మద్దతు ధర ఎలా?

పంటలకు ధరలు నిర్ణయించిన విధానం రైతాంగాన్ని ఆహారపంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించటం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్యపంటలు, పండ్లు, కూర గాయలు తదితరాలను ఎక్కువగా పండిర చాలని, ఆ పంటలకు అధికధరలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. భారత్‌ లోని రైతు లను ఆహారపంటలు పండిరచటం నుండి దూరం చేసి, వాణిజ్యపంటలు పండిరచేలా చేసి, వారిని అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకుల లోకి లాగి దివాళా తీయించటం, దేశంలో ఆహారకొరత ఏర్పడేలాచేసి, ఆహార సరఫరాదారులుగా దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై తమ పెత్తనాన్ని పెంచు కోవచ్చు ననేది సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి కంపెనీల వ్యూహం.
ప్రధాని మోడీ అధ్యక్షతన సెప్టెంబరు8వ తేదీన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఆర్థిక వ్యవ హారాల కమిటి 2021-22 ఖరీఫ్‌ సీజన్‌లో 23 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. కమిటీ ప్రకటించిన ధరలతో వ్యవసా య ఖర్చులు పోనూ రైతుల కనీస ఆదాయం 50 శాతం అదనంగా పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ప్రకటనలో పేర్కొన్నారు.కనీస మద్దతు ధరలను గురించి ఎవరూ ఏవిధమైన పొరపాటు అభిప్రాయాలతో ఉండవద్దని, కనీస మద్దతు ధరలు, వాటి పెంపుదల ఎప్పటికీ ఉంటాయని వ్యవ సాయశాఖ మంత్రి పత్రికా విలేకరుల సమా వేశంలో పేర్కొన్నాడు. ప్రభుత్వం వివిధ పంటలకు ప్రకటించిన ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయి. మద్దతు ధరలు, వ్యవసాయోత్పత్తుల సేకరణపై రైతాంగం చేస్తున్న డిమాండ్లను, మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం పది మాసాల నుండి దేశవ్యా పితంగా రైతాంగం చేస్తున్న పోరాటాలను పరిగణన లోకి తీసుకోకుండా ప్రభుత్వం పూర్తి ఏకపక్షంగా నిర్ణయించిన ధరలు రైతాంగానికి ఏ మాత్రం మేలు చేయవు.వరిధాన్యానికి 2020-21లో కనీస మద్ద తు ధర గ్రేడ్‌ ‘ఎ’కు క్వింటాలుకు 1,888 రూపా యలుగా నిర్ణయించగా,2021-22లో1960 రూపాయలకు-72రూపాయలుపెంచారు. సాధా రణ రకానికి క్వింటాలుకు 1,868 రూపా యల నుండి 1940 రూపాయలకు-72 రూపాయలు-పెంచారు. గత సంవత్సరం కన్నా గ్రేడ్‌ ‘ఎ’ రకానికి 3.8శాతం,సాధారణ రకానికి3.9 శాతం పెంచా రు. గోధుమలకు పెంపుదల మరింత తక్కువగా ఉంది.2020-21లో గోధుమ క్వింటాలుకు 1925 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించగా, 2021-22లో 1975రూపాయలుగా నిర్ణయించారు. పెంపుదల 2.5శాతం మాత్రమే. గత సంవ త్సరం కన్నా అత్యధికంగా నువ్వులకు క్వింటా లుకు 452 రూపాయలు(6.6శాతం) పెంచారు. తర్వాత కందులు, మినుములకు 300 రూపాయల చొప్పున (5శాతం) పెంచారు. వేరుశనగ, పొద్దు తిరుగుడు గింజలకు 275,235 రూపాయల చొప్పున 5.2,2.2శాతం చొప్పున పెంచారు. ఈవిధం గా కొన్ని పంటలకు ఎక్కువగా ధరలు పెంచ టం రైతాంగాన్ని ఆ పంటలను పండిరచే విధంగా ప్రోత్సహించటం కోసమేనని అధికా రికంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. దేశంలో పండిరచే పంటలలో వరి, గోధుమ ప్రధానమైనవి. ప్రభుత్వం ఈ పంట లనే అధికంగా సేకరిస్తుంది. ప్రభుత్వం సేకరించని పంటలకు మద్దతు ధరలను ప్రకటించినా వాటిలో ఎక్కువ భాగం కాగితాలపై ఉండటం మినహా రైతాంగానికి ఉపయోగపడవు. ప్రభుత్వం గోధుమలకు క్వింటాలుకు 2.5 శాతం, వరి ధాన్యానికి 3.8 శాతం చొప్పున పెంచగా,ద్రవ్యోల్బణం 5 శాతం వరకు ఉంటుందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. ద్రవ్యోల్బ ణంతో పోల్చుకున్నపుడు గోధుమలకు 2.5 శాతం, వరి ధాన్యానికి 1.1 శాతం తక్కువగా ధరలు నిర్ణయించినట్లు స్పష్టమౌతున్నది. వాస్తవవంగా ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకొని, అంతకన్నా అధికంగా మద్దతు ధరలు పెంచితే అదనంగా పెంచానని చెప్పుకోవటానికి అవకాశం ఉండేది. కాని కనీసం పెంచాల్సిన ధరల కన్నా తక్కువ నిర్ణయించి ఖర్చులకు అదనంగా 50 శాతం వచ్చేలా తాము రైతుల ఆదాయాన్ని పెంచామని చెప్పుకోవటం ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని వెల్లడి స్తున్నది. రైతులకు తాము పండిరచిన పంటలకు అయిన ఖర్చులన్నీ పోనూ 50శాతం అదనపు ఆదాయం వచ్చేలా ధరలు నిర్ణయించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. కాని వాస్తవంగా ప్రభుత్వం ఎ2ంఎఫ్‌.ఎల్‌కు అదనంగా 50 శాతాన్ని ప్రాతిపదికగా తీసుకొంటున్నామని చెబుతున్నది. రైతాంగం సి2ం50 శాతం విధానం ప్రాతిపదికగా వ్యవసాయోత్పత్తుల ధరలు నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తున్నది. సి2ం50 విధానంలో మొత్తం వ్యవసాయ ఖర్చులతో పాటు వడ్డీలు, కౌలు, కుటుంబ శ్రమను కూడా పరిగణన లోకి తీసుకొని పంటలకు అయిన వ్యయాన్ని నిర్ణయి స్తారు. ఎ2ంఎఫ్‌.ఎల్‌ లో పెట్టుబడులు, కుటుంబ శ్రమను మాత్రమే పరిగణన లోకి తీసుకొని వ్యయాన్ని లెక్కిస్తారు. కాని వాస్తవంగా ప్రభుత్వం ఎ2ంఎఫ్‌.ఎల్‌ ను ప్రాతిపదికగా తీసుకోవటంలో కూడా మోసపూరితంగా వ్యవహరిస్తున్నది. వాస్తవంగా అయిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలను కొద్దిమేరకు పెంచి,50శాతం అదనంగా నిర్ణయించామని చెబుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలించినట్లైతే నువ్వులు, మినుములు, కందులు, వేరుశనగకు మాత్రమే 5 శాతం, అంతకన్నా ఎక్కువగా పెరచారు. ద్రవ్యోల్బణం 5శాతం ఉన్నపుడు ఇది నామకార్ధపు పెరుగుదల మాత్రమే. మిగతా పంటలకు వాస్తవంగా గత సంవత్సరం కన్నా తక్కువ ధరలు నిర్ణయించినట్లుగా స్పష్ట మౌతున్నది. అసలుకే తక్కువ ధరలు నిర్ణయించి నపుడు ఇక 50శాతం అదనంగా ఇవ్వటం ఎక్కడీ ప్రభుత్వం తానుగా ప్రజలపై వేస్తున్న భారాలు రైతులు,వ్యవసాయ రంగం పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం పెట్రోలు, డీజిలు ధరలనను మూడోవంతుకు పైగా పెంచింది. సాధారణ రైతులు కూడా వ్యవ సాయంలో వచ్చిన మార్పుల దృష్టా మోటారు సైకిల్‌ వాడకం తప్పనిసరైంది. చాలా ప్రాంతా లలో వ్యవసాయ మోటార్లకు డీజిలు వినియో గిస్తున్నారు. వారు ఈ భారాన్నంతా భరించాల్సి వస్తున్నది. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పాటు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించమని కేంద్రం ఒత్తిడి చేయటంతో కొన్ని రాష్ట్ర ప్రభు త్వాలు మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాయి. దానిలో ఆంధ్రప్రదేశ్‌ లోని వైసిపి ప్రభుత్వం ముందెత్తున వున్నది. మీటర్లెందుకు బిగిస్తున్నా రంటే రైతులపై ఏ మాత్రం భారం ఉండదు. విద్యుత్‌ వ్యయాన్నంతా ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. రైతులు విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చునని, వారిపై ఒక్క రూపాయి కూడా భారం ఉండదని చెబుతున్నారు. రైతులపై నిజంగా భారం వేసే ఉద్దేశ్యమే లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మీటర్లు బిగించటం ఎందుకు? ఇదే విధంగా గతంలో ప్రభుత్వం వంటగ్యాస్‌ సరఫరా చేసే కంపెనీలకు చెల్లిస్తున్న సబ్సిడీని వినియోగ దారుల ఎకౌంట్లలో జమ చేస్తానని,ముందు వినియోగదారులు మొత్తం ఖరీదు చెల్లించి వంటగ్యాస్‌ను కొనుగోలు చేయాలని చెప్పింది. ఆ విధంగా మార్చిన తర్వాత అనేకమంది ఎకౌంట్లలో సబ్సిడీ జమ కాలేదు.2020 నుండి మొత్తం సబ్సిడీని రద్దు చేశారు. వ్యవసాయ విద్యుత్‌కు కూడా ఆ విధంగా ప్రభుత్వం చెల్లిం చటం మానేస్తే బిల్లుల చెల్లింపు భారాన్ని రైతు లు భరించలేరు. కేంద్రం పంటల ధరలను నిర్ణయిస్తున్నపుడు ఈ విధంగా పెరుగుతున్న భారాలను పరిగణనలోకి తీసుకోవటం లేదు.
వాణిజ్య పంటల వైపుకు మళ్ళించే యత్నం
పంటలకు ధరలు నిర్ణయించిన విధానం రైతాంగాన్ని ఆహారపంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించటం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్య పంటలు,పండ్లు, కూర గాయలు తదితరాలను ఎక్కువగా పండిర చాలని, ఆ పంటలకు అధిక ధరలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. భారత్‌ లోని రైతులను ఆహారపంటలు పండిరచటం నుండి దూరం చేసి,వాణిజ్య పంటలు పండిర చేలా చేసి,వారిని అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదు డుకుల లోకి లాగి దివాళా తీయించటం,దేశం లో ఆహారకొరత ఏర్పడేలా చేసి,ఆహార సరఫరా దారులుగా దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై తమ పెత్తనాన్ని పెంచుకోవచ్చుననేది సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి కంపెనీల వ్యూహం. దీనిలో దేశంలోని కార్పొరేట్‌ కంపెనీలకు కూడా ప్రయోజనం ఉన్నది. అందువలన బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు కలిసి దీనిని ముందుకు తీసుకు పోవటానికి ఒత్తిడి చేస్తున్నాయి. నయా ఉదార వాద విధానాలలో భాగమైన ఈ వ్యవసాయ విధానాన్ని అమలు చేయమని రైతులపై మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి.వాణిజ్య పంటలు పండిర చమని రైతాంగాన్ని ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వాలు పంటలు మార్కెట్లోకి వచ్చి ధరలు పడిపోయి నపుడు రైతాంగాన్ని ఆదుకోవటానికి, వారికి కనీస మద్దతు ధరలు ఇప్పించటానికి ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. గతసంవత్సరం ఉభ య తెలుగు రాష్ట్రాలలో ధాన్యం,పత్తి,ఇతర వాణిజ్య పంటలు మార్కెట్‌ లోకి వచ్చినపుడు వ్యాపారులు ధరలు దిగ్గోసి కోనుగోలు చేశారు. ఆ సందర్భంలో ప్రభు త్వాలు మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వాలు నామమాత్రపు కొను గోళ్ళతో కంటి తుడుపు చర్యలు తీసుకున్నాయి మినహా మార్కెట్లోకి వచ్చిన ధాన్యం, వాణిజ్య పంటలను కొనుగోలు చేసి, రైతాంగానికి మద్దతు ధరలు అందించ టానికి ప్రయత్నం చేయలేదు. ఇటువంటి పరిస్థి తులలో రైతాం గాన్ని మరింతగా వాణిజ్య పంటల వైపు మళ్ళించటమంటే వారిని మరిం తగా మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు వదిలివేయ టమే అవు తుంది. అటువంటి స్థితిలో రైతాంగం మరిం తగా మార్కెట్‌ ఒడిదుడుకులకు గురై కనీస మద్దతు ధరలు పొందలేకపోవటం, అప్పుల పాలు కావటం,ఆత్మహత్యలు పెరగటానికి దారితీస్తుంది. అందువలన ప్రభుత్వం మద్దతు ధరలపై అసత్య ప్రచారాన్ని కట్టిపెట్టి, రైతాంగం డిమాండ్‌ చేస్తున్న విధంగా సి2ం50 శాతం ప్రాతిపదికగా అన్ని పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి,సీజన్‌ ప్రారంభం కాగానే రైతాంగం నుండి మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయటానికి పూనుకోవాలి. ఆహార ధాన్యాలు పండిరచే భూమి, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గ కుండా,మన దేశ ఆహార భద్రత దెబ్బతినని విధంగా వ్యవసాయ విధానాలు రూపొందిం చాలి.- ఎ.కోటిరెడ్డి

ఆకలి భారతం`సత్య సూత్రాలు

ఆకలి మహమ్మారిని తరిమివేయాలి అంటే, లోపాలమీద పోరాటంలో ప్రజల భాగస్వా ములు కావడం కూడా తప్పనిసరి. భారతదేశం ‘ప్రపంచ ఆకలి లెక్కల్లో, గత సంవత్సరం కంటే 45 స్థానాలు కిందకు పడిపోయి, 100వ స్థానానికి దిగజా రింది.అని ‘అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ’ (వాషింగ్టన్‌) తాజా నివేదిక వెల్ల డిరచింది. వెంటనే, భారత్‌ ప్రజలు ఆకలిదప్పు లతో మలమల మాడిపోతున్నారని మేధావులు, మీడియాల వాళ్ళు రాసేసారు. అసలు ఈ నివేదిక లో పేర్కొన్నది నిజమేనా? భారత్‌ అంత ఘోర స్థితిలో వుందా? ఒకటి రెండు సంవత్సరాల్లో ఆన్ని స్థానాలు పడిపోయేంత ఆకలి తీవ్రత భారతలో పెచ్చుమీరిందా? నివేదికను, అందులోని అంశా లను, గత నివేదికలను సాధికారికంగా పరిశీలిస్తే వాస్తవం మరోలా వున్నది. భారత్‌లో ఆకలి వుండ డం అయితే నిజం. కానీ ఆ ఆకలి లెక్కలు మాత్రం పూర్తి వాస్తవం కాదు.
అసలు వాస్తవం ఏమిటంటే 100వ స్థానానికి పడిపోవడం కరెక్టే. కానీ నిరుడు 55వ స్థానంలో ఉన్నప్పుడు,ఈ సంవత్సరం 100వ స్థానానికి దిగజారడం ఏమిటి అని పరిశీలించి నప్పుడు ఈసారి దేశాలకు ర్యాంకులు ఇచ్చే విధానంలో మార్పు చేసారు. 2016వ సంవత్సరం దాకా ఆ వాషింగ్టన్‌ సంస్థ రెండు వేర్వేరు ర్యాంకుల లిస్టు ఇచ్చేది. ఆకలి సమస్య మరీ ఎక్కువ వున్న దేశాలకు వేరుగా, అభివ ృద్ధి చెందిన దేశాలకు వేరుగా ఇచ్చేది. ఆకలి రూపుమాపే దిశగా ఇంకా ఎంతో వృద్ధి చెందాల్సిన లిస్టులో మన భారత దేశాన్ని పెట్టేది. అప్పుడు మనకు 55ర్యాంకు వచ్చింది. ఈసారి 2016 సంవత్సరానికి గానూ ర్యాంకులను ప్రకటించే విధానంలో మార్పులు చేసి, రెండు లిస్టులు కాకుండా అన్ని దేశాలకు కలిపి ఒకే లిస్టు ఇచ్చింది. సహజంగానే భారత్‌ ర్యాంకు 55వ స్థానం నుంచి 100కు పడిపోయింది. పూర్తి వాస్తవం కాని మన ర్యాంకును చూసి సోషల్‌ మీడియా మొదలుకొని అందరమూ గుండెలు బాదుకున్నాము! సరే, 45స్థానాలు తగ్గిన మాట తప్పే అనుకొందాము. మరి ప్రపంచంలో 100వ స్థానంలో ఉండడం నిజమే కదా అనే ప్రశ్నకు , ఆర్యాంకులను విమర్శిస్తున్నప్పుడు, జవాబు చెప్పాలి. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ పేరిట వాషింగ్టన్‌ సంస్థ ఇచ్చిన లెక్కలను బాగా పరిశీలిస్తే, ఈ ర్యాం కులు స్థూలంగా పోషకాహారలోపం ఆధారంగా ఇస్తూ అయిదు సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు మూడు ఆరోగ్య సూచికలను పునాదిగా చేసుకొన్నారు. వేస్టింగ్‌ (ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం), స్టంటింగ్‌ (వయసుకి తగినంత ఎత్తు లేకపోవడం), మరణాల రేటు అనే మూడు ప్రామా ణిక విలువల సగటుని తీసుకొని ర్యాంకులను ఇచ్చారు. పోషకాహారలోపం, అయిదు సంవత్సరాల వయస్సు లోపు శిశువుల మరణాలకి 1/3 వంతు సగటు ఇచ్చి, ఎత్తు, బరువులకు 1/6 వంతు వెయి టేజీ ఇచ్చారు. ఈ సగటుల ప్రామాణిక విలువలను, శాతాల్లోకి మార్చి, 1983-2012 మధ్య సంవ త్సరాల్లో వచ్చిన అత్యధిక శాతంలో నుంచి మైనస్‌ చేసారు. ఈసంవత్సరాల మధ్యకాలంలో ఈ అంశాల ఆధారంగా అత్యధిక పోషకహార లోపం విలువ 76.5%గా తేలింది. అందువలన భారత్‌లో ఆకలిని, ఆయా సంవత్సరాల్లో వచ్చిన సగటులను ‘80’లోనుంచి తీసేసి, ఫలానా శాతం గా చెప్తారు. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ విలువలను 1-100 మధ్యలో చూపిస్తారు. ఒకటి అంటే, పైన చె ప్పిన నాలుగు సూచికలు అసలు కనిపించవు. 100 అంటే ఆకలితో ప్రజలు అలమ టించడం. ఇలాంటి పద్ధతిని మొదటిసారి 2017 సంవత్సరంలోనే వాడారు. ఈ పద్ధతి ప్రకారం, ఈ సంస్థ భారత్‌కు 2016కు మాత్రమే కాకుండా, గడచిన సంవత్సరాలైన 1992, 2000, 2008 సంవత్సరాలకు కూడా విలువలను ఇచ్చింది. వాషింగ్టన్‌ సంస్థ ఇచ్చిన అంచనాల ప్రకారమే భారత్‌ గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ స్కోరును 1992లో 46.2 నుంచి 2017లో 31.4కు తగ్గించు కోగలి గింది. అంటే, కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో పోషకాహార లోపం తగ్గుతూ వస్తోంది అని ఆ సంస్థే చెప్తోంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మన ఆకలి సూచిక ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ సర్వే, మన దేశపు జాతీయ కుటుంభ ఆరోగ్య సర్వేలో కూడా తగ్గింది. పోషకాహార లోపం వల్లే తగ్గుతున్నట్లుగా తేలింది. సరే, వీటితో కూడా సంతృప్తి చెందమూ అంటే, జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ)లో బాగంగా మీరు ఎప్పుడైనా ఏదేనీ కారణం చేత ఆహారం దొరక్కుండా వున్నారా అని తమ డేటా సేకరణలో బాగంగా అడిగితే 1983లో 16%మంది తాము ఒక్కసారైనా ఆకలి తో ఉన్నాము అని చెప్పగా, 2004-05 నమూనా సర్వేలో కేవలం1.9% మంది మాత్రం తాము ఎప్పుడో ఒకప్పుడు ఆకలితో అన్నం లేకుండా ఉన్నామని చెప్పారు. అంత తక్కువ శాతం వున్నార నేమో అని కాబోలు, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తరువాతి సంవత్సరాల్లో అసలా ‘ఆకలి’ అనే కాలమ్‌ తీసే సింది! కొందరు విమర్శకులు, పేదలు తాము ఆకలితో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇష్టపడరు అని వాదించారు. తమ వాదనకి మద్దత్తుగా ‘ఐక్య రాజ్యసమితి అభివృద్ధి పధకం’ (యుఎన్‌ డిపి) సర్వేలో దేశంలోని అతిపేద జిల్లాల్లో ఆకలితో అల్లాడే వాళ్ళు7.5% అని, కొద్దిగా ఆహారం వుండే వాళ్ళు 29% అని వచ్చిన లెక్కలు చూపించారు. అంటే, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ లెక్కల్లో చెప్పుకోలేని వారు, యుఎన్‌డిపి సర్వేలో మాత్రం చెప్పుకోన్నారన్న మాట! సరే, యుఎన్‌డిపి లెక్కలే కరెక్టు అనుకొంటే, భారత్‌ లో జరుగుతున్న అతిపెద్ద సంక్షేమ పధకం, 2013 లో ప్రవేశ పెట్టబడిన జాతీయ ఆహార భద్రతా చట్టం సంగతేమిటి అనే ప్రశ్న వస్తుంది.
భారత్‌ లోని ప్రజలకు ఆహారం ఒక సంక్షేమపథకంగా కాకుండా ‘హక్కుగా’ అందిం చాలనే ఉద్దేశంతో పెట్టబడిన ఈ చట్టంద్వారా 75%గ్రామీణ ప్రజ లకు,50%,పట్టణ ప్రజలకు కవరేజ్‌ వచ్చే విధంగా డిజైన్‌ చెయ్యబడి, లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశంలోని2/3వంతు ప్రజలకి,మనిషికి, నెలకి 5కేజీల వంతున, కేజీరూ.1/2-/1-వంతు న బియ్యం/గోధుమలు/తృణధాన్యాలు ఇవ్వబడు తోంది. అతిపేదలుగా అంచనా వేయబడినవారికి ‘అంత్యోదయ అన్న యోజన’ ద్వారా ఉచితంగా నెలకు 35కేజీల వంతున ఇవ్వబడుతోంది. ఇది కాకుండా, జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారానే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, పోషకాహార పధకం కింద, బాలింతలకు పూర్తి భోజనం పెట్టడమే కాకుండా, రూ. 6000 వరకూ మెటర్నటీ బెనిఫిట్‌ కింద ధనసహాయం చెయ్యబడుతోంది. 14 సంవ త్సరాల లోపు పిల్లలకు పోషకాహార విలువల ప్రకారము భోజనం ఇవ్వబడుతోంది.పలు రాష్ట్రాలు ప్రత్యేక పధకాల కింద, అన్న అమ ృతహస్తం లాంటి పధకాలు చేపడుతున్నాయి. ఇక చాలా సంవత్స రాల నుంచి నడుస్తున్న మధ్యాహ్న బోజన పథకం గురించి చెప్పక్కరలేదు. అన్నీ ఇంత బాగా వుంటే అసలు పేదరికం ఎందుకు వుంటుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ప్రతి పధకంలో ఉన్నట్టే ఈ పధకంలో కూడా లోపాలు వున్నాయి. అవినీతి, డెలివరీ వ్యవస్థ లోపాలు, అమలు యంత్రాగం నిర్లక్ష్యం, ప్రతి రాష్ట్రంలో కొన్ని వేల సంఖ్యలో వున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు నియంత్రణ లోపాలు, ప్రజల ఆహార అలవాట్లు మారడం.. ఇలా పలు కారణాలుతో మనము ‘ఆకలి’ అనే భూతాన్ని ఇంకా తరిమి వేయలేకున్నాము. ప్రతి రాష్ట్రప్రభుత్వం వందల కోట్ల డబ్బు ప్రజా పంపిణీవ్యవస్థ ద్వారా ఆహార సరఫరా కొరకు ఖర్చు పెడుతోంది. ఇంతమంది ప్రజలు దీని మీద ఆధార పడేటప్పుడు, ప్రభుత్వం, దాని యంత్రాం గంతో పాటుగా తమకు దీనిద్వారా లబ్ధి జరిగే టట్లు చేసుకొనే బాధ్యత ప్రజల మీద కూడా ఉందేమో. తమకు రేషన్‌ సరుకులు దొరక్కపోతేనో, సమయానికి ఇవ్వకపోతేనో, ధర ఎక్కువ చార్జ్‌ చేస్తేనో, లేక అసలు చౌక ధరల దుకాణాలు తెరవక పోతేనో, బరువు సరిగ్గా లేకపోతేనో, అంగన్‌వాడీల్లో తమకు, పిల్లలకు సరైన సేవలు, పోషకాహార విలు వలు కలిగిన భోజనం లేదని భావిస్తేనో, ఇలా తనకు ప్రభుత్వం ఇచ్చిన ఈ సౌలభ్యం అందాల్సిన రీతిలో అందలేదు అని భావిస్తే ఏమి చెయ్యాలి? మండల అధికారులకి రిపోర్టు చెయ్యాలి. వాళ్ళు సరైన లేదా సంత ృప్తికరమైన చర్య తీసుకోలేదని భావిస్తే, జిల్లా స్థాయిలో, రేషన్‌ విషయం అయితే తెలుగు రాష్ట్రాల్లో జేసి-2కి,అంగన్‌వాడీల విష యంలో ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఐసిడీఎస్‌)లకు రిపోర్ట్‌ చెయ్యాలి. వీళ్ళేవ్వరి దగ్గర కూడా న్యాయం జరుగ లేదు అని భావిస్తే, పార్లమెంటు ఆమోదించిన ఈ ఆహార భద్రతా చట్టంలో బాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, క్వాసీ జ్యుడిషియల్‌ అధికా రాలు కలిగిన ‘ రాష్ట్ర ఆహార కమీషన్‌’లను ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసారు. విస్తృత అధికా రాలు కలిగిన ఈ ‘కమీషన్‌’ కు రిపోర్ట్‌ చెయ్యడం అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ద ృష్టికి తీసుకోచ్చినట్టే! మన రాష్ట్రంలో కూడా ఇటీవల ‘రాష్ట్ర ఆహార కమీషన్‌’ ను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఒక చైర్మన్‌, అయిదుగురు సభ్యులు, ఒక ఐఏఎస్‌ అధికారి మెంబర్‌ సెక్రటరీగా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కమీషన్‌ తనకు వచ్చిన ఫిర్యాదులనే కాకుండా, సుమోటోగా, అంటే తనకు తానుగా కూడా చర్యలు తీసుకొని, క్రైం కాని వాటిలో జరీమానాలను శిక్షలుగా వేస్తుంది. నేర చరిత్ర వుంటే, కేసు నమోదు చేసి కోర్టుకు బదిలీ చేస్తుంది. ఆకలి వున్నది అన్నది నిజం. అది ఎంత శాతమైనా సరే. అలాంటి ఆకలిని పారద్రోలాల్సిన అవసరం బాధ్యత అందరిమీద వుంది. ఏ ప్రభుత్వ మైనా పధకాలు తెస్తుంది, నిధులు ఇస్తుంది. పధకాలు ఆశించిన విజయం సాధించి ఆకలి మహమ్మారిని తరిమివేయాలి అంటే, లోపాల మీద పోరాటంలో ప్రజల బాధ్యత కూడా తప్పనిసరి. అప్పుడే ప్రజలు ఆనందంగా వుంటారు.
ఆంధ్ర దేశంలో ఆకలి కేకలు
విద్య, భూమి కలిగి వుండటం, పారి శ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచ నలో ప్రధాన మైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సదాÄవేన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజ లకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపోతుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండా కాదు. రాష్ట్రంలో ఎటుచూసినా ఆకలి కేకలు విని పి స్తున్నాయి. ప్రభుత్వం ప్రజా సమస్యల పైన ప్రజల ఆకలి తీర్చడం పైన దృష్టి సారించడం లేదు.‘అన్ని విషయాలు నాకు తెలిసాయి’ అని ముఖ్యమంత్రి అనుకోవడమే దీనికంతటికి కారణం. కానీ ఆయనకు తెలియని ఆవేదన తెలుగు నేలలో వుంది. ఈ ఆకలి కేకలకు కారణం ముఖ్యమంత్రికి అంబేద్కర్‌ రాజ్యాంగ సూార్తిే లేకపోవడం. రాజ్యాంగం ప్రధానంగా నిర్దేశిస్తున్న అంశం విద్యాభివ ృద్ధి. కానీ నేడు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా వుంది. పాఠ్యపుస్తకాలు లేక, బోధించడానికి ఉపాధ్యాయులు లేక త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులు కాలేక పోతున్నారు. ‘అమ్మ ఒడి’ ప్రచారం మోగిపోతోంది. మధ్యాహ్న భోజనంలో నీళ్ళ చారు, బుల్లి గుడ్డుతో అన్నం తినలేక పిల్లలు పస్తులుంటున్నారు. ఒక్కొక్క టాయిలెట్‌ దగ్గర ఇరవై మంది పిల్లలు క్యూలో నిలబడుతున్నారు. బాత్‌ రూమ్‌లు దుర్గంధం కొడుతున్నాయి. రుతుక్రమం సమయంలో ప్యాడ్స్‌ కోసం హెచ్‌.యం ఆఫీసు దగ్గర బాలికలు క్యూ కడుతున్నారు. ఈ దృశ్యాల న్నింటిని పాదయాత్రలో ముఖ్యమంత్రి వర్ణించినవే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అటు వంటి పరిస్థితి ఉండదని వాగ్ధానం కూడా చేశారు. కాని ఆస్థితి యథాతథంగానే గాక ఇంకా అధ్వాన్న దశకు చేరుకుంది. విద్య సామాజిక పరిణామానికి మూ లం. సమాజ భవితవ్యానికి సోపానం.
ప్రధానంగా భారత రాజ్యాంగం విద్యా వ్యాప్తినే ప్రభుత్వా లకు ఆదేశిస్తున్నది. ప్రతి విద్యార్థికి విద్యను అందించే ప్రక్రియే ముఖ్యం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.రెండు లక్షల 20 వేల కోట్లు కాగా మరి స్కూళ్ళు ఎందుకు ఇంత అధ్వాన్న స్థితిలో వున్నాయి? బడ్జెట్లో కొత్త ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి 16,17 పైసలే పెంచింది. మరి రూ.6,7లకు నాసిరకం భోజనమే కదా వచ్చేది. ఇటువంటి భోజనం చేయలేక ఎంతో మంది హాస్టలు విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఖాళీ కడుపుతో ఉంటున్నారు. పౌష్టికాహారం అంటే ఏంటో పాలకులకు తెలి యదా? అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఎటువంటి ఆహా రం వడ్డిస్తున్నారు? ప్రభుత్వానికి మానవతా స్పూర్తే కావాలి. అది లేని ప్రభుత్వం ఎండు కట్టె వంటిం ది. ప్రభుత్వ ప్రతినిధులెందుకు మధ్యాహ్న భోజనం లో సహ పంక్తికి రావడం లేదు. ప్రజా ప్రతినిధుల్లో కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ప్రతి ప్రజాప్రతి నిధికి మూడు లేక నాలుగు మండలాలే ఉంటాయి. కొందరి పరిధిలో ఒకమున్సిపాలిటీ కూడా ఉంటుంది. ప్రతి నియోజక వర్గంలో ప్రభుత్వ స్కూళ్ళు వుంటాయి. వారంలో ఏదో ఒకరోజు ఆ స్కూళ్ళ ప్రజాప్రతినిధి పిల్లలకు మంచి భోజనం పెట్టించవచ్చు. అసలు ప్రజాప్రతినిధులను సామా జిక కార్యకర్త్తలుగా ఎందుకు మార్చడం లేదు? పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో 50శాతం మంది ఇంటర్మీయట్‌లో చేరడం లేదు. ఈ విషయం మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? ‘మీ పిల్లల భవిష్యత్తు నాచేతుల్లో పెట్టండ’ని పాద యాత్రలో భరోసా ఇచ్చారు. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? ఇంటర్మీయట్‌, బి.ఎచదువుతున్న విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనం లేదు. స్కూళ్ళలో, కాలేజీల్లో మంచినీళ్ళు లేక విద్యా ర్థులు జ్వరాల బారిన పడుతున్నారు. 300నుండి వెయ్యి మంది ఉండే స్కూళ్ళల్లో ప్రాథమిక చికిత్స అందించే నర్స్‌ లేరు. ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్న వారంతా యస్‌.సి,యస్‌.టి, బి.సి పిల్లలే! 80 శాతం మంది యస్‌.టి, యస్‌.సి లే అని తేలింది.
‘నాకు పార్టీలతో పనిలేదు. పారదర్శకతే ముఖ్యం’ అని చెప్పిన ముఖ్యమంత్రి,మధ్యాహ్న భోజన కార్మికులను, యానిమేటర్లను, ఆశా వర్కర్ల ను, మున్సిపల్‌ అంగన్‌వాడీ వర్కర్లను రాజకీయ కారణాలతో తొలగించి, తమ పార్టీ వారిని పెట్టు కొంటున్నారు. ఇదిరాజ్యాంగ విరుద్ధం! ఇలా తొలగించడం వల్ల ఒక యానిమేటర్‌ ఆత్మహత్య చేసుకొన్నారు కూడా! ‘పార్టీ కార్యకర్తలకే పదవులు’ అనే అంశం వల్లనే కదా చంద్రబాబు ప్రభుత్వం పై అసంత ృప్తి రగిలింది. బాబు దారి లోనే ఈ ముఖ్యమంత్రి నడుస్తున్నారు. అంతేకాక, అనేకాం శాల్లో ఆయన్ని మించి పోతున్నారు.
పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటిన్‌’ని కూడా రద్దు చేశారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? మరోపక్క వ్యవసాయ కార్మికులకు భూమి పంచ కుండా ఉపాధి కూలీలుగా మార్చారు. గుంటూరు జిల్లా నివేదిక చూస్తే విస్తుపోక తప్పదు. జిల్లాలో సుమారు 13 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 7,99, 599 కుటుంబాలకు జాబ్‌ కార్టులు మంజూరు చేశారు. వీరిలో దళిత కుటుంబాలు 4,78,919 మంది, గిరిజనులు 1,12,954 మంది ఉన్నారు. మొత్తం జాబ్‌ కార్డుల్లో నమోదైన కూలీల సంఖ్య 15,53,660 మంది ఉన్నారు. దళిత, గిరిజన, బీసీ వర్గాల నుంచి మాత్రమే కాకుండా ఓసీల్లోని పేదలు సైతం కూలీలుగా నమోదైన పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో ప్రతి రోజూ 1.50లక్షల మందికే పని కల్పిస్తున్నారు. వేతనాలను పరిశీలిస్తే కనీస వేతనం రూ.211 రావాల్సి వుంది కానీ రూ.80 నుంచి రూ.140మాత్రమే ఇస్తున్నారు. ఇకపోతే 100 పని దినాలు కల్పించాల్సి ఉండగా సరాసరి 40 పని దినాలు మాత్రమే కల్పిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. దీనిని బట్టి పరిశీలిస్తే ప్రతి వ్యవసాయ కార్మికుడు రోజుకు కనీస వేతనం నుంచి రూ.81కోల్పోతున్నట్లు వెల్ల డవుతోంది. ప్రతి రోజూ పని ప్రదేశాలకు ప్రతి కూలి తన మంచి నీరు తానే తెచ్చుకుంటే వేతనం కాకుండా రోజుకు రూ.5 మంచి నీటికి, పలుగు, పార తెచ్చుకుంటే రూ.5 అదనంగా అద్దె ఇవ్వాలి. ఈ వివరాలన్నీ పే స్లిప్పులో నమోదై పారదర్శకంగా కూలీలకు తెలియజేయాలి. అయితే అది అమలు జరగడం లేదు. పని ప్రదేశాల్లో మెడికల్‌ కిట్స్‌ దాదాపు లేవు. మజ్జిగ సరఫరా చేయడం లేదు. గతంలో మజ్జిగ సరఫరా చేసినా బిల్లులు రావడం లేదని మేట్స్‌ చెప్పారు. ఒకజిల్లా నివేదికే ఇలా వుంటే రాష్ట్ర మొత్తంగా ఉపాధి కూలీల సంగతి ఆలోచిస్తే దారుణంగా వుంది. ప్రజల దాహం తీర్చడానికి, ప్రజల పొట్ట నింపడానికి వెనకాడడం ఏ ధర్మ సూత్రమో ముఖ్యమంత్రే చెప్పాలి. తన చేతిలో రెండు కోట్ల 20లక్షల ఎకరాల భూమి పెట్టుకొని విదేశీ కంపెనీలను పిలిచి పందేరం చేయాలని చూస్తున్నారే గాని, ఆభూమిని భూమి లేని పేదలకు పంచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చూడ డం లేదు.
విద్య,భూమి కలిగి వుండటం, పారి శ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచన లో ప్రధానమైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సదాÄవేన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజలకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపో తుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండాకాదు.
డా॥బి. ఆర్‌. అంబేద్కర్‌ అణగారిన వర్గాలకు న్యాయం చేయడం అంటే భూమి పంప కంలో,వారి పిల్లలకు విద్యను నేర్పించడంలో, పరిశ్రమల్లో వారిని భాగం చేయ డంలో చిత్తశుద్ధితో వుండాలని చెప్పారు. నిజానికి దళితుల నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ముఖ్య మంత్రిని పొగిడే పనిలో వున్నారు గాని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేట పరిస్థితి లేదు. ద్వేషంతో దేన్నీ నిర్మించలేం. ప్రేమ, కరుణ తోనే పునర్నిర్మాణం సాధ్యం అని ముఖ్య మంత్రి తెలుసు కున్న నాడు ఆంధ్ర దేశంలో ఆకలి కేకల నివారణకు పరిష్కారం రూపొందుతుంది.-నీలయపాలెం విజయ్‌ కుమార్‌

అసైన్డ్‌ చట్ట సవరణ ఎవరి కోసం?

పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరత రాలుగా అనుభవించాలేగానీ అమ్మకూడదు. ఇతరు లు కొనకూడదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 20సంవత్సరాల తరువాత అమ్ముకోవచ్చని సవరిస్తే. …ఇప్పటి వైసిపి ప్రభుత్వం పదేళ్ళకు కుదించింది. అమ్ముకోవచ్చని చట్టమే సవరిస్తే పేదల చేతుల్లో ఉన్న చారెడు భూమి కూడ మిగలదు.
‘భూమి అనేది కేవలం ఆర్థిక వనరే కాదు. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, సమాజంలో హోదాని అందిస్తుంది. వీటితోపాటు భూమి అంటే అధికారం’ అని చెప్పేవారు ఎస్‌.ఆర్‌.శంకరన్‌. అందుకేనేమో పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములు చేజారిపోకుండా, ఒకవేళ పోయినా తిరిగి ఆ పేదలకు చెందేలా 9/77 అసైన్డ్‌ చట్టాన్ని తెచ్చారు. నాటి పాలకవర్గం దీనిని తొలత తీవ్రం గా వ్యతిరేకించినా పట్టుబట్టి ఈ చట్టాన్ని సాధిం చారు. ఇంతటి ప్రాధాన్యత కల్గిన అసైన్డ్‌ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు పరచాల్సింది పోయి నేటి పాలకులు రోజు రోజుకూ నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం 9/77 చట్టం సెక్షన్‌ 3ను సవరించి పేదలకిచ్చిన ఇళ్ళ స్థలాలు,ఇళ్లు 10సంవత్సరాల అనుభవం తరువాత అమ్ము కోవచ్చని తీర్మానించింది. పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరతరాలుగా అనుభవించాలేగానీ అమ్మ కూడదు. ఇతరులు కొనకూడదు. గత తెలుగుదేశం ప్రభుత్వం 20సంవత్సరాల తరువాత అమ్ము కోవచ్చని సవరిస్తే…ఇప్పటి వైసిపి ప్రభుత్వం పదే ళ్ళకు కుదించింది. ఈ చట్టం ఇంత పగడ్బందీగా ఉన్నప్పటికీ పేదలకిచ్చిన భూములను పలుకుబడి కలిగినవారు, సంపన్నులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు, చివరకు ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరుతో అసైన్డ్‌ భూములనే బలవంతంగా లాక్కుంటుంది. ఇక అమ్ముకోవచ్చని చట్టమే సవరిస్తే పేదల చేతుల్లో ఉన్న చారెడు భూమి కూడ మిగలదు.
స్వాతంత్య్రానికి ముందు ఆ తరువాత ‘దున్నే వానికే భూమి’ నినాదంతో దేశ వ్యాపితంగా జరిగిన భూ పోరాటాలవల్ల పాలక వర్గాలకు ఇష్టం ఉన్నా, లేకపోయినా భూసీలింగ్‌ చట్టం, రక్షిత కౌలుదారీ చట్టాలు, 1/70చట్టం,9/77 అసైన్డ్‌ చట్టాలు సాధించబడ్డాయి. ఈ చట్టాల వల్ల పేదల చేతుల్లోకి కొంతైనా భూమి వచ్చింది. ఆ భూమిని పొందిన దళితులు, బలహీన వర్గాల కుటుంబాలు తమ పిల్లలను చదివించుకుని ఇపుడిప్పుడే సమా జంలో మెల్లమెల్లగా తల ఎత్తుకుని తిరిగే స్థాయికి చేరుకుంటున్నారు. దీనిని కూడా సహించని పాలక వర్గాలు పేదలను భూమి నుండి వేరు చేసి వీరికున్న కొద్దిపాటి చట్టబద్ద హక్కులను కూడా లేకుండా చేస్తున్నాయి. ఇందులో భాగమే మన రాష్ట్ర మంత్రి వర్గం చేసిన అసైన్డ్‌ చట్ట సవరణ. స్వాతంత్య్రానికి పూర్వం నుండి కమ్యూనిస్టులు చేసిన పోరాటాల వల్లగాని లేదా ల్యాండ్‌ సీలింగ్‌ చట్టంవల్ల భూస్వా ముల చేతుల్లో ఉన్న మిగులు భూమిగాని, ప్రభుత్వ బంజర్లు, ఇనాం భూములు మొదలగు 16 రకాల భూములు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 55 లక్షల ఎకరాలకుపైగా పేదలకు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ లెక్కలు తెలియచేస్తున్నాయి. ఈ రూపంలో పేదలు పొందిన భూములను తిరిగి పెత్తందార్లు, పలుకు బడి కలిగినవారు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్ర మించుకుంటుంటే….పేదలకు పావలో, పాతికో ఇచ్చి లాగేసుకుంటుంటే…పేదల చేతుల్లో ఉన్న భూములు చేజారిపోకుండా ఉండడానికే నాడు సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా ఉన్న ఎస్‌.ఆర్‌ శంకరన్‌ 9/77అసైన్డ్‌ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఎవరైనా పేదలు తమ అవసరాల కోసం భూమిని అమ్మినా లేదా ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా భూమి కోల్పోయిన పేదలు మా భూమి తిరిగి ఇప్పించమని ప్రభుత్వానికి విన్నవించుకుంటే సెక్షన్‌ 4 ప్రకారం తిరిగి కోల్పోయిన పేదలకే ఇవ్వాలి. సెక్షన్‌ 5ప్రకారం అసైన్డ్‌ భూములు రిజిష్టర్‌ చేయ కూడదు. అసైన్డ్‌ భూములు పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు. అసైన్డ్‌ భూములు పొందాలంటే ప్రభుత్వం ఇచ్చేది, సొంత భూమి కలుపుకొని 5ఎకరాలు మెట్టగానీ లేదా రెండున్నర ఎకరాలు మాగాణి మించకుండా ఉండాలి. అనర్హులు అసైన్డ్‌ భూములు కొంటే 6 నెలలు జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించాలని సెక్షన్‌ 6 చెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసైన్డ్‌ భూములకు ఈ చట్టం కవచకుండలం లాంటిది.
ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల ఒత్తిడితో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2005లో కోనేరు రంగారావు నాయకత్వంలో ఏడు గురు ఐఎఎస్‌ అధికారులతో భూకమిటీని వేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాపితంగా పర్యటించి భూసమస్య పరిష్కారం కోసం 104సిఫారసులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 90ఆమోదించింది. 12 తిర స్కరించింది.2పెండిరగ్‌లో ఉంచింది. ఆమోదిం చిన 90 సిఫారసులను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలక్టర్లకు, సంబంధిత అధికారులకు జీవో నెంబర్‌ 1049,1191 విడుదల చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములతో పాటు భూస్వాముల దగ్గర ఉన్న మిగుల భూములు, ప్రభుత్వం దగ్గర ఉన్న పదహారు రకాల భూములు మొత్తం కలుపుకుంటే ఈ రాష్ట్రంలో భూమిలేని ప్రతికుటుంబానికి ఎకరం భూమి పంచవచ్చని భూకమిటీ చెప్పింది. ఇది అమలు కావాలంటే అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూ ములు తిరిగి పేదలకు ఇప్పించాలి. సాగు నీటి వనరులు వచ్చిన చోట భూమి పున:వర్గీకరణ చేసి భూస్వాముల చేతుల్లో ఉన్న మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలి. దేవాలయ భూములు పేదలకే లీజుకివ్వాలి. కౌలుదారీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. 1/70 చట్టాన్ని పక డ్బందీగా అమలు చేయాలని కోనేరు రంగారావు భూ కమిటీ 104 సిఫారసులు చేసింది. వీటిని అమలు చేయవలసిన రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం… అసైన్డ్‌ చట్టం సెక్షన్‌ 4 సవరించి అసైన్డ్‌ భూములు ఆక్రమించుకున్నవారు విద్యాలయాలు, పరిశ్రమలు, ఉద్యానవనాలు నిర్మించుకుని ఉంటే వారికే రెగ్యులర్‌ చేస్తూ చట్టసవరణ చేసి భూకమిటీ సిఫారసులకు ఆదిలోనే తిలోదకాలిచ్చి పేదలకు తీరని అన్యాయం చేసింది. అయినా నేటికీ 90 సిఫారసులు అమలు లోనే ఉన్నాయి. కానీ కోనేరు రంగారావు తో పాటు ఆయన సిఫారసులను కూడా కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు కోనేటి లోకి కలిపేశాయి.
స్వాతంత్య్రానంతరం పాలక వర్గాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా పేదలకు అనుకూలంగా కొన్ని చట్టాలయినా చేశాయి. 1991 నూతన ఆర్థిక విధా నాలు అమలు చేసిన తరవాత పేదలకు వ్యతి రేకంగా రివర్స్‌ భూసంస్కరణలు మొదలుపెట్టారు. నాడు పేదలకు అనుకూలంగా భూ పంపిణీ కోసం చట్టాలు చేస్తే నేడు పేదల భూములు పెద్దలకు కట్టబెట్టడానికి చట్టాలను అనుకూలంగా మారుస్తు న్నారు. ఇప్పటికే అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని రద్దు చేశారు. నేడు అసైన్డ్‌ చట్టాన్ని మారుస్తున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి మాటున భూ బ్యాంక్‌ పేరుతో అసైన్‌మెంట్‌ భూములనే లక్ష్యంగా చేసుకుని 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి చట్టబద్దమైన నష్టపరిహారం పేదలకివ్వ కుండా బలవంతంగా భూసేకరణకు పూనుకు న్నారు. నాడే చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్‌ భూము లు అనర్హులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళస్థలాలు, ఇళ్ళు 20సంవత్సరాలు అనుభవం ఉన్న వారు అమ్ముకోవచ్చని పేదలను నమ్మబలికించి చట్టసవరణ చేసింది. దీనివల్ల పేదలు లబ్ధి పొంద డం సంగతి పక్కనపెడితే రాష్ట్రంలో అక్రమంగా, దౌర్జన్యంగా పొందిన అనర్హులు తప్పుడు అగ్రి మెంట్‌లు సృష్టించి క్రమబద్దీకరించుకుని పేదలకు ద్రోహం చేశారు. నేడు వైసిపి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 10 సంవత్సరాలు అనుభవం ఉంటే చాలు అమ్ముకోవచ్చని అసైన్డ్‌ చట్టం సెక్షన్‌ 3ను సవరిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీనివల్ల పేదలు లాభపడేదేమోగానీ దీనిమాటున అనర్హులకు మాత్రం రాజమార్గం ఏర్పడనుంది. ఏ ప్రభుత్వాలైనా పేదలకు భూములు ఇచ్చి వాటికి నీటి వనరులు, పరపతి సౌకర్యాలు కల్పించి వారిని దారిద్య్రంలో నుంచి బయటకి లాగి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి విరు ద్ధంగా పేదలకిచ్చిన సెంటో,కుంటో భూమిని కూడా అమ్ముకోమని ప్రభుత్వాలే పేదలను బికా రులుగా మార్చడం అత్యంత బాధాకరమైన విష యం.రాష్ట్ర వ్యాపితంగా భూముల విలువ పెరిగిన తరువాత రకరకాల అభివృద్ధి పేరుతో అసైన్డ్‌ భూ ములనే లక్ష్యంగా చేసుకొని బలవంతంగా లాక్కుంటున్నారు. ఎదిరించినవారిపై దౌర్జన్యం చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలే భూమాఫి యాగా మారాయి. రాష్ట్రంలో నాగార్జున సాగర్‌, శ్రీశైలం, తుంగభద్ర,సోమశిల,వంశధార,తోటపల్లి,హంద్రీ నీవా,గండికోట,మొదలగు ప్రాజెక్టులు, రిజర్వాయర్ల కింద లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్యం వచ్చింది. 1975 భూసీలింగ్‌ చట్టం ప్రకారం ఈ భూములన్నీ పున:వర్గీకరణ చేసి భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను తీసుకొని తిరిగి పేదలకు పంపిణీ చేయాలి. కానీ గడచిన నాలుగు దశాబ్దా లుగా కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు ఒక్క భూస్వామి దగ్గర ఒక్క సెంటు భూమి తీసుకున్న దాఖలాలు లేవు.
దీనిని బట్టి ఈ ప్రభుత్వాలు ఏ వర్గ ప్రయోజనాలు కాపాడతాయో అర్థం అవు తుంది. దీనికి భిన్నంగా బెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో భూస్వా ముల చేతుల్లో ఉన్న మిగుల భూములను తీసుకుని లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర వామ పక్ష ప్రభుత్వాలకు ఉంది. ప్రస్తుతం పేదలకు భూ పంపిణీ మాట ఏమో గానీ పేదల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూమిని కూడా వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలే లాగేసుకుం టున్నాయి. రాష్ట్ర మంత్రి వర్గం చేసిన అసైన్డ్‌ చట్ట సవరణ వల్ల పేదలకు లాభం లేదు. ఆక్రమణ దారులకు రాజమార్గం ఏర్పాటు చేయడానికి కొద్దో, గొప్పో దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములను లాక్కోవడానికి తప్ప మరొకటి కాదు. నాడు ‘’దున్నే వానికే భూమి’’ కావాలని పోరాడి సాధించుకున్న భూ చట్టాలను నేటి ప్రభుత్వాలు ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. సంక్షేమ పథకాల వల్ల దారిద్య్ర నిర్మూలన జరగదు. కేవలం ఉపశమనం మాత్ర మే. పేదలకు భూపంపిణీ చేయడం ద్వారానే దారిద్య్రాన్ని రూపుమాపడానికి దోహదపడుతుంది. కాబట్టి ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించు కున్న భూ చట్టాలను అదే స్ఫూర్తితో పోరాడి రక్షించు కోవాలి.
వ్యాసకర్త ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి-వి.వెంకటేశ్వర్లు

సమత తీర్పుకు 24 ఏళ్లు

గిరిజన ప్రాంతాల్లో వారు అనుభవిస్తున్న భూములపై హక్కులను సమర్ధిస్తూ ‘సమత’ కేసులో ఒక సంచలన తీర్పు ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వర్గీయ జస్టిస్‌ కె రామ స్వామి సేవలు చిరస్మరణీయం. సమత తీర్పువెలువడి ఇప్పటికి 24 సంవత్సరాలు పూర్తి య్యాయి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు ప్రకారం మాత్రమే కాకుండా వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు విరుద్ధంగా షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజ నులకు చెందిన భూములను గిరిజనేతరులు దోచు కుంటున్నారని,చివరకు గిరిజనులు వారి హక్కు లను కోల్పోతున్నారని ‘సమత’ స్వచ్ఛంద సంస్థ ఆ హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతోంది.

దీర్ఘకాల పోరాటం తర్వాత ఆ సంస్థ కోర్టుల్ని ఆశ్రయించిది. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దాన్ని కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలుచేసింది. నాలుగేళ్ళ పోరాటం తర్వాత సమత ఆ కేసులో విజయం సాధించింది.1980 నాటి అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో, రిజర్వు అటవీ ప్రాంతాల్లో భూములను ప్రైవేటు మైనింగ్‌ అవసరాల కోసం లీజుకు ఇవ్వడం నిషేధమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గిరిజన ప్రాంతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తి (పర్సన్‌) తరహాలోనే చట్టాలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. ‘‘గవర్నర్‌ తన వ్యక్తిగత బాధ్యత ప్రకారం షెడ్యూల్డు ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలి. సుపరిపాలన అందేందుకు చొరవ తీసుకోవాలి. గిరిజనులు, గిరిజనేతరులు, స్థానిక వ్యక్తుల మధ్య భూముల కేటాయింపు క్రమ బద్ధీకరణకు సంబంధించి రాజ్యాంగంలోని ఐదవ అధికరణంలో కొన్ని అధికారాలను కల్పించింది. షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూములను బదలాయించడంపై నిషేధాజ్ఞలు విధించింది. ‘క్రమబద్ధీకరణ’ అంటే ‘నిషేధం’ కూడా అనే అంశాన్ని అన్వయించడానికి సంబంధించి స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘వ్యక్తుల’ అంటే సహజ వ్యక్తులతో పాటు న్యాయ వ్యవహారాలతో సంబంధం కలిగిన వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు కూడా’’ అని జస్టిస్‌ కె.రామస్వామి, జస్టిస్‌ సాగిర్‌ అహ్మద్‌లు వారి తీర్పులో పేర్కొన్నారు. పైవేటు వ్యక్తులు, సంస్థలు, పారిశ్రామికవేత్తలకు అటవీ భూములను కేటాయించడం చెల్లదని సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. అయితే ఖనిజాభివృద్ధి సంస్థ, గిరిజన సహకార సంస్థ లాంటి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం అటవీ భూములను బదలాయించడాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అనుమతించింది. కానీ కొన్ని షరతులు విధించింది. ఆ సంస్థలు ఆర్జిస్తున్న నికర ఆదాయంలో కనీసంగా ఇరవై శాతం మొత్తాన్ని ఒక శాశ్వత నిధిగా నిర్వహించాలని, ఆ నిధిని గిరిజనులకు ఉపయోగపడేలా పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు, పారిశుద్య అవసరాలు తదితరాల కోసం ఖర్చు చేయాలని ఆ షరతులో పేర్కొనింది.
గిరిజనుల ఆర్థిక వనరుల్లో ఒకటి వారి ప్రాంతాల్లో లభిస్తున్న విలువైన ఖనిజాలు. గిరిజనులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే ఖనిజ (సహజ) వనరులు నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిలో, పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక వృథాగా వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నాయి. నిజంగా వాటిని సమర్ధవంతంగా వినియోగించుకున్నట్లయితే మైనింగ్‌ పరిశ్రమ లేదా ఖనిజ ఆధార పరిశ్రమలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా గిరిజనులకే ఆ పరిశ్రమల్లో ఉపాధి కల్పన లభించే అవకాశం ఉంటుంది. మొత్తం గిరిజన ఆవాసాల్లోనే నాణ్యమైన లోహ సంబంధమైన ఖనిజాలే కాకుండా ఇతర రకాల ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవచ్చు. గిరిజనులను భాగస్వాములను చేసి అనేక రకాలుగా విలువను జోడిరచే ఖనిజ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పి అభివృద్ధి చేయవచ్చు. ఇదే చేసినట్లయితే గిరిజనుల అభివృద్ధి కోసం శాశ్వతంగానే ఒక ‘రాయల్టీ అభివృద్ధి డివిడెండ్‌ ఫండ్‌’ను నెలకొల్పడానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. మైనింగ్‌ వ్యాపారంలో గిరిజనులకు కూడా నిర్దిష్ట వాటాను కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయవచ్చు. విలువైన ఖనిజాల ప్రాధాన్యత గురించి గిరిజనులు తెలుసుకునేందుకు, అవగాహన చేసుకోడానికి దోహదపడుతుంది. ఖనిజ ఆధార వ్యాపార, వాణిజ్య రంగాల్లో మాత్రమే కాక వ్యాపార నిర్వహణలో సైతం వారు రాణించేలా చైతన్యం కలిగించవచ్చు. అంతిమంగా ఇది వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. గిరిజనుల చేతి బ్రహ్మాస్త్రం 1/70 చట్టం: షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న భూములు గిరిజనులకే చెందేలా 1970లో ‘భూ బదలాయింపు క్రమబద్ధీకరణ చట్టం’ (వన్‌ ఆఫ్‌ సెవెంటీ) ఉనికిలోకి వచ్చింది. షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి ఉన్నట్లయితే, ఏదేని నిర్దిష్టమైన ఉత్తర్వులు లేదా అనుమతి ఉంటే తప్ప, అది గిరిజనుల నుంచి స్వాధీనం చేసుకున్నదేననే ఒక స్పష్టమైన (ముందస్తు అంచనాతో కూడిన) సెక్షన్‌ ఈ చట్టంలో ఉంది. గిరిజనేతరులు ఈ ప్రాంతాల్లో ఏ స్వల్ప స్థాయిలో భూమిని కలిగి ఉన్నా దాన్ని మరో గిరిజనేతరుల పేరు మీద బదలాయించడానికి కూడా వారికి అధికారం లేదు. షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూమి (స్థిరాస్తి) బదలాయింపుకు ఈ చట్టంలో చాలా స్పష్టత ఉంది. 1964 నాటి సహకార సొసైటీల చట్టం కింద రిజిస్టర్‌ అయిన సొసైటీలోని సభ్యులు లేదా గిరిజనులకు తప్ప మరెవ్వరికి ఈ ప్రాంతంలోని భూమిని బదలాయించడం వీలు పడదు. బదలాయించాలనుకుంటున్నవారు గిరిజనులైనా, సొసైటీలో సభ్యులైనా తీసుకుంటున్నవారు గిరిజనులు కానప్పుడు, సొసైటీలో సభ్యులు కానప్పుడు ఆ బదలాయింపు చెల్లుబాటు కాదు.
ఈ చట్టం షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూమిపై గిరిజనులకు హక్కు కల్పించింది. తొలుత ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి ఉంటే తప్ప గిరిజనులకు చెందిన భూమిని గిరిజనేతరులకు బదలాయించడం సాధ్యంకాదు. ప్రారంభంలో ఈ చట్టం పరిధి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనప్పటికీ ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి కూడా అన్వయించేలా సవరణ జరిగింది. గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదలాయింపు జరుగుతున్నట్లయితే ఈ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించబడిరది. అలాంటి సందర్భాల్లో ఆ భూమి గిరిజనులకు లేదా వారి వారసులకు మాత్రమే చెందుతుంది తప్ప గిరిజనేతరులకు చెల్లదు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తొమ్మిదేళ్ళ కాలంలో (1979 వరకు) షెడ్యూల్డు ప్రాంతంలో గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న విస్తారమైన భూములు పరిరక్షించబడినాయి. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరుల ఆధీనం లో ఉన్న లక్షలాది ఎకరాల భూములు రక్షించ బడినట్లు ట్రైబల్‌ కల్చరల్‌ రీసెర్చి అండ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొనింది. అయితే ఇలా పరిరక్షణకు గురైన భూములు మళ్ళీ గిరిజనుల చేతికి వెళ్ళింది కేవలం నాల్గవ వంతు మాత్రమేనని, వివిధ రకాల ఉత్తర్వులతో ఇంకా లక్షలాది ఎకరాలు గిరిజనేతరులే అనుభవిస్తున్నారని కూడా పేర్కొనింది. ఇలాంటి పరిస్థితుల్లో 1197 జూలై 11న (దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం) దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జస్టిస్‌ కె రామస్వామి, జస్టిస్‌ సాగిర్‌ అహ్మద్‌, జస్టిస్‌ జిబి పట్నాయక్‌ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పులోని అంశాలను పరిశీలించడం అవసరం.
‘వ్యక్తి’ అంటే కేవలం వ్యక్తులు మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అని ఆ తీర్పు నొక్కి చెప్పింది. షెడ్యూల్డు ప్రాంతంలోని భూమిని బదలాయించేటప్పుడు ‘వ్యక్తి’ అని పేర్కొన్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుతుందని, మైనింగ్‌ అవసరాల కోసం భూమిని గిరిజనేతరులకు లీజుకు ఇస్తున్నప్పుడు లేదా బదలాయిస్తున్నప్పుడు ఇది వర్తిస్తుందని, అలాంటి బదలాయింపు / లీజు నిషిద్ధమని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వమే ఆ భూమిని మైనింగ్‌ అవసరాల కోసం ఒక సంస్థకు బదలాయిస్తుంటే అది కూడా నిషేధిత చర్యే అవుతుందని స్పష్టం చేసింది. ఆ తర్వాతి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఒక ప్రకటనలో ‘గవర్నర్లతో ఏర్పాటైన కమిటీ’ ఏర్పాటవు తుందని, చట్టం అమలులో జరుగుతున్న పొరపాట్లను, లోపాలను,ఉల్లంఘనలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సైతం పలు సిఫారసులతో కూడిన తీర్పు ఇచ్చినా ఆ తదనంతర పరిస్థితుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నా యో స్పష్టం కావడంలేదు. -వనం జ్వాలా నరసింహారావు

వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు

భారత వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్ర సంక్షో భాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ అప్రజాస్వామికంగా రాజ్యసభ బిజినెస్‌ రూల్స్‌ను తుంగలో తొక్కి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిన పరిస్థితి గతంలో ఏనాడూ లేదు.
ప్రస్తుత మార్కెటింగ్‌ యార్డులు రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నాయని,ఈనూతన వ్యవ సాయ చట్టాల వలన రైతులు ఎక్కడికైనా తమ ఉత్పత్తులను పంపి, తనకు నచ్చిన ధరకు అమ్ముకొనే వెసులుబాటు లభిస్తుందని,కమీషన్‌ ఏజెంట్లు వుండ రని, రైతులకు చాలా మేలు చేకూరుతుందని ప్రధాని మోడీ, వ్యవసాయ మంత్రి తోమర్‌ తదితరులు పదేపదే చెటబుతున్నారు. వాస్తవానికి ఈ మూడు నల్ల చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్ళుగా మారతా యి. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద వున్న 2384 రెగ్యులేటెడ్‌ మార్కెట్‌ యార్డులు, 4887 సబ్‌ యార్డులు,ఎ.పి.ఎం.సి.లు నోటిఫై చేసిన వేలా ది ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులు,గోడౌన్లు ఈ-నామ్‌తో అనుసంధానం చేయబడిన వందల మార్కెట్‌ యార్డులు,గ్రామీణ ప్రాంతాలలో వున్న దాదాపు 20,000 చిన్న చిన్న మార్కెట్‌ యార్డులు, మోడీ తెచ్చిన చట్టంలో ‘’ట్రేడ్‌ ఏరియా’’ నిర్వచనం లోకి రావు.దాంతో మార్కెటింగ్‌ వ్యవస్థ క్రమేపీ నిర్వీర్య మై, గత్యంతరం లేక రైతులు ఎమ్‌.ఎస్‌.పిలతో నిమిత్తం లేకుండా కార్పొరేట్‌ సంస్థలకు తక్కువ ధరలకు అమ్ముకోవలసిన దుర్గతి పడుతుంది.
మోడల్‌ ఎ.పి.యం.సి.యాక్ట్‌-2017, మోడల్‌ కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ యాక్ట్‌-2018లను అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు ఆర్థిక మద్దతు ఇవ్వబడుతుందని, దాంతో వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కలుగుతుందని ఆర్థిక మంత్రి లోక్‌సభలో నమ్మబలికారు. రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ రెండు మోడల్‌ చట్టాలను అమలు చేయటం అవసరమని నీతి అయోగ్‌ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేసి వుంది. కమీషన్‌ ఏజెంట్లు ఉండరని ప్రధానమంత్రి పెద్ద అబద్ధం చెబుతున్నారు. రైతుల ఉత్పత్తుల మార్కె టింగ్‌లో ‘’ఎగ్రిగేటర్లు’’ ఉంటారని చట్టంలో స్పష్టంగా పేర్కొ నబడిరది. కమీషన్‌ ఏజెంట్లు చేసే పనినే ‘ఎగ్రిగేటర్లు’చేస్తారు. ‘మోడల్‌ ఎ.పి.ఎం.సి.యాక్ట్‌-2017’లో రెగ్యు లేటెడ్‌, ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డు లనుఈ-నామ్‌తో అనుసంధానం చేయడం, ధాన్యం, గోధుమలు మున్నగు ఉత్పత్తులపైన 2శాతం మించ కుండా, కూరగాయలు, పండ్లు మొదలగు పచ్చి సరుకుపై 1శాతం మించకుండా మార్కెట్‌ సెస్సు వసూలు చేయవచ్చు. కమీషన్‌ ఏజెంట్లకు ధాన్యం మున్నగు వాటిపైన 2శాతం మించకుండా, కూర గాయలు మున్నగు వాటిపైన 4శాతం మించ కుండా కమీషన్‌ వసూలు చేసుకోవచ్చు. ఇందుకు పూర్తి భిన్నంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకు రావలసిన అగత్యంపై కేంద్రం నుండి ఇంతవరకు సమాధానం లేదు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టం-2020 రైతులకు నష్టం కలిగిం చేలా వుంది. రైతులకు సరైన రక్షణ కలిగించే అంశాలు ఇందులో లేవు. స్పాన్సర్‌తో విభేదాలు వచ్చినపుడు రైతు (ఆర్‌.డి.ఒ/జిల్లా కలెక్టర్‌ స్థాయిలో నడిచే వివాద పరిష్కార ప్రక్రియ సందర్భంగా) న్యాయవాది సహాయం తీసుకోడానికి వీల్లేదని ఆంక్షలు విధించడం అత్యంత దుర్మార్గం. సాధార ణంగా రైతాంగంలో ఎక్కువ శాతం మంది నిరక్షరా శ్యులు. స్పాన్సర్‌ తరపున హాజరయ్యే వారికి ఉన్నత విద్య, చట్టాలపట్ల అవగాహన,ప్రభుత్వ అధి కారులతో సత్‌సంబంధాలు వుంటాయి. కావున వారు చెప్పినట్లుగానే జరుగుతుంది. అంతే తప్ప రైతుల మాటలకు విలువ వుండదు. ’నిత్యావసర వస్తువుల సవరణ చట్టం’’లో నిల్వ పరిమితులను ఎత్తివేయడంవల్ల బడారిటైల్‌ సంస్థలు చాలా హెచ్చు పరిమాణంలో సరకులను నిల్వ చేసుకోగల అవ కాశం కల్గుతుంది. ఫలితంగా కృత్రిమ కొరతలు సృష్టించబడేందుకు ఆస్కారం వుంది. అంతేకాక గత 12మాసాలలో వస్తువు సగటు ధరపైన మరు సటి సంవత్సరం 50శాతానికి మిగలని ధరలకు అమ్ముకోవచ్చుననే అంశం ప్రైవేట్‌ రిటైల్‌ మాల్స్‌కు అత్యధిక అదనపు లాభాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలకు, రిలయన్స్‌ రిటైల్‌ మార్టులలో వినియోగ దారులకు అమ్మే ధరలకు పొంతన లేదు. రైతులకు ఎంతమాత్రం ఉపయోగం లేకపోగా వినియోగ దారులపైన పెనుభారం మోపబడుతుంది.
ఈ నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోపడ్డ చందంగా తయారయ్యే అవకాశం వుంది. సన్నకారు, చిన్న రైతులలో నూటికి 40మంది ప్రైవేట్‌ వడ్డీ వ్యాపా రుల దయాదాక్షిణ్యాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వుందని నాబార్డుసర్వే చెబుతోంది. రూ.1.5లక్షల లోపు పంట రుణాలను హామీతో నిమిత్తం లేకుండా రైతులకు, కౌలు రైతులకు ఇవ్వా లని రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు వున్నా సరిగ్గా అమలు కావడం లేదు. దేశవ్యాప్తంగా సాగుభూమి లో 10శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తు న్నారని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో ఇంకా అధిక శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. పంట రుణాలే కాక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అందవలసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ గానీ, ప్రభుత్వం నేరుగా అందించే నగదు బదిలీ సహాయం (పి.ఎం.కిసాన్‌ సమ్మాన్‌ యోజన) కానీ, పంటల బీమా పథకం వలన అందాల్సిన సహా యం గానీ కౌలు రైతులకు ఇప్పటికీ అందడం లేదు. చాలామంది రైతులలో కౌలుకిచ్చినట్లు కాగి తంపైన అంగీకరిస్తే, తమ భూయాజమాన్య హక్కుకు భంగం వాటిల్లుతుందనే భయాందోళనలు వుండ టం వలన కౌలు పత్రం పైన సంతకాలు చేయడం లేదు. అంతేకాక బ్యాంకు కౌలు రైతుకిచ్చే పంట రుణం అతను కట్టకపోతే తాను కట్టవలసి వస్తుం దనే భయం కూడా వుంది. వాస్తవంగా తాము కౌలు చేస్తున్న భూమి తమకు చెందాలని, కౌలు రైతులు కోరుకోవడం లేదు. కౌలు చేసుకోడానికి భూమి దొరికితే చాలనుకుంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నీతి ఆయోగ్‌ సంస్థ ‘’మోడల్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ లీజింగ్‌ యాక్ట్‌-2016’’ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. ఉత్తరప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలు ఈచట్టం అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చట్టా న్ని ఆమోదించాలని,రైతుకు తనభూమి పైన యాజ మాన్య హక్కుకు ఎట్టి పరిస్థితిలోనూ భంగం వాటి ల్లదని హామీ ఇస్తూ, అదే సమయంలో కౌలు రైతుకు గుర్తింపు ఇచ్చి,బ్యాంకు రుణం, ఇన్సూరెన్స్‌ సదు పాయం, ఇన్‌-పుట్‌ సబ్సిడి, నగదు బదిలీ మున్నగు ప్రయోజనాలు అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయవలసి వుంటుంది. రైతు సంఘాలు,కౌలు రైతు సంఘాలు, మోడల్‌ యాక్టు లోని అంశాలను రైతు లకు అవగాహన కల్పించి కౌలుపత్రాలపైన సంత కాలు చేయడంద్వారా కౌలు రైతులకు మేలు కలిగేం దుకు కృషి సల్పాలి.కేంద్ర ప్రభుత్వ నగదు బదిలీ (పి.యం.కిసాన్‌ సమ్మాన్‌) పథకంలో 5ఎకరాల లోపు భూయజమానులైన సన్నకారు, చిన్న రైతులకు మాత్రమే వార్షికంగా మూడు వాయిదాలలో రూ. 2,000 చొప్పున మొత్తంగా రూ.6,000నగదు బదిలీ జరుగుతుంది. వాస్తవానికి సాగు చేస్తున్న భూమిగల రైతుగాని లేక అనేక కష్టనష్టాలకోర్చి సాగు చేస్తూ వున్న కౌలురైతుకు ఈసహాయం అంద వలసిన అవసరం ఎంతైనావుంది. కాలియా పథ కం కింద ఒరిస్సా ప్రభుత్వం వార్షికంగా వ్యవసా య కూలీ కుటుంబాలకు రూ.12,500 చొప్పున, సన్నకారు,చిన్నరైతులు,కౌలు రైతులకు రూ.10,000 చొప్పున అందచేస్తున్నది. అదేపద్ధతిని ఇతర రాష్ట్రా లలో కూడా అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ఈ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే భూమి రికార్డులు సక్రమంగా వుండా లి. దేశంలో సుమారు 2 కోట్ల గిరిజన కుటుంబాలు వుండగా 20లక్షల మందికి మాత్రమే ఫారెస్ట్‌ అటవీ హక్కు పత్రాలు ఇవ్వబడ్డాయి. తగు సంఖ్యలో సిబ్బందిని నియమించి మహిళారైతుల పేర్లతో సహా భూ యజమానులపేర్లు, కౌలు రైతుల పేర్లతో సహా భూ రికార్డులను ఆధునీకరించవలసిన అవసరం ఎంతైనా వుంది.
వ్యవసాయ చట్టాలు -నిజా నిజాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసా య సంస్కరణల చట్టాలు రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు చెబుతు న్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వ్యవసా య చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఢల్లీి సరిహ ద్దుల్లో కొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రైతుల ప్రయోజనాల కోసమే మూడు కొత్త చట్టాలు చేశామని కేంద్రం చెబుతోంది. అవసరమైతే చట్టాల్లో సవరణలు చేస్తాం కానీ, వాటిని రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాల వల్ల రైతులకు లాభం ఎంత? కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? తదితర వివరాలను పరిశీలిద్దాం.
ప్రభుత్వం ఇటీవల మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలకు ఆమోదం తెలిపి, వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేందుకు తీసుకువచ్చిన ుష్ట్రవ ఖీaతీఎవతీం ూతీశీసబషవ ుతీaసవ aఅస జశీఎఎవతీషవ (ూతీశీఎశ్‌ీఱశీఅ aఅస ఖీaషఱశ్రీఱ్‌a్‌ఱశీఅ) Aష్‌-2020బీ ఒప్పంద వ్యవసాయం చేసుకునేందుకు రూపొం దించిన, నిత్యావసర వస్తువుల పరిమితిపై చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. దళారులకు అవకాశం కల్పించకుండా రైతుల ఆదాయాన్ని వృద్ది చేయాలనే లక్ష్యంతోనే ఈ చట్టాలు చేశామని కేంద్రం ప్రకటించింది.
రైతులకు ఎలా ఉపయోగం?
ఇంతకు ముందు వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల (Aూవీజ) నియమాల ప్రకారం రైతులు పంటలు అమ్ముకు నేవారు. వీటిని కొత్త చట్టాలు సడలించాయి. ఇప్పటి నుంచి ప్రభుత్వ మార్కెట్లలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తు లను అమ్ముకునేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. దీంతోపాటు ఒప్పంద వ్యవసాయానికి సంబంధిం చిన నియమ,నిబంధనల ద్వారా చట్టబద్దత కల్పిం చారు. వ్యవసాయ ఉత్పత్తులపై స్టాక్‌ పరిమి తులను తొలగించేందుకు విధానాన్ని రూపొందించారు. పంటలు ఎక్కువగా పండినప్పుడు వ్యాపారులు రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ ఉత్ప త్తుల మార్కెట్లలోకి వచ్చేందుకు కొత్త చట్టాలు వీలు కల్పిస్తున్నాయని రైతులు భయపడుతున్నారు. ఇది గుత్తాధిపత్యాన్ని సృష్టించగలదని,ఫలితంగా పంట ల ధరలను ఆయాకంపెనీలు తగ్గించడానికి అవకాశం కలుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Aూవీజ మార్కెట్లను 1960లలో దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. రైతులకు మెరుగైన మద్దతు ధరలు కల్పించాలనేది వీటిలక్ష్యం. దీని ప్రకారం రైతులు స్థానిక మార్కెట్‌ యార్డులలోని లైసెన్స్‌ పొందిన మధ్యవర్తులకు మాత్రమే పంట ఉత్పత్తులను అమ్మాల్సి ఉంటుంది. అంటే.. బహి రంగ మార్కెట్లో కాకుండా,తమకు దగ్గర్లో ఉన్న మార్కెట్‌ యార్డుల్లోనే రైతులు పంటలు అమ్ము కోవాలి. ఈ పరిమితుల వల్ల రైతులు తమ పంటను బహిరంగ మార్కెట్లలో అమ్ముకునేందుకు అడ్డంకు లు ఏర్పడ్డాయి. దీంతోపాటు కొన్ని దశాబ్దాలుగా ఈ కమిటీల ద్వారానే పంట ఉత్పత్తులు అమ్మాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ మార్కెట్లే రైతులు తమ ఉత్పత్తులకు సరిపోయే ధరను పొందడానికి అవరోధాలుగా మారాయి. ఏయే సీజన్లో, ఏయే పంటలకు ఎంత ధర పలుకుతుందనేది ప్రభుత్వం చేతుల నుంచి మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లింది. దీంతో దళారులు చెప్పిన ధరకే పంటలను అమ్ము కునే గతి రైతులకు పట్టింది. Aూవీజలు ప్రధానంగా కమిషన్‌ ఆధారిత వ్యవస్థ పై ఆధారపడి ఉంటాయి. లైసెన్స్‌ పొందిన మధ్యవర్తులు మాత్రమే ఈ మార్కెట్లలో రైతుల పంటలను కొనాలి. ఈ మధ్య వర్తుల్లో కమీషన్‌ ఏజెంట్లు,హోల్‌సేలర్స్‌, ట్రాన్స్‌ పోర్టర్స్‌, రైల్వే ఏజెంట్లు,స్టోరేజ్‌ ఏజెంట్లు ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాలు తరువాత ఇవి ఱఅ్‌వతీషశీఅఅవష్‌వస శీశ్రీఱస్త్రశీజూశీశ్రీఱవంలకు దారితీశాయి. కొన్ని వ్యాపార వర్గాలే మార్కెట్‌ యార్డులపై ఆధిపత్యం చూపడం మొదలైంది. స్థానిక మార్కెట్లలో వారు చెప్పిందే వేదం అనేంతగా పరిస్థితులు దిగజా రాయి. ఇందుకు ఒక ఉదాహరణ సైతం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ ఉంది.2010 డిసెంబరులో…ఈ మార్కెట్‌ నుంచి జరిగిన వ్యాపారంలో దాదాపు 20శాతం ఒకే ఒక్క దళారీ సంస్థ ద్వారా జరిగిం దని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా తేల్చింది. ఇలాంటి సంస్థలన్నీ కలిసి మార్కెట్‌ యార్డులకు వచ్చే రైతులకు మద్దతు ధర రాకుండా ముందుగానే ప్రణాళిక వేసుకొని వ్యాపారాన్ని పంచుకుం టున్నాయని తేలింది. ఇలాంటి దళారుల వల్ల రైతు అందుకున్న ధరకు, వినియోగదారులు కొనే ధరకు మధ్య తేడా పెరిగిపోతుంది.లాభం మాత్రం ఎప్పుడైనా మధ్యవర్తుల జేబుల్లోకే వెళ్తుంది. ప్రభుత్వ మార్కెట్‌ యార్డులు కొంతమంది వ్యాపారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లాయని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (చీa్‌ఱశీఅaశ్రీ జశీబఅషఱశ్రీ శీట Aజూజూశ్రీఱవస జుషశీఅశీఎఱష Rవంవaతీషష్ట్ర)2012లో వెల్లడిరచిన నివేదికలో తెలిపింది. రైతులు ప్రభుత్వ మార్కెట్‌ యార్డుల్లోనే కాకుండా బహిరంగ మార్కె ట్లలో,ఇతర రాష్ట్రాల్లో కూడా పంటలు అమ్ముకు నేందుకు కొత్తచట్టం అవకాశం కల్పించింది.దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడే అమ్ముకునే అవకాశం కలుగుతుంది. చట్టాలపై రైతులకు ఎందుకు నమ్మకం కలగడం లేదు? క్రమబద్ధీకరించని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లలోకి పెద్ద సంస్థలు, ప్రైవేటు వ్యాపారులు ప్రవేశిస్తే..వారితో బేరమాడే శక్తిని కోల్పోతామని రైతులు భయపడుతున్నారు.దీంతోపాటు కొత్త చట్టం ప్రకారం వ్యాపారులు ఎలాంటి ఫీజులూ చెల్లించా ల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రైవేట్‌ వ్యాపారులు లావాదేవీ లు చేయడం వల్ల సాంప్రదాయ మార్కెట్‌ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందేమోనని రైతులు భయపడుతు న్నారు. గత కొన్ని సంవత్సరాలలో చాలా రాజకీయ పార్టీలు ఇలాంటి సంస్కరణలు చేసేందుకు ముం దుకు వచ్చాయి. కానీ అందులో రాజకీయ కోణమే ఉందని స్పష్టంగా అర్థమైంది. సాంప్రదాయ Aూవీజమార్కెట్లు కొన్ని రాష్ట్రాలకు ఆదాయ వనరు లుగా ఉన్నాయి. ఉదాహరణకు పంజాబ్‌లో Aూవీజల్లో గోధుమల కొనుగోలుపై ఆరు శాతం ఫీజు(మార్కెట్‌ఫీజు,గ్రామీణాభివృద్ధి ఫీజు-మూడు శాతం చొప్పున)ను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ధాన్యంపై ఆరు శాతం, బాస్మతి బియ్యంపై 4.25 శాతం ఫీజుఉంటుంది. పంజాబ్‌లో సుమారు 90 శాతం గోధుమలు, వరి పంటలను ఈ మార్కెట్ల లోనే కనీస మద్దతు ధరల (%వీూూం%)కు కొను గోలు చేస్తారు. అందువల్ల కొత్తచట్టాలతో ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ప్రభుత్వంతో పాటు మార్కె ట్‌ కమిటీలపై ఆధారపడి వ్యాపారాలు చేసే మధ్య వర్తులు,రైతులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం చివరికి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆపేస్తుందేమోనని, ప్రైవేటు వ్యాపారులకే పంటలు అమ్ముకునే రోజులు వస్తాయేమోనని రైతులు భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ను ప్రతి సంవత్సరం ప్రకటిస్తోంది.
కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లు ఏంటి?
అన్ని ప్రధాన పంటల ఉత్పత్తులను ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చట్టప్రకారం హామీ ఉండాలని, అలాంటి హామీ ఇచ్చే చట్టాన్ని కేంద్రం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. దీని ప్రకారం ప్రైవేటు వ్యాపారులు రైతుల పంటలను కనీస మద్దతు ధరకు, లేదా అంతకంటే ఎక్కువకు కొనాలనే నియమం ఉంటుంది.వీూూకి తక్కువగా ఉండే ఏదైనా వ్యవ సాయ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించేలా చట్టం ఉండాలని రైతులు కోరుతున్నారు.
ఎవరికి ఉపయోగం?
వ్యవసాయ ఉత్పత్తులను ఫుడ్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఖీజI)ద్వారా ప్రభుత్వం కొను గోలు చేస్తోంది.దేశ అవసరాలకు సరిపోయే ఉత్పత్తులను ఎఫ్‌సీఐ సేకరించి,నిల్వ చేస్తోంది. దేశవ్యాప్తంగా అతి తక్కువమంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు నిరూపిస్తున్నాయి. వరిసాగు చేసే రైతుల్లో 13.5శాతం,గోధుమలు పండిరచే రైతుల్లో 16.2శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరను పొందుతున్నారని నేషనల్‌ శాంపిల్‌ సర్వే చెబుతోంది.
కనీస మద్దతు ధరపై చట్టాలు చేయలేమా?
కనీస మద్దతు ధరకోసం చేసే చట్టం వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితమవుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు…రైతుల వద్ద మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసే ప్రైవేట్‌ వ్యాపారి,తన లాభాన్ని చూసుకొని వాటిని వినియోగ దారులకు అందించేందుకు ఎక్కువ ధరలను నిర్దేశిం చాల్సి వస్తుంది. దీంతోపాటు మద్దతు ధరల విధా నాన్ని చట్టబద్దం చేస్తే.. బహిరంగ మార్కెట్లో కొను గోళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిపంట ఉత్పత్తుల ఎగుమ తులపై కూడా ప్రభావం చూపు తుంది. కొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో, విదేశాల్లో పంట ఉత్పత్తులధరలు మద్దతు ధరలకంటే తక్కువ గా ఉండే అవ కాశంఉంది. ఇలాంటప్పుడు వ్యాపా రులు పంటలను ఎక్కువ ధరలు పెట్టి కొని, తక్కువ లాభాలకు ఎగుమతి చేయలేరు. ఇదే సందర్భంలో దేశీయ మార్కెట్‌లో కూడా ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరలకు పంటలను కొనడానికి ముందుకు రారు. దీనివల్ల ప్రభుత్వం లేదా ఎఫ్‌సిఐ మాత్రమే మార్కెట్లో పంటలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో పాటు ఎక్కువ మద్దతు ధర వచ్చే పంటలనే రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీనివల్ల ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల పంటల సాగు తగ్గిపోతుంది. ఫలితంగా నూనె గింజలు వంటి అనేక ఆహార ఉత్పత్తులను భారత దేశం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడు తుంది. సంస్కరణల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రైతుల అభ్యం తరాలను పరిగణనలోకి తీసుకొని, చట్టాలకు కొన్ని సవరణలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కనీస మద్దతు ధరకు లిఖిత పూర్వక హామీ ఇస్తామని కేంద్ర మంత్రులు సైతం చెప్పారు. రైతులకు మెరుగైన ధర లభిస్తుందని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ధర-లోటు (జూతీఱషవ-సవటఱషఱవఅషవ) విధా నాన్ని అమలు చేస్తే మంచిదని కొంతమంది నిపు ణులు అభిప్రాయపడ్డారు.
ఈ వ్యవస్థను మధ్య ప్రదేశ్‌లో ప్రయ త్నించారు. దీని ప్రకారం..మార్కె ట్‌ ధరకు, కనీస మద్దతుధరకు మధ్య ఉండే లోటును ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. కాంట్రాక్ట్‌ వ్యవసా యంలో రైతుల హక్కులను కాపాడేందుకు చట్టపరంగా అద నపు రక్షణ కల్పించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రిజిస్ట్రేషన్‌ విధానం ద్వారా ప్రైవేటు మార్కెట్లు, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వ ర్యంలో పనిచేసే నోటిఫైడ్‌ మార్కెట్ల మధ్య సమానత్వం తీసు కొస్తామని తెలిపింది.నోటిఫైడ్‌ మార్కె ట్లలో వర్తించే సెస్‌, సర్వీస్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభు త్వాలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తా మని ప్రకటిం చింది. కాంట్రాక్ట్‌-ఫార్మింగ్‌ చట్టం ప్రకారం అగ్రి బిజినెస్‌ స్పాన్సర్లు రైతుల భూమిని ఇతరుల పేరుకు ట్రాన్స్‌ఫర్‌ చేయడం,అమ్మడం,లీజుకు ఇవ్వడం, తనఖా పెట్టడం వంటివి నిషేధించారు. కాంట్రా క్టు వ్యవసాయంలో రైతులు, స్పాన్సర్ల మధ్య ఏర్పడే భేదాభిప్రాయాల కారణంగా రైతుల భూమిని జప్తు చేయలేరని ప్రభుత్వం పేర్కొంది. పంటల వ్యర్థా లను కాల్చడంవల్ల ఢల్లీి,చీజR పరి సర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోందని, అందువల్ల వ్యర్థాలను దహనంచేసే రైతులకు ఒక సంవత్సరం జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అక్టోబర్లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. వ్యర్థా లను దహనం చేయకుండా ఇతర అవసరాలకు కొనుగోలు చేసేలా చొరవ చూపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకక్వింటాల్‌ వ్యర్థాలకు రూ. 200 చొప్పున చెల్లించి, వాటిని తరలించాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్‌కు రూ.100 చొప్పున చెల్లించేందుకు ముందుకు రావాలని కేంద్రా నికి సుప్రీంకోర్టు సూచిం చింది. ఈసమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది.– జిఎన్‌వి సతీష్‌

కరోనా కట్టడిలో ఆచార సంప్రదాయాలూ మేలే

భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి.

మన దేశం సంస్కృతి,సంప్రదాయాలు, ఆచా రాలకు పుట్టినిల్లు. పూర్వం నుంచి మన వాళ్లు పాటించిన ఆచార సంప్రదాయాల వెనుక మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యా లున్నాయి. పూర్వీకులు ఆచరించిన సాంప్ర దాయక, ఆధ్యాత్మిక ఆచారాల చాటున వెనుకటి మర్యాద మన్ననలే కాదు అవి ఆరోగ్యంతో కూడుకున్నవి. భారతీయ సంప్రదాయాచారాలను కొందరు మూఢ నమ్మకంగా కొట్టి పారేస్తారు. దాని మాటున శాస్త్రీయ విజ్ఞానం ఉందని ఆలోచించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. తీరిక లేని యువతతో పాటు పెద్దలు కూడా నాటి ఆహారపు అలవాట్లు అతిథి మర్యాదలు వంటి పురాతనాచారాలను అవలంబించడంపై శ్రద్ధపెట్టకపోవడంతో అవి కనుమరు గవుతున్నాయి. కరోనా లాంటి మహమ్మారులు సృష్టిస్తున్న కల్లోల సందర్భాల నేపథ్యంలో పూర్వాచారాల అమలుపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఆచారాలలో దాగున్న శాస్త్రీయత ఆధారంగా పునరాలోచించి తిరిగి ఆచరిస్తే ఫలితముంటుందని ఆయుర్వేద వైద్యులు, ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు. పెళ్లిళ్లు,వేడుకలు, పండుగలు, వాస్తు సంబంధ విషయాలలో తరచుగా కొన్ని పూర్వాచారాలు గోచరిస్తుంటాయి.
సంప్రదాయక ఆరోగ్య సూత్రాలు
వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు మాత్రమే నేడు అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి వస్తోంది కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీ రియా సోకకుండా యాంటీ సెప్టిక్‌, యాంటీ బయాటిక్‌ గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్ల లోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే…ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని చెబుతారు. అమ్మవారు (వైరల్‌ ఇన్ఫెక్షన్‌) సోకితే పిల్లలకు క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం. మన ఇంటికి అతిథులైనా, బంధువులైనా వచ్చారంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇచ్చి స్వాగతించడం ఆనవాయితీ. బయటి నుంచి వస్తారు గనుక కాళ్లు కడుక్కుని లోపలికి రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిములు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే వండిన భోజనం వెంటనే తినమని పెద్దలు సూచించేవారు. చల్లారిన పదార్ధంలో క్రిములు చేరతాయని. అప్పట్లో ఆహార పదార్థాల తయారీకి మట్టి,ఇత్తడి,రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. వాటివల్ల పోషకాల నిల్వ పుష్కలంగా సమకూరుతుంది. కాలుష్యం బారిన పడే అవకాశమే లేదు. పర్వదినాల్లో ఇంటి గుమ్మాలకు తప్పనిసరిగా తోరణాలు కట్టేవారు. గతంలో ఇళ్లలో సూక్ష్మ క్రిముల తాకిడికి నివారణగా సాంబ్రాణి పొగ వేసేవారు. హిందూ సంప్రదాయ పండుగల్లో దర్శనమిచ్చే రకరకాల పిండి వంటకాల ప్రత్యేకతల వెనక కొన్ని ఆరోగ్య రహస్యాలు న్నాయి. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున పచ్చడిలో, శ్రీరామనవమి నాటి బెల్లం పానకం లోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దసరా, సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాల్లో వాడే బెల్లం, నువ్వులు, వాము వంటివి దీని ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బతికుంటే బలుసాకు తినొచ్చు నన్న సామెత ఊరకే పుట్టలేదు. పొలాల గట్లమీద, చిత్తడినేలల్లో బలుసాకు అరుదుగా లభిస్తుంది. దీన్ని పల్లెల్లో కొందరు వినాయక చవితి సమయంలో పులుసుగా, పప్పుతోనో వండుకుని తినడం అలవాటు. దీన్ని పచ్చడిగా తింటే అతిసారం తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి తోడ్పడుతుంది. ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు శరీరంలో వేడిని తొలగించి ఒత్తిడిని జయిస్తుంది. పూర్వం ఆదివాసులలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. ఏ పద్ధతి పాటిం చిన మానవతా దృక్పథంతో కూడి ఉండేవి. ఆ కాలంలో జనసమూహంలో ఎవరైనా తుమ్మినా అపచారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామాజిక దూరాలు పాటించేవారు. అలాగే అశుభాలకు సంబంధించిన ఆచారాల్లోనూ అదే జాగ్రత్త కనిపించేది. క్షౌరశాలకు, అంత్య క్రియలకు వెళ్లి వస్తే దేన్నీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం. వ్యాధులు సంక్రమించకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించేవారు. పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి. మైల, అంటు వంటివి పాటించడంతో ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. వాటిని మూఢాచారాలుగా మార్చేసిన కొందరి వల్ల అటువంటి పద్ధతులపై విరక్తి, అనాసక్తి ఏర్పడ్డాయి. అందులోని శాస్త్రీయతను ఆరోగ్య సూత్రాలను కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చలేని విధంగా ఆనాటి సంప్రదాయాలను పాటించడం, అనుసరించడం నేడు చాలా అవసరం.
ఇవీ ఆరోగ్యకారకాలే
వేకువ జామునే ‘సూర్యనమస్కారాలు’ చేయడం వల్ల శారీరక దృఢత్వం చేకూరటమే గాక శరీరానికి కాంతి కిరణాలు సోకి విటమిన్‌ ‘డి’ సమకూరుతుంది. వ్యక్తులు తారసపడితే చేతులు జోడిరచి నమస్కరించడం ఎంతో ఆరోగ్యకరం. నమస్కరించడంలో రెండు చేతుల వేళ్లు కలిసిపోయి ఆక్యుప్రెషర్‌ జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరూ మెరుగవుతుంది. నుదుటన కుంకుమ బొట్టు ధరించడం హైందవ ఆధ్యాత్మికతకు ప్రతీకనే గాక నుదురులోని నాడులు ఉత్తేజితమై ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రతతో కూడిన మానసికోల్లాసం ఉట్టిపడుతుంది. పీయూష గ్రంథి ప్రేరేపించబడుతుంది. దీంతో రక్తపోటు, ఒత్తిడి, ఆందోళన వంటివి క్రమంగా తగ్గుతాయి. గుడిలో దైవాన్ని ప్రసన్నం చేసుకునే ముందు గంటలు కొట్టడం ఆధ్యాత్మి కాచారం. గంట మోగించడంతో ఆ ప్రాంతం లో ఓంకార ధ్వని విస్తరించి గాలిలో ఉండే (సూక్ష్మ) క్రిములు నశిస్తాయి. సద్దుల బతుకమ్మ సంస్కృతిలో ఆడపడుచులు సత్తుపిండి పంచిపెట్టడం వెనుక పోషకాల లేమి ఉండ కూడదనే ఆచారం వాడుకలో ఉంది. వీటిని మనం మరిచిపోయాం.ఇంటిలోకి విస్తారంగా గాలి, ధారాళంగా వెలుతురు ప్రవేశించేందుకు వాస్తు పండితులు తగు ప్రణాళికను సూచిస్తుంటారు. కిటికీల ద్వారా చల్లని గాలి (ఆమ్లజని) ప్రవేశిస్తూ, వెంటిలేటర్ల ద్వారా వేడి గాలి (బొగ్గు పులుసు వాయువు) బయటికి వెళ్ళడం వల్ల చల్లటి ఆహ్లాద వాతావరణం. చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య కిరణాలు గదులలోకి ప్రసరిస్తే క్రిమి కీటకాలు నశిస్తాయి. పెద్దలు సూచించిన ‘చద్దన్నం’ శరీరానికి చలువ కలిగించడమే గాక కడుపులో అల్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. నేలపై చాప పరిచి కూర్చోని భోంచేయడం’ మన సదాచారం. ఇలా చేయడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరిగి, అజీర్తి సమస్యలు సమసిపోతాయి. భోంచేసేటప్పుడు కూర్చోవడానికి బాసుపీటలు ఉపయోగిస్తే కాళ్ల నొప్పులు రావు. అరిటాకు భోజనం చాలా శ్రేష్టమైనది. అరిటాకు ద్వారా ఆహారంలోని పోషకాలు యధాతధంగా శరీరానికి చేరతాయి. ఇది కాలుష్యరహితమైనదిగా గుర్తించాలి. పూర్వం రోజుల్లో భోజనం చేయడానికి మోదుగాకులు లేదా పారెటాకులతో చేసిన విస్తరాకులను వాడేవారు. అప్పట్లో మట్టి, రాగి, కంచు పాత్రల్లో భోజనం చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా కంచు పళ్ళెంలో ఆహారం భుజిస్తే జీర్ణశక్తి, మేధోశక్తి పెరుగుతుంది. ఉదరంలో ఆమ్లత్వం గాఢత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆ తరం అలవాట్లను కొంతమేరకైనా ఒంటపట్టించుకోవాల్సిందే. విలువలతో, శాస్త్రీయతతో కూడిన మరిన్ని ఆచారాలపై భవిష్యత్తరాలకు తెలిసేలా ‘పాఠ్యాంశం’ గా ప్రవేశ పెడితే సమాజ ఆరోగ్యం, నైతిక విలువలు పెంపొందుతాయి.- గుమ్మడి లక్ష్మినారాయణ

ఆదివాసులకు పోడు భూములు అందని ద్రాక్షేనా

’పోడు భూముల సమస్య ఎక్కడ లేకుం డా ఉంది?ఖమ్మంలో ఉంది. వరంగల్‌లోఉంది. నిజామాబాద్‌లో ఉంది. 60ఏండ్లుగా ఈపెద్ద మను షులు దీనికి పరిష్కారం చూపలేదు. మేము కొంత వరకు చేశాం. కానీ వచ్చే టర్మ్‌లో ఈ పోడు భూ ములు, గిరిజన భూముల స్టోరీ ఎక్కడోకాడ అయి పోవాలి. అడవుల నరికివేత ఆగాలి. సాగు చేసుకున్న వాటికి హక్కులు రావాలి. తప్పకుండా ఈ పోడు భూములు దున్నుకునే వారికి పట్టాలి ప్పించి వారి హక్కులు కాపాడతాం. నేనే వచ్చి ఆ పని చేయిస్తా’’. ఇది 2018 డిసెంబర్‌లో కుమ్రం భీం-ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్బంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ. కానీ జరుగుతున్నదేమిటి?
మోసమంటే తెలియని అమాయక గిరిజ నులకు సొంత ఆస్తి అంటూ ఉందంటే అవి పోడు భూములు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ భూములపై పాలకుల కన్ను పడిరది. మోకాలికి బోడు గుండుకు ముడిపెట్టినట్టు అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని, దాన్ని పెంచడానికి పోడు భూముల్లో మొక్కలు నాటడానికి అటవీ శాఖాధికారులు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ అధికారంలోకొచ్చాక ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వి గిరిజను లకు వెళ్లనీయకుండా చేస్తోంది. ఐదారేండ్లుగా పోడు భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారం భంలో అటవీ అధికారులు పోడు భూముల్లో సాగును అడ్డుకోవడం, గిరిజనులు ప్రతిఘటించడం జరుగుతోంది. కానీ రెండేండ్లుగా పోడు భూముల వ్యవహారం తారా స్థాయికి చేరింది. తమ భూము ల్లోకి వచ్చిన అటవీ శాఖాధికారులను గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
పోడుతోనే అటవీ విస్తీర్ణం తగ్గుతోందా?
గిరిజనులు పోడు వ్యవసాయం చేయ డంతో అడవులు తగ్గిపోతున్నాయని ప్రచారం ఉంది. కానీ ఇందులో ఏమాత్రమూ వాస్తవం లేదు. విసిరేసినట్టు ఉండే గిరిజనగూడాల్లో పదుల సంఖ్య లోనే ఆవాసాలుంటాయి. వారు మహా అయితే పది ఇరవై ఎకరాల్లో పోడు సాగు చేస్తుంటారు. కానీ వారు ఆ ప్రాంతంలో ఉండడం చేత అటవీ సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంటారు. కానీ పాలకులు గిరిజనులతోనే అడవంతా నాశనమవు తున్నట్టు వారిపై నిందలు మోపుతుంటారు. అనాదిగా అటవీ సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు అటవీ ఫలాలు అను భవిస్తూనే అడవులను సంరక్షిస్తున్నారనేది ముమ్మాటికీ వాస్తవం.
కలప స్మగ్లర్ల సంగతేంటి?
అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గిపో తోందన్నది జగమెరిగిన సత్యం. అయితే దీనికి ప్రధాన కారణం కలప రవాణానే అనేది అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కనబెట్టి పోడే కారణమని అసత్య ప్రచారం చేస్తోంది. అటవీ విస్తీర్ణం పెంచడానికి పోడు భూ ముల్లో మొక్కలు నాటడానికి యత్నిస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలప రవాణా చేస్తూ పట్టుబడిన ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఈవార్తలు లేకుండా దినపత్రికలు వెలువడవని రోజుండదంటే అతిశ యోక్తి కాదు. దీనికి రాజకీయ అండదండలు, ఇంటి దొంగల సహకారం పుష్కలంగా ఉంటోంది. ఇలా వాస్తవాలను మరుగునపడేసి ప్రభుత్వాలు అటవీ విస్తీర్ణం పెంచడానికి గిరిజనులనే సమిధులుగా చేయడం ఆక్షేపణీయం. ఇప్పటికైనా గిరిజనులు కొండకోనల్లో ఉండడంతోనే అడవులు రక్షింపబడ తాయని తెలుసుకోవాలి. వారికి న్యాయం బద్ధంగా పోడు భూములకు హక్కు పత్రాలిచ్చి బతుక్కు భరోసా కల్పించాలి. ఈ విషయంలో వామపక్షాలు నిరంతరంగా పోరాడుతూనే ఉన్నాయి.
– రాపర్తి దత్తాత్రి

ఆదివాసుల ఆపన్న హస్తం సమత సంస్థ

విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పోటీపడి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే శక్తి ఎన్‌జీఓ లకు ఉందని సమత నిరూపిస్తోంది. విశాల మైన సామాజిక దృక్పథంతో కరోనావ్యాప్తి లాక్‌డైన్‌ సమయంలో అన్నార్తులకు అండగా నిలిచింది. నిబద్ధతతో సంక్షేమ కోణంలో సేవ లందిస్తున్న సమత సేవలను అటు విశాఖ స్మార్ట్‌ సిటీ మురికివాడ ప్రజలు ఇటు గిరిజ నులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బొర్రా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు అధ్యక్ష తన, జరిగిన పంపిణీ బహిరంగసభకు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ రెబ్బప్రగాడ రవి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రజలు మహ మ్మారి కరోనావల్ల టూరిజం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కుటుం బాలు దయ నందన పరిస్థితులను ఎదుర్కొంటు న్నారన్నారు. ఈరకంగా నేను ఈసేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. సర్పంచ్‌ జన్ని అప్పారావు మాట్లా డుతూ ఈకరోనా సమయంలో సమత సేవలు మరువలేనిది అంటూ అభినందన తెలిపారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని ఎంతో మంది ప్రజలు ఉపాధి లేక ఆకలితో ఇబ్బంది పడుతున్న సమయంలో సమత ముందుకు వచ్చి పేద ప్రజల ఆకలి తీర్చిడం వారికి రుణపడి ఉంటామన్నారు. ఈ పంచాయితీలో సుమారుగా 500 మంది పేద తెల్లరేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల వారికి సుమా రుగా 1800 వందల రూపా యలు విలువ చేసే నిత్యావసర వస్తువులు ఒక్కొకరికి పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగాబొర్రా పంచాయితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు 14 గిరిజనగ్రామాల తరు పున సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బా ప్రగడ రవికి పుష్పగుచ్ఛాలిచ్చి ఘనంగా సత్క రించారు. తర్వాత మైనింగ్‌ పోరాట యోధులుగెమ్మెల దేవకుమర్‌, స్వర్గీయ దోనేరు రాము సతీమణి దొనేరు పోల్లు గార్లను రవిగారి చేతుల మీదగా ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో గ్రామప్రజలు, వార్డ్‌ నెంబర్స్‌ గైడ్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొ న్నారు. విశాఖనగంర మురికివాడ ప్రాంతాలు, జిల్లా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో సుమారు రూ.50లక్షలతో సుమారు మూడు వేల మంది కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.
సమతకు కృతజ్ఞతలు -జన్ని అప్పారావు, సర్పంచ్‌,బొర్రా పంచాయితీ
గిరిజన పేదప్రజల ఆకలి తీర్చే నిత్యావసర సరకులు ఐదువందల కుటుంబాలకు పంపిణీ చేసిన సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవికి కృతజ్ఞతలు.యావత్‌ భారతదేశ ఆదివాసీ తెగలన్నీ సమతకు రుణపడి ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తమ ప్రాంతాల్లో ఉన్న వనరులు పరిరక్షణకు సమత తీర్పు మాకు వజ్రాయుధం లాంటి తీర్పుకు రవి చేసిన పోరాటం గిరిజన భావితరాలకు స్పూర్తిదాయకం.
కందుకూరి సతీష్‌ కుమార్‌

ప్రకృతి సహజీవనమే పర్యావరణ పరిరక్షణ

పంచభూతాత్మకమైన అనంత సృష్టిలో మానవుడు ఒకభాగం, అంతే కానీ తానే సర్వస్వం కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేయా లనే ఆలోచనలు వినాశనానికి దారి తీస్తాయి అనే విషయాన్ని మనం చరిత్ర నుండి గ్రహించవచ్చు. పంచభూ తాత్మకమైన ప్రకృతిలో విలీనం కానీ ఏ పదార్థమైనా అది పర్యావరణానికి సమస్యగా మారుతుంది. ఈరోజు మానవుడు తన అవసరాల కోసం కొండల్ని గుట్టల్ని తొలిచేసే సమతలం చేస్తూ అడవుల అన్నిం టిని సమూలంగా నరికివేస్తూ భూమాతను సంపదవిహీనంగా చేస్తున్నాడు, భూగర్భ జల ప్రవాహాలను వాటి సహజ మార్గాలను మార్చివేసి తనకు అనుగుణంగా మళ్ళించి వేస్తున్నాడు. భూగర్భ జలాలను అడు గంటించేస్తున్నారు దాని కారణంగా ఈ రోజున మంచినీటి కటకట ఏర్పడుతున్నది. అత్యంత విస్తృతమైన ప్రకృతి వనరులను తన గుప్పెట్లో బంధింప చూస్తు న్నాడు. తనకు తానే సర్వశక్తిమంతుడైన సృష్టి స్థితి లయ కారకుడు అని భావించు కుంటున్నాడు. ఇది ప్రకృతి ప్రకోపించనంత కాలం సాగుతుంది ఎప్పుడైతే ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుందో అప్పుడు సృష్టిలోని ఈ మానవమాత్రుడిన్ని ఎవరు రక్షించగలరు? అందుకే భారత దేశంలో ఏకాత్మతా అనుభూతి చెందే జీవనము రచించబడిరది. ప్రకృతి అనుకూల జీవన విధానంతో ప్రకృతిని కాపాడు కుంటూ వస్తోంది. దాని నుంచి బయట పడటం దానికి విరుద్ధంగా వ్యవహరించటం అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈరోజు కాలుష్యం కానీ పంచ భూతాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే అన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చెయ్యాలని నినాదం చేస్తున్నారు. కానీ ప్రకృతి అనుకూలంగా జీవించాలనే మాట చెప్పడం లేదు. ప్రకృతికి అనుకూలమైన జీవనం లోకి మానవుడు ఎప్పటివరకైతే మారడో అప్పటి వరకు ఏవో సమస్యలు వచ్చి పడుతూనే ఉంటా యి. ఈరోజు జల సమస్య చాలా తీవ్రంగా ఉంది నదులు సజీవనదులుగా కనబడటం లేదు. ద్వాపర యుగ అంతంనుండి త్రివేణి సంగమం లోని సరస్వతి నది లుప్తం కావటం ప్రారంభమై ఇప్పుడు అంతర్వాహినిగా కనబ డుతున్నది ఇట్లా అనేక నదులు ఆ దిశలో ఉన్నా యి కాబట్టి నదులను,వాగులు,వంకలను కాపాడు కోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దిశలో చేయవలసిన ప్రయత్నం అందరూ చేయాలి. అందుకే మనం ప్రతి రోజు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచి స్తుంటాం. అది మన జీవితంలో ఒక భాగము. అదే పాశ్చాత్య దేశాలలో సంవ త్సరంలో ఒకరోజు పర్యావరణ పరిరక్షణ అనే నినాదం చేస్తారు. పర్యావరణ విద్వంసం చెయ్యి దాటిపోయే పరిస్థితులలో ప్రపంచ దేశాలు 1974 వ సంవత్సరం ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసి ప్రతి సంవ త్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమము చేస్తుంది. కరోనా ప్రపంచంలో విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో 47వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం, ప్రకృతి తో సంబంధాలనుతిరిగి పునరుద్ధరించు కోవటంపై దృష్టి కేంద్రీ కరించబడిరది. 2021-2030 దశాబ్దం యుఎన్‌ లాంఛనం గా వాతావరణ సంక్షోభంపై పోరాడటానికి, ఒక మిలియన్‌ జాతుల నష్టాన్ని నివారించు కోవటానికి, మరియు ఆహారభద్రత, నీటి భద్రతా,జీవనోపాధిని పెంచడానికి క్షీణించిన నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణనులక్ష్యంగా పెట్టుకొన్నది. మనదేశంలో కూడా గడిచినరెండు దశాబ్దాల నుండి ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించి ఇప్పుడుదేశ వ్యాప్తంగా ఆచరణ లోకి తీసుకోని వస్తున్నది.కొద్దీ సంవత్సరాల పూర్వం దేశ వ్యాప్తంగా విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగింది దానితో గో ఆధారిత వ్యవ సాయం ఊపు అందుకొంది,దాని కొనసాగింపు గానే, ఈ మధ్యనే భూమిసంరక్షణ, భూమిసు పోషణ,దిశలో పెద్దఎత్తున దేశమంతా ఒక ఉద్యమం ప్రారంభమైనది. ఇట్లా మన దేశంలో అనేక ప్రయత్నాలు దేశవ్యాప్తంగా మొదలైయి నాయి. నీటి సంరక్షణపై అవగాహన పెంచటా నికి ఆ నీటి వనరులను కాపాడు కోవటానికి ప్రజలను జాగృతం చేయటానికి ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్‌ ‘రివర్స్‌ ఆఫ్‌ ఇండియా’ అనే మ్యూజిక్‌ వీడియో ను విడుదల చేసింది. భారతదేశంలోని 51 నదులుపేర్ల ఆధారంగా ఆ వీడియో తయారు చేయబడిరది. ఆ వీడియోలో పెరుగుతున్న జనాభాపై,నదులను కాపాడుకోవటంపై, నీటి వనరుల దోపిడీ దాని పర్యవసానాలపై, కథనం సాగుతుంది. పర్యా వరణ వ్యవస్థల విస్మరణపై హెచ్చరిస్తుంది. ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనలను చేయటానికి కేంద్రం యొక్క నిబద్ధతను హైలైట్‌ చేస్తుంది.
పర్యావరణానికి తగిన గౌరవం, విలువ ఇస్తున్నామా?

ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే పేరుతో ఈ సంవత్సరం దీనిని ‘‘పర్యావరణవ్యవస్థ పునరుద్ధరణ ‘‘(జుషశీంవర్‌వఎ Rవర్‌శీతీa్‌ఱశీఅ) అన్ననినాదంతో జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ నేపధ్యంలో గ్లోబల్‌ వార్మింగ్‌ పెరగటంవల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి.అభివృద్ది చెందాము అని చెప్పుకునే దేశాలు తమ విధానాలవల్ల జరుగు తున్న నష్టాన్ని పట్టించుకోకుండా మాత్రం ప్రపంచానికి సుద్దులు చెపుతుంటాయి. అవి చేసే పర్యావరణ నష్టాన్ని , ఇతర దేశాల భుజాలపైకి తోసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అయితే,దేశాల అనాలో చిత నిర్ణయాల వల్ల కూడా ఈ సమస్య ఉత్పాతంగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. నిజమే ప్రపంచం ఇప్పుడు సరిదిద్దుకోకపోతే తరువాత సరిదిద్దుకుందామనుకున్నా కుదరనంత చిక్కుల్లోకి పోయే పరిస్థితి ఏర్పడిరది . ఇటు వంటి విషమ పరిస్థితుల్లో ‘‘విశ్వగురువు‘‘ భారత దేశమే ప్రపంచానికి దారి చూపగలదు. పర్యావరణ పరిరక్షణలో రెండు ప్రధాన సమస్యలు మనకు కనపడతాయి. ఒకటి ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి నిర్వహణ. రెండోది ప్రజల భాగస్వామ్యం. జపాన్‌,సింగాపుర్‌ వంటి దేశా లలో పరిశుభ్రత చాలా కచ్చితంగా పాటిస్తారని చెప్పుకుంటూ ఉంటాం. మరి మన దేశం గురించి వేరే దేశస్థులు ఏమి ఆలోచిస్తారో మనం కూడా చూసుకోవాలి కదా. మొదట మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఏమి చెపుతోందో తెలుసుకుని, మన వంతుగా ఏమి చేయాలో ఆలోచించాలి . ప్రభుత్వం ఏమి చేస్తోంది 2014 లో ప్రధాని మోదీ శౌచాలయపు ప్రాధా న్యతను ఏకంగా ఎర్రకోట పై నుంచే చెప్పారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో శౌచలయాల నిర్మాణం జరిగింది. 2019లో తిరిగి ప్రధాని పీఠం ఎక్కిన తరువాత మొదలు పెట్టిన కార్యక్రమాలలో ‘స్వచ్చ భారత్‌ అభియాన్‌ ‘మొదటిది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ పర్యావరణ పరిరక్షణలో మొదటి మెట్టు స్వచ్చమైన పరిసరాలు అంటూతానే స్వయంగా చీపురు అందుకొని మొదలు పెట్టారు. ఈ స్వచ్చ భారత్‌ అభియాన్‌ ఒక ఉద్యమంగా మొదలై 2019 నాటికి బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన పూర్తిగా అరికట్టాలని లక్ష్యంతో పని చేసి దాదాపు 94%లక్ష్యం 2019లో మిగిలిన 6%తరువాతి కాలంలో సాధించ కలిగారు (ఈవెబ్‌ సైటు చూడవచ్చు ష్ట్ర్‌్‌జూం://ంషaషష్ట్రష్ట్రపష్ట్రaతీa్‌.ఎవస్త్రశీఙ.ఱఅ). అదే విధంగా ‘నమామి గాంగే‘ అన్న నినాదంతో గంగానది పరీవాహక ప్రాంతాలలో వ్యర్ధాల నిర్వహణ,కాలుష్య నివారణ,శుద్దీకరం వంటి అనేక కార్యక్రమాలను మొదలుపెట్టారు. అలాగే షaఎజూa aష్‌ ద్వారా అటవీ భూమిని ఎంత వాడుతాము అంత తిరిగి మళ్ళా అడవిని తయారు చేయటానికి అవసరమైన నిధులను తప్పని సరిగా సిద్దం చేసే చట్టాన్ని రూపొందిం చారు. దాదాపు రూ.95వేలకోట్ల నిధి సిద్దం చేశారు. పర్యావరణ రక్షణ ఒక నినాదంగా మిగిలి పోకుండా అది ఒకవిధానంగా మారేం దుకు అవసరమైన నిపుణతలను పెంచేందుకు Gతీవవఅ ూసఱశ్రీశ్రీ ణవఙవశ్రీశీజూఎవఅ్‌ ూతీశీస్త్రతీaఎ ను ంసఱశ్రీశ్రీ ఇండియాలో ఒకభాగంగా చేశారు. ఇది ఒకమంచి కార్యక్రమం ఈ వెబ్‌ సైటు ను చూడండి ష్ట్ర్‌్‌జూ://షషష.స్త్రంసజూ-వఅఙఱం. స్త్రశీఙ.ఱఅ).ప్రభుత్వం ఈపర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగానే కర్బన ఉద్గారాలను (షaతీపశీఅ వఎఱంంఱశీఅం) తగ్గించే ఉద్దేశ్యం తోనే దాదాపు పునరుత్పాదక వనరులు (తీవఅవషaపశ్రీవ వఅవతీస్త్రవ ంశీబతీషవం) అయిన సౌర శక్తి, వాయు శక్తి వాడకాన్ని ప్రోత్సహి స్తోంది. ఎలెక్ట్రిక్‌ వాహనాలు,భారత్‌ 6’ నిబం ధనలకు అనుగుణమైన వాహనాల తయారీ వంటి చర్యలు చెప్పట్టింది. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిరోధించేవిధంగా గట్టి అడుగులే పడుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతుంటే మరి ప్రజల భాగ స్వామ్యం ఏమిటీ??
ప్రజల భాగస్వామ్యం
పర్యావరణ స్పృహ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశం. మనం జరుపుకొనే ప్రతీ పండుగలో ఏదో ఒక ప్రకృతి సంబందంమైన అంశాలు ఉండటం మనం గమనించవచ్చును. అసలు మన మొదటి పండుగ యుగాది అంటేనే ప్రకృతి క్రొత్తచివురులుతొడగటం. ఆయా ఋతువులో ఏర్పడే ఆయా మార్పులను అర్ధంచేసుకొని పండుగలు జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఏమి జరుగుతోంది? తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి ఇవ్వమని ఉచితంగా పచ్చనిరంగు, నీలి రంగు డబ్బాలులు ఇస్తే,నగరంలో కేవలం 25% మాత్రమే వాటిని వాడుతున్నారని తెలుస్తోంది. 5000 టన్నుల చెత్తనుతడి,పొడి విభజన చేయడం అసాధ్యమని, దానివల్ల ఎంతో కాలు ష్యం కలుగుతోందని ఒక మునిసిపల్‌ అధికారి వెల్లడిరచారు. నిజానికి అది ఇళ్ళలో వారికి చాలా చిన్న పని. ఇంటిలో చెత్తని తడి, పొడిగా విభజించి పారిశుద్ధ్య విభాగానికి ఇస్తే చాలు. ఇంత సులభమైన పని కూడా మనం చేయలేమా? భారతీయులు తమ మూల విధా నాలకు విలువ ఇస్తూ, ప్రకృతి తో మమేకమయ్యే అవసరం ఇప్పుడు చాలా కనిపిస్తోంది. మనం వ్యక్తిగత పరిశుభ్రతతో మొదలుపెట్టి, ఇల్లు, వీధి,గ్రామం,జిల్లా,రాష్ట్రం, దేశం ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళితే మన జీవిత కాలం లో ఏదో ఒకచిన్న సకారాత్మక మార్పునైనా చూడగలుగుతాము. పారిశ్రామిక కాలుష్య నివారణ,షaర్‌వ ఎaఅaస్త్రవఎవఅ్‌ మొదలై నవి ప్రభుత్వపు పనులేనని భావించకుండా మనం చేయాల్సిన పని మనం చేద్దాం. మన దైనందిన అంశాలలో మొట్ట మొదటగా ప్రారంభించాల్సిన విషయం, పర్యావరణ కాలు ష్యాన్ని తగ్గించడం కోసం మీ ఇంటి పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇంట్లోని చెత్తను తడిచెత్త, పొడిచెత్తగా తప్పనిసరిగా విభజించడం. ప్లాస్టిక్‌ వినియోగాన్ని బాగా తగ్గించడం. ప్రకృతి అందించే సౌరశక్తి, వాయు శక్తిని ఎక్కువ వినియోగంలోనికి తెచ్చుకోవడం. వీలైనంత వరకు సేంద్రీయ విధానం వైపుకు మారటం. జ్యూట్‌,కొబ్బరి,గుడ్డలతో తయారు కాబడ్డ సంచీలు,తాళ్ళు, ప్రకటన వస్తువుల ఉపయోగాన్ని పెంచటం. తమ తమ పరిధి మేర ఎంతో కొంత స్వచ్చ భారత్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవటం. ఇలా అనేక చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టి దేశం కోసం స్వంత లాభం కొంత మానుకుని, మన భావితరాలకి మంచి పర్యా వరణాని అందించడం కోసం మనవంతు ప్రయ త్నం చేయకపోతే ముందు ముందు ఎన్ని ఉత్పా తాలను చూడాలో ఈ రెండు సంవత్సరాలలో బాగా అర్ధమయింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచే ప్రయ త్నం చేయాలి. ఎందుకంటే, ప్రకృతిలో సహజం గా పెరిగిన ఎన్నో చెట్లను మనిషి తనకోసం తొలగిస్తున్నారు. అందువలన మనిషి మరలా అటువంటి చెట్లు తయారుకావాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. ఇంకా వాతా వరణం అనుకూలంగా లేకపోతే నాటిన ప్రతి మొక్క చెట్టుగా మరే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనన్ని మొక్కలు పెంచడానికి ప్రతివారు కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణలో చెట్లు చాలా కీలకమైనవి.సమాజంలో పర్యావరణ పరిరక్షణ అంటూ అనేక నినాదాలు సంవత్సరాలుగా వస్తున్నాయి. పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను సమాజంలో పెద్దలు గుర్తించారు. కానీ నరుకుతున్న చెట్లు, ఒక్కరోజులో పెరిగినవి కావు. ఏళ్ల నాటి నుండి మొక్కలుగా పెరిగి, పెరిగి చెట్లుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారాయి. అటువంటి చెట్లు తొలగించే సమయానికి ఒక చెట్టుకు కనీసం పది మొక్కలు నాటి, వాటిని పెంచే ప్రయత్నం చేస్తే, అటువంటి చెట్లు భవిష్యత్తులో మానవ మనుగడకు అవసరమైనన్ని తయారు కాగలవు. మొక్కలు పెంచడానికి ఎవరికి మినహాయింపు లేదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.మనిషి మనుగడకు గాలి అవసరం. అలాగే నీరు అవసరం. నేడు చెట్లు తక్కువగా ఉండడం వలన పర్యావరణ సమతుల్యత తగ్గి వానలు సరైన సమయానికి రావడం లేదనే వాదన బలంగా ఉంది. వానలు సమృద్దిగా కురిస్తే, నీరు పుష్కలంగా ఉంటుంది. తగినంత నీరు ఉంటే, తగినంత పంటలు పండుతాయి. తగి నంత పంటలు పండితే, తగినంత ఆహార పదార్ధాలు లభిస్తాయి. శ్రమజీవులకు ఆహారం అందుతుంది. నేటి సమాజం శ్రామిక జీవుల పైనా, రైతులపైనా ఆధారపడి ఉంది.
నీటి దుర్వినియోగం పర్యావరణానికి చేటు
గత కాలంలో నీరు భూమిపై మాత్రమే ప్రవహించేది. అందువలన నీరు అయితే భూములోకి ఇంకేదీ. లేకపోతే ఎండలకు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘంగా మరి మరలా భూమిపైకి వర్షించేది. ఇలా ఒక సహజమైన క్రమం జరుగుతూ ఉండేది. కానీ నేటి రోజులలో నీరు ప్రవహించేది గొట్టాలలో` వివిధ రకాల గొట్టాల ద్వారా వివిధ విధాలుగా నీటి మళ్లింపు జరుగుతుంది. అందుకోసం ఆకాశం నుండి కురిసే వానలు చాలక భూమి లో నీటిని పైకి తీసుకురావడం కూడా జరుగు తుంది.పర్యావరణ పరిరక్షణలో చెట్లు, జంతువులు, గాలి నీరు అనేక విధాలుగా పాలు పంచు కుంటాయి. వాటిని సహజంగా ఉండేలాగా కృషి చేయవలసిన బాద్యత, ప్రకృతిని వినియోగించుకుంటూ, ప్రకృతిని ఆధారంగా జీవించే ప్రతి మనిషిపైన ఉండాల్సిన అవశ్యకత ఉంది.

ఉపాధి ఊసేది?

వైసిపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ నిజాయితీకి దూరంగా ఉంది. వాస్తవాలను పరిగణన లోకి తీసుకోకుండా మసి పూసి, మారేడుకాయ చేసే ప్రయత్నం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం కరోనా సంక్షోభంతో మొదలయింది. పారిశ్రామిక, సర్వీసు రంగాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. గత ఆర్థిక సంవత్సరం లోనే ప్రభుత్వాల ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయి. ఈ ఏడాది మరింత తీవ్రంగా పడిపోతాయనడంలో సందేహం లేదు. ఇటువంటి సమయంలో బడ్జెట్‌ అంచనాలు భారీగా చూపించటం ప్రజలను పక్కదారి పట్టించటానికే.
ఆదాయాలు-ఖర్చులు
ఆదాయాలు, ఖర్చుల అంచనాలే బడ్జెట్‌. అంచనా వేసిన ఆదాయం కంటే అంచనా వేసిన ఖర్చు ఎంత ఎక్కువ ఉంటే దాన్ని ద్రవ్య లోటుగా లేదా డబ్బుల లోటుగా పిలుస్తున్నారు. అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం ద్రవ్యలోటును పూడుస్తుంది. అప్పుకు పర్యాయ పదమే ద్రవ్యలోటు. అప్పు తీసుకొచ్చి ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యతను ప్రభుత్వం సాధిస్తుంది. 2019-20లో అంటే మొన్న మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ సైజు రూ.2 లక్షల 27 వేల కోట్లు. ఇదే మొత్తంలో ఆదాయాలు, ఖర్చులు ఉంటాయి. ఆదాయంలో రెవెన్యూ ఆదాయం, పెట్టుబడి ఆదాయం ఉంటాయి. ఖర్చులో రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి ఖర్చు, అప్పు ఫాయిదాలు ఉంటాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో అప్పుతో కలిపి రూ. 2లక్షల 2వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన వైసిపి ప్రభుత్వం చివరికి దాన్ని రూ. లక్షా 74 వేల కోట్లకు తగ్గించింది. రెవెన్యూ ఆదాయం రూ.68 వేల కోట్ల మేర తీవ్రంగా తగ్గింది. అంచనా వేసిన దాని కంటే మరో రూ. 15వేల కోట్ల అప్పు తెచ్చి మొత్తం ఆదాయ లోటును రూ.53 వేల కోట్లకు తగ్గించింది. ఆ మేరకు ఖర్చును కూడా రెవెన్యూ ఖర్చులో రూ.43వేల కోట్లు, పెట్టుబడి ఖర్చులో రూ.19 వేల కోట్లు కోత వేసింది. అదే సమ యంలో అప్పు తీర్చే ఫాయిదాలను రూ.9 వేల కోట్లకు పెంచింది. వెరసి అంచనా వేసిన ఖర్చు కంటే పెట్టిన ఖర్చు రూ.53 వేల కోట్లకు తగ్గిం ది. ఆ మేరకు బడ్జెట్‌ సైజు కూడా రూ.53 వేల కోట్లకు తగ్గి, రూ.ఒక లక్షా 74 వేల కోట్లయింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగు నీరు, పరిశ్రమలు, రవాణా వంటి ఆర్థిక సర్వీసులకు పెట్టిన ఖర్చు భారీగా రూ.48 వేల కోట్లు తగ్గింది. సాధారణ విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, పట్టణా భివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం తదితర సామాజిక సర్వీసులకు రూ.9 వేల కోట్ల కోత పెట్టింది. ఈ సర్వీసులలో ఇతర రంగాలకు రూ. 23 వేల కోట్ల కోత పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి రూ.14వేల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. వెరసి సామాజిక సర్వీసులలో రూ.9 వేల కోట్ల కోత పడిరది. కోర్టులు, జైళ్ళు, పోలీసు, రెవెన్యూ మరియు అప్పులు, వడ్డీల చెల్లింపులు, ఉద్యోగుల పెన్షన్లు వంటి సాధారణ సర్వీసులకు కేటాయించిన దాని కంటే రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టింది.
వర్తమాన బడ్జెట్‌
2019-20 బడ్జెట్‌ వాస్తవం తెలిస్తేగాని ప్రస్తుత 2020-21 బడ్జెట్‌ను అవగాహన చేసుకోలేము. ముందుగా గత 2019-20 బడ్జెట్‌ వాస్తవాలను పరిశీలించాం. కరోనా లేని సమయంలో 2019-20 బడ్జెట్‌ అంచనాలు వాస్తవంలో తలకిందులయ్యాయి. కరోనాతో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్‌ అంచనాలు వాస్తవం అయ్యే అవకాశం అసలు లేదు. 2019-20 బడ్జెట్‌ 2018-19 ఆర్థిక సంవత్సరపు స్థాయికి దిగజారింది. 2020-21 బడ్జెట్‌ సైజును రూ. 2 లక్షల 25 వేల కోట్లుగా ప్రతిపాదించి నప్పటికీ వాస్తవంలో అది కూడా 2018-19 స్థాయికి కొద్దో గొప్పో తేడాతో దిగజార బోతోంది. ప్రభుత్వానికే బడ్జెట్‌ మీద నమ్మకం లేదు. ఏకంగా బడ్జెట్‌ సైజునే రూ.3 వేల కోట్ల మేర తగ్గించింది. వ్యవసాయం, గ్రామీణా భివృద్ధి, నీటిపారుదల, సాధారణ విద్య వంటి రంగాలకు కేటాయింపులోనే రూ.30 వేల కోట్లు తగ్గించింది. అదే సమయంలో సంక్షేమానికి దాదాపుగా అదే మొత్తంలో రూ. 28 వేల కోట్ల మేర పెంచింది. వివిధ రంగాలను అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమం మాత్రమే ప్రజలకు మేలు చేయదు. అభివృద్ధికి కేటాయిం పులు తగ్గకుండా అదనంగా సంక్షేమానికి కేటాయింపులు జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం జోడు చక్రాలుగా నడుస్తాయి.
కార్మికులకు కానరాని మేలు
ఉపాధి హామీ పథకానికి పోయిన సంవత్సరం రూ.3626 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ. 2021 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కరోనా వలన పనులు దొరకని పరిస్థితుల్లో ఉపాధి కల్పన పెంచాల్సిన ప్రభుత్వం గతం కంటే రూ. 400 కోట్లు తగ్గించింది. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరించాలన్న డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. వైయస్సార్‌ బీమా పథకం కూడా వట్టిపోయిన గొడ్డులా తయారయింది. పోయిన సారి దీనికి రూ. 400 కోట్లు కేటాయించినా… దాన్ని ఖర్చు చేయకుండా ఈ సంత్సరం రూ.262 కోట్లు మాత్రమే కేటాయించింది. బడ్జెట్‌ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు కూడా స్పష్టమవుతాయి. గత 9 సంవత్సరాలుగా షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్స్‌ లోని 50 లక్షల మంది కార్మికులకు వేతన సవరణ చేయలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో దీని ప్రస్తావనే లేదు. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులకు పని లేదు. వేతనాలు లేవు. ఇటువంటి సమయంలో కార్మికుల కొనుగోలు శక్తి పెంచ టానికి అవసరమైన చర్యలను కూడా బడ్జెట్‌లో ప్రకటించ లేదు. వృద్ధాప్య పెన్షన్లను ప్రభుత్వం వారికి కానుకగా చూపిస్తు న్నది. ఇతర పెన్షన్లకు అర్హత లేని వారు కూడా తాము పని చేయగలిగిన వయసులో 30, 40 సంవత్సరాల పాటు పని చేసినవారే. వారికి ఒక యజమాని అంటూ ఉండరు కాబట్టి ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది. దానిని కానుకగా చూపించి వైసిపి ప్రభుత్వం వారిని అవమానపరుస్తోంది. ఈ బడ్జెట్‌ కార్మికులకు మేలు చేయదు. పారిశ్రామిక, వ్యవసాయ, సర్వీసు రంగాలలో ఉపాధి పెరగదు. కార్మికులు కొనుగోలు శక్తీ పెరగదు.
సంక్షోభవేళ అరకొరగా
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) రూ.40,000 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించారు. మే 17న విలేకరుల సమావేశంలో అదనపు కేటాయింపుల గురించి నొక్కి చెప్తూ ఈ పథకం కింద 2019 మే నెలలో కంటే 40-50 శాతం మంది కార్మికులు అధికంగా నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ బడ్జెట్‌కు ఈ అదనపు రూ.40,000 కోట్లు జోడిరచినప్పటికీ మంత్రిగారు వక్కాణించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపోదు.రూ.40,000 కోట్ల కేటాయింపును గొప్పగా చెప్పుకోవడం మీదే ఆర్థిక మంత్రి దృష్టి కేంద్రీకరించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం కింద పని కోరే వారి సంఖ్యకు సరిపడేంత బడ్జెట్‌ వుండాలన్నది ఆవిడ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇదొక సులభమైన మార్గం అంతే. ఇప్పటికే 14 కోట్లకు పైగా వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలన్న భారీ లక్ష్య సాధనకు ఈ మొత్తం ఏ మూలకూ సరిపోదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షేత్రస్థాయి వాస్తవాలను నిశితంగా పరిశీలించినట్లయితే ఈ విషయం తేలిగ్గానే తెలుస్తుంది.
ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులలో కార్మికులకు ఏడాదికి 200 పని దినాలకు గ్యారంటీ వుండాలి. అదేవిధంగా వారికి రోజువారీ వేతనం రూ.300 (లేదా ఆయా రాష్ట్రాలలో అమలులో వున్న కనీస వేతనం అంతకంటే ఎక్కువైతే ఆ మొత్తం) ఇవ్వాలి. వ్యవసాయ కార్మిక సంఘాలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌ ఇది. పైగా, అనేకమంది ఆర్థికవేత్తలు కూడా గతంలో ఇటువంటి సూచనలే చేశారు. ఆ విధంగా చేస్తే గ్రామీణ కార్మికులకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అది ప్రధానమైన అడుగు అవుతుంది.
2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కి కేటాయించింది రూ.61,500 కోట్లు. వాస్తవానికి 2019-20 సంవత్సరంలో ఆ పథకం కింద చేసిన ఖర్చు కంటే ఈ కేటాయింపులు 9,500 కోట్లు తక్కువ. పైగా గతేడాది చెల్లించవలసిన బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. ఇప్పుడు అదనంగా ప్రకటించిన రూ.40,000 కోట్లు కలిపితే ఉపాధి హామీ పథకం కింద మొత్తం రూ. 1,01,500 కోట్లు వున్నట్లు లెక్క.
ఈ ఏడాది మే 16వ తేదీన అందుబాటులో వున్న ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పోర్టల్‌ వివరాల ప్రకారం 1435.73 లక్షల మంది జాబ్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 1374.39 లక్షల మందికి కార్డులు మంజూరు అయ్యాయి. అంటే దరఖాస్తు చేసుకున్న 61,35,751 కుటుంబాలకు జాబ్‌కార్డు మంజూరు కాలేదు. ఇందులో 1166 లక్షల మంది పనిచేసేవారుండగా కార్మికులు వుండగా, అందులో 766.75 లక్షల జాబ్‌కార్డులు మాత్రమే ఉపయోగంలో వున్నాయి. గత మూడేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క రోజు పనిచేసినా జాబ్‌కార్డు ఉపయోగంలో వున్నట్టేనట!
సులభంగా అర్థమయ్యేందుకు ఒక చిన్న లెక్క చూద్దాం. జాబ్‌కార్డులున్న 766.75 లక్షల క్రియాశీల కార్మికులకు రూ. 200 రోజువారీ వేతనం చొప్పున 100 రోజులు పని కల్పించడానికి రూ.1,53,350 కోట్లు అవసరం అవుతుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం తన ధోరణి మార్చుకుని, జాబ్‌కార్డులున్న కుటుంబాలన్నింటికీ 100 రోజుల పని కల్పించాలని భావిస్తే అందుకుగాను రూ.2,87,146 కోట్లు అవసరమవుతాయి. అన్నిటినీ మించి, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒక్కో ఇంటికి కనీసం 200 రోజుల పని కల్పించాల్సిన అవసరముంది. ఇలా చేస్తే, ఖజానా నుంచి రూ.3,06,700 కోట్లు ఖర్చు అవుతుంది. మరో ముఖ్యమైన అంశాన్ని గమనంలో వుంచుకోవాలి. వేతనం రూ.200 అంటే చాలా తక్కువ. అయినప్పటికీ మనం దాన్నే కనీస వేతనంగా పరిగణిస్తున్నాం. పై లెక్కలన్నీ కేవలం వేతనానికి సంబంధించినవి మాత్రమే. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనికి సంబంధించి ఇతర ఖర్చులు కూడా వుంటాయి. గత ఆర్థిక సంవత్సరం 2019-20లో ఢల్లీి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన వికాస్‌ రావల్‌ ఒక సూచన చేశారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఒక వ్యక్తి పని చేస్తే అందుకు రూ.290 ఖర్చు అవుతుంది. ఈ ఏడాది పెరిగిన వేతనం రూ.20 కూడా జోడిరచినట్లయితే అది రూ.310 అవుతుంది. ఈ లెక్కన, కార్డు వున్న వారందరికీ 100 రోజుల పాటు పని కల్పించాలంటే రూ. 4,26,975 కోట్లు అవసరమవుతాయి (13,77,33,901 జాబ్‌కార్డులకు 2019-20 ప్రకారం అయ్యే ఖర్చునకు (రోజుకు రూ.290) కొత్తగా పెరిగిన వేతనాన్ని (రోజుకు రూ.20) జోడిరచాలి).
ఈ గణాంకాలన్నీ లోగడ గ్రామాలలో వున్న శ్రామికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వేసిన అంచనాలు. ఇప్పుడు, గ్రామాలకు తిరిగి వస్తున్న కోట్లాది మంది వలస కూలీలను కూడా కలిపి అందరికీ పనులు కల్పించాల్సి వుంటుంది. తిరిగివచ్చిన వలస కూలీలను కూడా కలుపుకొని పని అడిగేవారి సంఖ్య పెరిగిన పరిస్థితిని ఈ అరకొర కేటాయింపులతో ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్న నుంచి హాయిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్‌ కొరత ప్రభావం ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకం అమలు మీద తీవ్రంగా వుంటోంది. దీనికితోడు, కేంద్రం విడుదల చేసే నిధులు చాలీచాలకుండా, ఒక పద్ధతిపాడు లేకుండా విడుదల అవుతుంటాయి. ఆర్థికంగా బలహీన స్థితి లోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను ఇవ్వలేకపోవడం కూడా పథకం అమలుపై ప్రభావం చూపుతోంది. జాబ్‌కార్డులు-పనుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య పెరగడం, ఆర్థిక ప్రతిబంధకాలు, ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నగదు నిల్వలు తక్కువగా వుండడం వల్ల అనేక రాష్ట్రాలు ఈ పథకం కింద పనులు కల్పించలేకపోయాయి. లాక్‌డౌన్‌ అమలులో వున్నప్పటికీ మార్చి 31 తర్వాత జాబ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7.1 లక్షలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌లో దరఖాస్తుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస కూలీల సంఖ్య ఈ రాష్ట్రాలన్నిట్లోను ఎక్కువగా వుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ప్రాధాన్యత ఎంతగా వుందనేది దీనిని బట్టే అర్థమౌతోంది.
లాక్‌డౌన్‌ వేళ గ్రామీణ కార్మికులకు కొంత ఉపశమనం కల్గించడానికి, తిరిగి వచ్చిన వలస కార్మికుల కారణంగా పడిన భారాన్ని తగ్గించడానికి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం. సాధారణంగా ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) లోనే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పని ఎక్కువగా జరుగుతుంది. పని డిమాండ్‌ కూడా అధికంగా వుంటుంది. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ‘పూర్తయిన పని’లో సుమారు 37 శాతం ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లోనే జరుగుతుంది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ మొదటి దశ సందర్భంగా పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు ప్రణాళిక, ఆలోచన లేకుండా గుడ్డిగా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ పనులను నెల రోజుల పాటు రద్దు చేసేసింది. ఒక ప్రకటన ద్వారా ఏప్రిల్‌ 15 నుంచి ఈ నిబంధనలను ఎత్తివేసినప్పటికీ అవి ఏప్రిల్‌ 20 నుంచి అమలు లోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ నుంచి ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ను మినహాయించినప్పటికీ ఈ పథకం కింద పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయి.
ఏప్రిల్‌ మాసంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కేవలం 30 లక్షల మంది మాత్రమే పని చేశారని (మామూలుగా పనిలో వుండేవారిలో కేవలం 17 శాతమే) అందుబాటులో వున్న ప్రభుత్వ గణాంకాలు తెలియచేస్తున్నాయి. అదే గతేడాది 1.7 కోట్ల మంది కార్మికులు పనిలో వున్నారు. అంటే ఈ ఏడాది 82 శాతం కార్మికులు తగ్గారన్నమాట. అయితే ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద ఏప్రిల్‌ 2020లో 26.2 కోట్ల పని దినాలను సృష్టించవచ్చని గొప్పగా చెప్పారు. కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి ప్రధానంగా పట్టణాలకే పరిమితమై వుంది. గ్రామాలలో దాని ప్రభావం తక్కువగా వుంది. అవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ పని దినాలను అనవసరంగా పోగొట్టుకున్నామన్నమాట.
కరోనాకు ముందు, సాధారణ పరిస్థితులు వున్నప్పుడు కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు ఎటువంటి నిరుద్యోగ భృతిని చెల్లించేవారు కాదు. అయితే దేశంలో 2019-20లో నిరుద్యోగ భృతి చెల్లించారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కార్మికులకు ఎలాంటి నిరుద్యోగ భృతిని ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఈ లాక్‌డౌన్‌ కాలంలో వేతనాలను చెల్లించాల్సిందిగా ప్రయివేటు రంగానికి విజ్ఞప్తి చేయడం విస్తుగొల్పుతోంది.
అనేక పరిమితులు వున్నప్పటికీ, గత పదేళ్ల కాలంలో ఆర్థిక-వ్యవసాయ విపత్తు లలో సైతం గ్రామీణ భారతంలో ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ఎంత ప్రయోజనకరమైనదో నిరూపణ అయ్యింది. గ్రామీణ నిరుపేదలు, అణచివేతకు గురవుతున్న వారు మనుగడ సాగించేందుకు ఈ పథకం తోడ్పడిరది. ఈ వాస్తవాన్ని గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ అంగీకరించడమే గాక ఇలా పేర్కొంది. ‘’ఈ పథకం కింద పనిచేసే కార్మికులలో షెడ్యూల్డ్‌ కులానికి చెందినవారు 20 శాతం, షెడ్యూల్డ్‌ తెగ కార్మికులు 17 శాతం ఈ పథకం కింద స్థిరంగా వుంటున్నది’’. అదేవిధంగా పనిదొరికే మహిళా కార్మికుల సంఖ్య కూడా ప్రోత్సాహకరంగానే వుంది. వీరికి పని దొరకడం మాత్రమే కాదు, సమాన వేతనాలు గ్యారంటీ అయ్యేలా కూడా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సహాయపడిరది.
లాక్‌డౌన్‌ సమయంలో నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. భారత్‌లో ఇప్పటికే 14 కోట్ల ఉద్యోగాలు పోయాయని సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎమ్‌ఐఆ) పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో 40 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్రమైన పేదరికం, ఆకలి సమస్యను ఎదుర్కోనున్నారని ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఈ పరిస్థితిలో గామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం వేతన కార్మికుల మీద దృష్టి సారించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలి.
ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం : వ్యవ’సాయమే’ ప్రధానం!
కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులుబాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు.కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్‌ భారత్‌ పథకం ప్రకటించిన విషయం విదితమే. ఈ పథకంలో భాగంగా వివిధ రంగాల వారికి ఇచ్చే వెసులు బాట్లు.. ఆర్ధిక చేయూత గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోజూ వారీ వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలకు భారీ మద్దతు ప్రకటిస్తూ పలు అంశాలను వివరించారు. వాటి వివరాలివే..పాడి పరిశ్రమకు పాలు పోశారు.. దేశంలో సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పాడి పరిశ్రమకు ఇప్పటికే ‘ఫసల్‌ బీమా యోజన’ కింద ?6,400 కోట్లు పరిహారం ఇచ్చామనీ, ?74,300 కోట్లు మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు చేశామనీ నిర్మలా సీతరామన్‌ వెల్లడిరచారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించి తద్వారా ?4,100 కోట్ల రూపాయలను రైతులకు ప్రయోజనం చేకూర్చమని వివరించారు. ఇక భవిష్యత్తులో పాడి పరిశ్రమకు ఇవ్వబోయే చేయూత ఇదే.. పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. దీని కోసం ?13,343 కోట్లు కేటాయించారు. పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు ?15 వేల కోట్లు కేటాయించారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మత్స్యరంగానికి చేదోడుగా.. మత్స్య సంపద యోజనకు ?20 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇంకా ఆర్ధిక మంత్రి మత్స్యరంగానికి ప్రకటించిన ప్రత్యేక వెసులుబాట్లు..దేశంలో మత్స్యకార రంగంలో ఉపాధి పొందుతున్న55 లక్షల మంది. వీరందరికీ వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం. రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా. మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబన సాధించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఫిషింగ్‌ హార్బర్‌, శీతల గోదాములు, మార్కెట్ల కోసం ?9 వేల కోట్లు కేటాయింపు. గడువు తీరిన ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్‌ గడువు మూడు నెలలు పొడిగింపు. రైతుల కోసం మరిన్ని.. నిన్న (మే 14) రైతులకు ఇస్తున్నాట్టు చెప్పిన ఆర్ధిక సహకారంతో పాటు ఈరోజు మరిన్ని రైతు సంక్షేమ విధానాలను ఆర్ధిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉత్పత్తి అయిన వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులైనా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు రైతులకు కల్పిస్తారు. ఇంతకు ముందు ఈ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే ఏర్పాట్లు చేస్తారు. ు అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగిస్తారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకుని వస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్‌ విధానం బలోపేతం చేస్తారు. లైసెన్స్‌ పొందిన వ్యాపారులకు రైతులు అమ్మాల్సిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చు. – ప్రతి సీజన్‌కు ముందే ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టపరమైన ఏర్పాటు చేస్తారు. మొత్తమ్మీద ప్రధాని ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. – (వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కార్యదర్శి)-పి.అజయకుమార్‌/విక్రమ్‌ సింగ్‌

1 5 6 7 8 9 11