నోబెలే గుర్తించింది..
మరి పాలకులు…?

ఏసేవకైనా,శ్రమకైనా ప్రపంచ గుర్తింపులో అత్యంత ప్రసిద్ధి గాంచినది నోబెల్‌ బహుమతి. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ప్రకటించిన నోబెల్‌ బహుమతులో ఆర్థిక శాస్త్రం మరియు శాంతికి ప్రకటించిన నోబెల్‌ బహుమతి ఇటు కార్మిక వర్గానికి అటు భావవ్యక్తీ కరణకు పరిత పించే అభ్యుదయ వాదులకు ఒకఊరట నిచ్చింది. లాభాలు పెంచుకోవడం కోసం వేతనాల కోతనే మరమౌష ధంగా భావించే పెట్టు బడిదారీవర్గానికి ఈసారి ప్రసాదించిన నోబెల్‌ బహుమతి యొక్క అంత రార్థం ఒక సమా ధానం. కనీస వేతనాల పెరు గుదల కొత్త ఉపాధి అవకాశాలను తగ్గించదని నిరూపిస్తూ చేసిన రీసెర్చ్‌కుగానూ ఈ ఏడు అర్థశాస్త్ర నోబెల్‌ బహుమతి ఇవ్వడం జరిగింది. తక్కువ వేతనా లను ఇవ్వడం ఎక్కువ పనిగం టలు పని చేయించు కోవడం వంటివే అధిక లాభాలకు ఆధా రాలుగా భావించే యాజమా న్యాలకు ఇది ఒక కనుపిప్పు కలిగించాలి. ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈఏడాది ముగ్గురిని వరించింది. అమె రికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించగానే అనేకులకు ఆశ్చర్యమేసింది.అయితే ఇందులో సగం పురస్కా రాన్ని డేవిడ్‌ కార్డ్‌కు ఇవ్వగా..మిగతాసగాన్ని జాషువా,గైడో పంచుకోనున్నారు. కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్‌ అందించారు. ఇక ఆర్థిక శాస్త్రానికి సంబం ధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇచ్చారు. సామాజిక శాస్త్రాల్లో ఒక్కోసారి చాలా పెద్దపెద్ద ప్రశ్నలు ఎదురవు తుంటాయి.ఉపాధి,ఉద్యోగుల వేతనంపై వలస విధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది?ఓవ్యక్తి సుదీర్ఘ విద్య అతని భవిష్యత్తుపై ఏ మేరకు పనిచేస్తుంది? వలసవిధానం తగ్గడం,వ్యక్తి సుదీర్ఘకాలం చదువుకోకపోవడం ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది?ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం.అయితే ఈ ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధాన మివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్‌, జాషువా,గైడో రుజువు చేశారు.అయితే ఏ దేశ ప్రభుత్వాలైనా, ఏ రంగంలోనైనా ఇలాంటి పరిశోధనలను గుర్తించడమే కాక వాటిని తమ విధానాల్లో భాగం చేసుకున్నప్పుడే ఆర్థిక అసమానతల తొలగింపు సులభమౌతుంది. భారత దేశంలో కనీస వేతనాల చట్టం1948 లోనే తయారు చేయబడిరది. కానీ ఇది చట్టపరమైన బైండిరగ్‌ ఏమీ కాదు. కనీస వేతనాలు చెల్లించనందుకు ఇంత వరకు ఎవరినీ చట్టం శిక్షించడం లేదు. అయితే ఈ చట్టం ప్రకారం కార్మిక సంఘాలు పోరాటం చేయడం మూలాన రాష్ట్రాలు కంపెనీల యాజమాన్యాలు కొంతవరకు కనీస వేతనాలు చెల్లించడానికి చర్చలు మాత్రం జరిపుతాయి కానీ అమలుకు చిత్తశుద్ది లేదు. కనీస వేతనాలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మరియు ఒక రంగానికి మరో రంగానికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. షెడ్యూల్డ్‌ కంపెనీలకు, రిజిస్టర్డ్‌ కంపెనీలకు మరియు రిజిష్ట్రేషన్‌ చేయబడని కంపెనీలలో కూడా కనీస వేతనాలు వ్యత్యాసాలతో కొనసాగు తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రిజిస్ట్రేషన్‌ పొందిన కంపెనీల్లో కూడా కింది స్థాయిలోని ఎక్కువ శాతం ఉద్యోగులు ఎలాంటి మస్టర్‌ లేకుండా డైలీ వేజ్‌ వర్కర్లుగా పని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ అదే కంపెనీలో పని చేస్తున్న వారి కన్నా తక్కువ వేతనం చెల్లించబడుతుంది. ఇది అనేక సందర్భాలలో కార్మిక సంఘాల సర్వేలలో బయట పడిరది. ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. అయితే భారతదేశంలో రిజిస్ట్రేషన్‌ చేయబడినవి, షెడ్యూల్లో లేని సూక్ష్మ, మధ్య తరగతి మరియు సీజనల్‌ ఇండస్ట్రీ లే ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి చోట దోపిడీ మరింత ఎక్కువగా ఉన్నది. మన దేశంలో అత్యంత ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఈ రకమైన దోపిడీయే. కనీస వేతనాల చెల్లింపు నుండి సంఘటిత రంగం కూడా చాలా తెలివిగా తప్పించుకుంటున్నది. కాంట్రాక్టీకరణల ద్వారా నియమించుకున్న ఉద్యోగులకు సదరు కాంట్రాక్టర్‌ ఎంత వేతనాలు చెల్లిస్తున్నారో విధిగా తెలుసుకోవలసిన బాధ్యత పని తీసుకుంటున్న సంస్థకు ఉన్నది. ప్రావిడెంట్‌ ఫండ్‌, ఈ.ఎ.ఐ వంటివి చెల్లిస్తున్నాడా లేదా చెక్‌ చేయవలసింది కూడా కంపెనీయే. కాంట్రాక్టర్‌ కూడా తను ఏ ఏ హెడ్స్‌ కింద ఇస్తున్నాడో తెలుపవలసిన బాధ్యత ఉన్నది. అయితే ఇవన్నీ పేపర్‌ వరకే పరిమితమై బ్యాంకు క్రెడిట్‌ మరోలా ఉన్నదని కాంట్రాక్టీ కరణల ద్వారా నియమించబడుతున్న ఉద్యోగు లందరూ వాపోతుంటారు. దీనికి కాంట్రాక్టర్‌ ఇచ్చే సమాధానం ఏమంటే- ట్రైనింగు, యూని ఫామ్‌,రిఫ్రెషర్‌ ట్రైనింగ్‌ మరియు ఇతర మెయింటేనెన్సులు వంటివన్నీ మినహాయించు కున్న తర్వాత ఆ విధంగా చెల్లించవలసి వస్తుందని. దీనిలో నిజానిజాలు ఎంత ఉన్నా నష్టపోయేది కార్మికుడే. కనీస వేతనాలు అమలు కోసం రాష్ట్రాల పరిధిలో వేజ్‌ బోర్డులు అని నామకరణం చేయబడ్డాయి కానీ ఇవి నామ మాత్రంగానే ఉన్నాయి. నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి- కూడు,గూడు,గుడ్డతో పాటు విద్య, వైద్యం, మరియు ఎంటర్టైన్మెంట్‌ సదుపాయాల కోసం లెక్కించి,ఆస్థానిక పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించడం అవి అమలు జరిగేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఇది ఈ దేశమంతా అందని ద్రాక్షే. 2020లో భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన వివరాల ప్రకారం జాతీయ సగటు కనీస వేతనం కేవలం 293 రూపా యలే! కేరళ రాష్ట్రం 670రూపాయలతో మొదటి స్థానంలో వుండగా 453రూపయలతో జమ్ముకాశ్మీర్‌,438 రూపాయలతో తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో వున్నవి. అత్యల్పం మధ్యప్రధేశ్‌ రాష్ట్రంలో 205రూపాయలు చెల్లించబడగా గుజరాత్‌ బీహారుల్లో వరుసగా 233 మరియు267 గా వున్నవి.భారత దేశ టెలికాం రంగంలో సంస్కరణలను ప్రతిపాధించి నప్పుడు శ్యాంపిట్రోడా గారు కంపెనీ సి.ఈ.ఓ జీతాన్ని కంపెనీలోని అత్యధిక జీతానికన్నా మూడిరతలు చేయడం ద్వారా క్రింది స్థాయి వుద్యోగులను మరింత పిండగలరని చెప్పారు. ఈ సూత్రం వంటబట్టించుకున్న రిలయన్స్‌ జియో క్రింది స్థాయి వర్కర్లకు చాలీచాలని భృతి ఇస్తూ లాభాలు గడిస్తున్నది!. అయితే ఉద్యోగు లను పిండుకోవడం కాదు, క్రింది స్థాయి వేతనాల్లో పెరుగుదల మార్కెట్‌నూ పరుగులు పెట్టించగలదనీ ఆర్థిక మాంద్యానికి సమాధా నాలుగా సూచించినప్పుడు కీన్స్‌ అనే ఆర్థిక వేత్త కూడా అభిప్రాయపడ్డారు. కనీస వేతనాల పెరుగుదల ఉపాధి లేమికీ లాభాల్లో తగ్గుద లకూ దారి తీయదని సాక్షాత్తు ప్రపంచ ప్రసిద్ది నోబెల్‌ నిర్వహాకులే గుర్తించినందుకు మన పాలకులూ ఆ దిశగా ముందడుగు వేయాలి.

భావ ప్రకటనా స్వేచ్చకు ఊపిరినిచ్చిన నోబెల్‌ శాంతి బహుమతి
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్‌లు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు నిరంతర దాడులు,వేధింపులు,హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్‌ స్వాతంత్య్రం కోసం శ్రమించారు. ప్రజాస్వామ్యం, పాత్రికేయ స్వేచ్ఛకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో భావ వ్యక్తీకరణ హక్కు కోసం ధైర్యంగా నిలబడ్డ విలేకరులకు వీరు ప్రతి నిధులు. శాంతిని పెంపొందించడానికి ఈ స్వేచ్ఛ చాలా ముఖ్యం. మరియాది ఫిలిప్పీన్స్‌ కాగా దిమిత్రి స్వస్థలం రష్యా.ఈ పాత్రికేయుల నోరు నొక్కేయడానికి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిలిప్పీన్స్‌వాసి ఒకరు నోబెల్‌ శాంతి బహు మతికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. భావవ్యక్తీకరణ, పత్రికాస్వేచ్ఛ లేకుంటే దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించలేమని.. నిరాయుధీకరణ, మెరుగైన ప్రపంచ క్రమాను గతిని సాధించలేమని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఛైర్మన్‌ బెరిట్‌ రెయిస్‌ ఆండర్సన్‌ బహుమతి ప్రకటన సందర్భంగా పేర్కొనటం గమనార్హం. రాప్లర్‌ పేరుతో.. మరియా ఒక వార్తా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అధికార ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తె తెచ్చిన వివాదాస్పద ‘యాంటీ డ్రగ్‌’ కార్యక్రమంపై ఆమె సాహసోపేతంగా విమర్శనాత్మక కథనాలు రాశారు. డ్రగ్‌ మాఫి యా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన తీరును వెలుగులోకి తెచ్చారు. తనకు నోబెల్‌ రావడంవల్ల ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం కచ్చితంగా అసంతృప్తికి గురై ఉంటుందని మరియా వ్యాఖ్యానించారు. ‘‘ఈవార్త తెలిసి మొదట నేను షాక్‌కు గురయ్యా. ఇవి నాకు ఉద్వేగభరిత క్షణాలు. మేం ఎదు ర్కొంటున్న పరిస్థితులను గుర్తించిన నోబెల్‌ ఎంపిక కమిటీకి కృతజ్ఞతలు’’ అని చెప్పడం. ‘‘ఫిలిప్పీన్స్‌లో నేను,నాసహచర పాత్రికేయులు నిరంతరం వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొ న్నాం. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులకు,పాత్రి కేయ స్వేచ్ఛకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులకు ఇది ప్రబల ఉదాహరణ’’అని అనటం.ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మీడియా దిగ్గజాలు విద్వేషంతో చేసే అసత్య ప్రచారాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని వారనడం గమని స్తుంటే…పెట్టుబడి శాశిస్తున్న ఏ దేశ పాలనల్లోనైనా సత్యాన్ని బయటికి రానివ్వటం లేదు. మరియా లాంటి పోరాటంతో సత్యాన్ని వెలికి తీయజూసిఒన గౌరీ లంకేష్‌ను నాలుగేళ్ళ క్రితం బెంగుళూరులో నిర్దాక్షిణ్యంగా మతతత్వ శక్తులు చంపేశాయి. అత్యాచార బాధితురాలికి పోలీసులు నిర్వహించిన అసంబద్ద అంత్య క్రియలను కవర్‌ చేయడానికి వెళ్ళిన సిద్దికీ కప్పన్‌ అనే రెపోర్టర్‌ని ఊ.ఏ.పి.ఏ క్రింద జైల్లో వేశారు. మొన్నటికి మొన్న త్రిపురా అల్లర్లను కవర్‌ చేస్తున్న హెచ్‌.డబ్ల్యూ న్యూస్‌కు చెందిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు.

1993లో రష్యాలో ప్రారంభమైన ‘నవోయా గజెటా’ దినపత్రిక వ్యవస్థాపకుల్లో దిమిత్రి మురాతోవ్‌ ఒకరు. ఇది..రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక. వాస్తవ ఆధారిత పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను ‘నవోయా గజెటా’ ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. చెచెన్యాలో రష్యా సాగించిన పోరుపై కథనాలు రాసిన అన్నా పొలిటికోవోస్కయా కూడా వీరిలో ఉన్నారు. అయినప్పటికీ మురాతోవ్‌ వెనకడుగు వేయకుండా తన సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చారు. మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. 1990లో నోబెల్‌ శాంతి బహుమతి గెల్చుకున్న నాటి సోవియట్‌ యూనియన్‌ నాయకుడు మిఖాయిల్‌ గోర్బచేవ్‌.. తన బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని ‘నవోయా గజెటా’ సంస్థకు కార్యాలయ ఉపకరణాలు, కంప్యూటర్ల కొనుగోలుకు వెచ్చించారు. కానీ ఈరోజుల్లో తిన్నింటి వాసాలు లెక్కించే కంగనా రనౌత్‌ లాంటి బహుమతి గ్రహితలు తయారయ్యారు. అయితే జర్నలిజంలో కఠోరమైన కార్యాన్ని నెరవేర్చు తున్న వారికి నోబెల్‌ ఇవ్వటం నచ్చని విలేఖర్ల, సంపాదకుల పట్ల కక్షతో వ్యవహరించే వారికి చెంపపెట్టు లాంటిది.జి.తిరుపతయ్య