భారత దేశంలో అమలు కానీ ఐక్య రాజ్య సమితి నియమాలు

ప్రపంచ వ్యాప్తంగా179 దేశాలలోని ఆదివాసీ ప్రజలు దట్టమైన అడవులు కొండ ప్రాంతాల్లో నది పరివాహక ప్రాంతాలలో అభివృద్ధికి దూరంగా విలక్షణమైన జీవనాన్ని అవలంబిస్తూ పకృతి పై ఆధారపడి, ప్రత్యేక సంస్కృతి సాంప్ర దాయాలు, భాష, వేషధారణ కలిగి38కోట్ల జనాభాతో7000 భాషలు మాట్లాడుతూ, 50 00 రకాల బిన్న సంస్కృతులు పాటిస్తున్నారు. భారతదేశం లో అధికారికంగా చూసినపుడు 2011జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభాలో ఆదివాసీల జనాభా 8.6శాతం కాగ అందులో10,42,81,034 జనాభాగల ఆది వాసీలు, 6,92,027 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల దట్టమైన అడవిప్రాంతంలో 26 రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో,188 ఆదివాసి జిల్లాలలో ఉన్నారు. దేశ విస్తీర్ణంలో 60శాతం అడవి ఆదివాసి ప్రాంతంలోనే ఉం డగా పకృతిలో మమేకమైన తెగలను భారత రాజ్యాంగంలో 705షెడ్యూల్‌ తెగలుగా గుర్తించింది, ఇందులో అత్యంత ఆట విక లక్షణాలు కలిగిన ప్రిమినిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పిటిజి)లు75 తెగలు కలిగి 27,68,322 జనాభా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో9రకాల ఆదిమతెగలు కోయ, గోండు, కొలం,పర్ధాన్‌,తోటి, నాయకపొడు, మన్నేవార్‌, కొలవార్‌, కొండ రెడ్డి, అంద్‌,చెంచు,గోతి కోయ, లాంటి ఆదిమ తెగలు గోదావరి పరివాహక ప్రాంతం ప్రాణహిత, కిన్నెరసాని,కృష్ణ నది లాంటి పరివాహక ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో నివాసం ఏర్పరుచు కొని,17352 చరపు కిలోమీటర్ల షెడ్యూల్‌ ఏరియా భూభాగంలో నివాసం ఉం టున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా,దేశ వ్యాప్తంగా,రాష్ట్ర వ్యాప్తంగా, ఆదిమ తెగల మనుగడ పై కొన్ని అంశాలను మి ముందు విశ్లేషణ చేయాలనేది ఈ వ్యాసం సారాంశం.
1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి(ఖచీూ) ఆధ్వర్యంలో ‘జెనీవా’లో ప్రపంచ వ్యాప్త ఆదిమ తెగల సమస్యలపై,26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమా వేశాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సమా వేశంలో 140దేశాల ప్రతినిదులు పాల్గొన్నారు. ఆదివాసీల గుర్తింపు కోసం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి కమిటీ కోరగా,ఆదివాసుల సంరక్షణ, హక్కులు, చట్టాల రక్షణకు ఐక్య రాజ్య సమితి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ కమిటీ 1982నుండి1992 వరకు,పది సంవ్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్షేత్రపర్యటన చేసి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్య యనంచేసి,విశ్లేషించి,23 డిసెంబర్‌ 1994 నుండి 2004 వరకు ఆమధ్య కాలన్ని ఆదివాసీ అభివృద్ధి కాలంగా పరిగణించి,ఆగస్టు9వ తేది నీ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకిం చింది. ఆదివాసి తెగలలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువ జరుగుతున్నాయని మానవ హక్కుల రక్షణ కోసం హై కమిషన్‌ సెప్టెంబర్‌ 13,2007న జనరల్‌ అసెంబ్లీ ద్వారా ఐక్య రాజ్య సమితి ఒకడిక్లరేషన్‌ (ఖచీణRI) ప్రకటించింది.అందులో‘ఆర్టికల్‌ 45’లో ఆదిమ తెగల సంస్కృతి రక్షణ,సంస్కృతి రక్షణలో ఆది ఆదివాసీల అభిప్రాయాలను గౌరవించటం,తెగలభాష రక్షణ,విద్య వ్యవస్థలో ఆదివాసి భాష కూర్పు,విద్య అభివృధి లాంటివి చేర్చినారు.‘ఆర్టికల్‌ 46’లో ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాల్లో అభివృధి విషయంలోచేసే అన్ని నిర్ణయాలలో ఆదివాసీలను బాగా స్వామి చేయటం,అదే విధంగా బారిప్రాజెక్ట్‌ల మూ లంగా,ఖనిజ త్రవ్వకాల మూలంగా నిర్వాసి తులుగామారి,జీవన ఆధారం కోల్పోయిన ఆదివాసీలకు న్యాయమైన హక్కుగా నష్ట పరి హారం,రిహబిటేషన్‌ కల్పించి రక్షించటంతో పాటు, ములవాసిల పట్ల వివక్షతను చూపటం నీ నిషేధించింది,వారి యొక్క నిర్ణయం లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టడం నిషేధం, అభివృధిలో బాగంగావారి ఆర్థిక,సామాజిక, పరిస్థితులను వారి విభిన్నమైన జీవనశైలికి అను గుణంగా వ్యవహరించాలని ఈ డిక్లరేషన్‌ తెలి పింది. దీనితో పాటు2017లో ఆదివాసి పదం తోపాటు,‘ఇంటర్నేషనల్‌ ఇండిజినియస్‌ పీపిల్స్‌ డే’గా ప్రకటించింది. ఆదివాసి తెగల భాష రక్షణకు కూడా2022 నుండి 2032 కాలాన్ని ఆదిమ భాషల రక్షణకు అన్ని దేశాలకు నివేదిం చింది.2022 సంవత్సరాన్ని ఆదిమభాషల పరి రక్షణ దినోత్సవం గా ప్రకటించింది.పై తీర్మా నలపై148 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సంతకాలు చేసినవి,అందులో అమలు చేసిన దేశాలు కేవలం 60మాత్రమే. ఈ అమలు చేసిన 60దేశాల జాబితాలో భారతదేశం లేదు అంటే,ఈ దేశంకి ఆదివాసిల అభివృధిపట్ల ఎంతశ్రద్ధ ఉంది అర్థం చేసుకోవచ్చు.ఏసమా జానికి అయినబాష అనేది అత్యంతకీలకం. ప్రపంచవ్యాప్తంగాఉన్న 7000ఆదివాసీ తెగల సజీవభాషలలో,దాదాపు 3000భాషలు అంత రించిపోతున్న భాషలుగా పరిగణించబడ్డాయి. ఇప్పటి వరకు ఖచీజుూజూ ప్రపంచంలోని అంతరించిపోతున్న భాషల జాబితాలో అసుర్‌, బిర్వోర్‌,కొర్వాలను ఉంచింది,బిర్వోర్‌ను క్లిష్టంగా అంతరించిపోతున్న భాషగా వర్గీకరించారు. కేవలం 2000మంది మాత్రమే ఈభాష మాట్లా డుతారు.భారతదేశంలో ఐదు ఆదిమభాషలు అంతరించిపోతున్నాయి అని తెలిపింది. అందులో సిక్కింలోని మారిaభాష అత్యంత ప్రమాదకర భాష అనీ భాష నిపుణులు చెబు తున్నారు,‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండి యా’ నిర్వహించిన పరిశోధన ప్రకారం ప్రస్తుతం ‘‘మారిa’’ మాట్లాడే వ్యక్తులు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు, వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారుగా పేర్కొంది. అదేవిధంగా తూర్పు భారత దేశంలో ‘‘మహాలీ’’బాష,అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ‘‘కోరో’’,గుజరాత్‌లోని ‘‘ సిడి’’,అస్సాం లోని ‘‘దిమాస’’ భాషలు అంతరించిపోతున్నాయి అని తెలిపింది.ఖచీూ చెప్పినట్లుగా అత్యంత దారుణ పరిస్థితిలో ఈదేశంలో ఆదిమభాషల పరిస్థితిఉన్న కూడా భాషకు రక్షణ చర్యలు మాత్రం ప్రభుత్వాలు చేసే పరిస్థితులు కనిపిం చవు.ఐక్యరాజ్య సమితి నివేదించిన ఏఒక్క నియమాలను గౌరవించటం లేదు భారత దేశం,ఛత్తీస్గఢ్‌ రాష్ట్రంలో ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరిట,లక్షలాది ఆర్మీ క్యాంపులు ఏర్పాటు చేసి, పకృతి ఒడిలో జీవించే ఆదివాసీలను అడవిలోకి పశువుల్ని మేపటానికి వెళ్లిన,పకృతితో మమే కమైన పండుగలు జరిపే క్రమంలో,ఒకగూడెం నుండి ఇంకొక గూడెంకి సత్సంబంధాలు నెల కొల్పే క్రమంలో,ఎందరో సామాన్య ఆదివాసీల ను కాల్చి చంపిన ఘటనలు అనేకం.ఖనిజ త్రవ్వకాల పేరిట,టాటా,బిర్లా, ఆధానిలకు ఈ దేశ సంపదను అమ్మి వేస్తూ అడవితల్లిని, విధ్వంసంను అపమన్నదుకు అడవితల్లి నెల కోసం పోరాడినదుకు,అస్తిత్వంకోసం తిరగ బడి నందుకు,వేలాదిమంది ఆదివాసులపై అక్రమ కేసులు,ఊపాచట్టాలు,మహిళలపై అత్యాచా రాలు. సల్వా జుడుం లాంటి సంస్థలను నెల కొల్పి ఈ దేశ ములావాసులపై ఎటువంటి మారణ హోమం,లైంగిక హింస అడవిబిడ్డపై కొనసాగింది కళ్ళారా చూసాము. జంగల్‌ మహల్‌ పచింబెగాల్‌లో కానీ, కాంద మహల్‌ ఒరిస్సాలోగాని,నియంగిరి కొండలలోని బాక్సైట్‌ త్రవకంకానీ,జార్కండ్‌లో టాటా బిర్లా ఉక్కు కర్మాగారంగాని,ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పేరిట ముచిన 300గ్రామాల ఆదివాసి ప్రజల జలసమాధి కానీ,గుజరాత్‌ మధ్య ప్రదేశ్‌లో నర్మదనదిపై ఏర్పాటు చేసిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ క్రింద మునిగిన 1000గ్రామాల ఆది వాసీల ఆర్తనాదాలు కానీ, ఈదేశంలో ఆదిమ తెగలకు స్థానం లేదు వారికి బ్రతుకుకు విలువ లేదు. అసలు మనుషులుగానే చూడబడటం లేదు అనటానికి నిదర్శనం.వర్జీనియస్‌ కాక కమీ షన్‌ 2014’నివేదించిన ప్రకారం ఈదేశంలో 47శాతం ఆదివాసీలు నిర్వాసితులు అయ్యారని తెలిపింది,బారిప్రాజెక్ట్‌లు డ్యాంలు కట్టడం వలన, మైనింగ్‌ త్రవ్వకాలవలన,వైల్డ్‌ లైఫ్‌ శాంచరీ,పులుల అభయ అరణ్యాల వలన, పరి శ్రమల ఏర్పాటు వలన,స్వాతంత్య్రం వచ్చిన నుండి నేటి వరకు 21మిలియన్‌ ఆదివాసి ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పించలేదు. పైగా అసలు ఏమయ్యరో ఈప్రజలు అనేది కూడా స్పష్టత లేదు నేటి వరకు.పైగా ‘‘కేంద్ర పునరావాస చట్టం 2013’’లాంటివి ఉన్నా ఉపయోగం లేదు. ఇంకా దారిద్య్రపు రేఖకి దిగువన ఈదేశంలో 36శాతం ఆదివాసి ప్రజలు ఉన్నారు అందులో జార్ఖండ్‌ రాష్ట్రం 54.2శాతంకాగా, ఒరిస్సా 75.6శాతం అధిక స్థానంలో అత్యంత పేదరికంలో ఉంది కానీ ఈ దేశంలో అత్యధి కంగా మైనింగ్‌ కలిగిన రాష్ట్రాలు కూడా ఇవే కానీ ఆది ఆదివాసీలకు మాత్రం కడు పేదరికం వెంటాడుతుంది అనేది గ్రహించాలి. ప్రభుత్వం మైనింగ్‌ త్రవ్వకాలపై ఉన్న శ్రద్ధ ఆదివాసి కడుపు నింపటంలో లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు అనేది ఒక సహజ అంశంగా మారింది. భారత రాజ్యాం గం ఆదివాసీల రక్షణకు ఉన్న 5,6షెడ్యూల్‌ లను అందులోని సారాన్ని కూడా తొక్కి వేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆదివాసి ప్రాంతా ల్లోని నాన్‌ ట్రైబల్‌ వలసలను పూర్తిగా నిషేదం అని ఉన్న నేడు వలసలు అధికం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సొన్‌ భద్రలో జూలై 17,2018 న10 మంది ఆదివాసీలను ఇతర కులస్థులు నాన్‌ ట్రైబల్‌ క్రూరంగా ఊచకోత కోసిన,అందులో 3గురు మహిళలు ఉన్న ఇంత దురగతానీ ఏఒక్క రాజకీయపార్టీ,లేదా ప్రభు త్వం పట్టించు కోని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేకం. పార్లమెంట్‌ సమావేశం జరిగే సమయంలో ఈఘటన జరిగిన 47మంది ఆదివాసీలు ఎంపీలు ఈదేశంలో ఉన్న మాట్లాడని దుస్థితి వెలు ముద్దర రాజకీ యాలును ఈ దేశరాజకీయ పార్టీలు ప్రోత్సహి స్తున్న తీరు అర్థం అవుతుంది. కానీ ఇలాంటి ఘటనలు నిరోధించాల్సిన ప్రభుత్వాలు ‘‘నేషనల్‌ సిటిజన్‌ షిప్‌ బిల్‌ 2018,పౌర సత్వం చట్టం 2019పేరిట ఈ ప్రాంతాలను చాలా క్రింద నీరులా ధ్వంసం చేశాయి.ఈ దేశంకి నాగరికత నేర్పిన ఆదివాసి,నేడు అనాగరికునిగా ముద్ర వేయబడి వేలివేయ బడ్తున్నాడు,బ్రతుకు ధ్వంసం చేయబడి గెంటివేయ బడుతున్నాడు. ‘1996 సమత వర్సెస్‌ ఆంధ్ర ప్రదేశ్‌’కేసులో 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రభుత్వం కూడా నాన్‌ ట్రైబల్‌ గానే చూడాలని తీర్పు ఇచిన,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ‘‘గిర్‌గ్లాని కమిషన్‌ 2004,కోనేరు రంగారావు కమిటీ 2006’’లు చాలా స్పష్టంగా ఆంధ్ర వలసలు తెలంగాణ ఆదివాసి ప్రాంతంలో అత్యధికంగా పెరిగి, 7,50,000 ఎకరాల ఆది ఆదివాసీల భూము లు,దాదాపు 48శాతం ఆదివాసీల భుములు నాన్‌ ట్రైబల్‌ చేతిలో అన్యాక్రాంతం అయ్యాయి అని నివేదించిన, 1/70/ (ఎల్టిఆర్‌) లాంటి చట్టాలు పకడ్బందీగా ఉన్న ఆదివాసీలకు న్యా యం జరిగే పరిస్థితులు లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వలస ఆంధ్రలదే షెడ్యూల్‌ ఏరియాలో పెత్తనం నడుస్తుంది ఇంకా ఆది వాసీలకు దిక్కేది.ఈ దేశంలో ప్రస్తుతం అడవిపై హక్కు అనే సమస్య ఆదివాసీలకు ప్రధాన సమస్యగా మారింది. తరతరాలుగా ఆదివాసీలు జల్‌ జంగిల్‌ జమీన్‌ కోసం అడవిపై హక్కు కోసం వేలాది మంది చారిత్రక పోరాటాలు చేసి అమరులు అయ్యారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో ఎస్‌ఆర్‌ శంకరన్‌ కమిటీనీ నియమించి. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అటవీ భూములపై హక్కులు కల్పిస్తు పార్లమెంట్‌ లో ‘2006 డిసెంబర్‌13న’’ అటవీ హక్కుల చట్టంచేయబడిరది. ఈచట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 10ఎకరాల లోపు వరకు హక్కు పత్రం ఇవ్వ వచ్చు. పైగా‘‘అడవుల పై హక్కు లు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సిగ్‌ కూడా ప్రకటిం చారు’’ దానిలో భాగంగా కొంత మేరకుయుపిఎ ప్రభుత్వం ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు అందించింది. ఆదివాసీలు అడవిపై ఉమ్మడి హక్కు నీ కూడా కల్పించింది కానీ కేంద్రంలో బీజేపీ కూటమి వచ్చాక అటవీ హక్కుల చట్టం`2006కి ఎటువంటి రక్షణ ఇవ్వక పోవడం మూలంగా, సుప్రీం కోర్టు ఈచట్టానీ కొట్టి వేసింది. తదుపరి దేశ వ్యాప్త ఆందోళనతో ప్రతుతం ఈ తీర్పుపై ‘‘స్టే’’ విధించింది కానీ ఇంకా పూర్తి స్థాయి నిర్ణ యాలు ఆదివాసీల పక్షాన చేయక ముందే, నూతన అటవీ విధానం తీసుకు వచ్చి అసలు ఆదివాసీల సంబంధం లేకుండానే,అడవుల నుండి ఆదివాసీలను కాలి చేసి కార్పొరేట్‌ శక్తులకు అడవులను అమ్ముకునే కుట్రలుకు జీవం పోసింది.ఈ పోడు భూమి సమస్యనీ తెలంగాణ రాష్ట్రంలో చూసినపుడు నిజాం నిరంకుశ పాలన మళ్లీ మొదలు అయిందా అనే ప్రశ్న లు తలెత్తుతాయి, అటవీశాఖ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను టార్గెట్‌ చేసి వారి భూముల్లో హరితహరం పేరిట మొక్కలు పెట్టడం,దానికి అడ్డుగా వచ్చిన వారిపై ‘‘పిడి యాక్ట్‌’’లు పెట్టడం,మహిళలపై హింస, గర్భి ణీలకు చెట్లకు కట్టేసి కొట్టడం,10రోజుల బాలిం తలు అని చూడకుండా జైళ్లకు పంపడం, మొన్న టికి మొన్న ఆదిలాబాద్‌ జిల్లా ‘‘కోయ పోష గూడ’’లోని గోండు మహిళపైదాడి చేసి మహి ళను అర్ధనగ్నంగా గుంజుకోని పోవడం,ఇవన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు లాగే పరిగణించ బడుతాయి.ఒకపక్క ఆది వాసీ లకు పట్టలిస్తాము అని ప్రభుత్వం దరఖాస్తులు తీసుకొని,ఇంకో పక్క అటవీశాఖ వచ్చి దాడు లు చేయటం అనేది ఎంత వరకు సమంజసం? అసలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా అటవీశాఖ పాటించే పరిస్థితి లేదు ఏమైనా అంటే మావి కేంద్ర చట్టాలు అంటుంది అటవీ శాఖ, ఆదివాసీల న్యాయమైన పోడుభూములకు పట్టాలు అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలపై ఉన్న పట్టించుకునే పరిస్థితి లేక అదొక హింసల మారింది పోడు సమస్య..తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు నుండి నానాటికీ ఆదిమ తెగల మనుగడ జీవనం ప్రశ్నార్థకమే అవ్తుంది గిరిజన కేంద్రీయ విశ్వ విద్యాలయం ‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014’’తో నే వచ్చిన,దానిని గోదావరి పరివాహక ప్రాంతం లో ఆదిమతెగల జీవనం దగ్గర కాకుండా మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, ఆదివాసీలకు విద్య నీ దూరం చేయాలని చూస్తున్నారు. షెడ్యూల్స్‌ ప్రాంతంలోని ఐటీడీఏల పరిధిలో 29శాఖలలో ‘ఆర్టికల్‌ 342’ ప్రకారం షెడ్యూల్‌ ఏరియా సర్టిఫికేట్‌ల ద్వారా రావాల్సిన ఉద్యో గాలను మొత్తం కూడా నేడు నిలిపివేశారు. జీఓ నెంబర్‌ ‘3’ పేరిట సుప్రీం కోర్టు 100శాతం రిజర్వేషన్లు చెల్లవు అని తీర్పు ఇవ్వడంతో, న్యాయపరమైన అంశంగా తయారు చేసి, ఆది వాసి నిరోధ్యుగులకు చేయా ల్సిన అన్యాయం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం చెసే పరిస్థితి లేదు, 5వ షెడ్యూల్‌నీ నిర్దేశం చేసే హక్కు, దానిలో నీ నియమాలను నిరోధించే హక్కు, సుప్రీం కోర్టు లేదు. అయిన కానీ రాజకీయ కుట్రలో ఆదివాసి ప్రాంతం, భూభాగం,బందిగా మారే పరిస్థి తులు నెల కొన్నాయి. వీటికి పరిష్కారం చూపించాల్సిన కోర్టులు, ప్రభుత్వాలు,ఆదివాసిలకు వ్యతిరేకంగా ఉన్న పుడు ఇంకా ఆదివాసీ లుకు దిక్కు ఏది?.ఏది ఏమైనా ఈ దేశంలోగాని వివిధ రాష్ట్రాలలో గాని ఆదివాసిల మనుగడ నానాటికీ అంతరి స్తుంది. ఆదివాసి భూబాగాలపై ఒత్తిడి పెరి గింది.ప్రభుత్వాలు కూడా వ్యతిరేక చర్యలే చేపడుతున్నాయి అనేది వాస్తవం. అందుకే ‘‘ఆగస్ట్‌ 9’’ ని‘1982లో ఐక్యరాజ్య సమితి’’ గుర్తించిన, నేటికీ 40సంవత్సారాలు అవుతున్న కానీ భారత దేశం మాత్రం నేటికీ గుర్తించలేదు, పైగా ఐక్య రాజ్య సమితి ఆదివాసిల అభివృద్ధికి చేసే ఏనియమంని లెక్క చేయటం లేదు. తెగలు అంతరిస్తున్న ఆదివాసీల మూలాలు ధ్వంసం అవ్తున్న, అస్తిత్వం కనుమరుగు అవుతున్న, ఇంకా అనాగరిక చర్యలే చేస్తుంది ప్రభుత్వం.ఇకనైనా ఆదివాసీల దినోత్సవం గుర్తించి భారత ప్రభు త్వం అధికారికంగా నిర్వహణ చేయాలి.రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేయాలి.ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా నిర్వహించాలి. ఆదివాసీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. భూమి పుత్రుల హక్కు లను చట్టాలను రక్షించాలి. ఆదివాసిస్వయం పాలన హక్కులను రక్షించి ఆదివాసిల అస్తిత్వం నీ సుస్థిరం చేయాలి. నాణ్యమైన విద్య అందిం చాలి. మాలిక సదుపాయాలు కల్పించాలి. మానవ హక్కుల ఉల్లంఘనలు చర్యలు నిలిపివేయాలి.ఈ దేశ పౌరులు అయిన ఆదివాసిలపై హింసనీ నిలిపివేయాలి.మధ్య భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో ఆదివాసిలపై వారి స్వయంప్రతిపతి హక్కులపై అధికారాలు కల్పించి సమస్య పరిష్కారం చూపాలి. భారీప్రాజెక్ట్‌లు అక్రమ ఖనిజ తవ్వకాలు నిలిపివేయాలి,ప్రధానంగా రాష్ట్ర పతి తెగ కి చెందిన సంతాల్‌ ,ఒరాన్‌,ముండా తెగల ఆదివాసి ప్రజలను బ్రిటిష్‌ పాలనలో అస్సాం కాపీ తేయాకు తోటల లలో పని చేయటానికి 60 లక్షల మందిని బలవంతంగా తీసుకెళ్లినారు స్వాతంత్య్ర అనంతరం వారు అక్కడే ఉండి పోవడం జరిగింది కానీ వాటిని అస్సాం ప్రభుత్వం షెడ్యూల్‌ ట్రైబల్‌ గా గుర్తించలేదు వారికి ఎస్టీ హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేదంటే ఈ దేశం ప్రధమ పౌరురాలు రాష్ట్రపతిగా ఆదివాసి చేయ గలిగింది కానీ దానికి ప్రయోజనం మాత్రం చేకుర్చలేదు అనేది భవిష్యత్‌లో తేలిపోతుంది అనేది గ్రహించ వలసిన విషయం.
వ్యాసకర్త : అనువర్తిత భాషశాస్త్రం,తెలుగు యూనివర్సిటీ హైద్రాబాద్‌,సెల్‌:9392283453– కాక నవ్య

సముద్రం పొండిన వేళ..

మీరు ఎప్పుడైన సముద్రాన్ని చూసారా? చాలా బాగుటుంది కదా. పెద్దగా శబ్ధం చేస్తూ పెద్ద పెద్ద అలలు ఒడ్డుకు వస్తుంటాయి. ఒక అల వచ్చి వెళ్ళిన తరువాత ఇంకొక అల వస్తుంటుంది. కంటికి కనిపించేంత దూరం నీళ్ళుంటాయి. ఇన్ని నీళ్ళు సముద్రంలోకి ఎక్కడునించి వచ్చాయి అనే అనుమానం కలుగుతుంది. మనకు తెలుసు నదులన్ని సముద్రంలో కలుస్తాయని. మనదేశంలోని జీవనదులు గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి లాంటివి, ఇంకా అమేజాన్‌, నైలు లాంటి ఇతర దేశాలలోని నదులన్ని సముద్రాలలో కలుస్తుంటాయి. మరి ప్రతి రోజు ఇన్ని నదులలోంచి నీళ్ళు కొన్నివేళ సంవత్సరాలుగా సముద్రంలో కలుస్తుంటే అందులో నీరు ఎక్కువైపోయి సముద్రం పొంగాలి కదా, ఎప్పుడు సముద్రం పొంగినట్లు మనం వార్తల్లో వినలేదు (ఒక్క సునామి వచ్చినప్పుడు తప్ప). కారణం ఏంటో చెప్పుకొందామా!
మన భూమిని నీటి గ్రహం (షa్‌వతీ జూశ్రీaఅవ్‌) అంటారు. ఎందుకంటే భూమి 70% నీటితో నిండి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97.2% సముద్రాలలోనే ఉంటుంది. మిగితా 2.8% నీరు నదులతో, చెరువుల్లో, మంచుకొండల్లో (ద్రువాలు, హిమాలయాలలో) ఉంటుంది. పర్వతాల మీద మంచు కరిగి ఆ నీరు జీవనదులుగా ప్రవహిస్తుంటుంది. సముద్రం నీరు ఉప్పుగా ఉండడానికి కారణం ఈ జీవనదులు తమ నీటితో పాటు భూమి మీది లవణాలను నిరంతరం సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు ఉప్పుగా మారింది. భూమి మీద సముద్రం చంద్రుని వైశాల్యం కంటే 9 రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత విస్తీర్ణం ఉన్న సముద్రంలోనే నీరు ప్రతిరోజు ఎండ తాకిడికి ఆవిరిగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ ఆవిరి మేఘాలుగా మారి చల్లబడి వానలుగా కురుస్తాయి. ఇలా సముద్రంలోన నీరు ప్రతినిత్యం నీటి ఆవిరిగా మారి వాతావరణంలో కలవడం వల్ల నదులు నుండి వచ్చే నీరు సముద్రంలోకి ఎక్కువ అవదు. ఈ విధంగా భూమి మీద సముద్రాలు ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు సముద్రాలలో నీటి పరిమాణం మారకుండా ప్రకృతి నియంత్రిస్తుంది. దీనినే హైడ్రోలాజిక్‌ సైకిల్‌ (నవసతీశీశ్రీశీస్త్రఱష జవషశ్రీవ) అంటారు. భూమి మీద నీరు ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఉంటుంది. అది నీరు, నీటి ఆవిరి లేక మంచు రూపంలో ఉంటుంది. ఇలా నీరు నిరంతరం తన రూపం మార్చుకోవడం వల్ల మనిషి బ్రతకగలుగుతున్నాడు. దీని కారణం ప్రకృతి. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాం.! `ఆధారం: ఆనంద్‌,(వికాస్‌పీడియో)

  • ప్రపంచమంతటా ఇదే దుస్థితి ా ఉత్తరార్ధ గోళంలో తీవ్ర దుర్భిక్షం ా 230కోట్ల మందికి నీటి కొరత
  • జర్మనీ,ఇటలీ ఫ్రాన్స్‌,స్పెయిన్‌,చైనా,అమెరికా, ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవ నదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల చాలాదేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరతకాస్తా ఈకరువు దెబ్బకు రెట్టిం పౖంది.2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటికొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదిక చెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో47శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకు న్నాయని గ్లోబల్‌ డ్రాట్‌ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది.
  • బయట పడుతున్న చారిత్రక అవశేషాలు
  • మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొల రాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్‌ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సె లోనా సమీపంలోని రిజర్వాయర్లో నీరు ఆవిరవ డంతో9వశతాబ్దానికి చెందిన చర్చి బయట పడిర ది.మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌ లోనే కాసెరస్‌ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్‌ నది ఎండినచోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్‌, నాటి నగరం బయట పడ్డాయి.
  • నదులన్నింటా కన్నీళ్లే…
  • జర్మనీ, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది.
  • 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్ల సముద్రంలోకలిసే ఈనది ఎన్నోచోట్ల ఎండి పోయింది.
  • రెయిన్‌, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షలకోట్ల) విలువైన సరుకు రవాణా జరుగు తుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంత కాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు.
  • ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.
  • ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడిరది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు.
  • ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయెర్‌ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు.
  • యూరప్‌లో 10దేశాల గుండా పారే అతి పొడవైననది డాన్యూబ్‌కూడా చిక్కిపో తోంది.
  • అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి!
  • 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది.
  • నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సిచువాన్‌ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడచూసినా నీరు అడుగంటి నదీ గర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది.
  • అమెరికాతో సహా యూరప్‌, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతు న్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కికొట్టుమిట్టాడుతోంది. పారిశ్రా మిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది.
  • మాయమైపోతున్న మంచినీరు
  • ప్రపంచం మీదడైబ్బైశాతం నీరే వుండి అందులో ఒక్కశాతం మాత్రమే మంచినీరుగా ఉప యోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు,వాగులు, వంకలు,వర్రెలు,బావులు,చెరువులు,నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలి పోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగు తుంటే కాపాడుకోవడానికి నగరంలో నిజాం కాలం లో హైదరాబాద్‌ నగరంలో3000పైగా వున్న చిన్న పెద్ద కుంటలు ఒక్కటికూడా ఆచూకీ లేకుండా, అందులో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయి? పై నుంచి పడ్డ నీరు నిలిచ్చే చోటు దొరకక సము ద్రం పాలవుతుంటే,వున్న కొద్ది భూగర్భ జలాలూ అడుగంటుతున్న దుస్థితి. మనం చేసిన పాప ఫలి తమే కదా ఇదంతా లేకపోతే ఏమిటి? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా780మిలియన్ల ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం అల్లాడిపోతున్నారు. ఆఫ్రికాలో ఓతెగ ప్రజలు మంచినీళ్లు దొరకక, వేకువజామునే కిలో మీటర్లకొద్దీ నడిచి అడవుల్లో ఆకుల మీద కారుతున్న మంచు బిందువులను ఒక్కొక్కటిగాసేకరించి మంచి నీరుగా వాడుకుంటారట. ఒకనాడు నదులు పొంగిన జీవగడ్డ భారతావనికూడా ఇవాళ మంచినీటి చుక్క కోసం విలవిలలాడిపోతోంది. అటుచూస్తే ఏళ్ల తరబడి నీటిజాడ కనబడక అనంతపురం జిల్లా ఎడారిదారి పట్టింది. చిత్తూరు జిల్లాలో శిలాజాల లోపలకి వెయ్యి అడుగుల లోతునబోర్లు వేస్తే తప్ప నీటి చుక్క దొరికే అవకాశం లేదు. కృష్ణానది మైళ్లకు మైళ్లు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాగొంతు తడ వడం లేదు. ఫ్లోరిన్‌నీళ్లు నల్లగొండకు నిద్ర పట్టనీ యడం లేదు. పుష్కలంగా నీటి వనరులన్న ప్రాం తాలు రసాయన ఎరువులు,పురుగు విషాలతో విష తుల్యమైపోయాయి. అసలు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నాలుగు వందల అడుగులకు మించి నీళ్లు రకర కాల రసాయనాలతో విషపూరితమైనవి కాబట్టి వాటిని మంచినీటిగా ఉపయోగించకూడదని చెప్పింది. మరోప్రక్క కలుషితమైన నీటివల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజుకు ఆరువేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే,మనం రెండు గుక్కలనీళ్లు తాగిగ్లాసు కిందపెట్టే లోపు ఒక చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతోంది.
  • అడవుల్ని కొట్టేసి,కొండల్నిపిండేసి, నదుల్నిఎండేసి,గాలినికాలుష్యంతోనింపేసి,తిండిని రసాయ నాల్తో కలిపేసి, ఇంకా ఎన్ని దుర్మార్గాలు కళ్లముందే జరుగుతున్నా ఇప్పటి దాకా మౌనంగానే వున్నాం. ఆఖరికి తాగే నీళ్లలో కూడా ఇన్ని రసాయ నాలు వున్నాయంటే చుక్క కూడా గొంతు దిగడం లేదు. అలాగని తాగకుండా వుండనూలేము, చిన్న చిన్నపిల్లలు తాగే పాలే కాదు, నీళ్లు కూడా విషమని తెలిసాక ఇక మాట్లాడకుండా ఎలా వుండగలం.
  • ఇందుకు మనమేం చేద్దాం
  • నీరు లేనప్పుడు ఇబ్బందులు పడడం కంటే అందుబాటులో వున్న చుక్కనీటిని కూడా వృధా చేయకపోవడం అవసరం. నగరాల్లో, పల్లెల్లో ఎక్కడిక్కడఇంకుడు గుంతలు,కందకాలు, చెక్‌డ్యా మ్‌లు,వాటర్‌షెడ్‌లు నిర్మించుకోవాలి. వాన నీటిని ఒడిసి పట్టుకునే చాలా వరకు మంచినీటి కొరతను అధిగమించవచ్చు. సముద్రతీర ప్రాంతం కావడం తో ప్రకాశం జిల్లాలలోని ఉప్పు నీళ్ళు ఎక్కువగా వుంటాయి కాబట్టి అక్కడ చాలా ప్రాంతాల్లో సంప్ర దాయికంగా వాననీటిని ఒడిసిపట్టి సంవత్సరమంతా మంచినీటిగా ఉపయోగిస్తారు.ఎడారి రాష్ట్రం రాజా స్థాన్‌లోని గ్రామాల్లో తరతరాలుగా వాననీటిని మంచినీటిగా వాడుకునే సంప్రదాయం వుంది.అతి తక్కువ వర్షపాతం పడే అనంతపురం ప్రాంతంలో కూడా(400-500మి.మీ.వర్షపాతం)200 చద రపు అడుగుల వైశాల్యంలో వుండే ప్రభుత్వ కట్టి చ్చిన ఇందిరమ్మ ఇంటిమీద 10000 లీటర్లు నీరు నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటిని రోజుకు 20 లీటర్ల చొప్పున వాడినా ఒక కుటుంబానికి దాదాపు 500 రోజులకు సరిపోతుంది.మహారాష్ట్రరాలెగావ్‌ సిద్దిలో అన్నాహజారే,రాజస్థాన్‌లో రాజేంద్రసింగ్‌ చేసిన నీటి సంరక్షణ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ కోవలో ఎండిపోయిన బావుల్ని, వట్టిపోయిన చెరువుల్ని,జీవం వచ్చిన నదుల్ని తిరిగి బతికించు కునే ప్రయత్నం చేయాలి. వనసంరక్షణే జన సంర క్షణగాభావించాలి. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, అడవుల ఉపయోగాలపై అవగాహన కల్పించి చిన్నప్పటి నుంచి ప్రకృతిని వాళ్ల జీవితంలో భాగం చేయాలి.అడవులు,నదులు,వానలు, రుతుపవనాలు, కాలాలు ఇలా ప్రకృతిలో ఒకదానికొకదానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని అవగాహన చేసుకుని మనం వివేకంతో వ్యవహరించాలి. నీరు లేకపోతే మనకు వర్తమానమూ లేదు, భవిష్యత్‌ అంతకన్నా లేదన్న నిజాన్ని మనమంతా నిర్భయంగా అంగీకరించాలి. నీటిని వ్యాపార వస్తువుగా మార్చిన సమస్త పరిస్థి తులను వ్యతిరేకించాలి.ప్రతి నీటి చుక్కను గుండె లకు హత్తుకుని పదిలంగా కాపాడుకోవాలి.

అలుపెరగని పోరాటాలు…

కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం… – గునపర్తి సైమన్‌

Read more

ఆదివాసీల భాషా మాటేమిటి ?

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమ్కెంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడిరది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది. తెలుగు భాషాభిమానులు, పండి తులు తెలుగు భాష ఇంగ్లీష్‌ ప్రపంచంలో కొట్టుకుపోతుందని ఎక్కడలేని బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎవరి భాషను వారు అభిమానించటంలో, పరభాష నుంచి తమ భాషను రక్షించుకోవటంలో తప్పు ఏమీలేదు. నా బాధంతా తెలుగు ప్రపంచంలో ఆదివాసీ భాషలు ఏవిధంగా కొట్టుకుపోతున్నాయో ఈ పండితులు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సదస్సులో ఆదివాసులను తెలుగు ప్రజలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆదివాసీ భాషల ఉనికినే తుడిచిపట్టే ప్రమాదం ఉంది.

Read more

పథకాల మీద కన్నేసిన పాలకులు

వేళ్ళ మీదలెక్క పెట్టగలిగిన బడా కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు గత ఏడు సంవత్సరాల మోడీపాలనలో రూ.10లక్షల 72వేల కోట్లరూణాలు రద్దు చేశారు.13కంపెనీలు బ్యాం కుల్లో తీసుకున్న రూ.4లక్షల50వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61వేల కోట్ల తగ్గింపుతో ‘సెటిల్‌మెంట్‌’ చేశారు.ఈ మొత్తం డబ్బు గ్రామీణపేదల ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేసి వుంటే సుమారు 14 సంవత్సరాల వరకు పేదలకు పని కల్పించి కొద్ది మేరకు ఆకలి తీర్చివుండవచ్చు. అలా చేయలేదు కాబట్టే ప్రపంచ ఆకలి సూచి 116దేశాల జాబితా లో మన దేశం101వ స్థానంలో నిలిచింది. మన కంటే ఆకలితో అల్లాడుతున్న దేశాలు కేవలం 15 మాత్రమే. ఇది మన అన్నపూర్ణకు పట్టిన ఆధోగతి.

Read more

మొక్క‌లు నాటుదాం…ప‌ర్య‌వ‌ర‌ణాన్ని కాపాడుకుందాం..!

కాలుష్య కాసారం ప్రకృతినీ పర్యావరణాన్నీ, మానవ ఆరోగ్యాన్నీ అనేక రూపాల్లో ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు అందంగా… అహ్లాదం గా…. స్వచ్ఛంగా ఉన్న వాతావరణం క్రమంగా కనుమరగైపో తోంది. అవసరంలేని ఆధునికతతో, రకరకాల వ్యర్థాలతో, కాలుష్యాలతో జీవావరణ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికే అది తీవ్రస్థాయికి చేరిందని పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు, ఆందోళనవ్యక్తం చేస్తు న్నారు. మానవ మనుగడ సాఫీగా ఉండాలంటే ప్రకృతిని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినన అవసరం ఉంది. పర్యావరణంలో రోజు రోజుకూ వస్తున్న మార్పులు, పొంచి ఉన్న ప్రమాదం, చేపట్టాల్సిన చర్యలు గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పర్యావరణం విషయానికొస్తే మీకు కొన్ని అంశా ల చెప్పాలి. నాచిన్నప్పుడు యింటి ముందు మట్టి రోడ్లే కానీ తారు రోడ్లు లేవు.స్నేహితులం దరం ఆ మట్టిలో గంటల తరబడి ఆడినా, ఆమట్టి ధూళి పీల్చినా ఏకొంచెం అనారోగ్యం కూడా కలిగేది కాదు. కారణం మట్టిలో ఉన్న సూక్ష్మ జీవులను,కీటకాలను పిచ్చుకలు,కోళ్ళు, పావురాలు పక్షి సమూహాలు ఎన్నో వచ్చి తినేసి పర్యావరణానికి ఎంతో మేలు చేసేవి.ఇక సరు కులకోసం షాపుకెళ్తే షాపు వాళ్ళు న్యూస్‌ పేపర్‌ కాగితాలలో చింతపండు,మిరప కాయలు పప్పు,ఉప్పు,అన్నీ పొట్లాలు కట్టి ఇచ్చేవాళ్ళు ఒక బట్ట సంచీలో వాటిని తెచ్చుకునే వాళ్ళం. కొబ్బరి నూనె అయిపోగానే ఖాళీ సీసా తీసుకు వెళ్తే అందులో.. నూనె కొలిచి ఇచ్చేవారు. కొంచెం సమయం పట్టినా సరుకులు ఇచ్చే విధా నంలో ఎక్కడా పర్యావరణానికి హాని జరిగేది కాదు. కాలుష్యం అనే కాసారానికి ఎంతో దూరంగా పర్యావరణ పరిరక్షణ జరుగుతూ ఎంతో బాగుండేది.అసలు పాలిథీన్‌ కవర్లు 19 80 వరకు మేము ఎన్నడూ చూడలేదు.1978-79లో అంటే అప్పుడు మే8వ క్లాసు/ 9వ క్లాసు లో ఉన్నప్పుడు ‘‘ప్లాస్టిక్కులు’’ అనే తెలుగు పాఠం ఉండేది. బహుశా అప్పటికే రాబోయే సునామీ అది అనే విషయం ఆరోజుల్లో తెలిసేది కాదు, పైగా ప్లాస్టిక్కులవల్ల ఎన్ని లాభాలో ఆపాఠం లో చదువుకున్నాం. ఆరోజుల్లో ఉదయం నిద్రలేపుతూ పాల సీసా బండివాడు బండిపై టక టకా శబ్దం చేస్తూ ..వచ్చేవాడు. వెంటనే పిల్లలమంతా అమ్మ ఇచ్చిన ఖాళీపాల సీసాలు రెండు తీసుకుని వీధిలోకి వెళ్లి బండి ఆయనకు ఇచ్చికొత్త పాల సీసాలు రెండు పట్టుకొచ్చే వాళ్ళం.అమ్మ ఆపాల సీసాల ఢక్కన్‌ (మూత)ను తెరవగానే దాన్నిండా వెన్న ఉండేది. ఆవెన్న తినటానికి మేము అప్పుడప్పుడూ పోటీపడే వాళ్ళం. పాలిథీన్‌ కవర్లలో పాలు అప్పట్లో మే ము ఎరగము..షాపు నుండి సరుకులు తెస్తే అన్నీ పాత ఒవల్టీన్‌/డాల్డా వంటివి చిన్న డబ్బా ల్లో పోసుకునేది అమ్మ. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా భూమిలో కరిగిపోని /కలిసిపోని ప్లాస్టిక్‌ కవర్లే. ప్రతి రెండు అడుగుల భూమికీ ఒకటి చొప్పున రోడ్డుపై కనబడుతున్నాయి. ఆ వ్యర్ధాలు తిని ఆవులు, గేదెలు అనారోగ్యం పావుతు న్నాయి. మొన్నీమధ్యే పేపర్‌లో వచ్చింది ఈవార్త ఏమి టంటే…ఆవ్యర్దాలన్నీ తిన్న ఆవుకు ఆపరే షన్‌ చేసి 25 కిలోల ప్లాస్టిక్‌వ్యర్ధాల చుట్టను బయటికి తీసిఆవుకుప్రాణంపోశారటపశు వైద్యు లు !!! అప్పట్లో చాటలో బియ్యం చేరుగుతూంటే వడ్లు/నూకలు (ఈ కాలం పిల్లలకు ఇవిఏంటో కూడా తెలియదు) తినటానికి పిచ్చుక లెన్నో వచ్చేవి కిచకిచమంటూ రెక్కలు అల్లల్లా డిరచు కుంటూ తినేవి అదిచూసి, మేము ఇంకా బియ్యం వేసే వాళ్ళం.మనసుకు ఎంతో ఆహ్లాదం గా, ఆనందంగా ఉండేది. అప్పట్లో ఇన్ని పెట్రోల్‌/డీసిల్‌ బండ్లెక్కడివి? ప్రతియింట్లో విధిగా సైకిల్‌ ఉండేది. 1980 వరకు స్కూటర్‌లు ఎక్కువ కనిపిం చేవి కావు, బైక్‌లు అసలే లేవు. చిన్న దూరాలకు వాకింగ్‌, పెద్ద దూరాలకు సైకిళ్ళు ఉండేవి. అప్పట్లో మేము ఆడ పిల్లలం కూడా సైకిల్‌ నేర్చుకోవటానికి ఉబ లాట పడే వాళ్ళం. అలా నేను కూడా సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నాను. మా చిన్నప్పుడు 3మైళ్ళ దూరం వెళ్ళాల్సి వస్తే రిక్షల్లో వెళ్ళే వాళ్ళం. చార్జి కేవలం 2 రూపాయలు (ఇప్పటి పిల్లలకు అవి బొమ్మ గీసి చూపెట్టాల్సి వస్తున్నది). 1980-85 సమయంలో 5,7,రూపాయలకు దింపే వారు. ఇక వాహన కాలుష్యం ఎక్కడిది? అంతా స్వఛ్ఛమైన గాలే కదా! ఇకదానితో బాటుధ్వని కాలుష్యంకూడా లేదు. ఇప్పుడు ఈ వాహనాల మూలంగా, పొగవల్ల థైరాయిడ్‌ గ్రంథి ó పని తీరు అధ్వాన్న మైంది అందరికి ఇదే జబ్బు. ఇక అస్తమా, బ్రోన్కైతిస్‌ అయితే చెప్పనక్కర లేదు ఇవి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రమాదంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. అలాఅవసరం లేకున్నా వాహనాలు చేసే ధ్వని కాలుష్యం (హార్న్‌ శబ్దాలు) వలన తలనొప్పి, అల్జీమర్స్‌, ఒత్తిడి ఆందోళన,మతి మరుపు, నరాల జబ్బులు వస్తున్నాయి ఇళ్ల మధ్యలో ఎక్కడా ఏ చిన్న ఫ్యాక్టరీ కూడా ఉండేది కాదు.పట్నం(హైదరా బాద్‌) మా చిన్నప్పుడు పల్లె శోభతో కళకళ లాడేది. తులసి కోటలోనే కాకుండా బయట కూడా చాలామొక్కలు తులసివనంలాఉండేది. దాంతో మంచి స్వచ్చమైన గాలి పీల్చే వాళ్ళం. వర్షం పడితేచాలువీధిలో గడ్డిపై వెల్వెట్‌ (ఆరు ద్ర పురుగులు) పురుగులు కనబడితే వాటిని అగ్గిపెట్టె లో పెట్టి అందరికీ చూపించే వాళ్ళం. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు వెలుస్తు న్నాయి. గ్యాస్‌ ఫిల్లింగ్‌ వంటి వైతే పేలుడు కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు. ఇళ్లలో ఉండే మొక్కలవల్ల మంచిగాలి పీల్చే వాళ్ళం. ఇప్పుడు ఫ్లాట్‌లలో ఒక్క చెట్టు కూడా కనబడటం లేదు. అసలే ఓజోన్‌ పొరతరిగి పోతున్నది. దాంతో భూమిపై వాతావరణం వేడెక్కి, భూతాపంవల్ల మనుషులకు డ్రైనెస్‌ గొంతులో,కళ్ళలో మంటలు,హైబిపి జబ్బులు వస్తున్నాయి. ఇప్పటికైనా విరివిగా మొక్కలు, చెట్లు పెంచితే కొంత వరకైనా ఈసమస్య నుండి అధిగమించవచ్చు.జలకాలుష్యం:నదులు, సరస్సు లు పూడుకు పోయాయి ఇసుకమట్టి మాత్రమే కాదు ప్లాస్టిక్కులతో నిండి పోయాయి. నాలాలు మరీ ఘోరంగా తయార య్యాయి ఒకవర్షం వస్తే డ్రైనేజ్‌ పొంగి వీధుల్లో యిళ్ళ మధ్య ప్రవహిస్తూ దోమలతో అనారోగ్యం కలిగిస్తున్నది. ప్లాస్టి కవర్లు భూమి పొరల్లో కరుగక, ఎండా` వానలకు రసాయనాలు విడుదల చేస్తూ కాలు ష్యాన్ని పెంచుతు న్నాయి.అవిపీల్చిన వాళ్లకి భయం కరమైన వ్యాధులు,ఆస్తమా,రక్తపోటు, గుండెదడ,ఉబ్బస వ్యాధులు కలుగుతున్నాయి. కొందరు అజ్ఞానంతో,చెత్తలలో టైర్‌లవంటివి కూడా కాలుస్తున్నారు.దీనివల్ల కీడు ఎక్కువ. ఇవన్నీ ప్రజలకు అవగాహన కలిగించాలి .
ఇలా చేయాలి:
ే నేటి తరానికి, పిల్లలకు మన అంత అందమైన బాల్యం కూడా ఇవ్వలేక పోయాం. కనీసం ఇప్పటి నుంచైనా కళ్ళు తెరిచి, పచ్చని వాతావరణం కల్పించి, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి బట్ట సంచులు వాడేలా చేయాలి.
ే దగ్గరి షాప్‌లకు నడిచో, సైకిల్‌ పై వెళ్ళేలాగో చర్యలు చేపట్టాలి. వాళ్లకి ఈ అవగాహన కల్పించాలి.
ే పిచ్చుకలు,కాకులు ఇతర పక్షి జాతులు మనచుట్టూ ఉండేలా చేసుకొనే ప్రయత్నం చేయాలి.తక్కువ నీరు పీల్చే మొక్కలను సత్వరమే పెంచాలి.
ే మళ్ళీ రిక్షాలను, ఆహ్వానించాలి. తద్వారా పేద వారికి ఉపాధి కూడా కలుగుతుంది.
ే ఇంటి బయట పావురాలకు కాస్త ధాన్యం వేసి, మంచి నీరు ఒక మూకుడులో పెట్టి, ఆకర్షించాలి
ే ప్లాస్టిక్‌ కవర్లు వాడ కూడదు. ప్లాస్టిక్‌ను వీధుల్లో ఎక్కడ బడితే అక్కడ వేసే వారికి జరిమానా వెయ్యాలి. అలాగే పేరుకున్న వాటన్నింటినీ వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలి. కాలనీల వారీగా ఈ ప్రయత్నం చేయించాలి.
ే నాలాలను, చెరువులను వర్షా కాలం లోపలే చెత్త రహితంగా చేసుకోవాలి
ే ఇళ్లల్లో ,ఆఫీసుల్లో అవసర మైనంత మేరకే విద్యుత్తు వాడాలి/ స్విచ్‌ ఆఫ్‌ చేస్తూ ఉండాలి. సెల్‌ ఫోన్‌లను రోజుకో గంట స్విచ్‌ ఆఫ్‌ చేయాలి, రేడియేషన్‌ను తగ్గించాలి
ే సౌర శక్తిని విరివిగా ప్లేట్‌లుభవనాలపై నిర్మించి విద్యుత్‌ ఆదా చేయాలి.
ే బియ్యం, కూరలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి.
ే వాహనాల హారన్‌లు ఊరికే మోగించ కుండా చర్యలు చేపట్టాలి
ే ఇళ్ళ మధ్యలో, మైదానాల్లో పార్క్‌లు అభివృద్ధిపరిచే చర్యలు చేపట్టాలి. ఉదయం సాయం సంధ్యలలో వాకింగ్‌ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించాలి. చీటికి మాటికి మందులు వేసుకోవటం కూడా తగ్గించినట్లు అవుతుంది
ే పిల్లలకు పట్టే పాలల్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు వార్తలొచ్చాయి సింథటిక్‌ పాలను, కృత్రిమ పాలనునిషేధించాలి.
ే కంపోస్ట్‌ ఎరువులనే వాడాలి.రసాయ నిక ఎరువులను వాడకుండాచర్యలు చేపట్టాలి
ే సేంద్రీయపధ్ధతిలోపెంచే కూరగాయా లనే వాడేలా, జనరిక్‌ మందులనే వినియోగించేలా ప్రజలకు అవగాహనా సదస్సులు పెట్టి వారిని చైతన్య వంతులను చేయాలి.
ే ధాన్యాల్లో కల్తీని అరికట్టే చర్యలు చేపట్టాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే తప్పకుండా భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, వాతా వరణాన్ని అందించ గలుగుతాం.
కార్భన్‌డయాక్సైడ్‌తో నష్టాలు:
వాతావరణంలో కర్బనం రెండు ఆక్సిజన్‌ అణువులతో కలిసి కార్బన్‌ డయాక్సైడ్‌గా మారుతుంది. కార్బన్‌ డయాక్సైడ్‌,గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్టు కారణంగా భూమి గడ్డ కట్టుకుపోకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు వాడే శక్తి అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎక్కువ మొత్తా ల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ వాతా వరణంలో కలు స్తోంది.వాతావరణంలో ఇప్పుడు సగటున మిలి యన్‌కు 380పార్ట్‌ల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉంది. పారిశ్రామిక విప్లవం మొదలు కావడానికి ముం దు ఇది280స్థాయిలో ఉండేది.అంటే ఇప్పుడు 36శాతం ఎక్కువైంది.శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కాలుష్యాలను తగ్గించకపోతే గనుక 2100 సంవత్సరంనాటికి ఉష్ణోగ్రత3నుంచి 6డిగ్రీల సెల్సియస్‌ పెరుగు తుందని వాతా వరణ నిపుణులు పేర్కొం టున్నారు.భూమిమీద వేడి పెరిగితే మంచు పర్వతాలుకరిగి,సముద్ర మట్టాలు పెరుగుతాయి.దీనివల్ల తీరానఉండే ద్వీపాలు,లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ఇంకా పెరుగుతుంది.ఇది లాగే కొన సాగితే భవిష్యత్తు ప్రమాదకరంగా ఉంటుంది.(జీ.ఏ.ఎస్‌. కూమార్‌ )

మాలి కొండపై ఆదివాసులు దండయాత్ర

ఒడిశాలోని కోరాపుట్‌ అడవుల్లో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి, స్థానిక గిరిజన జనాభా వారి మాలి పర్బత్‌ (కొండ)లో మైనింగ్‌ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నారు. గత వారం, నవంబర్‌ 22న, ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని కంకదాంబ గ్రామంలో బాక్సైట్‌ తవ్వకాలపై బహిరంగ విచారణను నిర్వహించింది, దీనికి స్థానిక ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్థానిక నివాసుల ప్రకారం, జరిగిన బహిరంగ విచారణలో సాయుధ భద్రతా దళాలు మరియు అధికారుల సంఖ్య స్థానిక గిరిజన ప్రజల కంటే చాలా ఎక్కువ. విచారణ రోజున, మైనింగ్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు రద్దు చేయాలని, కొండ, అటవీ ప్రాంతాన్ని రక్షించాలని డిమాండ్‌ చేస్తూ మాలి పర్వత సురక్షా సమితి (మలి కొండ రక్షణ కమిటీ) సభ్యులు నిరసన చేపట్టారు. ‘‘ఒడిశా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కంపెనీకి %ళి%హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇస్తే, మేము మా ఆందోళనను తీవ్రతరం చేస్తాము’’ అని నిరసన సమూహాలలో ఒకటైన లోక్‌ శక్తి అభియాన్‌ అధ్యక్షుడు ప్రఫుల్ల సమంత్ర గావ్‌ కనెక్షన్‌తో అన్నారు. ‘‘మైనింగ్‌ వల్ల ఈ ప్రాంతంలో భూగర్భజలాలు, గాలి మరియు మట్టికి అంతరాయం కలుగుతుంది. ఇది జరగడానికి మేము అనుమతించము, ’’అని అతను గట్టిగా చెప్పాడు. కోరాపుట్‌ జిల్లాలోని గిరిజనుల ప్రాబల్యం గల సెమిలిగూడ బ్లాక్‌లోని కంకదాంబ గ్రామం వద్ద మాలికొండ చుట్టుపక్కల మైనింగ్‌కు వ్యతి రేకంగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. మాలి కొండ చుట్టుపక్కల ప్రాంతంలో 44 గ్రామాలలో నివసించే కొండ,పరాజ,గదబ గిరిజన సంఘాలు ఉన్నాయి. మైనింగ్‌ లీజు పరిధిలోకి వచ్చే ప్రాంతం 268.110 హెక్టార్లలో విస్తరించి ఉంది. మైనింగ్‌ లీజు మరియు పర్యావరణ క్లియరెన్స్‌ హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు 2003లో మంజూర య్యాయి. స్థానిక నివాసితులచే ప్రాజెక్ట్‌ గురించి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, స్థానిక ప్రతిఘటన ఆ ప్రాంతంలో మైనింగ్‌ కార్యకలాపాలను నిరోధిం చింది. లీజు మరియు పర్యావరణ అనుమతి 2013లో ముగిసింది.
ఇప్పుడు పరిశ్రమను తాజాగా 50ఏళ్లలీజుకు తీసుకోనున్నారు. అయితే ఇది స్థానిక ప్రజల నుండి ఆమోదం పొందాలి. దీని కోసం బహి రంగ విచారణ అవసరం.సెప్టెంబర్‌ 22న జరగాల్సిన బహిరంగ విచారణను జిల్లా యం త్రాంగం పెద్దఎత్తున హింసాత్మకంగా జరి గింది. దీంతో అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు.తిరిగి నవంబర్‌ 22న పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించారు. అది కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ పబ్లిక్‌ హీరింగ్‌ నిర్వహించారు. అది చెల్లదంటూ గిరిజనులు తమ అడవులను కాపాడాలని కోరుతున్నారు.
మాలికొండ ప్రాంతంలో నివసించే అడవులు ప్రజలు,వృక్షజాలం,జంతుజాలానికి ఏమి జరుగు తుందో అని స్థానిక ఆదివాసీ జనాభా గొంతుతో ఆందోళన వ్యక్తం చేశారు.ముప్పై ఆరు శాశ్వత ప్రవాహాలు మాలికొండ గుండా ప్రవహిస్తాయి మరియు చివరికి కోలాబ్‌ నదిని పోషిస్తాయి. గిరిజన సంఘాలు సాగునీటి కోసం నదీ జలా లను ఉపయోగించుకుంటున్నారు. కొండ లలో మైనింగ్‌ చేయడంవల్ల నది ఎండి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ మాలీపర్వా తాలు ఏనుగు కారిడార్‌తో పాటు అనేక విలువైన ఔషధ వృక్షాలతో దట్టమైన అడవిగా రూపంతరం చెంది ఉంది.బాక్సైట్‌ వెలికితీస్తే ‘‘అటవీ కొండలలో బాక్సైట్‌ తవ్వకం అనేక సహజ ప్రవాహాలు,జలపాతాలు, వాగు లు ఎండిపోవడానికి అవకాశం ఉందని, అంతేకాకుండా కాలుష్యకారకాలతోను,అనేక అనారోగ్యాలకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మేము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాము’’ అని ఆదివాసీప్రజలు ఆవేదన చెందుతున్నారు.రాష్ట్రంలో ఏనుగు కారిడార్‌లు ధ్వంసం కావడానికి అడవిలో విపరీతమైన మైనింగ్‌ కూడా ఒక ప్రధాన కారణం. జంబోల సంరక్షణ మరియు రక్షణ కోసం డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది ప్రారంభంలో, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (చీGు) ఒడిశా ప్రభుత్వాన్ని రెండు నెలల్లో 14 ఏనుగు కారిడార్‌లను నోటిఫై చేయాలని ఆదేశించిందని ఒడిశా వైల్డ్‌లైఫ్‌ సొసైటీ కార్యదర్శి బిస్వైత్‌ మొహంతి తెలిపారు. ఇంతలో, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ మారీa ప్రకారం, బహిరంగ విచారణ సందర్భంగా నవంబర్‌ 22న ఈ ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు పెద్ద సంఖ్యలో స్థానిక నివాసితులు తమ సమ్మతిని తెలిపారు.‘‘ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగం ముప్పై ప్లాటూన్ల భద్రతా బలగాలను మోహరించింది. ఒడిశా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ త్వరలో పబ్లిక్‌ హియరింగ్‌ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది’’ అని అధికారి తెలిపారు.
మలిపర్బత్‌ మైనింగ్‌ను అడ్డుకోవాలని గిరిజనులు
చైత్ర పండుగ సందర్భంగా కొండపై బాక్సైట్‌ వెలికితీతను వ్యతిరేకిస్తామని బాక్సైట్‌ ప్రభావిత ఆదివాసీ ప్రజలు మాలిపర్వతాలపైకి ఎక్కి ప్రమాణం చేశారు. కంకదాంబ గ్రామ సమీపం లోని చైత్ర పండుగ సందర్భంగా ఏప్రిల్‌ 27న మాలిపర్బత్‌ కొండ వద్ద బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గిరిజనులలోని పర్వతాలపైకి సుదూర ప్రయాణం చేసి అక్కడ దేవతలకు పూజలు చేశారు. మలిపర్బత్‌ కొండ సమీపం లోని పాటలీ గుహలో మౌలిమా దేవత ముందు ప్రతిజ్ఞ చేశారు. మలిపర్బత్‌ సురాఖ్య సమితి(ఎంఎస్‌ఎస్‌)మరియు కోరాపుటియా జన సురాఖ్య మంచ్‌(కెజెఎస్‌ఎం)సభ్యులు,పలువురు సామాజిక సంస్థల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చైత్ర పండుగను జరుపుకోవ డానికి కోరాపుట్‌ మరియు రాయగడ జిల్లాల నుండి వేలాది మంది గిరిజనులు మలిపర్బత్‌ కొండ వద్దకు చేరుకున్నారు. మలిపర్బత్‌లో బాక్సైట్‌ తవ్వకాలపై ఉద్రిక్తత మధ్య వారు ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించాలని ప్రార్థిస్తూ సంప్రదాయ ఆచారాలను నిర్వహిం చారు. ఈ పండుగను కోంద్‌, పరాజ మరియు గద్బా తెగలు జరుపుకుంటారు.చాసి మూలీయ ఆదివాసీ సంఘం అధ్యక్షుడు నాచిక లింగం కూడా ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ‘‘మేము చెట్లు, నేల, నీటి బుగ్గలు, వృక్షజాలం మరియు జంతుజాలాన్ని ప్రేమిస్తాము మరియు మన ఆచారాలు మరియు సంప్రదాయాలకు అనుగుణంగా జీవించాలనుకుంటున్నాము. గిరిజనులు ప్రభుత్వం నుండి ఎలాంటి సంపదను కోరుకోవడం లేదు. ప్రకృతితో, వనరులతో సహజీవనం చేయాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వ ఏజెంట్లు ఈ ప్రాంతంలో అశాంతిని సృష్టిస్తున్నారు. మైనింగ్‌ వ్యతిరేక మరియు అనుకూల వ్యక్తుల మధ్య విభేదాల కారణంగా గత రెండు నెలలుగా ఈ ప్రాంతం లో ఉద్రిక్తత నెలకొని ఉందని వర్గాలు తెలి పాయి. గిరిజనులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు జీవనోపాధికి ప్రాధాన్యతనిచ్చే మలిపర్బత్‌ కొండ నుండి బాక్సైట్‌ తవ్వడానికి హిందాల్కో కంపెనీకి ప్రభుత్వం లీజు మంజూ రు చేసింది. ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మొదటి సమావేశం విఫలమైన తర్వాత విజయ వంతంగా పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించింది. అయితే, విషయం కోర్టుకు వెళ్లడంతో రెండో పబ్లిక్‌ హియరింగ్‌ అనిశ్చితిలో పడిరది. జిల్లా యంత్రాంగం నాలుగు ప్లటూన్ల పోలీసు బలగాలను మోహరించి పండుగ ప్రశాంతంగా సాగింది.
మా కొండలు బంగారు కుండలు
కోరాపుట్‌లోని మాలి కొండలన్నీ బంగారు కుండలు. వాటి జోలికి వస్తే సహించబోం అంటూ గిరిజనులు హెచ్చరిస్తున్నారు. మాలిపర్వాతాలు అనేక ప్రవాహాలకు మూలం. ఔషధ చెట్లకు నిలయం. ఇది ఏనుగు కారిడార్‌. సెప్టెంబర్‌ 22, 2021న ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన బహి రంగ సభ వేదికపై ఆదివాసీలు నినాదాలు చేస్తూ ధ్వంసం చేశారు. గిరిజనులు అధికంగా ఉండే కోరాపుట్‌లోని సిమిలిగూడ బ్లాక్‌లోని కంకదాంబ గ్రామంలోని వేదిక వద్ద పర్యా వరణ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు మరియు ఇతరులు కూడా ప్రాజెక్టును వ్యతిరేకిం చారు. హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (హిం డాల్కో)చే ప్రాజెక్ట్‌ యొక్క ప్రదేశం అయిన మాలి కొండ,అడవికి ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మాలి పర్వత్‌ సురక్షా సమితి (సేవ్‌ మాలి హిల్‌ కమిటీ) సభ్యులు ఆ స్థలంలో మైనింగ్‌ను అధికారులు రద్దు చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. మాలి మరియు అటవీ ప్రాంతంలో 44గ్రామాలలో విస్తరించి ఉన్న కొండ,పరాజ మరియు గదబ గిరిజనులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.సేవ్‌ మాలి హిల్‌ కమిటీ అధ్యక్షుడు బిజయ్‌ ఖిల్‌ మాట్లాడుతూ మాలి కొండ నుండి బాక్సైట్‌ తవ్వకాలకు ఏ కంపెనీని అనుమతించకుండా కొండను మరియు అడవిని రక్షించాలని ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా పరిపాలన అధికారులను మేము కోరాము. ఖిల్‌ తన బృందం కొండను రక్షించడానికి మరియు సంరక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాల వల్ల ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన అన్నారు. అటవీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధం,అనైతికం. ప్రతిపాదిత మైనింగ్‌ ప్రాజెక్ట్‌ టూత్‌ అండ్‌ నెయిల్‌ను మేము వ్యతిరేకిస్తాము’’ అని లోక్‌ శక్తి అభియాన్‌ అధ్యక్షుడు ప్రఫుల్ల సమంతర అన్నారు.మాలి కొండ 36శాశ్వత ప్రవాహాలకు మూలమని,ఇది కోలాబ్‌ నది జలాలను పోషిం చేదని ఆయన తెలిపారు. కోలాబ్‌ నీటితో గిరిజనులు తమ భూమికి సాగునీరు అందించారు. మలి కొండను గనుల తవ్వ కాలకు ప్రభుత్వం అనుమతిస్తే నది ఎండి పోతుందని సమంత అన్నారు. కొండ అనేక విలువైన ఔషధ వృక్షాలకు నిలయం అని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక ముఖ్యమైన ఏనుగు కారిడార్‌ కూడా.మైనింగ్‌వల్ల పరిసరాల్లోని భూగర్భ జలాలు,గాలి,మట్టికి భంగం కలుగు తుంది. ఆందోళనకారులు ప్రభుత్వం మరియు కంపెనీ అధికారులకు హెచ్చరికలు చేశారు. తమ ప్రాణాలైనా ఇస్తాంగానీ,మాలి పర్వతాలపై బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టనీయమని నినదించారు. ప్రభుత్వం,కంపెనీలు తమ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని, ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితిలోను బాక్సైట్‌ తవ్వకాలు చేయరాదని, చేస్తే తమ ఆందోళనలను మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.-(కందుకూరి సతీస్‌ కుమార్‌)

ఉచితాల‌పై అనుచిత ప్ర‌చారం

‘కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటారా!? ఆకలేసి అరిచినోళ్ళు కాకులంటారా!?.’’ ప్రాణం ఖరీదు సినిమాలో ఓ పాటలోనివి ఈ వాక్యాలు. ప్రభుత్వ ఉచిత పథకాలు, వ్యయాలపై నేడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూస్తుంటే ఇవి గుర్తుకు రాకమానవు. అంటే తమ చాతుర్యాలతో లక్షల కోట్ల దేశ సంపదను ఆశ్రిత అవకాశ వాదంతో కాజేస్తున్న వారేమో ఉన్నతులు, శ్రమకు దగ్గ ప్రతిఫలాన్ని ఆశించకుండా, అడిగినంత ధరలు చెల్లిస్తూ వస్తు సేవలను పొందుతున్న ప్రజలేమో అధములన్న మాట! దేశ సంపదనంతా సామాన్యులకిచ్చే ఉచితాల ద్వారా సర్వనాశనం చేస్తున్నారంటూ వ్యక్తమవు తున్న సదరు అభిప్రాయాలపై జాలి కలుగు తున్నది. ప్రజలని ‘’అలగా జనం’’ అని సంబో దించిన చోట ఇంతకన్నా ఎక్కువ ఆలోచనను ఆశించడం అత్యాశే కాబోలు!. జి.తిరుపతయ్య
ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టమని, ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక అత్యవసర పరిస్థితి భారత్‌కూ తప్పదని ప్రధానమంత్రి నిర్వహించిన ఉన్నత అధికారుల సమావేశంలో పలువురు వ్యాఖ్యానించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్‌నారాయణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వీటిని ఆధారం చేసుకుని బూర్జువా పార్టీల ఏజెంట్లు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులు పేదలకు ఇచ్చే ఉచితాలే పెను భూతాలు అనే విధంగా సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాయి. ఇందులో నిజానిజాలను తెలుసు కోకుండానే దావానలంలా ఆ ప్రచారాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్నారు మన మధ్య తరగతి సోషల్‌ మీడియా మిత్రులు! మొదటిది, ఉచిత పథకాలు ఇవ్వమని ప్రజలు ఎప్పుడూ కోరలేదు, లేదా అలాంటి పథకాల కోసమేం వారు ఉద్య మాలూ చేయలేదు. రెండవది, ఈ ఉచితాలను ప్రకటిస్తున్నది ఎన్నికల వాగ్దానాల రూపంలో బూర్జువా పార్టీలు మాత్రమే. నిజానికి ఓట్ల కోసం సామాన్య ప్రజానీకాన్ని ప్రలోభ పెట్టే పాలక పార్టీల పన్నాగాలే ఇవన్నీ. అయితే ఈ ఉచిత పథకాలను అనుభవిస్తున్నది పేదలు మాత్రమే కాదు. కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ గానీ, రాష్ట్రం ప్రవేశపెట్టిన రైతుబంధు గానీ భూమి కలిగి ఉన్న పట్టాదారులందరికీ ఇస్తున్నారు తప్ప అర్హులైన, పెట్టుబడికి కొరవడిన పేద రైతులకు మాత్రమే చేరుతున్నాయా? ఇప్పటికీ అత్యధిక భూమి కొందరి చేతుల్లోనే ఉన్నది. అలాంటి ఉన్నత అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు లాంటి వారందరికీ రైతుబంధు అందుతున్నది. ఇక చౌక ధరల దుకాణాల అవకతవకలు అటుంచితే, ఇక్కడ సప్లయి చేయబడుతున్న వస్తువులు ఏవీ ప్రభుత్వానికి భారం కాదు. ఎందుకంటే నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకొని వినియోగ వస్తువులుగా మార్చిన తర్వాత ఇస్తున్న రేటు దాదాపు మధ్యవర్తిత్వం లేకుంటే పెద్దగా సబ్సిడీ ఏమీ ఇవ్వట్లేనట్లే. చివరికి వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, వితంతు పెన్షన్లు ఇవేనా ప్రభుత్వాలకు భారమైంది? లేదా 39లక్షల కోట్ల దేశ బడ్జెట్‌లో కేవలం 70వేల కోట్ల రూపా యలు కేటాయించి గ్రామీణ నిరుపేదలకు పని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమా? అరకొర నిధులు కేటాయించినప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లనే గ్రామాలలో, కీన్స్‌ అనే ఆర్థిక వేత్త చెప్పినట్లుగా అందరి చేతిలో ఎంతో కొంత కొనుగోలు శక్తి మిగిలివుంది. ఉచిత పథకాల కన్నా వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దే దీర్ఘ కాలిక మౌలిక వసతుల ప్రణాళికలు అవసరం. స్కూళ్ళల్లో పరిస్థితిని మెరుగుపరచ కుండా లాప్‌టాప్‌లు అందించడం అర్థరహితం. పాఠశాల విద్యార్థినుల హాజరు శాతాన్ని పెంచడానికి, వారు హాజరయ్యే విధమైన సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా, సైకిళ్లను కొనివ్వడం అర్థరహితం. ఇక ఇలాంటి పథకాలకు నిధులు ఎక్కడి నుండి కేటాయించ బడుతున్నాయి, దాని పర్యవసనాలు ఎంటో కూడా పరిశీలించాలి. 2020-21సంవత్స రానికి గాను పరోక్ష పన్నులు స్థూల జాతీయ ఉత్పత్తిలో 5.4శాతం ఉంటే ప్రత్యక్ష పన్నులు 4.7శాతం మాత్రమే ఉన్నాయి. 2.7ట్రిలియన్‌ డాలర్ల(200 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థలో పరోక్ష పన్నుల ద్వారా 10.8 లక్షల కోట్ల రూపాయలు వస్తే ప్రత్యక్ష పన్నుల ద్వారా కేవలం 9.4లక్షల కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో చూస్తే మొత్తం పన్ను రాబడిలో 67.4శాతం ప్రత్యక్ష పన్నుల వాటా ఉంటే భారత్‌లో అది 38.3శాతంగా నమోదు అవుతుంది. (మూలం బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక ) ఈ రెండు గణాంకాలను చూస్తే చాలా సులభంగా అర్థం అయ్యేది పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అని. మరి అట్లాంటి పరోక్ష పన్నులను చెల్లిస్తున్నది ఎవరు? వినియోగదారులైన ప్రజలు. ఆక్స్‌ ఫామ్‌ నివేదిక ప్రకారం కిందిస్థాయి 58శాతం ప్రజలు కేవలం 13శాతం ఆదాయంతో ఉన్నారు. అనగా అత్యంత తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు అత్యంత ఎక్కువ పన్నులు చెల్లించే పరోక్ష పన్నుల జాబితాలో ఉన్నారు. నిశితంగా గమనిస్తే సామాన్య ప్రజానీకం రెండు రకాల మోసాలకు గురవుతున్నారు. మొదటిది వారికి చెల్లించవలసిన వేతనం చెల్లించకుండా పెట్టుబడిదారులు మధ్యవర్తులు కొట్టేస్తున్నారు. రెండవది వారి నుండి పరోక్ష పన్నుల రూపంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఉచితాల రూపంలో ప్రజలకు పంచి పెట్టడం నేరమని, అది దేశానికి ఘోరమని విపరీత అర్ధాలు తీయడం సరైంది కాదు. అయితే ఉన్నతాధి కారులు చెప్పిన మాటలు అవాస్తవమా? వారికి ఆ మాత్రం అవగాహన లేదా అని మన పాఠకులకు సందేహం రావచ్చు. ఈ బూర్జువా రాజకీయ పార్టీలతో పాటు అత్యంతపై స్థాయిలో ఉన్న బ్యూరోక్రాట్లు కూడా ‘’ట్రికిల్‌ డౌన్‌ థియరీ’’నే (పై వాడి కడుపు నిండిన తరువాత మిగిలిందే క్రింది స్థాయికి చేరాలనేది) నమ్ముతారు. ఎందుకంటే డబ్బు కొందరి చేతుల్లోనే ఉండాలి, ప్రజలకు సౌకర్యాలు అలవాటు కాకూడదు, అలవాటైతే వాటిని తీర్చడం ప్రభుత్వ బాధ్యత కాకూడదు అన్నది వారి ఆలోచన. ఇలా అమాయక ప్రజలకు ఇచ్చే ఆ నాలుగు రూపాయల మీద పడి బాధపడే కన్నా రాబడి మార్గాలను ఎందుకు పాటించడం లేదో ఈ బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలి. అనగా ప్రత్యక్ష పన్నుల వాటా పెరగాలి అంటే ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య పెరగాలి. 6కోట్ల మంది పిఎఫ్‌ ఖాతాదారులు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతుంటే 3.7కోట్ల మంది మాత్రమే వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారని ఆదాయపు పన్ను అధికారులు తేల్చుతున్నారు. మరి ఈ వ్యత్యాసం ఏంటి? రిటర్నులు దాఖలు చేసిన వారిలోనూ నామ మాత్రపు పన్ను చెల్లించే వారి సంఖ్యే గణనీయం! దీనికి బాధ్యులెవరు? ఇక వ్యాపార వర్గాల నుండి ఆదాయపన్ను రాబట్టడానికి సమగ్రమైన ప్రణాళిక ఇంతవరకు లేదు. వ్యాపార లావాదేవీల్లో లాభాలను ఆర్జిస్తున్న అనేక మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చాక జీరో వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయాయా? అనగా బిల్లులు రాయకుండా నమోదు చేయబడిన నగదు రూపంలోని వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గడం లేదా? ఈ వ్యవహారాల వల్ల తప్పుడు మార్గంలో ఎందరికో లబ్ధి చేకూరడం లేదా? వీటిపై అనేక సందర్భాల్లో మేధావులనేకులు హెచ్చరికలు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఏమాత్రం దృష్టి పెట్టవు. ఇక కూత నేర్చిన వారు (సంపన్నులు) రెండు రకాలుగా దేశాన్ని, ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకటి, బ్యాంకుల్లో అత్యంత తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందడం, వాటిలో కొంత భాగాన్ని మాఫీ చేయించుకోవడం లేదా ఎగ్గొట్టడం…! ప్రభుత్వం దీనికి బాహాటంగా సహకరించడం జరుగుతోంది!! రెండవది, టాక్స్‌ కన్సెషన్స్‌ (పన్ను మినహాయింపు)గా లక్షల కోట్ల రూపాయలను పొందడం. వీరికోసం కేంద్ర బడ్జెట్‌లో దాదాపు 15శాతం పన్ను మినహాయింపునకు పోతుంది… అంటే ఆరు లక్షల కోట్లు సగటున ప్రతి ఏటా వీరికి రాయితీగా ఇస్తున్నారు. కొందరు వ్యాపారస్తులూ, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే ఈ మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి అమలు చేస్తున్న ఉచిత పథకాల కన్నా చాలా ఎక్కువ. దీనిపై జయప్రకాశ్‌ నారాయణ, ఇతర మేధావులు నోరు మెదపరెందుకు? ఎందుకంటే వీరు కూడా ఆ ట్రికిల్‌ డౌన్‌ థియరీనే ఇష్ట పడతారు. ఇక ఆదాయ పన్నును క్రమం తప్పకుండా చెల్లించే వేతన జీవులకూ ఈ ఉచితాలపై చాలా కోపం వస్తుంది. అయితే తమ నుండి బలవం తంగా,పన్ను మినహాయిం పులేవీ ఇవ్వకుండా, ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న ప్రభుత్వా లపై కాకుండా, తాము పని చేసేందుకు ఆధారమౌతూ పేదరికంలో మగ్గు తున్న సామాన్యులపై కోపం రావడం సరికాదు. అందువల్ల, ప్రజల మూలుగుల్ని పీల్చి లాభాలు సంపాదిస్తున్న కార్పొరేట్లకు ఇచ్చే పన్ను మినహాయింపులూ,రాయితీల వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం తప్ప, వీరి సరుకుల అమ్మకాలకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఆధారమవుతున్న చిన్న చిన్న ఉచిత పథకాల వల్ల కాదు.నిజానికి ఇది ఆర్థిక వ్యవస్థకు రక్త ప్రసరణలా పనిచేస్తుంది.

దేశాన్ని కాపాడుకుందాం..!

ధరల పోటు,నిరుద్యోగం,ఎక్కడ చూసినా అభద్రత…ఒక్కటి కాదు అనేక సమస్యలు దేశ ప్రజల్ని చుట్టుముట్టాయి. ఎనిమిదేళ్లుగా మోడీ సర్కార్‌ తీవ్రతరం చేసిన అత్యంత ధనవంతులు, బడా కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు కొనసాగడం వల్లే సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిరది. ఇదంతా ఆగాలంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని కార్మిక, కర్షక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే ప్రజా ఆందోళన మరింత ఉధృతం అవుతుందనే హెచ్చరిక చేసేందుకు మార్చి 28,29 రెండు రోజులు 48 గంటలపాటు దేశవ్యాప్త సమ్మెకు కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, యువత, కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలు… ఇలా అనేక వర్గాలు పాల్గంటున్నాయి. ‘దేశాన్ని.. ప్రజల్ని కాపాడుకుందాం’.. అనే నినాదంతో ముందుకు కదులాయి.
చారిత్రాత్మకమైన ఈ సమ్మెలో దాదాపు 25కోట్లమంది కార్మికులు పాల్గొరని ఒక అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగమంతా సామూహిక నిరసన కార్యక్రమాలు చేపడు తున్నారు. తయారీరంగం,బ్యాంకింగ్‌,ఆర్థిక సేవా సంస్థలు,విద్యాసంస్థలు,ప్రభుత్వ కార్యాల యాలు, రవాణా,నిర్మాణం,ఓడరేవులు…మొదలైన రంగాలన్నీ సమ్మెలో పాలుపంచు కుంటుండటంతో రెండు రోజుల పాటు కార్యక లాపాలు స్తంభించిచాయి. దేశానికి స్వాతంత్య్రం లభించి 75ఏళ్లయిన సందర్భంగా మోడీ సర్కార్‌,బిజెపి నాయకులు ‘అమృత కాలం’ మొదలైందని ప్రచారం చేసుకుంటున్నారు. కుటుంబ ఆదాయం కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడుతుంటే,నిరుద్యోగంరికార్డ్‌స్థాయికి చేరుకొంటే,అధిక ధరలతో సామాన్యుడు వణికి పోతుంటే.. ‘అమృత కాలం’ఎలా అవుతుంది? అనికార్మిక, కర్షక సంఘాల నాయకులు ప్రశ్నిస్తు న్నారు. అనేక రంగాల్ని అభద్రత ఆవహిం చింది. సమ్మె జయప్రదానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే ముమ్మర ప్రచారం చేశారు. మోడీ సర్కార్‌ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తుం దోనని. ప్రభుత్వరంగ ఉద్యోగులు,బ్యాంకింగ్‌ ఉద్యోగులు హడలిపోతున్నారు. కార్మిక సంఘాల డిమాండ్లు…
– 12 అంశాల డిమాండ్‌తో కార్మికులు, కర్షకులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. కోవిడ్‌ సంక్షోభం కారణంగా కష్టపడుతును కుటుంబాలకుతక్షణ ఆర్థిక సహాయం అందించడం వంటి కొత్త సమస్యలను డిమాండ్‌ చార్టర్‌ చేర్చింది.
– నాలుగు లేబర్‌ కోడ్‌లు, ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ (ఇడిఎస్‌ఎ)నిరద్దు చేయాలి.
– వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తామనిప్రధానిమోడీ ప్రకటించిన తర్వాత, పెండిరగ్‌లో ఉను ఇతర డిమాండ్ల కోసం పోరాటం కొనసాగిస్తామనిరైతు సంఘాలు ప్రకటించాయి.
– వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ‘జాతీయ నగదీకరణ విధానాన్ని’ రద్దు చేయాలి.
-ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలందరికీ నెలకు రూ.7,500 ఆదాయ మద్దతును అందించాలి
– ఉపాధి హామీకి కేటాయింపులను పెంచాలి. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ విస్తరించాలి
– అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించాలి.
– అంగన్‌వాడీ,ఆశా,మధ్యాహు భోజనం, ఇతర స్కీమ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి.
– లక్షలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పారా మెడికల్‌, సహాయక సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి.
– వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర కీలకమైన ప్రజా సేవల్లో ప్రభుత్వ పెట్టుబడిని పెంచాలి.
జు పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని గణనీయంగా తగ్గించి, ధరల పెరుగుదలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలి.
– కాంట్రాక్ట్‌ కార్మికులు, స్కీమ్‌ వర్కర్లందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
పెట్రో,గ్యాస్‌ మంటలు
సామాన్యుడు చెల్లించే పెట్రో ధరల్లో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఇంత పన్నుల భారం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. మూలధరతో పన్నుల శాతం ముడిపడి ఉండటంతో ధరలు పెరిగే కొద్ది పన్నుల రూపంలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. అందులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు వీలుగా పన్ను బదులు సర్‌ చార్జీలను పెంచుతూ పోతోంది కేంద్ర ప్రభు త్వం. ఇలా ప్రజల్ని కొల్లగొట్టి దానిని రాయితీల రూపంలో కార్పొరేట్లకు దోచిపెడు తోంది. ప్రజా క్షేమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రో ధరలను నియంత్రిం చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీనికోసం రాష్ట్రాలు నష్టపోకుండా పన్నుల విధానంలో అవసరమైన మార్పులు చేయాలి. ప్రజలను ధరాఘాతం నుండి ఆదుకోవాలి. లేకపోతే, దాని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి సామాన్యులకు గుదిబండ అవుతుంది.
వ్యవస్థలో ఆంక్షలు
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు దౌడు తీస్తున్నాయి. 2014 తరువాత ముడి చమురు అత్యధిక ధర (బ్యారెల్‌ దాదాపుగా 100 డాలర్లు)కి చేరింది. ఐతే, ఏరోజుకా రోజు ధరలు పెరిగే మన దేశంలో 110రోజుల నుండి ఒక్క పైసా ధర కూడా పెరగలేదు. బ్యారెల్‌ ధర 82 డాలర్లు ఉన్నప్పుడు మన దేశంలో చివరిసారిగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆతరువాత నాలుగు నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగకపోవడానికి కారణం ఎన్నికల రాజకీయాలేనన్నది సర్వ విదితం. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ముడి చమురు ధర ఒక డాలరు పెరిగితే దేశంలో ఒక లీటరు పెట్రోలు, డీజల్‌పై 45 నుండి 50 పైసలు పెరుగుతుందని, ఎన్నికల కారణంగా ధరలు నియంత్రించిన గత 110 రోజుల్లో ఆయిల్‌ కంపెనీలు కోల్పోయిన మొత్తాన్ని కూడా కలుపుకుంటే ఈ పెరుగుదల 10 రూపాయల వరకు ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఈ విశ్లేషణలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఖండిరచడం లేదు. దీనిని బట్టే రానున్న రోజుల్లో ధరాభారం ఖాయమనే స్పష్టమౌతోంది. ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అత్యంత హేతుబద్ధమైనదిగా చిత్రీకరించి…అన్ని దేశాలనూ ఒప్పించడం ద్వారా దానిని ఉనికి లోకి తెచ్చారు. కాని ఈ వ్యవస్థ సామ్రాజ్యవాద పెత్తనాన్ని మరింత పెంచేందుకోసమే రూపొందింది. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తమను ఆర్థికేతర కారణా లతో వ్యతిరేకించే దేశాలపై కక్ష సాధింపుకు సామ్రాజ్యవాదం ఉపయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో సభ్యదేశంగా ఉండాలా వద్దా అన్నది అంతర్జాతీయ వాణిజ్యం పరిధిలోకి రాని అంశం. కాని ఆవివాదం కారణంగానే ఇప్పుడు రష్యా మీద ఆంక్షలను విధించారు. పోకము నుపు భారతదేశానికి సోవియట్‌ యూనియన్‌ తోను, తూర్పు యూరపు సోషలిస్టు దేశాలతోను వ్యాపార లావాదేవీలలో రూపాయిలతోనే చెల్లింపులు జరిగేవి. అంతర్జా తీయంగా అమెరికన్‌ డాలర్‌ను రిజర్వు కరెన్సీగా అందరూ అంగీకరించినప్పటికీ, సరుకుల మారకానికి ఆ డాలర్‌ను కొలమానంగా ఈ లావాదేవీలలో మనం ఆ కాలంలో ఉపయో గించలేదు. రష్యన్‌ రూబుల్‌తో మన రూపాయి ఏ రేటుకు మారకం చేయాలో ఆ రేటును ముందే నిర్ణయించి, దానిని స్థిరంగా ఉంచుతూ వ్యాపారం సాగించేవారు. ఇరు దేశాల నడుమ వ్యాపార చెల్లింపులలో ఒక దేశానికి లోటు ఏర్పడితే దానిని వెంటనే సెటిల్‌ చేసేయాలనే షరతు ఏదీ ఉండేదికాదు. కాలక్రమేణా ఆ లోటు సర్దుబాటు అయ్యేది. అంతే తప్ప ఏనాడూ డాలరు కొలమానం ఉపయోగిం చలేదు. డాలర్లు తగినంత మొత్తంలో లేనందువలన ఇరు దేశాల నడుమా వ్యాపారా లు ఆగిపోయే పరిస్థితి. అందువల్లనే ఉత్పన్నం కాలేదు. పైగా డాలరు ప్రసక్తి లేకపోయేసరికి ఇరు దేశాలకూ మరింత తేలికగా, మరింత ఎక్కువగా వ్యాపారం చేసుకోగలిగిన పరిస్థితి ఉండేది. ఈ పద్ధతి చాలా సహేతుకమైది. ఇరు దేశాలలోనూ ఒకరికి అవసరమైన సరుకులు రెండో దేశం దగ్గర ఉన్నప్పుడు డాలర్లు తగిన మొత్తంలో లేకపోయినా, ఆ సరుకును కొనుగోలు చేయడానికి ఏ ఆటంకమూ ఉండదు. ఇది ఆ రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండిన విధానం. డాలర్ల కోసం విధిగా ఏదో సరుకును మూడో దేశానికి అమ్ముకుని, తద్వారా వచ్చిన డాలర్లతో మాత్రమే తనకు అవసరమైన సరుకును రెండో దేశం నుండి కొనుగోలు చేయవలసిన అగత్యం ఏర్పడదు. వ్యాపారం యావత్తూ డాలర్ల రూపంలోనే సాగాలంటే సంపన్న పెట్టుబడిదారీ దేశాల దగ్గరే ఆడాలర్లు ఎక్కువగా ఉంటాయి గనుక ఆ దేశాలకు కావ లసిన సరుకులను, అవి చెప్పిన రేటుకు తెగన మ్ముకోవలసిన దుస్థితి వస్తుంది. అదే డాలరు ప్రస్తావనే లేకుండా రెండు దేశాలూ వ్యాపారం చేసుకోగలిగితే అటువంటి దుస్థితి ఏర్పడదు. కాని నయా ఉదారవాద ఆర్థికవేత్తలు ఈ విధం గా డాలరుతో నిమిత్తం లేని ద్వైపాక్షిక వ్యాపారా లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటు వంటి ద్వైపాక్షిక వ్యాపారాలు అంతర్జాతీయ వ్యాపారాన్ని తేలికగా నిర్వహించుకోడానికి దోహదం చేస్తాయని మనం భావిస్తుంటే,వాళ్ళు మాత్రం ఈ తరహా వ్యాపారాలు అంతర్జాతీయ వ్యాపారాన్ని కుదించివేస్తాయని,పక్కదోవ పట్టిస్తాయని విమర్శించారు. తమ వద్ద ఉన్న డాలర్లకు సరిపడా సరుకులు దొరకడం లేదని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆయా దేశాలు ద్వైపాక్షికంగా వ్యాపారాలు నిర్వహించుకుంటూ తమ వైపు రావలసిన వ్యాపారాన్ని పక్కకు మళ్ళిస్తున్నాయని వారు అభ్యంతరాలు లేవనె త్తారు. ఒకసారి సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తర్వాత ఈ చర్చ నిలిచి పోయింది. డాలరు ఆధిపత్యం స్థిరపడిరది. నయా ఉదారవాదం ఎటువంటి ద్వైపాక్షిక వ్యాపారాలనూ అనుమతించదు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే మారకపు రేటు ఉండాలని అది శాసిస్తుంది. విదేశీ మారకద్రవ్య వ్యాపారానికి కూడా ఈ సూత్రమే వర్తించాలని ఆదేశిస్తుంది. ఈమధ్య కాలంలో తమ ఆదేశాలను ధిక్కరిస్తున్న దేశాలపై సంపన్న పెట్టుబడిదారీ దేశాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇలా ఆంక్షలకు గురైన దేశాలు తమలో తాము ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను చేసుకోవడం మొదలైంది. తద్వారా తమపై విధించిన ఆంక్షల ప్రభావా న్నుంచి తప్పించుకోవాలని అవి ప్రయత్నిస్తు న్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసిన నేపథ్యంలో రష్యా మీద సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తీవ్రంగా వ్యాపార ఆంక్షలు విధించాయి. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా స్పందిం చారు. అమెరికా, తక్కిన సంపన్న పశ్చిమ దేశాలు మాత్రమే మొత్తం ప్రపంచం కాదని, ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉందని, తమను ఓ మూలకు నెట్టాలని చూస్తే అనేక దేశాలతో తాము ద్వైపాక్షికంగా ఒప్పందాలను కుదుర్చు కోగలమని పుతిన్‌ హెచ్చరించాడు. ఈ పరిస్థితి చూస్తే మళ్ళీ ప్రపంచంలో ద్వైపాక్షిక ఒప్పందాల జోరు పెరిగేలా ఉంది.రష్యాకు చెందిన బ్యాం కులు, ఇతర ఆర్థిక సంస్థలు పశ్చిమ దేశాల ఆర్థిక నెట్‌వర్క్‌తో ఏ విధంగానూ లావా దేవీలు జరిపేందుకు వీలు లేకుండా నిషేధిం చడం ఇప్పటివరకూ విధించిన ఆంక్షలలోకెల్లా తీవ్రమైనటువంటిది. స్విఫ్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌) నెట్‌వర్క్‌ను రష్యన్‌ బ్యాంకు లకు అందుబాటులోకి లేకుండా చేయడం దీనిని సూచిస్తుంది. దీని వలన రష్యా తన దేశం నుండి విదేశాలకు చేసిన ఎగుమ తులకు ప్రతిగా డాలర్ల రూపంలో రావలసిన ఆదాయం నిలిచిపోతుంది. డాలర్లు లేకపోతే రష్యా తనకు అవసరమైన దిగుమ తులకు కొనుగోలు చేయలేదు. అటు వంట ప్పుడు రష్యా తన దిగుమతుల అవసరాల కోసం తప్పనిసరిగా డాలర్లతో ప్రమేయం లేని ద్వైపా క్షిక ఒప్పందాలను కుదుర్చుకోవలసి వస్తుంది. అందులో భాగంగా భారతదేశంతో కూడా గతంలో మాదిరిగా ద్వైపాక్షిక ఒప్పం దాలకు రష్యా సిద్ధపడవచ్చు. ఆ ఒప్పందాలు గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉన్న కాలంలో చేసుకున్న ఒప్పందాలను తలపించే అవకాశం ఉంది. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తట్టుకుని నిలదొక్కుకోడానికి రష్యాకు ఆ విధమైన ఒప్పందాలు ఎంతమేరకు దోహదం చేయగలవో ఆచరణలో చూడాల్సిందే. ఈవిధమైన ఆంక్షల ఫలితంగా వేలాదిమంది ప్రజలు సకాలంలో ఔషధాలు అందక వెనిజు లాలో, ఇరాన్‌లో మరణించారు. ఒకానొక ప్రభుత్వం తీసుకున్న వైఖరి అంగీకారయోగ్యంగా లేనందున ఆంక్షల పేరుతో అక్కడి పౌరులను సైతం బలి చేయాలా అన్నది చర్చ. ఐతే, రష్యా వంటి పెద్ద, బలమైన దేశం విషయంలో ఈ విధమైన చర్చ పెద్దగా వర్తించదు. పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు కాదన్నంత మాత్రాన రష్యాను పట్టించుకోకుండా దూరంగా ఉంచగ లిగిన స్థితి చాలా దేశాలకు లేదు. రష్యా బలమైన దేశమే గాక, ప్రపంచంలో దానికి చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. సామ్రా జ్యవాదం విధించే ఈ ఆంక్షలు అనేక వైరు ధ్యాలతో కూడివున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో సామ్రాజ్యవాదం విధించే ఆంక్షలు ప్రధానంగా అమెరికన్‌ డాలర్లు లేదా ఇతర ప్రధాన కరెన్సీలు ఆదేశాలకు అందుబాటులోకి లేకుండా చేస్తాయి. ఆవిధంగా ఆంక్షలు విధిం చిన ప్రతీ సందర్భంలోనూ ఆంక్షలకు గురైన దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిం చడం మొదలుపెడతాయి. ఆ క్రమంలో సామ్రా జ్యవాదం యొక్క పట్టు బలహీనపడడం ప్రారం భం ఔతుంది. ఆంక్షలకు గురైన దేశాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ద్వైపాక్షిక ఒప్పందాలు పెరుగు తాయి. సామ్రాజ్యవాదపు పట్టు బలహీన పడడం పెరుగుతుంది. ఆవిధంగా సామ్రాజ్య వాద ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వాణిజ్య వ్యవస్థ తలెత్తడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అత్యంత హేతుబద్ధమైనదిగా చిత్రీకరించి…అన్ని దేశాలనూ ఒప్పించడం ద్వారా దానిని ఉనికి లోకి తెచ్చారు.కాని ఈ వ్యవస్థ సామ్రాజ్యవాద పెత్తనాన్ని మరింత పెంచేందుకోసమే రూపొందింది. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తమను ఆర్థికేతర కారణాలతో వ్యతిరేకించే దేశాలపై కక్ష సాధింపుకు సామ్రా జ్యవాదం ఉపయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో సభ్యదేశంగా ఉండాలా వద్దా అన్నది అంతర్జాతీయ వాణిజ్యం పరిధిలోకి రాని అంశం. కాని ఆవివాదం కారణంగానే ఇప్పుడు రష్యా మీద ఆంక్షలను విధించారు. అంతర్జాతీ య వాణిజ్యం రాజకీయ వివాదాలకు అతీ తంగా,హేతుబద్ధంగా జరగాలంటూ తొలుత ప్రతిపాదించిన సామ్రాజ్యవాదులే ఇప్పుడు ఆ సూత్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తు న్నారు. వారి అసలురంగు ఏమిటో దీనిని బట్టే బైట పడుతోంది. నాటో కూటమి విస్తరణతో ముడి పడిన వివాదాల కారణంగా ఆయా దేశాలు పరస్పర వాణిజ్య సంబంధాలను ప్రతికూ లంగా దిగజార్చుకోవలసిరావడం పలు దేశా లకు ఆమోదయోగ్యం కాదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇమిడివున్న వైరుధ్యాల పర్యవ సానాలను నేడు మనం చూస్తున్నాం. నయా ఉదారవాదం ముందుకు పోయే దారి కనిపిం చని, దిక్కుతోచని స్థితికి ఏవిధంగా చేరుకుం టున్నదీ మనం చూస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణ రూపంలో మనకు కనిపించేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకా లంగా కొనసా గుతున్న సంక్షోభపు చిహ్నాలు, అమెరికా ఆధిప త్యానికి పెరుగుతున్న సవాళ్ళు మాత్రమే.- (ప్రభాత్‌ పట్నాయక్‌ )

పార్ల‌మెంటు సాక్షిగా విశాఖ ఉక్కుపై కేంద్రం దాడి

విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో వ్యక్త మౌతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేని బిజెపి… దుష్ప్రచారానికి పార్లమెంటు వేదికగా పూనుకుంది. తన సన్నిహిత కార్పొరేట్‌ వర్గానికి దీనిని ధారాదత్తం చేయడానికి ప్రజల్లో విశాఖ ఉక్కు ఖ్యాతిని మసక బార్చేందుకు కుట్ర పన్నింది. మొన్న పార్లమెంటులో విశాఖ ఉక్కుపై సభ్యులు అడిగిన ప్రశ్నలను ఆసరా చేసుకొని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విషం కక్కారు. వాస్తవాలకు పాతరేసితీవ్రమైన అబద్ధాలు వల్లించారు.అబద్ధం 1: విశాఖ ఉక్కుకు కేప్టివ్‌ మైన్స్‌ లేకపోవడం వల్ల నష్టాలు రాలేదు-డా॥ బి.గంగారావు
ఇది పచ్చి అబద్ధం. కేప్టివ్‌ మైన్స్‌ అంటే ప్రభుత్వం ఉక్కు పరిశ్రమలకు ముడిఇనుప గనులు కేటా యించడం.దేశంలో సొంతముడి ఇనుప గనులు లేని ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు.అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్టీల్‌ పరిశ్రమలకు ప్రభుత్వం సొంత ఇనుప గనులు కేటాయించింది.ఇంకా నిర్మాణం జరగని బ్రాహ్మణి స్టీల్‌కి, పోస్కోకి కూడా సొంత ముడి ఇనుప గనులు కేటాయించారు.స్టీల్‌ ఉత్పత్తి వ్యయంలో ముడి ఇనుప ఖనిజంపై చేసే ఖర్చు చాలా కీలక మైంది.విశాఖ ఉక్కుకి సొంత ముడి ఇనుప గనులు లేకపోవడంవల్ల ప్రైవేట్‌ వారి నుండి కొనుగోలు చేస్తున్నది.ఈ ఏడాది ఒక టన్ను ముడి ఇనుప ఖనిజాన్ని సగటున సుమారు రూ.8500 కు కొనుగోలు చేశారు.టాటా,జిందాల్‌,మిట్టల్‌ తది తర పరిశ్రమలన్నీ సొంత గనులు ఉండటం వల్ల ఒకటన్ను ముడి ఇనుప ఖనిజాన్ని కేవలం రూ. 800కే సమీకరించు కోగలిగాయి.దీనివల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇతర అన్ని స్టీల్‌ప్లాంట్ల కంటే రూ.2 వేల కోట్లకుపైగా అదనంగా ముడి ఖనిజంపై ఖర్చు భరించాల్సి వస్తున్నది.ఫలితంగా ఉక్కు ఉత్పత్తి వ్యయంలో56శాతం విశాఖ స్టీల్‌ ముడి పదార్ధాలకు ఖర్చవుతున్నది.ఇతర స్టీల్‌ప్లాంట్లకైతే ఈ వ్యయం 30శాతం మాత్రమే ఉంటుంది.మార్కెట్‌లో మా త్రం స్టీల్‌ అంతర్జాతీయ రేట్ల ప్రకారం అన్ని కంపె నీలు ఒకే రేటుకు అమ్మాలి.అయినప్పటికీ ఈ ఏడాది 2022జనవరి నాటికి రూ.739కోట్లు నికర లాభం ఆర్జించింది.సొంత ఇనుప గనులు కేటాయిస్తే ఏడాదికి 2 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జిస్తుంది.
అబద్ధం2 :విశాఖ ఉక్కుకు భారీగా నష్టాలు, రుణ భారం
గతఏడేళ్ళలో విశాఖఉక్కు రూ.7122కోట్లు నష్టాలు చవి చూసిందని, రుణ భారం కూడా రూ.22 వేలకోట్లు ఉందని మంత్రి వాపోయారు. విశాఖ ఉక్కు2015-16నుండిలాభాల్లోనే కొనసాగు తున్నది.ఇది వాస్తవం.అయితే విశాఖ ఉక్కుకు ఇటీవల నికర నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మొదటిది దీనికి సొంత ఇనుప గనులు లేకపో వటం.ముడి ఇనుప ఖనిజంధర ఈ ఆరేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. రెండోదిప్లాంట్‌ 33 లక్షల టన్నుల నుండి 73లక్షల టన్నులకు విస్తరిం చింది. రాయబరేలిలో 500 కోట్లతో రైలు చక్రాల తయారి పరిశ్రమను నిర్మించింది. వీటికోసం ప్లాంట్‌కి ఉన్న మిగులు నిధులతో పాటు బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని విస్తరణ చేపట్టింది.కేంద్ర ప్రభు త్వం ఈవిస్తరణకు ఒక్క రూపాయి పెట్టుబడి ఇవ్వ లేదు.అందువల్ల రూ. 22 వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది.పైపెచ్చు అప్పుపై14శాతం వడ్డీ చెల్లిం చాల్సి వస్తున్నది. ప్రైవేట్‌ స్టీల్‌ కంపెనీలకు బ్యాం కులకు ఇచ్చేవడ్డీ రేట్లు విశాఖ స్టీల్‌కి కూడా కేంద్ర ప్రభుత్వం వర్తింప చేస్తే ఏడాదికి కనీసం రూ.700 కోట్లు వడ్డీ ఆదా అవుతుంది.ఈ విస్తరణ ద్వారా సుమారు పదివేల మందికిఉద్యోగాలు కల్పించింది. దేశంలో ఏ ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌కి అప్పులు లేవు? అంతే కాదు దేశంలో ఉన్న 8 బడా స్టీల్‌ కంపెనీలు సుమారు రూ. 2లక్షల 15 వేల కోట్లు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టాయి.కేంద్ర బిజెపి ప్రభుత్వం మద్ద తుతోనే రుణాల రద్దు జరిగాయి. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ఏ బ్యాంకుకు ఒక్క రూపాయి ఎగ్గొట్టలేదు. నికర నష్టాలున్నా గత ఏడేళ్ళలో సుమారు16 వేల కోట్లు కేంద్రానికి పన్నులు చెల్లించింది
అబద్ధం 3 : విశాఖ ఉక్కు ఉత్పాదకత, ఉత్పత్తి తగ్గింది. రెండేళ్ల నుండి జీతాలు ఇవ్వలేని స్థితి
గత రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభం కొనసాగినప్పటికీ విశాఖ ఉక్కు తన ఉత్పత్తిని 60 లక్షల టన్నులకు పైగా చేయగలిగింది.అంతేగాక గతఆరేళ్లలో టర్నో వర్‌ రూ.12వేల కోట్ల నుండి రూ.24 వేల కోట్లకు పెంచుకోగలిగింది.ఉత్పాదకత బాగా ఉందని, 88 శాతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగించు కుంటు న్నదని సాక్షాత్తూ స్టీల్‌ పార్లమెంట్‌ స్టాండిరగ్‌ కమిటీ తన నివేదిక లోనే పేర్కొన్నది.వాస్తవంగా ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 2025 నాటికి 120 లక్షల టన్నులకు పెంచుకోవాలి.కానీ కేంద్ర బిజెపి నుండి ఆర్థిక సహకారం లేకపోవడంతో ఈ విస్తర ణకు నోచుకోలేక పోయింది.అలా జరిగి ఉన్నట్ల యితే మరో50వేల మందికి ఉద్యోగాలు కల్పించ బడేవి.కోవిడ్‌ కాలంలో దేశంలోని అన్ని ప్రయివేటు స్టీలు పరిశ్రమలు కార్మికులను తొలిగించటం, జీతా ల్లో కోత పెట్టడం చేశాయి. కానీ విశాఖ ఉక్కులో మాత్రం ఈదారుణం జరగలేదు.అంతేకాదు ఏడా దికి రూ.2588 కోట్లు జీతాలకే చెల్లిస్తున్నది.
అబద్ధం 4 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగినా ఇలాగే ఉంటుంది! ఉద్యోగాలు పెరుగుతాయి!!
ప్రైవేటీకరణ జరిగితే ప్లాంట్‌ ఎక్కడికి పోదు. అక్కడే ఉంటుందని పార్లమెంట్‌లో ఉక్కు మంత్రి వ్యం గ్యంగా చెప్పారు.విశాఖ స్టీలు ప్రైవేటీకరణ జరిగితే ఏమౌతుంది? తొలుత దీని విస్తరణకు ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌ పేర అమ్మే స్తారు. ఉద్యోగులందరినీ వి.ఆర్‌.ఎస్‌ కింద తొలగి స్తారు.జీతాల్లోభారీగా కోతలు పెడతారు. కాంట్రా క్టు కార్మికులను సైతం తొలగిస్తారు. ఏఒక్కరికి ఉద్యోగ భద్రత ఉండదు.కార్మిక హక్కులు అమలు ఉండదు. ఈ చర్యలు మొత్తం విశాఖ నగర ప్రజల ఆర్థిక జీవనాన్ని దెబ్బతీస్తుంది.ఎయిర్‌ ఇండియాని, నీలాచల్‌స్టీల్‌ని టాటా కొన్నతరువాత జరిగిందేంటి? కార్మికులను కేవలం ఏడాది మాత్రమే కొనసా గిస్తాం, ఆ తరువాత వి.ఆర్‌.ఎస్‌ ద్వారా అందరినీ తొలగిస్తాం అని ప్రకటించారు. విశాఖఉక్కు ప్రైవేటీ కరణ చేస్తే ఇదే జరుగుతుంది.
అబద్ధం 5 : ఉక్కు నిర్వాసితులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం !
విశాఖ స్టీల్‌ కోసం 16,500 కుటుంబాలు 22 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు,64 గ్రామా లు తొలగించబడ్డాయి. ఇప్పటివరకు ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు 8 వేలు మాత్రమే.ఇంకా సగం మందికి పైగా ఇవ్వాల్సి ఉంది.ఐదువేల ఉద్యోగాలకే ఒప్పం దం జరిగిందని ఇక ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరమే లేదని మంత్రితెగేసి చెప్పారు. నిర్వా సితుల ఉద్యోగాల కోసం అనేక పోరాటాలు జరిగా యి. కాలక్రమంలో నిర్వాసితులందరికి ఉద్యోగాల కల్పనకు అనేక ఒప్పందాలు,హామీలు జరిగాయి.ఈ వాస్తవాలను మంత్రి కప్పిపుచ్చారు. ఇటీవల ఉద్యోగాల భర్తీకిఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా బిజెపి దుర్మార్గంగా రద్దు చేయించింది.ఉక్కు ఉద్యమాన్ని చీల్చడానికి, నీరుగార్చడానికి బిజెపి అనేక కుట్రలకు పాల్పడిరది.నిర్వాసితులపైవల పన్నింది. నిర్వా సితులకు ఉద్యోగాలు ఇస్తామని, మేలు చేస్తామని నమ్మబలికింది.బిజెపి అగ్ర నాయకత్వం విశాఖలో వుండి కొందరిని తనవైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది.అయినా ఉద్యమంలో చీలిక తీసుకు రాలేకపోయింది.చివరికి ఇప్పుడు నిర్వా సితుల పట్ల బిజెపి తన అసలు నైజాన్ని పార్ల మెంట్‌లో బయటపెట్టింది.నిర్వాసితు లకు అన్నీ ఇచ్చేశాం.ప్లాంట్‌కు నిర్వాసితులకు ఎటువంటి సం బంధం లేదనేవిధంగా దుర్మార్గంగా తెగేసి చెప్పింది
అబద్ధం6: నీలాచల్‌ స్టీల్‌ ప్రైవేటీకరణవల్లఉద్యోగుల జీతాలు రెట్టింపు అయ్యాయి
వాస్తవం ఏమిటంటే ఈ కంపెనీని టాటాకి గత నెల బిజెపి అమ్మేసింది. ఈఅమ్మకంలో నీలాచల్‌ కంపెనీ ఉద్యోగులను కేవలం ఏడాది మాత్రమే కొనసాగించ టానికి, తరువాత వి.ఆర్‌.ఎస్‌ తో వీరిని తొలగించ టానికి టాటాతో బిజెపి ఒప్పందం చేసుకుంది.అంటే త్వరలో పర్మినెంట్‌ ఉద్యోగులం దరినీ తొలగించటం ఖాయం.ఈ నిజాన్ని దాచిపెట్టి ఉద్యోగులకు జీతాలు రెట్టింపయ్యాయనడం ప్రజలను మోసగించడమే. పైగా,మోడీ అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా ప్రభుత్వ కంపెనీలను అమ్మేసిన దానిలో నీలాచల్‌ స్టీల్‌ రెండోది.గత ఏడాది లక్షల కోట్ల విలువ చేసే ఎయిర్‌ ఇండి యాను18వేలకోట్లకుటాటా కి అమ్మేశారు. నీలాచల్‌ స్టీల్‌ ఆస్తుల విలువను కేంద్ర ప్రభుత్వం రూ.5616 కోట్లుగా నిర్ధారించి దీనిని రిజర్వు ధరగా ప్రకటిం చింది. టాటా స్టీల్‌ దీనిని ఏకంగా రూ.12,011 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదెలా సాధ్యమైంది? ఈ కంపెనీకి వందేళ్ళకు సరిపడా 874 హెక్టార్లలో సుమారు 102 మిలియన్‌ టన్నుల ముడి ఇనుప గనులు ఉన్నాయి. ప్రస్తుత రేటు ప్రకారం ఈ గనులు అమ్ముకుంటే సుమారు రూ.80వేల కోట్లు ఆదాయం వస్తుంది. అంతేగాక ఈప్లాంట్‌ 100 లక్షల టన్ను ల తక్షణ విస్తరణకు అన్ని అవకాశాలు న్నాయి. 2500 ఎకరాల మిగుల భూమి ఉంది. పారదీప్‌ పోర్టుకి దగ్గరలో ఉంది.మోడీ ప్రభుత్వం అందుకే టాటా స్టీల్‌కి కట్టబెట్టింది. విశాఖ ఉక్కులో దీనిని కలిపివేయాలని డిమాండ్‌ చేసినా బిజెపి అంగీక రించలేదు.
అసలు కుట్ర ఏమిటి ?
దేశంలోని ప్రభుత్వ స్టీల్‌ కంపెనీ లన్నింటిని బడా కార్పోరేట్ల పరం చేయాలన్నదే బిజెపి కుట్ర. వామపక్షాలు మినహా దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ విధానాలను బలపరుస్తున్నాయనేది వాస్తవం.90వ దశకంలో మొత్తం దేశీయ స్టీల్‌ ఉత్పత్తిలో ప్రభుత్వ స్టీల్‌ కంపెనీల వాటా 46 శాతం ఉండేది. నేడు 17 శాతానికి పడిపోయింది.గత 3 దశాబ్దాల ప్రైవేటీ కరణ విధానాల వలన టాటా,మిట్టల్‌,జిందాల్‌ వంటి 6బడా కంపెనీలు స్టీల్‌రంగంలో అతి పెద్ద కంపెనీలుగా అవతరించాయి.నేడు స్టీల్‌ ఉత్పత్తిలో వీటి వాటా 46 శాతానికి చేరింది. ఇప్పుడు ప్రభుత్వ స్టీల్‌ పరిశ్రమల న్నిటినీ తమ సొంతం చేసుకో వడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.అలాగే మొత్తంస్టీల్‌ ఉత్పత్తిలో నేడు చిన్నతరహా స్టీల్‌ కంపె నీల మొత్తం కంపెనీలవాటా42శాతం ఉంది.వీటిని కూడా ఈబడా కంపెనీలు మింగే యడానికి ప్రయత్నం చేస్తున్నాయి.అందుకు బిజెపి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఫలితంగా జరగబోయే పరిణామం ఏంటంటే మొత్తం దేశీయ స్టీల్‌ రంగం కేవలం నాలుగైదు బడా కంపెనీల గుత్తాధిపత్యం లోకి వెళ్ళబోతున్నది. వ్యాసకర్త: గౌరవాధ్యక్షులు, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ (సిఐటియు)

1 2 3 4 5 6 11