ఆదివాసులకు దక్కని రాజ్యాంగ ఫలాలు

రాజ్యాంగ దినోత్సవాన్ని ‘‘నేషనల్‌ లా డే’’ లేదా ‘‘సంవిధాన్‌ దివస్‌’’ అని కూడా పిలుస్తారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని ప్రతి సంవత్సరం నవంబర్‌ 26 న జరుపుకుంటారు. 26 నవంబర్‌ 1949 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందువల్ల రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలను, డాక్టం బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ఈ రోజును ఎంచుకున్నారు.– బి.రామారావు దొర

ఈ దేశ ఆదివాసులకు భారత రాజ్యాంగం షెడ్యూల్‌ 5,6 ద్వారా ప్రత్యేకమైన రక్షణ వలవలయాలు (బపర్‌ జోన్స్‌) రూపొందించింది. భూమి హక్కులు,వనరులు పరిరక్షించడంతో పాటు భాష,సాంస్కృతి, సాంప్రదాయక విలువలను కూడా ఈరక్షణ వలయంలోకి తీసుకువచ్చింది.ఈషెడ్యూల్‌ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిరక్షణకు 1/70భూ వదలాయింపు నియంత్రణ చట్టం చేసింది.1917 ుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ aఅస ూaఅస ుతీaఅంటవతీం Aష్‌, 1917 (Aష్‌ చీశీ.1శీట 1917)’’ఈ చట్టానికి మూలం కాగా,ఈ చట్టం రూపకల్పనకు కారం తమ్మన్న దొర చేసిన పోరాటం స్పూర్తిగా నిలిచింది. ఆ తరువాత 1935, 1959 సవరణల తరువాత 1970లో ఏజేన్సీ ప్రాంతంలో ఆదివాసులు-ఆదివాసేతరు లకు మద్య అన్నిరకాల భూబదలాయింపులు పూర్తిగా నిషేదించబడిరది. షెడ్యుల్డ్‌ ప్రాంతంలో స్వయం ప్రతిపత్తిని బలపరుస్తూ,స్థానిక సంస్థల పరిపాలనను చూసుకోవడానికి పెసా చట్టం, 1996 ను తీసుకు వచ్చారు. వందల ఏళ్లుగా అదారపడ్డ అటవీ భూములకు యాజమాన్యపు హక్కులు సుస్థిరం చేయడానికి 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం రూపకల్పన చేసారు.షెడ్యూల్డ్‌ కులాలు,షెడ్యూల్డ్‌ తెగల పట్ల అత్యాచారాలు,ద్వేషపూరిత నేరాలను నిరోధించడానికి భారతపార్లమెంటుఎస్సీ,ఎస్టీ అట్రాసిటి (అత్యాచారాల నిరోధక) చట్టం,1989 తీసుకు వచ్చింది. ఆదివాసులను వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి కాపాడటానికి షెడ్యూల్డ్‌ ప్రాంత ఋణ (వడ్డీ) వ్యాపార నిబంధనలు 1960,రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు మరియు వెనకబడిన తరగతుల కుల దృవీకరణ పత్రాల జారిచట్టం`1993వంటి రక్షణ వ్యవస్థలు రూపొందించబడి ఉన్నాయి. అంతేకాకుండా,జాతీయ విధానాలు (చీa్‌ఱశీఅaశ్రీ ూశీశ్రీఱంఱం), మార్గదర్శకాలు (Gబఱసశ్రీఱఅం) చాలానే ఉన్నాయి.
క్షేత్రస్థాయి ఆచరణలో ఆదివాసుల హక్కులపట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వలన వారి హక్కులకు భంగంకలుగుతూనే ఉన్నాయి.రోజురోజుకు వారిహక్కులు ఉల్లంఘించబడుతూ ఉంది. బలమైన రాజ్యాంగవ్యవస్థలు ఉన్నప్పటికీ,ప్రస్తుతం ఆదివాసుల స్థితి ఏమిటి అంటే?ఉన్న చట్టాలు అమలు కోసం లేదా పరిరక్షించుకోవడం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, జరుగుచున్న ఉల్లంఘనలను అడ్డుకో వడానికి కొత్త చట్టాలు రూపకల్పనకు మరో పోరాటం చేస్తు ఉండాలి.దొంగ ఎస్టి సర్టిఫికెట్లుతో ఎస్టీల లోకి చొరబడిన వారు దొంగ ఎస్టీ విద్యార్థులు,దొంగ ఎస్టీ ఉద్యోగులు,దొంగ ఎస్టీ రాజకీయ నాయకులు, దొంగ ఎస్టీ ఓటర్లు, దొంగ ఎస్టీ లబ్దిదార్లు ఆదివాసులకు న్యాయంగా దక్కవలసిన రాజ్యంగా ప్రయోజనాలు, భూములు దొంగిలిస్తున్నారు.వీరికి పాలకపక్షాలన్ని మద్దతుగా నిలుస్తున్నారు.భారతదేశం అత్యంత వైవిధ్యమైన ఆదిమా సముహాల జనాభాకు సాక్షిగా నిలుస్తుంది.ప్రతి తెగకు దాని సొంత పాత్ర,గుర్తిం పు,స్వభావం కలిగి ఉంటుంది.ఉదాహరణకు,మధ్య భారతదేశం లేదా పశ్చిమ భారతదేశంలోని ఆదివాసుల జీవితం, పరిస్థితులకు – ఈశాన్య భారతదేశం మరియు అండమాన్‌లోని తెగల స్థితులు భిన్నంగా ఉంటాయి. దేశంలోని ఆదిమ సమూహాలు 18 రాష్ట్రాలలో విస్తరించి దేశ జనాభాలో 8.6% (104.2 మిలియన్లు) ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని ఈ సమూహాలు మెజారిటీగా ఉండగా (ఉదా:ఈశాన్య రాష్ట్రాలు), ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్డ్‌ ప్రంతాలలో చిన్నచిన్న భూ భాగా లుగా ఉన్నాయి.వీరిచట్టాలు కేంద్ర,రాష్ట్రా ప్రభు త్వాలచే అమలు చేయబడతాయి.భారత రాజ్యాంగం ఆదివాసుల ప్రయోజనాలను,ప్రత్యేకించి వారి భూమిపై వారి స్వయం ప్రతిపత్తి హక్కులను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5,6 ప్రత్యేక రక్షణను కల్పిస్తుంది.ఇది ఆదివాసీ సమూహాలను దోపిడీ నుండి రక్షించడానికి,వారి భూమిపై వారి హక్కులను కాపాడు కోవడానికి దోహద పడుతుంది.
ఐదో షెడ్యూల్డ్‌ నియమాల ప్రకారం సాధారణ పరిపాలనకు ఉద్దేశించిన పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చేసిన చట్టాలను షెడ్యూల్డ్‌ ప్రాంతానికి వర్తిస్తా యని జారిచేసిన నోటిఫికేషన్‌ లేదా ఆ చట్టాలను కొన్ని మినహాయింపులు, కొన్ని చేర్పుల (జుఞషవజ్‌ూఱశీఅం aఅస వీశీసఱటఱషa్‌ఱశీఅం)తో ఈ ప్రాంతానికి వర్తింపచేసేటట్లు రాష్ట్ర గవర్నర్‌,టిఎసితో కలిసి తగిన నిర్ణయం తీసుకుని వర్తింపచేయవలసి ఉంటుంది. ఇది ఐదో షెడ్యూల్డ్‌ లోని పేరా 5(1డ2) వెసులుబాటు కల్పిస్తుంది.దీనికి ఉదా హరణ:1994లో 73వరాజ్యాంగ సవరణ ద్వారా రూ పొందించిన రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చట్టం నియ మాల ప్రకారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, 1996లో పంచాయతీరాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత విస్తరణ చట్టం (పెసా) కేంద్ర చట్టం చేసే వరకు ఇదేళ్ళపాటు (1995-99) షెడ్యూల్‌ ప్రాంతంలో హై కోర్టు తీర్పుతో రద్దుచేసారు. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలను మినహాయింపులు లేదా చేర్పుల లేదా కొత్త చట్టాలు రూపొందించడానికి టిఎసిదే కీలకపాత్ర.కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 10 నెలలు గడుస్తున్న ఇంకా కౌన్సిల్‌ ఏర్పాటు జరగలేదు. నియమా నుసారం జరజవలసి రాజ్యాంగ ప్రక్రియాను నిర్లక్ష్యం చేయడం లేదా దానిని రాజకీయ సంస్థగా చూడటం వలన ఆదివాసులకు తీవ్రనష్టం జరుగుతుంది. ఇది అణ గారిన అదివాసి ప్రజల పట్ల జరుగుతున్న వివక్షపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో1950 జనవరి 26 నాటికి షెడ్యూల్‌ తెగలుగా గుర్తించబడి షెడ్యూల్డ్‌ ప్రాం తంలో నివాసం ఉంటున్న స్థానిక తెగలతో టిచర్‌ పోస్టుల భర్తికి ఉద్దేశించిన జీవో నెంబర్‌ 3రద్దు తర్వాత అదివా సులలో ‘షెడ్యూల్‌ ప్రాంతాల ఉద్యోగ నియామకల చట్టం’ చేయాలని డిమాండ్‌ ముందుకు వచ్చింది.నిజానికి ఈ డిమాండ్‌ కొత్తగా లేవనెత్తిన గొంతెమ్మ కోరిక కానేకాదు. రాజ్యాంగ కర్తలు ఐదో షెడ్యూల్‌ పేరా5లో పొందు పరచిన అంశమే.ఈ ప్రక్రియా రాజ్యాంగ వ్యవస్థ అయిన టిఎసిని ఏర్పాటుచేసి, ఆదివాసీ శాసనసభ్యులంత సంత కాలుచేసి,తిర్మాణాన్ని ఆమోదించి గవర్నర్‌ గారికి పం పాలి.రాష్ట్ర గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపాలి.ఆతీర్మానం ఆమోదం పొందితే ఆదివాసుల ఉద్యోగ భద్రతకు చట్టబద్దత వస్తుంది.ఇది రాజ్యాంగ ప్రక్రి యనే అయినప్పటికీ,ఉభయ తెలుగు రాష్ట్రాలు కనీస ప్రయత్నం చేయకుండా గుమ్మనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో గతప్రభుత్వం చేసిన టిఎసి తీర్మానం గవర్నర్కు ఆమోదం కోసం పంపిన సరిపోతుంది.లేదా టిఎసి ఏర్పా టు చేసి, తీర్మానాన్ని ఆమోదించి పంపాలి. లేదంటే, నాణ్యత లేని అరకొర చదువులతో ఏజేన్సీ ప్రాంత తెగలు, ఇప్పుడున్న పోటిని ఎదుర్కొని ఉద్యోగాలు పొందడం అంత సులువు కాదు. జీవో నెంబర్‌ 3రద్దు తరువాత,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడకి లేఖ రాస్తూ, ‘ఆదివా సుల హక్కులపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సాను భూతి లేకపోవడం వలన అణగారిన ప్రజలు వారి పురోగతికి,సాధికా రతకు ఆటంకం కలిగిస్తున్నార’ని తన లేఖలో పేర్కొ న్నారు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అరుకు సభలోను,అమరావతిలో జరిగిన ‘ప్రపంచ ఆది వాసి దినోత్సవ’ సభ లోను జివో నెం.3ని మళ్లీ తీసుకు వస్తానని బాబుప్రకటించారు.ఈప్రకటన వయసు మిరు తున్న ఆదివాసీ నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశమే.అయినా,మెగా డిఎస్సి -2024 నోటిఫికేషన్‌ జారీకి ముందు ఏజేన్సీప్రాంతానికి కేటాయించిన పోస్టు లు గురించి సరిjైున నిర్ణయం తీసుకోకుండా జెనరల్‌ రోస్టర్‌ ప్రకారం నోటిఫికేషన్‌ ఇస్తే మాత్రం షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది.ఆదివాసులకు గత పాలకులపై కలిగిన అపనమ్మకం, చంద్రబాబుపై పెట్టుకున్న ఆశ నెరవేరాలని ఆశిద్దాం…(నంబర్‌ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సంద ర్బంగా… వ్యాసకర్త: ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్‌, అల్లూరి జిల్లా)

వణికితున్న మన్యం..విసురుతున్న చలి పంజా…!

చలి తీవ్రత పెరగడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కురుస్తున్నది. సాయంత్రం నుంచి మొదలుకొని మరునాడు ఉదయం 8 గంటల వరకు చలివీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది వాకింగ్‌, జాగింగ్‌ చేస్తున్నారు. చలికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య నియమాలు పాటించక పోవడంతో జబ్బుల బారినపడతారని నిపుణులు పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జబ్బులు వారిని పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గునపర్తి సైమన్‌


ఉత్తరాంధ్రలో చలిపంజా విసురుతోంది. అర్ధ రాత్రి నుంచి తెల్లవారే వరకు కురుస్తున్న మంచుకు చలిగాలులు తోడయ్యాయి.దీంతో జనం ఉదయం7 గంటల వరకు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులుచెబుతున్నారు. సాధారణంగాఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు గత వారం రోజుల నుంచి వేగంగా పడిపోతు న్నాయి.మన్యంలోపాటు మహావిశాఖలోను ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.కురి స్తున్న దట్టమైన పొగమంచుతో చలి తీవ్రత పెరగడంవల్ల మన్యం వణికిపోతుంది. ప్రధా నంగా వృద్దులు,పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవా లని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
గతంలో లేని విధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.నగరంలో గతనాలుగైదు రోజుల నుంచి కనిష్టస్థాయిలో సుమారు14 డిగ్రీలుగా నమోదువుతు న్నాయి.చలిగాలి తీవ్రత పెరిగి వణికిస్తోంది.ప్రధానంగా రాత్రిళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతుండడం గమనార్హం.రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావ నేపథ్యంలో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు.ఇక మన్యప్రాంతంలో డుంబ్రిగుడలో8.2, జీ.మాడుగులలో 8.4,అరకులోయలో 8.5,పాడేరులో 10.9,ముంచంగిపుట్టులో 10.9,గూడెం కొత్తవీధిలో 11.4,చింతపల్లిలో11.3,మినుములూరులో9, పాడేరు లో 11డిగ్రీలు నమోదైంది.
మన్యంలో దట్టమైన పొగమంచులు..
చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది.జనం ఇళ్లలో నుంచి బయటకు రావడా నికి భయపడిపోతున్నారు.చలిమంటలు వేసుకుని కాలక్షే పం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదా రుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది.చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడి పోతు న్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. మిచౌంగ్‌ తుఫాన్‌ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది.తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలితీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది.
ఎంత పొద్దెక్కినా సూరీడు కనిపించట్లేదు..
ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపిం చకపోగా, పాడేరు,చింతపల్లి,అరకు లోయ, డుంబ్రిగుడ, ముంచుంగిపుట్టు, హుక్కుంపేట, తదితర మన్యప్రాంతాన్ని మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతు న్నారు.రోజురోజుకూ ఉష్ణోగ్ర తలు పడిపోవ డంతో పగలైనా సరే,వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్‌ చెయ్యా ల్సిందే.ఇక ముంచంగిపుట్టులో చలితీవ్రతకు జనం చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది.క్రమంగా ఉష్ణోగ్ర తలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది.తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు చలితీ వ్రత కొనసాగుతోంది.ఇకసాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవు తోంది.కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.ఇక ముంచంగి పుట్టు మండల పరిధిలో గత మూడు రోజులు గా చలి తీవ్రత పెరిగింది.ఉదయం పూట పది గంటల వరకు ముంచంగిపుట్టులో మం చు తెరలు వీడడం లేదు.చలికి జనం గజగజ వణికిపోతున్నారు.సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయ పడుతున్నారు.సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమి స్తున్నాయి.ఇలా ఉండగా ఈవాతావరణ పరిస్థితులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు మంచి అనుభూతినిస్తోంది.చలిలో మంచు అందాలను తిలకిం చేందుకు మాత్రమే వారు సందర్శి స్తున్నారు.మంచు విపరీతంగా పడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు.ఫ్రధానంగా విష(వైరల్‌) జ్వరాలు విజృంభిస్తున్నాయి.ఆస్తమా(ఉబ్బసం)బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం విశాఖ కేజీహె చ్‌కు జ్వరాలు,ఆస్తమాతో బాధప డుతున్న రోగులు తాకిడి పెరిగింది.ఎక్కువశాతం మందికి ఓపి విభాగంలో చికిత్స చేసి పంపుతున్నామని,శ్వాస తీసుకోవడంతో ఏమైనా ఇబ్బందులుంటే ఆసుప్రతిలో చేర్చి చికిత్స అందిస్తున్నా మని ఆసుపత్రి మెడిసిన్‌ విభాగా ప్రొఫెసర్‌ డాక్టర్‌ వల్లూరి సత్యప్రసాద్‌ తెలిపారు.చలి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
పెరుగుతున్న బాధితులు..
బాధితుల్లో ఒళ్లునొప్పులు,జ్వరం,జలుబు, గొంతు నొప్పి,నోరు రుచి లేకపోవడం వంటిలక్షణాలు కనిపిస్తు న్నాయి. జ్వరం మాత్రం48గంటలోపే నియంత్ర ణలోకి వస్తోంది.ఐదురోజుల వరకు జ్వరం తగ్గకపోయినా,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. కోవిడ్‌ టీకాలు వేయించుకోకుంటే కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.ప్రస్తుతం వస్తున్నవి విష జ్వరాలే.ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కాస్త ఆప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..` డాక్టర్‌.యశోధ

గిరిజన విద్యార్థుల్లో సమగ్ర వికాసం

అనంతగిరి ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, అరకు లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, యండపల్లి వాలసాలో జూనియర్‌ కాలేజ్‌, మరియు పాదేరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ వంటి వివిధ సంస్థలలో యువ క్లబ్‌లు ఉన్నాయి.ఈ యువ క్లబ్‌లతో మా పరస్పర చర్యల సమయంలో,విద్యార్థులు కొన్ని అత్యంత ముఖ్యమైన సమస్యలను మాకు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలలో,మేము పాఠశాల మరియు కాలేజ్‌ విద్యార్థుల కోసం ఉద్యోగా భివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాము, వారి సంబం ధిత గ్రామాల నెలకొన్న సమస్యలపై విద్యార్థులు దృష్టిసారించి తెలియజేశారు. వారి సమస్య లను యూత్‌ క్లబ్స్‌ తరుపున అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌కి,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌ సమత ప్రతినిధులు అందజేయడం జరిగింది.
విద్యార్థి దశ ఓమధురానుభూతి.అయితే తీవ్ర ఒత్తిడితో కూడిన నేటి చదువుల వల్ల విద్యా ర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పుస్తకాల బరువు,హోంవర్కులు,పరీక్షలు, మార్కులు, ర్యాంకులు వంటి వాటి హోరుతో తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారు. ఆటపాటలు కరువై ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతుం డటంతో మధురస్మృతులకు లోనై తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు.విషయ పరిజ్ఞానం,ఆలోచ నాశక్తి,సృజనాత్మకత,ప్రశ్నించేతత్వం అంతంత మాత్రంగానే ఉంటోంది.ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంపొందించటమే లక్ష్యంగా సమత రెండేళ్ల నుంచి అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు,అనంతగిరి, అరకు ఏపీ గిరిజన సంక్షేమ ఆశ్రమ జూని యర్‌ కళాశాల బాలబాలికలతో యూత్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసింది.స్థానికంగా నివాసముంటున్న వారి గ్రామాల్లో పలు సామాజిక సమస్యలను గుర్తించడం,వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం,జీవిత నైపుణ్యాలు తెలుసుకోవడం వంటి అంశాలపై తద్వారా విద్యార్ధినీ, విద్యార్థులు తమ నైపుణ్యాలతో గ్రామాల్లో ఉన్న పలు రకాల సమస్యలను తెలుసుకుని ఇటీవల జిల్లా కలెక్టర్‌,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి విన్నవించేలా కృషి చేస్తోంది.సామాజిక సేవే లక్ష్యంతో విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గిరిజన యూత్‌ క్లబ్‌లు సత్ఫ్‌లితాలు ఇస్తున్నాయి.కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన,వక్తత్వ పోటీలు నిర్వహిస్తుండటం ద్వారా విద్యార్థుల్లో ప్రపంచ,సామాజిక,శాస్త్ర, సాంకేతిక విషయా లపై అవగాహన,ఆసక్తి పెంపొందిం చటానికి కృషి చేస్తున్నారు.పోటీల్లో విజయం సాధించిన విజేతలకు చక్కట విలువైన బహుమతులు అందజేస్తున్నారు.స్నేహపూర్వకంగా సహాయ సహకారాలతో ముందుకు సాగుతోంది. కళా శాల విద్యార్థుల్లో సమగ్ర మనో వికాసానికి తమవంతుగా కృషి చేస్తున్నారు. ప్రాథమిక విద్య సమయంలోనే నైతిక విలువలు,జీవన నైపుణ్యాలు,సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని యూత్‌ క్లబ్‌ విద్యార్థులకు అలవర్చుతున్నారు.మాధ్యమిక, ఉన్నత విద్యను అభ్యసించే వారికి విమర్శనాత్మక దృష్టి, సృజనాత్మకత,భావ ప్రకటనా సామర్థ్యం, పరస్పర సహకారం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి కృషిచేస్తున్నారు. సామాజిక సమానత్వం,న్యాయం,ప్రపంచ సంఫీుభావం పెంపొందించటం,ప్రజాస్వామ్య విలువల పరి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి సమస్య గురించి హేతుబద్ధంగా ఆలోచించటం,పరిస్థితులను అవగాహన చేసుకోవటం,ఊహించటం,పోల్చటం, క్షేత్ర స్థాయి జ్ఞానాన్ని పెంపొందించటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.చదువుకునే రోజుల్లో ఉన్నత ప్రమాణాలకు పునాదులు వేసేందుకు యూత్‌ క్లబ్‌లు నిర్విరామంగా కషిచేస్తున్నాయి. వాటితోపాటుగా ఆరోగ్య సూత్రాలు,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికిగాను వారి శారీరక, మానసిక,విజ్ఞాన శక్తులను పెంపొందించే విధంగా సూచనలు,సలహాలిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. సదస్సులు, సమావేశాలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది.ఆటల్లో ప్రోత్సాహం, వ్యాయామం వంటివి నేర్పిం చటం, అవగాహనా శక్తి పెంపొందించే విధంగా మోటివేషనల్‌ తరగతులను వివిధ విషయాలపై నిర్వహిస్తున్నారు. మేథోశక్తిని పెంపొందించటానికి పుస్తకపఠనం,ఆన్‌లైన్‌ పోగ్రాములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా,ఒత్తిడి లేని విద్యను అభ్యసించటంపైనా, కెరీర్‌ గైడెన్స్‌పైనా మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నత చదువులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.ఆతర్వాత కూడా వారి ఆరోగ్య రక్షణకు,మానసిక వికాసానికి తగిన సూచనలు,సలహాలను అందిస్తున్నారు.
-గునపర్తి సైమన్‌

సముద్ర కాలుష్యం..ప్లాస్టిక్‌ అధికశాతం

తినే తిండి..తాగేనీళ్లు..వాడుకునే వస్తువులు..ప్రతిదానికీ ప్లాస్టిక్‌! మనకండ్ల ఎదురుగా కనిపించే ప్రతి వస్తువులో ప్లాస్టిక్‌..అంతాలా మన జీవితంలో ప్లాస్టిక్‌ భాగమైపోయింది.అవసరం ఉన్నాలేకున్నా వాడాల్సిన పరిస్థితికి మనం చేరి పోయాం.ప్లాస్టిక్‌ వస్తూనే ఉన్నది..గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూనే ఉంది.భూమినే కాదు..సముద్రాలను ముంచెత్తుతుంది.ఎన్నో జీవరాశుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది.ప్లాస్టిక్‌ భూతం వల్ల సముద్రాలకు,జలచరాలకు జరుగుతున్న నష్టమెంత?ప్లాస్టిక్‌ను ఆపేదెట్ల? సముద్రాలను కాపాడుకునుడెట్ల (కొట్టాల రాము)
మనిషి అడుగుపడనంత వరకే ఏ ప్రాంతమైనా సురక్షితం..అని అన్నాడో రచయిత.దేన్నయినా ధ్వంసం చేయగల నేర్పు..గాలినీ,గంగనూ..కలుషితం చేయగల తెలివి..ఒక్క మనిషికే సొంతం.మన తప్పులకు నీటి అడుగున ఉన్న ప్రపంచం నాశనం అవుతోంది.ఫ్లాస్టిక్‌ చెత్తను పడేసేందుకు డంపింగ్‌ యార్డుల్లా సముద్రాలు మారిపోతున్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో నిండిపోతున్నాయి.సముద్రపు జీవుల మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందని అమెరికాకు ఎందిన ‘ది5గైర్స్‌ ఇనిస్టిట్యూట్‌’ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ప్రపం చవ్యాప్తంగా ఉన్న మహా సముద్రాల్లో దాదాపు 170 ట్రినియన్ల ప్లాస్టిక్‌ ముక్కలు ఉన్నాయి.వీటి బరువు రెండు మిలియన్‌ టన్నుల ఉంటుంది.2005నుంచి సముద్రాల్లో ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ చాలా పెరిగింది.దీన్ని కానీ ఆపకపోతే 2040నాటికి వ్యర్ధాలు మూడురెట్లు పెరుగుతాయి.ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది.ప్లాస్టిక్‌ నివారణకు చట్టబద్దమైన విధానాలు తీసుకురావాలి.ఫ్లాస్టిక్‌ నష్టాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం అవసరం.ఎక్కువ ఫ్లాస్టిక్‌ తయారీతోపాటు వాడకం కూడా పెరిగింది.దీంతో భూమిపై వీటి వ్యర్ధాలు భారీగా పేరుకుపోయాయి’’ని వివరించింది.
మనకు ఎంతో ఇస్తోంది..
జీవి మనుగడకు సముద్రం అత్యంత ముఖ్యం.సముద్రాలులని మానవ జీవనాన్ని ఊహించలేం. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడువంతులు సముద్రాలే.ఒకవంతు భాగంలో మనం జీవిస్తున్నాం. మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం.సముద్రాల్ని క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ,మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. మన ఫుడ్‌లో ఇంపార్టెంట్‌ స్టాల్‌..అఅది దొరికేది సముద్రం నుంచే.చేపలు,రొయ్యలు,పీతల్లాంటి జలచరాలు సముద్రాల నుండే లభిస్తున్నాయి.అలాగే సముద్రపు పొచి,నాచు నుంచి సేకరించే పదార్ధాలను ఫుడ్‌ ఐటమ్స్‌లో వాడతారు.సముద్రాల్లో దరికే ఫ్రాన్స్‌,సీవిప్‌ కోరల్స్‌ నుంచి సేకరించిన పదార్ధాలను ఫెయిర్‌ కిల్లర్స్‌,ఇతర ఔషధ ఉత్పత్తుల్లో వాడతారు. సముద్ర తీరాల్లో లభించే ఇసుక..భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది.మనకు ఇంత ఉపయోగపడుతున్న సముద్రాలకు మనం మాత్రం తిరిగికాలుష్యాన్ని కానుకగా ఇస్తున్నాం.ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా కలుషితం చేస్తున్నాం.
సముద్ర జీవాలకు ముప్పు…
సముద్రపు అంచుల్లో నివసించే జీవుల్లో మైక్రో ఫ్లాస్టిక్స్‌ బయటపడుతున్నాయి. ‘‘మైక్రో ఫ్లాస్టిక్‌వల్ల నీరు కలుషితం అవుతుంది.ఇదొక్కటేనా ప్లాస్టిక్‌ను ఫుడ్‌ అనుకొని సముద్ర జీవులు తినడంతో వాటి ఆర్గాన్స్‌ దెబ్బతింటున్నాయి.మహాసముద్రాల్లో మైక్రో ఫ్లాస్టిక్స్‌ పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రపంచస్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంద’’ ని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.తాబేళ్లు,తిమంగలాలు,ఇతర జలచరాలు ఫ్లాస్టిక్‌ మింగడం లేదా వాటిలో చిక్కు కొని మరణిస్తున్నాయి.సముద్రపక్షలు చేపలు అను కుని ప్లాస్టిక్‌ను తింటున్నాయి.ఇలా చనిపోయిన పక్షల కడుపుల్లో దాదాపు80శాతం ఫ్లాస్టిక్‌ ఉంది. తిమింగలాల పొట్టలో నుంచి కేజీల కొద్దీ ఫ్లాస్టిక్‌ బయటపడిన ఘనటలూ ఉన్నాయి.
కారణాలేంటీ?..
సముద్రాలకు ఫ్లాస్టిక్‌ చేస్తున్న హానిని ఊహించ లేమని సైంటిస్టులు ఆందోళన పడుతు న్నారు.‘బీచ్‌ల్లో చెత్త వేయడం,సాధారణ వ్యర్ధాల నిర్వహణలోపం,మురుగు కాలువలు,నదులు, వాన లకు కొట్టుకుని రావడం వంటి కారణాలతో సము ద్రంలోకి ఎత్త చేరుతోంది.మరో 22శాతం మిస్‌ మేనేజ్‌ చేస్తున్నారు.ఇది ఇలానే కొనసాగితే భయంకర పరిస్థితులు తెలెత్తుతాయి.ప్రపంచం ముందుకు వచ్చి ఫ్లాస్టిక్‌ కట్టడికి చర్యలుతీసుకోకపోతే..2040 నాటికి మహా సముద్రాల్లోకి చేరే చెత్త 64బిలియన్‌ ఫౌండ్ల(2,902కోట్ల కిలోల)కు పెరుగుతుందని రీసెచర్చర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2050 నాటికి భూమిపై పోగయ్యే చెత్త 26ట్రిలియన్‌ ఫౌండ్ల(11.79కిలక్షల కోట్లు)వరకు ఉండొచ్చని మరో స్టడీ అంచనా వేసింది.‘‘ఫ్లాస్టిక్‌ కాలుష్యం చాలా స్థిరంగా కొనసాగుతుంది.అలానే వదిలేస్తే అనేక దశాబ్దాలు లేదా శతాబ్దాలపాటు ఇలానే ఉండొచ్చు.సముద్రంలోకి ఫ్లాస్టిక్‌ చేరకుండా అడ్డు కోవాలంటే దాని మూలాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి.అప్పుడే పరిష్కారాలు దొరుకుతాయి. దీనికి పూర్తి మ్యాపింగ్‌ అవసరం.ఒకసారి మహా సముద్రాల్లోకి చేరిన చెత్త..చిన్నచిన్న భాగాలుగా విడిపోతుంది.కాలక్రమేణా మారిపోతుంది.కానీ నిజంగా అదృశ్యం కాదు.రికవరీ కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది’’అని ది ఓషన్‌ క్లీనప్‌ రీసెర్చ్‌ హెడ్‌ లౌరెంట్‌ లెబ్రెటెస్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.
నమ్మలేని నిజాలివి…
-కొన్నేండ్లుగా సగటున ప్రతి నిమిషానికి ఓట్రక్కు చెత్త సముద్రంలో కలుస్తున్నట్లు అంచనా.
-గత వందేండ్లలో ఉత్పత్తి కానంత చెత్త..కేవలం గత దశాబ్దకాలంలోనే ఉత్పత్తి అయింది.
-ఒక ఫ్లాస్టిక్‌ కవర్‌ మనకు ఉపయోగపడే సమయం సగటున కేవలం 15 నిమిషా లు.కానీ అవసరం తీరాక అది డీగ్రేడ్‌ కావడానికి 500నుంచి వెయ్యేండ్లు పడు తుంది.డీ గ్రేడ్‌ అయినంత మాత్రాన డీ కంపోజ్‌కాదు.మైక్రోఫ్లాస్టిక్‌గా మారు తంది. మనుషులు,జంతువులకు విష పూరితంగా మారుతుంది.పావుగంటలో వాడేందుకు పనికరాకుండా పోయే వస్తువును..కొన్ని తరాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాకర వస్తువుగా మారుస్తున్నాం.
– ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 సముద్ర జంతువులు ఫ్లాస్టిక్‌ వల్ల చనిపోతు న్నాయి.దాదాపు 90శాతం సముద్ర పక్షలు ఫ్లాస్టిక్‌ తింటున్నాయి. ఫ్లాస్టిక్‌ను ఆహారం అనుకుని ప్రతి మూడు సముద్ర తాబేళ్లలో ఒకటి తింటున్నాయి.
– చివరికి తల్లి గర్బంంలోని శిశువులకు అన్ని పోసకాలను అందించే,బొడ్డు తాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రోఫ్లాస్టిక్‌ అవశే షాలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
-2050కల్లా ప్రపంచంలో మత్స్య సంపద తో సమానంగా ఫ్లాస్టిక్‌ సముద్రాల్లో చేరు తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు చేపలు పట్టేటప్పుడు ప్లాస్టిక్‌ వస్తువులు ఎక్కువగా పడుతున్నాయట. ఇటీవల కేరళలో మత్స్యకారుల వలలకు టన్నుల కొద్దీ ఫ్లాస్టిక్‌ చెత్త వచ్చి పడిరదట.
-సముద్రాల్లో పొగువుతన్న చెత్తలో 80శాతంపైగా ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలే ఉం టున్నాయి.
– ప్రపంచంలోని ఒక్కశాతం నదులు (సుమారు1,0001)..సముద్రాల్లోకి చేరే 80శాతం ఫ్లాస్టిక్‌కు కారణమవు తున్నాయి.
క్లీనింగ్‌ ఇలా..
ఫ్లాస్టిక్‌ చెత్త సముద్రాల్లోకి చేరకుండా ఆపడాన్ని నదులను శుభ్రపరచడం ద్వారా ప్రారం భించాలి.దిఓషన్‌ క్లీనప్‌ అనే నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనై జేషన్‌.. సముద్రాల్లో ఫ్లాస్టిక్‌ క్లీన్‌ చేసేందుకు చర్యలు చేప ట్టింది.ఇప్పటివరకు 2మిలియన్‌ కిలోలకు పైగా చెత్తను సముద్రం నుంచి తొలగించింది.
కాస్టింగ్‌ నెట్‌..
సముద్రాల్లో ఏర్పడే ప్యాచ్‌లను తొలగిం చేందుకు నెట్స్‌ వాడుతున్నారు.రెండు పడవలకు చెరోవైపు నెట్‌ను తగిలించి..యు ఆకారంలో వెళ్లి చెత్తనంతా మధ్యలోకి తీసుకొస్తారు.అక్కడి నుంచి తరలించి రీ సైకిల్‌ చేస్తారు.ఈప్రాసెస్‌లో సముద్ర జీవులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంటర్‌ సెప్టార్‌ సిస్టమ్‌..
నదికి అడ్డంగా ఒకవైపు నుంచి ఇంకో వైపునకు ‘ట్రాష్‌ ట్రెంచ్‌’ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంటర్‌ సెప్టార్‌ బ్యారియర్ల ద్వారా చెత్త సేకరి స్తారు. నది వెడల్పు,లోతు,ప్రవాహ వేగం,చెత్త రకం వంటి అంశాల ఆధారంగా సేకరణ తీరు మారు తుంటుంది.ఈ మొత్తాన్ని ఏఐ కెమెరాలను ఉపయో గించి అంచనా వేస్తారు.చెత్తను తీయడానికి కన్వే యర్‌ బెల్ట్‌ వాడతారు.
గ్రేట్‌ బబుల్‌ బారియర్లు..
గ్రేట్‌ బబుల్‌ బారియర్లద్వారా నది నుంచి వచ్చే చెత్త సముద్రంలో కలవకుండా చూస్తారు.ఈ బబుల్‌ బారియర్లను నదిలో వాలుగా ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి వచ్చే గాలి బుడగలు ప్లాస్టిక్‌ చెత్తను అడ్డుకుంటాయి.వచ్చే చెత్తమొత్తం ఒడ్డును ఒక మూలకు చేరేలా చేస్తాయి.అక్కడి నుంచి చెత్తను సేకరిస్తారు.
రోజూ వాడే వస్తువులన్నీ…
నదులు ద్వారా,నేరుగా డంపింగ్‌ చేయ డం ద్వారా భారీస్థాయిలో ఫ్లాస్టిక్‌ చెత్త సముద్రాల్లోకి వచ్చి పడుతోంది.సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆఫ్లాస్టిక్‌ అక్కడక్కడా గుంపు(ప్యాచ్‌)గా చేరుతోంది.ఈ ఫ్లాస్టిక్‌ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల వస్తువులు ఉంటున్నాయి.శాస్త్రవేత్తలు పసిఫిక్‌ ప్యాచ్‌లో పరిశీలించినప్పుడు..ఫ్లాస్టిక్‌ బాటి ల్స్‌,గ్లాసులు,పాత్రలు,బొమ్మలు,టాయిలెట్‌ సీట్లు, చేపల వలలు,ఎలక్ట్రానిక్‌ పరికరాల ఫ్లాస్టిక్‌ భాగా లు,ఇంట్లో వాడే ఇతరఫ్లాస్టిక్‌ వస్తువుల ముక్కలు, థర్మాకోల్‌ ముక్కలు..ఇలా ఇంకా ఎన్నో రకాలు కనిపించాయి.
ఫ్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేమా.?
ఫ్లాస్టిక్‌ను నియంత్రిండమెలా?నిజంగా మనం ఫ్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేమా?శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి.‘‘ విచ్చలవిడిగా ఫ్లాస్టిక్‌ను తయారుచేస్తూ..రీ సైకిల్‌ చేయాలి..క్లీన్‌ చేయాలి అంటే ఎలా?అసలు ఫ్లాస్టిక్‌ తయారు చేయడమే మానేయాలి.అప్పుడు రీ సైక్లింగ్‌,క్లీనింగ్‌ అవసరమే ఉండదు.ఫ్లాస్టిక్‌ బదులు మనకు ఎన్నోప్రత్యామ్నాయ మార్గాలున్నాయి .కాకపోతే ప్రభుత్వాలకూ,ప్రజలకూ నిబద్దత అవ సరం.ఫ్లాస్టిక్‌ వాడే తీరు మారాలి’అంటున్నారు.
సైంటిస్ట్‌లు..
మనం బజారుకెళ్లి ఏంతెచ్చినా..ఫ్లాస్టిక్‌ కవర్‌లోనే తెస్తాం.ఇంటికి వచ్చే వరకే ఫ్లాస్టిక్‌ కవర్‌ మనకు అవసరం.తర్వాత అదిచెత్త బుట్టలోకి వెళ్తుంది. ఇలా ఒకరోజుకు,నెలకు,ఏడాదికి ఎంత ఫ్లాస్టిక్‌ చెత్తను మనం పడేస్తున్నాం అనేది ఆలో చించాలి.అవసరం మేరకే వాడుతున్నామా? అందుబాటులో ఉంది కాబట్టి విచ్చలవిడిగా వాడు తున్నామా?అనేది గమనించాలి.మితిమీరి తింటే మందు కూడా విషం అవుతుంది.అలాంటిది విషం లాంటి ఫ్లాస్టిక్‌ను..ప్రతి దానికి ఉపయోగిస్తున్నాం.
మారాల్సింది మనం ..ఫ్లాస్టిక్‌ వాడుతున్న పద్దతి కదా!..
ఫ్లాస్టిక్‌ కవర్లపై నిషేధం అంటూ ఉత్తుత్తి ప్రకటనలతో కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి.దశల వారీగా సింగిల్‌ యూజ్‌ ఫ్లాస్టిక్‌ను నిషేధించాలి.ఫ్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేం దుకు టార్గెట్లు పెట్టుకోవాలి.వాటిని సాధించేందుకు కృషి చేయాలి.బ్యాన్‌ను కాదని అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రత్యామ్నాయాలను ప్రొత్స హించాలి.జనపనార లేదా క్లాత్‌ సంచుల వినియో గాన్ని ప్రోత్సహించాలి.తయారీదారులకు ఇన్సెం ట్‌వ్‌లు ఇచ్చి దన్నుగా నిలవాలి.ముఖ్యంగా బయో డీఏడబుల్‌ సంచులను ఉపయోగించేలా ప్రజల్లో మార్పు తీసుకురావాలి.బంగాళదుంపలతో కూడా క్యారీబ్యాంగ్‌,స్పూన్స్‌,ప్లేట్స్‌,పిల్లల ఆట సామగ్రిని తయారు చేస్తున్నారు.పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.కొదÊఇద రోజులకే కరిగి భూమిలో కలిసిపోతాయి.వీటిని రీసైక్లింగ్‌కి కూడా వాడొచ్చు. బ్రిటన్‌,జపాన్‌లలో వీటిని ఇప్పటికే వాడుతున్నారు. రోజుకు సముద్రాల్లో ఎంత ఫ్లాస్టిక్‌ చెత్త పేరుకు పోయింది?రేపటికీ అది ఎంత అవుతుంది?వచ్చే ఏడాది ఎంత పెరుగుతుంది?ఇలాంటి ప్రశ్నలకు మనకు నిజంగా సమాధానాలు తెలియపోవచ్చు. కానీ,సముద్రపు చెత్తా చెదారాన్ని నియంత్రించ డానికి స్థానికంగా,ప్రాంతీయంగా, ప్రపంచ స్థాయి లో తీవ్రమైన ప్రయత్నాలు జరిగే వరకు భారీ మొత్తంలో ఫ్లాస్టిక్‌ వేస్ట్‌ సముద్రాల్లో పెరుగుతూనే ఉంటుంది.
పదివేల అడుగుల లోతున…
ఫిలిప్పీన్స్‌ మెరైన్‌ సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మైక్రోబయల్‌ ఓషియనాలజిస్ట్‌ డాక్టర్‌ డియోఫ్లోరెన్స్‌ ఓండా..2021లో పసిఫిక్‌ సముద్రం లోని ‘ఎమ్డెన్‌ డీప్‌’లో 10,000మీటర్ల లోతైన ప్రదేశానికి వెళ్లారు.అది ప్రంచంలోని అతి పురాత నమైన, భూమ్మీద మూడులోతైన ట్రెంచ్‌(కందకం) సముద్రంలో దాగి ఉన్న రహాస్యాలను కనుగొవడం కోసం ఆసాహసం చేశారు.10,000మీటర్ల లోతులో పదార్ధాలను,వాతారణాన్ని పరిశీలిం చారు. ఆయనతోపాటు అమెరికన్‌ సైంటిస్ట్‌ విక్టర్‌ వెస్కోవా వెళ్లారు.ఇద్దరూ దాదాపు 12గంటలపాటు అన్వేషించారు.‘‘ మేమిద్దరం సముద్రంలోని లోతైన ప్రదేశానికి వెళ్లగానే తెలుపు రంగులోని పదార్ధాలు కనిపించాయి.వాటిని మొదట జెల్లీఫిష్‌ అనుకు న్నాం.తీరా దగ్గరకు వెళ్లి చూస్తే..అవన్నీ ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలని అర్ధమైంది.ఇంత లోతులో ఫ్లాస్టిక్‌ వ్య ర్ధాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. బట్టలు, పాత బొమ్మలు,ప్యాకేజింగ్‌ వస్తువులు,ఫ్లాస్టిక్‌ సంచులు ఇలా చాలా వస్తువులు అక్కడ పేరుకు పోయాయి’’ని చెప్పారు ఓండా.
ఊహించలేనంత నష్టం..
సముద్రం ఒక క్రైమ్‌ ప్లేస్‌గా మారింది. ఇది ఒక సైటింటిస్టు ఆవేదన.నీటిలో తప్ప ఇంకె క్కడా బతకలేని జలచరాలకు..సముద్రమే ప్రమాద కరమైన ప్రదేశంగా మారుతోంది.మనకెన్నో ఇస్తు న్న సముద్రాన్ని అంతలా మనమే నాశనం చేస్తు న్నాం.నీళ్లు,సముద్రపు ఉత్పత్తులు కలుషితం అయి పోతున్నాయి.అమెరికా సహా పలుదేశాల్లోని సము ద్ర తీర ప్రాంతాల్లో మట్టి,ఇసుకను పరిశీలిం చిన శాస్త్రవేత్తలు…వాటిలో ఫ్లాస్టిక్‌ అవశేషాలు గణ నీయంగా ఉన్నట్లు గుర్తించారు.మనం తినే తిండి, తాగే నీళ్లు..ఓలెక్కన చెప్పాలంటే మన శరీరంలోకి కూడా మైక్రోఫ్లాస్టిక్‌ చేరిపోతుంది.అసలు మైక్రోఫ్లాస్టిక్‌(సూక్ష్మస్థాయి ఫ్లాస్టిక్‌ ముక్కలు) లేనిప్రదేశమే లేకుండా పోయిందని సైంటిస్టులు చెప్తున్నారు.ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకా రం..గాలిలోని దుమ్ములో,తాగేమంచినీళ్లలో, సము ద్ర జీవు కడుపుల్లో మైక్రోఫ్లాస్టిక్‌ను గుర్తించారు. మనం తప్పు చేసి శిక్ష అనుభవించడమే కాకుండా ఎన్నో కోట్ల జీవరాశులను బలి చేస్తున్నాం.భవిష్యత్తు తరాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాం.‘‘ఏటా 640 వేల టన్నుల ఫిషింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను సముద్రాల్లో డంప్‌ చేస్తున్నారు.ఫ్లాస్టిక్‌ నుంచి వెలువడే రసా యనాలతో నీళ్లు కలుషితమవుతున్నాయి.ఆ ప్రభా వం సముద్రం జీవులపై పడుతోంద.వాటి నుంచి ఆ ఎఫెక్ట్‌ మనుషుల ఆరోగ్యంపై పడుతోంది’’ అని డబ్ల్యూయూఎన్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ రీసెర్చర్లు ఆందోళన పడుతున్నారు.
ప్లాస్టిక్‌ లేని ఊరు..
ఫ్లాస్టిక్‌ వల్ల ఈ భూమ్మీద ప్రతి ప్రాణికి ప్రమాదమే.అందుకే మన దేశంలో సహా ప్రపం చంలో అనేక దేశాలు ఫ్లాస్టిక్‌ వాడకం తగ్గించాయి. వ్యర్ధాలను ఎక్కపడితే అక్కడ పారేయకుండా చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్ధాలను గుర్తించిన ఓ గ్రామం సర్పంచ్‌ వాళ్ల ఊరి ప్లాస్టిక్‌ రహిత పంచాయితీగా మార్చాలి అనుకున్నాడు.కానీ,అది అంత ఈజీకాదని కొత్తగా ఆలోచించాడు.దాంతో ఆయన లక్ష్యం 15రోజు ల్లోనే నెరవేరింది.సౌత్‌ కశ్మీర్‌ అనంతనాగ్‌ జిల్లా లోని షహబాద్‌ బ్లాక్‌ సాదీవర పంచాయితీకి ఫరూ క్‌ అహ్మద్‌ గనయ్‌ సర్పంచ్‌.ఇంతకుముందు ఆయన లాయర్‌గా పనిచేశారు.వాళ్ల గ్రామంలో ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలు లేకుండా చేయాలనుకుని..‘ఫ్లాస్టిక్‌ తీసుకు రండీ`బంగారం గెలుచుకోండి’ అని ప్రకటించాడు.ఈ కార్యక్రమంలో భాగంగా 20 క్వింటాళ్ల ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలను తీసుకొచ్చిన వాళ్లకు ఒక బంగారం నాణెం ఇస్తామని చెప్పాడు.దాంతో ఊరివాళ్లంతా ఫ్లాస్టిక్‌ సేకరించే పనిలో పడ్డారు. దాంతో..పదిహేను రోజుల్లోనే ఊళ్లో ఫ్లాస్టిక్‌ కని పించకుండా పోయింది.ఆ తర్వాత గవర్న మెంట్‌ ఆ గ్రామాన్ని ఫ్లాస్టిక్‌ రహిత గ్రామంగా ప్రకటిం చింది.
రీసైక్లింగ్‌కు కట్టుబడితేనే…
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం మున్సి పాలిటీల ప్రాధమిక విధుల్లో ఒకటి.తడి,పొడి చెత్తను వేరుగా తీసుకోవాలి.రీసైక్లింగ్‌ చేపట్టాలి .అయితే ఈపని ఎక్కడా సరిగా జరగదు.కానీ, ఒడిశాలోని సంబల్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ)చెత్తనుంచి ఆదాయం సంపాదించుకుం టోంది.ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి.. అమ్మ డం ద్వారా ప్రతినెల రూ.15లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఆదయాం పొందుతోంది.‘గ్లాసు, పేపర్‌,కార్డ్‌బోర్డ్‌,మెటల్‌,ఫ్లాస్టిక్‌ టైర్లు,బట్టలతో సహా 16రకాల రీసైకిల్‌ చేయగలిగే వ్యర్ధాలు వేరు చేస్తోంది. ఎంపిక చేసిన ఏజెన్సీకి..ఒక్కో ఐటమ్‌ను ఒక్కో ధరకు అమ్ముతోంది.సంబల్‌పూర్‌ సిటీలో రోజూ 110టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే.. తొమ్మిది వెల్త్‌ సెంటర్లును ఏర్పాటు చేసి ప్రాసెస్‌ చేస్తున్నారు.తొలుత గృహాలు,వాణిజ్యసంస్థల నుంచి సేకరించిన చెత్తను వెల్త్‌ సెంటర్లకు తీసు కొస్తారు.ఈసెంటర్లలో మైక్రోకంపోస్టింగ్‌ సెంటర్‌ (ఎంసీసీ),మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ (ఎం ఆర్‌ఎఫ్‌) ఏర్పాటు చేశారు.నగరంలో ఉత్పత్తయ్యే బయోడీగ్రేడబుల్‌ వ్యర్దాలను వేరు చేస్తారు.అలా వేరు చేసిన తర్వాత రీసైకిల్‌ చేయడానికి వీలులేని చెత్తను..ఇంధనంగా వాడేందుకు సిమెంట్‌ ఫ్యాక్టరీకి పంపుతారు.రీసైకిల్‌ చేయగలిగే చెత్తను ఏజెన్సీకి అమ్ముతారు.వేస్ట్‌ను కూడా వేస్ట్‌ చేయకుండా ఆదాయవనరుగా మార్చుకుంటు న్నారు వాళ్లు.2017లో బ్రిటన్‌కు చెందిన అండర్‌ వాటర్‌ ఫొటోగ్రాఫర్‌ కారోలిన్‌ పవర్‌ తీసిన పొటో ఇది.హోండురాస్‌లోని రోవాటెన్‌ ఐలాండ్‌కు దగ్గర్లోకి కరేబియన్‌ సముద్రంలో ఇలాకొన్ని కిలో మీటర్ల మేరచెత్త పేరుకుపోయింది.హోం డురాస్‌, గాటెమాలలో అడ్డూఅదుపు లేని ఫ్లాస్టిక్‌ వినియో గానికి ఇదోఉదాహరణ.సముద్రాల్లో ఫ్లాస్టిక్‌ ఎంతటా పేరుకుపోతుందో చేపేందుకు ఇదో నిదర్శనం.పైగా‘దీనికి మీదే బాధ్యత’అంటూ రెండు దేశాలు ఒకరినొకరు నిందుంచుకోవడం గమ నార్హం. (వీ6వెలుగు సౌజన్యంతో…)

పెసా చట్టంపై అవగాహన సదస్సు

షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందా లంటే పెసా చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. సమత,గిరిమిత్ర సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 8వతేదీన నర్సీపట్నం ఎన్‌జీజీఎస్‌ భవనంలో పెసా చట్టం-1996పై సమీక్ష,అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపి ఆదివాసీ హక్కుల సంఘం అధ్యక్షులు ఎన్‌. కళ్యాణ్‌ మాట్లాడుతూ గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు గ్రామసభల అమలపై పెసా చట్టాలను నేటి గిరిజన యువత అవగా హన చేసుకొని,స్థానిక వనరులు దోపిడికి గురి కాకుండా పరిరక్షించుకోవాలన్నారు.పెసా కమిటీ సభ్యులు బత్తుల కృష్ణ మాట్లాడుతూ గిరిజన వనరులు పరిరక్షణ,గిరిజన పల్లెల ప్రగతి చెందాలంటే పెసా చట్టం ద్వారా గ్రామ సభలు సంపూర్ణంగా అవగాహన చేసుకోవా లన్నారు.అనకాపల్లి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు ఎస్‌.జనార్దన్‌ ప్రతి యువత గ్రామసభల నిర్వహణ,బాధ్యతలు తెలుసుకుని గిరిజన గ్రామభివృద్ధికి తోడ్పాడాలని పిలుపు నిచ్చారు.సమత సభ్యులు పెద్దమల్లాపురం)లోతా సుబ్బారావు మాట్లాడుతూ సమత చేస్తున్న రాజ్యాంగ పోరాటాల ఫలితమే నేడు గిరిజన వనరుల పరిరక్షణ అన్నారు.గిరిమిత్ర కార్యదర్శి బి.గంగరాజు అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో అనకాపల్లి జిల్లా బిఎస్పి పార్టీ అధ్యక్షులు బి.నాగరాజు,వికాసవాణి కార్యదర్శి జగ్గారావు,ప్రగతి శిలా కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ పెసా చట్టం అమల్లోకి వచ్చి సుమారు 32 సంవత్సరాలు అవుతున్నా నేటికీ షెడ్యూల్డ్‌ ఏరియాలో సంపూర్ణంగా అమలు కావడం లేదని అన్నారు.దీనివల్ల ఎన్నో గిరిజన కుటుంబాలు భూములు అన్యాక్రాంతమవుతూ దోపిడీదారుల గుప్పెట్లో నలిగిపోతున్నారని పేర్కొన్నారు.బి.బాలరాజు,వినియోగదారుల మండల్‌ చింతపల్లి మండల అధ్యక్షులు పి.చిట్టిబాబు,సమత డైరెక్టర్‌ సుశాంత్‌ ప్రాణాగ్రహీ,కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామసభ ప్రతిష్టతను,దాని ఫలితాలను వివరించారు.జీ.సైమన్‌ మాట్లాడుతూ పెసాచట్టం, గ్రామసభ ప్రాధాన్యత పై తమ తమ అభిప్రాయాలను వెల్లడిరచారు.పెసా చట్టంలో పొందు పరిచిన కమిటీలు నిర్వహణ,బాధ్యతలు,అన్యా క్రాంత మవుతున్న భూములు పరిరక్షణ, సంతల కోసం గ్రామసభల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవా లనే అంశాలను వివరించారు.ఈ సమావేశం లో సమత పరిశోధన విద్యార్థులు,గిరిజన యువకులు పాల్గొన్నారు. అనంతరం ‘పల్లె ప్రగతికి పట్టాభిషేకం పెసా చట్టం-996’అనే పుస్తకానీ ఆవిష్కరించారు. – (బి.గంగరాజు)

దేశంలో జమిలి ఎన్నికల సంకేతాలు

జమిలి ఎన్నికల విషయంలో మరో అడుగు పడిరది. ఈ మధ్యనే, సార్వత్రక ఎన్నికలకు కాస్తంత ముందు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. లోక్‌సభలో సొంతబలం గట్టిగా ఉన్న తొలి రెండు పర్యా యాల్లో ఈదిశగా సాగించిన ప్రయత్నా లను, ఇప్పుడు సరిపడా స్వశక్తి లేని దశలో కూడా ముందుకు తీసుకుపోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జమిలితో దేశా నికి ఎంతో మంచిది అంటూ బీజేపీ పెద్దలు పట్టువీడ కుండా పోరాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
దేశంలో జమిలి ఎన్నికల సంకే తాల సందడి మరోసారి బలంగా తెరపైకి వచ్చింది.అకస్మాత్తుగా పార్లమెంట్‌ ప్రత్యేక సమా వేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో జమిలీ ఎన్నికల సాధ్యా సాధ్యాలపై కమిటీ వేశారన్న సమాచారంతో.. ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ సాగు తోంది. ఇప్పటికే తెలంగాణపై కర్ణాటకలో కాం గ్రెస్‌ గెలుపు ప్రభావం ఉంది. వచ్చే ఎన్నికలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఛత్తీస్‌గఢ్‌, తెలం గాణలో కాంగ్రెస్‌ గెలిస్తే మరింత ప్రభావం చూపే అవ కాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ లు, దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సిఫారసులు చేయాలంటూ గత మోదీ ప్రభుత్వం కోవింద్‌ కమిటీని కోరింది.ఈ నేపథ్యంలో చర్చలు నిర్వహించిన కమిటీ.. తన సిఫారసు లను గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.తొలుత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒక విడుతలో ఎన్నికలు నిర్వహించడం,తదుపరి వంద రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలి సాధ్యపడుతుందని కోవింద్‌ కమిటీ పేర్కొన్నది.జమిలి ఎన్నికలు నిర్వహిం చాలంటే రాజ్యాంగంలో పలు కీలక సవరణలు చేయాల్సి ఉంటుంది.తొలివిడుతలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించ డానికి రాజ్యాంగ సవరణలు అవసరమైనప్పటికీ.. పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రాల ర్యాటి ఫికేషన్‌ అవసరం ఉండదు. అయితే..వంద రోజు ల తర్వాత నిర్వహించే స్థానిక ఎన్నికలకు మాత్రం కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు,లోక్‌ సభకు,స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వ హించడమే జమిలి ఎన్నికలప్రధాన ఉద్దేశం. గతం లో జరిగినా..ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952 లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడక పోవడం,గడువుకు ముందే పలురాష్ట్రాల శాసన సభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాల తో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ,అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరు పడం మొదలైంది.
ప్రక్రియ పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాలు చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్య వధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నిక లు జరుగాలంటే దాదాపు 18రాజ్యాంగ సవర ణలు,ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌172(1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తు న్నారు.
రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సులు
జమిలి ఎన్నికల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయక త్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ 18 వేల పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పిం చింది.దేశంలో47రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.ఈకమిటీ 2029నాటికి రాజ్యాం గంలో 5ఆర్టికల్స్‌ సవరణ చేసి జమిలి ఎన్నికలు నిర్వ హించవచ్చని తెలిపింది.7దేశాలలో జమిలి ఎన్ని కల గురించి అధ్యయనం చేశామని పేర్కొంది. కానీ స్వీడన్‌,జర్మనీ,బెల్జియం వంటి దేశాలలో అమ లులో ఉన్న నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం గురించి కమిటీ పేర్కొనలేదు.కోవింద్‌ కమిటీ 10కీలక సిఫా ర్సులు చేసింది.తొలి దశలో లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారిఎన్నికలు నిర్వహించాలని, రెండో దశలో కార్పొరేషన్లకు, మునిసిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు,పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్ని కలు నిర్వహించాలని పేర్కొంది.స్థానిక సంస్థల ఎన్నికలు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పింది. జాతీ య ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయాలని పేర్కొంది.
రాజ్యాంగ సవరణలు
జమిలి ఎన్నికలు అమలులోకి రావటానికి కనీసం 6 రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటుందని రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ పేర్కొన్నది. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గద ర్శకాలను నిర్దేశించిన 1951ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు కనీసం 6కీలక రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉం టుంది.లోక్‌సభ,రాజ్యసభ కాలపరిమితిని నిర్ణ యించే 83వఆర్టికల్‌,రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని నిర్ణయించే 172వ ఆర్టికల్‌,ఎన్నికల కమిషన్‌ అధికారాలకు సంబంధించిన 324వ ఆర్టికల్‌ సవరణ చేయాలి.వీటితో పాటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్‌243-కె, 243-జడ్‌.ఏలను కూడా సవరించవలసి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే రాజ్యాంగ సవరణలను రాజ్య సభ, లోక్‌సభ లలో 2 బై 3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం రెండు సభలలో బిజెపికి ఉన్న బలంతో అది సాధ్యం కాదు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. దీనితో పాటు స్థానిక సంస్థల రాజ్యాంగ సవరణలకు సగం రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించాలి. బిజెపి మిత్రపక్షాలు అంగీకరిస్తేనే ఇది సాధ్యమౌ తుంది. – (కె.యస్‌.లక్ష్మణరావు)

అడవి తల్లి వేదన..అరణ్య రోధన

అడవంటే జ్ఞాన నిలయం.తపోభూమి. అడ వంటే ఆరోగ్య ప్రదాయిని. ఔషధుల ఖని. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి భారతీయ ఆత్మ. జీవితాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే అందులో ఒక భాగానికి వానప్రస్థాశ్రమం అన్న పేరు పెట్టి, అడవిలో తమని తాము భాగం చేసుకున్నారు భారతీయులు. ఈ అద్భుత చింతనను గతం గూటిలోకి నెట్టడం సరికాదు. ఇప్పుడు అడవులకు మనిషి చేస్తున్న చేటును ఆపాలంటే ఆ భావన ఉపయోగపడు తుందని ఆశిద్దాం. అడవిని రక్షించుకోవాలన్న నినాదం ఈ క్షణం నుంచి ప్రతి గుండె లయ కావాలి. లేదంటే రేపన్నరోజు ఆ గుండె కొట్టుకోవడం కష్టమవు తుంది. అడవి లుప్తమైతే మంచి గాలి ఉండదు. అడవి నరికితే భూమి ధ్వంసమవుతుంది. చెట్లు నరికితే పర్యావరణం నాశనమవుతుంది. వీటన్నిటికి స్పందిం చేది నీ గుండె, నా గుండె, మనందరి గుండెలు. అడవిని రక్షించుకోవడం ధార్మిక విషయమే కాదు. శాస్త్రబద్ధం కూడా. కాని వనాల మీద భారతీయులు పెంచుకున్న భావనకు వేళ్లు విజ్ఞానశాస్త్రంలో ఉన్నాయి.
ప్రపంచ జనాభాను బాధిస్తున్న దాదాపు ఎనభై శాతానికి పైగా జబ్బులకు ఔషధాలను అంది స్తున్న ఆఅడవితల్లి ఇప్పుడు రక్తకన్నీటిని కారుస్తున్నది..ప్రతీ యేటా ప్రపంచ అటవీ సంరక్షణ దినోత్సవాన్ని ఘనంగా జరిపే ఐక్యరాజ్య సమితి ఈసంవత్సరం కూడా ‘’ఫారెస్ట్‌ అండ్‌ ఎనర్జీ(అడవి మరియు శక్తి)’’ నినాదంతో పర్యావరణ ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలను రూపొందించింది. అయినప్పటికీ,ప్రకృతి మాతపై జరుగుతున్న ఘోర కలి ఆగట్లేదు. డెబైÄ్భయేండ్ల క్రితం 250కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభాకు ఎటువంటి రక్షణను అందించిందో, ప్రస్తుతమున్న ఎనిమిది వందల కోట్ల జనులకు అదే ప్రేమను పంచుతున్న ఆ అడవికి మాన వుడు చేస్తున్న గాయం వర్ణనాతీతం! తనను ఎంతగా నాశనం చేస్తున్నా..ఆఅడవితల్లి తన బిడ్డలకు జీవ వాయువులను అందిస్తూ, వర్షాలు కురిసేలా చేస్తూ, ఆకలితీర్చే అమ్మగా తన ఒడిలో ఇప్పటికీ సమస్త ప్రాణికోటిని కంటికి రెప్పల సాకుతూనే ఉన్నది.
అగ్ర రాజ్యాలే ఆజ్యం పోస్తున్నాయి
1990 నుంచి ఇప్పటి వరకు సగానికి సగం వర్షాధార అడవులు కేవలం అగ్ర దేశాల కార్యకలాపాల వల్లనే నాశనమయ్యాయని తెలిస్తే ఆశ్చర్యం కలక్కమానదు..అటవీ పరిరక్షణ సమితి,ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం..భూమిపై 30శాతం అడవులు ఉం డాలి.కానీ ఏటావీటి విస్తీర్ణం గణనీయంగా పడిపోతున్నది. ప్రతీ సెకనుకి ఒకటిన్నర ఎకరం అడవి నరకబడుతుందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పర్యావరణవేత్తలు చెప్పే దాన్ని బట్టి..వాతావరణంలోకి విడుదల య్యే ఒక క్లోరిన్‌ పరమాణువు, భూమికి కవచంలా ఉన్న ఓజోన్‌ పొరలోని లక్ష అణువులను విచ్ఛి న్నం చేయగలదు! అడవులను క్రమక్రమంగా క్షీణింపజేస్తూ..రోజుకి కొన్నిలక్షల లీటర్ల క్లోరిన్‌ సంబంధ ఉదారాలను అగ్రదేశాలు వాతావర ణంలోకి వదులుతున్నాయని, ఇదిలాగే జరిగితే రానున్న శతాబ్ద కాలంలో భూమిపై ఒక్కటంటే ఒక్క వర్షాధార అడవి కూడా మిగలదని హార్వర్డ్‌,కొలంబియా విశ్వ విద్యాలయాల పర్యావరణ విభాగానికి చెందిన నిపుణుల పరిశోధనల్లో వెల్లడ వ్వడం యావత్‌ ప్రపం చాన్ని నిశ్చేష్టులను చేస్తున్నది.
అడవుల ప్రాధాన్యం తెలుసా ?
అభివద్ధి ముసుగులో అగ్రరాజ్యాలు అవలం భిస్తున్న పారిశ్రామిక వింత పోకడలు ప్రకతి మాత ఒంటిని తునాతునకలు చేస్తున్నది. అడవులను విచక్షణా రహితంగా నరకడం వల్ల కార్బన్‌ డైయాక్సైడ్‌ నియంత్రణ కుంటు పడి, వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపు తున్నది. సాధా రణంగా సముద్రాలు 25శాతం కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుం టాయి.ఇవి నీటిలోని వివిధ మూలకాలతో కలిసి కార్బాలిక్‌ యాసిడ్‌ వంటి పదార్ధాలను ఏర్పరుస్తాయి.ఈ విధంగా గడచిన 250 సంవత్సరాల్లో సము ద్రజలాల ఆమ్లత్వం 30శాతం పెరిగిందని, దీనికి కారణం..అడవులశాతం తగ్గడమే నని,ఇది ఇలాగే కొనసాగితే,2100 సంవత్స రం నాటికి సముద్రజలాల ఆమ్లత్వం 150 శాతం వరకు పెరిగి..సముద్రాన్నే ఆవాసంగా ఏర్పరచుకున్న లక్షలాది సముద్ర జీవులు మృత్యువాత పడటం ఖాయమని బయో డైవర్సి టీ రిపోర్టులు కుండబద్దలు కొట్టాయి. ఇక,అడవుల్లో చెలరేగే అగ్ని ప్రమాదాలు పర్యా వరణానికి, జంతువులకే గాక మానవుల్లో సైతం వివిధ శ్వాసకోశ వ్యాధులు,అస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి రోగాలకు పెను ముప్పుగా దాపురిస్తున్నాయి. ఉదాహరణకు.. 2015ఆగష్టు నెలలో ఇండోనేషియా అటవీ ప్రాంతంలో సంభవించిన ఘోరఅగ్ని ప్రమా దంలో వేలకు వేల అరుదైన వ క్షాలు, జీవ జాలం కలిగిన సుమారు 2.6మిలియన్‌ హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహు తవ్వగా..సుమారు 1,00,300 మంది ప్రజలు వివిధ శ్వాసకోశ వ్యాధులతో అసువులు బాసా రని తేలింది.అడవులను నరకడంవల్ల ఓజోన్‌ పొర క్షీణించి సూర్యుడినుంచి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమికి చేరుకోవడవల్ల మానవుల్లో వివిధ రకాల క్యాన్సర్లకు కారణ మవుతాయనే విషయం కూడా తెలిసిందే !
అడవులను విచక్షణారహితంగా నరుకుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న సుమారు 70శాతం కాగితాన్ని వినియోగించు కుంటూ ..రానున్న ఇరవై యేండ్లలో 28వేల జీవజాతుల మనుగడనే ప్రశ్నార్ధకంచేస్తున్న అమెరికా,ఐరోపా వంటి అగ్రదేశాలే జరుగు తున్న విపత్కర పరిణామానికి జవాబుదారీతనం వహించాలి.పర్యావరణ ప్రేమికులు,అభివృద్ధి చెందుతున్న దేశాల అధినేతలు అగ్రరాజ్యాల మెడలు వంచి అడవితల్లి మెడలో పచ్చల తోర ణం అలంకరించే అవసరం ఎంతైనా ఉంది.
అడవులు ఆశ్చర్యకర అంశాలు
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160కోట్ల మంది ప్రజలకు అడవే జీవనాధారం!భూమిపై ప్రతి నిమిషం..ఇరవై ఫుట్‌ బాల్‌ స్టేడియం విస్తీర్ణ మంతా అటవీ ప్రాంతం కనుమరుగవుతు న్నది.ప్రపంచ జనాభాలో 5శాతం కూడా లేని అమెరికన్లు, ముప్పై శాతంకి పైగా కాగితాన్ని వినియోగిస్తున్నారు.ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం అమెరికా,ఐరోపా దేశాలే 12రెట్లు ఎక్కువ అడవిని పారిశ్రామికీకరణ పేరుతో నాశనం చేస్తున్నాయి.
చెట్టును కూల్చడమంటే హత్యతో సమానం. ఒక అడవిని నిర్మూలించడమంటే ఒక జాతి మీద జరిగిన సామూహిక హననం కాదా! చెట్టుకు అనుభూతులుంటాయి. చెట్టుకు వ్యక్తీకరణలుంటాయి. వైర్లెస్‌ సిగ్నలింగ్‌, మైక్రోవేవ్‌ ఆప్టిక్స్‌ శాస్త్రవేత్త సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ వంటి మహా శాస్త్రవేత్త చెప్పిన అద్భుత సత్యమిది. చెట్టుకు అనుభూతులు ఉంటాయని ఆయన నిరూపించారు.లండన్‌ రాయల్‌ సొసైటీలో 1901లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రుజువు చేశారు.జంతువులకు వలెనే మొక్కలకీ నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారాయన.వాటికి హాని జరిగితే మౌనంగా రోదిస్తాయి కూడా.వాటిని నిర్మూలించుకోవడం అంటే మానవాళి తనను తాను నిర్మూలిం చుకోవడమే.
పచ్చదనం మీద కక్ష
అడవులు స్వచ్ఛమైన గాలినిస్తాయి. వాతావ రణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి.పర్యా వరణ సమతుల్యాన్ని కాపాడతాయి. ఉపాధిని స్తాయి. జీవజాలానికి ఆశ్రయమిస్తాయి. సకాలంలో వానలు కురిపిస్తాయి.భూగర్భ జలాల పరిరక్షణ,కర్బన ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో అడవులు విశేషమైన పాత్ర పోషిస్తాయి.కానీ రానురాను ఆధునికత, అభివృద్ధి, ప్రజావసరాలు, పట్టణీ కరణ పేరుతో విచక్షణా రహితంగా వనాల నరికివేత సాగిపోతోంది. ఇది ఏఒక్క దేశా నికో,రాష్ట్రానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కళ్లకు కడుతున్న దుష్పరిణామం. పచ్చదనం మీద మనిషి కక్ష కట్టినట్టే వ్యవహరి స్తున్నాడు.దీనివల్ల కలిగే అనర్థాలు విపరీతంగా ఉంటున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపో తోంది. స్వచ్ఛమైన గాలి కరవవుతోంది. వన్య ప్రాణులు ఆహారం కోసం వనాలు వదలి పల్లెలు,పట్టణాలకు తరలుతున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ప్రజలను భయపెడు తున్నాయి. దాడులు చేస్తున్నాయి.రుతుపవ నాలు క్రమం తప్పుతున్నాయి.వర్షాలకు విఘాతం కలుగుతోంది. అయితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో యావత్‌ భూ మండలం తల్లడిల్లుతోంది.విశ్వవ్యాప్తంగా అడవుల క్షీణత మానవాళి మనుగడను ముప్పులోకి నెడుతోంది. చెట్లు తరిగేకొద్దీ కరవులు,తుపాన్లు,వరదలు, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటు న్నాయి.ఇవి ప్రజలకు సవాళ్లను విసురుతు న్నాయి.
ఏటా నాశనమయ్యే అడవి ఎంతో తెలుసా?
ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం ఏటా దాదాపు కోటీ ఇరవై లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం హరించుకుపోతోంది.వనాలక్షీణత, జలవనరులతో పాటు వాతావరణ మార్పులపై, జీవనోపాధులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది.12నుంచి 20శాతం వరకు కర్బన ఉద్గారాలకు అడవుల క్షీణతే కారణం.ఈపరి స్థితిని అధిగమించేందుకు 2012 నవంబరులో ఐక్యరాజ్య సమితి నడుంబిగించింది.
కాపాడలేకపోతున్న ‘కంపా’
కానీ అడవుల రక్షణ కాగితాల మీదే విస్తరి స్తున్నది. అనేక దేశాలు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పాలకు లలో చిత్తశుద్ధి లేక వనాల నరికివేతకు అడ్డుకట్ట పడటం లేదు.కొత్తగా వనాల పెంప కం తూతూ మంత్రంగా సాగుతోంది. మొక్కలు నాటేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటు న్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనపడటం లేదన్నది చేదు నిజం.జలాశ యాలు,వివిధ ప్రాజెక్టులు,రహదారుల నిర్మాణం,విస్తరణ,ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఏటా పెద్దయెత్తున వనాలను వినియోగిస్తుండటంతో అవి కుచించుకు పోతున్నాయి.ఈపరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం‘కంపా’పథ కాన్ని తెరపైకి తీసుకువచ్చింది.కాంపన్సేటరీ అఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌,ప్లానింగ్‌ అథారిటీ (ప్రత్యమ్నాయ వనీకరణ నిధి ప్రణాళిక సంఘం)కి సంక్షిప్త రూపమే ‘కంపా’.కోల్పో యిన అటవీ భూమి మేరకు ప్రత్యామ్నాయంగా అడవులను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దే శం.దీనికింద 27రాష్ట్రాలకు కేంద్రం 2019లో రమారమి రూ.47వేలకోట్లు మంజూరు చేసింది.ఈ నిధులను ప్రత్యమ్నాయ అటవీ పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ,అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ తదితరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. అటవీ భూములను పారిశ్రామిక అవసరాలకు బదలాయిస్తే,ఆ మే రకు అడవుల పెంపకం చేపట్టాలన్న ఆలోచన తో ‘కంపా’ పథకం రూపుదిద్దుకుంది.పథకం లక్ష్యాలు సమున్నతమే.కానీ ఆచరణ అంతంత మాత్రం.వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం,కాగితాలపై లెక్కలు, క్షేత్ర స్థాయిలో లోపాల కారణంగా అడవుల పెంప కం కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. వనాల విస్తీర్ణం తగ్గడానికి పోడు వ్యవసాయం కూడా కొంతవరకు కారణం.అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా అడవులను ధ్వంసం చేయడం,నదీగమనాలను మళ్లించడం,నీటి వనరులను విచ్చలవిడిగా వాడటం వైపరీ త్యాలకు దారితీస్తోంది.కొండలను,గుహలను తొలచి, భారీ సొరంగాలను తవ్వి విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మిస్తుండటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని అనర్థాలు చోటుచేసు కుంటున్నాయి.ఇటీవలి ఉత్తరాఖండ్‌ వరదలకు ఇదే కారణం.అడవులు జీవ వైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తాయి.ఇక్కడ అనేక రకాల జంతుజాలాలు మనుగడ సాగిస్తాయి. దాదాపు అరవై వేల చెట్ల జాతులు ఉన్నయాని అంచనా. ఈ వైవిధ్యమే మానవాళికి మేలు చేస్తుంది.– (గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌)

చిన్నారుల చిదిమేసిన కలుషిత ఆహారం

అనాథాశ్రమంలో ఫుడ్‌పాయిజన్‌.. ముగ్గురు చిన్నారులు మృతి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాల విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రయంలో సమోసా తిన్న విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని,జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ఉదయం ముగ్గురు చిన్నారు చనిపోయారని తెలిసింది.. మృతి చెందిన విద్యార్థులు భవాని, జాషువా, శ్రద్ధగా గుర్తించారు. మృతులు ముగ్గురు కొయ్యూరు మండలానికి చెందిన వారు. జరిగిన ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శ.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందు తున్న చిన్నారులను రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత, స్థానిక ఎంపీ శ్రీభరత్‌, ఉత్తర ఎమ్మెల్సీ విష్ణుకుమార్‌ రాజు,తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ,భాజపా నేత మాధవ్‌ ఇతర నేతలు, అధికారు లతో కలిసి పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థి తిని తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారి లో మనోధైర్యం నింపారు.ఆమె వెంట జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌, కేజీహెచ్‌ సూపరెం టెండెంట్‌ కె.శివానంద,ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ ఇతర అధికారులు.అస్వస్థతకుగురైన పిల్లలకు కేజీ హెచ్లో మెరుగైన వైద్యం బాధితులను జిల్లాకలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ పరామర్శించించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు కేజీహెచ్లో మెరుగై న వైద్యం అందుతోందని, వైద్యులు అన్ని రకాలుగా పర్యవేక్షిస్తున్నారని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం చిన్నారులను కేజీహెచ్‌కు తీసు కురాగా కలెక్టర్‌ వెళ్లి పరామర్శించారు.చిన్నా రులతో,వారి తల్లిదం డ్రులతో మాట్లాడారు. వారి లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మొ త్తం14మంది పిల్లలు అనకాపల్లి నుంచి వచ్చారని వారందరికీ ప్రస్తుతం పిల్లల వార్డులో వైద్య నిపు ణుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోం దని పేర్కొన్నారు.అందరి పరిస్థితీ బాగానే ఉందని భయపడాల్సిన పని లేదని అన్నారు.
ఆదమరిస్తే ఆహారమే విషం..
అభం..శుభం తెలియని ముగ్గురు గిరిజన బిడ్డలు కలుషిత ఆహారం తిని ప్రాణాలు పొగొట్టుకున్నారు. మరో 35మందికి పైగా పిల్లలు త్రీవ అస్వస్థతకు గురై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసప ట్నంలో ఇటీవల జరిగిన ఈవిషాద ఘటన రాష్ట్రం లో కలకలం రేపుతోంది.ఈనేపథ్యంలో సంబంధిత యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.అయితే కేవలం వసతి గృహాల్లోనే కాదు.. నగరంలోని చాలా హోటళ్లు,బేకరీలు,ఇతర ఫాస్టు ఫడ్‌ సెంట్రల్లో కలుషిత ఆహారాలు,తినబండారాలు యధ్ఛేగా విక్రయాలు సాగుతున్నాయి.దీనిపై ఫుడ్‌ సెప్టీ యంత్రాంగం తూతూ మంత్రంగా చోదాలు చేస్తూ చోధ్యం చేస్తోంది.
ఆకలి రుచి ఎరగదు..నిద్ర సుఖమెరగ దంటారు పెద్దలు.మహానగరంలోని సిటిజన్ల ఉరకులు పరు గుల జీవితంలో సమయానికి దొరికింది.ఏది పడితే అదితినేస్తున్నారు.వాటిలో ఫాస్ట్‌ ఫుడ్‌తోపాటు అనేక రకాల ఆహార పదార్ధాలు ఉంటున్నాయి.అయితే కొన్ని ఆహారపు అలవాట్లవల్ల కొన్నిసార్లు అనా రోగ్యం బారిన పడే అవకాశం లేకపోలేదు. శరీరా నికి పడని ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్‌ పాయి జనింగ్‌ అయ్యే ప్రమాదం ఉంది.ఈ క్రమంలో వాంతులు,విరేచనాలు,కడుపునొప్పి,మంట, గ్యాస్ట్రి క్‌ సమస్యలు లాంటివి తలెత్తుతున్నాయి. అంతే కాకుండా కొన్ని సమయాల్లో ప్రాణా పయస్థితికి తీసుకువస్తూన్నాయి.
ఆకర్షణ వెనుక..విషాదం..
నగరంలో నోరూరించే వాసన,ఆకర్షించే రంగులు. ఇంకేముంది చికెన్‌,మటన్‌,చేపలు కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తింటాం.బిర్యానీ ప్రేమికులు ఇంకాస్త ఎక్కువగా ఆరగిస్తున్నారు.కానీ హోటల్‌ ల్లో తిన్నపాపానికి పొద్దున్నే ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది.రోజురొజుకూ నగరంలో ఫుడ్‌ పాయిజి నింగ్‌(విషాహారం)కేసులు నమోదువుతూనే ఉన్నా యి. కానీ కొన్ని భయటపడుతున్నాయి. మరి కొన్ని మామూళ్లు చాటును దాగిపోతున్నాయి. హోటళ్ల లో వాడుతున్న నాసిరకం ఆహారం పదార్ధాల ముడి సరుకులు,అపరిశుభ్ర వాతావరణం,సరైన నీళ్లు వాడకపోవడం,ఎక్కువరోజులు నిల్వ ఉంచిన పదార్ధాలు వండటం వంటి కారణాలతో ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు తీవ్రమవుతున్నాయి.
విషాహారానికి ప్రధాన కారణాలు ఇవే..
ఆహార పదార్ధాలను సరిగా శుభ్రం చేయకుండా వినియోగించడం.సరైన మోతాదులో ఉడికించక పోవడం.మాసాహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం,వాడిన నూనెలు మళ్లీమళ్లీ వినియోగిం చడం,ఆకర్షణకోసం రకరకాలరంగులు వేసి వడ్డిం చడం,బాగాచల్లారిపోయిన పదార్ధాలను వడ్డిం చడం,ఎక్కువ రోజులునిల్వ ఉంచిన చీజ్‌, బటర్‌ లలో బ్యాక్టీరియా ఉండటం,కలుషిత నీళ్లు వాడడం ద్వారా ఎక్కువ బ్యాక్టీరియావచ్చే అవకాశం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…
మాంసాహారం గానీ,కూరగాయలుగానీ ఎక్కువ సేపు ఉడికించి తినాలి.వీలైనంత వరకూ నిల్వ ఉంచకుండా ఏరోజు ఆహారం ఆరోజే తినాలి.కాచి చల్లార్చిని నీళ్లును తాగడం మంచిది.ఒకసారి వేడిచేసిన నూనెను మళ్లీమళ్లీ వాడకుండా చూసు కోవాలి.ప్రధానంగా మాంసాహారం అప్పటికప్పుడు తినడం మంచిది.పురుగు మందుల వాడకం ఎక్కువైన నేపథ్యంలో ఆకుకూరలుగానీ, కూరగా యలు గానీ వేడినీటిలో ఉప్పువేసి ఆరగంట సేపు నానబెట్టాక వండటం మంచిది.వాంతులు, విరేచ నాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించగానే ఓఆర్‌ఎస్‌(ఓరల్‌ రీ హైడ్రేషన్‌ సొల్యూషన్‌)ఫౌడర్‌ నీళ్లలో కలిపి తాగాలి.కాచి చల్లార్చిన నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం,కొబ్బరినీళ్లు,మజ్జిగ వంటివి తీసుకోవాలి.
నియంణ్ర ఎక్కడా..?
స్ట్రీట్‌ ఫుడ్‌,బీచ్‌ రోడ్డు ఫుడ్‌.. హోటళ్ల లో వండుతున్న ఆహారంపై నియంత్రణే లేదు. ప్రధానంగా మాసాహారం,చికెన్‌,మటన్‌,చేపలు, రొయ్యలు వంటి పదార్ధాలు నాలుగైదు రోజులు కూడా నిల్వ ఉంచి వినియోగదారులకు పెడుతు న్నారు.దీనివల్ల వినియోగదారుడు త్రీవంగా నష్టపో తున్నారు.చిన్నచిన్న బడ్డీకొట్టు అటుంచితే ఓ మోస్తరు మెస్‌లు,రెస్టారెంట్‌లకు కూడా లైసెన్సులు లేని పరిస్థితి.ఏళ్లతరబడి ఇన్‌స్పెక్టర్లు చూసీ చూడ నట్లు వెళుతున్నారు.ఫిర్యాదులు వచ్చినా పట్టించు కోలేదు.ఇక రోడ్లమీద,బీచ్‌లుఎదురుగా అమ్మే ఆహారం కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.గతేడాది అక్టో బర్‌లో మూలగాఢ గ్రామానికి చెందిన 13మంది యవకులు గాజువాక సమీపంలో ఓహోట్‌లో మండీ బిర్యానీ తిని ఫుడ్‌ పాయిజన్‌కు గురై తీవ్ర అస్వస్థతకు గురైనఘటన అప్పట్లో కలకలం రేపింది.ఎక్కడో ఒకదిక్కున ఫుడ్‌ పాయిజనింగ్‌ కేసులు బయట పడితేనే తప్పా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూన్నారే తప్పా.క్రమంగా తనిఖీలు చేసిన దాఖలాలు కన్పించలేదనే విమర్శలు వినిపి స్తున్నాయి.
నగర హోటళ్లుల్లో దారుణాలు..
కైలాసపట్నం ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌,ఫుడ్‌ సేఫ్టీ అధికార యంత్రాంగం నగరంలో చేపడుతున్న మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగు లోకి వచ్చాయి.ఆర్కే బీచ్‌లోని మత్స్యదర్శినివద్ద ఉన్న ఓహోటల్‌లో నాణ్యత లేని ఆహారం విని యోగదారులకు రోజుల తరబడి నిల్వ ఉంచిన బిర్యానీ,చికెన్‌,మటన్‌,చేప కూరలు నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.డాబాగార్డెన్స్‌ దగ్గర ఉన్న ఓమెస్‌లో చికెన్‌,ఫిష్‌కర్రీతో పాటు వెజ్‌ కర్రీలు కూడా రెండు, మూడు రోజుల కిందట వండి ఫ్రీజర్లు,ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.అంతేకాదు ముందు రోజు వండిన అన్నాన్ని వినియోగదారు లకువడ్డిం చేందుకు రెడీచేసే సమయంలో తనిఖీలు చేప ట్టారు. ఈపదార్థాలు రంగు,రుచి కోసం కూరల్లో కొన్నిరకాల పౌడర్లను కలుపుతున్నట్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన పదార్థాలను విక్రయిస్తున్నం దుకు హోటల్‌కురూ.పది వేలు జరిమానా విధిం చారు.- (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

ఉసురు తీస్తున్న ఫార్మా కంపెనీలు

విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో ఇటీవల పేలుడు సంభవించి 17మంది మృతిచెందిన నేపథ్యంలో రాష్ట్రం లోని అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఉమ్మడిజిల్లాలోని చౌటుప్పల్‌,బీబీనగర్‌, భువనగిరి,బొమ్మల రామారం,భూదాన్‌ పోచంపల్లి, త్రిపురారం,మిర్యాలగూడ మండలాల్లో సుమారు 100వరకు ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి.10వరకు భారీ కంపెనీలు ఉండగా..వీటిల్లోనే సుమారు 30వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.మిగిలిని వాటిలో సుమారు 20వేల వరకు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వేల మందికి ఉపాధి ఇచ్చే కంపెనీల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది.నైపుణ్యం గల కార్మికులు పనిచేయాల్సి ఉండగా..ఉత్తర్‌ప్రదేశ్‌,బీహర్‌, జార్ఖండ్‌ లాంటి తదితర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనంతో పనిచేసే వారిని కార్మికు లుగా నియమించుకుంటున్నారు. కంపెనీల్లో పిర్యాదుల చెద్దామంటే స్థానికులకు సంబం ధిత ఫ్యాక్టరీస్‌,పీసీబీ అధికారులు అందు బాటులో ఉండటం లేదు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ వీరు పాల్గోనడం లేదు.
ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తు న్నాయి. ఫార్మా కంపెనీల్లోకార్మికులకు రక్షణ కరువు అవుతోంది. యాజమాన్యాలు కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.దీంతో ఏటా కార్మికులు మృత్యువాత పడుతున్నారు.ఫార్మా కంపెనీల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండాలి.ఎక్కడా ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు.తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడిరచాలనే దురాలో చనతో సబ్‌ కాంట్రాక్టర్లకు పరిశ్రమల నిర్వ హణ అప్పగిస్తున్నారు. సబ్‌ కాంట్రాక్టర్లు నైపుణ్యం లేని వారిని తక్కువ వేతనాలతో నియమించడంతో తరుచు ప్రమాదాలు సంభవి స్తున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. భద్రత గురించి ప్రశ్నించే కార్మికుల్ని యాజమా న్యాలు నిర్ధాక్ష్యణ్యంగా విధుల నుంచి తొలిగి స్తున్నాయి. దీంతో కార్మికులు భయపడి బిక్కుబిక్కుమంటు ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఫార్మా కంపెనీలు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రతపై చూపడంలేదనేది బహిరంగ రహస్యం. కార్మికులకు భద్రతా పరికరాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్లు, కార్మిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాల్సి ఉన్నప్ప టికీ ఫార్మా కంపెనీల్లో ఇదంతా మొక్కుబడి తంతుగా మారుతోంది.
కంట్రోల్‌ కాని రియాక్టర్లు
ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో హై టెం పరేచ్‌లో ద్రవకాలను మరిగించాల్సి ఉం టుంది. నిపుణులైన ఉద్యోగులు లేకపోవడం వల్ల తరుచు ప్రమాదాలు సంభవిస్తున్నాయనే ఆరోణపణలు ఉన్నాయి. రియాక్టర్లు పేలిన ప్పుడు కంట్రోల్‌ చేయాలంటే నిపుణులు ఉం డాలి అత్యధిక శాతం కంపెనీల్లో అరకొర నాలెడ్జి ఉన్న వారే ఉండటంతో ప్రమాద సమయాల్లో రియాక్టర్లను కంట్రోల్‌ చేయడం కష్టంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పైప్‌లైన్‌ లీకేజీ కార ణంగా పలు సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యర్థ రసాయనాలు వెళ్ళే పైల్‌లైన్‌ సక్రమంగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యాలతో పాటు అధికారులు పర్యవేక్షించాలి. వ్యర్థ రసాయనాలను శుద్ధి చ?టటసి పైల్‌లైన్‌ గుండా బయటకు పంపాల్సి ఉన్నప్పటికీ పలు కంపెనీలు ఈదిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది.అనకాపల్లి జిల్లా అచ్యుతా పురం సెజ్‌ లోని సాహితీ ల్యాబ్‌ లో రియా క్టర్‌ భారీ పేలుడు కారణంగా ఇద్దరు కార్మి కులు అక్కడికక్కడే మృత్యువాత పడగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.ల్యాబ్‌ లో కెమికల్స్‌ మరిగించే క్రమంలో వ్యాపిం చిన మంటలే ప్రమాదానికి కారణంగా -గునపర్తి సైమన్‌

తెలుగు రాష్ట్రాల్లో వరదల విలయం.

ఊహకందని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి.ఇటు ఏపీలో బుడమేరు విజయవాడ,అటు తెలం గాణలో మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బ తీసింది.బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో సింగ్‌నగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది.నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద..పుట్టెడు శోకాన్ని మిగి ల్చింది.కొందరు ఇళ్లపైకి ఎక్కి, సాయంకోసం హాహాకారాలు చేస్తున్నారు. మరికొందరు బంధువుల గృహాలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తర్వాత స్వగృ హాలకు చేరుకుని,ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు,రూపరేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరుమున్నీర వుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గలేదు.పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసా గుతున్నాయి.విజయవాడ, ఖమ్మం,మహబూబాబాద్‌ ప్రాంతాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా కనిపిం చింది.ఎటూ చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు, బురద ముంచెత్తిన నివాసాలు,అనేక గ్రామాల్లో కుప్ప కూలిన ఇళ్లు..కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు..వరద నీటి నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న బస్తీలు.. కాలనీలు.. పొలాల్లో మట్టి,ఇసుక మేటలు..ఛిద్రమైన రహదారులు.. మృత్యువాత పడిన పశువులే కన్పిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి.అటు ఆంధ్రప్రదేశ్‌,ఇటు తెలంగాణలో వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.ఏర్లు,నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.బుడమేరు వరద ఉధృతితో విజయ వాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది.భారీ వర్షాలు..వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు జనజీవనం కకావికలమైంది.ఏపీలో బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోక ముందే.. కృష్ణా నదికి వరద పొటెత్తింది.తెలంగానలో కురిసిన భారీవర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీ వద్ద11.43లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది.ఉమ్మడి గుంటూరు,కృష్ణా జిల్లాలో కృష్ణానది ఇరువైపులా లంక గ్రామాలు జల దిగ్బందంలోకి చేరాయి.అక్కడి ప్రజలను అధికారులు హూటాహుటిన ఖాళీచేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.గుం టూరు జిల్లా పరిధిలో 18లంకగ్రామాలకు రాకపోకలు నిలిచాయి.విద్యుత్తు సరఫరా స్తంభించింది.మహిళలు,గర్భిణులు,వృద్దులు సహా వైద్యసాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు.రెండు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నీటి మునిగాయి.ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలవల్ల మొత్తం19మంది మరణించినట్లు అధికారిక సమాచారం.వీరిలోఎన్టీఆర్‌ జిల్లాలో ఎనిమిదిమంది మరణించగా,గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిగిలిన వారు మరణిం చారు.తెలంగాణలో వరదలవల్ల ఇప్పటి వరకు 9మంది మరణించినట్లు అధికారిక సమా చారం.విజయవాడ నగరం వరుసగా రెండో రోజు కూడా నీటిలోనే ఉంది.బుడమేరు వరద ఈనగరాన్ని అతలాకుతలం చేసింది. నగరం లోని చాలాకాలనీల్లో ఒకఅడుగు నుంచి నాలుగు అడుగుల వరకు నీరునిలిచి పోయిం ది.అనేక ప్రభుత్వ శాఖలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.సింగ్‌ నగర్‌ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. పలుచోట్ల ఆహారం,ఇతర అత్యవసర పదార్థాలను బోట్లు,ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది అందిస్తున్నారు.చాలా మంది ఆవాన నీటిలోనే నానుతూ,వరదప్రభావం లేనిప్రాం తాల్లోని తమకు తెలిసిన వారిఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు.కృష్ణా,గుంటూరు జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో ప్రవాహంలో ఇరుక్కున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి.కోస్తాలోని మిగిలిన జిల్లాల్లో కూడా వరద,వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపించింది.రాయల సీమలో వరద ప్రభావం కాస్త తక్కువగా ఉంది.
నేనున్నాననే..భరోసా..
వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాలి లోతు నీటిలో ఏపీసీఎం నారా చంద్రబాబునాయుడు ముంపు ప్రాంతాలు,పునరవాస కేంద్రాలు పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. సహాయక కార్యక్రమాలు స్వయంగా పర్య వేక్షిస్తున్నారు.బుల్‌డోజర్‌,బందరు పోర్టు నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి,వరదలో పర్యటించారు.తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని,పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు.ప్రతి డివిజన్‌కు ఓఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జిగా నియ మించారు.మంత్రులందరూ విజయవాడలోనే మకం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఆహారం,మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడు తున్నారు.ప్రాణనష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు అందిన వేంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు.దాదాపు 10వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.ఆక్షయ పాత్రసంస్థ ద్వారా లక్షమందికి ఆహారం అందించారు.హోటల్స్‌ అసోసియేషన్‌ వారు మరో లక్షమందికి భోజనాలు సమకూర్చారు. పవర్‌బోట్లు పలు ప్రాంతాల్లో తిరుగుతూ బాధి తులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
పంట నష్టం
కరకట్ట లోపల వ్యవసాయం,ఉద్యాన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి.ఒక్కటి చేతికొచ్చే పరిస్థితి లేదు.అరటి,కంద,పసుపు,చామ,కూరగాయ పంటలన్నీ నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణయ్య కరకట్ట అంచులను తాకుతూ ప్రవహిస్తోంది.తెనాలి,రేపల్లి నియోజ కవర్గాల్లో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతా లో మట్టి,ఇసుక బస్తాలు వేసి,ఎత్తు పెంచి నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వీడని వరద..
బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్‌నగర్‌ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఐదారు అడుగుల ఎత్తున నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. పడవ లు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా,అధికశాతం మంది ఇంకా పైఅంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తు న్నారు.ప్రధాన రహదారుల వెంబడి ఉన్న వారికి ఆహారం,తాగునీరు అందుతున్నా,లోపలి ప్రాంతాల్లోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.బయటకు రావాలంటే పడవలు కూడా లేవు.విద్యుత్తు లేదు.తాగునీరు నిండుకుందన వాపోతున్నారు.
డ్రోన్ల ద్వారా ఆహారం,తాగునీరు..
బాధితుల్లో ఎక్కువ మందికి సురక్షితంగా ఆహారాన్ని అందించేందుకు డ్రోన్లను వినియోగించారు.మునిగిన ప్రాంతాలు,బహుళ అంతస్తుల భవనాలపైకి డ్రోన్ల ద్వారా ఆహార పొట్టాలు పంపించారు.పెట్టుబడులు,మౌళిక వసతులశాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఈ డ్రోన్‌ పని విధానాన్ని ఎన్జీఆర్‌ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకు ప్రయోగాత్మకంగా చూపించారు.డ్రోన్ల్‌ ద్వారా 8`10కిలోల బరువున ఆహారం,మందులు,తాగునీటిని సరఫరా చేయొచ్చని సూచించారు.దీంతో వీలైనన్ని ఫుడ్‌ డెవవరీ డ్రోన్లను సిద్దం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితు లకు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆ వెంటనే సింగ్‌నగర్‌, గొల్లపూడిలోని బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి ప్యాకెట్లును అధికారులు సరఫరా చేశారు.ఈ ప్రయోగం విజయవంతం కావ డంతో మున్ముందు మరిన్ని చోట్ల వినియో గించాలని అనుకుంటున్నారు.
కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి..
వరద సహాయక చర్యలపై మంత్రి లోకేష్‌ విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి నిరంతరం సమీక్షించారు.వరద సహాయక చర్యల్లో పెద్దఎత్తున పాల్గొన్నాలని తేదేపా శ్రేణులకు పిలుపు నిచ్చారు.ముంపు ప్రాంతాల్లో హెలీకాప్టర్ల ద్వారా 7,220కిలోల ఆహారం,తాగునీరు మందులు జారవిడి చారు.వరద ప్రాంతాల్లోని ప్రజలకు పండ్లు సరఫరాకు మార్కెట్‌ంగ్‌శాఖ చర్యలు చేప ట్టింది.1.10లక్షల యాపిల్స్‌,90వేల అరటి పండ్లు సేకరించి ముంపు ప్రాంతాలకు పంపారు.రానున్న రెండు రోజుల్లో 2.5లక్షల అరటి పండ్లను పంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కన్నీటి విపత్తు!
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 మంది మృతి చెందారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 9 మంది మృత్యువాత పడగా, గుంటూరు జిల్లాలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు మరణించారు.విజయవాడ మొగల్రాజుపురంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు, విజయవాడ రూరల్‌, జీ కొండూరు, రెడ్డిగూడెం, పైడూరుపాడులో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.గుంటూరు జిల్లా.. పెదకాకాని మండలంలో ఇద్దరు సహా ఒక టీచర్‌, ఇద్దరు విద్యార్థులు కారులో కొట్టుకుపోయి మృతి చెందారు. ఒక యువ కుడు కొండవీటివాగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మంగళగిరిలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు.ప్రకాశం జిల్లాలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గుంటూరు-నందివెలుగు రోడ్డులో వరదనీటిలో గుర్తుతెలియనివ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.విజయవాడలో 275 రైళ్లు రద్దు అయ్యాయి.149 రైళ్లను దారి మళ్లించారు.
4.68 లక్షల ఎకరాల్లో పంట మునక
వర్షాలు, వరదలకారణంగా 4,31,355 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 37,397 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.3,18,220 ఎకరాల్లో వరి, 64,782ఎకరాల్లో పత్తి, 28,085 ఎకరాల్లో మొక్కజొన్న,6,477 ఎకరాల్లో మినుము,6,167ఎకరాల్లో కంది, 2,610 ఎకరాల్లో పెసర,1,945 ఎకరాల్లో వేరుశనగ,5,012ఎకరాల్లో ఇతర పంటలు ముంపుబారిన పడ్డాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.ప్రాథమిక అంచనా ప్రకారం 20జిల్లాల్లో 365 మండలాలు వర్షాలు, వరదల ప్రభావానికి గురి కాగా, 2,475 గ్రామాల్లో 2లక్షల మంది రైతులకు నష్టం జరిగినట్లు భావిస్తున్నామని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
జల దిగ్బంధం..
తెలంగాణలో వరద తీవ్రంగా ఉంది. మహబూబాబాద్‌, ఖమ్మం పరిసరాల్లో అనేక జనావాసాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఖమ్మం నగరానికి, మహబూబాబాద్‌ పట్టణా నికిచాలా వైపుల నుంచి రాకపోకలు ఆగిపో యాయి.మున్నేరు వాగు వరదతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలు ప్రభావితం అయ్యాయి. పాలేరు దగ్గర ఒక కుటుంబం వరదల్లో చిక్కుకుపోయింది. యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ వారిని కాపాడలేక పోయారు.ఖమ్మం పరిధిలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకంపంపు హౌసులు మునిగి పోయాయి.నల్లగొండ, సూర్యాపేట, మహ బూబ్‌నగర్‌, కొత్తగూడెం జిల్లాలపై కూడా వరద ప్రభావం ఎక్కువగా కనిపించింది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల వరద, వర్షం ప్రభావంతో జన జీవనానికి ఇబ్బంది కలిగింది.చాలాచోట్ల కాలనీలు,బస్తీలు,ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు నీట మునిగాయి.అనేక చోట్ల హాస్టళ్లు జలదిగ్బంధమైపోవడంతో,ఆనీటిలో నుంచే విద్యార్థులు సామాన్లతో బయటకు వచ్చేశారు.తెలంగాణ ప్రభుత్వం సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పాలేరులో వరదలో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని కాపాడలేక పోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ వాతావరణం అనుకూలించక రక్షించుకోలేక పోయినట్టు చెప్పిన ఆయన, ఆ ఘటనను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వర్షాలపై సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్టుగా ఉండాలి. కలెక్టరేట్లలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలి.వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నాం.ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. ఈ వరద లను జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకో వాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాస్తాం. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాలకు తక్షణ సాయంగా రూ.5కోట్ల చొప్పున ఇస్తాం’’ అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.
లక్షల ఎకరాల్లో పంట నష్టం
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ,హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడారు. తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్ర బృందాలకు సహాయంగా కేంద్ర బృందాలను పంపమని ఆదేశాలు జారీచేశారు.ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరినాట్లు వేసిన సమయం కావడంతో ఆరైతులు బాగా నష్టపోయారు.ఇతర వాణిజ్యపంటలకూ పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. ఇక అరటి వంటి పండ్ల తోటలు, కూరగాయల పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
200 గేదెలు కొట్టుకుపోయాయి
చెరువులు, వాగులకు గండ్లు పడిన చోట పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కట్ట తెగిన చోట ప్రవాహ ఉధృతికి భవనాలు కొట్టుకుపోయాయి.ముందు జాగ్రత్త చర్యగా బడులకు సెలవులు ప్రకటించారు.చాలా చోట్ల ఇళ్ల డాబాలపైకి ఎక్కి కూర్చుని సమయం గడిపారు ముంపు బాధితులు.గుంటూరు జిల్లా తుళ్లూరు దగ్గర 200 గేదెలు కొట్టుకు పోయాయి. పలు చోట్ల లంక గ్రామాల్లో బాధి తులను కాపాడారు సహాయ సిబ్బంది.కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.విజయవాడలో సహాయ చర్యల్లో హెలికాప్టర్లు వాడనున్నట్టు విపత్తు శాఖ ప్రకటించింది.ఇవాళ, రేపు కూడా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన రైల్వే ట్రాకులు
భారీ వర్షానికి రవాణా వ్యవస్థ కూడా స్తంభిం చింది.ముఖ్యంగా విజయవాడ,ఉత్తర దక్షిణ భారతాలను కలిపే ప్రధాన నగరం కావడంతో ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.పలుచోట్ల హైవేలపై నీరు రావడంతో ట్రాఫిక్‌ ఆగిపో యింది.కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక రైల్వే ట్రాకుపై నీరు చేరడంతో,పెద్ద ఎత్తున రైళ్ల మళ్లింపుతో పాటు కొన్ని రైళ్లు రద్ద య్యాయి.వరంగల్‌ దగ్గర్లోని కేసముద్రం దగ్గర ట్రాక్‌ కింద ఉన్న నిర్మాణం మొత్తం కొట్టుకు పోయింది.అనేక చోట్ల వంతెనలపై నీరు పొంగి ప్రవహించింది.తాళ్లు, క్రేన్లు, ప్రోక్లెయినర్ల సహాయంతో ప్రజలు, నీరున్న ప్రదేశాలను దాటాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.విజయవాడ -హైదరాబాద్‌ హైవేపై కూడా రాకపోకలకు ఆటంకం ఏర్పడిరది.పలుచోట్ల రైలు ప్రయాణి కులను బస్సుల్లో తరలించారు.విజయవాడ శివార్లలో రైలు ప్రయాణికులను స్టేషన్‌ బయటకు తీసుకురావడం కూడా కష్టమైంది. రైళ్లు నిలిచిపోయినచోట ఆహార పదార్థాలు అందించారు.వందకు పైగా రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. రెండు రాష్ట్రాల ఆర్టీసీలూ పెద్ద ఎత్తున బస్సులను ఆపివేశాయి.
తెలంగాణలో వర్ష బీభత్సం: ఉప్పొంగిన మున్నేరు, రైళ్లు రద్దు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.జనజీవనం స్తంభించింది.రోడ్లు కొట్టుకుపోయి ఏపి, తెలంగాణ మధ్య రాకపోక లకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.పలుచోట్ల రైల్వే ట్రాక్‌లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు.భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ తెలిపారు.ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి హెలికాప్టర్‌ను రప్పిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పరిస్థితులపై సీఎం రేవంత్‌ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.పునరావాస,రక్షణ చర్యలపై సీనియర్‌ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు.రెవెన్యూ, పోలీస్‌, పంచాయతిరాజ్‌,వైద్య ఆరోగ్యశాఖ వంటి అత్యవసర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి రంగంలోకి దించాలని, జిల్లాల్లో ఎప్పటి కప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసు కోవాలని టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశిం చారు సీఎం.ఎంపీ,ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.
జలదిగ్బంధంలో ఖమ్మం,మహబూబాబాద్‌
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం,వరంగల్‌ జిల్లాలపై పడిరది.ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రకాశ్‌ నగర్‌ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూ బాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూ సపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో వరద ప్రవా హానికి రైల్వే పట్టాలకింద కంకర కొట్టుకు పోయింది.ట్రాక్‌ దెబ్బతినడంతో ఆరూట్‌లో రైళ్ల ను నిలిపివేశారు.మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో నిలిపివేసిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ప్రయా ణీకులకు స్వచ్ఛంద సంస్థలు,పోలీసులు ఆహారపదార్ధాలు,నీరు అందించారు. ప్రస్తుతం ట్రాక్‌ పునరుద్ధరణ పనులు సాగుతు న్నాయి. ఏపీ, తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ సికింద్రా బాద్‌ రైల్‌ నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వరద నీటిలో ఖమ్మం పట్టణం..
ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టు ముట్టింది.మున్నేరు నది ఉధృతంగా పారు తోంది. ప్రస్తుతం 27.5అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి.ప్రకాశ్‌నగర్‌ ప్రాం తం జలదిగ్బంధంలో ఉంది. ప్రకాశ్‌ నగర్‌ బ్రిడ్జిపై తొమ్మిది మంది ఉదయం నుండి చిక్కుకుపోయారు.వారిని రక్షించేందుకు హెలి కాప్టర్‌ను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చీకటి పడటంలో బ్రిడ్జిపైన చిక్కుకున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘‘ఖమ్మం పట్టణం గతంలో ఎన్నడూ చూడని వరద ఇది.సగం కాలనీలు మునిగిపోయాయి. నీరు చేరని ప్రదేశం అంటూ లేదు. పట్టణం నడిబొడ్డున 5అడుగుల నీరు ప్రవహిస్తోంది. వరద అంచనా,సహాయక చర్యల్లో అధికారులు విఫలం అయ్యారు. జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నా సమయానికి హెలికాప్టర్‌ను రప్పించ లేకపోయారు’’అని తన వివరాలు వెల్లడిరచడానికి ఇష్టపడని చెప్పారు.‘‘మున్నే రుకు ప్రొటెక్షన్‌వాల్‌ నిర్మాణ పనులు నత్తనడక కొనసాగుతున్నాయి.నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో నీరు బయటికి పోవడం లేదు.’’ అని ఆయన అన్నారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పరిస్థితి
మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది.నెక్కొండ మండలం వెంకటాపురం సమీపంలో40 మంది ప్రయాణీ కులతో ఉన్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకు పోగా,అధికారులు వారిని సురక్షితంగా బయ టకు తీసుకువచ్చారు.రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.మరోవైపు భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరు తోంది.మేడిగడ్డ బరాజ్‌ కు 1.57లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది.శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ లు 53వేల ఇన్‌ ఫ్లో వస్తుండగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను 63టీఎంసీలకు నిల్వ చేరింది.– (గునపర్తి సైమన్‌)

1 2 3 11