హామీలు ఇచ్చి..అమలు మరిచి..!

ఎన్నికల సందర్భంగా ఇచ్చీ హామీలు అన్నీ అమలు చేయడం, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వనికీ సాధ్యంకాదు. కానీ, ఏవో కొన్ని ఉచితాలు తప్ప, ఇచ్చిన హామీలు ఏవీ, ముఖ్యంగా సుస్థిర అభివృద్ధికి ఆడగా నిలిచే హామీలు ఏవీ అమలు చేయని ఘనత మాత్రం నిస్సందేహంగా వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి మాత్రమే దక్కుతుంది.
ప్రభుత్వ ఉద్యోగుల విషయమే తీసు కుంటే, 2019 ఎన్నికలకు ముందు ఆయన, సాధ్యా సాద్యాల గురించి క్షణమైనా ఆలోచించ కుండా, సీపీఎస్‌ రద్దు చేస్తామని హమీ ఇచ్చారు. అదికూడా ఎప్పుడో కాదు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే సీపీఎస్‌’ను ఎత్తేసి మళ్ళీ పాత పెన్షన్‌ పద్దతిని తెస్తామని హమీ ఇచ్చేశారు. ఉద్యోగులు ఆశ పడ్డారు …గుడ్డిగా ఓట్లు గుద్ది గెలిపించారు. అయినా, వారం పోయి వందవా రాలు అయినా, సీపీఎస్‌ పోలేదు ..చివరకు ఆల్‌ ఇన్‌ వన్‌ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అబ్బే అప్పుడు ఏదో తెలియక తప్పుచేశాం… సీపీఎస్‌ రద్దు సాధ్యంకాదని చావు కబురు చల్లగా చెప్పారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసన సభలో అమరావతి రాజధాని అంటే ఓకే అన్నారు. రాజ ధాని బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుమారు 40నిముషాలకు పైగా సాగిన ప్రసం గంలో అధికార వికేంద్రీకరణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ పేరిట మూడు రాజధా నుల ముచ్చట తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనను, మూత కట్టి అటకెక్కించారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌’ను రాజధాని లేని రాష్ట్రంగా త్రిశంకు స్వర్గంలో వెళ్లాడ దీశారు. ఇక అంచెల వారీ సంపూర్ణ మధ్య నిషేధం హామీ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. సంపూర్ణ కాదు , పాక్షిక మధ్య నిషేధం కూడా మరో పాతికేళ్ళు వెనక్కి నేట్టేశారు. జగన రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, మరో 25 సంవత్సరాల పాటు, ఆంధ్ర ప్రజలు చచ్చినట్లు ప్రతి రోజు మందు తాగకే తప్పదు. చావకా తప్పదు. రానున్న 25 సంవత్స రాలలో మద్యం అమ్మకాల మీద వచ్చే అదా యాన్ని పూచికత్తుగా పెట్టి జగనన్న అప్పు తెచ్చుకు న్నారు.సో …మరో రెండేళ్లలో ఈ ప్రభుత్వం పోయినా,జగన్‌ రెడ్డి జ్ఞాపకంగా నిత్య మధ్య విధా నం కొనసాగుతూనే ఉంటుంది.మధ్య నిషేధం సంగతి దేవుడెరుగు, ప్రభుత్వమే మద్యం వ్యాపా రంలో పీకలలోతు కూరుకుపోయింది. బడి పం తుళ్ల చేత మధ్యం అమ్మించే ‘ఎత్తు’కు ఎదిగిపో యింది.
అలాగే, పోలవరం ప్రాజెక్టు, 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హమీ ఇచ్చారు. రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి అనీల్‌ కుమార్‌, అసెంబ్లీలో విపక్షాలను అవహేళన చేస్తూ 2021 డిసెంబర్‌ చివరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, జరిగింది ఏమిటో .. అందరికీ తెలుసు. పోల వరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ వదిలిందో .. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత కూడా అక్కడే వుంది. జగన్‌ రెడ్డి ప్రభు త్వం ప్రాజెక్టు పనులకు చాపచుట్టేసింది. అయితే జగన్‌ రెడ్డి ప్రభుత్వం చెప్పినవి చేయక పోయినా, చెప్పనివి చాలా చేసింది.చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్ళలో ఎప్పుడు పెంచని ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ చార్జీలు జగన్‌ సర్కార్‌ పెం చింది. ఇలా, జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీలు తప్పడం అలవాటుగా చేసుకుంది.అందుకే, రాష్ట్ర అభివృద్ది కోరుకునే ప్రతి ఒక్కరూ, ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు.
నెరవేరని హామీలు
ఈ వాగ్దానాల అమలు కోసం రాష్ట్రంలోని 123 నగర కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, నగర పంచాయతీ లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పరిధిలోకి వచ్చే సుమారు 46 వేల మంది పారిశుధ్య కార్మికులు గత నాలు గున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడు తున్నారు. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గోదాలోకి దిగిపో యాయి. ‘మాట తప్పం, మడమ తిప్పంఅంటూ మీరిచ్చిన హామీలను అమలు చేయకుండా మరలా ఎన్నికలకు ఎలా వెళ్తారు?’ అని ప్ర్రశ్నిస్తూ మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్‌ మోగించారు. ‘ఇంకో ఆరు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తాం.టైం స్కేలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన జీతం అమలు చేస్తాం. వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తాం’ అంటూ గత ఎన్నికలకు ముందు సంకల్ప పాదయాత్రలోనూ, శాసనసభలోను ప్రతిపక్ష నాయకుడిగా వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకోసం డిసెంబర్‌ 26వ తేదీ నుండిఎ.పిమున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లా యీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికులు నిరవధిక సమ్మెకుదిగారు. ఈ వాగ్దానాల అమలు కోసం రాష్ట్రంలోని 123 నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు,నగర పంచా యతీలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పరిధిలోకి వచ్చే సుమారు 46వేల మంది పారిశుధ్య కార్మికులు గత నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గోదాలోకి దిగిపోయాయి. ‘మాట తప్పం, మడమ తిప్పం అంటూ మీరిచ్చిన హామీలను అమలు చేయకుండా మరలా ఎన్నికలకు ఎలా వెళ్తారు?’ అని ప్రశ్నిస్తూ మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్‌ మోగించారు.
పాలకులందరిదీ ఒకటే దారి
అధికార పీఠం ఎక్కే ముందు చెప్పే మాటలకు తీరా గద్దెనెక్కిన తర్వాత అనుసరించే విధానాలకు పాలకులందరిది ఒకటే దారి! ’’తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కిస్తే రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తాం’’ అంటూ 2014ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ప్రకటించింది టిడిపి. తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు మొండి చేయి చూపింది. కనుక తెలుగుదేశం పార్టీ 2019ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకు నేందుకు నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి నేత జగన్మోహన్‌ రెడ్డి గారు కాంట్రాక్ట్‌, ఔట్‌సో ర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఊరూవాడతో పాటు అసెంబ్లీలోను ఊదర గొట్టారు. గత నాలుగున్నరేళ్లుగా ఔట్‌సో ర్సింగ్‌ కార్మికులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. వారి ఆశలను గత టిడిపి ప్రభుత్వం మాదిరిగానే వైసిపి ప్రభుత్వం కూడా అడియాసలు చేసింది.
ప్రభుత్వ ప్లాప్‌ సినిమా ఆప్కాస్‌
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చీ రాగానే ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఆప్కాస్‌ పేర శఠగోపం పెట్టింది. గతంలో మధ్యవర్తి కాంట్రాక్టర్‌ ద్వారా పని చేసిన కార్మికులను దోపిడీ నుండి విముక్తి చేసేందుకు ఆప్కాస్‌ తెస్తున్నామంటూ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు. ప్రతి పట్టణంలో ఉన్న మధ్య దళారీల బెడదైతే తొలగిపోయింది కానీ వైసిపి ప్రభుత్వం ద్వారా కొత్త సమస్యలు కార్మికులను చుట్టుముట్టాయి. అందుకు ఉదాహరణ గతంలో మున్సిపల్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ పద్ధతి అమలులో లేదు. ఆప్కాస్‌ వచ్చాక రిటైర్మెంట్‌ విధానాన్ని బలవం తంగా కార్మికులపై రుద్దారు. ఆప్కాస్‌ మున్సిపల్‌ కార్మికులతో పాటు ఇతర డిపార్ట్‌మెంట్లలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ ఉద్యోగులుగా నమోదు చేశారు. ఉద్యోగులకు అమ లు చేస్తున్న జీతభత్యాలు,సరెండర్‌ లీవులు, గ్రాట్యుటీ,పెన్షన్‌ వంటి పథకాలు ఏవీ వీరికి వర్తింపచేయలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారైంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల పరిస్థితి. ఆప్కాస్‌లో ఉద్యోగులుగా నమోదు చేసినందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎగిరిపోయాయి. పిల్లలకు అమ్మఒడి,ఫీజు రీయం బర్స్‌మెంట్‌, కుటుంబ సభ్యులకున్న వితంతు/వృద్ధాప్య పెన్షన్‌ దారులకు పెన్షన్‌ కట్‌ చేశారు. దీనితో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్‌ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు,చెత్త పన్ను వంటివి కార్మికుల నెత్తిన బండ లుగా మారాయి. ముఖ్యమంత్రి గారు నవర త్నాలు ప్రారంభిస్తూ పారిశుధ్య కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన హామీ అటకెక్కింది.
కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఒకటేనన్నారే !
అధికార పీఠం ఎక్కక ముందు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఒక్కటే, పేరులోనే తేడాలు తప్ప. చదువులు విధులు ఒక్కటే అన్నారు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి అయ్యాక అందుకు విరుద్ధంగా కాంట్రాక్టు కార్మికులను మాత్రమే పర్మినెంట్‌ చేస్తూ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను గాలికొదిలేశారు. దసరా సందర్భంగా కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తూ జీవో నెంబర్‌ 114ను జారీ చేసే సందర్భంలో తమకు కూడా తీపి కబురు వస్తుందని ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరూ వేయి కళ్ళతో ఎదురు చూశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం కటాక్షించలేదు. గత టిడిపి ప్రభుత్వం, వైసిపి ప్రభుత్వం రెండిరటికి తేడా కనిపించడంలేదు. దొందూ దొందే చందంగా వుంది.
చర్చలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం
ఈ సమస్యపై మున్సిపల్‌ రంగంలోని అన్ని సంఘాలు కలిసి 2022 జులై 11 నుంచి 15వ తేదీ వరకు సమె నిర్వహించాయి. ఈ సమ్మెకు ముందు జులై ఏడో తేదీన డిఎన్‌ఏ ఆధ్వర్యం లోనూ, సమ్మె ప్రారంభమైన జులై 11వ తేదీ ఇరువురు మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి నేతృత్వంలో అన్ని సంఘా లతో సచివాలయంలో చర్చలు జరిగాయి. 2022 జనవరి నుండి జీతాలు 3000 రూపా యలు పెరిగాయి కనుక హెల్త్‌ అలవెన్స్‌ రూ.6000 కాకుండా రూ.3000 మాత్రమే చెల్లిస్తామంటూ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇంజనీరింగ్‌ కార్మికులకు సంబంధించి జీవో ఆర్టీ నెంబర్‌ 30సవరించి వాటర్‌ సప్లై, వర్క్‌ ఇన్‌స్పె క్టర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, షైన్‌ దళం మొద లగు ఎనిమిది కేటగిరీలకు కార్మిక శాఖ ప్రతిపా దనల మేరకు జీతాలు చెల్లిస్తామని, పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలోకి వచ్చే చెత్త తరలించే వాహన డ్రైవర్లు మలేరియా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కార్మికులకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ చెల్లిస్తామని, పారిశుధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్‌ కార్మికులకు కూడా సంక్షేమ పథకాల అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. పారిశుధ్య కార్మికులకు రూ.6000 హెల్త్‌ అలవెన్స్‌ మాత్రమే చెల్లిస్తూ మంత్రి గారు ఏకపక్షంగా ప్రకటించి ఇంజనీరింగ్‌ కార్మికులకు ద్రోహం చేశారు. అప్పటివరకు పారిశుధ్య కార్మికులకు అమలైన సంక్షేమ పథకాలను 2022 ఆగస్టు ఒకటో తేదీ నుండి ఎత్తివేశారు.
హామీల అమలు కోసం సమరశీల పోరాటాలు
పట్టణాల విస్తరణ మేరకు పని భారం పెరిగి కార్మికులు అవస్థలు పడుతుంటే సిబ్బంది సంఖ్యను పెంచాలని కార్మికులు నిలదీస్తున్నారు. సిబ్బందిని పెంచుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి అంటూ 44మున్సిపాలిటీలు ఆర్థిక శాఖకు మొరపెట్టుకొని ఏళ్లు గడుస్తున్నా అనుమతి ఇవ్వడం లేదు. రోడ్లమీద పని చేయాల్సిన కార్మికులను అధికారులు డ్రైవర్లు గాను ఇతర పనుల కోసం పెద్ద సంఖ్యలో వినియోగించుకుం టున్నారు. దీనివల్ల వీధుల్లో పని చేస్తున్న కార్మి కులపై మోయలేని పని భారంపడుతున్నది. దీనితోపాటు జీవో నెంబర్‌ 30 సవరణ, పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలోని వారికి హెల్త్‌ అలవెన్స్‌, ముఖ్య మంత్రి హామీలైన సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మినెంట్‌, సిపిఎస్‌ రద్దు డిమాండ్ల సాధన కోసం సిఐటియు అనుబంధ సంఘం మే,జూన్‌ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు బస్సుయాత్రలు నిర్వహించింది.ఆగస్టులో మున్సి పల్‌ కార్యాలయాల ముట్టడి,జిల్లా కలెక్టరేట్ల ముట్టడి మిలిటెంట్‌గా జరిగాయి. అనేక జిల్లాల్లో మహిళా కార్మికులతో సహా తలలు పగిలి చేతులు విరిగాయి. పోలీసు నిర్బంధం పెద్ద ఎత్తున కొన సాగింది. రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మార డంతో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సిఐటియు అనుబంధ సంఘంతో ఆగస్టు 10వ తేదీన ప్రత్యేకంగా చర్చలు జరిపారు. గత నాలుగున్నరేళ్లలో 20 నుండి 25 దఫాలు చర్చలు జరిగినప్పటికీ ఏఒక్క సమస్యాపరిష్కారం కాలేదు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని డిసెంబర్‌ 21వ తేదీ తరువాత సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి అధికారులకు సిఐటియు అనుబంధ సంఘం సమ్మె నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఏఐటీయూసీ నాయకత్వం కూడా డిసెంబర్‌ 27 నుండి సమ్మెలోకి వెళ్తామంటూ ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైశ్రీలక్ష్మి డిసెంబర్‌ 14వ తేదీ మున్సి పల్‌ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. ప్రధా నమైన డిమాండ్లు ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకునే దిశలో చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో సిఐటియు అనుబంధ సంఘం డిసెంబర్‌ 26వ తేదీ నుండి నిరవధిక సమ్మె తేదీని ప్రకటించింది. సమ్మెని ఫెయిల్‌ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్థానిక మున్సిపల్‌ అధికారులను రంగంలోకి దించి మున్సిపల్‌ కమిష నర్ల ఆధ్వర్యంలో జాయింట్‌ మీటింగులు పెట్టి స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం. మీరు సమ్మెలోకి వెళ్ళొద్దంటూ కార్మికులను లొంగదీసుకునేందుకు, బెదిరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు,హెచ్చరికలను లెక్క చేయకుండా కార్మికులు తమన్యాయమైన డిమాం డ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు సర్వం సన్నద్ధం చేస్తున్నారు. సమ్మె జయప్రదం కావడం కోసం ప్రజల మద్దతు కోరుతున్నారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం డిమాం డ్లతో ఆంధ్రప్రదేశ్‌ లోని పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. -(కె.ఉమామహేశ్వరరావు)

ఎటు చూసినా నిరసనలే..

రాష్ట్రం ఇప్పుడు ఉద్యమాంధ్రగా మారింది. ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా వర్కర్లు, ఇంకోవైపు మున్సిపల్‌ కార్మికులు జగన్‌ సర్కారుపై ధ్వజమెత్తుతున్నారు. సమస్య లు పరిష్కరించాలంటూ ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ముందు జగన్‌ గొప్పగా ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ… వాటిని నిలబెట్టుకోవాలంటూ నాలుగు రోజులుగా అంగన్వాడీలు సమ్మె బాట పట్టారు. సమస్యల పరిష్కారం కోసం 36 గంటల దీక్ష చేసిన ఆశావర్కర్లు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మున్సిపల్‌, పారిశుధ్య కార్మిక సంఘాలు తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 27 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే హెచ్చరించాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షమంది అంగన్వాడీలు సమ్మెబాట పట్టడంతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలు తెరిపించి బెదిరింపులకు పాల్పడినా అంగన్వాడీలు వెనక్కి తగ్గడం లేదు. చాలా చోట్ల అంగన్వాడీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపడంలేదు. ఇక ఆశావర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నాలుగున్నరేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌, పారిశుధ్య కార్మికుల గోడునూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జగన్‌ ఉద్యోగులనే గాక తమనూ మోసం చేశారని ప్రభుత్వ రంగ కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల నుంచి క్రమబద్ధీకరణ వరకూ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగులు హక్కుల కోసం ఆందోళన బాట పడితే ప్రభుత్వం కేసులతో భయపెట్టేది. నాలుగున్నరేళ్లుగా విసిగిపోయిన కార్మికులు, ఉద్యోగులు కేసులకు భయపడకుండా సమ్మె బాట పడుతున్నారు.
అక్కాచెల్లెమ్మల ఆక్రోశం
‘బటన్‌’ నొక్కుడు అయినా, బహిరంగ సభ అయినా సీఎం జగన్‌.. ‘నా అక్కాచెల్లెమ్మలు’ అని సంబోధిస్తుంటారు. అయితే వారి సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరీ మాట తప్పారంటూ అంగన్వాడీ సిబ్బంది ఆక్రోశిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మరోవైపు తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఇప్పటికే ధర్నాలు, నిరసనలు చేపట్టిన ఆశావర్కర్లు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జగనన్నా.. మాటిచ్చి మరిచారే?

తాను అధికారంలోకి వస్తే తెలంగాణలో కంటే అంగన్వాడీ వర్కర్లకు రూ.1000 ఎక్కువ జీతం ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు రూ.13,650 ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.11,500 మాత్రమే ఇస్తున్నారు. ఎన్నికల హామీ ఏమైంది జగనన్నా అంటూ అంగన్వాడీ సిబ్బంది మండిపడుతున్నారు.
కార్మికుల కష్టాలు
మున్సిపల్‌, పారిశు?ధ్య కార్మికులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు. జీతాలు పెంపు, ఇతర ప్రయోజనాలు, క్రమబద్ధీకరణ కోసం నాలుగున్నరేళ్లుగా ఎన్నోసార్లు నిరసనలు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
మా గోడు వినండి
సీఎం మానసపుత్రికగా చెప్పుకొనే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. దాదాపు 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో శాఖకు సంబంధించిన ఒక్కో రకమైన సమస్య ఉన్నా ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదు. సరెండర్‌ లీవ్‌లు ఎన్‌క్యాష చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. తమకు ‘ఖాకీ’ వద్దని మొత్తుకుంటున్నా సచివాలయ ఉద్యోగులను మహిళా పోలీసులుగా మార్చారు. దీంతో వారు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పనిభారం తీవ్రమైందంటూ డిజిటల్‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖలో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లు, సచివాలయాల ద్వారా నియమితులైన ఏఎన్‌ఎంలు, ఇతర శాఖల ఉద్యోగులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.అంగన్వాడీలు మొత్తం సిబ్బంది: దాదాపు లక్ష మంది జగన్‌ హామీ ఇదీఅంగన్వాడీ సిబ్బందికి తెలంగాణలో ఇస్తున్న జీతాల కంటే కనీసం రూ.1000 ఎక్కువగా ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ
తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు రూ.13, 650, హెల్పర్లకు రూ.7,800, మినీ వర్కర్లకు రూ.7,800 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500 హెల్పర్లకు రూ.7,000, మినీ వర్కర్లకు రూ.7000 ఇస్తున్నారు. జగన్‌ సర్కారు వచ్చాక అంగన్వాడీలకు రూ.1000 పెంచి చేతులు దులుపుకొంది. ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచలేదు. జీతాలు పెంచాలని అంగన్వాడీ సిబ్బంది అనేకసార్లు వినతులు ఇచ్చారు. రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అయినా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా… వారి కుటుం బ సభ్యులకు సంక్షేమ పథకాలు కట్‌ చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు.
అంగన్వాడీల డిమాండ్లు
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలి.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి.
రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలి. ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వాలి.
చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యో గం ఇవ్వాలి.
మిని సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి.
ఉపాధి సిబ్బందికి ‘హామీ’ ఏదీ?
గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే సెర్ప్‌ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయగా, ఉపాధి హామీ పథకం సిబ్బందికి మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. అంతేగాక ఉపాధి సిబ్బందికి రిటైర్మెంట్‌ వయో పరిమితి పెంచలేదు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్‌, ఔట్‌సో ర్సింగ్‌ ఉద్యోగులు అన్ని శాఖల్లో అరకొర జీతాలతో పనిచేస్తున్నారు. జగన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత వేతనాలు పెంచలేదు.పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేస్తా మన్న హామీని కొందరికే పరిమితం చేశారు. దీంతో లక్షల మంది సిబ్బంది లబోదిబో మంటున్నారు. ప్రభుత్వంపై గళమెత్తితే ఉద్యో గాలు పోతాయన్న భయంతో కొందరు ఉండ గా, మరి కొందరు ఏదో ఒక రూపంలో నిరస నలు తెలియజేస్తున్నారు. మున్సిపల్‌ కార్మికులు మొత్తం సిబ్బంది: 65 వేల మంది సమస్యలు పట్టని సర్కారు మున్సిపల్‌, పారిశుధ్య కార్మికు ల సమస్యలు పరిష్కరించడంలో జగన్‌ సర్కార్‌ విఫల మైంది. జీతాలు పెంచాలని, క్రమబ ద్ధీకరణ చేయాలని నాలుగున్నరేళ్లుగా ఎన్నో సార్లు కార్మికులు వినతులు ఇచ్చినా, నిరసనలు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్‌ 27 నుంచి సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. మున్సిపల్‌ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ(జేఏసీ) కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
కార్మికుల డిమాండ్లు ఇవీ
8 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజేషన్‌ చేయాలి. అప్పటి వరకు కనీస వేతనంగా రూ.20 వేలు, బేసిక్‌, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిపి ఇవ్వాలి. జీవో నంబరు 308ను సవరించి స్కిల్‌, అన్‌స్కిల్డ్‌ వారీగా సూపర్‌వైజర్ల వేతనాలు చెల్లించాలి. టైమ్‌ స్కేల్‌తో పాటు ఉద్యోగ, కార్మికులను రెగ్యులరైజేషన్‌ చేస్తూ 1992లో ఇచ్చిన జీవో 212ను సవరించాలి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వర్కర్లు మరణించినా, ప్రమాదాల బారిన పడినా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.పర్మినెంట్‌ కార్మికులకు జీపీఎఫ్‌ ఖాతాలు తెరవాలి. హెల్త్‌కార్డులు ఇవ్వాలి. ఆశావర్కర్లు మొత్తం సిబ్బంది: 42 వేలమంది నిరసనలు చేపట్టినా… జగన్‌ సర్కార్‌లో ఆశావర్కర్లకూ అన్యాయం జరిగింది. సమస్యల సాధన కోసం ఎన్నోసార్లు నిరసనలు తెలిపారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. తమకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తు న్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళ నలను ఉధృతం చేస్తామని ఆశావర్కర్లు హెచ్చరిస్తున్నారు.
ఇవీ డిమాండ్లు
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలి. పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలి. చనిపోయిన ఆశావర్కర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలి.-సైమన్ 

ఆర్ధిక ఇబ్బంద్లో రైతు భరోసా

రైతు భరోసా పథకం అనేది డైనమిక్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసిన రైతు మద్దతు,సాధికారత కార్యక్రమం.ఈసమగ్ర పథకం రైతులకు ఆర్థిక సహాయం మరియు ఇతర ప్రయోజనాలను అందించడం, వారి సామాజిక-ఆర్థిక శ్రేయస్సు మరియు అభ్యున్నతికి భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
వైఎస్సార్‌ రైతు భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వంరూ.7500,కేంద్ర ప్రభుత్వం రూ.6000 విరాళంగా ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధితో కలిపి సంవత్సరానికి 13,500 రూపా యల మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయ డం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం చేయ డానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం.ఇప్పటి వరకు ఐదువిడతలుగా రైతులకు రైతుభరోసా నిధులు అందజేశారు. వైఎ స్సార్‌ రైతు భరోసా-ప్రధానమంత్రి కిసాన్‌ పథ కం కింద రైతులకు సంవత్సరానికి రూ.13, 500 ఆర్థికసహాయం అందుతుంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500,భారత ప్రభుత్వం రూ.6,000 భరిస్తుంది.కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడుతారు. అన్న దాతలు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదిస్తే వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలోకి చేర్చుకుం టారు. రైతులు పొలం పట్టా,ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉం టుంది. అర్హులకు వైఎస్సార్‌ రైతు భరోసా స్కీమ్‌ కింద ఏపీ ప్రభుత్వం ప్రతిఏటా13,500 రూపా యలను మూడు విడతలుగా వారి బ్యాంక్‌ ఖాతా ల్లోకి నేరుగా జమ చేస్తుంది.
రైతుల్లో సంతోషం..
ఆంధ్రప్రదేశ్‌ లోని 38లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడానికి రూ.3785కోట్లను విడుదల చేస్తూ 2019అక్టోబర్‌ 15న రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ రైతు భరోసాను ప్రారంభించారు.మొక్కలు,ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు రైతుభరోసా కేంద్రా లను2020 మే30న ప్రారంభించారు. హార్టికల్చర్‌, ఆక్వాకల్చర్‌ మరియు వ్యవసాయ రంగాలకు 2019-20ఆర్ధిక సంవత్సరానికి మొత్తం రూ.6, 173 కోట్లు, 2020-21కి గాను రూ.6,928 కోట్లు ఖర్చు చేయబడిరది.%ళి6రి% రైతులకి ఆర్ధిక సహాయం కొనసాగించడానికి 2020-21ఆర్ధిక సంవత్సరానికిగాను హార్టికల్చర్‌, ఆక్వా కల్చర్‌ మరియు వ్యవసాయ రంగాలకు ఖర్చు చేసే రూ 6,928 కొట్లలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికె సగానికి పైగా అంటే రూ 3,615.60 కోట్లు కేటాయించడం జరిగింది
అంతర్జాతీయ గుర్తింపు
విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలందిస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రా లకు (ఆర్బీకే) ఇప్పుడు అంతర్జాతీయంగా అరుదైన ఖ్యాతిని గడిరచనున్నాయి. ఐక్యరాజ్య సమితి అను బంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) అందించే ప్రతిష్టాత్మక ‘ఛాంపియన్‌’ పురష్కారానికి ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం 2022 మే నెలలో నామినేట్‌ చేసింది.
అర్హత ప్రమాణం:..
రైతు భరోసా పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు, రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలి. వీటితొ పాటు రైతు ఆంధ్రప్రదేశ్‌ నివాసి అయి ఉండాలి.రైతుకు సాగు భూమిని కలిగి ఉండాలి.రైతుకు చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి.
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రయోజనాలు:..
రైతు భరోసా పథకం రైతులకు అనేక ప్రయోజ నాలను అందిస్తుంది, వీటిలో ఇవి ఉన్నాయి ఆర్థిక సహాయం ఒక్కో రైతుకు ఏడాదికి 13,500/-రూ.నీటిపారుదల సౌకర్యాన్ని అందించడానికి ఉచిత బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌.నష్టాలను తగ్గించడానికి పంట బీమా కవరేజీ.వ్యవసాయ కార్యకలా పాలకు మద్దతుగా వడ్డీలేని రుణాలు.కోత అనం తర నష్టాలను నివారించడానికి కోల్డ్‌స్టోరేజీ సౌకర్యాలు. మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ద్వారా మహిళా రైతులకు మద్దతు. నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచడం. హార్టికల్చర్‌ మరియు అనుబంధ కార్యకలాపాలకు పెట్టుబడి మద్దతు.
అమలు ప్రక్రియ..
రైతు భరోసా పథకం విజయవంతంగా అమలు కావడానికి ఈ క్రింది దశలను కలిగి ఉన్న క్రమ బద్ధమైన విధానాన్ని అనుసరించడం అవసరం: గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన రైతుల గుర్తింపు మరియు ధృవీకరణ. అవసరమైన వివ రాలు మరియు పత్రాలను సేకరించడం ద్వారా పథకంలో రైతుల నమోదు.రైతుల బ్యాంకు ఖాతా ల్లోకి నేరుగా ఆర్థిక సహాయం పంపిణీ. పారద ర్శకత మరియు ప్రభావాన్ని నిర్ధారించడానికి నిరంతర పర్యవేక్షణ మరియు మూల్యాంకనం.
ఆర్థిక సహాయం అందించబడిరది
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 13,500/-రూ.ఆర్థిక సహాయం మూడు విడతలుగా అందజేయగా, మొదటి విడతగా 7,500/-రూ. మరియు రెండవ విడత మొత్తం 4,000/-రూ. మరియు ఖరీఫ్‌,రబీ,యాసంగి సీజన్లలో వరుసగా 2,000/-రూ. రైతుల తక్షణ అవసరాలను తీర్చ డం మరియు వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ఆర్థిక సహాయం లక్ష్యం.
టైమ్‌లైన్‌లు మరియు షెడ్యూల్‌
రైతు భరోసా పథకం రైతులకు సకాలంలో ప్రయో జనాలను అందజేయడానికి చక్కగా నిర్వచించ బడిన కాలక్రమం మరియు షెడ్యూల్‌ను అనుసరి స్తుంది. ఆర్థిక సహాయం మరియు ఇతర సహాయ సేవల పంపిణీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించబడుతుంది, ఇది అధికారిక వెబ్‌సైట్‌లు,నోటిఫికేషన్‌లు మరియు స్థానిక పరి పాలనతో సహా వివిధ మార్గాల ద్వారా రైతులకు తెలియజేయబడుతుంది.
రైతులపై ప్రభావం..
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ఆంధ్రప్రదేశ్‌లోని రైతులపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపింది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం రైతులకు సాధికారత కల్పించడం ద్వారా సామా జిక-ఆర్థిక పరివర్తనను తీసుకువచ్చింది.ఈ పథకం రైతుల జీవనోపాధిని మెరుగుపరిచింది, గ్రామీణ ప్రాంతాల్లో కష్టాలను తగ్గించింది మరి యు మొత్తం గ్రామీణ అభివృద్ధికి దోహదపడిరది.
టెక్నాలజీ పాత్ర..
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని విజయవంతం గా అమలు చేయడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పథకం యొక్క సమర్థవంతమైన నిర్వహణ మరియు పర్యవేక్షణను సులభతరం చేస్తుంది,పారదర్శకత మరియు జవాబుదారీ తనాన్ని నిర్ధారిస్తుంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌లు మరియు మొబైల్‌ అప్లికేషన్‌ల వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫార మ్‌ల ఉపయోగం అతుకులు లేని నమోదు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మరియు పురోగతిని నిజ-సమయ ట్రాకింగ్‌ని అనుమతిస్తుంది, ఈ పథకాన్ని మరింత ప్రాప్యత మరియు రైతు-స్నేహపూర్వ కంగా చేస్తుంది.
విజయ గాథలు..
రైతు భరోసా పథకం అనేక విజయగాథలను చూసింది, రైతులకు సాధికారత కల్పించడంలో దాని ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అనేక మంది లబ్ధిదారులు తమ వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోగలిగారు,వారి ఆదాయ వనరు లను విస్తరింపజేసుకున్నారు మరియు మెరుగైన జీవన ప్రమాణాలను కలిగి ఉన్నారు. ఈ విజయ గాథలు ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తాయి మరియు గ్రామీణ వర్గాలపై పథకం యొక్క పరివర్తన ప్రభావాన్ని హైలైట్‌ చేస్తాయి.
ఎదుర్కొన్న సవాళ్లు..
విజయాలు సాధించినప్పటికీ,వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రధాన సవాళ్లలో ఇవి ఉన్నాయి..
నిజమైన లబ్ధిదారుల గుర్తింపు మరియు ధృవీకరణ.అర్హులైన రైతులందరికీ సమానమైన ప్రయోజనాల పంపిణీని నిర్ధారించడం. మారుమూల మరియు ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ప్రభావవంతమైన అమలు. దుర్వినియోగం లేదా అవినీతిని నిరోధించడానికి నిరంతర పర్యవేక్షణ మరియు మూల్యాంకనం.
భవిష్యత్తు పరిధి మరియు మెరుగుదలలు..
రైతు భరోసా పథకం భవిష్యత్తులో మెరుగుదలలు మరియు విస్తరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందు పరచడం,సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్స హించడం మరియు రైతులకు ఆదాయ వనరు లను వైవిధ్యపరచడం ద్వారా పథకాన్ని బలో పేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. ఈ పథకం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రా మ్‌లను ప్రవేశపెట్టడంతోపాటు అనుబంధ రంగా ల్లో ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని యోచిస్తోంది.
ప్రభుత్వ కార్యక్రమాలు..
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసేం దుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక కార్యక్ర మాలను చేపట్టింది.
నిధులను విడుదల..
రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందనేది ప్రతి రైతన్నా ఆలోచించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వైయస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ కింద వరుసగా ఐదో ఏడాది 2వ విడత పెట్టు బడి సాయాన్ని అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారం భించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహి రంగ సభలో సీఎం జగన్‌ రైమాట్లాడుతూ… రాష్ట్రంలోని 53.53లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్‌ నొక్కి నేరుగా దాదాపు రూ.2,200 కోట్లు జమ చేసే మంచి కార్యక్ర మానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొ న్నారు. ఈరోజు రేపటి లోపు మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లు నేరుగా ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇక పీఎం కిసాన్‌ కింద రావాల్సిన రూ.1,000 కోట్లు వాళ్లు ఇచ్చిన వెంటనే ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు.
రైతు ప్రభుత్వం మనది..
ఈ 53 నెలల్లోనే రైతుకు, రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతిచ్చిందో అందరికీ తెలిసిందేనని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్ర బాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్‌ చేసిన పనులను చేయలేక పోయాడో ఆలోచన చేయాలన్నారు.ఈ 53 నెలల కాలంలో 53 లక్షల పైచిలుకు రైతన్నలకు మంచి జరిగిస్తూ, ప్రతి రైతన్నకు నేరుగా బటన్‌ నొక్కి ఖాతాల్లోకి జమచేయడంవల్ల ఒక్కొక్కరికి దాదాపు రూ.65,500 ఇవ్వడం జరిగిందన్నారు. అయిదో విడత కింద రూ. 4వేలను ఒక్కో రైతు ఖాతాల్లో జమచేసేందుకు రూ.2,200 కోట్లు ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కేంద్రంతో సంప్రదించి రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరతానని సీఎం జగన్‌ తెలిపారు. కేవలం రైతు భరోసా పథకం ద్వారానే దాదాపు 53లక్షల పైచిలుకు రైతులకు రూ.33,209 కోట్లు ఆఅయిదేళ్లలోవారి ఖాతాల్లోకి నేరుగా పంప గలిగామన్నారు.
నిరుపేదలకు మంచి చేశాం కాబట్టే ..ప్రజలు వారి గుండెల్లో పెట్టుకున్నారు..
గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు స్పందన బాగుందని సీఎం జగన్‌ తెలి పారు. రైతులుగానీ, అవ్వాతాతలుగానీ, అక్కచెల్లె మ్మలుగానీ,చదువుకొనే పిల్లలుగానీ నా ఎస్సీ,నా ఎస్టీ,నా బీసీ,నా మైనార్టీ నా నిరుపేద వర్గాలు గానీ,ఈ వర్గాలకు మంచి చేస్తే,ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లో స్థానం ఇస్తారని చెప్పడానికి ఒకవైయస్సార్‌ గారిని చూసినా ఒక జగన్‌ ను చూసినా అర్థం అవుతుం దన్నారు. ఇదే విషయం సామాజిక సాధికార యాత్రలను చూసినా కనిపిస్తోందన్నారు.నా ఎస్సీలను,నాఎస్టీలను,నా బీసీలను, నా మైనార్టీలను నాయకత్వ రోల్‌లోకి తీసుకొచ్చి వాళ్ల చేత మీటిం గులు పెట్టిస్తున్నా తండోపతండాలుగా జనాలు కదిలి వస్తున్నారంటే ఎంతగా ప్రతి పేద వాడి గుండెల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానం ఉందో నిదర్శనంగా కనిపిస్తోందన్నారు. మీ బిడ్డ జగన్‌ కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగులే నిదర్శనమని, ప్రతి అడుగూ రైతన్నకు మంచి జరగాలి, పేద వాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీ,లు, నా మైనా ర్టీలు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, గొప్పగా చదవాలి, ఎదగా లని ఎంతో తపిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనదని సీఎం స్పష్టం చేశారు.
చంద్రబాబుకు మంచి చేయాలనే ఆలోచనలు ఎందుకు రాలేదు?..
గతంలో ఎప్పుడూ జరగని విధంగా, వైయస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా53లక్షల మంది పైచిలుకు రైతులకు,వారితోపాటు నాఎస్సీ,నా ఎస్టీ, నాబీసీ,నామైనార్టీ రైతులకు,ఆర్వోఎఫ్‌ ఆర్‌ రైతు లకు రూ.13500 చొప్పు న ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా?14సంవత్స రాలు సీఎంగా ఉండి,మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీ లో కూర్చుని కూడా రైతులకు మంచి చేయా లనే ఆలోచన చంద్రబాబుబుర్రలో ఎందుకు రాలే దని సీఎం జగన్‌ ప్రశ్నించారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది మన ప్రభు త్వం మాత్రమేనని,గతంలో పగలూ,రాత్రి రెండు సమయాల్లో కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా వ్యవసాయానికి ఎందుకు కరెంటు ఇవ్వ లేదని సీఎం జగన్‌ ప్రశ్నించారు.వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు 1700కోట్లు ఖర్చు చేశా మన్నారు. పంటల బీమాగా రైతన్న ఒక్క రూపా యి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంను కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ,రైతన్నకు తోడుగా నిలబడుతున్న పరిస్థి తులు చూస్తున్నామని సీఎం తెలిపారు. 53 నెలల కాలంలో దేవుడి దయతో నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదన్నారు.చంద్రబాబు హయాంలో వరుసగా 5సంవత్సరాలు కరువే కరువు అని ఎద్దేవా చేశారు.
ప్రజలు ఆలోచించాలి.. అబ్దాలను నమ్మవద్దు
స్కిల్‌ డెవపల్‌ మెంట్‌ ఒకస్కామ్‌,ఫైబర్‌ గ్రిడ్‌, మద్యం,ఇసుక ఇంకో స్కామ్‌. రాజధాని భూములు ఇంకో స్కాం ఇలా చంద్రబాబు పేరు చెబతే స్కామ్‌లే గుర్తుకు వస్తాయని, స్కీములు గుర్తుకు రావని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్న కు చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు అధికా రంలోకి రావడానికి రూ.87,612 కోట్ల వ్యవ సాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆ మాటలు నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చాడు. రైతులను మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేట్టుగా చేశాడు. రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. అప్పటిదాకా ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చాడు. ముస్టి వేసినట్లు రూ.15 వేల కోట్లు విదిల్చిన పరిస్థితులు. ఈరోజు మీ బిడ్డ హయాంలో నాలుగు సంవత్సరాల కాలం 53నెలల పాలనలో ఎక్కడాకరువు మండ లంగా డిక్లేర్‌ చేయాల్సిన పరిస్థితి రాలేదు. రాష్ట్రం లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి.చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలన్నది ఆలోచన చేయాలి. ప్రజలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వా తాతలకు, చదువుకుంటున్న పిల్లలకు, నిరుద్యో గులకు మంచి చేయడం కోసం కాదు. -జిఎన్‌వి సతీష్‌

ఆహార అభద్రతలో ఆదివాసీలు

ఆహార భద్రత ప్రధాన లక్షణంగా జీవించే స్వయం సమృద్ధ ఆదివాసీ జీవన విధానంలోకి వాణిజ్య పంటలను చొప్పించడం ఎంత వరకు సమంజసం? గిరిజన జీవన శైలిలో అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం వారికి డబ్బు సంపాదించాలనే యావ, ఆధునిక సౌకర్యాల పైన మోజు లేకపోవడం. తినడానికి కావలసినంత కష్టపడటం, తర్వాతంతా కావలసినంత తీరిక. రంప చోడవరం ఏజెన్సీలోని కొండరెడ్లేతోనే కాదు, నా పనిలో భాగంగా నల్లమల లోని చెంచు లతో, ఆదిలాబాద్‌ లోని గోండులతో, జార్ఖండ్‌లోని ముండా తెగ వారితో,పశ్చిమ బెంగాల్‌ లోని సంథాల్‌ లతో ఇలా ఎన్నో గిరిజన తెగల వారితో పని చేయడం జరిగింది. ఈ అన్ని ప్రాంతాలలోను నేను గమనించింది ఒకటే. అభివృద్ధి, నాగరికతల పేరుతో జరుగుతున్న గిరిజనుల సంత ృప్తికరమైన, స్వయం సమృద్ధమైన జీవితాల విధ్వంసం. ఆదివాసీ సంస్కృతి పై, వనరులపై జరిగే మరోదాడి పర్యాటకం అనే రూపంలో కూడా కొనసాగడం నేను గమనిం చిన మరొక అంశం. పశ్చిమ బెంగాల్‌ లోని భీర్‌భమ్‌ జిల్లాలోని బోల్‌పూర్‌ (ఇక్కడే రవీంద్రుని శాంతినికేతన్‌, ప్రస్తుత విశ్వ భారతి యూనివర్సిటీ ఉంది) దగ్గర ఒక సంతాల్‌ గిరిజన గ్రామాన్ని గతంలో నేను సందర్శించడం జరిగింది. గిరిజనుల సంస్క ృతి సంప్రదాయాలలోని విభిన్నతను, వైవిధ్యాన్ని నాగరీకులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతోఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఆ గ్రామాన్ని రూరల్‌ టూరిజం (గ్రామీణ పర్యాటక) కేంద్రంగా మార్చింది. పర్యాటకులు అక్కడ బస చేసేందుకు కాటేజ్‌ లు నిర్మించి, అక్కడి ఆదివాసీలలో కొందరికి గైడ్లుగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. శాంతినికేతన్‌ కు వచ్చే పర్యాటకులు అక్కడికి కేవలం మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో పచ్చటి అడవిలో ఉన్న ఈ గ్రామంలో విడిది చేయడం, కాలుష్యానికి కల్మషానికి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆ గిరిజన గ్రామాన్ని చెత్త, కాలుష్యంతో నింపేయడం తప్ప ఈ పర్యాటక కేంద్ర హోదా వల్ల ఆ ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు. కొంచెం బియ్యం, కారం దొంగతనం చేశాడనే ఆరోపణపై ఇటీవల కేరళలో కొట్టి చంపబడిన ఆదివాసీ యువకుడు మధు ఉదంతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రధాన, సామాజిక మీడియాలలో విస్త ృతంగా చర్చించబడ్డ ఈ సంఘటన నిజంగానే ఒక దారుణం. మానవత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చిన దురెటన. ఎవరైతే మధుని కొట్టి చంపారో ఆ గుంపులోని వ్యక్తులే ఆ సంఘటనను చిత్రీకరించి సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెంటనే వెలుగులోకి వచ్చింది కానీ నిజానికి ఈ మధు ఒంటరి వాడు కాదు. ఆదివాసీలపై ఇటువంటి వివక్ష, దాడులు కొత్త కూడా కాదు.కొన్ని సంవత్సరాల క్రితం గిరిజనులకు సంబంధించిన ఒక అధ్యయనంలో భాగంగా సుబ్బారావు గారనే ఒక గిరిజన వైద్యుడితో మాట్లాడటం జరిగింది. రంపచోడవరం ఏజెన్సీలోని ఒక చిన్న గిరిజన గ్రామం ఈయనది. ఆ ఏజెన్సీ లో ప్రతి చెట్టు, ఆకు, కొమ్మ, కాండం అన్నీ ఆయనకు తెలుసు. దేనిలో ఏ ఔషధ విలువలు ఉన్నాయో ఏ చెట్టులో ఏ భాగాన్ని ఎటువంటి వైద్యానికి వాడాలో ఆయనకు వారసత్వంగా వచ్చిన విద్య. అక్కడి కొండ రెడ్ల జీవితం అడవితో ఎలా పెనవేసుకుని ఉంటుందో ఎంతో చక్కగా వివరించారాయన. కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని దగ్గరలో ఉన్న వారపు సంతలో అమ్ముకోవడం, ఉన్న కొద్దిపాటి కొండ పోడు లో వ్యవసాయం చేసుకోవడం అక్కడి గిరిజనుల ప్రధాన జీవనోపాధులు. ఒక ఎకరం కొండ పోడు ఉంటే వరి, కొర్రలు, ఆవాలు, కందులు ఇలాంటివి పదకొండు రకాల పంటలు ఒక ఏడాదిలో పండిస్తారని చెప్పారాయన. ఆ పంటలు, అడవిలో దొరికే పండ్లు, కాయలతో వారికి ఆహార భద్రతకి లోటు ఉండదు అని ఆయన చెబుతుండగానే పెద్ద శబ్దం చేస్తూ రెండు లారీలు కొండవైపుకి వెళ్లడం చూశాం. వాటి నిండా యేవో మొక్కలు ఉన్నట్లు కనపడి అవి ఏమిటి అని అడిగాను ఆయనను. కాఫీ మొక్కలు అని చెప్పారాయన. మా గిరిజనులకు వ్యవసాయం చేయడం తెలియక ఎక్కువ లాభాలు పొందలేక పోతున్నామని మా కొండ పోడు లో ఈ కాఫీ మొక్కలు పెడతారట గవర్నమెంట్‌ వాళ్ళు. వీటితో మాకు లాభాలు బాగా వస్తాయని చెబుతున్నారు అన్నారు ఆయన. మరి మీ ఆహార పంటలు ఏమవుతాయి, అవి లేకపోతే మీరేమి తింటారు? అంటే మీ అందరి లాగా మార్కెట్‌లో కొనుక్కోవాలి ఇక అన్నారు సుబ్బారావు గారు నిట్టూరుస్తూ. ఆహార భద్రత ప్రధాన లక్షణంగా జీవించే స్వయం సమ ృద్ధ జీవన విధానంలోకి వాణిజ్య పంటలను చొప్పించడం ఎంత వరకు సమంజసం అనుకుంటూ తిరిగి వచ్చాను ఆ ఊరి నుండి నేను. వారి జీవన విధానంలో అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం వారికి డబ్బు సంపాదించాలనే యావ లేదు. ఆధునిక సౌకర్యాల పైన మోజు లేదు. తినడానికి కావలసినంత కష్టపడటం,తర్వాతంతా కావలసినంత తీరిక.ఈ రంపచోడవరం ఏజెన్సీలోని కొండరెడ్లేతోనే కాదు, నా పనిలో భాగంగా నల్లమల లోని చెంచులతో, ఆదిలా బాద్‌ లోని గోండులతో, జార్ఖాండ్‌లోని ముండా తెగ వారితో, పశ్చిమ బెంగాల్‌ లోని సంథాల్‌ లతో ఇలా ఎన్నో గిరిజన తెగల వారితో పని చేయడం జరిగింది. ఈ అన్ని ప్రాంతాలలోను నేను గమనించింది ఒకటే. అభివృద్ధి, నాగరికతల పేరుతో జరుగుతున్న గిరిజనుల సంత ృప్తికరమైన, స్వయం సమ ృద్ధమైన జీవితాల విధ్వంసం.2001 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 8.10 శాతం ఆదివాసీలు. వీరి ఆవాసాలు అడవులు, కొండ ప్రాంతాలే. పోడు వ్యవసాయం, కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి ప్రధాన వృత్తులు. స్వయం సమ ృద్ధ జీవన విధానం, ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలు, తమవైన కట్టుబాట్లు ఆచారాలతో దేశంలోని అనేక గిరిజన తెగలు నాగరిక సమాజానికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. వీరి ఆవాసాలు ఉండే ప్రాంతాలు మౌలిక సదుపాయాల కల్పనకు అనుకూలంగా లేకపోవడం, ఆసౌకర్యాల గురించి గట్టిగా ప్రశ్నించే గొంతు గిరిజనులకు కొరవడడంతో ఈనాటికీ అనేక ఆదివాసీ గ్రామాలు త్రాగునీరు, విద్యుత్తు, రవాణా సదుపాయాలు వంటి కనీస మౌలిక వసతులు కూడా కరవై అభివ ృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక విద్య, వైద్యం వంటి సదుపాయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ మధ్య ఒడిస్సా లో ఒక గిరిజనుడు అంబులెన్సు సదుపాయం అందుబాటులో లేక పక్కన వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురు వెంటరాగా తన భార్య శవాన్ని భుజాన వేసుకుని మైళ్ళ కొద్దీ నడిచిన సంఘటన ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది. ఇక విద్యా సదుపాయాల విషయానికి వస్తే చాలా వరకు గిరిజన గ్రామాలలో పాఠశాలలే లేవు. ఉన్నా వాటిపై పర్యవేక్షణా లోపంతో ఉపాధ్యాయుల లో జవాబుదారీతనం లేదు. ఒకవేళ మంచి టీచర్లు ఉండి బోధన జరిగినా తమ జీవన విధానానికి ఏ మాత్రం సంబం ధంలేని పాఠ్యాంశాలు ఆ గిరిజన బాల బాలికలను అయోమయానికి గురి చేయడం తప్ప వారికి అవసరమైన విద్య, పరిజ్ఞానాన్ని అందివ్వలేకపోతున్నాయి. గిరిజనుల మరొక ప్రధాన సమస్య భూమిపై హక్కు. వ్యవసాయం చేసుకునే భూమిపై పట్టా లేకపోవడం కొందరి సమస్య అయితే భూ రికార్డుల నిర్వహణలో అవకతవకలు, వాటికి తోడు గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యతల వల్ల వారి భూములు చాలా వరకు స్వార్ధపరులైన నాగరీకుల చేతులలోకి వెళ్లిపోయాయి. మన తెలంగాణా చరిత్రను ఒక్క సారి చూస్తే 1940లలో ఆదిలాబాద్‌ జిల్లాలో కొమరం భీం నాయక త్వాన గోండు తెగకు చెందిన గిరిజనులు జరిపిన పోరాటం తమ భూమికోసమేఆ భూమిపై హక్కు కోసమే. బ్రిటిష్‌ కాలంలో మెరుగుపడిన రవాణా వ్యవస్థ గిరిజనులు మైదాన ప్రాంతాలకు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించినదానికన్నా నాగరీకులు గిరిజన ప్రాంతాలలోకి చొరబడి వారి భూములు, వనరులు లాక్కునేందుకు ఎక్కువ అవకాశం కల్పించింది. దీనితో ఆ ఆదివాసీలు ఎదురు తిరిగి తమ భూమి కోసం ఉద్యమం చేసినప్పటికీ భూ రికార్డులు సరిగా లేకపోవడంతో ఆ భూములు తమవే అని నిరూపించుకోలేక తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని కోల్పోవాల్సి వచ్చింది. 1946-51 మధ్య వచ్చిన తెలంగాణా సాయుధ పోరాటం, పశ్చిమ బెంగాల్‌ లో మొదలై ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించిన నక్సల్బరీ ఉద్యమం, 1980లో ఇంద్రవెల్లి తిరుగుబాటు అన్నీ భూ పోరాటాల చరిత్రలే. 1990లలో వచ్చిన పీసా (ూజుూA- ూaఅషష్ట్రaవa్‌ జుఞ్‌వఅంఱశీఅ ్‌శీ ూషష్ట్రవసబశ్రీవస Aతీవaం),2006 నాటి అటవీ హక్కుల చట్టం వంటి బలమైన శాసనాలు కూడా అమలులో చిత్తశుద్ధి లోపం, ఆదివాసీల అవగాహనా రాహిత్యంవల్ల ఎందుకూ కొరగానివిగా అయి పోయాయి. నిజానికి అత్యధిక శాతం ఆదివాసీలకు వారి సంక్షేమం కోసం రూపొందించబడిన ఎన్నో పథకాల పేర్లు కూడా తెలియవు. భారత దేశంలోని గిరిజనుల జీవితాలపై విస్త ృతంగా అధ్యయనం చేసిన హేమాండార్‌ా అనే సామాజిక శాస్త్రవేత్త ప్రకారం మైదాన ప్రాంతాల నుండి వలస వెళ్లిన నాగరీకులు గిరిజనులకు మద్యం, డ్రగ్స్‌ (మత్తుమందులు) అలవాటు చేసి వారి భూములను, విలువైన వనరులను దోచుకోవడం మొదలు పెట్టారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో దీనిని నేను స్వయంగా చూశాను. అక్కడి గిరిజనులు వారమంతా అడవిలో తిరిగి గమ్‌ కరయా, కరక్కాయ, తిప్పతీగ (దీనిని మలేరియా తీగ అని పిలుస్తారు), తేనె వంటి కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి అడ్డతీగల వారపు సంతలో అమ్ముకుని వారికి కావాల్సిన ఉప్పు, పప్పులను కొనుక్కుని వారి వారి గ్రామాలకు తిరిగి వెళతారు. ఈ సంతలో ఒకరోజు గడిపిన మాకు బయట మార్కెట్‌ లో దాదాపు కిలో రెండువేల ఖరీదు చేసే గమ్‌ కరయా (దీనిని ఫార్మా పరిశ్రమలో ఎక్కువగా వినియోగిస్తారు)ను సారాదుకాణం లో ఇచ్చి ఒక సీసా చీప్‌ లిక్కర్‌ తీసుకుని తాగుతున్న గిరిజన దంపతులను చూసి బాధ కలిగింది. ఆ గిరిజ నుల బలహీనతలను, అమాయకత్వాన్ని తమ దోపిడీకి వాడుకునే నాగరీకులను నిజంగా నాగరీకులు అనవచ్చా అనే సందేహం కలిగింది. తేనె, కరక్కాయ, ఉసిరి, కుంకుడుకాయలు ఇలా ఏ అటవీ ఉత్పత్తి తీసుకున్నా మార్కెట్‌ ధరలో ఆ గిరిజనులకు దక్కేది రూపాయలో పది పైసలు మాత్రమే. వారు ఎంతో శ్రమపడి తెచ్చిన ఉత్పత్తులను ఇంత తక్కువ ధరకు తీసుకోవడం అన్యాయం కదా అని దళారీని అడిగితే ’వాళ్ళకి అడవిలో ఉచితంగా దొరికే వాటికి ఈ మాత్రం ఇవ్వడమే ఎక్కువ’ అనేశారాయన. అవి సేకరించేందుకు వారు ఖర్చు పెట్టిన సమయం, శ్రమ, తీసుకున్న రిస్క్‌ లకు ఏ మాత్రం విలువ లేదు వారి ద ృష్టిలో. తాడుకట్టుకుని కొండ అంచునుండి తలకిం దులుగా వేలాడుతూ కొద్దిపాటి కొండ తేనె సేకరించేందుకు ఒక గిరిజనుడు తన ప్రాణాలనే రిస్క్‌ చేస్తుంటాడు. కానీ మన ద ృష్టిలో అది ఉచితంగా దొరికే పదార్ధం. ఇలా వారి భూములు, వనరులు కారు చౌకగా లేదా ఉచితంగా నాగరీకులు దోచుకుని ఆదివాసీ లను నిరుపేదలుగా, నిస్సహాయులుగా మారు స్తున్నారు. ఇక దేశంలో పెద్ద ఎత్తున ఏ అభివ ృద్ధి ప్రాజెక్ట్‌ లు చేపట్టినా అందులో ప్రధానం గా నిర్వాసితులయ్యేది గిరిజనులే. భారీ నీటి పారుదల ప్రాజెక్ట్‌ లు, గనుల తవ్వకాలు, పారిశ్రామిక అభివ ృద్ధి ఇలా ఏది చేపట్టినా నిర్వాసితులయ్యే జనాభాలో దాదాపు మూడిర ట ఒకటో వంతు గిరిజనులే ఉంటున్నా రని అనేక అధ్యయనాలలో వెల్లడయింది. ఛత్తీస్‌ గఢ్‌, జార్ఖండ్‌్‌ వంటి రాష్ట్రాలలో వేళ్ళూను కునిపోయిన నక్సల్‌ ఉద్య మం కూడా ఆదివా సీల జీవితాలను అతలా కుతలం చేసింది. తమపై జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలకు ఆగ్రహించిన కొంత మంది ఆదివాసీలు నక్సల్‌ ఉద్యమాన్ని బలంగా సమర్ధించి దానికి తోడ్పాటు నందించగా ఆ ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వాలు, కాపాడుకు నేందుకు నక్సలైట్‌లు పరస్పరం తలపడడంతో జరుగుతున్న ఘర్షణలో నలిగిపోతున్నది కూడా ఆదివాసీలే. అందుకే పెద్దఎత్తున ఆ ప్రాంతా లలోని ఆదివాసీలు తమ ఆవాసాలను వదిలి మన తెలంగాణాలోని భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలలో కూలి నాలీ చేసుకుంటూ బతకడం మొదలుపెట్టారు. ఆదివాసీ సంస్క ృతి పై, వనరులపై జరిగే మరోదాడి పర్యాటకం అనే రూపంలో కూడా కొన సాగడం నేను గమనించిన మరొక అంశం. పశ్చిమ బెంగాల్‌ లోని భీర్‌భమ్‌ జిల్లాలోని బోల్‌పూర్‌ (ఇక్కడే రవీంద్రుని శాంతినికేతన్‌, ప్రస్తుత విశ్వ భారతి యూనివర్సిటీ ఉంది) దగ్గర ఒక సంతాల్‌ గిరిజన గ్రామాన్ని గతంలో నేను సందర్శించడం జరిగింది. గిరిజనుల సంస్క ృతి సంప్రదాయాలలోని విభిన్నతను, వైవిధ్యాన్ని నాగరీకులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఆ గ్రామాన్ని రూరల్‌ టూరిజం (గ్రామీణ పర్యాటక) కేంద్రంగా మార్చింది. పర్యాటకులు అక్కడ బస చేసేందుకు కాటేజ్‌ లు నిర్మించి, అక్కడి ఆదివాసీలలో కొందరికి గైడ్లుగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. శాంతినికేతన్‌ కు వచ్చే పర్యాటకులు అక్కడికి కేవలం మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో పచ్చటి అడవిలో ఉన్న ఈ గ్రామంలో విడిది చేయడం, కాలుష్యానికి కల్మషానికి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఆ గిరిజన గ్రామాన్ని చెత్త, కాలుష్యంతో నింపేయడం తప్ప ఈ పర్యాటక కేంద్ర హోదా వల్ల ఆ ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఉట్నూర్‌, ఏటూరు నాగారం, భద్రాచలం. ఈ మూడు ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులదీ ఇదే పరిస్థితి. ఎప్పుడో 1970ల లోనే హేమాండార్‌ ఉట్నూర్‌ ప్రాంతాన్ని సందర్శించి మహారాష్ట్ర నుండి, గుజరాత్‌ నుండి వచ్చిన గిరిజనేతరులు ఆ ప్రాంతంలో బలమైన వర్గంగా మారడం గమనించారు. ఏదో కొద్ది మంది గుజరాతీలు చిన్న పాటి దుకాణాలు, వడ్డీ వ్యాపారం వంటి వ ృత్తులలో స్థిరపడగా చాలా వరకు ఈ వలస దారులు అక్కడి గిరిజనుల భూములను ఆక్రమించుకుని వారిని వారి స్వంత ప్రాంతంలోనే ఒక మైనారిటీ వర్గంగా మార్చేయడం జరిగింది. గిరిజనుల భూములు, వనరులపై జరుగుతున్న దోపిడీ మాత్రమే ఇదంతా. ఇక నిస్సహాయులైన, అమాయకులైన గిరిజన స్త్రీలపై జరిగే అక ృత్యాల గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. ఒక్కసారి వాకపల్లి ఉదంతం గుర్తు చేసుకుంటే చాలు, దుఃఖం పొంగుకొస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, ఒడిశా,చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా గిరిజనుల ప్రాంతాలను ఆక్రమించి, వారి సంస్క ృతి సంప్రదాయాలను విచ్చిన్నం చేసి, వారికి జీవనోపాధి లేకుండా చేసి వారిని బలహీనులుగా, నిస్సహాయులుగా మార్చినది నాగరీకులం అని చెప్పుకునే మనవంటి వారి స్వార్ధం, క్రూరత్వమే. అప్పుడప్పుడు బయట పడే మధు లాంటి వారి ఉదంతాలు మన నాగరికత విక ృత రూపాన్ని బయట పెడుతున్నాయి. మనం సామూ హికంగా సిగ్గుపడాల్సిన సందరాÄలేలో అది ఒకటి మాత్రమే.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

అడవులు..చట్టాలు..గిరిజనుల మనుగడ

అటవీ చట్టానికి తెచ్చిన సవరణ తో అటవీ ప్రాంతాల్లో కార్పొరేట్లు యథేచ్ఛగా ఏ ప్రాజెక్టునైనా గ్రామ సభల ఆమోదం లేకుండా చేపట్టవచ్చు. 1980 అటవీ చట్టంలో అటవీ భూములను ఇతర అవసరాల కోసం విద్యుత్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌, బాక్సైట్‌ తవ్వకాలు లాంటివి గ్రామ సభలు లేకుండా చేపట్టటం కుదరదు. గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు ఈ తాజా చట్ట సవరణ ద్వారా గ్రామ సభల అవసరాన్ని రద్దు చేస్తోంది. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లు అడవుల్లో యథే చ్ఛగా ప్రాజెక్టుల పేరుతో ప్రవేశిస్తే గిరిజనులు తమ భూముల్నుండి గెంటి వేయబడతారు.
అడవుల పరిరక్షణ చట్టం-1980కి బిజెపి ప్రభుత్వం 2023 మార్చి 29న సవరణ ప్రతిపాదించింది. ఇది అమలైతే అడవుల రక్షణే కాదు, గిరిజనుల మనుగడే ప్రమాదంలో పడు తుంది. అటవీ భూములను ఆఖరుకి గిరిజనుల స్వాధీనంలో వున్న భూములను ఇతర అవసరాల కోసమని (విద్యుత్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌, పర్యాట కం పేరుతో) ప్రాజెక్టులకు మళ్లించడానికి వీలు కల్పించారు.
అడవులపై చట్టాలు – చరిత్ర
బ్రిటీషువారు మొదట 1865లోనే అడవులపై చట్టం తెచ్చారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పడిరది.దీన్ని మరింత కఠినతరం చేస్తూ 18 78లో మరోచట్టం చేశారు.పై రెండు చట్టా లను, ఇతర కొన్నికొత్త నిబంధనలను చేర్చి కొన్ని ముఖ్య మైన ప్రతిపాదనలతో 1927లో మరో చట్టం చేశారు.తద్వారా ప్రభుత్వానికి అడవులపై హక్కు లు దఖలు పరిచారు. 1927లో రూపొందిన అటవీచట్టం అడవులలో నివశించే గిరిజనుల జీవనం,వారి హక్కుల గురించి ఒక్కమాట పేర్కొ నలేదు. వారి ఇళ్లకు, భూములకు, ఇతర అటవీ ఉప ఉత్పత్తుల మీద హక్కులకు ఈచట్టంలో చట్టపరమైన హక్కులు గుర్తించలేదు.పైగా ఈ చట్టం ద్వారా రూపొందిన విధానాలు అడవుల్లో కలప సేకరణపై ప్రభుత్వానికి ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి.కలప తరలింపుపై అనేక నిబం ధనలు రూపొందించారు. అడవి, కలప, ఉప ఉత్పత్తులు మొదలగునవి పరిశ్రమల అభివృద్ధికి, పరిసరాల్లోని ప్రజల జీవనానికి అత్యంత ప్రాధా న్యత కలిగిన ఆరోజుల్లో బ్రిటీషు ప్రభుత్వం అంతకు ముందు చట్టాల కంటే మరింత పకడ్బం దీగా అటవీ ఉత్పత్తులను కంట్రోల్‌ చేసే చట్టంగా ఇది రూపొందింది. మొట్టమొదటి చట్టంలో (1865) అటవీ భూములన్నీ ప్రభుత్వ స్వాధీనం అయితే,1927చట్టంలో అడవుల్లో ఉత్పత్తి అయ్యే కలప ఇతర ఉత్పత్తులు అన్నీ బ్రిటీషు ప్రభుత్వ కంట్రోల్లోకి తేబడ్డాయి. ఈ కలపతోనే బ్రిటీషు ప్రభుత్వం ఇంగ్లండ్‌లో ఓడల నిర్మాణం చేపట్టిం ది. రైల్వే స్లీపర్లు (దుంగలు కొయ్యలతో) రైలు పట్టాలు నిర్మించింది. తమ వ్యాపారానికి రైల్వే లైన్లు, ఓడలు అవసరం అయిన తరుణంలో అడ వుల సంపదపై పూర్తి పట్టు సాధించిన చట్టంగా 1927చట్టం అమలులోకి వచ్చింది. ఈ కాలం లోనే మన అడవులు భారీ స్థాయిలో ధ్వంసం

అయ్యాయి. బ్రిటీషు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా అటవీ ప్రాంతాన్ని ఒక మంచి ఆదాయ వనరుగా రూపొందించింది. 1865 చట్టం బ్రిటీషు ప్రభు త్వానికి దట్టంగా చెట్లున్న ప్రాంతాన్ని అడవిగా ప్రకటించే అధికారం ఇస్తే, 1927 చట్టం అటవీ సంపద వలస రాజ్యం పూర్తిగా కొల్లగొట్టేదానికి అవకాశం ఇచ్చింది. భూముల్లో ప్రవేశించినా, కలపను తరలించినా అపరాధపు పన్ను వసూలు కు,చివరకు జైలు శిక్షలు విధించడానికి ఈ చట్టం బ్రిటీషు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. మిలి యన్ల కొద్దీ ప్రజలు అడవులలోనూ,అటవీ పరిస రాలలోనూ నివశిస్తున్నా వారికి ఏవిధమైన చట్ట బద్ధమైన హక్కులు లేకుండా పోయాయి. 1880 జనాభా లెక్కల ప్రకారం గిరిజనుల జనాభా 70 మిలియన్లని (7కోట్లు) అంచనా వేయబడిరది. కానీ అటవీ అధికారులకు అటు అడవుల మీద, ఇటు అడవులలో నివశించే గిరిజనుల మీద మితిమీరిన అధికారాలు దఖలు పర్చబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2023చట్ట సవరణ ద్వారా 1927చట్టం లాంటి విధానాల వైపు పరుగులు పెడుతోంది.
బ్రిటీషు ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో పాలనా యంత్రాగాన్ని వినియోగించి అడవులపై ఆధారపడిన గిరిజనుల కమ్యూనిటీల మీద, వారి జీవనంపైన విపరీతమైన ఆంక్షలు విధించింది. ఆహారం,వంట చెరుకు,మందులు,ఉప ఉత్పత్తుల వినియోగానికి ఈ ఆంక్షలు పెట్టారు. వాస్తవంగా అడవులలో నివశించే గిరిజనుల, వారి కమ్యూని టీల విధానాలతోనే అభివృద్ధి చెందుతూ వచ్చిన అడవుల పరిరక్షణ పరిణామాన్ని బ్రిటీషు చట్టాలు దెబ్బకొట్టాయి.
తాజా సవరణ చట్టం
ఇప్పుడు 2023 మార్చి 29న అటవీ చట్టానికి తెచ్చిన సవరణతో అటవీ ప్రాంతాల్లో కార్పొరేట్లు యథేచ్ఛగా ఏప్రాజెక్టునైనా గ్రామ సభల ఆమోదం లేకుండా చేపట్టవచ్చు. 1980 అటవీ చట్టంలో అటవీ భూములను ఇతర అవసరాల కోసం విద్యుత్‌ ప్రాజెక్టులు,మైనింగ్‌,బాక్సైట్‌ తవ్వ కాలు లాంటివి గ్రామ సభలు లేకుండా చేపట్ట టం కుదరదు. గ్రామ సభల ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు ఈతాజా చట్టసవరణ ద్వారా గ్రామ సభల అవసరాన్ని రద్దుచేస్తోంది. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లు అడవుల్లో యథేచ్ఛగా ప్రాజె క్టుల పేరుతో ప్రవేశిస్తే గిరిజనులు తమ భూము ల్నుండి గెంటి వేయబడతారు. ఈ సవరణ మూలంగా కార్పొరేట్లు అడవుల్ని వాణిజ్యపరంగా వినియోగించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రయివేటుతోటల పెంపకం,కాఫీ తోటలు పేరు తో దట్టమైన అడవుల్ని ధ్వంసం చేయడానికి వీలు కల్గుతుంది. స్వాతంత్య్రం వచ్చాక అడవుల పరిరక్షణతో పాటు – అడవుల్లో నివసించే వారికి వారి హక్కులను చట్టబద్ధం చేస్తూ చర్యలు చేపట్టబడ్డాయి. గిరిజనుల భూములు అన్యాక్రాం తం కాకుండా రక్షణగా ఎన్నో చర్యలు వచ్చాయి. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గిరిజనుల రక్షణ కు ఉద్దేశించి పరిపాలనాపరంగా కూడా కొన్ని చర్యలు చేపట్టబడ్డాయి.
రక్షణగా చర్యలు
అడవుల్లో బ్రిటీషు పాలకులు గిరిజనుల జీవనానికి ప్రమాదం తెచ్చినప్పుడు 1922 లోనే అల్లూరి సీతారామరాజు ప్రతిఘటన ప్రారంభించాడు.1924లో రామరాజు కాల్చి వేయబడేవరకు అడవుల్లో గిరిజనుల హక్కుల రక్షణ కొరకు ఎన్నో ప్రతిఘటనలు జరిగాయి. ఇదే తీరులో అదిలాబాద్‌ అడవుల్లో గిరిజనుల కోసం కొమరం భీమ్‌ పోరాడారు. దేశంలో ఇతర ప్రాంతాల్లోను అడవుల మీద బ్రిటీషువారి దోపిడి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వందలాది తిరుగు బాట్లు జరిగాయి. ఈఉద్యమాల ఫలితంగా దేశా నికి స్వాతంత్య్రం రాగానే అనేక రక్షణా చర్యలు తీసుకోబడ్డాయి. కేవలం విద్య ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు ప్రకటించడమే కాదు, అటవీ ప్రాంతా ల్లో గిరిజనుల స్వాధీనంలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా రెవిన్యూ చట్టాలలో రక్షణలు కల్పించారు. గిరిజనులకు న్యాయం జరగాలంటే గిరిజన ప్రాంతాల పరిపాలనలోనూ గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి రాజకీయం గానూ చర్యలు తీసుకున్నారు. 1/70 రెగ్యులేషన్స్‌ జీవో నెం-3లాంటివి కొన్ని అంశాల్లో గిరిజ నులకు రక్షణగా నిలిచాయి.అటవీ హక్కుల చట్ట మూ వచ్చింది. అయితే ఇప్పుడు మార్చి 29న ప్రకటించిన సవరణ ప్రకారం ప్రాజెక్టులు చేపట్ట డానికి గ్రామసభలు అనుమతులు అవసరం లేద ని చెప్పడమే గాదు టూరిజం, మైనింగ్‌ ఇతర ప్రాజెక్టుల చర్యలు కాంట్రాక్టర్లు, కార్పోరేట్లు అడ వుల్ని కొల్లగొట్టడానికి అవకాశం ఇస్తోంది. పార్ల మెంటులో ప్రకటించిన వివరాలను బట్టి 2008-09 నాటికే 2.53 లక్షల హెక్టార్ల అడవి ఇతర ప్రాజెక్టుల కోసం మళ్లించబడిరది. ఈ నాటి సవరణతో అడవులు ఎక్కువగా ధ్వంసంగా వడానికే అవకాశం ఇస్తుంది.
భూస్వాధీనం – హక్కులు
మైదాన ప్రాంతాల్లోనైనా ఏదయినా ప్రాజెక్టు చేపట్టేటప్పుడు భూములు కోల్పోయిన వారు దాని ప్రభావంతో జీవనాధారం కోల్పో వడాన్ని అంచనా కట్టాలి.అలాగే పర్యావరణ రక్షణకు జరిగే నష్టాలను అంచనా కట్టాలి. ఇది ఇప్పటికే 1980 అటవీ చట్టంలో రక్షణగా ఉన్న అంశం. ఇప్పుడు ఈచట్ట సవరణలో ఈ నిబంధ నకు మినహాయింపు ఇచ్చారు. ఏతరహా ప్రాజె క్టులకు అడవుల్లో నిబంధనలు సడలించవచ్చో ఒక జాబితా ప్రకటించారు. విద్యుత్‌, మైనింగ్‌, టూరిజం లాంటి అంశాల్ని లిస్టులో పేర్కొన్న అనంతరం అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అడవులు కేంద్రం అవుతాయి. గిరిజనుల జీవనాధారం ప్రశ్నార్ధకం అవుతుంది.ఈ చట్ట సవరణ అడవిని పునర్‌ నిర్వచనం చేస్తోంది. అడవిలో నివశించే గిరిజనులకున్న హక్కుల్ని విస్మరిస్తోంది.బ్రిటీషువారి 1927 చట్టంలో గిరిజ నుల జీవన హక్కులు గుర్తించబడలేదు. అటవీ పరిరక్షణ, పర్యావరణం గురించి ఒక్కమాట కూడా అందులో లేదు. అడవుల్లో చేపట్టే ప్రాజె క్టుల వల్ల భూహక్కులు కోల్పోయే బాధితుల ప్రస్తా వనే ఇందులో లేదు.అడవుల రక్షణకోసం ఇప్పటికే రిజర్వు ఫారెస్టు దాని సమీపంలోని 100 కిలో మీటర్ల వరకు కొన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం లేకుండా షరతులు విధించబడ్డాయి, ఇప్పుడు వీటన్నింటనీ తొలగించారు. అడవుల్లో చెట్లు నరికిన చోట మళ్లీ చెట్టు నాటాలన్న నిబం ధనకు సడలింపు ప్రకటించారు. అడవుల్లో జంతు వుల వేట సఫారీ సాగించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రయివేటు పెట్టుబడికి ప్రోత్సాహం పేరుతో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, గనుల తవ్వ కాలు అనుమతి ఇవ్వబడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్ట సవరణ అడవుల్ని ప్రైవేటీక రించడానికి అవకాశం ఇస్తుంది. కొంత భాగం భూముల్లో కలప పెంచడానికి కార్పొరేట్లకు అవకాశం ఇస్తుందని బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంలో పత్రికలలో వ్యాఖ్యానాలు వచ్చాయి. అందువల్ల అటు పర్యావరణం, ఇటు గిరిజనుల మనుగడ ఈ సవరణతో ప్రమాదంలో పడుతుంది.బ్రిటీషువారు రాక ముందు అడవుల మీద,అందులో నివశించే గిరిజనుల జీవనం మీద రాజులు, రాజ్యాలు చొరబాటుగాని,జోక్యం గాని లేదు. అడవుల్లో నివశించే గిరిజన తెగలు తమ జీవనం అడవుల మీద ఆధారపడి వుంది గనుక వాటిని కాపాడ్డానికి కొన్నికట్టుబాట్లు,రక్షణ చర్యలు చేపట్టి కాపాడారు. వేట సైతం దట్టమైన అడవుల మీద ఆధారపడి వుంది గనుక దట్టమైన అడవుల్ని కాపాడటం తమ బాధ్యతగా గుర్తించి వ్యవహరిం చారు.అందువల్లే అడవులు దేశంలో ప్రజల సంపదగా చరిత్రకారులు పేర్కొన్నారు. అడవుల మనుగడ, గిరిజనుల జీవనం పెనవేసుకున్న అంశాలుగా పేర్కొని 2006లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అది పూర్తిగా రద్దవుతుంది.ప్రజా ప్రతిఘటనే మార్గం.
అటవీ హక్కుల చట్టం ఆదివాసీల జీవితాలను మెరుగుపరిచిందా?
శతాబ్దాలుగా మధ్య భారతదేశంలోని ఆదివాసీలకు అడవి ముఖ్యమైన జీవనాధారంగా ఉంది. ఆహారం,పశుగ్రాసం మరియు ఇంధ నంతో పాటు,ఔషధం,నిర్మాణవస్తువులు, వ్యవ సాయ పనిముట్ల తయారీకి సంబంధించిన వస్తువులు మొదలైన వాటికి కూడా అడవి మూలం. ఈ ఆధారపడటం వల్ల ఆదివాసీలు తమ నివాస ప్రాంతాలలో అడవిని మరియు దాని జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నారు. వలస రాజ్యాల కాలంలో కలప డిమాండ్‌ను తీర్చడానికి రాష్ట్రం అడవిపై సంపూర్ణ నియంత్రణను పొంది నప్పుడు పరిస్థితి మారిపోయింది.భారతీయ అటవీ చట్టం,1927 అటువంటి నియంత్రణ కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించింది. కలప ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి ఇతర కలపేతర జాతులకు హానికరం అని నిరూపించబడిరది, ఇది క్రమంగా అడవి నుండి అదృశ్యం కావడం ప్రారంభించింది.ఈ పరిస్థితి స్వాతంత్య్రానంతరం కొనసాగింది మరియు ఫలితంగా, ప్రధానంగా అటవీ వనరులపై ఆధారపడిన ఆదివాసీల జీవి తం మరింత దుర్బలంగా మారింది. ఈ అన్యా యాన్నిరద్దు చేయడానికి, అటవీ-నివాస వర్గాలకు వారి జీవనోపాధిని పొందేందుకు అటవీ నిర్వ హణ హక్కులు మరియు భూమిని అందించడానికి భారత ప్రభుత్వం షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసితులు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 ని తీసుకు వచ్చింది. అయితే అప్పటికే ఆదివాసీల పరిస్థితి మరింత దిగజారింది. – (పి.మధు/గునపర్తి సైమన్‌)

ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు

భారత రాజ్యాంగం, దాని మౌలిక విలువలకు తిలోదకాలిస్తున్న నేటి సమాజంలో రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా భారతజాతిలో సామాజిక చైతన్యం, రాజ్యాంగ అధ్యయనం అన్ని వర్గాల ప్రజలకు అనివార్యంగా ఏర్పడిరది. రెండు దశాబ్దా లకుపైగా జరిగిన సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటం ఎందరో మహనీయుల ఆత్మత్యాగాల ఫలితంగా మనదేశ దాస్యశృంఖాలాలకు విముక్తి లభించింది. స్వతంత్య్ర భారత తొలినాటి నేతలు పేదరికాన్ని మరియు దాని కవలలైన ఆకలి, అనారోగ్యం రూపుమాపి పౌరులందరికి గౌరవ ప్రదమైన జీవనానికి బాటలు వేస్తామనే ప్రతిజ్ఞలతో పాలన ఆరంభించారు. మనదేశ ప్రజల జీవితాన్ని క్రమ బద్ధంగా నిర్వహించు కొనుటకు ఏర్పడ్డదే రాజ్యాం గం. మనదేశానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దానిలోని ప్రధానాంశాలైన,శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల వ్యవస్థీకరణ, అధికా రాలు, విధులు, పౌరుల హక్కులు, బాధ్య తలు, ఆదేశసూత్రాలు మొదలగునవన్ని పొందు పరుచు కున్న నిబంధనావళే రాజ్యాంగం. మన దేశానికి రాజ్యాంగమే మూలస్తంబం.
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చెప్పినట్లు గా రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా వృత్తు లు,సంపద,రాజకీయాలు,విద్య,వివాహం, హిందూమతాన్ని ప్రజాస్వామ్యీ కరించాలి. ఇదే బహుజన ప్రజాస్వామిక విప్లవం.ఆవిప్లవ లక్ష్యాల పరిపూర్తి ఇంకా మిగిలే ఉంది. వాటిని సమగ్రం గా సాధించడమనేది బహుజ నుల రాజకీయ చైతన్యంపై ఆధారపడి ఉంది. మన సమాజంలో మనుషులందరూ సమానమే అన్న భావన ఏనాడూ లేదు. వర్ణవ్యవస్థ, కుల వ్యవస్థ మను షుల్లో హెచ్చుతగ్గులు సృష్టించి స్థిర పరిచాయి. భారత రాజ్యాంగం ప్రప్రథమంగా అందుకు భిన్నంగా మనుషులందరూ సమాన మేనని గుర్తించింది. ఈ దృష్ట్యా భారత రాజ్యాంగ విప్లవ స్వభావం గురించి చర్చజరగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది.ఈ చర్చకు అగ్రశ్రేణి మార్క్సిస్టు మేధావి అయిన ప్రభాత్‌ పట్నాయక్‌ మన రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలను పునాదిగా చేసుకోవలసి ఉంది.‘భారతీయ సామా జిక చరిత్ర వ్యవస్థీకృత అసమానతలతో నిండి పోయి ఉంది. మన రాజ్యాంగం ప్రజలకు సార్వ త్రిక ఓటుహక్కు కల్పించడం ద్వారా రాజకీయ రంగంలో సమానత్వాన్ని ఆమోదించింది. కాబట్టి రాజకీయ సమానత్వం ద్వారా సామాజిక, ఆర్థిక రంగాలలో సమానత్వాన్ని తీసుకురావాల’న్న డాక్టర్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ భారత రాజ్యాంగానికి విప్లవ స్వభావం ఉందని ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు.ఈ విప్లవ స్వభావానికి రెండు రకాల రాజ్యాంగ ఉద్యమాలు పునాదిగా ఉన్నా యని ఆయన అన్నారు. మొదటిది బ్రిటిష్‌ వలస పాలన వ్యతిరేక ఉద్యమం కాగా రెండోది పూలే నుంచి అంబేడ్కర్‌ దాకా సాగిన సామాజిక విముక్తి ఉద్యమాలని ఆయన తెలిపారు. వైపరీత్యమే మంటే ఈ దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా భారత రాజ్యాంగ ఆవిర్భా వాన్ని దీర్ఘకాలిక విప్లవంగా గుర్తించడం లేదు. అందుకే అవి జనతా ప్రజాతంత్ర, సోషలిస్టు విప్లవ కార్యక్రమా లను ప్రకటించుకుని పనిచేస్తు న్నాయి. అన్ని కమ్యూనిస్టు పార్టీలు భారత రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగమని దాన్ని కూల్చి వేయడమే లక్ష్యంగా ప్రకటించుకున్నాయి.మరి ఆపార్టీల వారే ఇటీవలి కాలంలో రాజ్యాంగ పరి రక్షణ కోసం పిలుపులు ఇస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాజ్యాంగం విష యంలో వారిఅంచనాలు సరైనవి కావని స్పష్ట మయింది. మన రాజ్యాంగం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వాన్ని సాధించేం దుకు సామాజికన్యాయాన్ని లక్ష్యంగా ప్రకటించు కున్నది. దీనికి సంబంధించే రాజ్యాంగంలో అనేక అధికరణలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానులేనని 14వ అధికరణం ప్రకటించింది. మతం,జాతి,కులం,లింగం,ప్రాంతాన్ని బట్టి వివక్ష పాటించడాన్ని 15వ అధికరణం నిషేధించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకా శాలు కల్పించాలని అధికరణం 16 నిర్దేశించింది. 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధిం చింది. 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛను, 21వ అధికరణం పౌరరక్షణ, వ్యక్తిగతస్వేచ్ఛను కల్పించాయి. వెట్టిచాకిరిని 23వ అధికరణం రద్దు చేసింది.14ఏళ్ల లోపు పిల్లలచేత ప్రమాదకర పనులు చేయించరాదని 24వ అధికరణం స్పష్టం చేసింది. సమాజంలో ఆర్థిక,రాజకీయ,సామా జిక న్యాయాన్ని సమృద్ధపరిచేందుకు ప్రభుత్వం పాటుపడాలని అధికరణం 38 పేర్కొంది. అలాగే స్త్రీపురుషులిరువురికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పిల్లలు దోపిడీకి గురికాకుండా ఆరోగ్యంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించాలని ప్రకటించింది. ప్రతి పౌరుడూ సమానావకాశాలు పొందటానికి న్యాయవ్యవస్థ పనిచేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని అధికరణం 39(ఎ) ఆదేశించింది. ముఖ్యంగా 46వ అధికరణం బలహీన తరగతులకు చెందిన వారి పిల్లలు విద్యాపరంగా, ఆర్థికపరంగా ఎదిగేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులను అన్ని రకాల అన్యాయాలు, దోపిడీ నుంచి రక్షిం చాలి. ప్రజలందరికీ పౌష్టికాహార స్థాయి, జీవన ప్రమాణాలు పెంచడం ప్రభుత్వ బాధ్యత అని 40వఅధికరణం చెప్పింది. ఇంకా ఎన్నో అధిక రణాలు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి చేపట్ట వలసిన చర్యల గురించి వివరించాయి.
అందుకనే ‘భారత రాజ్యాంగం ప్రథ మంగా ఒక సామాజిక పత్రం’ అని గ్రాన్‌ విల్లి ఆస్టిన్‌ వ్యాఖ్యానించాడు. భారత రాజ్యాంగంలోని అత్యధిక అధికరణాలు సామాజిక న్యాయ లక్ష్యా లను సాధించడానికి లేదా సామాజిక విప్లవ ఉద్దేశాలను సాధించడానికి అవసరమైన పరిస్థితు లను స్థాపించడం కోసమే నేరుగా ఉద్దేశించినవి. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మొత్తం రాజ్యాంగం జాతీయ పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకుని సామాజిక న్యాయాన్ని సాధించడానికి మూడవ భాగంలోని ఆర్టికల్స్‌ కృషి చేస్తున్నాయి. ప్రాథమిక హక్కులు, రాజ్య విధానపు ఆదేశికసూత్రాలు ఈ లక్ష్యం వైపుగా పయనించడానికి ఉద్దేశించినవి. రాజ్యాంగంలోని 3,4వ భాగాలు అతి ముఖ్యమైన వని ఆస్టిన్‌ అంటాడు. అయితే ఇంతటి విప్లవ స్వభావం కలిగిన రాజ్యాంగాన్ని అటు కమ్యూనిస్టు శ్రేణులు ఇటు బహుజన శ్రేణులు కూడా సరిగా గుర్తించలేకపోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా బలహీన వర్గాలవారు చట్టసభలలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవచ్చు. అందుకోసం తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్వతంత్ర రాజకీ యాలు చేయాలి. తమ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలా దామాషా ఎన్ని కల పద్ధతిని వారు డిమాండ్‌ చేయవచ్చు.
ఇవాళ దేశంలో ప్రభుత్వరంగ సంస్థ లను పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నారు. సంక్షేమ వ్యయా లపై కూడా ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయి. ఈ పరిణామాలను‘సామాజిక ప్రతీఘాత విప్ల వం’గా ప్రభాత్‌ పట్నాయక్‌ విశ్లేషించారు.ఈ ప్రతీఘాత విప్లవం ప్రధానంగా దళితులు, మైనారి టీలు, మహిళలను కేంద్రంగా చేసుకుని కొనసాగు తోందని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితు లలో అణగారిన కులాలు, తరగతులు రక్షణ పొందాలంటే వారి ప్రాతినిధ్యం పెరగాలి. అంటే శాసనాలు చేసే రాజకీయ అధికారం ఉన్నప్పుడే ప్రస్తుత పరిస్థితుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు 15శాతంగా ఉన్న అగ్రకులాలు రాజకీయాలలో 66.5శాతం, వాణిజ్య వ్యాపార రంగాల్లో 97శాతం,ఉపాధి 87శాతం వాటాలు పొందడం అనేది ప్రజా స్వామ్య సూత్రానికి విరుద్ధం. డాక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పినట్లుగా రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా వృత్తులు,సంపద, రాజకీయాలు, విద్య, వివాహం,హిందూమతాన్ని ప్రజాస్వామ్యీ కరిం చాలి.దీన్నే బహుజన ప్రజాస్వామిక విప్లవం అని అంటున్నాను. ఈ విప్లవం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ప్రారంభమైంది.ఈవిప్లవ లక్ష్యాల పరిపూర్తి ఇంకా మిగిలే ఉంది. ఆ సమున్నత లక్ష్యాలను సమగ్రంగా సాధించడమనేది బహుజనుల రాజకీయ చైతన్యం పై ఆధారపడి ఉంది.
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి…
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 74 ఏళ్లు.ఈ సందర్భంగా దేశవ్యా ప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటు న్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్‌ 26) భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపిం ది. అందుకే ప్రతి ఏటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వాన్ని జరుపుకుంటున్నారు. నవంబర్‌ 26ను నేషనల్‌ లా డే..లేదా ..సంవిధాన్‌ దివస్‌ గానూ పిలుస్తారు.1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్‌ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను,7ఉప కమిటీలను ఏర్పాటు చేసింది.వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా కమిటిని 1947ఆగస్టు 29న బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్‌ 11సార్లు సమావేశమైంది. ముసాయిదా తయారీలో భాగంగా అంబేద్కర్‌ స్వయంగా 60 దేశాలకు చెందిన రాజ్యాంగాలను చదివారు.మొత్తంగా రెండేళ్ల 11నెలల18 రోజులపాటు కష్టించి..సుదీర్ఘ మేధోమథనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ,ఇంగ్లీష్‌లో కాపీలను తయారు చేసింది. దీనిపై రాజ్యాంగ పరిషత్‌లో 115రోజులు చర్చించి.. 2వేల 473 సవరణలతో1949 నవంబర్‌ 26న ఆమోదిం చారు. యేటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వం జరుపుకోవాలని 2015,నవంబర్‌ 19న భారతప్రభుత్వం ప్రకటించింది. అంబేద్కర్‌ 125 వ జయంతి వేడుకలను సందర్భంగా ముంబైలో ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. అంబే ద్కర్‌కు నివాళిగా రాజ్యాంగ దినోత్సవం జరుపు తున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగ దినో త్సవం పబ్లిక్‌ హాలిడే కాదు. కానీప్రభుత్వ విభాగా ల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గత నాలుగేళ్లుగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుం టున్నా..ఈసారి వేడుకలకు మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్ల మెంటులో ఘనంగా వేడుకలు నిర్వహించ నున్నారు.
భారత రాజ్యాంగం అమలు
1947 ఆగస్టు 15న భారత స్వాతం త్య్రం తర్వాత పీల్చిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాణం కోసం చాలా కసరత్తులు జరిగాయి. ఎన్నో వ్యయప్ర యాసలకు ఓర్చి 2సంవత్సరాల 11నెలల 18 రోజులు కష్టపడి అంబేడ్కర్‌ సారథ్యంలో కమిటీ పూర్తి స్థాయి రాజ్యాంగాన్ని రూపొందించింది. అనేక మేథోమధనాల మధ్య భారత ప్రజల శ్రేయస్సు కోసం లిఖిత రాజ్యాంగాన్ని రచించారు. 1949 నవంబర్‌ 26న అప్పటి అసెంబ్లీ దీన్ని ఆమోదించింది. రెండు నెలలు తర్వాత 1950 జనవరి 26నభారతదేశ మ్నెదటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటిం చారు. ఆరోజు నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగ దినోత్సవం
2015లో అంబేద్కర్‌ 125వ జయం తి సందర్భంగా నవంబర్‌ 26న రాజ్యాంగ దినో త్సవంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయిం చింది.ఈ మేరకు నవంబరు19న కేంద్ర ప్రభు త్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్స వాన్ని జరుపుకుంటున్నాం.
రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ?
రాజ్యాంగం అనగా ప్రభుత్వం యొక్క విధానం.ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు,ఆదేశికసూత్రాలు, రాజ్యాం గపరమైన విధులు విధానాలూ పొందు పరచబడి వుంటాయి.ప్రతి దేశానికి ప్రభుత్వ మనేది సర్వ సాధారణం.ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అను నది అతి ముఖ్యమైంది.ప్రభుత్వం అనునది శరీర మైతే,రాజ్యాంగం అనునది ఆత్మ లాంటిది. ప్రభు త్వాలకు దిశానిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాం గం.
ఎందుకు జరుపుకొంటారు?
1949 నవంబర్‌ 26న రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడినా…రాజ్యాంగ దినోత్సవం నిర్వహిం చలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్‌ 19న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం భారతదేశం. ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్‌గా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం వుండా లి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభు త్వానికి కరదీపిక వంటిది.ఆ దీపస్తంభపు వెలుగు ల్లో సర్వసత్తాక సౌర్వభౌమాధికార దేశంగా ప్రగతివైపు అడుగులు వేయాలి.అందుకనే రాజ్యాం గానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనదేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచిం చాయి. అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం.దీనికి కారణం..దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదీవాసీలు,దళితులు, అణగా రిన, పీడనకుగురైన వర్గాలు తదితరులున్నారు.వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్‌లాంటిదే. ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలోని రాజ్యాంగసభ డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సారధిగా డ్రాఫ్టింగ్‌ కమిటీని ఏర్పాటైంది. రాజ్యాం గ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంత గానో శ్రమించారు. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతి బింభించాలన్నది ఆయన ప్రధానాశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అందుకనే ప్రపం చంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నతవిలువలు కలిగిందంటూ మన్ననలు పొందింది. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26,1950 నుంచి రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. నవంబర్‌ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహి స్తున్నాం.భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. రాజ్యాం గాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరి పాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాం గం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
రాజ్యాంగంపైనా దాడి!
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది.రాజ్యాంగంలోని ప్రాథ మిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్య వాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారు స్తూ రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలకు విఘాతం కలిగిస్తున్నది.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో గణతంత్ర దినోత్సవం సందర్భం గా దిన పత్రికలకు విడుదల చేసిన రాజ్యాంగ పీఠిక చిత్రం ప్రకటనలో ‘లౌకిక,సామ్యవాద’ అనే పదాలను తొలగించింది.ఈఅంశమై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆ పదాల కత్తిరింపును ఉపసంహరించుకున్నది. 2021, డిసెంబర్‌ 3న‘రాజ్యాంగ సవరణ-2021’ పేరిట రాజ్యాంగ పీఠికకు ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపైనా తీవ్ర నిరసనలు రావ డంతో పక్కనపెట్టింది.ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక వ్యాజ్యంలో తీర్పు చెప్తూ లౌకిక తత్వం భారత రాజ్యాంగంలో ఇమిడి ఉన్న అంతర్బా Ûగమని సర్వోన్నత న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొన్నది.దీన్నిబట్టి రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలను తొలగించడమంటే,రాజ్యాంగంపై దాడి గానే భావించాలి.
గోలక్‌నాథ్‌ వర్సెస్‌ పంజాబ్‌ ప్రభుత్వా నికి జరిగిన వ్యాజ్యంలో ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడం’ అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు ఉన్న అధికారాల గురించి చెప్పిన అధికరణ-368కి ఉన్న స్థితిపై కీలక వ్యాఖ్య చేశారు. ‘రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని అధికరణ-368 పార్లమెంట్‌కు దత్తం చేయలేదు. ఈ రకమైన అధికారాలు 245, 246, 248 అధికరణల నుంచి వచ్చాయని, ఆ అధికర ణలు పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారానికే పరిమితమయ్యాయని తెలిపారు. అధికరణం 13 (2)లో చెప్పిన ప్రకారం..వాటిని చట్టాలుగానే భావించాలన్నారు.ఈఅధికరణం ప్రకారం రాజ్యం చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుకూ లంగా ఉండాలి. ఆచట్టాలు రాజ్యాంగంతో పొందిక లేని మేరకు రద్దవుతాయి.ఈ తీర్పులో అత్యధిక న్యాయ మూర్తులు రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌కు పరిమిత అధికారాలే ఉన్నాయని పేర్కొన్నారు. కేరళకు చెందిన మఠాధిపతి కేశవానంద భారతి అప్పీలుపై జరిగిన విచారణలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే పదం సర్వోన్నత న్యాయస్థానంలో అత్యధిక న్యాయమూర్తులు తొలిసారిగా పేర్కొ న్నారు.13 మంది సర్వోన్నత న్యాయమూర్తు ల్లో 9 మంది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదన్నారు. ఈ ‘మౌలిక స్వరూపం’ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినా, అంతర్లీనంగా ఉందనే అంశాన్ని మొదట 1973లో జరిగిన ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటినుంచీ రాజ్యాంగానికి భాష్యం చెప్పడానికి, పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణలను సమీక్షించే మధ్యవర్తిగానూ సర్వోన్నత న్యాయస్థానం కొనసాగుతున్నది.కానీ నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా లకు సంబంధిం చిన అంశాలన్నింటా జోక్యం చేసుకొని రాష్ట్రాల నడ్డి విరుస్తున్నది.జీఎస్టీ రూపం లో రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరును సొంతం చేసుకొని, ఇవ్వాల్సిన నిధులు తొక్కిపెట్టి, వాటిని తమ రాజకీ య ప్రయోజనాల కోసం వాడు కుంటున్నది.
జాతీయ అర్హత పరీక్ష (నీట్‌), ప్రణా ళికా సంఘంరద్దు జాతీయ అభివృద్ధి మం డలి రద్దు,వంటి అనేక రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ, రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడి,తానే పెత్తనం చెలాయి స్తున్నది. కరోనా వల్ల ప్రజానీకం ఓపక్క అల్లాడు తుంటే,ఇదే అదనుగా అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేసింది కేంద్ర ప్రభు త్వం.విద్యా సంస్కర ణలు,కార్మిక,విద్యుత్‌ సంస్కర ణల బిల్లు వంటివి ఇందుకు ఉదాహరణ. పాఠ్య పుస్తకాల నిండా మత అంశాలు చొప్పించి, లౌకిక వాదానికి గండి కొడుతున్నారు కేంద్ర పాలకులు. ముఖ్యంగా, జీఎస్టీతో పాటు,3వ్యవసాయ నల్లచట్టాలు చేయ డం రాష్ట్రాలహక్కులు హరించడంలో ప్రధాన మైంది. ఇక రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వానికి వ్యతిరేకంగా, పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశాన్ని మతరా జ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవు తున్నది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక, సామాజిక న్యాయాన్ని పూర్తిగా వదిలివేశారు. ఎక్కువ లాభాలతో నడిచే ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు వంటి అనేక సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు చేపట్టారు. పన్నుల మోత ప్రజానీకానికి పెను భారంగా మారింది. కార్మికులు, పేదలు, బడుగు బలహీనవర్గాలు, అసంఘటిత రంగ కార్మికుల బతుకులు దుర్భ రంగా మారే స్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం’ అంటూ గుజరాతీ, మార్వాడీ సంస్కృతీ నిల యంగా మార్చే చర్యలు చేపట్టింది బీజేపీ ప్రభుత్వం. హిందీని బలవం తంగా రుద్దడంతో పాటు, ఏ రాష్ట్రంలోనూ ఆ రాష్ట్ర ప్రజల భాషలో న్యాయపాలనా వ్యవహా రాలు జరగకుండా అడ్డుపడి ఇంకా స్వాతంత్య్రం రానట్టుగా, బానిసత్వంలో ఉంచుతూ, ప్రజల ఆహారాన్ని కూడా నియంత్రించబూనడం వంటి చర్యలకు పూనుకున్నది.భిన్న సంస్కృతులు,భాషలు, ఆరాధనా పద్ధతులున్న భారత ఉపఖండంలో నిజమైన ఐక్యతాభావం పెంపొందాలంటే, రాజ్యా ంగస్ఫూర్తితో రాష్ట్రాల హక్కులు, ప్రత్యేకతలను గౌరవించే ప్రజాస్వామిక పాలన రావాల్సిన అవ సరం ఎంతైనా ఉన్నది.-(డాక్టర్‌ పట్టా వెంకటేశ్వర్లు/అనిసెట్టి సాయికుమార్‌)

ఉక్కు పిడికిలి బిగుస్తోంది

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కులి పోరాటం గడచిన 950 రోజులుగా కార్మికులు చేస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం అమ్మేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. లిఉక్కు రక్షణ కోసం సి.పి.ఎం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాలు 1050 కిలో మీటర్లు బైక్‌ యాత్ర జరుగుతున్నదిలి. ఈ నేపద్యంలో విశాఖ ఉక్కు ను ఎందుకు కాపాడుకోవాలో..! ఒకసారి ఈ వ్యాసం చదవండి..` కె.లోకనాథ్‌
ఉక్కునగరం ఉద్యమిస్తోంది.విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జెండాతో పనిలేకుండా సింగిల్‌ ఏజెండాతో అన్ని పార్టీలు కదం తొక్కుతున్నాయి. కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు రోడ్డుమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చ రిస్తున్నారు.ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం సెగలు పుట్టి స్తుంది. వైజాగ్‌ స్టీల్‌ ఫ్యాక్ట రీని ప్రయివేట్‌ పరం చేయ కుండా ఆపడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి రాజకీయ పార్టీలు,తెలుగు ప్రజలు సన్నద్ధం అవుతు న్నారు. ఈ విష యంలో ఒక్క బీజేపీ తప్పా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తు న్నాయి. 32 మంది బలిదా నాలు, వందలాది మంది నిర్బంధాలు, లక్ష లాది మంది ఆందో ళనలు.. వారందరీ త్యాగాల ఫలితమే..విశాఖ ఉక్కు కర్మా గారం..ఈ ఉక్కు ప్లాంట్‌ 22వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. 17 వేల మంది పర్మి నెంట్‌, 16వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో పాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్య మంలో భాగంగా ఈబైక్‌ యాత్ర విజయ వంతం చేయాల్సిన అవశ్యకత ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల ప్రజలపై ఎంతైన ఉంది.!
రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృ ద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషి స్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌పరం చేయడమంటే దళితులు,గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకా శాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడు తుంది.విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మివేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని… తెలుగు ప్రజలు పోరాడి…32 మంది ప్రాణ త్యాగాలతో,16 వేల మంది రైతుల త్యాగ ఫలంగా సాధించుకున్న ఈ ప్లాంట్‌ను రక్షించుకుని తీరతామని… స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు గత వెయ్యి రోజులుగా పోరాడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు సరికదా దీనిని అమ్మడం సాధ్యం కాకపోతే మూసివేస్తామని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపులకు పూనుకున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజలు,కార్మికులు నీరసపడిపోయి,ఉద్యమాన్ని వదిలేస్తారని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది. అయితే వారి అంచనాలకు భిన్నంగా రెట్టిం చిన ఉత్సాహంతో,పట్టుదలతో కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, దేశవ్యాప్తంగా కూడా వీరి పోరా టానికి మద్దతు లభిస్తోంది. మన దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి ఇంత విశాలమైన మద్దతు లభించడం చాలా అరుదు. విభజిత ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇటువంటి సంస్థను రక్షించుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. కానీ దీనికి భిన్నంగా, చాలా విచిత్రంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార వైసిపి మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది. కానీ రాష్ట్ర ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కనీస ప్రయత్నం కూడా చేయడంలేదు. ప్రతిపక్ష టిడిపి రాష్ట్ర వైసిపిని విమర్శించడం తప్ప ప్లాంటును అమ్మేస్తామని తెగేసి చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. ఇక ప్రశ్నిస్తానని బయలుదేరిన జనసేన అధినేత ఆ పని వదిలేసి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వ పంచన చేరారు. తమలో తాము కలహించు కోవడం తప్ప రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు ఎంతో ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడానికి కూడా ఈ మూడు పార్టీలు సాహసించడం లేదు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి ఎజెండాను అమలు చేసేవిగా వున్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం లేవనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఇదే అవకాశంగా భావించి కేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ పట్నం స్టీల్‌ప్లాంటును అష్టదిగ్బంధనం చేస్తోంది. ఉత్పత్తిని ఏకపక్షంగా తగ్గించి వేసింది. మూడవ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నిలిపివేసింది. విడివిడిగా ముక్కలు చేసి అమ్మాలని కుట్రలు పన్నుతోంది. ఉన్నత స్థాయి అధికారులతో సహా ఉద్యోగుల ఖాళీలను నింపడం లేదు. రోజువారీ పనులకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ కూడా లేకుండా చేస్తోంది. దేశంలోని ప్రైవేట్‌ రంగంతో సహా అన్ని స్టీల్‌ ప్లాంట్లకు సొంత ముడి సరుకులను, గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం సొంతగనులు కేటాయించడానికి ససేమిరా నిరాకరిస్తోంది. దీనికి తోడు ఇప్పటి వరకు తక్కువ ధర చెల్లించి ఇనుప ఖనిజాన్ని కొంటున్న ఛత్తీస్‌గఢ్‌ లోని ఎన్‌ఎండిసి నుండి ఇక మీదట కొనుగోలుకు అనుమతించకుండా, దూర ప్రాంతంలోని కర్ణాటక నుండి కొనుగోలు చేసుకోమని తెలిపింది. తద్వారా రవాణా ఖర్చులు పెరిగి స్టీల్‌ప్లాంట్‌ మరింత కష్టాల్లోకి నెట్టబడుతుంది. మరోపక్క విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ముడి సరుకులు అన్‌లోడ్‌ చేయకుండా పక్కనే ఉన్న అదానీకి చెందిన గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ఇబ్బందులు పెడుతూ, పెనాల్టీలు విధిస్తోంది. ప్లాంట్‌ లోని కీలకమైన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తున్నారు. మొత్తం ప్లాంట్‌ విలువను తగ్గించి చూపి, కారుచౌకగా తమ కార్పొరేట్‌ మిత్రులకు ధారాదత్తం చేయజూ స్తున్నారు. 1400 ఎకరాల స్టీల్‌ప్లాంట్‌ భూమిని ఇప్పటికే గంగవరం పోర్టుకు ఇచ్చేశారు. ఇప్పుడు మరలా మరింత భూమిని అమ్మేయడానికి పావులు కదుపుతున్నారు. అదానీ పోర్టుకి వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది.
ఈ రకంగా అన్ని విధాలుగా స్టీల్‌ప్లాంట్‌ను బలహీనపరిచే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాల్పడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని రాష్ట్రం లోని ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ఎదుర్కోలేవని, అంతే కాకుండా ఈ మూడు పార్టీలు కేంద్ర బిజెపికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నాయని కూడా తేటతెల్లమై పోయింది. అందువల్ల పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కేవలం తెలుగు ప్రజల చైతన్యం మీదనే నేడు ఆధారపడి ఉంది. తెలుగు ప్రజల పౌరుషాన్ని మరొకసారి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి సహేతుకమైన కారణం కూడా లేదు. ప్రపంచంలోనే అగ్రగామి స్టీలు ఉత్పత్తి చేసే సంస్థగా మన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉంది. అతి తక్కువ మంది కార్మికులతో దేశంలోనే అత్యధిక ఉత్పాదకత కలిగిన ప్లాంట్‌ మనదే. కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేవలం రూ.4500 కోట్ల పెట్టుబడికిగాను ఇప్పటివరకు మన ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల ద్వారా రూ.45 వేల కోట్లకు పైగా చెల్లించింది. అందువల్ల నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని అమ్మేస్తున్నామనే వాదన పూర్తి అసంబద్ధం. లాభాలలో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా తెగనమ్మడమే నేటి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానంగా ప్రకటించింది. రాష్ట్రాభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలస ప్రాంతంగా వుండేది. విశాఖ ఇండిస్టియల్‌ హబ్‌గా ఏర్పడిన తరువాత ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులు, కూలీల కుటుం బాల నుండి అనేకమంది యువకులకు విశాఖ పట్నం స్టీల్‌ప్లాంట్‌ ఉపాధి కల్పిస్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌ పరం చేయడమంటే దళితులు, గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడుతుంది. ఇప్పటికే కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి కూడా ఆచరణలో నిరాకరిస్తోంది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ఒక ప్రహసనంగా మార్చివేసింది. ఫలితంగా ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకపోగా మరింత వెనుకబాటులోనికే నెట్టబడిరది. పేదరికం పెరిగింది. వలసలు పెరిగాయి. ఇవి చాలదన్నట్లు రాష్ట్ర విభజన చట్టంలోని విద్యాసంస్థల నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ శంకుస్థాపనకే ఇంత కాలం పట్టింది. ఇక నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. పెట్రో యూనివర్సిటీ ఇప్పటికీ పిట్టగోడల స్థితిలోనే ఉంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప నేటికీ ఆచరణ రూపం దాల్చలేదు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఊసే మరిచింది. ఈ విధంగా అన్ని రకాలుగా మన రాష్ట్రానికి, ప్రాంతానికి ద్రోహం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టకపోవడం రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే అవుతుంది. రాష్ట్రాభివృద్ధితో పాటు, ఈ ప్రాంత అభివృద్ధిలో విశేష పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించు కోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈ పని చేయలేవని ఇప్పటికే స్పష్టమైంది. అందువల్ల తెలుగు ప్రజలు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ప్లాంటును పరిరక్షించుకోవడానికి కూడా ప్రజలే ముందుకు రావాలి. ఈ కర్తవ్య నిర్వహణలో ప్లాంట్‌ పరిరక్షణకు విస్తృతమైన ప్రజా మద్దతు కూడగట్టాలనే లక్ష్యంతో సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టింది. ఇచ్చాపురం నుండి పాయక రావుపేట వరకు మైదాన, పట్టణ, గిరిజన ప్రాంతాల గుండా ఈ యాత్ర ఈనెల సెప్టెంబర్‌ 20 నుండి 29 వరకు పది రోజుల పాటు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదని, ఇంత ద్రోహానికి పాల్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, వారికి మద్దతిచ్చే పార్టీలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే హెచ్చరిక ఈ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజలు చేయాలి.
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు(ప్రజాశక్తి సౌజన్యంతో..)

మన నైతిక విలువలెక్కడ?

ప్రతి సమాజంలో నైతిక నియమాలు (ఎథిక్స్‌) సమాజ మనుగడను ప్రత్యక్షంగా శాసిస్తాయి. సమాజంలోని ప్రతి వ్యక్తి నైతికతను పాటిస్తే సమాజం లో ఎలాంటి సంఘర్షణ, అలజడి, ఆందోళన కనపడదు. నైతిక ప్రవర్తనలు మంచి నడవడిని, సమాజ నియమాల పట్ల నమ్మకాన్ని కోరుకొంటాయి. అందువల్ల సమాజం లో నైతిక నియమాలు అనేక ప్రధాన సామాజిక నియం త్రణ సాధనాలుగా వ్యవహరిస్తాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం మనం నైతిక విలువలు కన పడకుండా పోతున్న సమాజంలో ఉన్నాం.ఈ సమాజంలో మానవత్వంతో వ్యవహరించడం ఆడ,మగ అందరికీ అసాధ్యం అయిపోతోంది. ప్రభుత్వం సంగతిచూస్తే అది నిష్పక్షపాత వైఖ రితో,న్యాయబద్ధంగా, ధర్మంగా వ్యవహరిం చడం అనేది ఎప్పుడో మరిచిపోయింది. ఇక నాయకులు ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలుపుకోవడంలో విఫలమౌతున్నారు. నిజానికి వాళ్ళు తమ వాగ్దా నాలను అమలు చేస్తారని ఎవరూ ఆశించడం లేదుకూడా. ఏ మాత్రం జంకు,గొంకు లేకుండా, మనస్సాక్షి అనేదే లేకుండా‘మాదే మెజారిటీ గనుక మా మాటే శాసనం’ అనే విధానాన్ని ప్రభుత్వం ఆచరిస్తోంది. ప్రాచీన నిర్మాణాలను అమూల్యమైన చారిత్రక సంపదగా పరిగణించి పరిరక్షించాల్సి నది పోయి వాటిని ఉంచాలా, కూల్చాలా అన్నది వాటిని నిర్మించిన వారి మతాన్ని బట్టి నిర్ణయిస్తు న్నారు. ఆఫీసులలో పని చేసేవారి పట్ల, ఇళ్ళల్లో నివసించేవారి పట్ల ఎలాంటి వైఖరి ఉండాలన్నది కూడా అదే మాదిరిగా నిర్ధారిస్తున్నారు. ప్రభు త్వాన్నిగాని,ప్రభుత్వపుదన్నుతో రెచ్చిపోతూ విద్వే షాన్ని రెచ్చగొట్టే ప్రదర్శనల్ని నిర్వహిస్తున్న అసాం ఘిక శక్తుల్ని గాని నువ్వు ప్రశ్నిస్తే ఇక అంతే. నువ్వే వాళ్ళకి ప్రధానలక్ష్యం అయిపోతావు. మారుమాట్లాడకుండా తల ఒగ్గడమే నేడు అనుస రించాల్సిన పద్ధతి. మానవత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటివి ఇప్పుడు డీప్‌ ఫ్రీజ్‌లో ఉన్నాయి. భవిష్య త్తులో వాటిని బైటకు తెచ్చి నడిపించేదెన్నడో తెలీదు.
మారిపోతున్న విలువలు
యోగితా భయానా ఒక సామాజిక సేవకురాలు. గురుగ్రాంలో కొందరు గూండాలు ఒక ముస్లిం వ్యక్తికి చెందిన దుకాణాన్ని తగులబెడితే, దానిని తిరిగి నిర్మించుకోడానికి సహాయం చేసిందామె. ఆ సమాచారాన్ని, ఆమెకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్న ఆదుకాణదారుడి వీడియో క్లిప్పింగ్‌ని సోషల్‌ మీడియాలో పెట్టారు. వెంటనే యోగితకు మొదలయ్యాయి ట్రోలింగ్‌ వేధింపులు. నష్టపోయిన వాళ్ళు మరో50,60 మంది ఉన్నారు, వాళ్ళం దరికీ కూడా పోయి సాయం చెయ్యమం టూ వెటకారంగా కొందరు కామెంట్స్‌ పెట్టారు. ఆమె ఇంటి చుట్టుపక్కల హిందూ మహిళలు ఇంకా ఉన్నారు కదా,వాళ్ళకి లేనిబాధ నీకెందుకు? అం టూ మరి కొంతమంది కామెంట్‌ చేశారు. బహు శా ఒకపది,పదిహేనేళ్ళ క్రితం ఇటువంటి సహా యాన్నే చేసివుంటే,ఆకాలంలో యోగితకు అభినం దనల పరంపర ఎదురై వుండేది. మత సామర స్యాన్ని నిలబెట్టినందుకు గౌరవం దక్కేది. కాని, ఇప్పుడాపరిస్థితి లేదు.మారిపోయింది.పాత కాల పు విలువలు ఇప్పుడులేవు.మతవిశ్వా సాలు వేరు వేరుగా ఉన్నా, అందరమూ కలిసి బతుకుదాం అన్న ఐక్యతాస్ఫూర్తిలో విశ్వాసం లేనివాళ్ళు ఇప్పు డు కోట్లలో తయారయ్యారు. ఇప్పుడు ఎవరికి వారే. పక్కవాడు ఎలాపోయినా పట్టించుకోన వసరం లేదు అన్న ధోరణి బాగా పెరిగింది. హర్యానా లోని నువాలో అనిస్‌ అనే వ్యక్తి ముగ్గురు హిందూ యువకులకు తన ఇంట రక్షణ కల్పించి వాళ్ళని వెంట తరుముతున్న మూకల నుండి కాపాడాడు.తమ ప్రాణాలు నిలబెట్టినందుకు ఆ ముగ్గురూ అతని పట్ల కృతజ్ఞత తెలిపారు. కాని, ఆమర్నాడు అనిస్‌ ఇంటిని బుల్‌డోజర్‌ తో నేల మట్టం చేసేశారు. హర్యానాలో బుల్‌డోజర్లతో విధ్వంసం చేయడం ఇప్పుడు పరిపాటి అయి పోయింది. ఆ విషయం మీద పంజాబ్‌-హర్యానా హైకోర్టు జోక్యం కల్పించుకుని ఈవిధంగా చెప్పిం ది.’ముందస్తుగా నోటీసులు ఏవీ జారీ చెయ్య కుండా,కూల్చివేతకు అనుమతించే ఉత్తర్వులు ఏవీ లేకుండా శాంతి, భద్రతల రక్షణ పేరుతో ఇలా భవనాలను కూల్చివేయడం తప్పు. శాంతి భద్రత ల సమస్య ఒక సాకుగా ఉపయోగించుకుని ఒకే మతానికి చెందిన వారి ఇళ్ళను కూల్చివేయడం జరుగుతోందా అన్న అంశాన్ని కూడా చూడాలి. కొన్ని జాతుల సమూహాలను నిర్మూలించే విధా నాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందా అన్నది కూడా పరిశీలించాలి.’’
సమాజంలో నైతిక విలువల పతనం ఇదివరకే మొదలైంది.కాని మరీ ఇంత అథమ స్థితికి చేరు కోవడం గతంలో లేదు. అతి నీచంగా, పబ్లిక్‌గా ఆడబిడ్డల్ని మణిపూర్‌ వీధుల్లో అవమానపరచిన వైనం ఆ అథమ స్థితికి సూచన కాక ఇంకేమిటి? ఆ ఉదంతంపై అధికారంలో ఉన్న వారి స్పందన సంగతేమిటి?అది దేన్ని సూచిస్తోంది? ఆ బాధితు లను ఆ పాశవిక మూకలకు అప్పజెప్పినది ఆడ వాళ్ళేనంటూ ఆ దుర్మార్గాన్ని సమర్ధించే నైచ్యం దేనికి సంకేతం?కథువాలో జరిగినమరో ఉదం తం చూడండి! అక్కడ ఒక ఎనిమిదేళ్ళ ముక్కు పచ్చలారని పసిబాలికను ఘోరంగా రేప్‌ చేశారు. ఆ ఉదంతంలో నిందితులకు మద్దతుగా కొందరు జనాలు ఊరేగింపు తీశారు !
వెయ్యేళ్ళ క్రితమో,లేకుంటే నాలుగు వందల ఏళ్ళ క్రితమో ఎవరో ఒక రాజు, లేదా దండెత్తి వచ్చిన వాడు తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించా డంటూ ఇప్పుడు దానికి బాధ్యులుగా కొందరిని చేసి వారిపై దాడులకు దిగుతున్నారు.ఆ దాడు లను మనలో కొందరు సమర్ధిస్తున్నారు.కాని ఇప్పుడే,మనముందే మణిపూర్‌లో, హర్యానా లో జరుగుతున్న అన్యాయాలకు బలైపోయిన బాధి తులకు న్యాయం చేయాలని అడగడానికి మనం నోళ్ళు మెదపడం లేదు. ఫెవికాల్‌తో మన పెదవు లు అతుక్కుపోయాయి. ఎప్పుడో, ఎవరో దండెత్తి వచ్చినవాళ్ళు మన ప్రార్థనాస్థలాలను ఏ విధంగా అపవిత్రం చేశారో (ఆ ఘటనల్లో కొన్ని జరిగినవి, మరికొన్ని కేవలం కల్పితమైనవి కూడా ఉన్నాయి) చర్చించి, అప్పటి చారిత్రిక తప్పిదాలను ఇప్పుడు సరి చేయడానికి తయారయ్యాం. అది కూడా ఏ విధంగా?కొన్ని వందల సంవత్సరాల క్రితం చచ్చి పోయిన ఆ రాజు ఏ మతానికి చెందినవాడో ఆ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలమీద ఇప్పుడు దాడులు చేయడం ద్వారా.అప్పుడు ఆ రాజు చేసినది తప్పు అయితే ఇప్పుడు మరి మనం చేస్తున్నదేమిటి? అదే తప్పుకాదా? ఉత్తర ప్రదేశ్‌ లో,ఢల్లీిలో,హర్యానాలో పదే పదే మసీదులమీద దాడులు జరుగుతూనే వున్నాయి. ‘’మసీదు అంటే ఏమిటి? మహా అయితే అదో కట్టడం. చాలా కట్టడాలను కూల్చివేసినట్టే వాటినీ కూల్చేస్తాం’’ అని బాబరి మస్జిద్‌ విధ్వంసం సందర్భంలో ఎల్‌.కె.అద్వానీ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జ్ఞానవాపి మసీదు వియంలో కూడా అదే వ్యాఖ్యా నం చేశాడు. జరిగినదానికి ఏ విధమైన విచారం గాని సిగ్గు గాని లేనే లేదు. ఇది చరిత్రను రీవైండ్‌ చేస్తున్నట్టు ఉంది. నైతిక దౌర్బల్యం తాండవిస్తున్న కాలం ఇది. ప్రతీ జాతీఅప్పుడప్పుడు మనో వైక ల్యానికి లోనవుతూ వుంటుంది. మన విషయంలో ఆ వైకల్యం షార్ట్‌ టర్మ్‌ అమ్నీషియా (స్వల్పకాలిక మతిమరుపు) రూపంలో వ్యక్తం ఔతున్నట్టుంది. జరుగుతున్న వాటిని మనం చూస్తూనే వున్నాం. కాని వెంటనే మరిచి పోతున్నాం. గోగూండాలు ఒక మనిషిని చితక్కొట్టి చంపేసినా, ఒక మహిళ సామూహిక అమానుషత్వానికి బలైపోయినా ఆ సంఘటనలు మన మనస్సుల్లోని జల్లెడ కన్నాల నుండి జారిపోతున్నాయి. చాలా కొద్ది విషయా లను మాత్రమే గుర్తుంచుకోగలుగుతున్నాం. రోజూ కళ్ళెదుట జరుగుతున్న నీచమైన సంఘటనలను చూసి చూసి అలసిపోయామా? బహుశా అంతే అయివుండాలి మరి. కాకపోతే మన రోజువారీ పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోలేక పోతున్నామా? అది కూడా అయివుండొచ్చు. కార ణం ఏదైనా,మన నుండి ప్రతిస్పందన లేక పోవడంవలన విద్వేష మూకలకి, అసహన పరులకి ధైర్యం పెరుగుతుంది. జరుగుతున్న దాడి అక్కడో మసీదు మీదనో, ఇక్కడో దుకాణం మీదనో అయితే, అంతవరకూ అయితే వాటిని అదుపు చేయవచ్చు.కాని ఇప్పుడు జరుగుతున్న దాడి అటు వంటి చెదురు మదురుదాడి కాదు.
జోక్యం కల్పించుకోకపోవడం
ఇప్పుడు త్రిశూలాలు, పలుగులు, గొడ్డళ్ళు పుచ్చు కుని దాడి చేసే మూకలు అవసరం లేదు. ఇప్పుడు బుల్‌డోజర్లు ఆ పని కానిచ్చేస్తున్నాయి. ఒక చిన్న దుకాణం నడుపుకుంటూ బతుకుతున్నవాడిపైన లేదా ఒకచిన్న ఇంట్లో కాపురం ఉంటున్న వాడ పౖిెన దాడి చేసి వాటిని కూల్చివేసినప్పుడు గతంలో అక్కడినుంచి మూకలు చెల్లాచెదురు అయిపోయేవి. కాని ఇప్పుడు ఆవిధ్వంసం ముందు దర్జాగా నిల బడి సెల్ఫీ తీసుకుంటున్నారు.వాటిని వీడి యోలు చేసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఒక గోగూండా ఒక బక్కచిక్కిన పేద మీద విరుచుకు పడి, అతడిని వేధిస్తున్న వైనాన్ని, ప్రయోగిస్తున్న తిట్లను రికార్డు చేయిస్తున్నాడు. రైలులో ఒక పోలీ సు జవాను తన పై అధికారిని, మరో ముగ్గురు ముస్లిం ప్రయాణికులను కాల్చి చంపి, ఆ తూటా లకు బలై కొనవూపిరితో వాళ్ళు అతగాడి బూట్ల కింద కొట్టుమిట్టాడుతూ వున్నప్పుడే అక్కడే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో ప్రధాని నరేంద్ర మోడీకి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి జేజేలు పలికాడు. జనాలు కూడా జరుగుతున్న దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయడం కన్నా దానిని వీడియోగా తీయడమే ప్రధానం అనుకుంటున్నారు. ఇక బుల్‌డోజర్‌ బాధితులు తమపై జరిగే దుర్మార్గాన్ని తామే కళ్ళారా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోతున్నారు. కళ్ళ ముందే తాము కట్టుకున్న ఇల్లు ఒక్కో ఇటుకా, ఒక్కో రాయీ రాలి పడుతూంటే బిక్కచచ్చి కూలబడుతు న్నారు. మరోపక్క మీడియాలో కూడా కొందరు ఆ విధ్వంసాన్ని చూపిస్తూ క్షణాల్లో ‘న్యాయం’ ఏ విధంగా జరిగిందో చెప్తూ కీర్తిస్తున్నారు. బుల్‌ డోజర్ల విధ్వంసంలోని క్రూరత్వాన్ని,మూక దాడుల హత్యల్లోని ఆటవికతను, దేశ ప్రజల్లో ఒక పెద్దభాగం పశుప్రాయులుగా దిగజారి ప్రవర్తించడాన్ని మనం అందరం చూస్తున్నాం. ఏమీ పట్టనట్టు, లేదా ఇది రోజూ జరుగుతున్న దేలే అన్నట్లు చూస్తున్నాం.సామాజిక స్పృహ లేకుం డా బతికేయడం నేటి ప్రజానీకానికి అలవా టైపో యింది మరి!
నైతికతే శాంతిసమాజ నిర్మాణ పునాది
నైతిక విలువలు మన ఆలోచనలు, ప్రవర్తన మరియు నిర్ణయం తీసుకోవటానికి మార్గ నిర్దేశం చేసే నైతికతను కలిగి ఉంటాయి, ముఖ్యం గా నైతిక లేదా సామాజిక సందిగ్ధతలకు వచ్చిన ప్పుడు. నైతిక విలువలు సాంస్కృతిక భేదాలు, సామాజిక నిబంధనలు లేదా మతంలో లోతుగా పొందుపరచబడి,సమాజంలో ఒకరి స్థితిని నిర్వ చించే సమాచారంతో కూడిన ఎంపికలు చేయ డంలో సహాయపడే సరైన లేదా తప్పుపై వైఖరిని స్థాపించడానికి.పిల్లలకోసం, ఈ విలువలు సామా జిక బాధ్యత, తాదాత్మ్యం మరియు నైతిక నిర్ణయా త్మక నైపుణ్యాలను పెంపొందించడానికి అవస రం. బాల్య వికాస సమయంలో నైతిక విలువ లను పరిచయం చేయడం అనేది యుక్త వయస్సు లో యుక్తవయస్సులో భవిష్యత్తు వృద్ధి పథాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇతరులతో గౌరవప్రదంగా ప్రవర్తించేటప్పుడు మంచిగా లేదా పేలవంగా ప్రవర్తించడం వంటి ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడం వ్యక్తి గత ఎదుగుదలకు మాత్రమే కాకుండా సామాజిక సందర్భంలో కూడా అవసరమైన నైపుణ్యాలు.
-(జియా ఉస్‌ సలామ్‌)

ఆదివాసుల హక్కులకు రక్షణ కావాలి

‘‘ ఆదివాసీల హక్కులను గుర్తించేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కులను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఆదివాసీలు తిండి కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరు విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 40దేశాలలో సుమారు 40కోట్ల మంది ఆదివాసీ లు జీవిస్తున్నారు. ఆదివాసీల హక్కులను గుర్తిం చాలని 1994 ఆగస్టు 9నఐక్యరాజ్య సమితి డిక్ల రేషన్‌ పేర్కొంది.ఆదివాసీల హక్కులను గుర్తించ డానికి మాత్రం ప్రభుత్వాలు నేటికీ నిరా కరిస్తు న్నాయి. భారత దేశంలో 10కోట్ల మంది ఆది వాసీ ప్రజలు జీవిస్తు న్నారు. 700వందల ఆది వాసీ,75 ఆదిమజాతి తెగల హక్కులను గుర్తిం చేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం నిరాకరి స్తున్నది. అడవులపై వారు సాధించుకున్న హక్కు లను తొలగించి కార్పొరేట్‌ కంపెనీలకు ప్రవేశం కల్పిం చింది. స్వాతంత్య్రం వచ్చి75ఏళ్లు దాటినా ఆది వాసీలు తిండికోసం వలసలు పోవాల్సి వస్తోం ది. వీరు విద్య, వైద్య సదుపాయాలు,ఉపాధి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.’’
భారత రాజ్యాంగం5,6షెడ్యూల్‌ ప్రాంత అడవులలో నివసిస్తున్న ఆదివాసీలకు అక్కడి సహజ వనరులపై హక్కు కల్పించింది. ఆదివాసీలకు,గ్రామ సభలకు సర్వ అధికారాలు కల్పించింది.అయితే ఆదివాసీప్రాంతంలో ఉన్న అపారమైన సహజ వనరులను బడా కంపె నీలకు ధారాదత్తం చెయ్యడానికి,ఆదివాసీ ప్రాంత అడవు లను అదానీ,అంబానీ పరం చేయడానికి, విలు వైన బొగ్గు,బాక్సైట్‌,కాల్సైట్‌,లేటరైట్‌,మాంగనీస్‌, యురేనియం,గ్రానైట్‌,ఐరన్‌ ఓర్‌,వనమూలికలు, వృక్ష జంతు సంపదను ప్రైవేట్‌ బడా సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు.ఆదివాసీల అభిప్రాయాలు, ప్రతి పక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకో కుండా ఏకపక్షంగాఅటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుంది. ఆదివాసీ ప్రాంతంలో ప్రవేట్‌ బడా సంస్థల ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచింది.ఆదివాసీ ప్రాంతం లో ఆదివాసీలకు అడవులపై ఉన్న హక్కులను తొలగించింది.దీనివలన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటివరకూ ఆదివాసీలు సహజ సిద్ధంగా అటవీ ఫలసాయం పొందేవారు. ఇప్పుడది నేరం అవుతుంది. ఆదివాసీల అడవు లు, భూమి, సహజ వనరులకు రక్షణగా ఉన్న గ్రామసభకు అటవీ హక్కులు,1/70తదితర చట్టా ల అధికారాలు లేకుండా చేసింది. తక్షణమే ఈ సవరణ చట్టాన్ని రద్దు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలకు అడవులు,భూమి,సహజ వనరులపై హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
జీవో నెం 3 అమలు చెయ్యాలి
ఆదివాసీ ప్రాంత గిరిజన హక్కులు, చట్టాల అమలుకు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లకు భారత రాజ్యాంగం విస్త్రుతమైన అధికారాలు కల్పించింది.5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీ లకు వందశాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న జీవో 3 అమలు చేసి 20రకాల విభాగాలలో ఉపాధి కల్పించింది.అంతటి కీలకమైన జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆదివాసీ ప్రాం తంలో రిజర్వేషన్‌ ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన రిజర్వేషన్లు, హక్కులను రద్దు చేసినట్లయింది. గిరిజనేతర జాతులైన బోయ వాల్మీకులకు ఆదివాసీలుగా గుర్తింపు కల్పించి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర బిజెపి,రాష్ట్ర వైసిపి ప్రయత్నిస్తున్నాయి. ఆదివాసీ ప్రాంత అడవులు,సహజ వనరులను బడా కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా యి. తక్షణమే జీవో నంబర్‌ 3అమలుకు చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
పోలవరం బాధితులకు సహాయక చర్యలు
గత సంవత్సరం జులై 11న వచ్చిన గోదావరి వరద వల్ల అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు చెందిన కూనవరం, వరరామ చంద్రాపురం, దేవీపట్నం, ఎటపాక, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండ లాల్లోని 200 గ్రామాలు పూర్తిగా నీట మునిగి పోయాయి. వంద రోజులపాటు ఈ గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. పోలవరం వద్ద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంవల్ల నీరు వెనక్కి తన్ని ఈ జల ప్రళయం సంభవించింది.ఈ మండలాల్లోని ఊళ్ళకు ఊళ్ళు నీట మునిగిపోయాయి. వేలాది కుటుంబాలవారు కొండలు, గుట్టలు ఎక్కి వారాల తరబడి అక్కడే నానా అగచాట్లు పడ్డారు. రెండు నెలల తర్వాత గ్రామాలకు చేరుకున్నారు. అదే పరిస్థితి నేటివరదల సమయంలో మరలా పునరావృతం అయ్యింది. మునక మండలాల గ్రామాలు గోదావరి, శబరి నదుల వరద వల్ల జల దిగ్బంధనంలో ఉన్నాయి. వరద ముంపు సమస్యపై సత్వరం ప్రభుత్వం స్పందించాలి. ముందస్తు చర్యలు తీసుకోవాలి.
1.గోదావరి వరద ముందస్తు చర్యలు సత్వరం తీసుకోవాలి.2. వరద బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి.3.వరద గ్రామా ల నుండి బాధితులను తరలించేందుకు వాహ నాలు ఏర్పాటు చేయాలి. పడవలు, లాంచీలు సిద్ధం చేయాలి.4.వరద బాధిత గ్రామాల ప్రజలు తాత్కాలిక గుడారాలు నిర్మించుకోవడానికి ప్రతి కుటుంబానికి టార్పాలిన్లు ఇవ్వాలి.5. ప్రత్యామ్నా య రహదారులను పునరుద్ధరించాలి.రోడ్లను మరమ్మతు చేయాలి.6.పాఠశాలలు మూత పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 7.చింతూరులో ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసరును వెంటనే నియమించాలి.
షెడ్యూల్‌ ప్రాంతంలో నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామాలు కలపాలి
రాష్ట్ర వ్యాప్తంగా1500ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. షెడ్యూల్‌ ప్రాంతంలో లేనందున అక్కడ నివసి స్తున్న ఆదివాసీల భూములు, అడవులకు రక్షణ లేదు.గిరిజనేతర పెత్తందారులు,మైనింగ్‌ మాఫి యా మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఐటిడిఎ పర్యవేక్షణ, పథకాలు, నిధులు అందక… ఆదివాసీ గ్రామాలకు విద్య, వైద్యం ఉపాధి, మంచి నీరు,రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు అందు బాటులోలేక…బిక్కు బిక్కుమంటూ గడుపుతు న్నారు.తక్షణమే నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామా లను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి.
యుసిసి ని వ్యతిరేకిద్దాం
రాజ్యాంగం ఆదివాసీలకు ప్రత్యేక శాసనాలు చేసింది. వారి సంస్కృతి, ఆచారాలను గుర్తించింది. అయితే కేంద్ర బిజెపి ఆదివాసీలపై హిందూ భావజాలాన్ని రుద్దేందుకు, ఆదివాసీల ప్రత్యేక శాసనాలు, సంస్కృతి ఆచారాలు తొలగిం చేందుకు ఏకరూప పౌర స్మృతి (యుసిసి)ని అమలు చేయాలని చేస్తున్నది. ఆదివాసీ ప్రాంతం లో యుసిసి అమలును వ్యతిరేకించాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ఇస్తున్నది.
హక్కుల దినోత్సవం ప్రాధాన్యత :
యుఎన్‌ఓ 1982 లో ప్రపంచంలోని ఆదివాసీలను విశ్వమానవులుగా గుర్తించినపుడు, వారికున్న ప్రత్యేక హక్కులను రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఈ హక్కుల దినోత్సవం గుర్తుచేస్తుంది. ఈ కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాలు రాజకీయ,సామాజిక,ఆర్థిక సాధికారత, సంస్కృతి, సాంప్రదాయాలు,చరిత్ర,వేదాంతశాస్త్రం, వార సత్వ భూమి హక్కులు, స్థానిక వనరులు, అలాగే అన్ని రకాల వివక్షలు మొదలైన వారి హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని గౌరవిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆ సమా వేశంలో తీర్మానించిన అంశాలను వెల్లడిర చిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌ ను అనుస రిస్తూ సెప్టెంబర్‌ 13ను అంతర్జాతీయ ఆది వాసీ హక్కుల దినోత్సవంగా గుర్తించడం జరిగింది.
46 రకాల హక్కులను కల్పించి
ఈ డిక్లరేషన్‌ లో మొత్తం 46 ప్రకర ణలు పొందుపరిచారు.ఈ 46ప్రకరణలలో ముఖ్యమైనవి మచ్చుకు కొన్ని…(1):ప్రపంచ మానవ హక్కుల చట్టం ప్రకారం,ఆదివాసీలు స్వేచ్ఛగా మానవహక్కులు, ప్రాథమి క హక్కులను కలిగి వాటిని ఆనందంగా అనుభవించాలి. ఎటు వంటి వివక్షకు గురికావద్దు. అధికరణ(2): ఆదివాసీలు ఎటువంటి వివక్ష లేకుండా ఇతరులతో పాటు సమానంగా హక్కు లను అనుభవించాలి.
అధికరణ (3): ఆదివాసీలు సంకల్పంతో వారి ఇష్ట ప్రకారం, రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడు అంశా లను వారి ఇష్టమైన రీతిలో నిర్వహించుకొని అభివృద్ది చెందవచ్చు.
అధికరణ (4): వీరు స్వయం ప్రతిపత్తి, స్వయం పాలనను వారి అంతరంగిక స్థానిక అంశాలలో నిర్వహించుకోవచ్చు. అదే విధంగా ఆర్థిక వనరు లు,సముపార్జనను వారుఇష్టమైన రీతిలో నిర్వ హించుకోవచ్చును.
అధికరణ(5): ఆదివాసీలకు రాజకీయంగా, ఆర్థికంగా,చట్టాలను బలోపేతం చేసుకునే అధికా రం కలదు.
అధికరణ(6): ప్రతి ఆదివాసీ ఏ దేశంలో నివసి స్తున్నప్పటికీ ఆదేశ పౌరసత్వము పొందే ఉండే హక్కును కలిగి ఉంటాడు.
ఆధికరణ(7):ప్రతి ఆదివాసీ మానసిక సమత గ్రతలో జీవితంలో స్వేచ్ఛ,రక్షణ హక్కును కలిగి ఎటువంటి మారణ హోమానికి గురికాకుండా, వృక్తిగతంగా,సమూహంగా,రక్షణతో కూడిన శాంతి,రక్షణ కలిగి బలవంతపు చర్యలు వీరిమీద, పిల్లల లేకుండా ఉండే హక్కు.
అధికరణ(8): జాతిపరంగా రెచ్చగొట్టే చర్యలు, వివక్ష ఉండకూడదు. వారి సంస్కృతి, సాంప్రదా యాలు రక్షణ కలిగి విలువలు కలిగి ఉండాలి. భూమిపై హక్కులు కాలరాయకుండా, వనరుల దోపిడి జరగకుండా బాధ్యతాయుతమైన యంత్రాం గాన్ని ఆయా రాష్ట్రాలే కల్పించాలి.
అధికరణ(9):ఆదివాసీలు సంస్కృతి, సాంప్ర దాయులకు అనుగుణంగా ఏదైనా జాతీయతను కలిగి వుండవచ్చును. వీటిపై ఎట్టివివక్ష చూ పరాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన ఆది వాసీ సమాజాలకు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం గురించి తెలిసినంతగా ఆదివాసీ హక్కుల దినం గురించి తెలియక పోవడానికి కారణం నేటి ప్రభు త్వాల అలసత్వం.ఐక్యరాజ్య సమితి సూచన మేరకు దేశ మంతటా ఆదివాసీల హక్కులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి.
వ్యాసకర్తలు :ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ఆదివాసీ రచయి తల వేదిక, వ్యవస్థాపక కార్యదర్శి.(కిల్లో సురేంద్ర/గుమ్మడి లక్ష్మీ నారాయణ)

రాజకీయాలు`దళితుల దుస్థితి

స్వయం సేవకుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌, దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరుచుకున్నది.దళితుల్ని హిందువులుగాను,ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో,హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది.ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది.
‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ (అంద రినీ కలుపుకొని అందరి అభివృద్ధి) అని భారతీయ జనతా పార్టీ నినాదమిస్తుంది కానీ సమాజంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నది. మెజార్టీ మతవాద రాజకీయాలకు ముస్లింలు ప్రధాన లక్ష్యంగా ఉం డగా,దళితులను అణచివేయడం కూడా అంతే సమానమైన ప్రధాన అంశం.ఓవైపు దళితుల సామా జిక,ఆర్థికపరిస్థితులు దిగజారుతుండడం, మరోవైపు దళితులకు బిజెపి,ఎన్నికలపరంగా దగ్గరవుతున్న విడ్డూర పరిస్థితులు పెరుగుతుండడం చూస్తున్నాం. ఈ ఆధిపత్య రాజకీయాలకు మూల విరాట్టుగా దళితుల్ని హిందూ జాతీయవాద స్రవంతిలోకి చేర్చుకోవాలనిచెప్పే రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఫ్న్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ప్రభావం కూడా పెరుగుతున్నది. పందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో హిందూ మతంలో అణచివేతకు గురైన ప్రజల విద్య, ఇతర హక్కుల కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే ‘దళితుడు’ అనే పదాన్ని రూపొందించాడు. స్వామి వివేకానంద ‘’భారతదేశ భవిష్యత్తు’పై చేసిన ప్రసంగంలో ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ వర్గాల ప్రజలు చాలామంది కులవ్యవస్థ అణచి వేత కారణంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారని ఆయనన్నారు.సామాజిక సమానత్వం,ఆర్థిక న్యా యం, అందరికీ తాగునీటి బావుల అనుమతి, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం బి.ఆర్‌. అంబేద్కర్‌ చేపట్టిన అనేక అవిశ్రాంత పోరాటాల ద్వారా,ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(1935) స్థాపన ద్వారా కొద్దిగా సానుకూల ఫలితాలు లభిం చాయి. విద్య, ఉద్యోగాలు, ఎన్నిక ల రంగంలో దళితులకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు కల్పించే నిర్ణయా త్మక చర్యల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దళితుల జీవితాల్లో దీనివల్ల కలిగిన ప్రభావం, కొద్ది మేరకు సంభవించిన మార్పులు నత్తనడకన సాగాయి. గడిచిన కొన్ని దశాబ్దాలలో దళితుల పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారాయి. వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ సూచికలు ఈ క్షీణిం చిన పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి.‘నేషనల్‌ కొయలేషన్‌ ఆఫ్‌ స్ట్రెందెనింగ్‌ ఎస్సీస్‌ అండ్‌ ఎస్టీస్‌’ నివేదిక ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల వారిపై నేరాలు 2021లో1.2 శాతం పెరిగాయి. అదే సంవత్స రంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీలపై అత్యాచారాలు అత్యధికంగా 25.8శాతం నమోదుకాగా,రాజ స్థాన్‌ 14.7శాతం, మధ్యప్రదేశ్‌ 14.1శాతంతో ఆ తరువాతి స్థానాల్ని ఆక్రమించాయి. బిజెపి హిం దూత్వ ఎజెండాతో సమాజాన్ని రెండుగా విభజించ డానికి, అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన మైన సమస్యల్ని పక్క దోవపట్టించేందుకు అస్థిత్వ సమస్యల్ని లేవనెత్తుతున్నది. గోరక్షక దళాలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని, మూకదాడులతో మనుషుల ప్రాణాలు తీయడం నిత్యకృత్యమై పోయింది. ఈ ప్రచారాలతో రెచ్చిపోయిన మూకల ఆగ్రహానికి ప్రధానంగా బలవుతున్నది ముస్లిములై నప్పటికీ దళితులు సైతం పెద్ద సంఖ్యలో హత్యగా వించ బడుతున్నారు. ఉనా లో జరిగిన భయానక ఘటన వాస్తవంగా ఏం జరుగుతున్నదో మనకు తెలియచేస్తున్నది. చారిత్రక తప్పిదాలను సరిదిద్ద డానికి దళితులకు రిజర్వేషన్ల కల్పన ఒక సాధ నంగా వున్నమాట నిజమే కానీ, బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ఇది కూడా దెబ్బతింటున్నది. ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం ద్వారా వాటి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగు తున్నది. కేవలం 5 శాతం శ్రామిక దళిత జనాభా మాత్రమే రిజర్వేషన్ల నుండి ప్రయోజనం పొందు తున్నారని సామాజిక శాస్త్రవేత్త, సుఖ్‌దేవ్‌ థోరట్‌ అభిప్రాయపడ్డాడు. అస్పష్టమైన ఆర్థిక ప్రాతిపదికతో దళితేతరులకు రిజర్వేషన్ల కల్పించడంకూడా వారి అవకాశాల అందుబాటును కుదించేస్తుంది. ‘క్రీమీ లేయర్‌’ (మెరుగైన దొంతర)ను ప్రవేశపెట్టడం, కుటుంబాలలో వ్యక్తుల ఆదాయాల్ని కలగాలపు లగం చేయడం రిజర్వేషన్లకు ఒక వర్గాన్ని దూరం చేయడానికి దారి తీస్తుంది. 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి),అన్ని కళాశాలల్లో 700 ఖాళీలు ఉన్నాయని ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌లో దళిత అభ్యర్థులకు కేవలం 2.5 శాతం పోస్టులు కేటాయించగా, ఎస్టీ అభ్యర్థులకు అసలు ఎలాంటి పోస్ట్‌లు రిజర్వ్‌ కాలేదు. ఇలాంటి చర్యలే ఈవర్గాలను మరింత దుస్థితిలోకి నెడు తున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక
భారతీయ జనతా పార్టీ ప్రతీ సందర్భం లోను దళితుల హక్కులు, నిబంధనలను నిర్వీర్యం చేసేందకు ప్రయత్నిస్తున్నదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది అర్థం కావాలంటే బిజెపి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను,అది ఏ పరిస్థితుల్లో స్థాపించ బడిరదో క్లుప్తంగా తెలుసుకోవాలి. వలస పాలనా కాలంలో భారతదేశంలో సామాజిక సంస్కరణల ప్రక్రియ పుంజుకోవడం, దళితుల్లో విద్యను ప్రోత్స హించడానికి జ్యోతిరావు ఫూలే చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత సామాజిక సమానత్వం కోసం అంబే ద్కర్‌ చూపిన చొరవ దళితుల్లో మరింత సామాజిక అవగాహనకు, స్పృహకు దారితీసింది. ఈ అవగా హనే 1920లలో మహారాష్ట్రలోని విదర్భలో’ బ్రాహ్మణేతర ఉద్యమానికి’’బాట వేసింది, ఈ విధమైన మార్పులను అగ్రకులాలకు చెందిన వారికి మింగుడుపడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపనకు దారితీ సిన కారణాలలో అదీ ఒకటి. హిందూ రాష్ట్ర ఎజెండా ఓవైపు ముస్లింలను, క్రైస్తవులను ‘విదేశీ యులుగా’ పేర్కొంటూనే, మరోవైపున దళితులను బానిసలుగా పరిగణించిన మనుస్మృతి చట్టాల గురించి అదే పనిగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. సమాజంలో సమానత్వం కోసం జరిగిన ప్రతి ఉద్యమాన్నీ అగ్రకులాలకు చెందిన వారు వ్యతి రేకించారు.భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌,దాని మద్దతుదార్లు రిజర్వేషన్ల నిబంధ నలను తీవ్రంగా వ్యతిరేకించారు.రిజర్వేషన్ల అమలు చేయడం, ప్రభుత్వ రంగంలో విస్త్రతంగా ఉద్యో గాలు కల్పించడంవల్ల దళితులు సామాజిక రంగం లోకి రావడం మొదలైంది.1980లో దళిత సమా జం, సమానత్వం వైపు సాగించిన యాత్రను వ్యతి రేకించడంతోపాటు అహ్మదాబాద్‌లోదళిత వ్యతిరేక హింస కూడా చోటుచేసుకుంది. 1990లో మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయడంతో రథ యాత్రకు భారీ ఊపు లభించి,1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. వీటన్నిటి ద్వారా బిజెపికి పెద్దఎత్తున ఎన్నికల్లో పైచేయి సాధించ డానికి మార్గం తెరుచుకుంది. అదే సమయంలో బిజెపి ఆధిపత్య రాజకీయాలు,ఓవైపు దళిత సమా జాన్ని తొక్కిపడుతూనే వారిని సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థాయిలో ఆకర్షించేందుకు పనిచేశాయి. దళితులలో పని చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‘సామా జిక సామరస్య వేదిక’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కుల వ్యవస్థను దెబ్బ తినకుండా ఆ పరిధిలోనే ‘’హిందూ ఐక్యత’’ కాపాడుకోవాలనే సందేశాన్ని చ్చింది. అంబేద్కర్‌ ‘’కుల నిర్మూలనకు’’ విరుద్ధంగా ఈ సంస్థ భిన్న కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దళితుల్లో పని చేసింది. సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా దళిత సమాజంలో కొంత భాగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తిప్పుకోగలిగింది. దళితుల్ని మంచి చేసుకోవడానికి యు.పిలో సుహే ల్‌దేవ్‌ లాంటి ముఖ్యమైన దళిత వ్యక్తులను తీసుకొచ్చి, ముస్లిం వ్యతిరేకతను కూడా ఎక్కించడం మొదలు పెట్టింది. ఇది ఒక దెబ్బకు రెండు పిట్టలు వ్యవహారమే. దళితులను ప్రసన్నం చేసుకునేందుకు వారి ఇళ్ళలో బిజెపి భోజనాల తంతుతో,వారిలో ఒక వర్గాన్ని ఆకట్టుకుంది. ‘’సంస్కృతీకరణ’’ అనబడే ఈ తతంగం బాగా ప్రచారమైంది. స్వయం సేవ కుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ ఎస్‌,దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరు చుకున్నది. దళితుల్ని హిందువులుగాను, ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో, హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది. ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది. ఇలాంటి వ్యూహాలతో బిజెపి 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లోని మొత్తం84 సీట్లకు గాను 44 సీట్లను గెలుచు కుంది.
దళిత ముస్లిం సమస్య
ఇస్లాం మతాన్ని స్వీకరించిన దళితు లకు, రిజర్వేషన్లు కల్పించాలా,వద్దా అన్న మరో చర్చ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ‘’దళిత ముస్లింలు’’ రెండు రకాల ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది.ముస్లింలుగా వారు మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారు.దళితులుగా రిజర్వేషన్ల ప్రయో జనాలు పొందలేకపోతున్నారు. ‘ఇస్లాంలో కుల వ్యవస్థ ఉండదు, అందరూ సమానమే అని విశ్వసి స్తారు కాబట్టి వారికి రిజర్వేషన్లను ఎందుకు కల్పిం చాల’ని అనేకమంది దళిత రచయితలు, మేథావులు వాదిస్తున్నారు. ఖురాన్‌లో కుల వ్యవస్థను అనుమ తించలేదని కూడా వారు అంటున్నారు. ప్రముఖ దళిత మేథావులైన దిలీప్‌ మండల్‌, సూరజ్‌ యెంగ్డేలు ముస్లిం దళితులకు రిజర్వేషన్లను వ్యతిరేకి స్తున్నారు. ఇస్లాం పవిత్ర గ్రంథాల ప్రకారం, ఇస్లాం లో కుల వ్యవస్థ లేదు కాబట్టి రిజర్వేషన్ల వర్తింపులో దళిత ముస్లింలను పరిగణలోకి తీసుకోకూడదని వారు వాదిస్తున్నారు. మత గ్రంథాలు చదవడం ద్వారా సమాజాలు నడవవు. సమాజంలోని ఉన్న త వర్గాలు అనేక కారణాలతో అణగారిన వర్గాల స్థితిని నిర్ధారిస్తాయి.ఆవాస్తవం గుర్తించలేక పోవడ మే వారి వాదనలో ఉన్న లోపం. దక్షిణాసియా సమాజాలలో కులం అనేది అన్నిటినీ మించిన వాస్తవం. దీనికి ముస్లింలు కూడా మినహాయింపు కాదు.ముస్లింలకు ఆధునిక విద్యనందించే ఉద్దే శ్యంతో ప్రయత్నాలు ప్రారంభిం చినపుడు కూడా, అందులోని నిమ్న కులాల వృత్తికి ఎలాంటి ఆధునిక విద్య అవసరం లేదనే వాదన వచ్చింది. ఆవాదన తోనే ఆధునిక విద్యను అందిం చడంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు.
కనుక మిగిలిన దళితులెంత దళితులో ముస్లిం దళితులు కూడా అంతే. నిర్ణయాత్మకమైన కనీస సానుకూల చర్యల నుండి దళిత ముస్లింలను దూరం చేయడమంటే జనాభాలో ఒక పెద్ద వర్గానికి అన్యాయం చేసినట్టే. అసలు సమస్య ఏమంటే, కేకును ఎక్కువ మంది అడిగినప్పుడు, దాన్ని మరింత పెద్దదిగా చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ, ఎస్సీ రిజర్వేషన్లను గణనీయంగా తగ్గిస్తున్నది, కాబట్టి సమస్య ఇక్కడే ఉంది. ముస్లింల ఎన్నికల రిజర్వేషన్లు సంబంధించినంతవరకు, ఎన్నికల రంగంలో ముస్లింల ప్రాతినిధ్యం ఇప్పటికే చాలా తక్కువ స్థాయికి, అంటే జనాభాలో వారి ప్రాతినిధ్యం కంటే చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లపై ప్రభావం చూపుతాయని, వారి ఎన్నికల నిబంధనల అవసరాల్ని కూడా పెంచుతాయని కొందరు మేథావులు వాదిస్తున్నారు. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు విస్తరించే సందర్భంలో ఎన్నికలకు సంబంధించిన ఈ వాదనను పరిగణలోకి తీసుకోకూడదు.
(వ్యాసకర్త ఐఐటి మాజీ ప్రొఫెసర్‌, సామాజిక కార్యకర్త)(‘ద వైర్‌’ సౌజన్యంతో),- (రామ్‌ పునియానీ)

1 2 3 4 5 6 15