముఖ్యంగా సేంద్రీయ పద్ధతులనే అనుసరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా అది ఆచరణలో ఫలితాలు ఇవ్వవనేది.. తక్షణ సమస్యను పరిష్కరించలేవనేది శ్రీలంక పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. మెరుగైన పంట,నిల్వ,ప్యాకింగ్‌,రవాణా,మౌలిక సదు పాయాలు, మార్కెట్‌ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యలు అవసరం. వీటితో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ఆహార నష్టాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలి.
జిహెచ్‌ఐలో దిగజారిన భారత్‌..
మరోవైపు గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ మరింత దిగజారింది. పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన బరువు, ఎత్తు లేకపోవడం, మరణాలు.. అనే నాలుగు సూచికల ఆధారంగా ఈ జాబితా రూపొం దిస్తారు. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ) 2022లో 121 దేశాల్లో భారత్‌ 107వ స్థానా నికి పడిపోయింది. అంతకు ముందు నివేదిక ప్రకారం 101వ స్థానంలో ఉండగా..ప్రస్తుతం 107కి దిగజారడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన సరిహద్దు దేశాలైన పాకి స్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కంటే కూడా భారత్‌ వెనుకబడి ఉందని తెలుస్తోంది. బ్రెజిల్‌, చిలీ, చైనా,క్యూబా,కువైట్‌ సహా 18 దేశాలు జీహెచ్‌ఐ స్కోరు తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ వివరాలు ఆకలి, పోషకాహార లోపాలను లెక్కించే జిహెచ్‌ఐ వెబ్‌సైట్‌ గతేడాది వెల్లడిరచింది.
ఆహార ధాన్యాల సంక్షోభం..
ప్రపంచవ్యాప్తంగా 852 మిలియన్ల మంది దీర్ఘకాలంగా అతి పేదరికం కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా ప్రభుత్వాలు అనుసరించే విధానాలు అసమానతలను పెంచేలా ఉండటం. విపరీతమైన జనాభా పెరుగుదల,వాతావరణ మార్పు, ఆహార ధాన్యాలను జీవ ఇంధనాల కోసం ఉపయోగిం చడం,మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపడం…ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, చట్టాలు చేయడం..సరైన ప్రోత్సా హకాలు లేకపోవడం..గిట్టుబాటు ధర లేకపోగా..కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారు.దీంతో నష్టాలతో కూడిన వ్యవసాయం చేయలేక ప్రతీ ఏటా రైతులు తగ్గిపోతున్నారు.చదువుకున్నవారు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మరికొద్ది రోజుల్లో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి తీవ్రం కావొచ్చు. వీటన్నింటి పర్యవసానంగా ఆహారధా న్యాల ధరలు ఆకాశాన్నంటటం మరో సమస్య.
మహిళలపై ఎక్కువ ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 821 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడు తున్నారు. తద్వార వీరు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రజలే కావటం గమనించాల్సిన విషయం. ఆకలి అంటే అమ్మే గుర్తుకొస్తుంది. అటువంటి అమ్మ తాను ఆకలితో అలమటిస్తున్నా బిడ్డల కడుపు నింపాలనే చూస్తుంది. అటువంటి మహిళలే ఇప్పుడు ఎక్కువగా ఆకలితో బాధపడుతున్నారు. ఏ ఒక్క సమస్య వచ్చినా అది ముందు మహిళలపైనా, వారి ఆరోగ్యాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అలాగే ఆకలి, పోషకాహార సమస్య కూడా మహిళలనే ఎక్కువగా వెంటాడుతోంది. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60 శాతం మంది మహిళలే ఉండటం గమనించాల్సిన విషయం. మహిళలు ఆకలితో ఉంటే ముఖ్యంగా గర్భిణులకు ఇలాంటి సమస్య ఉంటే పుట్టే పిల్లల మీదా ఆ ప్రభావం పడుతుంది. దీంతో అనారోగ్యకరమైన పిల్లలు జన్మిస్తారు. ప్రస్తుతం జరిగేదీ అదే.. ఏటా దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారనే గణాంకాలే దీనికి నిదర్శనం. ఇందులో కూడా 96.5 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండటం గమనార్హం. వీరిలో ప్రతి ఐదు జననాలలో ఒక బిడ్డ సరైన వైద్య సదుపాయం లేకపోవటం వల్లే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి. దీంతో పిల్లల మరణాలలో 50 శాతం మంది ఐదు సంవత్సరాల లోపు వారే ఉండటం గమనించాల్సిన విషయం.
కారకులు ఎవరు..?
ప్రకృతితో సహజీవనం చేస్తున్నప్పుడు అనూహ్యంగా సమస్యలు వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లోనూ ఆహారం అత్యవసరం. ఆ దిశలో పాలకుల ధ్యాస ఉండాలి. అందుకు తగ్గ ప్రణాళికలు చేయాలి. ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నట్లనిపిస్తున్నా ఎక్కడో ఏదో లోపం ఉందనిపిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ నాటికీ అన్నం లేక విలవిల్లాడు తున్న దేశాలు. కారణం కరువు కావచ్చు. వరదలు కావచ్చు. ఆర్థిక వెనుకబాటుతనమూ కావచ్చు. వీటన్నింటికీ మూలం ప్రభుత్వ విధానాలేనన్న విషయం మరిచిపోకూడదు. ఏదేమైనా ఇది మానవాళి ఎదుర్కొనే తీవ్రమైన బాధ. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తు న్నారు. అయితే దేశంలో పౌరులందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వటంలేదనేదీ మరో వాదన.
కలుషిత ఆహార బాధితులు..
తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఏది దొరికితే అది తిని,ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి ఓ పక్క అయితే.. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమా ర్కులు ఆహారాన్ని కల్తీ చేయడం వల్ల, అక్రమ నిల్వలు చేసేందుకు క్రిమిసంహారకాలు కల పడం,నిల్వ ఆహారం తినడం వల్ల కూడా ఆహారం కలుషితం అవుతోంది. దీనికితోడు అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మురికి కూపాలుగా మారుతున్న మురికి వాడలు.. వెరసి.. ప్రపంచంలో ప్రతి10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితులుగా మారుతున్నారు. పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఏటా ఐదేళ్ల లోపు పిల్లలైన 1,25,000 మంది కలుషిత ఆహారం కారణంగా మరణి స్తున్నారు. సురక్షిత, శుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, కలుషిత ఆహారం ద్వారా కలిగే అనారోగ్యం తదితర అంశాలపై అవగాహన పెరగాలి.
అడుగంటుతున్న నిల్వలు..
ఆహారకొరత దేశాన్ని కూడా చుట్టుముడు తోంది..తాజా పరిణామాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో బియ్యం నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడా ది ఇదే సమయానికి దేశంలో 78.6 మిలి యన్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉండగా, ఈ ఏడాది నిల్వలు 44 మిలియన్‌ టన్నులకు పడిపోయా యి. రానున్న రోజుల్లో ఈ అనను కూల వాతా వరణ పరిస్థితుల్లో ఆహార కొరత ఏస్థాయిలో విరుచుకుపడనుందో ఈ సంఖ్యలే తేటతెల్లం చేస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది ధాన్యం సేకరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని, నిర్ధేశించిన లక్ష్యాలు అందు కోవడం దాదాపు అసాధ్యమనే అంచనాలు వెలువడుతున్నాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే దేశంలో తిండి గింజలకు సంబం ధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే! అదే జరిగితే సామాన్యుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టే! ఈ ఏడాది ప్రారంభం లో గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అంతకన్నా తీవ్రగానే బియ్యం కొరత రానుందని ‘డౌన్‌ టు ఎర్త్‌’ తాజాగా ఒక కథ నాన్ని ప్రచురించింది.
వృథా అరికట్టడం అవసరం..
ఈ రోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండిరచేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహారం పారేయడానికి ఒక్క నిమిషం చాలు. కానీ ఆ ఆహారాన్ని పండిరచ డానికి కనీసం మూడు నెలలు పడు తుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృథా చేస్తారు.అయితే ఏటా సుమారు 900 మిలియన్‌ టన్నుల (90 కోట్ల టన్నులు) ఆహారం వృథా అవుతోందని ఓగ్లోబల్‌ రిపోర్ట్‌ వెల్లడిరచింది.

రాజ్యాంగమే సర్వోన్నతం

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 73 ఏళ్లు పూర్తయి, 74వ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ సమ యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు, రాజ్యాంగ పదవులలో ఉన్న ఉపరాష్ట్రపతి, గవర్నర్లు వంటి వారు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపం,లక్ష్యాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు.2014లో నరేంద్రమోడీ అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు, మూడు వ్యవసాయ చట్టాలు, జాతీయ విద్యావిధానం-2020 మొదలైనవన్నీ రాజ్యాంగవిరుద్ధమే. రాష్ట్రాలతో సంప్రదిం చటంగానీ,చర్చించటంగాని చేయకుం డానే ఈ విధానాలను అమలు చేయటం, చట్టాలు చేయటం వంటి వాటికి కేంద్రం పాల్పడిరది. ఇది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన స్వాతంత్య్రపు హక్కును హరిస్తూ ‘భావప్రకట నా స్వేచ్ఛ’ను అణచివేస్తున్నది. అనేకమందిని ‘ఉపా’ చట్టం కింద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఢల్లీిలో గల జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ,ఢల్లీియూనివర్శిటీల్లో జరుగు తున్న సంఘటనలు రాజ్యాంగ హక్కుల హరణ కు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ నేపథ్యంలో సర్వోన్న తమైన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్య శక్తులపై ఉన్నది.
ఇటీవల జైపూర్‌లో జరిగిన83వ అఖి ల భారత స్పీకర్ల సమావేశంలో ఉపరాష్ట్రపతి జగ దీప్‌ ధన్‌కర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజ లు ఎన్నుకున్న పార్లమెంట్‌ ఆధిక్యత కలిగి ఉం డాలని,పార్లమెంటరీ సార్వభౌమాధికారం ఉండా లని వాదన చేశారు.ఇదిరాజ్యాంగ సూత్రాలకు పూర్తి విరుద్ధం. ఆధునిక ప్రజాస్వామ్యాలు ప్రారంభ మైన తరువాత ఫ్రెంచ్‌ న్యాయ నిపుణుడు మాంటెస్క్యూ ‘ది స్పిరిట్‌ ఆఫ్‌ లాస్‌’అనే గ్రంథాన్ని రాశారు. ప్రభు త్వ అంగాలైన శాసన వ్యవస్థ (లెజిస్లేచర్‌), కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్‌), న్యాయ వ్యవస్థ (జ్యుడిషియరీ)-మూడు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించరాదని, ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని విజయ వంతంచేయాలని దానిలో చెప్పారు. అమెరికా రాజ్యాంగంలో మాంటిస్క్యూ ప్రతిపాదించిన ‘అధి కార పృథక్కరణ’ సిద్ధాంతాన్ని ‘చెక్స్‌ అండ్‌ బాలె న్సస్‌’పేరుతో అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలు డాపపఅంబేద్కర్‌ నాయకత్వాన రాజ్యాం గంలో ప్రభుత్వ అంగాలు మూడిరటి మధ్య ఆధిప త్యం ఉండరాదని భావించారు. ఈమూడు వ్యవస్థలు తాను విధించిన పరిధిలోనే పనిచేయాలని రాజ్యాం గం స్పష్టం చేసింది.కేంద్ర న్యాయశాఖా మంత్రి తో సహా అనేకమంది అధికార పార్టీ ప్రముఖు లు న్యాయ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవా లనే వాదనలు చేస్తున్నారు.
న్యాయ సమీక్షాధికారం
అమెరికన్‌ సుప్రీంకోర్టు 1803లో తొలిసారిగా మాడిసన్‌ వర్సెస్‌ మార్బరీ కేసులో తొలిసారిగా న్యాయవ్యవస్థకు న్యాయ సమీక్షాది óకారం ఉందని ప్రకటించింది. న్యాయ సమీక్షాధి కారాన్ని ‘జ్యుడిషియల్‌ రివ్యూ’ అంటారు. న్యాయ సమీక్షాధికారం అనగా ‘పార్లమెంట్‌ చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా (అల్ట్రా వైర్స్‌) ఉంటే అవి చెల్లవు (నల్‌ అండ్‌ వాయిడ్‌) అని ప్రకటించటం. న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ పరిరక్షణకు, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తోడ్పడుతుంది. భారత రాజ్యాంగంలో 13వ నిబంధన భారత న్యాయ వ్యవస్థకుగల న్యాయ సమీక్షాధికారాన్ని వివరిం చింది.గత73ఏళ్లలో పార్లమెంట్‌ చేసిన అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను భారత సుప్రీం కోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించు కొని కొట్టివేసింది.1952లో వి.జి.రావు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ పతంజలి శాస్త్రి ‘న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను న్యాయస్థానాలు నెరవేర్చడమే తప్ప పార్ల మెంట్‌పై తమదే పైచేయి అని నిరూపించు కోవడానికి కాదని స్పష్టం చేశారు.న్యాయ సమీక్షాధికారంలో భాగంగా జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణయ్యర్‌, జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి, జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి, జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ మొదలైన న్యాయమూర్తులు అత్యున్నతమైన తీర్పులు ఇచ్చారు.
కేశవానంద భారతి కేసు-మౌలిక స్వరూపం
2023 జనవరి 7వ తేదీన రాజ్యసభ సమావేశాలలోను, ఇటీవల జైపూర్‌లో జరిగిన 83వ భారత శాసనసభల స్పీకర్ల సమావేశంలోను ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌…భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 1973లో ఇచ్చిన తీర్పుతో తాను ఏకభ వించడంలేదని విపరీత వాదన చేశారు. పార్లమెం ట్‌ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు సమీక్షించి ఆచట్టాలనురద్దుచేస్తే ప్రజాభిప్రా యాన్ని, పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని తిరస్కరించి నట్లని ఆయన భాష్యం చెప్పారు.
పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరణచేసే అధికారం లేదని 1967లో గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.దీనికి భిన్నంగా 1973లో కేశవా నంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు…రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చ కుండా సవరణ చేయవచ్చని తీర్పు చెప్పినది. ఈ తీర్పు 368వనిబంధన కింద రాజ్యాంగాన్ని సవరిం చడానికి పార్లమెంట్‌కు గల అధికారాలపై పరిమితి విధించింది.పార్లమెంట్‌లో మెజారిటీ ఉందనే కార ణంతో నిరంకుశంగా రాజ్యాంగాన్ని సవరించే ధోర ణిని అరికట్టడానికి, కీలక రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి ఈ తీర్పు దోహద పడుతుందని ఆనాడు న్యాయ నిపుణులు,రాజకీయ పార్టీలు హర్షం వెలిబుచ్చాయి.
కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో(1973)సుప్రీంకోర్టు తీర్పు చారిత్రా త్మకమైనది.ఆ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ (బేసిక్‌ స్ట్రక్చర్‌) వివరించింది. కేసును విచారించటానికి 13 మంది న్యాయమూర్తు లతో ధర్మాసనం ఏర్పడి విచారణ చేసింది. జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌, జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా, జస్టిస్‌ ఎ.ఎన్‌.రే,జస్టిస్‌ సిక్రి,జస్టిస్‌ గ్రోవర్‌వంటి ఉద్దండులు ధర్మాసనంలో ఉన్నారు.రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని మార్చే, సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు చెప్పారు.రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని నిర్వచించారు. రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం, న్యాయ సమీక్షాధికారం, లౌకిక విధానం, ప్రాథమిక హక్కులు మొదలైనవాటిని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధి కారం ఉన్నది కాని రాజ్యాంగ మౌలిక స్వభావా నికి భంగం కలగని విధంగా మాత్రమే పార్లమెంట్‌ తన అధికారాన్ని వినియోగించాలని ఈకేసు ద్వారా నిర్ధారణ జరిగింది. 1980లో సుప్రీంకోర్టు మినర్వా మిల్స్‌ కేసులో ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాల మధ్య సమతౌల్యత ఉండాలని స్పష్టంగా పేర్కొన్నది. ఇటీవలఉపరాష్ట్రపతితో సహా అనేక మంది బి.జె.పి నాయకులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిరాక రించి,పార్లమెంట్‌ ఆధిక్యత ఉండాలని ప్రచారం చేయటం పూర్తి రాజ్యాంగ విరుద్ధం.
రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్లు
భారతరాజ్యాంగం పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వానగల మంత్రి మండలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వానగల మంత్రి మండలి నిజమైన అధికారాలు కలిగి ఉంటాయి. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ నామ మాత్ర అధిపతులుగా ఉంటారు. రాజ్యాంగంలో 163వ నిబంధన ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ వ్యవహరించాలి. కాని కొన్ని సమ యాల్లో గవర్నర్లు కేంద్రానికి,రాష్ట్రాలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించకుండా,కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో రామ్‌లాల్‌,కుముద్‌ బెన్‌జోషి వంటి గవర్నర్లు ఎన్నో వివాదాలు సృష్టించారు.రాష్ట్ర ప్రభు త్వానికి ఇబ్బందులు కల్పించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో గవర్నర్లు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇటీవల తమిళనాడు గవర్నర్‌ రవి, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న తీరు ఎన్నో విమర్శలకు గురైంది.గతంలో కొన్ని కమిటీలు గవ ర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సిఫార్సులు చేయగా, కేంద్ర-రాష్ట్రసంబంధాలపై నియమించిన సర్కారి యా కమిషన్‌…గవర్నర్ల పనితీరుపై కొన్ని పరిమితు లు ఉండాలని కొన్ని సూచనలు చేసినది. పార్లమెం టరీ విధానం కొనసాగుతున్న భారత దేశంలో గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
రాజ్యాంగం ఉన్నతమైనది
పార్లమెంట్‌లో పాలక పార్టీలకు మెజారిటీ వస్తూ, పోతూ ఉంటుంది.రాజ్యాంగం,దానిస్ఫూర్తి, రాజ్యాంగ విలువలు శాశ్వతంగా ఉంటాయి. పార్ల మెంటు, ప్రభుత్వం,న్యాయ వ్యవస్థ వీటన్నిటి ఉని కికి రాజ్యాంగమే మూలాధారం.ఈ మూడు వ్య వస్థలు తమ,తమ పరిధిలో పనిచేయాలని రాజ్యాం గం స్పష్టం చేసినది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం గత తొమ్మి దేళ్లుగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు చేస్తున్నది. సమాఖ్య విధానం లో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు విభజిం చబడి ఉంటాయి.రాజ్యాంగ 7వషెడ్యూల్‌లో కేంద్ర జాబితా,రాష్ట్ర జాబితా,ఉమ్మడి జాబితా లుగా అధికార విభజన జరిగింది. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా రాష్ట్రాలతో సంప్రదించ కుం డానే కేంద్రం మూడు వ్యవసాయచట్టాలు చేయటం తో లక్షలాదిమంది రైతులు సుమారు 400 రోజుల పాటు ఉద్యమం చేయడంతో ఆచట్టాలు ఉపసం హరించుకోక తప్పలేదు. ఇది రైతాంగ ఉద్యమం ఉమ్మడిగా సాధించిన ఘనవిజయం. అలాగే విద్య ఉమ్మడి జాబితాలో ఉండగా,రాష్ట్రాలతో చర్చించ కుండానే కరోనా సమయంలో కేంద్రం జాతీయ విద్యావిధానం-2020 ఏకపక్షంగా ప్రకటించింది. అందువలన తమిళనాడు, కేరళ వంటి ప్రభుత్వాలు దీనిని అమలు చేయటానికి నిరాకరించాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయకుండా ఉండటానికి కేంద్రం ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో పేర్కొన్న లౌకిక వాదాన్ని,భిన్నత్వాన్ని,బహుళత్వాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య మతపరమైన విభజన తేవటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారతరాజ్యాంగ లక్ష్యా లు,విలువలను కాపాడుకోవటానికి రాజ్యాంగ మౌ లిక స్వరూపాన్ని సంరక్షించుకోవటానికి ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాసంఘాలు,దళిత,గిరిజన,వెనుకబడిన తరగ తుల సంఘాలు… అందరూ కృషి చేయ వలసిన అవసరాన్ని గణతంత్ర దినోత్సవం గుర్తు చేస్తున్నది. – కె.ఎస్‌.లక్ష్మణరావు

యవ్వ మాట..కోయభాష

కంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది.నీ పేరు ఏంటి అనడానికి ‘మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి ‘మీ వాది బాత కూసీరి’, ఇటురా అని పిలవడానికి ‘ఇలావా’ అంటారు. ఇవన్నీ కోయ భాష పదాలు. అతి ప్రాచీన భాషలలో ఇది ఒకటి. మన తెలుగు భాషలాగే ద్రావిడ భాష నుంచి పుట్టింది. అందుకే ‘మన కులతూరు భాష సాయిమంతే..’ అని కోయ తెగవారు మురిసిపోతుంటారు. అంటే మన కోయ భాష మంచిది అని అర్థం..
భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయ తెగ ప్రధాన మైనది. వీరి భాష,సంస్కృతి,సంప్ర దాయ విధానం భిన్నంగా ఉంటుంది.కోయల భాషలో యాస అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కోయ తెగ వాసులు ఎక్కువగా చింతూరు, వి.ఆర్‌.పురం,బుట్టాయగూడెం,పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు,జీలుగుమిల్లి మండలాల్లో ఉన్నారు. కోయలను రెండు విధాలుగా చెప్పుకుంటారు.మొదటి వర్గం దొరల సట్టం(కోయ తెగల్లో ఉన్నతులు-దేవుని వర్గం),రెండో వారు పుట్టదొరలు(నిజమైన దేవుళ్లుగా చెప్పుకుంటారు). గోండుల మాదిరి గానే తమను తాము వారి పరిభాషలో ‘‘కోయతూర్లు’గా చెప్పుకుంటారు. అలాగే కోయలు వారి వృత్తులను బట్టి రాచకోయ, గుమ్మకోయ,కమ్మరకోయ,ముసరకోయ, గంపకోయ,పట్టెడకోయ, వడ్డెకోయలు అనే 7వర్గాలుగా ఉన్నారు. అలాగే కోయలుగా గుర్తింపు పొందిన మరో నాలుగు తెగలు ఉన్నట్టు భాషా పరిశోధ కులు చెప్తున్నారు. డోలు కోయలు,కాక కోయలు, మట్ట కోయలు,లింగకోయలు అనే 4 తెగలను గుర్తించారు. అయితే కోయవారు కోయతూర్‌ భాషలో మాట్లాడతారు. కోయ భాషలో అన్నం తిన్నామా అనడానికి ‘‘దూడ తింతినే,నీ పేరు ఏంటి అనడానికి ‘‘మీ పేదేరు బాత’,మీది ఏమి కూర అని అడగడానికి ‘‘మీ వాది బాత కూసీరి’, నీకు జ్వరం వచ్చిందా అనడానికి ‘‘మీకు ఎరికి వత్తే ‘,ఇటురా అని పిలవడానికి ‘‘ఇలావా’ అని వారి భాషలో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఒక నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోయలందరూ మాట్లాడ గలిగినా నేడు కొందరు మాత్రమే ఈ భాషలో మాట్లాడు తున్నారు. మరికొందరు భాష వచ్చినా మాట్లాడ టానికి సిగ్గుపడుతున్నారని ఆ తెగకు చెందిన వారే చెప్తున్నారు. దీనికి కారణం అభివృద్ధి పేరుతో పరుగులు పెట్టడమేనని అంటున్నారు. జిల్లాలో గిరిజనులు సుమారు 97,929 వరకూ ఉండగా వీరిలో 70శాతం కోయ భాషమాట్లాడే వారు ఉన్నారంటూ ఆ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు.వీరిలో ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 60వేల మంది వరకూ గిరిజనులు నివసిస్తున్నారు.
గోండు అనేది సమాజం కోయతూర్‌? అనేది తెగ
ఒక్క తెలంగాణలో తప్ప దేశవ్యాప్తంగా గోండులు కోయలంతా కోయతూర్‌?లు గానే చెప్పుకుంటారు. దీనిని గోండి కోయ పురాణ లలో చూడవచ్చు, మధ్య భారతంలో 1నుండి 12 రకాల గొట్లు (సగా) లుగా నేడు ఆదివాసీ లున్నారు. అందులో తెలంగాణలో 3 నుండి 7 వరకు ఉన్నవి, మిగతావి ఇతర రాష్ట్రాలలో చూడవచ్చు వీరంతా కోయతూర్‌?లు గానే పిలుచుకుంటారు. కొమరం భీమ్‌ పోరాటం తరువాత ఆదిలాబాద్‌లో నిజాం రాజు ఏర్పాటు చేసిన ఆస్ట్రియా దేశస్తుడు అయిన ప్రో.హైమండార్ఫ్‌ కమిషన్‌ హైద్రాబాద్‌ రాష్ట్రంకి ఇచ్చిన నివేదికలో గోండు అని రాయటం మూలంగా తెలంగాణలో గోండు, కోయ వేరు అనే పరిస్థితులు వచ్చాయి. 8వ షెడ్యుల్‌లో గోండు భాషను అధికారికంగా గుర్తించాలి ప్రధానంగా ఈ దేశంలో హిందీ ప్రధాన భాషగా ఎక్కువ రాష్ట్రాలలో ఉండటం తో పూర్తి చేసిన ఈ డిక్షనరి మొదటగా దేవన గరి స్క్రిప్ట్లో ముద్రణలో చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో స్థానిక భాషలలోకి అనువాదం జరుగుతుంది. ఈ ప్రయత్నంతో రాష్ట్రాలు వేరు అయినా,ఈ దేశం ఆదివాసీ లను విభజన చేసినా,విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం జరిగిన ఒక గొప్ప ప్రయత్నంగా ఈ డిక్షనరీనీ చూడొచ్చు.ఈ డిక్షనరీ ఆదివాసి మేధావులు తయారు చేయటం వెనుక ఉన్న ఆకాంక్ష ఏమిటి అంటే పార్లమెంట్‌లో కోట్లాది కోయతూర్‌? ప్రజల అస్థిత్వానికి సంబంధించిన భాషకు రాజ్యాంగబద్ద ఆమోద ముద్ర 8వ షెడ్యూల్‌లో జరగాలి అని,హోం మంత్రిత్వ శాఖ అధికారిక పత్రం ప్రకారం గోండుభాషతో సహా 38 భాష లను చేర్చాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. 2004లో నాలుగు బాషలకు బోడో,డోగ్రి మైథిలి, సంతాలికి 22 భాషలతో కూడిన 8వ షెడ్యూల్‌?లో జోడిరచబడ్డాయి.కానీ గోండు భాషకు స్థానం కల్పించలేదు. గోండుభాష అంటే కేవలం సంభాషించే మాధ్యమం మాత్రమే కాదు, భౌగోళిక, పాక్నతిక, సామా జిక, చారిత్రక, ఇతిహాసాల సమగ్ర స్వరూపం, పురాతన మౌఖిక సాహిత్యం, ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానంతో ముడి పడి ఉన్నందున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలి. కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతంగా జరగాలి. ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో ఈ డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధ మిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూనివర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి.భాషాశాస్త్ర వేత్తలు,బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు,ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి.కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‌లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే భవిష్యత్‌లో పరాయి మతాల యొక్క బాషల ప్రభావం పడి కోయ తూర్‌ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం.
అతి ప్రాచీన భాషల్లో ఒకటి
తాము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడమే తప్ప తమ భాష, సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోందని కోయ గిరిజనులు భావించలేక పోతున్నారని పలువురు కోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయ భాష అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ద్రావిడ భాష నుంచి కోయ భాష పుట్టిందని చరిత్ర చెబుతోంది. అయితే కోయభాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కోయ భాష మీద ప్రధాన భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆతెగకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత పేరుతో జరుగుతోన్న అభివృద్దిలో భాగంగా భాషలకు ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం కోయభాషపై కనిపిస్తోందని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయ భారతి విద్య
కోయ భాషకు లిపి లేనప్పటికీ కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో 2005లో కోయ భాషలో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన గిరిజన ఉపాధ్యాయుల ద్వారా కోయ భాషకు సంబంధించిన తెలుగు పదాలతో కోయ భారతి అనే పుస్తకాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రధాన భాషలతో పాటు కోయ భాషను కూడా బోధించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానం వల్ల కోయ విద్యార్థులో విద్యపై ఆసక్తి పెరుగుతుందని, ప్రాథమిక విద్యాభ్యాసం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే కోయ భాషకు లిపి లేనందున భాషా సంస్కృతి క్రమంగా తగ్గిపోతోందని ఆదివాసీ కోయతెగల మేధావులు అంటున్నారు. తమ తెగకు ప్రధానమైంది భాషేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులపై ఉందని పేర్కొంటు న్నారు.కొండకోనల్లో అంతరించి పోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవు తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజ నులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది.
6 భాషలు..920 పాఠశాలల్లో అమలు
రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయను న్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవ డంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది.ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ),శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో (సవర),విశాఖపట్నం జిల్లాలో (కొండ,కువి, ఆదివాసీ),కర్నూలు,అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1నుంచి 3వ తరగతి వరకూ తెలుగు,గణితం,పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు.
యవ్వ.. ఇయ్య భాషలోనే..
కోయ భాషలో అమ్మను యవ్వ అని..నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా..అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని..కోడి పుంజును గొగ్గోడు అని..పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమా ణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా),బాత్‌ కుసిరి (ఏంకూర),దెమ్ము (పడుకో),ఏరు వాట (నీరు ఇవ్వు,పెట్టు),మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతా ల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతో పాటు వారి భాష, సంస్కృతి,సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొం దించారు.మాతృభాషలో బోధన వలన డ్రా పౌట్లు కూడా తగ్గుతాయి. మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసు కుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. కొత్తగా పాఠశా లలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయ భాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబు తుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవు తుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది.
కోయతూర్‌ బాట సాహిత్య కార్యశాల
కోయతూర్‌ల అస్థిత్వ మూలాలు,వారి కోయ భాష క్రమక్రమంగా అంతరించే దశకు చేరుకు న్నాయని ఆ తెగ ను, వారి కోయ భాష ను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని కోయతూర్‌ బాట వ్యవస్థపాకలు జి. యాద య్య పిలుపు నిచ్చారు.చింతూరు మండలం రామన్నపాలెంలో కోయతూర్‌బాట, సమత నిర్వహణలో కోయ బాల సాహిత్యం అనే అంశం పై ఐదు రోజులపాటు ఆదివాసీ యువకులు, పాఠశాలలో ని విద్యార్థులకు నిర్వహించిన కార్యశాల (వర్క్‌ షాప్‌ )నిర్వహించారు.సదస్సులో ఆయన మాట్లాడారు. ఒకే భాషగల ప్రజలు ఒకే మూలం నుండి వచ్చిన ప్రజలు భాష కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.భాషా శాస్త్ర వేత్తలు,బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు, ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి. కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‌లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. లేదంటే భవిష్యత్‌లో పరాయి బాషల ప్రభావం పడి కోయతూర్‌ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజమని స్పష్టం చేశారు. ఆదివాసీల హక్కులు, వనరులు పరిరక్షణ పై పని చేస్తున్న సమత కో-ఆర్డినేటర్లు గునపర్తి సైమన్‌, కందుకూరి సతీష్‌ కుమార్‌లు మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాలుగా,ఒరిస్సా,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌,ఆంధప్రదేశ్‌,మహారాష్ట్ర,ఒరిస్సా,కర్ణాటకలుగా విభజించటంతో ఆయరాష్ట్రాలలో ఈ కోయతుర్‌ భాషకు ప్రాధాన్యత లేక,66ఏళ్ళుగా,కోయ భాషకు మరాఠి,ఒడియ,హింది,కన్నడ తెలుగు భాష ప్రభావం పడి,కోయభాష యాస,ప్రాసలు కూడ మారియన్నారు.దాంతో కోయ పదాలన్ని స్థానిక భాష పదాలు అని చెప్పుకునే క్రమం తగ్గి పోతుందాన్నారు.విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం ఇది ఒక గొప్ప ప్రయత్నమని తెలిపారు. ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్ర దాయాలు, జీవన విధానంతో ముడిపడి ఉన్నం దున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలన్నారు.కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతం చేయాల్సి న బాధ్యత, ఆవశ్యకత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధమిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూని వర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్నారు.నాలుగు రోజుల వర్క్‌ షాప్‌లో కోయతూర్‌ బాట అకాడమీక్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పాండు ఆధ్వర్యంలో కోయ భాష పదాలు గుర్తించడం, విద్యార్థులు తో పదాలు పలికించడం వంటి అంశాలపై చర్చగోష్టి ఆసక్తికరంగా సాగింది.ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన కోయుతూర్‌ తెగల ఆనాటి జీవనవిధానం,వారు ధరించే వస్త్రాలు,పనిముట్లు ఇతరాత్ర అంశాలపై ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది.సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు,వినియోగదారుల సంఘం కార్యదర్శి చిట్టిబాబు,కృష్ణ,దుమ్మిరి వెంకన్న బాబు,సున్నం ఈశ్వర్‌ కుమార్‌,జి రాఘవ,దుమ్మిరి భీమమ్మా,కట్టం కిరణ్‌ యువతీ యువకలు,గిరిజన పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -గునపర్తి సైమన్‌

తుఫాన్లు..కష్టాలు

తీర ప్రాంత ప్రజానీకానికి తుపాన్లు, వాటి వల్ల వచ్చే కష్టాలు కొత్త కాదు. కానీ, ఆ కష్టాలను పూర్తి స్థాయిలో నివారించలేక పోవడమే బాధాకరం. తాజాగా విరుచు కుపడిన మాండూస్‌ తుపాన్‌ కూడా తీర ప్రాంత ప్రజానీకానికి తరగని కష్టాలను మిగిల్చింది. తుపాన్‌ ప్రాంతానికి పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా నష్టతీవ్రతను ఇంకా ప్రకటించలేదు. ఎన్యూ మరేషన్‌ ఇంకా ప్రారంభమే కాకపోవడంతో ఈ ప్రక్రియ పూర్తయి, బాధితులకు నష్ట పరిహారం అందడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోగా అరకొర సాయంతోనే బాధితులు నెట్టుకురావాల్సి ఉంటుంది. తుపాన్లు వంటి ప్రకృతి వైప రీత్యాలు చోటు చేసుకున్నప్పుడు గతంలో మరణాల సంఖ్య భారీగా ఉండేది. పెరి గిన సాంకేతికతతో పాటు అధికార యం త్రాంగం అప్రమత్తత కారణంగా ఇటీవల కాలంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.-సైమన్‌ గునపర్తి
మాండూస్‌ తుపాన్‌ సమయంలోనూ ఈ విష యాన్ని గమనించవచ్చు. మూడు,నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసినప్పటికీ,దక్షిణ కోస్తా జిల్లాలో నదులు,వాగులు పొంగి ప్రవహించినప్పటికీ మన రాష్ట్రంలో ఒక్కరే మరణించారు. అది కూడా వర్షాలకు నానిన గోడ కూలడం కారణంగా సంభవించింది. సకాలంలో సహాయ చర్యలు చేపట్టినందున మరణాల సంఖ్యను నలుగురికి పరిమితం చేయగలిగామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోనూ సంభవించిన ఆస్తి, పంట నష్టం మాత్రం అపారం. రాష్ట్రాలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే! తక్షణ సాయం ప్రకటించడంతో పాటు, పూర్తిస్థాయి నష్టం అంచనా వేయడానికి బృందాన్ని పంపడం, ఆ బృందం ఇచ్చే నివేదికను, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని మరిన్ని నిధులను మంజూరు చేయడం వంటి పనులు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా చేస్తుంది. ఈ తరహా స్పందన ఎంత త్వరగా వ్యక్తమైతే బాధిత ప్రజానీకానికి అంత త్వరగా ఊరడిరపు లభిస్తుంది. అయితే,తాజా తుపాన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇటువంటి స్పందన నామమాత్రంగా కూడా వ్యక్తం కాలేదు. సాయం సంగతి అలా ఉంచి,కనీసం బాధిత ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలనుండి ఊరడిరపు మాటలు కూడా వ్యక్తం కాకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.తమ సొంత ప్రభుత్వాలు ఉన్నచోటో,ఎన్నికలు వచ్చినప్పుడో దీనికి భిన్నంగా ఉరుకులు, పరుగుల మీద సాయం అందడం ప్రజానీకం గమనిస్తున్న విషయమే. ఈ తరహా వివక్షా పూరిత వైఖరిని కేంద్ర ప్రభుత్వం తక్షణం మానుకోవాలి. మాం డూస్‌ తుపాన్‌ కారణంగా చిత్తూరు, తిరుపతి,కర్నూలు నెల్లూరు,ప్రకాశం, బాపట్ల,గుంటూరు,కృష్ణ,ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట దెబ్బ తింది. రేపో,మాపోమార్కెట్‌కు చేరాల్సిన ధాన్యపు కళ్ళాల్లోకి వర్షపు నీరు చేరింది. పండ్ల తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరద నీరు చేరడంతో కొన్ని చోట్ల ఇళ్లకు దెబ్బతిన్నాయి. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ! అది జరగాలంటే ముందుగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో నష్టం అంచనాల ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వారం రోజుల్లోపు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఉదారంగా నిర్వహించాలి. రంగుమారినా, తడిసినా ముందుగా ప్రకటించిన రేటుకే కొనుగోలు చేయాలి. ముఖ్యమంత్రి కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి.దీంతో పాటు అన్ని విధాల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే రైతులకు కొంతమేరకైనా ఊరట లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని అధికార పక్షంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం కూడా సాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. అవసరమైతే ఇతర ప్రతిపక్షాలను, శక్తులను కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.
ఆంధ్రప్రదేశ్‌కు పదే పదే ఎందుకీ వరద కష్టాలు….
భౌగోళికంగా గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన నదులకు చివరలో ఉండే ఆంధ్ర ప్రదేశ్‌కు అనేక ముప్పులు పొంచివున్నాయి. నీటి కొరత ఏర్పడినా, నదికి వరదలు వచ్చినా తొలి ప్రభావం ఏపీ మీదనే ఉంటుంది. గడిచిన రెండు మూడు సీజన్లలో ఏటా వరదలతో అపార నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ చవిచూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి పెద్ద వరదలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి వరదల తాకిడి తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా పోలేదు. సహజంగా ఆగష్టులో ఎక్కువగా వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో.. గోదావరి తీరం ఇంకా ప్రమాదం ముంగిట్లో ఉన్నట్టుగానే భావించాలి.సెప్టెంబర్‌ మాసంలో ఎక్కువగా వరదల ప్రమాదం ఎదుర్కొనే కృష్ణా నదీ తీరం కూడా రాబోయే రెండు నెలల పాటు దినదినగండంగా గడపాల్సిందే. అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో పెన్నా తీరంలో ప్రమాదం పొంచి ఉంటుంది. గత నవంబర్‌లో ఎగువన కురిసిన భారీ వర్షాలకు పెన్నా నదీ తీరం పొడవునా అవస్థలు ఎదురయ్యాయి. ఏటా వరుసగా నాలుగైదు నెలల పాటు ఏదో నదికి వరదల ప్రమాదం అంచున ఆంధ్రప్రదేశ్‌ ఉంటుంది. అయితే, దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ..తగిన పరిష్కారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరకట్టల పరిస్థితిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరాన్ని ఇది చాటుతోంది.ఈ నేపథ్యంలో గోదావరి ఏటిగట్లు, కృష్ణా కరకట్ట, పెన్నా సహా పలు నదీ తీరాల్లో పరిస్థితిపై బీబీసీ పరిశీలన చేసింది.
గోదావరి ముప్పు నుంచి గట్టెక్కినట్టేనా
1986 తర్వాత 2006లో గోదావరికి ప్రమా దకర స్థాయిని మించి వరదలు వచ్చాయి. అపార నష్టానికి కారణమయ్యాయి. అధికా రికంగా 1986లో 300 మందికి పైగా ప్రాణా లు కోల్పోయారు. 2006లో 70మంది మర ణించారు. ఆతర్వాత 2022 జులై16న అత్యధి కంగా నీటిమట్టం నమోదయ్యింది. ఈసారి మాత్రం స్వల్ప సంఖ్యలోనే ప్రాణనష్టంతో గోదా వరి తీరం ఊపిరిపీల్చుకునే అవకాశం దక్కింది. ఇంత పెద్ద వరదల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న ఏకైక తేడా ఏటిగట్లు బలోపేతం కావడం. ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీకి ఎగువన అఖండ గోదావరిగా పిలుస్తారు.ఆ ప్రాంతం లో ఏటి గట్ల పొడవు 81.80కి.మీ.ఉం టుం ది.నదికి ఎడమ వైపు కొంత భాగాన్ని అంగు ళూరు ఫ్లడ్‌ బ్యాంకు అంటారు. దాని పరిధి 1.93 కి.మీ..ఇక బ్యారేజీ దిగువన గౌతమి ఏటి గట్లు 204.70కి.మీ.పరిధిలో ఉన్నాయి. వశిష్ఠ గోదావరి గట్లు 246.30 కి.మీ.పొడవు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైనతేయ సహా ఇతర నదీపాయల గట్లు కూడా కలిపితే దాదాపుగా 700 కిలోమీటర్లు ఉంటా యి. భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరిన నీటి మట్టం కారణంగా,ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద సుమారుగా 27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలాల్సి రావడంతో గోదావరి నదీ ప్రవాహం నిండుకుండను తలపించింది. అయినప్పటికీ పెద్ద ముప్పు రాకుండా నివారిం చేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.రాత్రి, పగలూ వివిధ శాఖల సిబ్బంది పలు చోట్ల పహారా కాయాల్సి వచ్చింది. స్థానికుల సహకారంతో గట్లు పరిరక్షించాల్సి వచ్చింది. ఈ ప్రయత్నాలే గోదావరి వాసులను ముప్పుల నుంచి తప్పించాయని చెప్పాలి. 2006 వరదల సమయంలో అయినవిల్లి మండలం శానపల్లి లంక,పి గన్నవరం మండలం మొండెపులంక వద్ద గట్లు తెగిపోయాయి. వరద ప్రవాహంతో ఊళ్లన్నీ జలమయమయ్యాయి. ఊరూ, ఏరూ ఏకం కావడంతో అపారనష్టం సంభవించింది. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పాటుగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా పర్యటించారు. ఆ సమయంలో గోదావరి గట్లు ఆధునికీకరిస్తామని శానపల్లిలంకలోనే సీఎం వైఎస్సార్‌ ప్రకటించారు. దానికి తగ్గట్టుగా 1983 వరదల తీవ్రతను ప్రామాణికంగా తీసుకున్నారు. అప్పట్లో దాదాపు 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించిన నేపథ్యంలో అలాంటి వరదలు మళ్లీ వచ్చినా ఎదుర్కోగల సామర్థ్యంతో గట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2006 వరదల నుంచి నేర్చుకున్న పాఠంతో సుమారుగా రూ.600 కోట్ల వ్యయంతో 535 కిలోమీటర్లు మేర ఆధునికీకరణ పనులు జరిగా యి.గట్లు ఎత్తు అందుకు తగ్గట్టుగా పెం చారు. ఆనాటి నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునికీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక ఆధారంగా ఈ పనులు చేశారు. ఇటీవల వరదల నుంచి కూడా కోన సీమ, పశ్చిమ గోదావరిలతో పాటు ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ప్రజలకు ఉపశమనం దక్కేం దుకు ఆనాటి పనులు తోడ్పడ్డాయి. కానీ రాను రాను గట్ల పరిస్థితికి నానాటికీ తీసికట్టు చందంగా మారుతోంది. అప్పట్లో పనులు పూర్తికాని చోట ఈసారి ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. వశిష్ఠ కుడి గట్టు నరసాపురం, వశిష్ఠ ఎడమ గట్టు పరిధిలో 48వ కిలోమీ టరు నుంచి 90వ కిలో మీటరు వరకు మూడు ప్యాకేజీలు ఆనాటి నుంచి అసంపూర్ణంగా వదిలేశారు.
ఇసుక తవ్వకాలతోనే తలనొప్పులు..
గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచినప్పటికీ వాటి లక్ష్యం దెబ్బతింటోందని ఇటీవలి వరదలు చాటుతున్నాయి. ముఖ్యంగా ఇసుక తవ్వకాలతో నదీ ప్రవాహం, ఒడి పెరగడమే కాకుండా ఏటిగట్లు బలహీన మవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇసుక తవ్వకాల విషయంలో నిబంధనలు అనుసరించకపోతే అనేక అనర్థాలు చవి చూడాల్సి వస్తుందని ఇరిగేషన్‌ నిఫునులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం గోదావరి ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. యంత్రాలు వినియోగించ కూడ దనే నిబంధన కేవలం పేపర్లకే పరిమితం. పైగా గట్లుని ఆనుకుని తవ్వేస్తుండడంతో గ్రోయిన్లు దెబ్బతింటున్నాయి. ఏటిగట్లు బలంగా ఉండేందుకు వాటిని నిర్మిస్తే ఇసుక తవ్వకందా రులు వాటిని కొల్లగొట్టేస్తు న్నారు. గట్లకి రక్షణ లేకుండా పోతోంది. ఏటిగట్లు మీద భారీ వాహనాల రాకపోకల కోసం బాటల పేరుతో గట్లు దెబ్బతీస్తున్నారు. ఫలితంగా వరదలు వచ్చిన ప్పుడు ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా భయాందోళనలు ఎదుర్కోవాల్సి వస్తోందని’’ భావిస్తున్నారు.
కృష్ణా తీరంలోనూ అదే కథ..
గోదావరి వరదల తాకిడికి కోనసీమ వాసులు ఎక్కువగా కలత చెందుతుంటే కృష్ణా వరదల వల్ల అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతాలు వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. విజయవాడ నగరంలోని పలు ప్రాంంతాలు కూడా వరద తాకిడికి తల్లడిల్లిపోవాల్సిన దుస్థితి నేటికీ ఉంది.కృష్ణా నదికి 2009లో భారీవరదలు వచ్చాయి. ఆ వరదల మూలంగా కృష్ణా తీర మంతా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. 2020లో కూడా వరద తాకిడి ఎక్కువగా నమోదయ్యింది. కానీ అంత పెద్ద ముప్పు లేకుండానే ప్రజలు బయటపడ్డారు. 2009 తర్వాత కృష్ణా నది కరకట్ల విషయంలో కూడా కొంత దృష్టి పెట్టారు. కానీ ఇసుక తవ్వకం దారుల తీరుతో నదీగర్భం కొల్లగొట్టడం, కరకట్ట దెబ్బతినడం వంటివి ఎదురవుతున్నాయి. ‘‘రాష్ట్రంలో గోదావరి, కృష్ణా వంటి నదులకు వరదలు తప్పవు. ఒక ఏడాది తప్పినా,ఎప్పటికయినా ముప్పు ఉంటుంది.దానికి మనం సన్నద్ధంగా ఉండాలి. కానీ అనేక అనుభవాల తర్వాత కూడా పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ఏటా వరదలు వస్తున్నాయనగానే వందల గ్రామాలు వణికిపోవాల్సి వస్తోంది. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూడాలి. అసాధా రణంగా ఎప్పుడయినా వరద వస్తే తప్ప, సాధారణ వరదలకు పెద్దగా భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేయాలి. అందుకు కరకట్టలు బలోపేతం చేయడం,వాటిని పరిరక్షించడమే మార్గం.కోట్లు వెచ్చించి పనులు చేసిన తర్వాత ఇసుక కాంట్రాక్టర్ల వ్యాపారం కోసం భారీ వాహనాలతో వాటిని బలహీనపరిస్తే ఏమి ఉపయోగం ఉంటుంది. కాబట్టి యంత్రాంగం అటువైపు దృష్టి సారించాలి’’అన్నారు ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఎస్‌ ఈ పీవీ రామారావు. దేశంలో వరద తాకిడి నుంచి గట్టెక్కడానికి వివిధ రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలను మనం పాఠంగా తీసుకొవచ్చని ఆయన బీబీసీతో అన్నారు. తమి ళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వరద నియం త్రణ చర్యలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రమాదం అంచున పెన్నా తీరం…
గోదావరి, కృష్ణా నదులతో పాటుగా వంశధార, నాగవళి సహా వివిధ నదుల మూలంగానూ వరద ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.వాటిలో పెన్నా ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో 2021 నవంబర్‌లో వచ్చిన వరదలు చాటిచెప్పాయి. ఏకంగా అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయే దశ నుంచి, సోమశిల ప్రాజెక్టు పరిస్థితి గురించి ప్రశ్నలు ఎదురయ్యే వరకూ వచ్చింది. భవిష్యత్తులో మరింత ముప్పు తప్ప దనే అంచనాలు ఉన్నాయి. దాంతో దానికి అనుగుణంగా చర్యలు అవసరమనే వాదన ఉంది. ‘‘అన్ని నదులకు కొన్ని సహజ లక్షణా లుంటాయి.20,30ఏళ్లలో ఓసారి అసాధా రణంగా ప్రవాహం వస్తుంది. వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటికి అనుగుణంగా మనం అప్రమత్తం కావాలి. వరద వచ్చినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత దానిని వదిలేయడంవల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. నిరుడు పెన్నా వరదలు, ఈ ఏడాది గోదావరి వరదలు వంటివి మనకు మేలుకొలుపు కావాలి. భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా అన్ని నదీ తీరాలను ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాలి. వాటిని ఎప్పటి కప్పుడు పరిరక్షణ జరగాలి’’ అంటూ పర్యా వరణ వేత్త సీహెచ్‌ శ్రీనివాసరావు అన్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఓవైపు వరద నీరు వెల్లువలా వచ్చి పడుతుంటే అప్పటికప్పుడు 2 మీటర్లు ఎత్తు పెంచినట్టు చెప్పడం విస్మయకరంగా కనిపించిందని,వరద నివారణ విషయంలో ప్రభుత్వ సన్నద్ధతను ఈ పరిణామం చాటుతుంది.ఆధునికీకరణలో భాగంగా వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాం తాలలో పర్యటనలో భాగంగా రాజమహేం ద్రవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు. శాశ్వత చర్యలపై దృష్టిపెడతాం. నవంబర్‌ కల్లా మనం టెండర్లు పూర్తిచేసుకుని పనులు మొదలు పెడదాం’’ అంటూ ఆయన అధికారులను ఉద్దే శించి వ్యాఖ్యానించారు.సీఎం ఆదేశా లకు అనుగు ణంగా శాశ్వత వరద నివారణ చర్యలకు సర్కారు సిద్ధమయితే గోదావరి తీర వాసుల భయాందోళనలు తగ్గుతాయి. అదే సమయంలో ఇతర ప్రధాన నదుల వెంబడి కరకట్టల తీరు మీద కూడా దృష్టి పెట్టాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

మళ్లీ కరోనా టెన్షన్‌

జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటి దాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్‌.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్‌ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్‌ తీసుకున్నామన్న భరోసాతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం మానేశారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటిం చాలన్న సోయి మరిచారు. ఫలితంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసు కోవాలని సూచిస్తున్నది. వైరస్‌ వల్ల తీవ్ర ఇబ్బందు లు పడిన ప్రజలు ఇక నుంచైనా జాగ్రత్తలు తీసు కోవాలి. అందరూ నిబంధనలు పాటిస్తేనే కొవిడ్‌ వ్యాప్తిని నిలువరించడం సాధ్యమవుతుంది. – జిఎన్‌వి సతీష్‌
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుం డటంతో అనేక దేశాలు మళ్లీ ఆంక్షలను విధిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మన దేశంలోనూ వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాయడం ఆహ్వానించదగిన పరిణామం. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే లేఖతో పాటు సమావేశంలోనూ రాష్ట్రాలకు సూచనలు చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టే నిర్దిష్ట చర్యల ఊసు లేదు. గతాను భవాల దృష్ట్యా ఈ తరహా ధోరణి ఏమాత్రం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబు తున్న సమాచారం ప్రకారమే కరోనా వైరస్‌ తాజా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బిఎఫ్‌-7 కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. దేశంలో ఈ రకం వైరస్‌ ముగ్గురికి సోకింది. ఇది బలంగా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుందని, ఇంక్యుబేషన్‌ వ్యవధి తక్కువగా ఉండటంతో పాటు ఒకరి నుండి మరొకరికి త్వరగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్ల సామర్ధ్యాన్ని సైతం అధిగమిస్తుందని అంత ర్జాతీయ నిర్ధారణ. అయితే, మన దేశంలో బిఎఫ్‌-7 రకం తొలి కేసును అక్టోబర్‌లోనే గుజరాత్‌లో గుర్తించారు.ఆ తరువాత ఇప్పటి వరకు మరో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు గుజ రాత్‌ లోనే నమోదుకాగా, మరొ కటి ఒడిశా లో వెలుగులోకి వచ్చింది. జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ తాజా గణాంకాల ప్రకారం గడిచిన 28రోజుల్లో (డిసెంబర్‌ 21నాటికి) జపాన్‌లో అత్యధికంగా 34లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరి యాలో16 లక్షల కొత్త కేసులు,1,385 మరణాలు సంభవించాయి. అమెరికాలో గత 28 రోజుల్లో 15,89,284 మందికి వైరస్‌ సోకింది.కోవిడ్‌ 19 వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆ దేశంలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఫ్రాన్స్‌లో 15,26,427 మంది ఈ కాలంలో కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. బ్రెజిల్‌లో 9, 45,568 మందికి వైరస్‌ సోకగా, 3,125 మంది మరణించారు. చైనాలో 9,17,308 కేసులు నమోదుకాగా, 646 మరణాలు సంభవించాయి. జీరో కోవిడ్‌ పాలసీని సడ లించిన తరువాత చైనాలో వైరస్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. జీరో కోవిడ్‌ విధానాన్ని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా విమర్శించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఈ సమయంలోనే మన దేశంలో 6,482 మంది వైరస్‌ బారిన పడగా 86 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ కోవిడ్‌ ట్రాకర్‌ నమోదు చేసింది.
కరోనా వ్యాప్తితో గత మూడేళ్ల కాలంలో దేశంలో కోట్లాది మంది ఆప్తులను కోల్పో యారు. ఆకస్మిక లాక్‌డౌన్‌ సామాన్యుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయి లో పునరుద్ధరణ జరగలేదు. ఆర్థిక సంక్షోభం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టడంతో పాటు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్య, ఆరోగ్య వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలి. దానికవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాలి. మందులకు కొరత రాకుండా చూడాలి. వ్యాక్సినేషన్‌ గురించి కేంద్ర ప్రభు త్వం ఎంత గొప్పగా చెబుతున్నప్పటికీ దాదా పుగా 27శాతం మంది ఇంకా మొదటి విడత వ్యాక్సినే అందలేదు. రెండు డోసులు వేసుకోని వారి సంఖ్య 32 శాతం దాకా ఉంది. ఇక బూస్టర్‌ డోస్‌ లెక్కల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించడానికి కేంద్రం ఇప్పటికైనా సిద్ధపడాలి. వైరస్‌ను అడ్డుపెట్టుకుని కార్పొరేట్‌ మిత్రులకు కోట్లు కట్టబెట్టే విధానానికి స్వస్తి పలికి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాలతో కలిసి కార్యాచరణకు కదలాలి. అటువంటి చర్యలే ప్రజలకు ధైర్యాన్నిస్తాయి. మహమ్మారిని నియంత్రించడంలో వారందరినీ భాగస్వామలను చేస్తాయి.
అకస్మాత్తుగా అలజడి..
కొవిడ్‌ తగ్గడంతో 2020 మార్చి నెలకు ముందు నాటి సాధారణ పరిస్థితులు వచ్చాయనే భావనలో ప్రజలు ఉన్నారు. సాధారణ జీవితానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. మొదటి, సెకండ్‌ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందులకు గురి కాగా, థర్డ్‌ వేవ్‌ ఇలా వచ్చి అలా వెళ్లడంతో ప్రజల్లో భయమే కనిపించలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నందున తమకేమీ కాదులే అనే ధీమాతో ప్రజలు చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్‌ జాడ మళ్లీ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మాస్కు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నది.
జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..
కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా గణాంకాలను చూస్తుంటే అర్థం అవుతున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలను పాటించాలి. మాస్కులు వాడడం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా చేతులు శుభ్రం చేసుకోవడం అలవర్చుకోవాలి. వైరస్‌ సోకిన వారికి తగిన వైద్యం అందించేందుకు దవాఖాన ల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు చాలా మంది ప్రికాషన్‌ డోసు తీసుకోలేదు. వారంతా మూడో డోసును తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు

1 2 3 6