మనమే నంబర్‌ వన్‌..రెండో స్థానానికి చైనా

ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్‌.ఈ లెక్కలు, సర్వేల మాట వినగానే సందేహాలు వెల్లువెత్తుతాయి. ఈ లెక్కలూ, సర్వేలూ చెప్పని కొన్ని అంశాలు ఉంటాయి. అవి జనాభా పెరుగుదలలోని అసమతౌల్య ధోరణులు. దానితో వచ్చే ప్రమాదాలు. మతం పేరుతో దేశాలు ఏర్పడిన చరిత్ర ప్రపంచంలో ఉంది. జనాభా పెరుగుదల వరమా? శాపమా? జనాభాతో మనం అతి పెద్ద మార్కెట్‌గా అవతరించామా? కొత్త సమస్యలు ఏమిటి? ఆహార భద్రత ఎలా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో అసమతౌల్యంతో వచ్చే ప్రమాదాల గురించి కూడా చర్చించాలి. కచ్చితంగా జనాభా మీద స్పష్టమైన విధానం రావాలి. అది అందరూ ఆమోదించేదై ఉండాలి.యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ తాజా సమాచారం ప్రకారం జనాభా పరంగా మనదేశం మొట్టమొదటిసారి చైనాను వెనక్కి నెట్టేసింది. దీని ప్రకారం ప్రస్తుత మనదేశ జనాభా 142.86కోట్లు. చైనా జనాభా ప్రస్తుతం 142.57 కోట్లు! ఇప్పుడు ప్రపం చంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన చైనాకు బదులు ఇక ఇండియా అని చెప్పాలి. 1950లో మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి (యు.ఎన్‌.) ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాను తయారుచేసింది. అప్పటి నుంచి యు.ఎన్‌.ఎప్పుడు ఈ జాబితా విడుదల చేసినా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశా లలో ప్రథమ స్థానం చైనాదే. ఇప్పుడు మనదేశం చైనాను తోసిరాజని ముందుకు దూసుకెళ్లింది. భారత్‌లో జననాల రేటు ఇటీవలి సంవత్సరాల్లో బాగా తగ్గినప్పటికీ, ‘పని చేసే వయసున్న వారు’ మొత్తం జనాభాలో 75% ఉండటం సానుకూలాంశం. భారత్‌లోని ఈ శ్రామిక సంభావ్య శక్తి ద్వారా రానున్న కాలంలో, ఇప్పటికే చైనా పడుతున్న ఇబ్బం దులను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలే ఎక్కువ. అయితే ఇక్కడ శ్రామిక జనాభా అధికంగా ఉండటం అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పెరుగుతున్న వీరి జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే అది ప్రతికూలాంశంగా మారడం తథ్యం.
ఫలితమిచ్చిన కుటుంబ నియంత్రణ
1901లో భారత జనాభా 23 కోట్లు. 1951 వరకు ఈ జనాభా పెరుగుదల చాలా నిదా నంగా సాగింది. తర్వాతి ఐదు దశాబ్దాల కాలంలో మూడు రెట్లు పెరిగి 2001 నాటికి మనదేశ జనాభా 102 కోట్లకు ప్రస్తుతం 1.4 బిలియన్లకు చేరుకుంది. యు.ఎన్‌. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌ అంచనా ప్రకారం 2030 నాటికి 1.5 బిలియన్‌, 2050 నాటికి 1.64 బిలియన్లకు మనదేశ జనాభా చేరుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత జనాభా దాదాపు 350 మిలియన్లు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ప్రభుత్వం 1952లో మొట్టమొదటిసారి కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టింది. అప్పట్లో సగటున ఒక స్త్రీ ఆరుగురు సంతానాన్ని కలిగి ఉండేది. అప్పటి నుంచి వరుసగా వచ్చిన ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఇప్పటికి ‘‘ఇద్దరి’’కి పరిమితం చేయగలిగింది. దేశంలో కుటుంబ నియంత్రణ అమలుకు ప్రపంచ బ్యాంకు అప్పట్లో 66 మిలియన్‌ డాలర్లు రుణ సహాయం చేసింది. 1950 నుంచి 1990 వరకు దేశ ఆర్థిక ప్రగతి సగటున 4%గా కొనసాగింది. 1990ల్లో పి.వి. నరసింహారావు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమాని దేశ ప్రగతి 5.5% తర్వాత 2000 సంవత్సరం నుంచి సగటున దేశ వృద్ధిరేటు 7.7శాతం నమోదు చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి జనాభాపై విధానకర్తల అభిప్రాయంలో మార్పు రావడం మొదలైంది. 15-64 సంవత్సరాల మధ్య వయస్కులను ‘పనిచేసే’ వారిగా పరిగణిస్తూ, వీరిని ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా పేర్కొంటూ వచ్చారు. దీన్నే ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’గా వ్యవహరి స్తున్నారు. ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలోని వివిధ దేశాలు అభివృద్ధి చెందింది కేవలం ఈ ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ వల్లనేనన్న సత్యం వెల్లడవు తుంది. 1990 నుంచి భారత్‌ కూడా దీనివల్ల సానుకూల ఫలితాలు పొందింది.
భయపెడుతున్న నిరుద్యోగం
అధికారిక గణాంకాల ప్రకారం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.7శాతంగా ఉన్న నిరుద్యోగం, 2017-18 నాటికి 6.1శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వార్షిక సమాచారం ప్రకారం 2021-22లో ఇది 4.1శాతానికి తగ్గడం కొద్దిగా ఉపశమనం కలిగించినా, సెంటర్‌ ఫర్‌ మానిటర్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం గత మార్చిలో దేశలో నిరుద్యోగరేటు 7.8శాతంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అధికారిక అంచనాల ప్రకారం ఏటా దేశంలో ఐదు మిలియన్ల మంది శ్రామిక మార్కెట్‌లోకి కొత్తగా చేరుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 18-35 మధ్య వయస్కులు 600 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 65%. వీరిలో వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచడంలోనే ఆర్థిక ప్రగతితో పాటు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ముడిపడివుంది.
స్థిరీకరణ దశకు జనాభా
జనాభా శాస్త్రవేత్తల ప్రకారం సగటున స్త్రీల ‘మొత్తం గర్భధారణ రేటు’ (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌- టీఎఫ్‌ఆర్‌)2.1గా నమోదైనప్పుడు ఒక దేశ జనాభా స్థిరంగా ఉంటుంది. అంటే ఇందులో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల సంఖ్యను స్థిరంగా ఉంచడాన్ని, 0.1 పిల్లల్లో సంభావ్య మరణాలను సూచిస్తుంది. దీన్నే యు.ఎన్‌. పాపులేషన్‌ డివిజన్‌ ‘రీప్లేస్‌మెంట్‌-లెవెల్‌ ఫెర్టిలిటీ’ అని వ్యవహరిస్తుంది. ఇంతకూ చెప్పొచ్చేదే మంటే భారత్‌ ఈ టీఎఫ్‌ఆర్‌కు అత్యంత సమీపానికి చేరుకుంది. అంటే జనాభా స్థిరీకరణ దశకు చేరుకున్నదని అర్థం. మనదేశం లోని చాలా రాష్ట్రాల్లో ఈ టీఎఫ్‌ఆర్‌ రేటు 2.1 కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ప్రముఖ డెమోగ్రాఫర్‌, సామాజిక శాస్త్రవేత్త షిరీన్‌ జెజీభోయ్‌ ప్రకారం భారత్‌లో మొత్తం 28 రాష్ట్రాల్లో 17,9 కేంద్రపాలిత ప్రాంతాల్లో 8 ‘రీప్లేస్‌మెంట్‌ దశ’కు చేరుకున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒకవేళ మనదేశం జనాభా స్థిరీకరణ దశకు చేరుకోకపోతే జనాభా ఎంతలా పెరిగిపోయేదో ఊహిస్తేనే ఒళ్లు జలద రిస్తుంది. దేశంలో జనాభా పెరుగుదలరేటు క్రమంగా తగ్గడమే ఈ స్థిరీకరణకు కారణం. ఉదాహరణకు 1972 నుంచి 1983 మధ్యకాలంలో వార్షిక జనాభా పెరుగుదల రేటు 2.3%గా ఉండేది. 2011నాటికి ఇది 1.37 శాతానికి, 2017లో 0.98%కి 2023లో 0.81%కు పడిపోయింది. ఇదిలావుండగా సి.ఐ.ఎ. వరల్డ్‌ ఫ్యాక్ట్‌బుక్‌ జనాభా గణాంకాల అంచనా ప్రకారం 2022లో మనదేశ జనాభా వృద్ధి రేటు 0.67% మాత్రమే. ఇక మనకున్న మరో సానుకూలాంశం డిపెండెన్సీ రేటు కేవలం 0.4శాతం. దశాబ్దకాలం క్రితం మనదేశంలో చిన్నపిల్లల జనాభా అత్యధికంగా నమోదుకాగా ఇప్పుడది పడిపోతుండటం గమనార్హం. 1951 లో దేశ జనాభాలో హిందువుల జనాభా 84.1% కాగా ముస్లింలు 2.3% మాత్రమే. అదే 2011 నాటికి హిందువుల జనాభా 79.80%కు తగ్గి, ముస్లింల జనాభా 14.23%కు పెరగడం గమనార్హం. అంటే హిందూ జనాభా వృద్ధిరేటు 16.8% (2001- 2011 మధ్యకాలంలో) కాగా ఇదే కాలంలో ముస్లింల వృద్ధిరేటు 24.6%. మిగిలిన మతాల జనాభావృద్ధి గమనించదగ్గ స్థాయిలో లేదు. 1991-2001 మధ్యకాలంలో ముస్లిం జనాభా వృద్ధిరేటు 29.52%గా ఉండగా 24.6%కు పడిపోయింది. అదేవిధంగా హిందువుల జనాభా వృద్ధిరేటు 19.92% నుంచి 16.8%కు పడిపోవడం గమనార్హం.- (జమలాపురపు విఠల్‌రావు/సుంకవల్లి సత్తిరాజు)

పోలవరం ఎంత దూరం?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలవారాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పరస్పర రాజకీయ ఆరోపణలు విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సాగు, తాగునీటి,విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలతోపాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్‌ చేసినా..అనుకోని విధంగా జరుగుతున్న ఆలస్యంతో..ఎప్పటికప్పుడు కథ మొదటికి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం అనడంలో రెండోమాట లేదు.కానీ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు మారుతున్నాయి. ఇప్పటికీ చాలాసార్లు గడువులు మారాయి.కానీ..ప్రాజెక్టు మాత్రం పూర్తికాలేదు. ప్రాజెక్టు పూర్తియితే తమకు నీళ్లెప్పుడొస్తాయా అని లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. –సైమన్‌ గునపర్తి
పోలవరం ఎత్తుపై గందరగోళం
ఆంధ్ర సీమకు జీవనాడిగా అభివర్ణించే పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర బిజెపి ప్రభుత్వం పూటకోమాట చెబుతూ గందరగోళం సృష్టిస్తోంది. నిర్మాణ పనులు, నిర్వాసితుల సహాయ, పునరావాసం అడుగు ముందుకు పడని దయనీయ స్థితి ఉండగా, కేంద్రం చేస్తున్న గజిబిజితో ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. గడచిన వారం రోజుల్లో పార్ల మెంట్‌లో కేంద్ర మంత్రుల ప్రకటనలు దోబూ చులాడగా, నిధుల విషయమై తాజాగా విత్త మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారుకు పంపిన లేఖ మరింత అయోమయంలో పడేసింది. పూర్తి చేసిన పనులకుగాను రూ.828 కోట్లు విడుదల చేస్తూ, ఇంకా ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లేనని బాంబు పేల్చింది. 2013-14 ధరల ప్రకారం రూ.20 వేల కోట్ల అంచనాకే కట్టుబడి ఉన్నట్లు మరోమారు స్పష్టం చేసింది. సవరించిన సవివర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) మేరకు ఇంకా కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా ఆ ప్రస్తావన చేయ లేదు. అంతకుముందు పార్లమెంట్‌లో ఇద్దరు జలశక్తి మంత్రులు ప్రాజెక్టు ఎత్తుపై తలొక మాటా మాట్లాడారు. లోక్‌సభలో మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ జోషి సమాధానమిస్తూ తొలి దశలో ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లేనన్నారు. రాజ్యసభలో మరో మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబు చెబుతూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ఎత్తు 45.72 మీటర్లుగా చెప్పు కొచ్చారు. కొత్త డిపిఆర్‌పై దాటవేశారు. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా సంతరించుకున్న ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరి స్తున్న తీరు దాని బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుంది.
పోలవరాన్ని ఆది నుంచీ కేంద్రం వివాదాస్పదం చేస్తోంది. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌నే భరిస్తాం నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని భీష్మిస్తోంది. ప్రాజెక్టు అంటేనే నిర్వాసితులతో కలిపే ఉంటుంది. కేంద్రం ఈ అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాన్ని విస్మరించడం అమానవీయం. ప్రతిపాదిత ఎత్తులో ప్రాజెక్టును నిర్మిస్తే 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. అత్యధికులు గిరిజనులే. కాంటూరు లెక్కల్లో శాస్త్రీయత లేదనడానికి మొన్న గోదావరికి వచ్చిన వరదలే ఉదాహరణ. అంచనాలను దాటి ఎక్కువ ప్రాంతాలు కొద్దిపాటి వరదలకే మునిగాయి. పునరావాస కాలనీలు సైతం మునిగాయి. కాంటూరు లెక్కలు తప్పుల తడకలని తేలిపోయింది. ప్రభుత్వ గణాంకాల బట్టి చూసినా ఇప్పటికి 22 శాతానికే పునరావాసం పూర్తయింది. అదీ అసం పూర్తిగానే. జాతి అభివృద్ధికి తమ సర్వస్వం ధారపోసిన లక్షలాది నిర్వాసితుల పునరావాసాన్ని గాలికొదిలేయడం హేయం. పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడి నిధులు సాధించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లుంటోంది. కేంద్రం వద్దకెళ్లి నిధులడుగుతున్నాం అని చెపుతు న్నారంతే. మొన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన పనులకు రూ.2,600 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడిరచగా,కేంద్రం ఇచ్చింది రూ.828 కోట్లు మాత్రమే. కొత్త డిపిఆర్‌ ఆమోదానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు అత్యవ సరంగా రూ.15 వేల కోట్లివ్వండని అడగ్గా, కొత్త డిపిఆర్‌ను బుట్టదాఖలు చేశామని కేంద్రం లేఖ పంపింది. అలాగే 2005 అనంతరం 18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదంది. కేంద్రం రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేస్తున్నా గట్టిగా ఒత్తిడి ఎందుకు చేయరో తెలీదు. నిర్వాసితుల పునరా వాసంపై తొలిదశ, మలిదశ, అని వక్ర భాష్యా లు చెపుతున్న కేంద్రానికి రాష్ట్ర సర్కారు వంత పాడటం అభ్యంతరకరం. 2017-18 ధరలకనుగుణంగా రాష్ట్రం రూ.55 వేల కోట్లకు కొత్త డిపిఆర్‌ పంపగా సాంకేతిక సలహా మండలి ఆమోదించింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ రూ.47 వేల కోట్లకు కుదించింది. నిర్వాసితుల పునరావాసానికే రూ.30 వేల కోట్లు కావాలి. ఈ భాగాన్ని ఎగ్గొట్టేందుకు కేంద్రం పన్నాగం పన్నుతోంది. రాష్ట్రం గమ్మునుంది. నిర్వాసి తులందరికీ పునరావాసం కల్పించాకే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న అంతర్జాతీయ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించి ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఎన్నికల వాగ్దానం ప్రకారం రాష్ట్ర సర్కారు నిర్వాసి తులకు రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం విభిన్నమైన ప్రకటనలు చేస్తూ గోదావరి నది పరీవాహకంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలను గందరగోళంలోకి నెట్టివేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై లోక్‌ సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరో విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో ఏది నమ్మాలో, ఏది నిజమో అన్న సందేహాలు ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గోదావరి నదీ జలాల వివాద పరిష్కారాల ట్రి బ్యునల్‌ 1980లో ప్రకటించిన అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి నీటినిలువ సామర్థం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఎత్తు 45.72మీటర్లు అని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడిరచారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎంతో తెలపాలని రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్‌ అడిగిన ప్ర శ్నకు మంత్రి లిఖితపూర్వకంగా బదులిచ్చారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూన్నట్టుగా ఎపి ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడిరచారు. అంతకుముందు ఇదే సెషన్స్‌లో పోలవరం ఎత్తుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపి సత్యవతి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ బదులిస్తూ పోలవరం ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకే పరిమితం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తుపై ఉభయ సభల్లో కేంద్ర మంత్రుల చేత భిన్నమైన ప్రకటనలు చేయించడం గందరగోళ పరిస్థితు లకు దారితీస్తోంది.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌,ఒడిశా రాష్ట్రాలతో ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టు సమస్యలో కేంద్రప్రభుత్వం చేసిన ఈ విధమైన ప్రకటనల్లో దేన్ని నమ్మాలో , ఏది నిజమో అన్న సందేహాలు పుటుకొస్తున్నా యంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని చూస్తున్నారని,దీన్ని సహించేది లేదని ఇప్పటికే ఎపిలో ప్రజాసంఘాలు కేంద్రా నికి హెచ్చరికలు చేశా యి. పోలవరం ప్రాజెక్టు లో ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేప థ్యంలో ఇప్పడు కేంద్రం పోలవరం ఎత్తుపై మరింత స్పష్టత ఇచ్చేలా ప్రకటన జారీ చేయాలని గోదావరి నది పరివాహక నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పోలవరం తుది నివేదికపై సుప్రీంకు కేంద్రం లేఖ పోలవరం ముంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సోమవారం సు ప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. పిటిషన్ల విచారణపై వాయిదా కోరుతూ వినతిపత్రం సమర్పించింది. పోలవరం ప్రాజెక్టుముంపు సమస్యపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. పోలవరం ప్రాజెక్టువల్ల వరద ముంపు తలెత్తుతున్నందున ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూపాలని తెలంగాణ,చత్తిగఢ్‌,ఒడిశా రాష్టాల ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటీషన్ల ్ల విచారణ నేపద్యంలో కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ లేఖ రాసింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖమంత్రి సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని, ఈ పరిస్థితుల దృష్టా మరో మూడు నెలల పాటు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ,తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం పడుతుందని కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబర్‌ 6న సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గోదావరి నదీ పరివాహకంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే కల్పించుకుని అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు మరికొంత సమయం కావాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థ్ధించింది.
ఇస్తామన్న పరిహారానికి దిక్కూమొక్కు లేదు
పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం మాట మరిచారు. పెండిరగ్‌ల పరిష్కారం లేనేలేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోనే ప్రస్తుతానికి ఊళ్లను ఖాళీ చేయించి నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుక్కునూరు, పోలవరం, వేలేరు పాడు మండలాల్లో నిర్వాసితుల కుటుం బాలను గుర్తించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పటికే దాదాపు 13 చోట్ల పోలవరం నిర్వాసిత పునరా వాస కాలనీలకు శ్రీకారం చుట్టారు. జంగారెడ్డిగూడెం సమీపాన ఉన్న చల్లావారిగూడెంలో అత్యధికంగా ఆరు వేల కుటుంబాలకు సరిపడా 650 ఎకరాలను సేకరించి కాలనీకి శ్రీకారం చుట్టారు. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లోను ఇదే తరహాలో 2019 వరకు పునరావాస కాలనీలు కాస్తంత వేగంగానే సాగాయి. ఆ తదుపరి ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం,కామయ్యపాలెం,రాచన్న గూడెం, ఎర్రవరం,దర్పగూడెం,రౌతుగూడెం,ములగలం పల్లి, స్వర్ణవారిగూడెంలలో కాలనీల నిర్మాణాలు చేపట్టినా ఇప్పటికే ఐదు గ్రామాల్లో కాలనీలకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. తమకు చెల్లించాల్సిన పరిహారం చేతికందనిదే తాము కాలనీలకు వెళ్ళబోమని నిర్వాసితులు భీష్మించారు. ఫలితంగా రాచన్నగూడెం,ఎర్ర వరం,దర్పగూడెం,రౌతుగూడెంలలో నిర్వాసిత కుటుంబం ఒక్కటంటే ఒక్కటి రాలేదు. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేటలో 400 గృహాలతో కాలనీ నిర్మించగా,అక్కడ నిర్వాసిత కుటుంబాలు అనేకం వచ్చి చేరాయి. అలాగే బుట్టాయిగూడెం మండలంలో ముప్పినవారి గూడెం,దొరమామిడి,రామన్నగూడెం, రెడ్డి గణపవరం వంటి గ్రామాల్లో దాదాపు 1500 నిర్వాసితగృహాలు నిర్మించాల్సి ఉండగా,వీటిలో పది శాతం కూడా ఇళ్ళు పూర్తికాలేదు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ముప్పుతిప్పలు పడినా ఫలితం దక్కలేదు. ఏకంగా వివిధ శాఖలకు లక్ష్యాలు విధించినా కాలనీలు మాత్రం పూర్తి చేయలేకపోయారు.దీంతో ఒకవైపు నిర్వాసిత కుటుం బాల్లో అసంతృప్తి గూడు కట్టుకునే ఉంది. పోలవరం నిర్వాసితుల్లో గిరిజన కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద 6లక్షల 86 వేలు,గిరిజనేతరులకైతే ఒక్కొ కుటుంబానికి 6లక్షల 36వేలు చెల్లించాల్సి ఉంది. వీటిలో చాలా కుటుంబాలకు పూర్తి పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నివేదికల పేరిట అధికారులు తాత్సారం చేస్తే ఆర్థిక వైఫల్యంతో ప్రభుత్వం మరో జాప్యం చేసింది.
మూడేళ్లయినా మాట నిలబెట్టుకోలేదు
తాము అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసిత కుటుంబాలన్నింటికీ పది లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికి మూడేళ్లుగా అధికారం వెరగబెడుతున్నా మాటెందుకు నిలుపుకోలేదని పోలవరం నిర్వాసితులు నేరుగానే ప్రశ్నిస్తు న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిధిలోకి వచ్చే గ్రామాలన్నింటిలోనూ ఒక్కొ కుటుంబానికి 2006 నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో పరిహార ప్రకటన, అందచేత దిగుతూ వచ్చారు. 2019కు ముందే జగన్మో హన్‌ రెడ్డి అప్పటికే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద గిరిజన, గిరిజనేతర కుటుంబాలన్నింటికీ పది లక్షలకు తగ్గకుండా పరిహారం అందచేసి తీరుతామని ఎన్నికల ప్రచార సభల్లో జగన్మోహన్‌ రెడ్డి పదేపదే హామీలు ఇచ్చారు. ఈ మేరకు ఆయా నిర్వాసిత కుటుంబాల నుంచి ఒత్తిడి పెరగడంతో గతేడాది జూన్‌ 30వ తేదీన జీవోఆర్‌టి-224 జారీ చేస్తూ ఒక్కొ కుటుంబానికి పది లక్షలు చొప్పున పరిహారం అందించేందుకు 550 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో నిర్వాసిత కుటుంబాలు సంబరాల్లో మునిగి తేలాయి. కాని ఏడాది కావస్తున్నా జీవో 224 అమలుకే నోచుకోలేదు. ఇదిగో అదిగో అంటూ కాల యాపన చేశారు. కాని తాజాగా పోల వరం ప్రాజెక్టు పరిధిలో 41.15 కాంటూరు పరిధిలో ఉన్న గ్రామాలన్నిం టినీ పూర్తిగా ఖాళీ చేయిం చడమే కాకుండా ఏవైతే కుటుంబాలు నిర్వాసిత కాలనీలకు చేరుకుంటాయో ఆ కుటుంబాలకు మాత్రమే ఇప్పటికే ఇచ్చిన ఆర్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు మిగతా మొత్తం కలిపి పది లక్షలు చెల్లిస్తామంటూ ఇప్పుడు కొత్త మెలిక పెట్టారు. దీనిపైనే నిర్వాసితుల్లో ఆగ్రహం, అసంతృప్తి పెల్లుబికుతోంది. ఎన్నికల ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేసేదేమి టంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.ఇప్పటికే కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లో దాదాపు నిర్వాసిత కుటుంబాలన్నింటికీ ముందస్తు ప్యాకేజీ ప్రకారం వరుసగా 6 లక్షల86 వేలు,6లక్షల 36 వేలు చెల్లిస్తూ వచ్చారు. అంతేతప్ప మిగతా మొత్తాన్ని చెల్లించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తాము నిర్వాసిత కాలనీలకు వెళ్ళబోమని, తమకు చెల్లించాల్సిన మొత్తం చేతికందిన తరువాతే పిల్లాపాపలతో కాలనీలకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలనీలు ఎక్కడికక్కడ బోసిపోయి కనిపిస్తు న్నాయి. దీనికితోడు మౌలిక వసతుల కల్పన లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ సౌకర్యం పూర్తిగా కల్పించకపోయినా కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణం సాగకపోయినా ఊరు నుంచి పదేపదే పొమ్మనడం ఏమిటంటూ నిలదీస్తున్నారు.
ఉన్న ఇల్లు సంగతేంటి
పరిహారం మాట అటుంచి తాము ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్ళకు 2017లోనే నష్టపరి హారం అంచనా కట్టారు. ఒక్కొక్క ఇంటికి దాదాపు రెండు నుంచి పది లక్షల వరకు ఆపైబడి కూడా ఇంకా చెల్లించాల్సి ఉంది. కాని అదేమీ ఇప్పుడు మాట వరుసకైనా నోరెత్తకుండా వ్యవహరించడాన్ని నిర్వాసితులు తప్పుపడు తున్నారు. ఎన్నో ఏళ్ళుగా కాపురం చేసిన ఇళ్ళకు లెక్కకైతే కట్టారుకాని, పరిహారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం కాపురాలు ఉంటున్న వారంతా అక్కడి నుంచి ఖాళీ చేస్తేనే తప్ప పరిహారం ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు.కాలనీలకు వెళ్ళాలంటే ముందుగా పరిహారం చెల్లించాలని నిర్వాసితులు..లేదులేదు మీరు ఊరు నుంచి కాలనీలకు వెళ్తేనే పరి హారం ఇస్తామంటూ అధికారులు పట్టుపడుతున్నారు.
ఆర్థిక శాఖ అంగీకరిస్తేనే…
పోలవరం నిర్మాణం కోసం అంచనా వ్యయాన్ని రూ.47,725 కోట్లకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి ఆమోదం లభించింది.అది జరిగి రెండేళ్లు పూర్తయింది. అయినాగానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో కొర్రీలు వేస్తున్నారు. పీపీఏ ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలి. జలశక్తి శాఖ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి ససేమీరా అనడంతో ఈ వ్యవహారం పెండిరగులో పడిరది. ప్రస్తుతం కేంద్రం నాబార్డు ద్వారా ఇస్తున్న నిధులతో పనులు సాగుతున్నాయి. కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబడు తోంది. 2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు. అంతే కాకుండా, అప్పటివరకూ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది.‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో సెక్షన్‌-90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది’’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్‌ కాగా, రెండోది విద్యుత్‌ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో నైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. కానీ పోలవరంలో దానికి భిన్నంగా కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే అనడం సమజసం కాదు. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంచనాలు సవరించేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను’’ అంటూ ఏపీ సీఎం నేరుగా ప్రధానికి విన్నవించారు.
‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు’
‘‘పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం పూర్తి చేస్తుందనే నమ్మకం లేదు.రివర్స్‌ టెండరింగ్‌ అంటూ అన్నీ రివర్స్‌లో నడుపుతోంది. 2024లోగా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి చేయకుండా డెడ్‌ స్టోరేజ్‌ నుంచి నీటిని లిఫ్ట్‌ చేయాలనే ప్రతిపాదనలు చేయడం సరికాదు. దానివల్ల గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుంది. అలాంటి ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాం. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’ అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యన్నారాయణ. మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనులను జగన్‌ ప్రభుత్వం ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని విమర్శించారు. ఏడాది క్రితం పోలవరం పనులను కవరేజ్‌ చేసిన సమయంతో పోలిస్తే, ప్రస్తుతం స్పిల్‌ వే అందుబాటులోకి రావడంతో పోలవరం స్పిల్‌ చానెల్‌ ద్వారానే గోదావరి ప్రవాహం సాగుతోంది. మొన్నటి వరదల సమయంలో 22 లక్షల క్యూసెక్కుల పైబడిన గోదావరి నీటిని ధవళేశ్వరం బ్యారేజ్‌ వైపు దిగువకు వదిలారు. దానికి అనుగుణంగా అప్రోచ్‌ చానెల్‌ సహా అన్నింటినీ ఈ కాలంలో సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది.

వైజాగ్‌లో జరగనున్న జీ`20 దేశాల సదస్సు

సిటీ ఆఫ్‌ డెస్టినేషన్‌ విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిస్తోంది. ఇప్పటికే మార్చి 3, 4 తేదీల్లో ఏపీ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ అట్టహాతంగా నిర్వహించింది. మళ్ళీ ఇదే నెలాఖరు 28,29 తేదీల్లో జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన నాటినుంచి భారత్‌.. పెద్ద ఎత్తున సన్నాహక సదస్సులతోపాటు, పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు వేదిక కాబోతోంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.సైమన్‌ గునపర్తి
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు జీ-20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రాయ బారులు,కేంద్ర,రాష్ట్ర మంత్రులు,సీఎం జగన్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సదస్సు నిర్వహణకు విశాఖలో రెండు స్టార్‌ హోటళ్లను గుర్తించారు. అతిథుల కోసం నగరంలోని వివిధ స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు.నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.ఈ సమా వేశాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రాచుర్యం దక్కనుంది. భారతదేశం అధికారికంగా డిసెంబర్‌ 1,2022న G20 అధ్యక్ష పదవిని చేపట్టింది.జీ20 సదస్సు కోసం 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహిం చేలా ప్లాన్‌ చేస్తోంది.డిజిటల్‌ పరివర్తన,హరిత అభివృద్ధి,మహిళా సాధికారత,యువత, రైతులు లాంటి అంశాలతో సదస్సులు నిర్వహిస్తున్నారు. జీ20 సదస్సులు జరగనున్న నేపధ్యంలో రూ.150కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయిం చింది.12శాఖల ఆధ్వర్యంలో ఈపనులు జరుగుతున్నాయి.నగరంలోని పర్యాటక ప్రదే శాలను సుందరంగా తీర్చిదిద్దడం,రహదా రులను అభివృద్ధిచేయటం,తదితరాల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నారు.నగరంలో రూ.74.46కోట్లతో 202.91కిలోమీటర్ల నిడివి రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌, (జీవీ ఎంసీ),విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డవల్‌ పెంట్‌ అథారిటీ సంస్థ (వీఎం ఆర్‌డీఏ),పోర్టు, జాతీయ రహదారుల సంస్థ,ఆర్‌అండ్‌బీశాఖల తరపున ఆయా యప నులు చేపడుతున్నారు. సిగ్నల్స్‌ను మెరుగుపరచ డానికి రూ.9.92 కోట్లు, పచ్చదనం అభివృద్ధికి రూ.3.25కోట్లు, సాధారణ పనులకు రూ.17.67కోట్లు, వేదికల వద్ద వసతుల కల్పనకు రూ.5కోట్లు, ఎగ్జిబిషన్ల నిర్వహణకు రూ.15కోట్లు ప్రతినిధులకు వసతి, ఆహారం,ఇతర సదుపాయాలకు రూ.7కోట్లు, మొబైల్‌ టాయ్‌లెట్ల ఏర్పాటుకు రూ.కోటి, పర్యాటక ప్రదేశాల సందర్శన,సాంస్కృతిక కార్యక్రమాలు, బొర్రా గుహలు,ఇతర పర్యాటక ప్రదేశాల వద్ద వసతుల కల్పనకు రూ.10కోట్లు, ఐటీ,కమ్యూనికేషన్లకు రూ.2కోట్లు,రవాణా వాహనాల కోసం రూ.3కోట్లు, ప్రొటోకాల్‌, భద్రతకు రూ.2కోట్లు,చొప్పున నిధులు అవసర మని అధికారులు అంచనా వేశారు. మార్చి 28,29 తేదీల్లో జరిగే జీ20 సన్నాహక సదస్సుకు 45దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. వారి కోసం నగరంలో పలు స్టార్‌ హోటళ్లులో గదులు తీసుకున్నారు. సదస్సు ఏర్పాట్లు,వసతుల కల్పనలో 15ప్రభుత్వ శాకలు భాగస్వాములయ్యాయి..
జీ-20 సదస్సు (గ్రూప్‌ ఆఫ్‌ గ్లోబల్‌ )అంటే ఏంటీ ?
అత్యంత శక్తిమంతమైన 17వ జి-20 సదస్సు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈ సమావేశాలు వచ్చే ఏడాది భారత్‌లోని ఆంధ్ర ప్రదేశ్‌ విశాఖపట్నంలో నిర్వహించడం ప్రతిష్టా త్మకం.పోటీ పరీక్షల దృష్ట్యా అంతర్జా తీయ సంబంధాల్లో భాగంగా జీ-20 సదస్సుపై ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో జీ-20 ఏర్పాటు,సభ్యదేశాలు,లక్ష్యాల గురించి తెలుసుకుందాం!
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు,అతి వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు. ఇది అంతర్జాతీయ సంస్థల్లో అత్యంత శక్తిమంతమైంది. ప్రపంచ జనాభాలో మూడిర ట రెండొంతులు, ప్రపంచ జీడీపీలో 85శాతం వాటాను జీ20 కలిగి ఉంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం జీ-20 వేదికపైన కనిపిస్తాయి. అధిక జనాభా కలిగి ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాల కూటమినే గ్రూప్‌ ఆఫ్‌ 20 లేదా జీ20 అంటారు.1997లో తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం చాలా దేశాలపై ప్రభావం చూపడంతో ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూప్‌ ఏర్పాటు చేయాలని భావించాయి. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలతో కూడిన గ్రూప్‌ ఆఫ్‌ ఎయిట్‌ (జీ-8) బృందాన్ని విస్తరించి చైనా బ్రెజిల్‌,సౌదీ అరేబియా తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను చేర్చారు. సభ్య దేశాలు 19,యూరోపియన్‌ యూనియన్‌ తో కలిపి జి20గా పేర్కొంటారు. మొదటిసారి 1999లో బెర్లిన్‌లో సమావేశ మయ్యారు. మొదట్లో జీ-20 సదస్సుకు ప్రధా నంగా ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్ర ల్‌ బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యేవారు. 2008 లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పరిస్థి తుల్లో మార్పు వచ్చింది. బ్యాంకులు కుప్పకూ లడం,నిరుద్యోగం పెరగడం,వేతనాల్లో మాం ద్యం నెలకొనడంతో జీ20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారింది.జీ-20 ప్రభుత్వాల అధినేతలు 2008 నుంచి సభ్య దేశాల్లో సమావేశం అవుతున్నారు. తొలి సదస్సు అమెరికా రాజధాని వాషింగ్జన్‌ డి.సి.లో జరి గింది. వాస్తవానికి జి20 ప్రధాన కార్యాలయం వంటిది ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చేస్తుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది.ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభ జించారు. గ్రూపుల వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. జీ-20 దేశాల అధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమైతే, ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు రెండుసార్లు సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సంస్థలు వరల్డ్‌ బ్యాంక్‌,ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌వో,ఐఎంఎఫ్‌,డబ్ల్యూటీవో, ఫైనాన్షి యల్‌ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లు పాల్గొంటాయి. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల మొదటి పర్సనల్‌ ప్యానల్‌ సమావేశం ఇండోనేషియా నేతృత్వంలో 2022,ఫిబ్రవరి17,18వ తేదీల్లో జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఫిబ్రవరి 17న భారత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతా రామన్‌ ప్రసంగించారు.
డ్రాప్ట్‌ స్టేట్‌మెంట్‌
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ జీ-20 సదస్సులో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికపై సదస్సులో చర్చించారు. ఉక్రెయిన్‌ నుంచి రష్యా తన సైన్యాన్ని బేషరతుగా పూర్తిస్థాయిలో ఉపసం హరించుకోవాలన్న డిమాండ్‌ను ప్రస్తావించారు. జీ-20 సదస్సుకు రష్యా తరఫున విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌ హాజరయ్యారు.
డిక్లరేషన్‌
శాంతి స్థాపన,కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ20 దేశాలు పిలుపునిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి తెరపడాలి. ఈ యుద్ధం కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని డిక్లరేషన్‌ పేర్కొంది.ఘర్షణల శాంతియుత పరిష్కారం,సంక్షోభ నివారణకు కృషి,చర్చలు ఇప్పుడు కీలకం. ఇది యుద్ధాలు చేసుకొనే శకం కాదని సభ్యదేశాలు పేర్కొన్నా యి. ఉగ్రవాదానికి నిధులందించే కార్యక లాపాల కట్టడికి దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చాయి. మనీ లాండరింగ్‌?ను నిరోధించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిం చడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని సంయు క్తంగా ప్రకటించారు. మరోవైపు కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యలపై కూడా సమావేశం చర్చించింది. లక్ష్యాలు ా సుస్థిరాభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సభ్య దేశాల మధ్య సహకారాలను పెంపొందించడం ా భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలు పునరావృతం కాకుండా ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టడం ా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునికీకరించడం, సభ్య దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం సభ్యదేశాలు : అర్జెంటీనా,ఆస్ట్రేలియా,బ్రెజిల్‌, కెనడా,చైనా,ఫ్రాన్స్‌,జర్మనీ,ఇండియా,ఇండో నేషియా,ఇటలీ,జపాన్‌,దక్షిణ కొరియా,రష్యా, మెక్సికో,సౌదీఅరేబియా,దక్షిణాఫ్రికా,టర్కీ, గ్రేట్‌? బ్రిటన్‌,అమెరికా,యూరోపియన్‌ యూనియన్‌. 2008 నుంచి స్పెయిన్‌ శాశ్వత ఆహ్వానిత దేశం.జీ20లో పాకిస్థాన్‌ లేదు. అంకురార్పణ ఇలా ... 1999లో బెర్లిన్‌లో తొలి జీ-20 సదస్సు జరిగింది. ఆ సమయంలో తూర్పు ఆసియా ఆర్థిక లోటుతో సతమతమైంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. 2008లో మొదటి సమావేశం జరిగింది. తర్వాత ఏడాదికోసారి భేటీ అవుతుంది. బెర్లిన్‌లో జరిగిన తొలి సమావేశానికి ఆయా దేశాల ఆర్థికమంత్రులు, రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్లు హాజరయ్యారు. అయితే 2008లో ఆర్థికమాంద్యం రావడంతో జీ-20 సదస్సుకు ఆయా దేశాల అధ్యక్షులు హాజరవుతున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ దెబ్బతిని,నిరుద్యోగం పెరగ డంతో ప్రత్యామ్నాయ మార్గాలపై నిర్ణయం తీసుకొనేది అధినేతలే కాబట్టి ..దాంతో అధినేతలు సమావేశమవుతున్నారు. ఆర్థికమే మూలం .. జీ-20 సదస్సులో ఆయా దేశాల అధినేతలు ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తారు.తమ తమ వ్యుహలను సభ్యదేశాల అధినేతలతో పంచు కుంటారు. వాణిజ్యం, వాతావరణ మార్పులపై ఈసారి ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ట్రంప్‌, జీనీ పింగ్‌,ట్రంప్‌, మోడీ మధ్యయ పన్నులు తదితర అంశాలపై కీలక డిస్కషన్స్‌ జరుగనున్నాయి. ఇంగ్లాండ్‌ ప్రధానిగా రాజీ నామా చేసిన థెరెసా మే కూడా సమావే శానికి హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆమె వివిధ అంశాలపై కూలం కషంగా మాట్లాడ తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కీలకం గా ప్రస్తావన ఉంటుంది. సదస్సులో వివిధ అంశాలపై ఒప్పందం చేసుకొని ..తర్వాత అధినేతలు ఫోటోలు దిగుతారు.ఆ ఫోటోలు వివిధ అంశాలపై చర్చలకు సంబంధించి సాక్షిభూతంగా నిలుస్తాయి.గతేడాది కొందరు అధినేతలు సౌదీ రాజుతో కరచాలనం చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా56 నగరాల్లో 200 సమావే శాలు నిర్వహించేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. అందులో ఏపీ నుంచి విశాఖకు అవకాశం దక్కింది. అతిధుల కోసం స్టార్‌ హోటళ్లలో 300 గదులను బుక్‌ చేస్తున్నారు. మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సు కు సంబంధించి అధికారుల బృందంకు నాయకత్వం వహిస్తు న్నారు. సదస్సులె సీఎం జగన్‌ తో సహా కేంద్ర మంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులు,ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. డిజిటల్‌ ఇండియా..హరిత అభివృద్ధితో పాటుగా మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు. వివిధ దేశాల నుంచి జీ-20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణకు నిర్ణయించారు. ఇప్పటికే మార్చి 3,4 తేదీల్లో నిర్వహించిన విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ గ్రాండ్‌ సెక్సెస్‌ అయ్యింది. విశ్వనగరిగా విశాఖ సుందరీకరణ సహజ అందాల ప్రకృతి నిలయం తీరప్రాంత నగరం విశాఖపట్నానికి రాజధాని కళ సంత రించుకుంటోంది.విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చబోతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి విశాఖ విశ్వనగరిగా అదనపు హంగులు సమకూర్చు తున్నారు. అంతర్జాతీయ బ్రాండిరగ్‌ కల్పిం చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. దీనికి తోడుగా వరుసగా అంతర్జాతీయ కార్య క్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన మెట్రో సిటీ (మోస్ట్‌ హ్యాపె నింగ్‌ సిటీ) విశాఖ ఖ్యాతి జాతీయ,అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.జీ.20సమావేశాలు రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ సమావేశాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రాచుర్యం దక్కనుంది. ఈ సదస్సుకు విచ్చేసే జాతీయ,అంతర్జాతీయ ప్రతినిధులకు విశాఖ బ్రాండ్‌ ఉట్టిపడేలా వారికి అతిథి మర్యాదులు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లిఖార్జున,జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజుబాబు,నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ పర్యవేక్షణలో నగర సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయా పనులు తుదిదశకు చేరుకుం టున్నాయి.ఈనేపథ్యంలో విశాఖనగరం అంతర్జాతీయ వేడుకలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుం టోంది. సాగర్‌తీరం,ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌, విశాలమైన రోడ్లు,విమానసర్వీసులు అందుబాటులోఉండ టంతో విశాఖ ప్రపంచదేశాలను ఆకట్టుకునే విధంగా ముస్తాబువుతోంది. ప్రభుత్వాధినేతలు విశాఖపైనే ఫోకస్‌ పెట్టడంతో వైజాగ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ రోజురోజుకీ రెట్టింపవుతోంది. ఇప్పటికే గతనెల జనవరి 68వరకు గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌,20,21న ఇన్ఫినిటీ ఐటీ సమ్మిట్‌, ఈనెల16,17తేదీల్లో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ జరిగిన జాతీయ,అంతర్జాతీయ సమావేశాలకు విశాఖ వేదిక కావడం దీనికి నిదర్శనం.
విశాఖ బీచ్‌లకు అదనపు హంగులు
రామకృష్ణా బీచ్‌ నుంచి భీమిలీకి వెళ్లే మార్గాన్ని మరింత సుందరంగా మార్చబోతున్నారు. ఈబీచ్‌రోడ్డు వెంట అదనపు హంగులను సమకూర్చారు.రుషికొండ,జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌,మధురవాడ,వుడా కాలనీ, సీతమ్మధార, బుచ్చిరాజుపాలెం, మద్దిళ్లపాలెం, బీఆర్‌టీఎస్‌ రోడ్డు,మహారాణి పేట సహా పలు ప్రాంతాల్లో సుందీరకరణ పనులు చేపట్టారు. మార్చి నెలలో జరగనున్న జి-20 సదస్సునకు జరుగుతున్న అభివృద్ధి,సుందరీకరణ పనులు త్వరితగతిపై ఇప్పటికే రాష్ట్ర మునిసిపల్‌ శాఖ కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి,సముద్ర తీర ప్రాంతాలలో రెండు సార్లు పర్యటించి నగర సుందరీకరణపై పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.జీ-20 సదస్సు నకు దేశ విదేశాల నుండి అధిక సంఖ్యలో అతిధులు,ప్రతినిధులు నగరానికి విచ్చేయనున్న నేపథ్యంలో విశాఖఖ్యాతి,సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భు తంగా వివిధఆకృ తులతో కూడినబొమ్మలు ఏర్పాటు,ఉన్న ప్రతిమలకు రంగులు అద్దిఅలంక రించడం, విద్యుత్‌ దీపాలం కరణలు,రంగు రంగుల మోడరన్‌ పెయింటింగలు, కల్చర్‌ఆర్ట్‌లతో వివిధ ఆకృ తులతో కూడిన మొక్కలు -చెట్ల్లు కటింగ్‌,వాటికి ఆకర్షణీయమైన రంగులు అద్దడం,పరిశుభ్రంగా రోడ్డులు నిర్వహణ, ఫుట్‌పాత్‌ ఆధునీ కరణ,నిరంతరం పారిశుధ్య పనులు పర్యవేక్షణ వంటి పనులపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని ప్రదేశాల్లో లాండ్‌ స్కేప్స్‌,వాటర్‌ ఫౌంటైన్స్‌, పార్కింగ్‌,వాల్‌ పెయింటింగ్స్‌,పబ్లిక్‌ టాయిలెట్స్‌, ఏర్పాటు చేస్తున్నారు.దీంతో పాటు ఉద్యాన వనాలు, బీచ్‌లు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దు తున్నారు.విదేశాల నుండి వస్తున్న అతిధులకు నగరం అందాలతో అబ్బుర పరచేటట్లు ఆకర్షితంగా ఈ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాడానికి అన్నీ హంగులతో సుందరీ కరిస్తున్నారు. రూ.150కోట్లతో నగర సుందరీకరణ పనులు
జీ`20 సదస్సులు జరగనున్న నేపధ్యంలో రూ.150కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయిం చింది. నగరంలో రూ.74.46కోట్లతో 202.91కిలోమీటర్ల నిడివి రహదారులను అభివృద్ధిచేస్తున్నారు.సిగ్నల్స్‌ను మెరుగుపరచ డానికి రూ.9.92కోట్లు,పచ్చదనం అభివృద్ధికి రూ.3.25కోట్లు,సాధారణ పనులకురూ.17.67 కోట్లు,వేదికల వద్ద వసతుల కల్పనకు రూ.5కోట్లు,ఎగ్జిబిషన్ల నిర్వహణకు రూ.15కోట్లు ప్రతినిధులకు వసతి,ఆహారం,ఇతర సదుపా యాలకు రూ.7కోట్లు,మొబైల్‌ టాయ్‌లెట్ల ఏర్పాటుకు రూ.కోటి,పర్యాటక ప్రదేశాల సందర్శన,సాంస్కృతిక కార్యక్రమాలు,బొర్రా గుహలు,ఇతర పర్యాటక ప్రదేశాల వద్ద వసతుల కల్పనకు రూ.10కోట్లు,ఐటీ, కమ్యూనికేషన్లకు రూ.2కోట్లు,రవాణావాహనాల కోసంరూ.3కోట్లు,ప్రొటోకాల్‌,భద్రతకు రూ.2కోట్లు,చొప్పున నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. నగరంలోని పలు ప్రధానమార్గాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న ప్రహారీ గోడలకు అందమైన బొమ్మలను చిత్రీ కరించారు. నగరంలో ముందుజాగ్రత్త చర్య లను సీపీ శ్రీకాంత్‌ నేతృత్వంలో కొత్తగా 20 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చ నున్నారు. ఇంటర్నేషల్‌ ఈవెంట్స్‌తో విశాఖ నగరం కొత్త అందాలు జీ20 సమావేశాలతో విశాఖ నగరం ప్రపంచస్థాయి గుర్తింపు పొందడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ విశ్వప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకా శాలు కన్పిస్తున్నాయి. రాజధాని అంశం కోర్టులో ఉన్నప్పటికీ సీఎం జగన్‌ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా తీర్చి దిద్దాలని పట్టుదలతో ఉన్నారు. అంతర్జాతీయ సమావేశాలతో విశాఖలోనే రాష్ట్రస్థాయి,జిల్లా స్థాయి అధికార యంత్రాంగం బిజీబిజీగా గడపబోతున్నారు.

నిర్మలమ్మ బడ్జెట్‌(20232024) ఆశల ఆవిరి

75 ఏండ్లు పూర్తయిన స్వతంత్ర భారత తొలి బడ్జెటును నేను ప్రవేశ పెడుతున్నా’ అని గొప్పగా చెప్పిన విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ కేటాయింపులకు వచ్చేసరికి పెదవి దాట లేదు. ప్రధానితో సహా మంత్రులం దరూ మాట మాటకు బల్లలు ఎట్ల రిథమ్‌ వచ్చేలా చర చాలని పార్లమెంట్‌ సాక్షిగా ప్రాక్టీస్‌ చేశారు. అధికార పార్టీ ఎంపీలైతే మోదీ నామాన్ని పోటీపడి స్మరించుకు న్నారు. ఇటు నిర్మలా సీతారామన్‌ కూడా అమృత్‌ కాల్‌, ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌, ప్రధానమంత్రి వికాస్‌ యోజన లాంటి పేర్లను జోడిరచి విన సొంపైన కవితలుగా కార్యక్రమాలను వల్లె వేశారు.
సప్తఋషిపేరుతో1)సమ్మిళిత అభి వృద్ధి 2)చిట్టచివరి వ్యక్తుల వరకు ఫలాలు అందడం 3)మౌలిక వసతుల కల్పన 4) పెట్టు బడులకు ప్రోత్సాహం(5)సంభావ్యతలు 6)హరి తవృద్ధి7) యువతకు చేయూతలను ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్ని కలను దృష్టిలో పెట్టుకొని ఆరాష్ట్రానికి బడ్జెట్‌ కటాయింపులు చేయడం గమనించదగ్గ విష యం.బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనకు ఏవిధమైన రోడ్‌ మ్యాప్‌లేదు.ఏకలవ్య స్కూల్స్‌ లో మాత్రం 38,800 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న10లక్షల ఉద్యోగాలను ఎప్పుడుభర్తీ చేస్తారో చెప్పలేదు. వీటి కోసం కొన్నికోట్ల మంది యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. అమె జాన్‌, మైక్రో సాఫ్ట్‌ లాంటిసంస్థలు కూడా ఉద్యోగులను తీసి వేస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎలాం టి నిధులు కేటాయించకపోవటం దురుదృష్ట కరం. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో రూ.75వేల కోట్లు ప్రకటించారు. అది కేవలం 100 నగరాలకు మాత్రమే. కానీ గ్రామీణ సడక్‌ పథకానికి కేటాయిం పులు పెరగలేదు. ఎస్టీల సంక్షేమాన్ని మరిచి 3 కోట్ల ఎస్టీ కుటుంబాలకు కేవలం 15 వేలకోట్లు మాత్రమే కేటాయించారు. చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.స్కూళ్ళ నిర్మాణానికి ఖర్చు పెట్ట రు కానీ ఎంతో ఖర్చుతోకూడుకున్న డిజిటల్‌ లైబ్రరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారట. రాష్ట్రాలకువడ్డీ లేనిరు ణాలు మరో ఏడాదిపాటు ఇస్తామన్నారు. దీనికి బడ్జెట్‌లో రూ.13.7లక్షల కోట్లు కేటాయించారు. తిరిగి చెల్లించడానికి దీనికి 50ఏండ్ల వ్యవధి ఇస్తుం డగాబీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఈ కేటా యింపులు ఉండటం గమనార్హం. నిర్మలమ్మ మాట్లాడుతూ9ఏండ్లలో తలసరి ఆదాయం రెట్టింప య్యిందన్నారు. అదే సమయంలో చైనా తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగింది. ఇటు తెలం గాణలో మూడు రెట్లు పెరిగింది. అలాగే కేవలం 23 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న అదాని గ్రూప్‌ సంపద విలువ ఈకాలంలో దాదాపు 125రెట్లు పెరిగింది.నిర్మలా సీతారా మన్‌ బడ్జెట్‌ పునాదులపై దేశ నిర్మాణం చేపట్టేం దుకు ఈ వార్షిక బడ్జెట్‌ దోహదపడుతుందని చెప్పారు. కానీ వారిమాటలు తప్ప చేతలు ఆశా జనకంగా లేవు. దేశంలో వ్యవసాయ కూలీల స్థితిగతులు మార్చిన గ్రామీణఉపాధి హామీ పథ కానికి నిధులు పెంచలేదు.ఎంతో కాలంగా ఈ పథకాన్నివ్యవసాయానికి అనుసంధానం చేయా లని,అర్బన్‌ ప్రాంతంలో కూడ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకు రావాలని కోరుతున్నా పట్టించుకోలేదు.ప్రస్తుత బడ్జెట్లో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20లక్షలకోట్లు.ఈ రంగంలో జీవనం సాగిస్తున్న56శాతం జనాభాకు ఇది ఏ మూలకు సరిపోదు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం ప్రేరణగా కిసాన్‌ సమ్మాన్‌ యోజ నను తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పుడు మత్స్యకా రుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని అనుకరించింది. మత్స్య సంపద పెంపుదలకు, మత్స్యకారులు చేపలు అమ్ముకునేందుకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, మార్కెట్‌ విస్తరణ కోసం రూ.6000 కోట్లు పెట్టుబడు లు పెట్టనున్నట్లు ప్రకటించింది. చేనేతరంగాన్ని ఆత్మనిర్భర్‌ కిందఅభివృద్ధి చేస్తా మని చెప్పటం చేనేత కార్మికులకు కొంతఉపశ మనం.అలాగే తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్‌, హరితహారానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వ నున్నది.నాణ్యమైన, ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్క లను ప్రోత్సహించడం కోసం రూ. 2,200 కోట్లు కేటాయించింది. సిరి అన్నం పథకం ద్వారా చిరుధా న్యాలను రైతులకు అందించడం మంచి పరిణా మం. తెలంగాణలో సఫలమైన గురుకుల విద్యాల యాలను ఆదర్శంగా తీసుకొని ఏకలవ్య పాఠశాల లను పెద్ద మొత్తంలో ప్రోత్సహించడం, అలాగే ఇంటింటికి నల్లా నీళ్లనిచ్చే మిషన్‌ భగీరథ లాంటి స్కీంలను కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ క్రింద దేశ వ్యాప్తంగా అమలు చెయ్యడం మంచి పరిమాణమే కానీ, తెలంగాణ కృషిని గుర్తించి, గౌరవించాలన్న కృతజ్ఞతను మాత్రం చూపలేదు.
మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకీకరణ,పెట్టుబడుల ఉపసంహరణలో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకొంటున్నది. ప్రతి ఏడాది రూ.50 వేల కోట్లకు తక్కువ కాకుండా కేంద్రఖజానాను మాత్రం నింపు కొంటున్నది. తనఅనుకూల కార్పొరేట్ల కడుపు నిం పటం కోసం ఈసారిరూ.51వేల కోట్లను సమీకరిం చాలన్న లక్ష్యాన్ని నిర్ధారించుకున్నది. అందులో భాగంగా షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ,స్టీల్‌ లిమిటెడ్‌,బి.ఇ.యం.ఎల్‌., హెచ్‌. ఎల్‌.ఎల్‌. లిఫ్కర్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీఐ బ్యాంక్‌, వైజాగ్‌ స్టీల్‌ అమ్మకానికి నిర్ణయం తీసుకోవడం దేశప్రజలకు తీరని అన్యా యం.
ప్రస్తావన లేని వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ
రాష్ట్ర విభజన చట్టం హామీల్లో భాగం గా వెను బడిన జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున కేటాయించాల్సింది.ఉత్తరాంధ్రలోని విశాఖ, విజ యనగరం,శ్రీకాకుళం జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు ఈ నిధులు కేటా యించాల్సి ఉంది. 2015 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది రూ.50 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఆ నిధులను ఆపేసింది. తాజా బడ్జెట్‌లోనూ దాని ప్రస్తావన లేదు.
అన్నదాతలకు ఆశాభంగం
జిల్లాలో 3.90లక్షల మంది రైతులు ఖరీఫ్‌,రబీ సీజన్‌లో కలిపి 6లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తమకు రాయితీలు ప్రకటిస్తుందని భావించిన అన్నదాతలకు భంగపాటే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీలపై ఎదురుచూసిన రైతాంగం ఆశలపై నీళ్లు చల్లింది.పంటల మద్దతు ధరకు సంబం ధించి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు ప్రస్తావనే లేదు. ప్రతి ఏడాది రైతులకు అందిస్తున్న రుణాల అంశం తప్ప గిట్టుబాటు గ్యారంటీ చట్టంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దేశవ్యాప్తంగా సేం ద్రీయ విధానాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటిం చింది. చిరు ధాన్యాలకు ప్రోత్సాహం, వినియోగం పెంచుతామని బడ్జెట్‌లో పొందుపరిచింది. జిల్లాలో ప్రస్తుతం 25ఎకరాల్లో చిరు ధాన్యాలను సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పంటల విస్తీర్ణం మరింత పెరగనుంది.
పిఎసిఎస్‌లపై పెత్తనం కోసమేనా?
రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాథమిక వ్యవ సాయ పరపతి సంఘాలపై పెత్తనం సాగించేలా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో ప్రస్తావన తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పిఎసిఎస్‌లను మ్యాపింగ్‌ చేయనున్నామని పేర్కొంది. పిఎసిఎస్‌లకు నూతన బైలాస్‌ రూపొందించి వాటిని బహుళార్థక సంఘా లుగా తయారు చేస్తామని చెప్తోంది.
పిఎం పివిటిజి మిషన్‌తో ఒనగూరేనా?
ఆదిమ తెగ గిరిజన కుటుంబాల్లో (పివిటిజి) సామా జిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రధాన మంత్రి పివిటిజి మిషన్‌ను ప్రారంభిస్తామని బడ్జెట్‌లో పేర్కొంది.మిషన్‌ ద్వారా గిరిజన ఆవాసా ల్లో గృహ నిర్మాణాలు, రక్షిత మంచినీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, రహదారి సౌకర్యం, పౌష్టికా హారం వంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్తోంది.
వినపడని రైల్వే కూత
రైల్వే బడ్జెట్‌ అనగానే కొన్ని నెలల ముందు నుంచీ అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు. మన ప్రాం తానికి ఏమైనా కొత్త రైళ్లు వేస్తున్నారా?,గతంలో ఇచ్చిన మోడల్‌ స్టేషన్ల హామీకి కార్యరూపం దాలుస్తుందా? రైళ్లకు అదనపు హాల్ట్‌లు కల్పిస్తున్నారా అసలు ఏం ప్రకటిస్తారోనని ప్రజలు ఉత్కంఠగా చూశారు. ముఖ్యంగా విశాఖ రైల్వేజోన్‌పై ఏదైనా ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రైల్వేపరంగా జిల్లాకు మొండి చేయి చూపింది. కొత్త రైళ్లు లేకపోగా జిల్లా మీదుగా వెళ్తూ ఆగకుండా వెళ్తున్న రైళ్లకు హాల్ట్‌లు కూడా దక్కలేదు.రైళ్ల పొడిగింపు, స్టేషన్ల అభివృద్ధి ప్రస్తావ నే లేదు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసం గాన్ని వీక్షించిన తర్వాత ఆ వివరాలేవీ కనిపించక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. జిల్లాలో రైల్వే లైన్ల అభివృద్ధి మినహా కొత్త ప్రాజెక్టులు, రైళ్ల ప్రకటన లేకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరాశ చెం దారు.
వేతనజీవులకు నిరాశే
పన్నుల విషయంలో ఈ ఏడాది బడ్జెట్‌లోనూ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆదాయపు పన్ను పరిమితినిరూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షలకు పెంచినట్లే పెంచిన కేంద్ర ప్రభుత్వం, వారికి ఇప్పటి వరకు కొన్ని సౌకర్యాలపై కల్పిస్తున్న మినహాయింపు లపై కోత పెట్టింది.పాతవిధానంలో ఉన్న హెచ్‌ ఆర్‌ఎ, సిపిఎస్‌, 80సి,80డి,ఇళ్ల రుణాలపై అంది స్తున్న మినహాయింపులను ఆపేసింది. దీంతో వేతన జీవులు బడ్జెట్‌పై తీవ్రఅసంతృప్తిని వ్యక్తం చేస్తు న్నారు.
ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ : సిఐటియు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కార్మికులు, రైతులు, శ్రమ జీవులు,సామాన్య ప్రజలకు నిరాశనే మిగిల్చిందని సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు,పి.తేజేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ధరల నియంత్రణ, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఈ బడ్జెట్‌ సహాయపడదని తెలిపారు. ప్రయివేటు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న బడ్జెట్‌ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసిడిఎస్‌, మధ్యాహ్న భోజనం, జాతీయ ఆరోగ్యమిషన్‌,జాతీయ విద్యామిషన్‌, జాతీయ జీవనోపాధుల మిషన్లను కేటాయింపులు పెంచ లేదని పేర్కొన్నారు. ఉపాధి హామీకి కేటాయింపుల్లో కోత పెట్టిందని తెలిపారు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి పెద్దఎత్తున నిధులను కేటాయించి సంక్షేమ పథకాలను కార్మికులందరికీ అమలు చెయ్యాలన్న కోర్కెనూ పట్టించుకోలేదని విమర్శిం చారు. ఇపిఎస్‌ పెన్షనర్ల కనీస పెన్షన్‌ పెంచాలని లక్షలాది మంది వద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు చేస్తున్న ఆందోళనలు కూడా మోడీ చెవికి ఎక్కలేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లోనూ రూ.61 వేల కోట్ల మేర ప్రభుత్వ సంస్థలను అమ్మాలని ప్రతిపాదిం చిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల పేరుతో బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం, బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టాలకు సవరణలు చేస్తామని చెప్తూ ప్రభుత్వరంగ బ్యాం కులు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రయివేటీకరణకు దారులు తెరిచిందని విమర్శించారు.రోడ్లు, రైళ్లు, విద్యుత్‌, టూరిజం తదితర రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించిందని తెలిపారు. ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈబడ్జెట్‌లో.గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని నేతన్నలకు జీఎస్టీ రాయితీలు కానీ, ప్రత్యేక ప్రోత్సాహకాలుగానీ ఇవ్వలేదు. తెలంగా ణకు ఒక్కటంటే ఒక్కటి కూడా పారిశ్రామికవాడను ఇవ్వలేదు. మరోవైపు, బడ్జెట్‌లో రైతులకు సంబం ధించిన కేటాయింపుల్లో భారీగా కోతపెట్టారు. ఎరు వుల సబ్సిడీలు తగ్గించడంతోపాటు గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లోకోత పెట్టారు. ఆహార సబ్సిడీలు తగ్గించారు. కేంద్ర ఆర్థికసంఘం సిఫార్సుల అమలు ఊసే లేదు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు ఉద్యోగులను భ్రమ ల్లో పెట్టేలా ఉన్నాయి తప్ప ఆశాజనకంగా లేవు. పన్నుల భారం నుంచి సామాన్యులకు లభించిన ఉపశమనం ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా భ్రమలబడ్జెట్‌. పేదల వ్యతిరేక బడ్జెట్‌. తెలంగాణకు మొండిచేయి చూపిన బడ్జెట్‌.ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కోత విధించింది.గత బడ్జెట్‌లోరూ.89,400 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.60వేలకోట్లకు కుదిం చింది. తద్వారా ఉపాధి హామీ కూలీల ఉసురు తీసే చర్యలకు పాల్పడిరది. పేదల ఆహార భద్రత కు గతేడాది రూ.2,87,194 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,97,350 కోట్లకు తగ్గించింది.ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ.. బడ్జెట్‌ లో మాత్రం దాని గురించి ఏమీ ప్రస్తావించక పోవటం శోచనీయం. గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్‌ కాలే జీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీలను ఆప్రాంతాలకే ఇస్తున్నట్లు ప్రకటించింది.అంటే తెలంగాణకు నర్సింగ్‌ కాలేజీల విషయంలోనూ మొండి చేయి చూపి మరోసారి తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత బడ్జెట్‌లో,మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగ నున్న కర్ణాటకలోని కరువు, వెనుకబడ్డ ప్రాంతాల అభి వృద్ధి కోసం రూ.5,300కోట్లను కేటాయిం చింది.అదే సమయంలో విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతా ల నిధిగా మూడేండ్ల నుంచి హక్కుగా రావాల్సిన రూ.1350కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. ఇది పక్షపాత వైఖరి కాక మరెమిటి? పీఎం కిసాన్‌ నిధి కోసం గతేడాది రూ.68వేల కోట్లు కేటాయించగా,ఈసారి60వేలకోట్లకు తగ్గించ డంతో పాటు లబ్ధి పొందే రైతుల సంఖ్యను సైతం కుదించింది. గతంలో కిసాన్‌ నిధితో11.27 కోట్ల మంది రైతులు లబ్ధి పొందగా, ఇప్పుడు ఆ రైతుల సంఖ్యను 8.99కోట్లకు తగ్గించింది.మరోవైపు రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీలో రూ.50,120 కోట్ల కోత విధించింది. రైతులు పండిరచే పత్తిని కొను గోలుచేసి మద్ధతుధర కల్పించేందుకు కాటన్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియాకు గతంలో రూ.9243 కోట్లు కేటాయిస్తే ఈసారి బడ్జెట్‌లో కేవలం ఒకలక్ష రూపా యలే కేటాయించారు. ఇది రైతులకు నష్టం చేయ డంతోపాటు కాటన్‌ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసే కుట్ర. ఇక రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు గతేడాది బడ్జెట్లో రూ.10,433 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.3,283కోట్లు కోత విధించి రూ.7, 150 కోట్లకు తగ్గించింది. దీన్ని బట్టి కేంద్రానికి రైతుల మీదున్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతున్నది. మరోవైపు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే, 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అనుమతిస్తామని షరతు పెట్టింది.అంటే బోరు బాయిల కాడ మీటర్లు పెట్టి, రైతుల ఇంటికి బిల్లు పంపించాలని చెప్పకనే చెప్పిం ది.ఈ నిబంధన వల్ల మన రాష్ట్రానికి మరో రూ.6 వేల కోట్లు రాకుండా పోతాయి. మైనారిటీల సంక్షే మానికి గతంలో రూ.5,020 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.3,097 కోట్లకు కుదించింది. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు కచ్చితంగా విడుదల చేయాలి. కానీవాటిలో కూడా కేంద్రం కోత విధించి గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేసింది. పట్టణ స్థానిక సంస్థలకు 2022-23లో రూ.22, 908 కోట్లు ప్రతిపాదించి, సవరించిన పద్దుల ప్రకారం దాన్ని రూ.15,026 కోట్లకు కుదించింది. గ్రామీణ స్థానిక సంస్థలకు 2022-23లో రూ.46, 513 కోట్లు ప్రతిపాదించగా, దాన్ని రూ.41 వేల కోట్లకు కుదించారు. ఈ చర్యలు పట్టణ, గ్రామీణ సంస్థలను చిన్నచూపు చూడటంలో భాగమనే భావించాలి.అదే విధంగా ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులో కూడా రూ.4,297 కోట్ల కోత విధించారు. 2023-24 బడ్జెట్‌లో నికర అప్పులు రూ.17,86,816 కోట్లుగా ప్రతిపాదించిన కేంద్రం అందులో సింహభాగం అంటే రూ.8,69,855 కోట్లు రెవెన్యూ లోటును భర్తీ చేయడానికే ప్రతిపాదించారు. అప్పులను క్యాపి టల్‌ ఎక్స్‌పెండీచర్‌ కోసం కాకుండా, 48.7శాతా న్ని రోజువారీ ఖర్చులకోసం ప్రతిపాదించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది.1979-80 నుంచి కేంద్రంలో రెవెన్యూ లోటు క్రమంగా పెరుగుతున్నది. 1979-80లో రూ.694 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా, 2022-23 సవరించిన అంచనాల ప్రకారం రూ.11, 10,546 కోట్లకు పెరిగింది. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి విరుద్ధం. రాష్ట్రాలు ఆనిబంధనలను పాటి స్తున్నాయి. కేంద్రం మాత్రం పాటించటం లేదు. దీనివల్ల దేశ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. బాగా పని చేసే రాష్ట్రాలపై కూడా ఎఫ్‌ఆర్‌ బీఎం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ వాటికి నిధులు లేకుండా చేస్తున్న కేంద్రం, తాను మాత్రం ఎప్పటికప్పుడు ఆ నిబంధనలను ఉల్లంఘి స్తున్నది. తద్వారా తన చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది.2022-23లో కేంద్రం మొత్తం పన్నుల వసూలు రూ.33,68,858 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల వాటా రూ.10,21,488 కోట్లుగా అంచనా వేశారు.అదే సమయంలో కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల ఆదాయంలో 30.4 శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నది. నిజానికి, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలి. కానీ కేంద్రం సెస్సులు, సర్‌ ఛార్జీల విధింపుతో రాష్ట్రాలకు అందుతున్నది 30 శాతం మాత్రమే. దీంతో రాష్ట్రాలు రెండు రకాలుగా నష్టపోతున్నాయి.ఈ విధంగా కేంద్ర బడ్జెట్‌ ఉద్యోగుల, రైతుల, సామాన్య పౌరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్నది. తొలి నుంచీ తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షనే ఈసారీ కేంద్రం కొనసాగించింది.
భ్రమాపూరిత బడ్జెట్‌..
మన దేశానికి కావాల్సిన విజన్‌.. బడ్జెట్‌-2023లో లేదు. ఇంకా చెప్పాలంటే అతుకుల బొంతలాగా ఉంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు తాము ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదన్న వాస్తవాన్ని ఆర్థికమంత్రి విస్మరించారు. అంతేకాదు ద్రవ్యోల్బణం, అభివృద్ధి లేమి, నిరుద్యోగం కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజలను, ఆర్థికరం గంలో నెలకొన్న కఠిన వాస్తవాలను కూడా ఆవిడ పట్టించుకోలేదు. ఆర్థికరంగం నిరాశాజనక పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా.. ఏడు ప్రాధామ్యాలను ఈ బడ్జెట్‌ ప్రాతిపదికగా చేసుకున్న ట్లు కనిపిస్తున్నది. అవి..సమీకృత అభివృద్ధి, చిట్టచివరి లబ్ధిదారునికీ ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్య వినియోగం, పర్యావరణ అనుకూల అభివృద్ధి,యువశక్తిజి, ఆర్థికరంగం. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అనేది బహిరంగసభల్లో నినాదాలకే పరిమితమైంది తప్ప ఆచరణలో లేదు. దేశంలో28రాష్ట్రాలు,8 కేంద్ర పాలితప్రాంతాలున్నాయి. వీటిలో చాలావరకు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడు దశా బ్దాల వ్యవధిలో ఏర్పాటయ్యాయి. ప్రతీ రాష్ట్రం తనదైన అభివృద్ధి దశలో, నమూనాలో ఉంది. కాబట్టి ప్రతీ రాష్ట్రానికి తనదైన ప్రణాళిక అవసరం. ఇంత వైవిధ్యం ఉన్న మన దేశంలో అన్నింటికీ ఒక్కటే అన్న సిద్ధాంతం పనికిరాదు. ఈ ఏడాది బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంగానీ, ఆర్థిక మంత్రిగానీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఎటువంటి చర్చలు జరుపలేదు. పారి శ్రామికవేత్తలను,ఇతర భాగస్వామ్యపక్షాలను మా త్రం వారు సంప్రదించారు. నిజంగానే ఇది ‘అమృ తకాలం’ అయితే, సమ్మిళిత అభివృద్ధి కోసం బడ్జెట్‌ పూర్వ చర్చల్లో రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కేంద్రప్రభుత్వం సంప్రదించి ఉండాల్సింది. ఎందుకంటే వాస్తవ కార్యాచరణ, ఫలితాలు రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి.
బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు, మత్స్యరంగానికి కేంద్రం కొన్ని పథకా లను ప్రకటించింది. అయితే, ఈ రంగాల్లో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఉత్పాదకతను రెట్టింపు చేసిన తెలంగాణ ప్రభుత్వం కృషిని గుర్తిం చటం మాత్రం ఆర్థికమంత్రి మర్చిపోయారు. సహకార రంగం కింద ‘ప్రాథమిక వ్యవసాయ సంఘాల’ కంప్యూటరీకరణను మంత్రి ప్రతిపాదిం చారు. తెలంగాణ ప్రభుత్వం చాలా కాలం కిందటే ఈపని పూర్తి చేసిందన్నది ఈ సందర్భంగా గమనిం చాల్సిన అంశం. అదీగాక సహకార రంగం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అటువంట ప్పుడు కేంద్రప్రభుత్వం దీనిపై బడ్జెట్‌లో ఎందుకు ప్రతిపాదనలు చేసిందన్నది అర్థం కాని విషయం. చిట్టచివరి లబ్ధిదారునికీ ప్రభుత్వ సేవలు: గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులను నియ మిస్తామని బడ్జెట్‌ ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12శాతం మంది గిరిజనులు ఉన్నప్పటికీ.. కేంద్రం ఒక్క ఏకలవ్య పాఠశాలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఈ స్కూళ్లను కేటాయించాలి. తెలంగాణలో కొత్త జిల్లాలకు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ విద్యాలయాలు కేటాయించాలని కోరితే వాటినీ ఇప్పటి వరకూ ఇవ్వలేదు.మౌలిక సదుపాయాలు,పెట్టుబడులు,పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలకు కేటాయింపులు పెంచుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు తగిన నిధులను కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్య యాన్ని ఈ కేటాయింపుల నుంచి చెల్లించే (రీయిం బర్స్‌ చేసే) అంశాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి. యువశక్తి: ఉద్యోగ కల్పనకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం, యువతలో నైపుణ్యాల పెంపు దల, అప్రెంటిషిప్‌లకు ట్కస్టెపెండ్‌ చెల్లింపు వంటి చర్యలు అమలులోకి వస్తే మంచిదే. కానీ, ఇప్పటి వరకూ ఏ మేరకు అమలు అయ్యాయి అన్నదే అసలు ప్రశ్న.సాధారణ పౌరుల సంక్షేమం, అభి వృద్ధే లక్ష్యంగా జవాబుదారీతనంతో, పారద ర్శకంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయటం కోసం పలు దీర్ఘకాలిక చర్యలను ప్రకటించారు. దీంట్లో భాగంగా కృత్రిమ మేధోరంగంలో (ఆర్టిఫీ షియల్‌ ఇంటెలిజెన్స్‌) ఏర్పాటుచేయ తలపెట్టిన మూడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లలో ఒకదానిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయమని కేంద్రప్రభు త్వాన్ని కోరుతున్నాం. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఎదురవుతున్న పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవ టానికి ప్రకటించిన చర్యలను బాధ్యతాయుత రాష్ట్రంగా తెలంగాణ స్వాగతిస్తున్నది. ఇదే సంద ర్భంలో, ఈ రంగంలో తెలంగాణ జరిపిన కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హరితహారం కింద గత ఏడేండ్లలో 240కోట్ల మొక్కలను నాట డం జరిగింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 28 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది.ఈ రంగా నికి ప్రతిపాదించిన పలు అంశాలు దీర్ఘకాలిక మైనవి. వీటిని ఏ విధంగా అమలు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. సమాఖ్య స్ఫూర్తిని కేంద్రప్రభుత్వం ప్రదర్శించలేదు. బడ్జెట్‌ రూపకల్పనలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపలేదు. 7 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. కానీ, రాష్ట్రాల పాత్ర లేకుండా దీనిని సాధించటం ఎలా సాధ్యమవుతుంది?ఈ విధంగా కేంద్ర బడ్జెట్‌ వాస్తవాలను విస్మరించిన కసరత్తుగానే నిలిచి పోయింది.
-(డాక్టర్‌ బైరి నిరంజన్‌/బి.వినోద్‌కుమార్‌)

హైడ్రోప్రాజెక్టుపై గిరిజనం తిరుగుబాటు

జనాలను రక్షించేవాడని షిర్డిసాయికి పేరు. కానీ.. అక్కడ షిర్డిసాయి మాత్రం గిరిజనుల గుండెపై బాణం సంధిస్తు న్నాడు. వేలాది జనాలను రోడ్డున పడేస్తున్నాడు. వందల ఎకరాలు నేలమట్టం చేయి స్తున్నాడు. ప్రకృతిఒడిలో పెరిగిన పంటలను ధ్వం సం చేయిస్తున్నాడు.షిర్డిసాయి తలచుకోవడం.. కేంద్రం తలవంచటం చకచకా జరిగి పోయాయి. మరి అనుగ్రహించాల్సిన షిర్డిసాయినే ఆగ్రహిస్తే, వాళ్ల బతుకులేం కాను? నోరు లేని గిరిజనం, తమ గోడు ఎవరికి వినిపించాలి? కొత్తగా వచ్చే ప్రాజెక్టు వల్ల ఊళ్లు వదిలి వెళ్లేవారికి దిక్కెవరు? షిర్డిసాయి అంత పని చేస్తాడని ఊహించని ఆ అమాయకులను ఆదుకు నేదెవరు? అసలు ఎవరీ షిర్డీ సాయి? పల్లెపై ఎందుకు పగ పట్టారు? ఇదీ ఇప్పుడు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం యర్రవరంలో గిరిజనగోస. దీన బాంధవుడు షిర్డీసాయి ఏమిటి? ఆదివాసీలను రోడ్డుపాలు చేయడమేమిటను కుంటు న్నారా? పేరులో కొంత గందరగోళం ఉన్నప్పటికీ, కంపెనీ మాత్రం షిర్డీసాయినే! ఆయన పేరు పెట్టుకున్న ఆ కంపెనీ ఇనుపపాదాల కింద, ఇప్పుడు వేలాది గిరిజనుల జీవితాలు నలిగి నాశనం కానున్నాయి. సర్కారే సదరు కంపెనీకి సలాము కొడుతున్నందున, గత్యంతరం లేని గిరిజనం పిడికిలి బిగించింది. షిర్డిసాయి కంపెనీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు మాకొద్దంటూ, మన్యంవీరులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కారుకు వ్యతిరేకంగా, చింతపల్లి ఏజెన్సీ బంద్‌తో తమ తడాఖా చూపించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింత పల్లి మండలం,గొందిపాకలు పంచాయతీ లోని ఎర్రవరం గ్రామంలో..షిర్డీ సాయి ఎలక్ట్రికల్‌ కంపె నీకి సర్కారు ధారాదత్తం చేసిన హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌, కొండకోనల నడుమ ప్రశాంతంగా ఉండే గిరిజ నుల గూడేల జీవితాల్లో చిచ్చుపెట్టింది.ఎర్రవరం పరిధిలోని హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్నిగిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలని రోడ్డెక్కారు.పంటలు, ఫలాలు పండి స్తూ జీవిసిస్తున్నామని..పవర్‌ ప్రాజెక్టు వస్తే జీవనా ధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేసున్నారు. తమకు న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.జనవరి 8నవిశాఖపట్నంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావవేశం ఏర్పాటు చేశారు.చింతపల్లి,అరకు,ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల వద్ద ఆల్‌పార్టీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిరసనలు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్‌ కాశ్మీర్‌ గా ప్రసిద్ధి చెందిన లంబసింగి వద్ద ఆదివా సీలు తెల్లవారుజామున గుమిగూడి రాస్తారోకో నిర్వహిం చారు.కనీసం నాలుగు గంటలపాటు వారు తమ ఆందోళనను కొనసాగించారు.అనంతరం మండల కేంద్రానికి తరలివెళ్లిన ఆందోళనకారులు హనుమాన్‌ జంక్షన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నాకు దిగారు. సమావేశంలో గిరిజన సంఘం అఖిల భారత కార్యవర్గ సభ్యుడు పి.అప్పల నరస మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోనూ గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆరోపించారు. మరియు రాష్ట్రం. యర్రవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు కేంద్రం అట వీ,పర్యావరణ అనుమతులు ఇచ్చింది. దాని ఆధా రంగా రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టును షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌కు అప్పగించింది, ’’అని అప్పల నరస అన్నారు మరియు ఏజెన్సీ ప్రాంతాలలో సహజ వనరులను దోపిడీ చేయ డానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చర్యలను పలుచన చేస్తోందని ఆరోపించారు.రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సమత కోఆర్డినేటర్లు కందుకూరి సతీష్‌కుమార్‌,గునపర్తి సైమన్‌సీపీఎం అనంతగిరి జెడ్‌పీటీసీ దిసరి గంగరాజు పాల్గొన్నారు. బంద్‌ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గోని మాట్లాడుతూ గిరిజనుల ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, గిరిజనుల రక్షణ కోసం పార్టీ ఉమ్మడిగా ఆందోళన చేపడుతుందని ప్రకటించారు.
ప్రాజెక్టు లక్ష్యం ఇదీ..
యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును, ఒక్కొక్కటి 300 మెగా వాట్లసామర్థ్యంతో,నాలుగు యూనిట్లు ప్రారంభిం చాలన్నది లక్ష్యం.తాండవ రిజర్వా యర్‌లో కలిసే పిట్ట ఒరుకుగెడ్డపై,రెండు రిజర్వా యర్లు నిర్మించాల న్నది ఒకప్రతిపా దన. యర్ర వరం ఎగువడ్యాం నుంచిగానుగుల దిగువ ప్రాం తంలోని దిగువ డ్యాం వరకూ సొరంగం తవ్వి, మధ్యలో జలవిద్యు దుత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేయాలన్నది మరో ప్రతిపాదన.ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం5,400 కోట్లుగా అంచనా వేశారు. నిజానికి 2020లో చింతపల్లి మండలంలో బాక్సైట్‌ తవ్వ కాల ఆలోచ నకు నాటిసీఎం వైఎస్‌ బీజంవేశారు. దానిని నక్స లైట్లు సహా, అన్ని రాజకీయపార్టీలూ వ్యతిరేకిం చాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం,జీఓ 97నురద్దు చేస్తూ మరో జీఓ ఇచ్చిం ది.దానితో మన్యంలో మంటలు చల్లారాయి. జగన్‌ సీఎంఅయిన తర్వాత, బాబు సర్కారు ఇచ్చిన జీవోనురద్దు చేసింది. ఫలితంగా పులివెం దులకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ తెరపైకి వచ్చింది. ప్రైవేట్‌ కంపెనీ ఏజన్సీతో సర్వే చేయించడం,ఆ వెంటనే డీపీఆర్‌ సిద్ధం చేయిం చడం,ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ,పర్యావరణశాఖ అనుమతికోసం ఢల్లీికి పంపించడం,ప్రాజెక్టును అదానీ కంపెనీకి అప్పగిం చేందుకు అంగీ కారం,2021 డిసెంబర్‌ 21న కేంద్రం అనుమ తులు జారీ చేయడం యుద్ధప్రాతి పదికన జరిగి పోయాయి. ఆతర్వాత దానిని షిర్డీ సాయి ఎలక్ట్రి కల్‌ కంపెనీకి అప్పగిస్తూ,జగన్‌ సర్కా రు మంత్రి వర్గం తీర్మానిచింది.షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ పాలకపార్టీకి,ఆత్మబంధువులన్న ఆరోపణ ల నేప థ్యంలో..ఆ కంపెనీకి ప్రాజెక్టు ధారాదత్తం చేసిన వైనం విమర్శలకు గురవు తోంది.ప్రాజెక్టును షిర్డీసాయి ఎలక్ట్రి కల్‌ కంపెనీకి కట్టబెట్టే అత్యుత్సా హంలో..నిబంధ నలకు నీళ్లొదిరారన్న ఆరోపణ లు వెల్లువెత్తుతు న్నాయి. విచిత్రంగా నిబంధనలు నిశితంగా పరిశీ లించిన తర్వాతనే, ఏ ప్రాజెక్టున యినా ఆమోదించే కేంద్రం ప్రభుత్వం కూడా.. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు చకచకా అనుమతి ఇచ్చిందంటే, ‘షిర్డీసాయి మహత్యం’ఏస్థాయిలో పనిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అటు హైడ్రో ప్రాజెక్టు ఏర్పాటు పై గిరిజనం ఆందోళన చేస్తుంటే..ఇటు బీజేపీ వారికి మద్దతు నివ్వక పోగా,కేంద్రంలోనిబీజేపీ సర్కారు అనుమ తులన్నీ ఆగమేఘాలపై జారీ చేయ డాన్ని గిరిజను లు మండిపడుతున్నారు. ఫలితంగా ఈవివా దంలో బీజేపీఅడ్డంగా ఇరుక్కుపోయినట్ట యింది. ఇక తమ జీవనాధారమైన పంటపొలాలు ధ్వంస మయి, జీవితాలు రోడ్డునపడటంపై గిరిజనం గగ్గోలు పెడుతోంది. సర్కారు నిర్ణయానికి వ్యతిరే కంగా చింతపల్లి ఏజెన్సీ ఏరియాను బంద్‌ ప్రకటిం చగా,అనూహ్య స్పందన లభించింది. ఆదివాసీలు మూకుమ్మడిగా రోడ్డెక్కి, సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పారు.ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదని హెచ్చ రించారు. మా జీవితాలు హరించే హక్కు ప్రభుత్వా నికి ఎవరిచ్చారని గర్జించారు. షిర్డీసాయి కంపెనీకి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ గళమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణంవల్ల తాము అనాధలమవు తామ ని ఆందోళన వ్యక్తం చేశారు. షిర్టీసాయి కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్టు వల్ల..చింతపల్లి,కొయ్యూరు మండ లాల్లోని 2500ఎకరాలు నేలమట్టమవుతాయి. ఆరకంగా నాలుగు పంచాయతీలోని ఆదివాసీలు రోడ్డునపడతారన్నమాట. దాదాపు 20 వేల మంది ఆదివాసీలు,32 గిరిజన గ్రామాలు ప్రాజెక్టు కోసం పూర్తి స్థాయిలో ఖాళీ చేసి, మూటా ముల్లె సర్దుకుని పోవాల్సిందే. అదొక్కటే కాదు..కొన్ని దశాబ్దాల నుంచి,తాత ముత్తాతల కాలం నుంచీ సాగుచేసు కుంటున్న పంటలు కూడా ప్రాజెక్టుకు బలవుతా యన్నది గిరిజనుల ఆందోళన. 600ఎకరాల్లో గిరిజ నులు సాగుచేస్తున్న జామ,అనాస,మల తోటలు నేలకూలనున్నాయి. 1500 ఎకరాల్లో సాగుచేస్తున్న మిరియాలు, కాఫీ తోటలు నేలమట్టం కానున్నాయి. మొత్తంగా అక్కడ ఇక పచ్చని చెట్లు, పంటపొలాలు మాయమవుతాయన్నమాట.
రాజ్యాంగానికి తూట్లు
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244(1) ద్వారా ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులు కల్పించారు. వారికి రక్షణగా భూబదలాయింపు చట్టాలుచేశారు. వాటినీ జగన్‌ సర్కారు భేఖారుచేస్తోంది. ఆదివాసీల సంప దను ఆస్మదీయులకు అడ్డదారుల్లో దోచి పెట్టాలని చూస్తోంది. గిరిజనప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మిం చాలంటే ప్రభావిత ప్రాంతాల్లో మొదట గ్రామసభను నిర్వహించి,వాటి ఆమెదంతోనే అనుమతులు ఇవ్వాలన్న నిబంధనను జగనన ప్రభుత్వం తుంగ లో తొక్కేసింది.ముఖ్యమంత్రి,మంత్రులు సచివా లయంలో కూర్చునే..షిర్డీసాయి సంస్దకు పీఎస్పీ ప్రాజెక్టుని కేటాయించేశారు. అది ఆచరణలోకి వస్తే ఏజెన్సీలోని కొయ్యూరు,చింతపల్లి,గూడెంకొత్తవీథి మండలాల్లోని కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందిని గిరిజనులు మూడు వేల ఎక రాల భూములు కోల్పోతారని గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చట్టాలను తుంగలోకి తొక్కి గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ చర్యలను నిరిసిస్తూ స్థానికలు ఆందోళనలు చేపడుతున్నారు. ముంపు ప్రభావిత మండలాల్లో బంద్‌లు,నిరసనలు,ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
తాండవ జలాశయంపై ప్రభావం
ఎర్రవరంలో నిర్మించనున్న పీఎస్‌పీతో అనకాపల్లి,తూర్పుగోదావరి జిల్లాలో ఆయకట్టు కలిగిన తాండవ జలాశయంపై ప్రభావం పడు నుంది.కొయ్యూరు,చింతపల్లి మీదుగా జలాశయం లోకి ప్రవహించే నీటి వనరులపై ఈ పీఎస్‌పీని నిర్మించబోతున్నారు.0.4టీఎంసీల సామార్ద్యంతో ఎగువు,దిగువన రెండు రిజర్వాయర్లు నిర్మించి, విద్యుదుత్పిత్తి చేయనున్నారు.దీనివల్ల జలాశయం లోకి వచ్చే0.4టీఎంసీల నీరు తగ్గిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికార్లులు అంటున్నారు. సుమారు 4వేలఎకరాలకు సాగునీరు ప్రశ్నార్ధ కంగా కానుంది.
చట్టం ఉల్లంఘన
ఐదో షెడ్యూల్‌ పరిథిలోని ఆదివాసీ గ్రామాల్లో భూములను గిరిజనేతరులకు బదలా యించడానికి వీల్లేదు.క్రయవిక్రయాలు పూర్తిగా గిరిజనుల మధ్యే జరగాలని 1/70చట్టం చెబుతోం ది.1995లో అనంతగిరి మండలంలో కాస్సైట్‌ గనుల వివాదంపై సమతా స్వచ్చంధ సంస్థ సుప్రీం కోర్టు ఆశ్రయించినప్పుడు షెడ్యూల్‌ ఏరియాలో ప్రభుతాన్ని కూడా గిరిజనేతరురాలిగానే భావిం చాల్సి వస్తుందని స్పష్టంగా పేర్కోంది. అయినా జగన్‌ ప్రభుత్వానిక లెక్కేలేదు. గిరిజన ప్రాంతంలో చేపట్టే కార్యాకలాపాలకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి.సభలో సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత వారి ఆమోదం ఉంటేనే ముందుకెళ్లాలని పీసా చట్టం చెబుతోంది.ఒడిశాలోని నియాంగిరి కొండ ను బాక్సైట్‌ కోసం వేదాంత గ్రూప్‌నకు కేటాయించి నప్పుడు సుప్రీంకోర్టు ఇదేవిషయాన్ని స్పష్టం చేసింది. అక్కడ గ్రామసభ నిర్వహించకుండా స్థానిక ప్రజాప్రతినిధి సంతకంతో అనుమతి చూపించడాన్ని తప్పపట్టింది.ఆకేటాయింపు రద్దుకు సిఫార్సు చేసింది.కానీ ఆవేవీ వైకాపా ప్రభుత్వం చెవికెక్కవు.
ఆదివాసీల ఆగ్రహ జ్వాల
ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు(పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి ఏపీ కేబినెట్‌ ఆమో దం తెలపడంపై గిరిజన సంఘాల నాయకులు, మండిపడుతున్నారు.గిరిజనులు వ్యతిరేకిస్తున్న ప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వైఎ స్సార్‌ కడప జిల్లా వైసీపీ నేతకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీకి నామినేషన్‌ పద్ధతిలో 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యర్రవరం పీఎస్‌పీ నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం గిరిజన సంఘం నాయకులు అదానీ దిష్టి బొమ్మను దహనం చేసి హైడ్రో పవర్‌ ప్రాజె క్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బాక్సైట్‌ తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును అడ్డుకుంటామని, వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరిం చారు.
కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు
ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మా ణానికి కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులను ఇది వరకే మంజూరు చేసింది.యర్రవరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఓ ప్రైవేటు ఏజెన్సీ2020 జనవరి22 నుంచి 25వరకు సర్వే చేపట్టి ప్రాథమిక డీపీఆర్‌ సిద్ధం చేసింది. పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు 2021 డిసెంబరు 21న మంజూరయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవస రమైన కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు(పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు) నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదంతో షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ కంపెనీకి అప్ప గించింది.
ముంపునకు గురికానున్న 32 గ్రామాలు
హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణంవల్ల 32గిరిజన గ్రామాలు ముంపునకు గురికాను న్నాయి. దీంతో ఈ ప్రాంత గిరిజనులను గ్రామాల నుంచి ఖాళీ చేయించాల్సి వుంది. ప్రధానంగా కొయ్యూరు మండలంపి.మాకవరం పంచాయతీకి చెందిన గానుగుల,రామచంద్రపురం,రామరాజుపాలెం, దిబ్బలూరు,వెలగలపాలెం పంచాయతీలో కిత్తాబు, చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ పరిధిలోవంట్లమామిడి,తాటిబంద,రాసపనస, ఎర్ర వరం,గాగులబంద,బొర్రమామిడి,పొర్లుబంద, రోలుగుంట,దంపులగుంట,వేనం,తాడపాలెం, పోతురాజుగుమ్మల,చీమలపాడు,సమగిరి,రాస పనస,తోటమామిడి,గొడుగుమామిడి,ఎర్రబొమ్మలు పంచాయతీ ఎర్రాబెల్లి,తప్పలమామిడి,జీడు మామి డితోపాటు మరో ఏడు ఆవాస గ్రామాలు ముంపు నకు గురికానున్నాయి.
అడవులను అదానీకి కట్టబెడతారా !
జల విద్యుత్‌ ప్రాజక్టువల్ల 4800 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభు త్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులో కేవలం 5వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభు త్వ సంస్థలోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్‌ ఉద్యోగాలు పొందగలమా అనేది ప్రశ్న. జోలపుట్‌ డ్యాం,మాచ్‌ఖండ్‌ పవర్‌ప్రాజెక్టు నిర్మాణం 1955 లో జరిగినప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితులైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు.
ఉపాధి పేరుతో మోసం
జల విద్యుత్‌ ప్రాజక్టువల్ల 4800 మం దికి ఉద్యోగావకాశాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది వాస్తవం కాదు. సీలేరు, మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టులో కేవలం 5 వందల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. అందులో స్థానిక గిరిజనులు నామమాత్రమే. ప్రభుత్వ సంస్థ లోనే అంతంతమాత్రపు ఉపాధి ఉన్నప్పుడు ప్రైవేటు అదానీ కంపెనీలో నాణ్యమైన టెక్నికల్‌ ఉద్యోగాలు పొందగలమా అనేదిప్రశ్న.జోలపుట్‌ డ్యాం, మాచ్‌ ఖండ్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం 1955లో జరిగిన ప్పుడు సుమారు 250 గ్రామాల ప్రజలు నిర్వాసితు లైతే వారిని ఆదుకునేవారే కరవయ్యారు. ఇప్పుడు మాత్రం ‘కేవలం 10 కుటుంబాలున్న 25 మంది జనాభాగల కొయ్యూరు మండలంలోని చిన్నయ్య కొండ అనే ఊరు మాత్రమే మునుగుతుంది. అందు లో కేవలం 22హెక్టార్ల ప్రైవేటు భూమి నష్టపోతు న్నారు.279 హెక్టార్ల భూమి అవసరం కాగా అందులో 257హెక్టార్ల అటవీభూమి ఉంద’ని ప్రభు త్వ సంస్థ ఎన్‌.ఆర్‌.ఇ.డి.సి.ఏ.పి చెప్పడం మోసం. అధిక సంఖ్యలో అడవిపై ఆధారపడి జీవిస్తున్న చుట్టుపక్కల నిర్వాసిత గ్రామాల ప్రజల వివరాలను పూర్తిగా దాస్తున్నది. రాష్ట్ర క్యాబినెట్‌ సత్య సాయి గ్రీన్‌ ఎనర్జీని అదానీ కంపెనీకి అప్పగిం చడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంత సహజ వనరులు ఆదివాసీలకు చెందాలని, ఆదివాసీ ప్రాంతంలో అదానీ ప్రవేటు సంస్థల ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ…చింతపల్లి, జి.కె వీధి,కొయ్యూరు మండలంలో గిరిజనసంఘం నాయకత్వంలో మిగతా గిరిజన సంఘాలు, ప్రతి పక్ష పార్టీల ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14న మూడు మండలాల్లో బంద్‌ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
సహజ వనరులున్నా వెనకబాటే
అడవుల విస్తీర్ణంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా రాష్ట్రంలోకెల్లా మొదట స్థానంలో ఉంది.అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేటికీ గిరిజన గ్రామాలలో వైద్యం కోసం డోలీ మోతలు కొనసాగిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి లేక మైదాన ప్రాంతంలో వలసలు వెళుతున్నారు. రక్త హీనతతో గిరిజన బాలింతలు,చిన్నపిల్లల మర ణాలు సర్వసాధారణంగా ఉన్నాయి. అక్షరాస్యత చాలా తక్కువ.సహజ వనరులు పుష్కలంగాఉన్న ప్పటికీ గిరిజనప్రజలు పేదరికంతో ఉన్నారు. పాడేరు ఏజెన్సీలో సుమారు 5 లక్షల కోట్ల రూపా యల విలువైన 515 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ మైనింగ్‌ వనరులు పుష్కలంగా ఉన్నాయి.చైనా క్లే, గ్రానైట్‌, లేటరైట్‌,రంగురాళ్ళు,క్వార్ట్డ్జ్‌, లైమ్‌ స్టోన్‌ తదితర సహజ వనరులతో లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదనిలయంగా ఉంది. ప్రపం చంలోనే అత్యంత రుచికరమైన ఆర్గానిక్‌ కాఫీ పంట పండే దట్టమైన అడవులు, సుగంధ ద్రవ్యా లు, పసుపు, పిప్పళ్లు, అల్లం, మిరియాల పంటలకు అనువైన ప్రాంతం.జీడి,అటవీ ఉత్పత్తులు, వనమూ లికలు,రాజ్మా విస్తారంగా దొరికే తూర్పు కనుమల అటవీ ప్రాంతమిది. ఇంకోవైపు దేశంలోనే అత్యంత ఎక్కువ మంది గిరిజనులను నిరాశ్రయులను చేసిన పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం. ఈ జిల్లాలో గిరిజనులు 82.67శాతం.రాజ్యాంగంలోని 5వషె డ్యూల్‌ ప్రాంతంలోని గిరి జన ప్రాంత హక్కులు, విద్య,వైద్యం,ఉపాధిని …గిరిజన సలహా మండలి, రాష్ట్ర గవర్నర్‌,దేశ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కాపా డాల్సి వుంది. ఆదివాసీల హక్కులు, సహజ వనరు లు,అటవీ భూముల రక్షణ చూడాల్సి ఉంది. కానీ దేశ విదేశీ బహుళజాతి సంస్థల ఒత్తిడితో కేంద్రం లోని బీజేపీ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌లో భాగంగా 2024 వరకు ఆదివాసీ అడ వులను అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించడానికి పూనుకున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీప్రాంతంలోని అడవు లు, భూములలో ప్రైవేటు కంపె నీల ప్రవేశంపై నిషేధం ఉన్నది. ఐదవ షెడ్యూల్‌ ప్రాంత అడవుల్లో బడా బహుళజాతి కంపెనీలు సులభంగా ప్రవేశిం చడానికి వీలుగా పర్యావరణ అటవీ సంరక్షణ చట్టం-1980ను సవరించి మరింత సులభతరం చేసింది. అటవీ పర్యావరణ పరిరక్షణ చట్టం-1980 ప్రకారం అటవీ ప్రాంతంలోని భూములను అటవీయేతర కార్యక్రమాలకు కేటాయించరాదు. మైనింగ్‌,భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అటవీ భూము లు కేటాయించరాదు. ప్రభుత్వ ప్రాజెక్టు అయితే 70శాతం గ్రామ సభలో ఆమోదం పొందడం తప్పనిసరి. ప్రైవేటు కంపెనీలకు 80శాతం గ్రామ సభ ఆమో దం పొందడం తప్పనిసరి. అయితే ఇప్పుడు సవరిం చిన నిబంధనల ప్రకారం ఎటు వంటి ఆమోదం పొందనవసరం లేదు.
చట్టవిరుద్దంగా వెళుతున్నారు..!
క్షేత్రస్థాయిలో పరిస్థితు లను అధ్యయనం చేయకుండా ఎక్కడో కూర్చుని నిర్ణ యాలు తీసు కోవడం తపుని విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ సీఎంజగన్‌కు లేఖ రాశారు. లేఖసా రాంశం ఇలాఉంది.రాష్ట్ర ప్రభు త్వం, పార్వతీపురం మాన్యం జిల్లాలో రెండు ప్రాజెక్టులు,అంటే కురుకుట్టి దగ్గర 1,200హైడ్రోపంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌, కర్రి వలస దగ్గర 1,000హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌, మరియు AూR జిల్లాలో ఎర్రవరం దగ్గర ఇంకొక 1,200వీఔ హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌,ఆదానీ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయిం చడం,ఆప్రాంతాల్లో అమలులో ఉన్న పీసా,అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించడం అవుతుంది.ఆ రెండు చట్టాల కింద,ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చే ముందు, అక్కడి గ్రామ సభలను సంప్రదించి, వారి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. గ్రామసభల అనుమతి తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ప్రాజెక్టుల మీద,ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారంలేదు.ఇదే విష యాన్ని,సుప్రీం కోర్టువారు,ఒరిస్సాలో కలాహండి ,రాయగడ జిల్లాలలో,అక్కడిప్రభుత్వం, గ్రామ సభల అనుమతి లేకుండా,వేదాంత కంపెనీకి బాక్సైట్‌ మైనింగ్‌ అనుమతి ఇవ్వడంచట్టవిరుద్ధమని, 20 13,ఏప్రిల్‌18నఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పాటించవలసిఉంది. సుప్రీం కోర్టువారి ఆదేశాల ప్రకారం,అక్కడ పద కొండు గ్రామాలలో గ్రామసభలు ఆమైనింగ్‌ ప్రాజె క్టును చర్చించి,తిరస్కరించడము వలన, ప్రాజెక్టు రద్దయింది. ఇదే కాకుండా, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో, ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులు ఇవ్వడం, అక్కడ భూములను లీజ్‌ తీసుకునే అనుమతులు ఇవ్వడం, అక్కడ వర్తించే ల్యాండ్‌ ట్రాన్స్ఫర్‌ చట్టాన్ని ఉల్లంఘిం చడం అవుతుంది.సుప్రీంకోర్టువారు,అప్పటి విశాఖ పట్నం జిల్లా షెడ్యూల్డ్‌ ప్రాంతంలో, అనంతగిరి మండలంలో,ఒక ప్రైవేటు కంపెనీ కి ఇచ్చిన నిర్ణ యాన్ని 1997లో సమతా కేసులో రద్దు చేశారు. ఆకారణంగా,ఈమూడుహైడ్రో ప్రాజేక్ట్‌ లను అదానీ కంపెనీకి ఇవ్వడం చెల్లదని మీరు గుర్తించాలి. రాజ్యాంగంలో 5వషెడ్యూల్‌ పారా4కింద రాష్ట్రం లో ఏర్పాటు చేయబడిన ట్రైబల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (ుతీఱపaశ్రీ Aసఙఱంశీతీవ జశీబఅషఱశ్రీ),ఇటువంటి ప్రాజె క్టుల మీద చర్చించవలసినది.రాష్ట్రప్రభుత్వం ుAజ వారి అభిప్రాయాలు తీసుకోకుండా ఈ ప్రాజె క్టుల మీద నిర్ణయం తీసుకోవడం, రాజ్యాంగాన్ని ధిక్కరిం చినట్లు అవుతుంది.షెడ్యూల్డ్‌ ఏరియాలో గిరిజ నుల జీవితాలమీద,వారి సంప్రదాయం మీద ప్రభా వం కలిగించే పెద్ద ప్రాజెక్టులు పెట్టే విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం,రాజ్యాంగం338A(9)కింద జాతీ య స్థాయి ట్రైబల్‌ కమీషన్‌ (చీa్‌ఱశీఅaశ్రీ జశీఎఎఱంంఱశీఅ టశీతీ ్‌ష్ట్రవ ూషష్ట్రవసబశ్రీవస ుతీఱపవం- చీజూు) అభిప్రాయాన్ని ముందే తీసుకోవాలి. మీ ప్రభుత్వంచీజూుతో ఎటువంటి సంప్రదింపులు జరిపినట్లు కనిపించడం లేదు. మీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అదానీ కంపెనీకి, ఎటువంటి పోటీ లేకుండా,ఇవ్వడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘‘జాతీయహైడ్రోఎలక్ట్రిక్‌ విధానం’’ ప్రకారం, పోటీ లేకుండా హైడ్రోప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం చెల్లదు. ఈ మూడు ప్రాజెక్టు వలన,గిరిజన ప్రాంతాల్లో వారి జీవితా లకు, సాంస్కృతికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నా యి. వారు ఆధారపడే జలవనరులకు అంతరా యం కలుగు తుంది. అటవీహక్కుల చట్టం క్రింద, వారికి అక్కడ అటవీ సంపద మీదఉన్న హక్కులకు అంత రాయం కలుగుతుంది. ఇన్ని విధాలుగా గిరిజన ప్రజలకు నష్టాలు కలిగే అవకాశాలున్నా, వారితో, వారి గ్రామసభలతో ముందుగా సంప్రదిం చకుం డా, ఇటువంటిపెద్ద ప్రాజెక్ట్‌ల మీద ఏకపాక్షి కంగా నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హైడ్రో ఎలక్ట్రిక్‌ విధానాన్ని ఉల్లంఘిస్తూ, ప్రాజెక్టులను అదానీకంపెనీకి పోటీ లేకుండా ఇవ్వ డం సబబు కాదు. ఈవిషయాలమీద, నేను ఎన్నో సార్లు మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి లేఖలు రాసినా,వారు స్పందించలేదు. నా లేఖల నకళ్ళను జతపరుస్తున్నాను ఈవిషయాలను దృష్టిలో పెట్టు కుని, మీ ప్రభుత్వం తత్‌ క్షణం, ఈ మూడు ప్రాజెక్టు లను రద్దు చేయాలని నా విజ్ఞప్తి. గిరిజన ప్రాంతా లలో అమలులోఉన్న చట్టాలను, గిరిజనుల హక్కు లను గౌరవిస్తూ మీ ప్రభుత్వం ఆలస్యం చేయకుం డా ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటారని విశ్వసిస్తు న్నాను ఆలేఖలో వివరించారు.-(మార్తి సుబ్రహ్మణ్యం)

ఇండియా మళ్లీ విశ్వగురువు కావాలి

రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత దౌపది ముర్ము డిసెంబర్‌ 4వ తేదీన తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. తెలుగునేలపై మొట్టమొదటి సారి అడుగుపెట్టిన రాష్ట్రపతికి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విజయవాడలో పౌరసన్మానం నిర్వహించింది. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలందరికీ రాష్ట్రపతి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతి దేశమంతా వ్యాపించిందన్నారు. మహాకవి గురజాడను, ఆయన రచించిన కన్యాశుల్కాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, దుర్గా బాయి దేశ్‌ముఖ్‌ తదితరుల బాటలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడ నుండి విశాఖకు వెళ్లారు. నౌకదళ దినోత్సవం సందర్భంగా ఆర్కేబీచ్‌లో నౌకదళా విన్యాసాలకు ముఖ్యఅతిధిగా హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ సింధు వీర్‌ జలాం తర్గామి ద్వారా రాష్ట్రపతికి నౌకదళం త్రివర్ణ బాంబర్లతో స్వాగతం పలికింది. ప్రముఖ గాయకుడు శంకర్‌ మహా దేవన్‌ ఆలపించిన నౌకాదళ గీతం ఆలాపించారు. నౌకదళ విన్యాసాలను తిలకించడానికి భారీ సంఖ్యలో ప్రజానీకం తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి తిరుపతికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రంచంలోనే ఎంతో ప్రతిష్టతగల నేల భారతదేశం. వేద కాలంలో వసుధైక కుటుంబ భావనను ప్రపంచానికి అందిం చింది. మన దేశంలోని వైవిధ్యాన్ని చూసి ప్రపంచ విజ్ఞులు దీన్నొక ఉపఖండమని ఎప్పటి నుంచో కీర్తించారని అన్నారు. ఇంకా ఏమన్నారంటే…! రానున్న 25 ఏళ్లలో భారతదేశం.. విశ్వ గురువుగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి భారతీయుడు నరనరాల్లో సంస్కృతి, సంప్రదా యాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్స రాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. వంద సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు చేసుకునే సమయంలో ప్రపంచంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో నావికాదళం కీలక పాత్ర పోషిస్తోంది.భారత్‌ రక్షణలో మహిళల పాత్ర ఎంతో ఉంది. భారత నావికాదళంలో వివిధ హోదాల్లో మహిళలు కూడా దేశ రక్షణ లో పాలుపంచుకుంటున్నారు. 1971లో పాకి స్తాన్‌పై జరిగిన యుద్దంలో విజ యానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ 4న నేవీ డే వేడుక లను జరుపుకుంటున్నాం.ఈ యుద్దంలో అసువు లు బాసిన యుద్ద వీరులను మరో సారి గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. వారి త్యాగాలు కీర్తిస్తూ..ప్రతి తరానికి గుర్తు చేయడం మన బాధ్యత.మూడువైపుల సముద్రంం,ఒకవైపు పర్వాతాలు కలిగిన మన దేశం. మొదటి నుంచీ సముద్ర తీర దేశంగా ఉంది. సహజసిద్దంగా ఉన్న ఈ సముద్ర తీరం దేశాభివృద్ధికి ఎంతో కీలకం.తీరరక్షణలో భారత నేవీఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. భారత నావికాదళం ఎంతో శక్తివంతమైనదే కాకుండా ఎటువంటి పరిస్థితు లనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పఉడూ సన్నద్దం గా ఉంటోంది. భారత నూతన అభివృద్ధిలో నావికాదళం పాత్ర కీలకమైనది..త్రివిధ దళాధి పతిగా నాకు ఎంతో నమ్మకం ఉంది. రాష్ట్రం లో ప్రారంభిస్తున్న వివిధ ప్రాజెక్టులు దేశాభి వృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దేశ ప్రజలం దరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయుక్తంగా ఉంటాయి.
గిరిజన విద్యకు దోహదం
దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏకలవ్య పాఠశాలలు గిరిజనుల్లో విద్యావకాశాలు పెంపొందేందుకు ఎంతగానో ఉపయోగపడు తాయి. రాష్ట్రంలో బుట్టాయగూడెం, చింతూరు, రాజబొమ్మంగి,గుమ్మలక్ష్మీపురంలో ప్రారంబి óస్తున్న ఏకలవ్య పాఠశాలల వల్ల గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధితోపాటు గిరిజన ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని భావి స్తున్నా..! దేశంలో ఎవరైనా,వారి ప్రాంతం, కులం,మతంతో సంబంధం లేకుండా విద్య అందించేందుకు మనం కృషి చేయాలి. విద్యను అందరికీ అందుబాటులో ఉంచేం దుకు అన్ని చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్పు ప్రసంగించారు. తర్వాత భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ద విన్యాసాల్ని రాష్ట్రపతి ముర్ము తిలకించారు.రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టు లను వర్చువల్‌ విధానంలో నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి చేరుకొని నేవీ డే రిసెప్షన్‌కు హజరయ్యారు.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఏపీలో ద్రౌపతి ముర్ము పర్యటన.. ఘనంగా పౌరసన్మానం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ విశ్వభూషన్‌, సీఎం జగన్‌,కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి,ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా,పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మె ల్యేలు,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపతి ముర్ము పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తిరుపతి బయలుదేరి అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తూర్పు నౌకా దళం ప్రత్యేకత అంశాలివీ
పాకిస్తాన్‌..దాయాది దేశం పేరు వింటనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటి శత్రు దేశంతో యుద్ధం జరిగితే..ఆయుద్ధంలో మన త్రివర్ణపతాకం రెపరెపలాడితే..ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదా. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. జాతి గర్వించదగిన గెలుపు నకు గుర్తుగా బీచ్‌రోడ్‌లో ‘విక్టరీ ఆఫ్‌ సీ’ స్థూపం నిర్మించారు. భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం అభివృద్ధి చెందింది. నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నం కావడం మరో విశేషం. దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం.సహజ సిద్ధమైన భౌగో ళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూరంగా ఉం డటం తూర్పు నౌకా దళం ప్రత్యేకత. అందుకే రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్‌ పాలకులు ఈ ప్రాంతాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే తూర్పు నావికా దళం ఏర్పా టైంది.1923 డిసెంబర్‌లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942-45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియో గించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధా లను రవాణా చేశారు. స్వాతంత్య్రా నంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్‌ను కమాండర్‌ హోదాకు పెంచుతూ, బేస్‌ రిపేర్‌ ఆర్గనైజేషన్‌ కార్యక లాపాలను ప్రారంభిం చారు.1962లో ఇండి యన్‌ నేవీ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌ హెచ్‌ ఎస్‌) కల్యాణి ప్రారంభ మైంది. అనంత రం1967 జూలై 24న కమాండర్‌ హోదాను రియర్‌ అడ్మిరల్‌ హోదాకు అప్‌గ్రేడ్‌ చేయ డంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్‌ ఆఫీసర్స్‌ పోస్టులను కూడా మంజూరు చేశారు. చివరిగా 1968 మార్చి1నవిశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్‌సీ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971మార్చి1న ఈఎన్‌సీ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్‌సీ విస్తరించింది.1971 నవంబర్‌ 1 నుంచి ఈఎన్‌సీ ఫ్లీట్‌ కార్య కలాపాలు ప్రారంభ మయ్యాయి. తొలి ఈఎన్‌సీ చీఫ్‌గా రియర్‌ అడ్మిరల్‌ కేఆర్‌ నాయర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం29వ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.
రక్షణలో వెన్నెముక
మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహా సముద్రం వరకూ ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్‌బన్‌ నుంచి దక్షిణాన గల్ఫ్‌ఆఫ్‌ మన్నార్‌ వరకూ విస్తరించి ఉంది.2,600కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30శాతం అంటే 6లక్షలచ.కిమీ పరిధిలో ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ విస్తరించి ఉంది.ఈ తీరంలో 13మేజర్‌ పోర్టులున్నాయి.భారత సర్కారు లుక్‌ ఈస్ట్‌ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తి స్తోంది. దీంతో పాటు డీఆర్‌డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీస్‌ (ఎన్‌ఎస్‌ టీఎల్‌) కూడా విశాఖలోనే ఏర్పాటైంది.
డిసెంబర్‌ 4 విజయానికి నాంది
ఘాజీ కాలగర్భంలో కలిసిపోవడంతో బంగాళ ఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్‌ నేవీ.. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. భారత్‌ ముప్పేట దాడితో పాకిస్తాన్‌ తలవంచక తప్పలేదు. డిసెం బర్‌ 16న పాకిస్తాన్‌ లొంగిపోతున్నట్లు ప్రకటిం చడంతో భారత్‌ కాల్పుల విరమణ ప్రకటిం చింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే. ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించింది.డిసెంబర్‌ 16న యుద్ధం ముగిసినా దానికి కారణం డిసెంబర్‌ 4న అతిపెద్ద పాకి స్తానీ నౌకాశ్రయం కరాచీపై చేసిన మెరుపుదా డేనని చెప్పుకోవచ్చు. అందుకే 1971 యుద్ధం లో మన నౌకాదళం ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభాపాటవాలు,వ్యూహాలు, ధైర్య సాహసా లకు గుర్తుగా డిసెంబర్‌ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్‌సీ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతోపాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకల తో ఇండియన్‌ నేవీ ఎప్పటికప్పుడు నౌకా సంప త్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారు తోంది.తూర్పు నౌకాదళం పరిధిలో 52 వరకు యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు, హెలి కాఫ్టర్లు, యుద్ధ విమానాలున్నాయి.యుద్ధ నౌకల పనితీరు, పరిజ్ఞానం బట్టి వాటిని వివిధ తరగ తులుగా విభజించారు.అదే విధంగా సబ్‌ మెరైన్లను కూడా వాటి సామర్థ్యం,పనితీరు బట్టి వివిధ తరగతులుగా విభజించారు.భారత నౌకా దళంలో ఉన్న షిప్స్‌ పేర్లన్నీ ఐఎన్‌ఎస్‌తో మొద లవుతాయి. ఐఎన్‌ఎస్‌ అంటే ఇండియన్‌ నేవల్‌ షిప్‌.యుద్ధ నౌకల్లో ఐఎన్‌ఎస్‌ ఢల్లీి క్లాస్‌, రాజ్‌ పుత్‌,గోదావరి,తల్వార్‌,కోల్‌కతా,శివాలిక్‌, బ్రహ్మ పుత్ర,ఆస్టిన్‌,శార్దూల్‌,దీపక్‌, మగర్‌, కుంభీర్‌, కమోర్తా,కోరా,ఖుక్రీ,అభ్య,వీర్‌, పాండి చ్ఛేరి, అస్త్రధరణి,సరయు,సుకన్య, కార్‌ నికోబార్‌, బం గారం,త్రికర్ట్‌..ఇలా విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. సబ్‌మెరైన్‌ల విషయాని కొస్తే.. న్యూక్లియర్‌ పవర్డ్‌ సబ్‌మెరైన్‌లను అరిహంత్‌, చక్ర(అకుళ-2)క్లాస్‌లుగా,కన్వెన్షనల్లీ పవర్డ్‌ సబ్‌ మెరైన్‌లను సింధుఘోష్‌,శిశుమార్‌ క్లాస్‌ సబ్‌మె రైన్లుగావిభజించారు.ఇటీవల ఐఎన్‌ ఎస్‌ విశాఖ పట్నం యుద్ధ నౌకతోపాటు పలు హెలికాఫ్టర్లు, అడ్వాన్స్‌డ్‌ యుద్ధ విమానాల రాకతో ఈఎన్‌సీ బలం మరింత పెరిగింది.
సాయుధ సంపత్తికి కీలకం.. రజాలీ
ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌కు అత్యంత వ్యూహాత్మక, కీలకమైన ఎయిర్‌స్టేషన్‌ రజాలీ. ఇది తమిళ నాడులోని అరక్కోణం జిల్లాలో ఉంది. ఇది ఈఎన్‌సీకే కాదు..భారత నౌకాదళానికీ కీలక మైన ఎయిర్‌స్టేషన్‌. 2,320 ఎకరాల విస్తీర్ణంలో అతి పొడవైన, వెడల్పైన రన్‌వే కలిగిన రజాలీ.. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్‌స్టేషన్‌గా గుర్తిం పు పొందింది. తూర్పు,దక్షిణ తీరాల మధ్యలో భూఉపరితల,సముద్ర మార్గాల ద్వారా దాడి చేసేందుకు వచ్చే శత్రు దేశాల తుదిముట్టేంచేం దుకు కావల్సిన ఆయుధ సంపత్తి అంతా రజాలీ లోనే నిక్షిప్తమై ఉంది.1985లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆధీనంలోకి ఈ ఎయిర్‌స్టేషన్‌ వచ్చింది. ఆతర్వాత భారత నౌకాదళం రజాలీని వ్యూహాత్మక ఎయిర్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దింది.1992 మార్చి 11న అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్‌ ఈఎయిర్‌ స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు.ఈఎన్‌సీకి చెందిన స్థావరాలు మొత్తం 15ఉండగా..ఇందులో ఏడు నేవల్‌ బేస్‌లు విశాఖలోనే ఉన్నాయి. నేవల్‌ బేస్‌ ఐఎన్‌ఎస్‌ వర్ష రాంబిల్లిలో నిర్మితమవుతోంది.
నౌకాదళానికి, ప్రజలకు వారధి.. నేవీడే
తూర్పు నౌకాదళం అత్యంత ప్రధానమైన కమాం డ్‌. దేశ రక్షణలో అశువులు బాసిన నావికులు చేసిన సేవలు శ్లాఘనీయం.లుక్‌ ఈస్ట్‌, టేక్‌ ఈస్ట్‌ విధానాలతో తూర్పు నౌకా దళానికి ప్రాధాన్యం పెరిగింది. మిషన్‌ డిప్లా య్స్‌ ఆపరేషన్స్‌ అనే విధానాన్ని ప్రస్తుతం నేవీ అనుసరిస్తోంది.ఈవి ధానంవల్ల అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో అందు బాటులో సిబ్బంది ఉండ గలుగుతున్నారు.హెలి కాఫ్టర్లు,యుద్ధ నౌకల ద్వారా దాయాదిదేశాలకు చెందిన వాటిని గుర్తించి ఎదుర్కొనేందుకు నిత్యం పహారా కాస్తు న్నాం.ఒకవేళ అలాంటివి ఎదురైనా..వాటిని తిప్పికొట్టేందుకు సమర్థంగా ఉన్నాం.- వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌దాస్‌ గుప్తా, తూర్పు నౌకా దళాధిపతి
ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం..ఆ పేరెందుకు పెట్టారంటే..
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్‌ -15బీ పేరుతో నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మ్కిసైల్‌ డిస్ట్రా యర్‌ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశం లోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం,మోర్ముగావ్‌,ఇంఫాల్‌, సూరత్‌ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు.
ముంబైలో తయారీ
2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్‌ ఒప్పందం జరిగింది. డైరెక్టర్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌, ఇండియన్‌ నేవీకి చెందిన అంతర్గత డిజైన్‌ సంస్థలు షిప్‌ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్‌ తయారీకి వై-12704 పేరుతో ముంబైలోని మజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) శ్రీకారం చుట్టింది.2015 నాటికి హల్‌తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. తయారు చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి. 2019 జూన్‌లో షిప్‌లోని ఏసీ గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు. అయితే..షిప్‌ తయారీలో మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లలేదు. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్‌ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నౌకను అక్టోబర్‌ 28న అప్పగించారు. డిసెంబర్‌లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు.
శత్రువుల పాలిట సింహస్వప్నమే
ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా..ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖను శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు.
యుధాలు :
32 బరాక్‌ ఎయిర్‌ క్షిపణులు,16 బ్రహ్మోస్‌ యాంటీషిప్‌, ల్యాండ్‌ అటాక్‌ క్షిపణులు,76 ఎంఎం సూపర్‌ రాపిడ్‌ గన్‌మౌంట్‌, నాలుగు ఏకే-630 తుపాకులు,533 ఎంఎం టార్పెడో ట్యూబ్‌ లాంచర్స్‌ నాలుగు, రెండు జలాం తర్గామి వ్యతిరేక రాకెట్‌ లాంచర్లు.
నౌకాదళ సేవలు.. తీర ప్రాంతాల సరిహద్దులను రక్షించడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ, ప్రక్రుతి వైపరీ త్యాలు, ఇతర ప్రమాదకర పరిస్థితులను మన నౌకాదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్‌ గ్రూప్‌ కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తారు. నేవీ డే సందర్భంగా విశాఖ పట్నంలోని ఆర్కే బీచ్‌ లో ప్రతి ఏటా ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తుంటారు. విశాఖతో పాటు ముంబైలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద బీటింగ్‌ రిట్రీట్‌ వేడుకలను నిర్వహిస్తారు.
రానున్న 25 ఏళ్లలో భారతదేశం.. విశ్వ గురువుగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి భారతీయుడు నరనరాల్లో సంస్కృతి, సంప్రదా యాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్స రాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. వంద సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు చేసుకునే సమయంలో ప్రపంచంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో నావికాదళం కీలక పాత్ర పోషిస్తోంది.భారత్‌ రక్షణలో మహిళల పాత్ర ఎంతో ఉంది. భారత నావికాదళంలో వివిధ హోదాల్లో మహిళలు కూడా దేశ రక్షణ లో పాలుపంచుకుంటున్నారు. 1971లో పాకి స్తాన్‌పై జరిగిన యుద్దంలో విజ యానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ 4న నేవీ డే వేడుక లను జరుపుకుంటున్నాం.ఈ యుద్దంలో అసువు లు బాసిన యుద్ద వీరులను మరో సారి గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. వారి త్యాగాలు కీర్తిస్తూ..ప్రతి తరానికి గుర్తు చేయడం మన బాధ్యత.మూడువైపుల సముద్రంం,ఒకవైపు పర్వాతాలు కలిగిన మన దేశం. మొదటి నుంచీ సముద్ర తీర దేశంగా ఉంది. సహజసిద్దంగా ఉన్న ఈ సముద్ర తీరం దేశాభివృద్ధికి ఎంతో కీలకం.తీరరక్షణలో భారత నేవీఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. భారత నావికాదళం ఎంతో శక్తివంతమైనదే కాకుండా ఎటువంటి పరిస్థితు లనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పఉడూ సన్నద్దం గా ఉంటోంది. భారత నూతన అభివృద్ధిలో నావికాదళం పాత్ర కీలకమైనది..త్రివిధ దళాధి పతిగా నాకు ఎంతో నమ్మకం ఉంది. రాష్ట్రం లో ప్రారంభిస్తున్న వివిధ ప్రాజెక్టులు దేశాభి వృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దేశ ప్రజలం దరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయుక్తంగా ఉంటాయి.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఏపీలో ద్రౌపతి ముర్ము పర్యటన.. ఘనంగా పౌరసన్మానం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ విశ్వభూషన్‌, సీఎం జగన్‌,కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి,ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా,పలువురు మంత్రులు,ఎంపీలు, ఎమ్మె ల్యేలు,ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ద్రౌపతి ముర్ము పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఆ తర్వాత రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తిరుపతి బయలుదేరి అక్కడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.- ` సైమన్‌ గునపర్తి

ఆదివాసీ పండగలు..ఐక్యతకు ప్రతీకలు

భిన్న జాతుల సమాహారం ఆదివాసీ గిరిజనులు. వారి ఆచార సంప్రదాయ, సంస్కృతికి ప్రతి రూపాలు. పండగలేదైనా ఐక్యతరాగంతో ఆచరించే వారిది ప్రత్యేక సంస్కృతి, ముఖ్యంగా గోదావరి ఉత్తర తీరాన ఉండే గిరిజన ప్రాంతం విభిన్నమైన సంస్కృతీ, ఆచా రాలకు ప్రసిద్ధి చెందింది. అడవితల్లి ఒడిలో గిరిజనులు జరుపుకొనే అందమైన పండగలు వారి సాంస్కృతికి ప్రతి రూపాలు. దాంట్లో భాగంగా తెలంగణా ప్రాంత ఆది వాసీల ఆచా రాలు, సంప్రదాయాల కళలు, పండగలు వారి ఐక్యతకు చిహ్నాలు. ఆది వాసీల సంస్కృతిని ప్రతిబింబించే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వారం పాటు ఘనంగా సాగే ఈ పండుగ నృత్య గానాలతో హోరె త్తుతుంది. గోండులు, తోటీలు, పర్దాన్లు, కోలములు ఈ పండుగను ఎక్కువ గా జరుపు కొంటారు. ఆదివాసీ సంస్కృ తిలో దీపా వళి పండుగ ‘దండారి’కి ప్రత్యేక స్థానం ఉన్నది. ఆటపాటలతో ఐక్యతగా జరుపుకొనే ఈ పండగపై థింసా అందిస్తున్న ప్రత్యేక కథనం…!- (సుమనస్పతి రెడ్డి)
ఈ పండగ సందర్భంగా జరిపే దండారి పండగలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన అమ్మమ్మ పద్మల్‌ పురి కాకో దేవాలయానికి భారీగా తరలివస్తారు.ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా గిరిజనులు ఈ ఆలయానికి వస్తారు. దండారి వేడుకలో గుస్సాడి వేషధారణ,రేలారే రేలా ఆటపాటలు,కొమ్ముల విన్యాసాలు, ఆది వాసీ మహిళల ప్రత్యేక పూజలు అందరినీ ఆకట్టుకుంటాయి.చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిల రావాలతో అడవి వారం పాటు హోరెత్తుతుంది. దండారి పండుగ జరిగే వారం రోజులపాటు ఆదివాసీ గూడేలు,పల్లెలు గుస్సాడీ నాట్యాలతో శోభాయ మానంగా కనిపిస్తాయి. గోండులు ప్రత్యేక నృత్యాలు చేస్తారు. ఈ పండగ ఆదివాసుల్లో ఐక్యతను, ఆప్యాయతను మరింత బలోపేతం చేస్తుంది. దండారి బృందాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడివారితో కలిసి ఆడిపాడ తాయి. విందు,వినోదాల్లో పాలుపంచు కుంటా యి. దండారిలో ఆట పాటలకు డప్పు,రడ మేళా,డోల్‌ వెట్టి,కర్ర,పెప్రి,తుడుం సంగీత పరికరాలు ఉపయో గిస్తారు. నెమలీకలతో పేర్చిన గుస్సాడి కిరీటాలను,ముఖానికి ధరించే పువ్వులను గ్రామం మధ్యన గుట్టపైన పేర్చి సంప్రదా య రీతిలో పూజలు జరిపి గొర్లు, మేకలు,కోళ్లను బలివ్వడం ఆచా రం.దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందిన తర్వాతనే గిరిజనులు నృత్యాలు ప్రారంభిస్తారు. పురుషులు గుస్సాడి,చచ్చాయి,చాహోయి నృత్యాలు చేస్తారు. శరీరం నిండా బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి పూసు కుంటారు.ఎడమ భుజంపై మేక చర్మం లేదా జింక చర్మం వేలాడదీసుకుంటారు.కుడిచేతిలో మంత్ర దండం లాంటి రోకలి పట్టుకుంటారు. లయబద్ధంగా సాగే గుస్సాడి నృత్యానికి వాయిద్యాల చప్పుడు తప్ప పాట నేపథ్యం ఉండదు. దండారి సందర్భంగా నృత్య బృం దాలు కాలినడకనే ఊరూరూ తిరుగుతాయి. ఈ పండగ సందర్భంగా యువకులు తమకు సరైన జోడి కోసం వెతుక్కుంటారు. పండగ తర్వాత పెళ్లి సంబంధాల గురించి మాట్లాడు కుంటారు. దీపావళి అమావాస్య తర్వాత ఒకట్రెండు రోజులు జరిపే కోలబోడితో దండారి ఉత్సవాలు ముగుస్తాయి. ఊరు బయటినుంచి చెంచి భీమన్న దేవుడు ఉండే ఇప్పచెట్టు దగ్గర దండారి వాయిద్యాలు, దుస్తులు తీసేసి వాటి ముందు జంతువులను బలిచ్చి పూజలు చేస్తారు. విందు భోజనం తర్వాత అన్ని వస్తువులనూ ఇళ్లకు తీసుకెళ్తారు. చివర్లో గుస్సాడీల దగ్గర్లో ఉన్న చెరువు, కాలువకు వెళ్లి స్నానం చేసి దీక్ష విరమిస్తారు. ఈ పండగ ప్రాధా న్యం గుర్తించిన రాష్ట్ర ప్రభు త్వం ఏటా ఈ పండగ నిర్వహణకు తగినన్ని నిధులను కేటాయిస్తున్నది. వం దల ఏండ్ల నుంచి గిరిజను లు ఈ దండారి పండుగను జరుపుకొంటున్నారు. తమ సంస్కృతీ సంప్రదాయాల ను కాపాడుకుంటూ భావి తరాలకు అందిస్తున్నారు. ప్రతిరూపం దండారీ ఉత్సవాలు గిరికోనలో సందడి మొదలైంది. డప్పుల మోతతో అడవితల్లి ప్రతిధ్వనిస్తున్నది. దీపావళి సందర్భంగా ఆదివాసీ గూడెంలో దండారి వేడుకలు సంప్రదాయ బద్ధంగా సాగుతాయి. గుస్సాడీ నృత్యాలు, కోలాటాలు, కోలాహలాలతో గూడాలన్నీ సందడిగా మారాయి. దీపావళికి వారం ముందు నుంచే దండారి సందడి మొదలవుతుంది. పండుగ తర్వాత కోలాబొడితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇందులో భాగంగా తమ ఆరాధ్యదైవం అయిన ఏత్మాసుర్‌ను భక్తితో కొలుస్తారు. ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే దండారి వేడుకలో గుస్సాడీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒళ్లంతా బూడిద రాసుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, జంతు చర్మం భుజాన వేసుకొని, నెమలి పింఛాలు ధరించి వాద్యఘోషకు అనుగుణంగా చేసే నృత్యం చూడముచ్చటగా ఉంటుంది. లయా త్మకంగా కదలాడుతూ, భక్తిపారవశ్యంలో హావ భావాలు పలికిస్తూ భక్తులను అలరిస్తారు కళా కారులు. ఉత్సవాల్లో భాగంగా ఒక గూడెం నుంచి మరొక గూడానికి వెళ్తూ బంధుత్వాలు కలుపుకొనే ప్రయత్నం చేస్తారు ఆదివాసీలు. అనుబంధాలు పెంచుకోవడానికి దండారి పండుగను ఆలంబనగా చేసుకుంటారు. ఆదిలాబాదు గోండు ఆదివాసీలంటే వెంటనే తలం పుకు వచ్చేది తలపైన నెమలిఈకల పెద్దటోపీలు ధరించి విచిత్రమైన వేషధారణతో లయబద్ధంగా నృత్యం చేస్తూ కదిలే ‘గుసాడి’ నృత్యకారులు.అయితే రంగస్థలం (స్టేజి) పైనో, సభలూ, సమావేశాల్లో ప్రముఖులను ఆహ్వానిస్తూనో చేసే గుసాడి నృత్యాన్ని మాత్రమే చూసినవాళ్లకు గోండు, ఇంకా కొలాం ఆదివా సీల అతిముఖ్యమైన సామాజిక ఉత్సవం ‘దండారి’లో గుసాడిలు ఒక భాగమని గాని, దండారి వంటి అతిమనోహరమైన, నృత్య, సంగీతమయమైన ‘సోవ పండుగ (శోభా యమైనపండుగ) ఏ సంస్కృతిలో నైనా అరుదనిగాని ఊహించడం కొద్దిగా కష్టమే. ఇందులో కోలాటం (దండారి అంటేనే కోలాటం) వేసేవాళ్ళు (యువకులు, మగ పిల్లలు)బీ గుమేల,పర్ర, వెట్టె ఈ ప్రత్యేకమైన దండారి వాయిద్యాలు,చాలా పెద ్దతోలుడప్పులు (10,20 నుండి 50,60 దాకా ఉండొచ్చు), తుడుం, పేప్రె (సన్నాయి), కాలికొం (కొమ్ము) ఈ వాయి ద్యాలు వాయించేవాళ్లుబీ ‘పోరిక్‌’ అంటే ఆడపిల్లల వేషాలు వేసిన పోర గాల్లుబీ గుసాడివేషగాళ్లుబీ తోడుగా వెళ్లేవాళ్లూ ఉం టారు. ఆతిథ్యం ఇచ్చే ఊరిలోకి చీకటి పడే వేళకు ప్రవేశించడం,వాళ్ల అతి స్నేహ పూర్వ కమైన ఆతిథ్యాన్ని, మర్యాదలను (ఆడ పెళ్లి వారే వచ్చినట్టుగా! గోండు సంప్రదాయంలో వరుడి ఇంట్లోనే పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగు తుంటాయి.) అందుకోవడం, అక్కడి డప్పులబృం దంతో కలిసీ, విడిగాకూడా జోరుగా డప్పులూ, తుడుమూ వాయించడం పలురకాల (గుసాడి లవి, కోలాటాలవి, రెండూ కలిసినవి) నృత్యాలు చేయడం గుమేలా,ఢోల్కీ (చిన్న డోలు) పాటలు పాడడం మధ్య మధ్య గొప్ప వినోదాత్మకమైన చిన్న, చిన్న హాస్య, వ్యంగ్య నాటికా సన్నివే శాలను ప్రదర్శించడం (వీటిని ‘ఖేల్‌’ అంటారు) విందులు ఆరగించడం,హాస్యాలు,ముచ్చట్లాడు కోవడం ఒక రాత్రి విశ్రమించి,మరునాడు మళ్లీ ఆటలాడి, పాటలుపాడి, ‘ఖేల్‌’ప్రదర్శనలతో కడుపారా నవ్వుకొని,డప్పులు మ్రోగించుకొని, సాదరంగా వీడ్కోలు చెప్పిరావడం,స్థూలంగా ఇదీ దండారి స్వరూపం.సొంత ఊరి నుండి బయలుదేరి వెళ్లడం,తిరిగి రావడం కూడా చెప్పుకోదగ్గ తంతులే! ఆడవాళ్ల దండారి సంప్ర దాయం కూడా ఉన్నది!బృందంలోని పెళ్లికాని యువకులు ఈ ఊళ్లో పెళ్లీడుకొచ్చిన అమ్మా యిల్లో తమకు తగినవారె వరైనా ఉన్నారా అని వెతుక్కోవడం కూడా దండారి ప్రయోజనాల్లో ఒకటి. ఇంతవిపులమైన దండారి పండుగలో ఉండే ఆచారాలు,పూజలు,మర్యాదలు,చిన్నా పెద్దా ఇతర తంతులూ,సరదాలూ,వాటి అం దాలూ,విశేషాలూ అన్నీ వర్ణించి చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది.దండారి పర్వం వివిధ దశల్లోని కొన్ని విశేషాంశాలను ప్రస్తావించుకోవడానికి మాత్రమే ఇక్కడ వీలవుతుంది. తెల్లని ధోవతులు, అంగీలు ధరించి, నడుముకూ,తలకూ తెల్లని లేక రంగు రుమాళ్లూ కట్టుకొని, చేతుల్లో సన్నని కోలలు ధరించి వచ్చిన దండారి ఆటగాళ్లబృందం వారు వెట్టె, పర్ర వాయిద్యాల దరువుల మీద చేసే ‘మాన్కోలా’ (గౌరవ అభివాదక సూచకమైన కోలాటం), ‘చచ్చోయ్‌’ నృత్యాలు, మెత్తని గుమేలా, పర్ర దరువుల మీద పాడే మెల్లని, మధురమైన పాటలకు అనువుగా చేసే అత్యంత లయాత్మకమైన కోలాటాలు, వారితో కలిసి ‘పోరిక్‌’లు (అమ్మాయిల వేషంలో వచ్చిన యువకులు) కూడా కోలాటం ఆడటం చూడ ముచ్చటగా ఉంటుంది.గజ్జెలు,అందెల రణగొణ సవ్వడులతో,బరువైన లయాత్మకమైన అడుగులు వేస్తూ, ఎడమ చేతితో జింకతోలును వెడల్పుగా కదిలిస్తూ, చాచిన కుడిచేతిలో పట్టుకున్న దండంతో శాసనం చేస్తున్నట్టు, మహత్తరమైన గాంభీర్యంతో,అతిలోకమైన శివసౌందర్యంతో, రెండు ఊళ్ల గుసాడిలు కలగలిసి కోలాటం ఆడేవాళ్లతోనూ,విడిగా కూడా చేసే తిరుగోల నర్తనాలుబీ కుర్రవాళ్లు, యువకులూ నిలబడి పాడే జోరైన ఢోల్కీ పాటలు, భుజాల మీదుగా చేతులు కలుపుకొని, ఏవాద్యమూ తోడు లేకుం డా తమ శృతిదేలిన సన్నని గొంతుకలతో దేవుండ్ల పాటలు పాడుతూ మెల్లని తిరుగోలలా ఈ ఊరి ఆడవాళ్ళు ఆడుతూ ఉంటే, వాళ్లను రక్షిస్తున్నట్టు వాళ్ల చుట్టూ మరో వలయంగా గుసాడిలు ఆడుతుంటారు. కనికట్టులా సాగే ఈ ఆటలు, పాటల మధ్య నిత్యజీవితపు వాస్తవానికి తీసుకు వచ్చి గొప్ప హాస్యమూ, వ్యంగ్యదృష్టీ కల బోసి, పనికొచ్చే సందేశాలు కూడా ఇచ్చే ‘ఖేల్‌’ అనే లఘు వీధి నాటికలు, ఇలా ఎన్నో ఘట్టాలతో సకలేంద్రియాలను, మనస్సును గొప్ప ఉత్సవానందాను భూతితో నింపుతుంది అమావాస్య తరువాతి ఒకటి రెండు రోజుల్లో జరిపే ‘కోలబోడి’తో దండారి పండుగను ముగిస్తారు. ఆనాడు ఏ ఊరికాఊరి దండారి, గుసాడిలబృందం ప్రతి ఇంటికీవెళ్లి, పూజలందు కొని, పరాచ కాలాడి, ఊరవతల ‘చెంచిభీమన్న’ దేవుడుండే ఇప్పచెట్టుదగ్గర దండారి వాయి ద్యాలు, దుస్తులు, ఆభరణాలు అన్నీ తీసిపెట్టి, బలులిచ్చి, పూజలు, తాపీగా విందు భోజనమూ చేసి, అన్ని వస్తువులనూ ఇళ్లకు తీసుకువెళ్తారు. గుసాడిలు దగ్గరలో ఉన్న చెరువో, కాల్వకో వెళ్లి, ఒళ్లు కడుక్కొని,స్నానం చేసి, దీక్ష విరమిస్తారు. గుమేల,పర్ర,వెట్టె, ఈ దండారి వాయిద్యాలు మళ్లీవచ్చే ‘అకాడి’ పండుగ వరకు బయట కురావు,వినిపించవు!
గోండుల పౌరాణిక గాథలు
సంస్కృతీ పెద్దగా తెలియని వారికే ఒక్కసారి చూస్తే చాలు, గొప్ప అనుభూతిగా మిగిలిపోయే దండారి ఉత్సవం,ఆగాథల వారసత్వంగానే ఏర్పడిన మతాచార సంస్కృతీ సంప్రదాయాల్లో నిత్యం జీవిస్తున్న ఆ జాతి జను లకు ఎంతో ప్రాణ ప్రదంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అయితే రాజ్‌గోండుల్లో ఉన్న నాలుగు శాఖలు లేకగట్ల (‘నాల్వేన్సగ’, ‘సియివేన్సగ’, ‘సార్వేన్సగ’, ‘యేడ్వేన్సగ’ – అంటే నాలుగు, అయిదు, ఆరు, ఏడు(ఆదిగోండు) దేవతల గుంపులు లేక గట్ల – గోత్రాల నుండి జనించినవారు) వాండ్లల్లో వారివారి సగల పౌరాణిక గాథల్లో ఉన్న అపారమైన వైవిధ్యం కారణంగా దండారి ఉత్సవం పుట్టుక గురించి చాలాకథలే ఉన్నాయి. రాజ్‌గోండుల గురించి, విఖ్యాత మానవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ క్రిస్తోప్‌వాన్‌ ఫ్యూరర్‌ హైమండాఫ్‌ రాసిన ప్రామాణిక గ్రంథంలో రెండు మూడు కథలు లభిస్తున్నాయి. ఈ కథలన్నీ కూడా గోండుల తొలితరంతోనే ముడివడిఉండటం విశేషం. ఆది గోండులు పంటలు,సమృద్ధి బాగా ఉన్న ఒక తరుణంలో, ఆ ఆనందపు రోజులు ఉండగానే పండుగగా చేసుకునే గొప్ప సంబురాన్ని రూపొందించమని అడిగినప్పుడు హీరాసుక్‌ అనే తొలి పరధాన్‌ (‘పరధాన్‌’లు, ‘తోటి’లు గోండుల పురాణాలను, వంశ చరిత్రలను ఆలపించే ఆశ్రిత జాతుల వారు) దండారి వాయిద్యాలను, ప్రక్రియ మొత్తా న్ని రూపొందించి ఇచ్చినాడని ఒక కథ. ఈ కలి యుగం చడీ,చప్పుడు లేకుండా నీరసంగా ఉం దని ఆది గోండులు దుఃఖిస్తుంటే కోట్కపిట్టె జుంగాల్‌ రావుడ్‌ అనే సాహసికుడు సమస్య పరిష్కారం కోసం వెదుకుతూ సుదూర ప్రయా ణం చేసి, సముద్రం మీద వెదుకుతూ ఉంటే ‘యేత్మ సూర్‌’ అనే దేవ జలకన్య గుసాడి రూపంలో మనోహరమైన నృత్యం చేస్తుంటే చూసి ఆమెతో ప్రేమలో పడితే, ఆమె తన వేషభూషణాలను అతనికిచ్చి, గోండులు ప్రతి యేడాదీ యేత్మసూర్‌ (యేర్‌ అంటే నీరు, సుర్‌ అంటే స్వరము అని వింగడిరచవచ్చు) దేవత రూపం వేసుకొని నృత్య, సంగీతాలతో దండారి చేసుకొమ్మని ఆనతి ఇస్తుంది. ఇటువంటిదే మరో కథలో దేవుడు తన మనుమరాలైన యేత్మసూర్‌ ను గోండు యువకుడు పెండ్లి చేసుకుంటానంటే ఒప్పుకొని, కాని ప్రతి యేడాదీ తమ లాగే రూపం వేసుకొని, ఆమె చుట్టూ నృత్యమాడి జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్దేశిస్తాడు. ఇంకొక కథా భేదం ప్రకారం అదృష్టాన్ని, సంపదలనిచ్చే లక్ష్మీ సమానమైన యేత్మసూర్‌ దైవత చిహ్నాలుగా దండారి వాయిద్యాలు, అలంకారాలు అన్నింటినీ పూజించి, ధరించి పండుగ చేసుకోవడం జరుగుతున్నది. సృష్టికర్తjైున ‘జటాశంకర్‌ విలాస్‌ గురు’ సృష్టి చేయడానికి తపోదీక్ష పూనినప్పుడు సరీమ్‌ మీదకు చెట్లూ పుట్టలు పెరిగి పోయిన ఆయన రూపం వంటిది గుసాడి వేషం అని చెప్పు కోవడం కూడా ఉన్నది. ఆత్మ అనగా ఆత్మ స్వరూపుడైన ఈశ్వరుని రూపమే గుసాడి అని భావం. మరొక కథలో ఆది గోండులు తమకు భార్యలు కావాలి కదా అని అడిగినప్పుడు గోండుల సగలు, సామాజిక వ్యవస్థలు, మతా చారాలన్నింటినీ ఏర్పరిచిన ప్రవక్త వంటి ‘పహండి కుపార్‌ లింగు’ అభ్యర్థన మీద ‘సొంఖస్తాడ్‌’ గురువు, ‘షేకు’ సోదరుల కూతుళ్లను ఈ యువకులు ఆకర్షించడానికి తగినట్టుగా దండారి ఆటపాటలను రూపొం దించినట్టు ఇంకొక కథ ఉన్నది. ఇలా ఒకే అంశం మీద పలు కథలు, తేడాలు ఉండటం జాన పద, పౌరాణికేతిహాసాల్లో మామూలే!
దండారి-గుసాడి పర్వంలో, ఈ కథలన్నీ నిర్దేశించే, సూచించే అంశాలూ, గూఢార్థాలూ, వ్యక్తిపరమైన, సామాజిక ప్రయోజనాలూ పెనవేసినట్టుగా కలగలిసి ఉన్నాయి. దండారిలో పాల్గొన్న వారికీ,చూసిన వారికి కూడా ఆ భావానుభవాలు అన్నీ ఎంతోకొంత అంది తీరుతాయి. ఉదాహరణకు వయసొచ్చిన మగ పిల్లలు ‘పోరిక్‌’ ల వేషాలు వేసుకొని రావడం అనేది, అన్ని మంచి గుణాలు, సామర్థ్యం ఉండి కూడా అణకువగా, అనుకూలంగా ఉండే ఆడపిల్లను ఎంత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలో అన్న విషయం అనుభవపూర్వకంగా తెలుసుకో వాలనే కదా? ఎన్నో ఊళ్ల నుండి వచ్చి దర్శించి పోయే గుసాడి దండారిబృందాలను చూడాలను కుంటే మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండ లంలో గోదావరీ నదీ తీరాన ఉన్న ‘పద్మాల్‌ పురి కాకో’ అమ్మవారి పుణ్య క్షేత్రానికి వెళ్లాలి.
గుసాడి వేషం
సుద్ద మన్నులేక బూడిద ను బురదగా చేసి శరీరమంతా పూసి, వేళ్లతో గాని, పల్చటి లోహపు గొలుసుతో గాని రుద్దుతూ గీతల అందమైన విన్యాసాలు వచ్చేలా ముందుగా గుసాడి వేషగాన్ని దిద్దుతారు. ముఖానికి ఎక్కువగా పెంక మసిని, కొన్ని సార్లు తెల్ల సుద్ద రంగును దట్టంగా పూస్తారు. నడుముకు మోకాళ్ల కింది వరకు వచ్చేలా తెల్లని లేక రంగు వస్త్రం (ఒకప్పుడు మేక తోలు ధరించే వారు), దానిపై నుండి పెద్ద ఇత్తడి,కంచు గజ్జెలు, గంటల వడ్డాణము,అరచేతికి,మోచేతికి, చేతిదండాలకు పూసలు,రుద్రాక్షలు,రంగు గుడ్డలు లేక ప్లాస్టిక్‌ పూలతో అలంకరంచిన కంకణాలు,కాలి మడమల పైన బరువుగా ఇత్తడి గజ్జెల వరుసలు,ఎడమ భుజం నుండి వేలాడే చిన్న జోలె,ఒక వెడల్పైన జింక తోలు, మెడ నుండి పెద్ద రుద్రాక్షలు, ఎండిన మేడి, ఇతర అడవి కాయలు, పెద్ద ఫూసలతో చేసిన మాలలు,గంటలు,కుడి చేతిలో ‘గంగారాం సోట’ అని పిలిచే, కర్రతో అందంగా తణెం పట్టిన అలంకరించిన రోకలి కర్ర, తలపై భవ్యమైన ‘కంకాలి’టోపిబీ ముఖం పైన గోగు నార పోగులతో చేసి కట్టిన గుబురు మీసాలూ, గడ్డాలూ -ఇది గుసాడి రూపం.దీక్ష తీసుకున్న తరువాత దండారి పండుగ పూర్తయ్యే దాకా వారం, పది రోజులు గుసాడిలు స్నానం చేయకూడదు..
వేషాధరణకు ప్రత్యేకం..గుసాడి పండుగ
గుసాడి టోపి 10,15దండారి పండుగల దాకా నిలిచే అతి పవిత్రమైన గుసాడి టోపీలను కొం దరు నిపుణులైన గోండులు, కొలాంలే చేయ గలరు. పదిహేను వందల కన్న ఎక్కువే నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు.టోపీకి చుట్టూ,ముఖ్యంగా ముందరి వైపు,పలు వరుసల్లో,పెద్ద అద్దాలతో,రంగు,జరీ దారాలు, చక్కటి డిజైన్లున్న గుడ్ద పట్టీలతో,పలు ఆకారాల రంగు రంగు చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్ని సార్లు రెండు పక్కల జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు. ఆదివాసి గిరిజన గూడాల్లో గుస్సాడి డ్యాన్స్‌ .. ఎందుకు చేస్తారో తెలుసా ..?
జిల్లాలోని ఆదివాసి గిరిజనులు దీపావళి పండుగ రోజుల్లో దండారి సంబురాల పేరుతో వేడుకలు జరుపుకుంటారు. అందులో భాగమే ఈ విచిత్రమైన వేషాధారణ. ఆదివాసి గిరిజ నుల మాటల్లో చెప్పాలంటే ఇది కూడా ఓ దీక్ష లాంటిదే. తలపై నెమలి పించాలతో తయారు చేసిన కిరీటాన్ని పోలి ఉండిన టోపి. శరీరానికి నల్లటి రంగు. దానిపై బూడిద చారలు. భుజాన జింక తోలు. మెడలో గవ్వల హారాలు. చేతిలో మంత్రదండాన్ని పోలినటు వంటి కర్ర. కాళ్లకు గజ్జెలు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు పండుగ వేళ ధరించే ప్రత్యేక వేషా దారణ ఇది.జిల్లాలోని ఆదివాసి గిరిజనులు దీపావళి పండుగ రోజుల్లో దండారి సంబురాల పేరుతో వేడుకలు జరుపుకుంటారు. అందులో భాగమే ఈ విచిత్రమైన వేషాధారణ. ఆదివాసి గిరిజనుల మాటల్లో చెప్పాలంటే ఇది కూడా ఓ దీక్ష లాంటిదే. ఆ విధంగా ప్రత్యేక వేషదారణలో వారు చేసే నృత్యం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ నృత్యం విడిగా చేసేది కాదు. గిరిజన బిడ్డలు ఓ గుంపుగా చేరి నృత్యం చేస్తుంటారు. సొంతగా తయారు చేసిన సంగీత పరికరాల ధ్వనుల మధ్యే డ్యాన్స్‌ చేస్తారు. గోండులు, కొలాంలు ప్రతి గిరిజన గూడెంలో చేసుకునే వేడుకల్లో ఒక భాగం. డప్పుల దరువు రకరకాల గిరిజన సంప్రదాయ వాయిద్యాల సంగీతం మధ్య చచోయ్‌ నృత్యంతో పాటు రేల పాటల నడుమ డ్యాన్సులు చేయడం కనువిందుగా ఉంటుంది. లయబద్దంగా సాగే ఈ గుస్సాడి నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా వాళ్లను ఆదివాసి గిరిజనుల సంప్రదాయనృత్యానికి ముగ్దులుగా మార్చేస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన గూడాలు గోండుల దండారి, గుస్సాడి నృత్య ధ్వనులతో మారు మ్రోగి పోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌ గోండులకు మాత్రమే పరిమితమైన సంప్రదాయం ఇది. ఈ గుస్సాడి, దండారికి సంబంధించి చాలా తక్కువ మంది గోండులకు తెలిసిన ఒక ప్రాచీన కథ కూడా ప్రాచూర్యంలో ఉంది. రాజ్‌ గోండుల్లో ఏడు దేవతల గోండులు,ఆరు దేవతల గోండులు, ఐదు దేవతల గోండులు, నాలుగు దేవతల గోండులు అనే నాలుగు ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. ఈ దండారి పుట్టుక కథ ముఖ్యంగా ఐదు దేవతల రాజ్‌ గోండుల కథకు చెందినది. ఒక ఊరికి చెందిన గుస్సాడి నృత్యం చేసే పురుషులు, పిల్లలు, ఆడవాళ్ల బృందం, డప్పు, పర్ర, తుడుం, తప్పల్‌, వెట్టె, గుమేలా మొదలైన వాయిద్య కారులు, అమ్మాయిల వేషం వేసుకున్న పోరికలు ఇంకో ఊరికి వెళ్లడం ఆనవాయితీ. అలా వచ్చిన తమ గ్రామానికి వచ్చిన దండారి బృందానికి ఆతిథ్యం ఇచ్చె గిరిజన గూడెం వాసులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికి వారికి సకల సదుపాయాలు కల్పిస్తారు. అలా ఒక్కో యేడాది ఒక్కో బృందం ఒక్కో ఊరికి అతి థులుగా వెళుతుంటారు. దండారిలో భాగంగా నృత్యాలు, సంగీతం, పాటలే కాకుండా అనేక రకాల క్రతువులు ఉంటాయి. తాము దైవంగా భావించే ఏత్మసూర్‌ దేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. సామూహిక భోజనాలు కూడా చేస్తారు. గుస్సాడి నృత్యంతో పాటు పలు సామాజిక అంశాలు, ఇతర సమకాలిన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శించే ఖేల్‌ ఈ దండారి వేడుకలకు ప్రత్యేక ఆకర్శణగా ఉంటుంది. గుస్సాడి వేషం ధరించిన వారిని దేవతలు ఆవహిస్తారని, వారి చేతిలోని దండం వంటి కర్రతో తాకితో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని గిరిజనుల విశ్వాసం. అయితే గుస్సాడి వేషధారణలో ఉన్న పురుషులు దీక్ష పూర్తయ్యే వరకు స్నానం కూడా చేయకపోవడం మరోవిశేషం.ఏదిఏమైనప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రాజ్‌ గోండులు, కొలాంలు తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచార్య వ్యవహారాలను తూ.చ తప్పకుండా పాటించడంతోపాటు వారి సంస్కృతి సంప్రదా యాలను పరిరక్షించుకుంటూ వాటిని భావిత రాలకు అందజేయడంలో ముందున్నారని చెప్పవచ్చు. `(తెలంగణా మాస పత్రిక సౌజన్యంతో..)

మన్యం కాఫీ తోటల కథ..

చల్లటి సాయంత్రానా..వేడి వేడి కాఫీని తాగుతూ..ఓ మంచి పుస్తకాన్ని చదువు తుంటే… ప్రపంచానే మైమరిచిపోతారు అనటంలో అతిశయోక్తి లేదు. ఎంతటి ఒత్తిడినైన ఓకప్పు కాఫీ అలవోకగా దూరం చేస్తుంది. మిత్రులతో కబుర్లు చెబుతూ..పొగలు కక్కే కాఫీని ఆస్వాదిస్తూ కాలాన్నే మరిచి పోతుంటారు. ఇంతటి విశిష్ట కలిగిన కాఫీ పంట మన ఆంధ్రాలోను పండుతుం దండోయ్‌?.అంతేనా అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలను అందుకోవటంతో పాటు… కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. మరి ఈ కాఫీ కథేంటో కాస్త చూద్దామా…
ఓ మంచి కాఫీ… తీయ్యని అనుభూతిని కలిగిస్తుంది. మనస్సుకు నచ్చిన వారితో కబుర్లు చెబుతూ… కాఫీని ఆస్వాదించటం ఓ మధుర జ్ఞాపకం. అలాంటి విశిష్టత కలిగిన కాఫీ తయారీలో కీలక పాత్ర వహిస్తోంది విశాఖ నర్సీపట్నంలోని కాఫీ శుద్ధీకరణ కేంద్రం. ఇందులో శుద్ధి చేస్తున్న కాఫీ గింజల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థకు ఏటా కోట్ల ఆదాయం వస్తోంది. విశాఖ మన్యంలోని ప్రత్యేకమైన వాతావరణంలో పండే ఈ కాఫీ గింజలకు దేశంలోనే విశిష్ట స్థానం ఉంది. అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో ఏన్నో పురస్కారాలు దక్కాయి. నర్సీపట్నం కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ ప్రస్థానం…మన్యం కాఫీ గింజల గుర్తింపు వెనుక నర్సీపట్నంలోని కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ కృషి ఎంతో విలువైనది. ఈ కేంద్రం ఏపీఎఫ్‌ డీసీ ఆధ్వర్యంలో 1959లో ఏర్పడిరది. అప్పట్లో శ్రీలంక కాందిశీకులకు (వలసదారులు) ,ఉపాధి కల్పించాల్సిన ఒప్పందం మేరకు … ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల పెంపకాన్ని ప్రారంభించింది. తోటలోని గింజలను శుద్ధి చేసేందుకు మన్యానికి సమీపంలో ఉన్న… నర్సీపట్నంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మకం, రవాణాకు తగిన సదుపాయాలు ఉండటం వల్ల లాభదాయ కంగా ఉండేది. దీని ద్వారా కోట్లరూపాయల ఆదాయం రావడంతో పాటు.. మన్యం కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. మహిళా ఉపాధి…ఇక్కడి కేంద్రంలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వందలాది మంది మహిళలు…దశాబ్దాలుగా కాఫీ శుద్ధీకరణ పనులతో ఉపాధి పొందుతున్నారు. వీరంతా గింజల్లోని నల్లటి పప్పును వేరు చేయడం వంటి పనులు చేపడుతుంటారు. తొలిరోజుల్లో 15 మంది మాత్రమే సగటున 40రూపాయల వేతనంతో పనిచేసేవారు. క్రమేపి వీటి సాగు విస్తరించటం… దిగుబడులు పెరగటం ద్వారా ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం కాఫీ శుద్ధీకరణ పనులకు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు.
లాభ, నష్టాల బేరీజు…ఈ ఏజెన్సీ ప్రాంతంలో పదివేల ఎకరాల్లో కాఫీ తోటలు ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్నారు. గతంలో స్థానిక గిరిజనుల సహాయంతో బెంగ ళూరు వంటి పట్టణాల్లో ఈ గింజల విక్రయాలు జరిపేవారు. ప్రస్తుతం ఆన్‌?లైన్‌? లో వేలం వేస్తున్నారు. ఈ పంట వల్ల ప్రతి ఏటా 18 కోట్లు ఆదాయం వచ్చేది. ఏజెన్సీలో వీటి సేకరణపై మావోయిస్టుల ఆంక్షలు, పంట దిగుబడి తగ్గడం…వంటి కారణాలతో ఈ వ్యాపారానికి నష్టాలు తప్పటం లేదు. గత ఏడాది శుద్ధిచేసిన 234 టన్నుల గింజలు మాత్రమే విక్రయించగలిగారు . దీంతో 4.5 కోట్ల ఆదాయం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ సీజన్‌ ప్రారంభం కావడంతో కాఫీ శుద్ధి పనులకు అధికారులు సన్నద్ధమవు తున్నారు. ఈ సంవత్సరం మన్యంలో కాఫీ పంట విస్తారంగా పెరిగిన నేపథ్యంలో ఆదా యం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.నాలుగేళ్లుగా కొత్త వ్యాపారం. నాలుగేళ్లుగా ఈ కేంద్రం నీలగిరి వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది.మునుపు విశాఖ డివిజన్‌ లో దీనిని చేపట్టేవారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ఆ డివిజన్‌ మూసి వేసి నర్సీపట్నంలో విలీనం చేశారు. దీంతో జిల్లాలోని కసింకోట మండలం , కన్నూరు పాలెం…వంటి ప్రాంతా ల్లో ఏపీఎఫ్‌?డీసీకి చెందిన నీలగిరి తోటలను టెండర్ల ద్వారా అమ్మకాలు చేపడుతున్నారు. వీటి ద్వారా సుమారు 10కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ ఏడాది కరోనా వైరస్‌ కు తోడు టన్ను ధర 8వేల నుంచి 4వేల దిగిపోవడంతో అమ్మకాలు ముందుకు సాగడం లేదు.
అరకు కాఫీ’కి వందేళ్లు..
భారతదేశంలో అరకు కాఫీ టాప్‌ బ్రాండ్స్‌లో ఒకటి. వందేళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఇది కాఫీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసు కుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరకు కాఫీ గురించి తెలియని తెలుగు వారు ఉండకపోవచ్చు. అసలు ఇంతకీ ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా సాగింది.
చెట్ల మధ్య తోటల పెంపకం…
విశాఖ ఏజెన్సీకి అసలు కాఫీ ఏలా వచ్చిందనే విషయాన్ని జీసీసీ (గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌) మాజీ ఎండీ రవి ప్రకాష్‌ గతంలో వివరించారు.‘‘1898లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో ఆంగ్లేయులు కాఫీ పంట వేశారు. అక్కడ్నించి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతా ల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920కి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే అది ఎక్కువ గా సాగవలేదు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10వేల ఎక రాలలో అభివృద్ధి చేసింది. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగిం చింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి ‘అరకు కాఫీ’ అనే పేరు స్థిర పడిరది’’ అని చెప్పారు.
పోడు వ్యవసాయం వదిలి కాఫీ తోటల్లోకి…
గిరిజన కుటుంబాలలో ఎక్కువమంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు. తాము సంప్రదాయ పద్ధతులోల చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిం చారు.వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు,అనంతగిరి,జీకే వీధి, చింతపల్లి, పెదబయలు,ఆర్వీనగర్‌, మిను మలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్‌ కార్పో రేషన్‌ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది. మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా… ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరిం చాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం.
అరకు కాఫీ రుచికి కారణం అదే…
అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం మన్యం లోని వాతావరణమేనని ఆంధ్ర విశ్వవిద్యా లయం మెటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ రామకృష్ణ తెలిపారు. ‘‘సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ…పొడవాటి మిరియాలు,సిల్వర్‌ ఓక్‌ చెట్ల మధ్యలో సాగవు తాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది’’ అని తెలిపారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి
ప్రపంచంలో కాఫీని అధికంగా పండిరచే దేశాల్లో భారతదేశానిది ఏడో స్థానం.బ్రెజిల్‌ 25 లక్షల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. ఇండియా మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నులతో ఏడవ స్థానంలో ఉంది. భారతదేశంలో…12 రాష్ట్రా లు కాఫీని పండిస్తుండగా…అందులో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తమి ళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో అరబికా రకం కాఫీని పండిస్తారు.ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్‌ పేరుతో 2017లో కాఫీ షాప్‌ తెరి చారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్ట మొదటి ‘అరకు కాఫీ’ షాప్‌ ఇది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌ నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని ప్యారిస్‌ లో ఏర్పాటు చేసింది. ఆతర్వాత అరకు కాఫీ రుచులు జపాన్‌, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాలకూ పాకాయి. 2018లో పారిస్‌ లో జరిగిన ప్రిక్స్‌ ఎపిక్యూర్స్‌-2018 పోటీలో (ూతీఱఞ జుజూఱషబతీవం) అరకు కాఫీ గోల్డ్‌ మోడల్‌ గెల్చుకుంది. రుచికరమైన కాఫీ బ్రాం డులకి పేరుపొందిన బ్రెజిల్‌, సుమత్రా, కొలం బోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం విశేషం.-(కిల్లో సురేంద్ర)

విఫత్తులు..మానవాళికి పెనుశాపాలు

అంతా నేతల చేతుల్లోనే : భూతాపాన్ని తగ్గించ డానికి ఏమాత్రం గడువు లేదు. వెంటనే స్పందిం చాల్సిందే.కానీ,ఇప్పుడిది ప్రభుత్వాధినేతలు, రాజ కీయ నేతల చేతుల్లో ఉంది. భూమిని రక్షించుకోవ డానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలను పట్టాలెక్కిం చడానికి ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు కానీ స్పందించకపోతే ఆ తరువాత వారు వాతావరణంలోని కర్బనాన్ని సంగ్రహించడానికి ఇంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘సత్వరం మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే. ఇంతకుముందు పారిస్‌ ఒప్పందం చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉన్నంత మాత్రానసరిపోదు’ అని ప్రొఫెసర్‌ జిమ్‌ స్కీ అన్నారు. ప్రపంచదేశాల నేతలు ఈ నివేదికను చదివి వారి లక్ష్యాలను పెంచుకోవడానికి నిర్ణయించడంతో పాటు వెంటనే కార్యరంగంలోకి దిగితే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించడం అసాధ్యమేమీ కాదని జిమ్‌ అభిప్రాయపడ్డారు. పర్యావరణవేత్తలు, భూతాప నివారణకు పనిచేస్తున్నవారు ఈ అంశంపై మాట్లాడుతూ,ముప్పు ముంచుకొస్తుండడంతో దీనిపై చర్చించడానికి కూడా సమయం లేదని, మార్పులకు సత్వరం శ్రీకారం చుట్టాల్సిందేనని చెప్పారు.

పర్యావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి ప్రళయాలు, విపత్తులు సర్వసాధారణంగా మారాయి. మండే ఎండలు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీల వంటి దుస్థితికి మానవ తప్పిదాలే ప్రధానంగా తోడవుతున్నాయనేది చేదు నిజం. ప్రభుత్వాల చొరవకు తోడు.. పౌర బాధ్యతతోనే ప్రకృతి వనరుల పరిరక్షణ, మానవ ప్రేరిత విపత్తులను నివారణ సాధ్యమవుతుంది. జిఎన్‌వి సతీష్‌
భారీవర్షాలు,వరదల ధాటికి పాకిస్తాన్‌, బెంగళూరు,కేరళ,ఉత్తరాఖండ్‌ అతలాకుతలమవు తున్నాయి.వేలసంఖ్యలో మరణాలు నమోదయ్యా యి. వేల మంది నిరాశ్రయులయ్యారు.వరద బీభ త్సం-దేశీయ ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ తీరుతెన్ను లను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. పశ్చిమ, తూర్పు కనుమల్లో విచ్చలవిడిగా సాగుతున్న వనాల విధ్వంసం,సున్నితమైన పర్యావరణ వ్యవస్థల పరి రక్షణలో అంతులేని నిర్లక్ష్యం,వాతావరణ మార్పుల చేదు ఫలితాలు ఎక్కడికక్కడ విపత్తులతాకిడిని పెంచుతున్నాయి.ముందు జాగ్రత్తల ద్వారా నష్టా లను తగ్గించే కార్యాచరణ లోపిస్తుండటమే విచా రకరం!
బుట్టదాఖలవుతున్న నివేదికలు : భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలిగిన భారతదేశంలో ఏటారుతుపవనాలు ప్రవేశించాక వరదలు, తుపా నులు సంభవించడం సర్వసాధారణం.కొన్నేళ్లుగా లెక్కకుమిక్కిలిగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు- జనజీవనాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే తుపానుల్ని ముందే పసిగట్టి హెచ్చ రించే సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. వాటి ఆసరాతో సమర్థ చర్యలు చేపడితే నష్టాలను గణనీయంగా తగ్గించ వచ్చు. కేంద్ర జల సంఘం, విజ్ఞానశాస్త్ర-పర్యావ రణ కేంద్రం(సీఎస్‌ఈ) సమాచారం మేరకు గడిచిన అరవై ఏళ్లలో వరదల మూలంగా దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోయారు. దాదాపు 62 కోట్ల ఎకరాల్లో పంటలు, ఎనిమిది కోట్లకు పైగా గృహాలు నాశనమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖ నివేదికల ప్రకారం దేశంలో అధిక శాతం నదులు 2019లో భారీ వరద ఉధృతిని చవిచూశాయి. వందేళ్లలో కనీవినీ ఎరగని స్థాయిలో ముంచెత్తిన వరదల ధాటికి 2018లో కేరళ బాగా దెబ్బతింది. ఉత్తరాఖండ్‌,గుజరాత్‌,రాజస్థాన్‌,బిహార్‌,పశ్చిమ్‌ బంగ,ఈశాన్య రాష్ట్రాలూ గడచిన కొన్నేళ్లలో భీకర వరదల తాకిడికి గురయ్యాయి. శ్రీనగర్‌,చెన్నై, హైద రాబాద్‌,ముంబై నగరాలూ అలాగే శోకసంద్రాల య్యాయి. విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు హుద్‌హుద్‌,తిత్లీ వంటి తుపానులు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దేశవ్యాప్తంగా ఏటా మూడు కోట్ల మంది వరదల బారిన పడుతున్నారు. దేశంలో జూన్‌-అక్టోబర్‌ మధ్య కాలంలో భారీ వర్షాలతో నదుల్లోకి అధికనీటి ప్రవాహంచేరుతోంది.ఆ సమ యంలో పర్వత శ్రేణులకు ఆనుకుని ఉండే ప్రదే శాలు,నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విచక్షణారహితంగా సాగు తున్న ఇసుక తవ్వకాలు నదుల సహజ ప్రవాహ గమనాన్ని దెబ్బతీస్తున్నాయి.అనేక నగరాల్లో దశా బ్దాల నాటి మురుగు నీటిపారుదల వ్యవస్థలు ఇప్ప టికీ మెరుగుపడలేదు.దాంతో వరద నీరు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.గుజరాత్‌,మహా రాష్ట్ర,గోవా,కర్ణాటక, కేరళ,తమిళనాడు రాష్ట్రాల పరిధిలో సుమారు1.60 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. అక్కడి పర్యావరణ, జీవవైవిధ్య వ్యవస్థల పరిరక్షణ కోసం 2010లోకేంద్ర ప్రభుత్వం ప్రముఖ పర్యా వరణ వేత్త మాధవ్‌ గాడ్గిల్‌ నేతృత్వంలో అధ్యయన సం ఘాన్ని నియమించింది. పశ్చిమ కనుమలను పర్యా వరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటిం చాలని ఆ సంఘం సూచించింది. నిర్దేశిత ప్రాంతా ల్లో నూతన ఆర్థిక మండళ్లు, హిల్‌స్టేషన్ల ఏర్పాటు, ఖనిజాల తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని సిఫార్సు చేసింది. కనుమల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ భూములను బదిలీ చేయ కూడదని పేర్కొంది. పశ్చిమ కనుమల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. వీటిని అమలు చేయకుండా 2012లో శాస్త్రవేత్త కస్తూరి రంగన్‌ నేతృత్వంలో కేంద్రం మరోసంఘాన్ని కొలు వు తీర్చింది.గాడ్గిల్‌ కమిటీ బాటలోనే-కనుమ లలో గనులతవ్వకం,క్వారీ కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించాలని ఆ సంఘం సిఫార్సు చేసింది. కనుమలలో37శాతం భూభాగాన్ని సున్నిత పర్యా వరణ ప్రాంతంగా గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. వీటినిఅమలు చేసి ఉంటే- వరదల తీవ్రత తగ్గి ఉండేది. ఒడిశా,ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన తూర్పు కనుమల దుస్థితీ ఇలాగే ఉంది. ఒడిశా, ఆంధ్రపరిధుల్లోని కనుమలలో లేటరైట్‌, బాక్సైట్‌ వంటి ఖనిజాల తవ్వకాల మూలంగా అడవులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నదుల గమనంలో మార్పులతో భవిష్యత్తులో వరద ప్రమాదాలు అనూహ్య స్థాయిలో ఉంటాయని నిపుణులు హెచ్చరి స్తున్నారు. వాస్తవ పరిస్థితులను మదింపు వేయ డానికి అధ్యయనాలు చేపట్టేందుకు సైతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవడం ఆందోళన కరం.
పటిష్ఠ కార్యాచరణ అవసరం : ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదాలతో సమన్వయం కొరవడుతోంది. విపత్తు లకు కారణమయ్యే వాతావరణ మార్పుల ప్రభా వాలను పరిమితం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠ ప్రణాళికలు అవసరం. వాటికి అనుగుణంగా ప్రకృతి వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వాలు ఇతోధి కంగా నిధులు కేటాయించాలి. ఖనిజ తవ్వకాలు, ఆనకట్టలు, జల విద్యుత్‌ ప్రాజెక్టులపై లోతైన చర్చ తరవాతే ముందడుగు వేయాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థలను నెలకొల్పాలి. విపత్తుల నిర్వహణ,యాజమాన్య సంస్థలను వేగంగా పటిష్ఠీకరించాలి.చాలా రాష్ట్రాల్లో వరదలు, తుపా నుల బాధితులకు దీర్ఘకాలంలో మేలు చేకూర్చేలా ప్రభుత్వాల కార్యాచరణ ఉండటం లేదు. ఈ వైఖరి లో మార్పు రావాలి. వరదలు, తుపానుల్ని ఎదుర్కొ నేలా ప్రకృతివిపత్తుల సంఘాల్లో స్థానికుల భాగస్వా మ్యాన్ని పెంచి, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలి. ప్రకృతి వనరుల వినియోగం, యాజమాన్యాలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిం చాలి. స్థానికుల సాయంతో వాటి అమలుకు ప్రభు త్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అప్పుడే విపత్తు ల దాడిలో కకావికలమవుతున్న జనావళికి భవిష్య త్తుపై భరోసా కలుగుతుంది.విచ్చలవిడిగా ఆన కట్టలు..భారతదేశంలో ప్రధాన పర్వతశ్రేణులైన హిమాలయాలు,పశ్చిమ-తూర్పు కనుమల్లో పర్యావ రణ వ్యవస్థలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఫలితం గా వరదల తీవ్రత ఏటా అధికమవుతోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ-సామాజిక నష్ట ప్రభావాల అంచనా, నష్ట భర్తీలపై సమగ్ర చర్యలు పూజ్యమవుతున్నాయి. భవిష్యత్తు ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాల రూప కల్పనా కొరవడుతోంది. వాతావరణ మార్పులతో హిమగిరులు వేగంగా కరిగిపోతుండటంతో అక్కడి సరస్సులు,నదులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడు తోంది.దానికి మానవ తప్పిదాలుతోడై ఆ పర్వత రాష్ట్రాల్లో విపత్తుల తాకిడి పోనుపోను ఇంతలం తలవుతోంది. ముందుచూపు లేకుండా, ప్రత్యామ్నా య మార్గాలజోలికి పోకుండా సాగు,విద్యుత్‌ అవస రాల పేరుతో నదీప్రవాహాలకు అడ్డంగా నిర్మి స్తున్న భారీ ఆనకట్టల మూలంగానూ సమస్య తీవ్రత అధికమవుతోంది.
భూతాపం :
పెరుగుతున్న భూతాపం మానవజాతిని కబళించే రోజు ఎంతో దూరంలేదంటూ శాస్త్రవేత్తలు అత్యం త తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వ రాదన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేని స్థాయిలో సత్వరం ఫలితమిచ్చే చర్యలు చేపట్టా లని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.’1.5డిగ్రీల సెల్సి యస్‌కు మించి పెరగకుండా నియంత్రించడం లక్ష్య మైనప్పటికీ ఇప్పటికే ఉష్ణోగ్రతలు దాన్ని మించి పోయే దశలో ఉన్నాయి. అదే జరిగితే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను నివారించడానికి ఇప్పటికీ ప్రపంచ దేశాలకు అవ కాశముంది’’అంటూ నివారణోపాయాలనూ సూచి స్తున్నారు.
మూడేళ్ల అధ్యయనం : అనంతరం దక్షిణ కొరి యాలో వారంపాటు శాస్త్రవేత్తలు, అధికారుల మధ్య సమగ్రచర్చ తరువాత ‘ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యా నెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌’ (ఐపీసీసీ) భూఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర పెరిగితే ఆ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై కీలక నివేదిక విడు దల చేశారు.శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య చర్చల సారాంశాన్ని ఆ నివేదికలో పొందు పరిచారు.ఇందులో కొన్ని విషయాల్లో రాజీపడినట్లు గా కనిపిస్తున్నప్పటికీ పలు అంశాలపై విస్పష్టమైన సూచనలు చేశారు. ‘ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కే పరిమితం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలుం టాయి.వాతావరణ మార్పులవల్ల కలిగే దుష్ఫలి తాలను ఇది తగ్గిస్తుంద’ని ఐపీసీసీ ఉపాధ్యక్షుడు జిమ్‌ స్కీ అభిప్రాయపడుతున్నారు.‘భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలనుకుంటే చేపట్టాల్సిన మార్పులపై ఆలోచించాలి. ఇంధన వ్యవస్థలో తేవాల్సిన మార్పులు.. భూవినియోగం తీరుతెన్నుల్లో మార్పులు..రవాణా రంగంలో తీసుకు రావాల్సిన మార్పులు అన్నీ ఆలోచించాలి’ అని అభిప్రాయపడ్డారు.
టార్గెట్‌ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ : ‘తక్షణం చర్యలు తీసుకోండి’ అని పెద్దపెద్ద అక్షరాలతో రాయాలని శాస్త్రవేత్తలు అనుకునే ఉంటారు.వారువాస్త వా లను,గణాంకాలను చూపుతూ ఆ మాట చెప్పాల్సి ఉందని చర్చల్లో పరిశీలకురాలిగా పాల్గొన్న గ్రీన్‌ పీస్‌ సంస్థ ప్రతినిధి కైసా కొసోనెన్‌ అన్నారు.ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా చూస్తే వాతావరణ మార్పుల కారణంగా కలిగే ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలుగుతామన్న ఇంతకు ముందు ఉండేది.కానీ,1.5 డిగ్రీలసెంటీగ్రేడ్‌ను మించి ఉష్ణోగ్రతలుపెరిగితే భూమిపై జీవనయోగ్య త విషయంలో పాచికలాడినట్లేనని ఈకొత్త అధ్య యనం హెచ్చరిస్తోంది.
ఈపరిమితి సాధ్యమే : అయితే, ఇది అత్యవసరంగా జరగాల్సి ఉంది.ప్రభుత్వాలు,వ్యక్తులు..ఇలా ప్రతి స్థాయిలోభారీ ఎత్తున మార్పులు రావాల్సి ఉంది. అంతేకాదు,రెండు దశాబ్దాల పాటు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో2.5శాతం ఇలాంటి చర్యల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. అప్పుడుకూడా వాతావరణంలోని కర్బనాన్ని సంగ్ర హించడం కోసం చెట్లు ఉండాలి, సంగ్రహణ యం త్రాలను ఉపయోగించాలి. అలా సంగ్రహించిన కర్బనాన్ని భూగర్భంలో పాతరేయాలి. ఈ ప్రక్రియ నిత్యం కొనసాగుతుండాలి.
మనమేం చేయాలి? : ప్రధానంగా ఇంధన, భూవిని యోగం,నగరాలు,పరిశ్రమల వ్యవస్థల్లో సమూల మార్పలు తెస్తేనే భూతాపాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించగలమని ఈ నివేదిక వెల్లడిరచింది. అయితే, వ్యవస్థలతో పాటు మనిషి తనకు తాను ఇలాంటి మార్పులను నిర్దేశించుకోకుంటే లక్ష్యాన్ని చేరు కోవడం కష్టం. ఇందుకు గాను వ్యక్తిగతంగా తీసుకు రావాల్సిన మార్పులనూ ఈ నివేదిక సూచించింది.
ా మాంసం,పాలు, వెన్న వంటి ఉత్పత్తులను కొనడం తగ్గించాలి. అలాగే వాటిని వృథాగా పారబోయడమూ తగ్గించాలి.
ా తక్కువ దూరాలకైతే నడుచుకుంటూ లేదంటే సైకిళ్లపై వెళ్లాలి.
ా విమాన ప్రయాణాలు తగ్గించుకుని బస్సులు, రైళ్లలో రాకపోకలు సాగించాలి.
ా వ్యాపార పరమైన సమావేశాల కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి అందరూ ఒక చోటికి వచ్చే కంటే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ా దుస్తులు ఎండబెట్టేందుకు డ్రయ్యర్లను వాడేకంటే చక్కగా తాడుకట్టి దానిపై ఆరబెట్టడం మంచిది.
ా కొనుగోలు చేసే ప్రతి వస్తువూ కర్బన రహి తమో..లేదంటే తక్కువ కర్బనాలను విడు దలచేసేదో అయ్యుండేలా చూసుకోవాలి.
ా జీవనశైలిలో ఇలాంటి మార్పులను తీసుకు రావడంవల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగు తుందని ఐపీసీసీకి చెందిన మరో ఉపాధ్యక్షురాలు డెబ్రా రాబర్ట్స్‌ చెప్పారు.
ా ఉష్ణోగ్రతలు1.5డిగ్రీలసెంటీగ్రేడ్‌కు తగ్గించ డానికి 5మార్గాలు
ా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 2010 నాటి స్థాయితో పోల్చితే 45 శాతం తగ్గాలి.
ా 2050 నాటికి ప్రపంచ విద్యుత్‌ అవసరాలలో 85 శాతం పునరుత్పాదక ఇంధన వనరులే తీర్చాలి.
ా బొగ్గు వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలి.
ా ప్రపంచవ్యాప్తంగా 70మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంధన పంటలు(జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే మొక్కలు) ఉండాలి. అంటే సుమారు ఆస్ట్రేలియా అంత విస్తీర్ణంలో జీవఇంధనాల తయారీకి ఉప యోగపడే మొక్కలను సాగు చేయాలన్నమాట.
ా 2050 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి.

దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..!

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో 75 ఏళ్ల స్వాత్రంత్య్ర వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపడుతోంది. పౌరుల్లో దేశభక్తి పెంపొందేలా పలు అవగాహన కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కో ఆపరేటివ్‌ సొసైటీలు ఇలా అన్నీ ప్రభుత్వ, ప్రభుత్వేయతర సంస్థలన్నీ ఈ క్యాంపెయిన్‌లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనల్లో హర్‌ ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌కి విస్తృత ప్రచారం కల్పించారు.

Read more
1 2 3 4