యుద్దంతో ధ‌రాఘాత‌కం

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు రష్యా దళాల స్వాధీనంలోకి వచ్చాయి. ప్రస్తుతం రాజధాని కీవ్‌ని వశం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడు తున్నారు. ఐతే, దానిని స్వాధీనం చేసుకునేందుకు రష్యాకు ఎంతో సమయం పట్టకపోవచ్చు. కానీ ఈ చర్య వల్ల రష్యాతో పాటు ప్రపంచానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ధరల పెరుగు దల ప్రపంచ దేశాలకు మోయరాని భారంగా మార నుంది. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకు తలమ య్యాయి. దానికి ఇప్పుడు ఈ యుద్ధం తోడైంది. క్రూడాయిల్‌ ధరలు అనూహ్యంగా పెరిగి బ్యారెల్‌ 100 డాలర్లకు చేరింది. ఈ స్థాయికి పెరగటం గత ఎనిమిదేళ్లలో మళ్లీ ఇదే. మన దేశంపై కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మార్చి 7న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు భారీగా పెరగవచ్చంటున్నారు.
రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు జర్మనీ, అమెరికా వంటి ప్రధాన ఉత్పాదక దేశాల నుంచి చేసుకునే దిగుమతులు చాలా తక్కువ. కానీ ఈ రెండు దేశాలు అనేక ఉత్పత్తులకు ముడి పదార్థాలు సమకూరుస్తాయి. కావాల్సిన ఇందనాన్ని అందిస్తాయి. చాలా ఐరోపా దేశాలు రష్యా ఇందనంపై ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ చమురు మార్కెట్‌లో రష్యా ఆధిపత్యం నడుస్తోంది. ఇది రెండో అతిపెద్ద చమురు ఎగు మతిదారు. ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యాది మూడో స్థానం. యూరప్‌, ఆసియా దేశాలలో దాదాపు సగం దేశాలు ముడి చమురు అవసరాలకు రష్యాపై ఆధారపడ్డాయి. గ్యాస్‌ మార్కెట్‌పై రష్యా భారీ ప్రభావం చూపుతున్నందున పరిస్థితి క్లిష్టంగా మారొచ్చు. చమురు, గ్యాస్‌లో మాత్రమే కాకుండా బొగ్గు, అణుశక్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి, ముడి చమురుతో పాటు, గ్యాస్‌ ధరలు కూడా ఎప్పుడైనా ఆకాశాన్ని తాకొచ్చు. ఒకవైపు చలికాలం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకు పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ- స్విఫ్ట్‌ నుంచి రష్యాను తొలగించడానికి యూరోపియన్‌ దేశాలు ఇష్టపడకపోవడానికి కారణం కూడా రష్యా దగ్గర ఉన్న ఈ గ్యాస్‌. ఐనా,ఈ యుద్ధం వల్ల జర్మన్‌ సహకారంతో రష్యా నిర్మిస్తున్న??కొత్త బాల్టిక్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నార్డ్‌ స్ట్రీమ్‌ 2 పనులను నిరవధికంగా నిలిపి వేయక తప్పలేదు. మరోవైపు, కరోనా మహ మ్మారి కారణంగా గ్లోబల్‌ గ్యాస్‌ నిల్వలు పూర్తిగా తగ్గిపోవటంతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. దానికి తాజా పరిణమాలు తోడవటం వల్ల వినియోగదారులు, పరిశ్రమ లపై మోయరాని భారం పడుతుంది.చాలా సప్లయ్‌ చెయిన్లకు గ్యాస్‌ ప్రాథమిక అసవరం. కనుక గ్యాస్‌ సరఫరా నిలిచిపోతే భారీ ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది. 2021 శీతా కాంలో మొదటిసారి గ్యాస్‌ ధరలు పెరిగినపుడు ఇంధన వ్యయం భరించలేక బ్రిటన్‌లోని ఎరు వుల ఫ్యాక్టరీ మూతపడ్డాయి. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ కొరతకు దారితీసింది. వైద్య ప్రక్రియల నుంచి ఆహారం తాజాగా ఉంచడం వరకు అన్నింటికీ ఇది అవసరం. కాబటటి పెరుగుతున్న చమురు, గ్యాస్‌ ధరల వల్ల ఇలాంటి పరిణామాలకు ఆస్కారం ఉంది. మరోవైపు, ప్రస్తుతం గోధుమల ధర పదమూ డేళ్లలో అత్యధిక స్థాయికి చేరాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను పెంచుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు ఆసియా, మధ్యప్రాచ్య వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ప్రధాన సరఫరాదారులు. ప్రపంచం లోని గోధుమల వ్యాపారంలో పాతిక శాతం వాటా ఈ రెండు దేశాలదే. మొక్కజొన్న అమ్మ కాలలో 20 శాతం, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో ఎగుమతుల్లో 80 శాతం వాటాను ఈ రెండు దేశాలు పంచుకుంటున్నాయి. వ్యవసాయరంగం ఇప్పటికే సంక్షోభంలో పడిరది. పలు అగ్రశ్రేణి ధాన్యం వ్యాపార సంస్థలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. తాజా పరిణమాలతో ఈ రంగం మరింత పడిపోతుంది. ఉక్రెయిన్‌-రష్యా యుధ్దం రవాణా రంగంపై కూడా గణనీయ మైన ప్రభావం చూపనుంది. ఇప్పటికే, కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఈయుద్ధం ఈ రంగంలో మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా సముద్ర రవాణా,రైలు సరుకు రవాణాపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2011నుంచి చైనా, ఐరోపా మధ్య స్థిరమైన రైలు సరుకు రవాణా సంబంధాలు ఉన్నాయి. ఆసియా,యూరప్‌ సరుకు రవాణాలో దీని పాత్ర తక్కువే అయినా ఇటీవల ఇతర రవాణా మార్గాలకు అంతరాయం కలిగినపుడు ఇది చాలా ఆదుకుంది. దాని అవసరం ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. ఐతే,తాజా సంక్షోభం దీనిపై తీవ్ర ప్రభావం చూపనుంది.మరోవైపు, రష్యా దండయాత్రకు ముందే ఓడ యజ మానులు నల్ల సముద్రం షిప్పింగ్‌ రూట్లను నిలిపివేశారు. నల్ల సముద్రంలో కంటైనర్‌ షిప్పింగ్‌ అనేది ప్రపంచ స్థాయిలో సాపేక్షంగా ఉత్తమ మార్కెట్‌. దీనిని రష్యా దళాలు కట్‌ చేస్తే ఉక్రెయిన్‌ ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే చాలా ఎక్కువ గా ఉన్న సరుకు రవాణా ధరలు మరింత పెరగవచ్చు.ఇది ఇలావుంటే,సైబర్‌ దాడులు ప్రపంచ సరఫరా గొలుసులను లక్ష్యంగా చేసుకో వచ్చనే ఆందోళన కూడా ఉంది. నేడు వాణి జ్యం ఎక్కువగా ఆన్‌లైన్‌ లోనే జరుగుతోంది కాబట్టి కీలకమైన షిప్పింగ్‌ లైన్‌లు, మౌళిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి. లోహ పరిశ్రమపై కూడా ఈ యుద్ధం విశేష ప్రభావం చూప నుంది. ఎందుకంటే నికెల్‌, రాగి,ఇనుము ఉత్పత్తిలో రష్యా ,ఉక్రెయిన్‌ ప్రపంచంలోనే అగ్రగాములు. నియాన్‌, పల్లాడియం,ప్లాటినం వంటి ఇతర ముఖ్యమైన ముడి పదార్థాల ఎగుమతిలో కూడా ఇవి ముందున్నాయి. రష్యాపై ఆంక్షల భయంతో ఈ లోహాల ధరలు పెరిగాయి. పల్లాడియం విషయానికే వస్తే గత డిసెంబర్‌ నుంచి దాని ట్రేడిరగ్‌ ధర ఔన్సుకు 2,700 డాలర్లు పెరిగింది. ఆటోమోటివ్‌ ఎగ్జాస్ట్‌ సిస్టమ్స్‌, మొబైల్‌ ఫోన్లు, డెంటల్‌ ఫిల్లిం గ్‌ల వరకు ప్రతిదానిలో పల్లాడియంను ఉపయో గిస్తారు. తయారీరంగంతో పాటు నిర్మాణ రంగంలో ఉపయోగించే నికెల్‌,రాగి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అమెరికా, యూరోప్‌ , బ్రిటన్‌ ఏరోస్పేస్‌ పరిశ్రమలు కూడా రష్యా టైటానియంపై ఆధారపడి ఉన్నాయి. దాంతో,బోయింగ్‌,ఎయిర్‌బస్‌ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ప్రత్యామ్నాయ సరఫరాదారులను సంప్రదించినట్టు తెలుస్తోంది. మైక్రోచిప్‌లపై కూడా తాజా సంక్షోభం ప్రభా వం చూపనుంది. కరోనా కారణంగా గత ఏడాది మొత్తం మైక్రోచిప్‌ల కొరత వేదించింది. ఈ సంవత్సరం ఆ కొరత తీరుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో యుద్దం వచ్చిపడటంతో ఆ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆంక్షలలో భాగంగా రష్యా మైక్రోచిప్‌ల సరఫరాను నిలిపివేస్తామని అమెరికా ప్రకటి చింది. కానీ మైక్రోచిప్‌ ఉత్పత్తిలో ముఖ్యమైన నియాన్‌, పల్లాడియం, ప్లాటినంల కీలక ఎగుమతిదారులుగా రష్యా, ఉక్రెయిన్లు ఉన్నప్పు డు అది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న. చిప్‌ లితోగ్రఫీలో ఉపయోగించే నియాన్‌లో దాదాపు 90 శాతం రష్యా లోనే లభిస్తుంది. చిప్‌ తయారీదారుల వద్ద ప్రస్తుతం రెండు నుండి నాలుగు వారాలకు సరిపడ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య వల్ల ఏదైనా దీర్ఘకాలిక సరఫరా అంతరాయం ఏర్పడితే అది సెమీకండక్టర్లు, వాటిపై ఆధారపడిన ఉత్పత్తు లపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఆందోళనలో రైతులు
రైతులు పండిరచిన ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రైతులకు అన్యా యం జరగకుండా చూస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రకటనలు నీటి మూటలు గానే మిగిలిపోతున్నాయి. పండిరచిన ధాన్యానికి మద్దతు ధర లభించకపోగా ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయిని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు కల్లాల్లో ఉన్న ధాన్యం ఎప్పుడు విక్రయించకుంటామోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, దళారులు వారి ఆదాయాన్ని చూసుకుంటున్నారే తప్ప రైతుల కష్టాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా పురుగు మందులు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ గిట్టుబాటు ధర మాత్రం రైతులకు అందడం లేదు. పలువురు మిల్లర్లు, దళారులు మాత్రం పక్క రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది ఎక్కువగా ధాన్యం పండిరదని, అందువల్ల గిట్టుబాటు కావడం లేదనే పుకారును సృష్టిస్తున్నారు. దీంతో ధాన్యానికి మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు, సాధారణ ప్రజలు-కార్మికులు, రైతులు మార్కెట్‌ నుండి అధిక ధరలకు అదే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అధిక ధరల ద్వారా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? నిజమైన ఉత్పత్తి దారులకు, రైతులకు కాదు. కార్పొరేట్లు, పెద్ద భూస్వామ్య వర్గం ఆధిపత్యం చెలాయించే బడా వ్యాపా రులకు, రుణదాతలకు చేరుతుంది. వీరే చిన్న రైతుల నుంచి చౌక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారే మార్కెట్‌ను, ఉత్పత్తులను నియంత్రిస్తారు. మోడీ నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు లేకుండా విధించిన ఆకస్మిక లాక్‌డౌన్‌ ప్రజలపై అనేక రకాల కష్టాలను తెచ్చిపెట్టింది. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రమజీవుల ఆదాయం బాగా తగ్గిపోయింది. మన దేశ సంపదను ఉత్పత్తి చేసే కోట్లాది మంది కార్మి కులు ఆకలితో కొట్టు మిట్టాడుతున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకు తున్నాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితమే ఇది. ఆహారం, ఇంధనం, వస్తువుల అధిక ధరలు…సరఫరా వైపు అడ్డంకులు రిటైల్‌ మరియు టోకు స్థాయి ద్రవ్యోల్బణం రేటులో ప్రతిబింబిస్తాయి. బియ్యం, వంటనూనెలు, పప్పులు, కూర గాయలు, గుడ్లు తదితర నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. వంట నూనెల ధర 60శాతం వరకు పెరుగుదలను చూసింది. రైతులు తమ పంపుసెట్లు, ట్రాక్టర్లకు వినియోగించే డీజిల్‌ ధర పెరగడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. సబ్సిడీలో భారీగా కోత విధించడంతో వంటగ్యాస్‌ ధర పెరిగింది. 2019-20లో వంట గ్యాస్‌కు మొత్తం ప్రత్యక్ష నగదు సబ్సిడీ రూ.22,635 కోట్లు. ఇది ఇప్పుడు రూ.3,559 కోట్లకు (ఫిబ్రవరి 2021 వరకు) తగ్గింది. దీంతో మొత్తం భారం వినియోగదారులపైనే పడిరది. పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాలు మరి యు ఇతర పన్నుల భారీ భారం ఈ ధరల పెరుగుదలపై ప్రధానంగా ఉంది. గత మూడేళ్లలో అంటే 2018నుంచి మోడీ నేతృ త్వంలోని బిజెపి ప్రభుత్వం ఇంధన పన్నుల ద్వారా రూ.8లక్షల కోట్లు ఆర్జించింది. 2020-21లో రూ. 3.71లక్షల కోట్లు ఆర్జించింది. పైగా ఈ కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యో గాలు, ఆదాయాలను కోల్పోయారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు, వివిధ ఇన్‌పుట్‌ల ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతాయి. సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.33, లీటర్‌ డీజిల్‌పై రూ.32 వుంది. అనేక రాష్ట్రాల ఎన్నికలలో బిజెపికి ఎదురు దెబ్బలు తగిలిన తరువాత, ధరల పెరుగు దలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికాక, మోడీ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, లీటర్‌ డీజిల్‌పై రూ.10 కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని నామమాత్రంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇది కేవలం టోకెన్‌ తగ్గింపు మాత్రమే, ఇది ప్రజలకు పెద్దగా ఉపశమనం కలిగించదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, టీకాల కార్య క్రమానికి డబ్బులు కావాలి కాబట్టి పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గించలేమని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి చేసిన వాదన అవాస్తవం. ఇది అశాస్త్రీయమైనది కూడా. అనేక ఇతర పన్ను మినహాయింపులు, రాయితీలతో పాటు కార్పొరేట్‌ పన్నులను తగ్గించడం ద్వారా మోడీ ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీలను వెనక్కి తీసుకోవడం ద్వారా కలిగే ఆదాయ నష్టాన్ని…కార్పొరేట్‌ పన్ను రేటును 2019కి ముందు స్థాయికి పునరుద్ధరించడం ద్వారా తిరిగి పొందవచ్చు. అతి సంపన్నులపై సంపద పన్ను విధించడంద్వారా తగినంత ఆదాయాన్ని పొందవచ్చు. కానీ మోడీ ప్రభు త్వం అలాంటిదేమీ చేయడానికి సుముఖత చూపడం లేదు. ఎందుకంటే అది స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు అసంతృప్తి కలిగి స్తుంది. అందుకే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా కోట్లాది మంది ప్రజలను బాధిస్తోంది. ధరల పెరుగుదలపై నియంత్రణను అమలు చేసేం దుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. బదులుగా,నిత్యావసర వస్తువుల చట్టాన్ని నిర్వీ ర్యం చేయడానికి చర్యలు తీసుకుంది. అధిక ధరలతో సామాన్యులు అల్లాడుతుంటే కార్పొరేట్లకు సూపర్‌ లాభాలు వచ్చేలా చేయడమే దీని ఉద్దేశం. ఒకవైపు ప్రభుత్వం ధరల పెరుగుదలను సులభతరం చేసే విధానాలను అవలంబిస్తోంది. మరోవైపు, కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఉద్యోగాలు, ఆదాయాలను కోల్పోయిన కార్మికులకు, ఇతర శ్రామికులకు ఎటువంటి ఉపశమనం అందిం చడానికి నిరాకరిస్తోంది. మహమ్మారి కాలంలో పేద వర్గాల కార్మికుల వాస్తవ ఆదాయాలు బాగా తగ్గాయి. దానివల్ల, మన దేశ సంపదను సృష్టించే కోట్లాది మంది కార్మికులు, శ్రమ జీవులు నేడు ఆకలి,పేదరికం లోకి నెట్టబడ్డారు. ప్రపంచ ఆకలి సూచీలో 2020లో 94వ స్థానంలో వున్న భారత్‌ 2021లో 101వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల కంటే దిగువన ఉంది. ఆకలి పెరిగిందంటే దేశంలో మనకు సరిపడా తిండి లేనందువల్ల కాదు. ప్రపంచ ఆకలి సూచీలో మన స్థానం పడిపోతున్నప్పుడు, దేశంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి.1సెప్టెంబర్‌ 20 21న, ఎఫ్‌.సి.ఐవద్ద 50.2మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల ధాన్యం ఉచిత పంపిణీ కోసం ఈ నిల్వలను విడుదల చేయడం వల్ల నిరుపేదల ఆహార అవసరాలు తీరుతాయి. ధరలు కూడా తగ్గుతాయి. అందుకుగాను 26.2 మిలియన్‌ టన్నులు అవసరం. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం, ప్రముఖ ఆర్థికవేత్తల సిఫార్సుల్లో స్థిరమైన ఈ డిమాండ్‌ ఉన్నప్పటికీ, బిజెపి ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. బదులుగా, ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ధాన్యాలు, చెరకును ఉపయోగించేందుకు పథకం వేసింది ! ఒకవైపు వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు,సాధారణ ప్రజలు-కార్మికులు, రైతులు మార్కెట్‌ నుండి అధిక ధరలకు అదే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అధిక ధరల ద్వారా వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? నిజమైన ఉత్పత్తిదా రులకు, రైతులకు కాదు. కార్పొరేట్లు, పెద్ద భూస్వామ్య వర్గం ఆధిపత్యం చెలాయించే బడా వ్యాపారులకు, రుణదాతలకు చేరుతుంది. వీరే చిన్న రైతుల నుంచి చౌక ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారే మార్కెట్‌ను, ఉత్పత్తులను నియంత్రిస్తారు. స్పెక్యులేటివ్‌-ఫ్యూచర్‌ ట్రేడిరగ్‌లో మునిగి పోతారు. ఇది ధరల పెరుగుదలకు మరొక ప్రధాన అంశం.ధరల పెరుగుదల ద్వారా ప్రజలపై మోయలేని భారాలు మోపడాన్ని మనం ఇక సహించలేం.
పెట్రో బాంబు!
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు దౌడు తీస్తున్నాయి. 2014 తరువాత ముడి చమురు అత్యధిక ధర (బ్యారెల్‌ దాదాపుగా 100 డాలర్లు)కి చేరింది. ఐతే, ఏరోజుకా రోజు ధరలు పెరిగే మన దేశంలో 110 రోజుల నుండి ఒక్క పైసా ధర కూడా పెరగలేదు. బ్యారెల్‌ ధర 82 డాలర్లు ఉన్నప్పుడు మన దేశంలో చివరిసారిగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ తరువాత నాలుగు నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగకపోవడానికి కారణం ఎన్నికల రాజకీయాలేనన్నది సర్వ విదితం. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ముడి చమురు ధర ఒక డాలరు పెరిగితే దేశంలో ఒక లీటరు పెట్రోలు, డీజల్‌పై 45 నుండి 50 పైసలు పెరుగుతుందని, ఎన్నికల కారణంగా ధరలు నియంత్రించిన గత 110 రోజుల్లో ఆయిల్‌ కంపెనీలు కోల్పోయిన మొత్తాన్ని కూడా కలుపుకుంటే ఈ పెరుగుదల 10 రూపాయల వరకు ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఈ విశ్లేషణలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఖండిర చడం లేదు. దీనిని బట్టే రానున్న రోజుల్లో ధరాభారం ఖాయమనే స్పష్టమౌతోంది. అంత ర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి తాజాగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది ఇటీవల పరిణామం. అంతకన్నా ఆయిల్‌ ఉత్పత్తి చేసే దేశాల ధనకాంక్షే అసలు కారణం. ఉక్రెయిన్‌ మీద రష్యా యుద్ధాన్ని ప్రారంభిస్తే, అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తుందని, అదే జరిగితే ముడిచమురు సరఫరాలో కొరత ఏర్పడు తుందన్న అంచనాల ఆధారంగా ప్రస్తుతం ధరలను పెంచుతున్నారు. తమకు యుద్ధం చేసే ఉద్దేశ్యమే లేదని, ఇప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న రష్యా ప్రకటనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే ఈ ప్రచారం సాగుతోంది. ముడి చమురు కోసం ప్రపంచం రష్యా మీదనే ఆధారపడి లేదు. పెట్రోలియం ఉత్పత్తిలోఆ దేశంది మూడవ స్థానం.అమెరికా, సౌదీ అరేబియాలు మొదటి రెండు స్థానాలో ఉన్నాయి. నిజంగానే చమురు ఉత్పత్తితో సమస్యలు ఏర్పడితే ఇతర దేశాలు తమ సరఫరాలను పెంచవచ్చు. కానీ,రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్లకు అదనంగా ఒక్క బ్యారెల్‌ను కూడా ఉత్పత్తి చేయబోమని ఒపెక్‌ దేశాలు ప్రకటించడం దేనికి నిదర్శనం? నిజానికి, బ్యారెల్‌ ధరను వంద డాలర్లకు చేర్చాలని ఈ దేశాలు ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్నాయి. తాజా సంక్షోభాన్ని దానికి అవకాశంగా వాడుకున్నాయి. ఇప్పుడు నెలకొన్న పరిస్థితే ధరల పెరుగుదలకు కారణమైతే యుద్ధ వాతావరణం మారి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ధరలు తగ్గుతాయా? ప్రస్తుతం ఊహల మీద ఆధారపడి ధరలను పెంచివేసిన ఆయిల్‌ ఉత్పత్తి చేసే దేశాలు అలా తగ్గించడానికి ఒప్పుకుంటాయా? ఈ ప్రశ్నకు సమాధానమేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశానికి వస్తే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో భాగంగా అప్పటివరకు ఇరాన్‌తో ఉన్న ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకున్నాం. స్థిరమైన ధరకే చమురును అమ్మడానికి, మన కరెన్సీలో చెల్లింపులను స్వీకరించడానికి సిద్ధపడినా, ఇరాన్‌తో ఒప్పందాన్ని కాలదన్నుకున్నాం. దానికి బదులు బేషరతుగా సౌదీ నుండి పెట్రో ఉత్ప త్తులను కొంటున్నాం. దీనివల్ల దేశానికి నష్టం జరుగుతుందని, ధరలు పెరుగుతాయని అప్పట్లోనే వామపక్షాలు హెచ్చరించాయి. వామపక్షాల హెచ్చరికల్లోని వాస్తవాలు పెట్రో ఉత్పత్తులతో పాటు వివిధ రంగాల్లో ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి. అయినా పాలక వర్గాల ఆలోచనల్లో మాత్రం ఏమాత్రం మార్పు లేకపోగా అమెరికాకు మరింతగా సాగిల పడటానికే మోడీ ప్రభుత్వం సిద్ధమౌ తోంది. సామాన్యుడు చెల్లించే పెట్రో ధరల్లో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఇంత పన్నుల భారం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. మూలధరతో పన్నుల శాతం ముడిపడి ఉండ టంతో ధరలు పెరిగే కొద్ది పన్నుల రూపంలో జమ అయ్యే మొత్తం పెరుగు తుంది. అందులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు వీలుగా పన్ను బదులు సర్‌చార్జీ లను పెంచుతూ పోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇలా ప్రజల్ని కొల్లగొట్టి దానిని రాయితీల రూపంలో కార్పొరేట్లకు దోచిపెడు తోంది. ప్రజా క్షేమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రో ధరలను నియం త్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీనికోసం రాష్ట్రాలు నష్టపోకుండా పన్నుల విధానంలో అవసరమైన మార్పులు చేయాలి. ప్రజలను ధరాఘాతం నుండి ఆదుకోవాలి. లేకపోతే, దాని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి సామాన్యులకు గుదిబండ అవుతుంది. రోజువారీ నిత్యా వసరాల ధరలు వాటంతటవే పెరగవు. సామాన్య ప్రజల ఖర్చుతో బడా వ్యాపార-పెద్ద భూస్వామ్య తరగతి లాభాల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వమే పూనుకుంటోంది. ఇది నేటి పాల కుల నిజ స్వరూపం. ధరలు తగ్గించాలని, ప్రజలకు ఉపశమనం కల్పించాలని సిఐటియు, ఇతర కేంద్ర కార్మిక సంఘాలు పోరా డుతున్నాయి. కాబట్టి…ప్రభుత్వాన్ని మనం డిమాండ్‌ చేద్దాం. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌)ను సార్వత్రీకరించాలి. పిడిఎస్‌ కింద 14 నిత్యావసర వస్తువులను అందించాలి.
ఆహార ధాన్యాల స్పెక్యులేటివ్‌-ఫ్యూచర్‌ ట్రేడిరగ్‌పై నిషేధం విధించాలి. పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తక్షణం తగ్గించాలి.విద్య, ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ప్రభుత్వ సంస్థల ద్వారా పేదలం దరికీ ఉచిత విద్య, ఆరోగ్య సేవలు అందిం చాలి. ఆదాయ పన్ను చెల్లించని కుటుం బాలకు నెలకు రూ. 7500 అందివ్వాలి. ఆహార,ఆరోగ్య సంబంధిత సహాయాన్ని అందించాలి. నయా ఉదారవాద ఎజెండాకు కట్టుబడి…మోడీ ప్రభు త్వం కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టడాన్ని కార్మిక వర్గం అనుమతించదు. శ్రమజీవులు ఉమ్మడి పోరు ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పైడిమాండ్లను సాకారం చేసుకోగలరు. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను ఎత్తివేయాలంటూ బిజెపి ప్రభుత్వం మెడలు వంచిన చారిత్రాత్మక రైతు పోరాట విజయం నుండి మనం నేర్చుకునే పాఠం ఇది. –సైమన్‌ గునపర్తి