వినిపించని పక్షుల కిలకిల

తెల్లవారుతుండగా పక్షుల కిలకిలరాగాలతో పల్లెలు మేల్కొనేవి. ఎటు చూసినా పక్షుల రాగాలే.. ఇవి ఒకప్పటి మాటలు. నేడు ఆ పరిస్థితి లేదు. రోజురోజుకూ వాతావరణంలో వచ్చే మార్పులతో జీవజాతులు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పక్షుల సరాగాలు ఇప్పుడు వినిపించడం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం పక్షులు ఉదయాన్నే సందడి చేసేవి. కిలకిల మంటూ మురిపాలు కురిపించేవి. ఇంటి ముందర కట్టే వరిగొలుకలు తింటూ పక్షులు సంగీతాన్ని వినిపించేవి. తెల్లవారకముందే మనుషులను నిద్రలేపేవి. ముద్దులొలికే పిచ్చుక చేస్తున్న చేష్టలు కనువిందు చేసేవి. ఊర పిచ్చుకల జాతి అంతరించుకు పోతోంది. రసాయన ఎరువులు, రేడియేషన్‌ ప్రభవంతో ఇప్పటికే రాబంధులు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు పశువులు చనిపోతే అక్కడ రాబంధులు వాలి దాన్ని మొత్తం తినేసేవి. అటువంటిది ఇప్పుడు ఊళ్లలో పశువులు లేవు…రాబంధులు రావు. దీంతో రాబోయే రోజుల్లో రాబంధులంటే ఇలా ఉండేవని చెప్పుకోవడమే. ఇంత జరుగుతున్నా మన పాలకుల్లో మార్పు కనిపించడం లేదు.(జి.ఎ.సునీల్‌ కుమార్‌)
మనదేశంలో పదమూడు వందల యాభై మూడు పక్షి జాతులున్నాయి. అంటే ప్రపంచ పక్షి జాతుల్లో ఇవి 12.04శాతం అన్నమాట.వీటిలో డెబ్భైఎనిమిది జాతులు (ఐదుశాతం) మన దేశానికి మాత్రమే చెందినవి.ఈ డెబ్భై ఎనిమిదిలో మూడు జాతులు గత కొన్ని దశాబ్దాలుగా కనుమరుగ య్యాయని ఇటీవల జువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్త అమితవ మజుందార్‌ తెలిపారు. అవి మణిపూర్‌ బుష్‌ పిట్ట,(పెర్డికులా మణి పురెన్సిస్‌)..హిమాలయన్‌ పిట్ట (ఓఫ్రిసియా సూపర్‌సిలియోసా), జెర్డాన్స్‌ కోర్సర్‌ (రినోప్టిలస్‌ బిటోర్క్వాటస్‌)లు.అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ (ఐయుసిఎన్‌) 1907లో వీటి మనుగడకు ముప్పు ఉందని తెలిపే రెడ్‌ లిస్ట్‌ ఆఫ్‌ థ్రెటెన్డ్‌ స్పీసీస్‌ అనే అధ్యయనంలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణ కు కంకణబద్ధులు కావడం లేదు.విచ్చలవిడిగా మనం ఉపయోగించే ఎరువులు, సెల్‌టవర్‌ల ప్రభావంతో పక్షిజాతులైన రాబంధులు,గద్దలు,పాలపిట్టలు,చిలకలు,గోరింకలు కనిపించ కుండా పోతున్నాయి.వాతావరణ మార్పులకుతోడు పక్షిజాతులు అంతర్థానంతో మానవ మనుగడే ప్రమాదంలో పడబోతోందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
పిండేస్తున్న కొండలు…
ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా జిల్లా ఎడారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన గుట్టలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. విచ్చలవిడిగా, ఇబ్బడిముబ్బడిగా అమ్యా మ్యాలకు ఆశపడి అడ్డగోలుగా అనుమతులిస్తుంటే కొండలు దిక్కుతోచని స్థితిలో దీనంగా చూస్తున్నాయి.మానవుని అత్యాశకు బలవుతున్నామని రోదిస్తున్నాయి. దేవుని గుట్టలైనా, ఏగుట్టలైన డబ్బుల రుచిమరిగిన బకాసురులు కొండలను పిండి చేయడంతో జంతువులు,పక్షులు,కనిపించకుండా పోతున్నాయి.గుట్టల్లో ఎలుగుబంట్లు,తోడేళ్లు,జింకలు,పక్షులు నివాసం ఉండేవి.ప్రస్తుతం జంతువులు జనారణ్యంలోకి పరుగులు పెడుతున్నాయి. ఇలా జరగడానికి కారణం కొండలు కనుమరుగు కావడమే. గుట్టలనే నివాసంగా చేసుకోని జీవించే జీవజాతుల పరిరక్షణకు ప్రభుత్వమైనాచర్యలు తీసుకోవడం లేదు.
రసాయన ఎరువులు…
మనం వ్యవసాయానికి వాడే రసాయన ఎరువులు వల్ల జంతువులు,పక్షులు చనిపోతున్నాయి. వాటిలో ఉండే విష పదార్థాల వల్ల పక్షులు అంత రించిపోతున్నాయి. గతంలో జాతీయ పక్షులు నెమళ్లు విషాహారం తిని మృతి చెందిన సంఘ టనలు జరిగాయి.పంటలు బాగా పండాలని మనం వాడే రసాయనాలతో పక్షులు ఆ పంట లను తిని తనువుచాలిస్తున్నాయి. పక్షిజాతుల్లో ఇప్పటికే పలు పక్షులు కనుమరుగైపోయాయి. పూర్వం కోడిపిల్లలు గద్దలను చూసి భయపడేవి. ఇప్పుడు కోడి పిల్లలు లేవు.గద్దలు కానరావడం లేదు. గద్దలు,గోరింకాలు, చిలుకలు,పిచ్చుకలు ఒకటేమిటి భూమి మీదఉన్న పక్షిజాతులన్నీ రాను..రాను కన్పించకుండ పోయే దుస్థితి నెలకొంటోంది.
సెల్‌ టవర్లతోనూ ముప్పు..
సెల్‌ లేని ఊరులేదు. సెల్‌టవర్‌ లేని పట్టణం లేదు.సెల్‌ టవర్ల వినియోగంతో రేడియేషన్‌ సమస్య ఉందని పర్యావరణ విశ్లేషకులు చెబుతు న్నారు. వీటి వినియోగంతో మనుషులు సైతం రోగాల బారిన పడుతున్నారు. రేడియేషన్‌ ప్రభా వంతో పక్షుల్లో రోగాలు పెరుగుతు న్నాయి. ఫలి తంగా మృత్యువాత పడుతున్నాయి.ఇటీవల కాలంలో ఎక్కువ కావడంతో అసలు పక్షులే కని పించకుండా పోతున్నాయి. భవిష్యత్తు తరాలకు మనం పక్షులంటే ఇలా ఉంటాయని బొమ్మల ద్వారా చూపించే రోజులు వస్తున్నాయి. పర్యా వరణ పరిరక్షణ కోసం పాటుపడకపోతే భవిష్యత్తు అంధకారమే.దీనిపై ప్రభుత్వాలు,పాలకులు స్పం దించి పర్యావరణ సంరక్షణ కోసం నడుం బిగించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఆజాదీ ఏదీ..!
ప్రచురణ రచయితలలో ధృతి బెనర్జీ ఒకరు. ఈమె ‘మన దేశంలో డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ‘ఆజాదీకా అమృత్‌ మహో త్సవ్‌’ వేడుకలు జరుపుకున్నాం. అదే సమయంలో జెడ్‌ఎస్‌ఐ ‘75ఎండిమిక్‌ బర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఒక నివేదికను ప్రచురించింది.ఈ విష యాన్ని అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడిరచింది కూడా.అయినా పరిస్థితి క్షీణ దశ లోనే ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచ డం..నిషేధిత ప్రాంతాలలో మాత్రమే కనిపించే జాతులను సంరక్షించడం తక్షణం చేయవలసిన కర్తవ్యం.ఇదే మా నివేదిక ప్రగాఢ ఉద్దేశ్యం’ అని ధృతి పేర్కొన్నారు.
అరుదైనవి..అంతరిస్తున్నాయి..
‘తెల్ల బొడ్డు మినివెట్‌ పెరిక్రోకోటస్‌ ఎరిత్రోపైజియస్‌ పక్షులు పశ్చిమ కనుమలు, నేపాల్‌, మన దేశంలోని ఆకురాల్చే అడవుల్లో అత్యధికంగా ఉండేవన్నారు. అండమాన్‌ నికోబార్‌ దీవులలో ఆసక్తికరమైన నాలుగు పక్షి జాతులు కనిపిస్తున్నాయి.అవి నికోబార్‌ మెగాపోడ్‌ (మెగాపోడియస్‌ నికోబారియన్సిస్‌),నికోబార్‌ సర్పెంట్‌ ఈగిల్‌ (స్పిలోర్నిస్‌ క్లోస్సీ), అండమాన్‌ క్రేక్‌ (రల్లినా కన్నింగి),అండమాన్‌ బార్న్‌ గుడ్లగూబ (టైటో డెరోప్స్టోర్ఫీ).ఇవి తూర్పు హిమాలయాలు, దక్కన్‌ పీఠభూమి, మధ్య భారత అడవులకు చెందినవి. ఇంకా ఆ దీవుల్లో మరెక్కడా కనిపించని 25 పక్షి జాతులు ఉన్నాయి.అవి నికోబార్‌ మెగాపోడ్‌,నికోబార్‌ సర్పెంట్‌ ఈగిల్‌, అండమాన్‌ క్రేక్‌, అండమాన్‌ బార్న్‌ గుడ్లగూబ వంటి జాతులు.వీటి ఆవిర్భావానికి స్థానిక భౌగోళిక పరిస్థితులే కారణం’ అని డాక్టర్‌ మజుందార్‌ చెప్పారు. ఆ ప్రదేశాల్లో మారిన పరిస్థితులకు ఈ పక్షుల మను గడ ప్రమాదంలో పడిరది. పశ్చిమ కనుమల్లో ఇరవై ఎనిమిది ప్రత్యేకమైన జాతులున్నాయి. అవి మలబార్‌ గ్రే హార్న్‌బిల్‌, మలబార్‌ పారాకీట్‌, అశంబు లాఫింగ్‌ థ్రష్‌, వైట్‌-బెల్లీడ్‌ షోలకిలి.
‘ప్రచురణలో స్థానిక పక్షి జాతుల జీవ-భౌగోళిక ప్రాంతాల వివరాలు,శాస్త్రీయపేర్లు,ఉప జాతుల తేడాలు, ప్రత్యేక లక్షణాలు, ఇష్టపడే ఆవా సాలు,సంతానోత్పత్తి అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు, చారిత్రక ఔచిత్యం ఉన్నాయి’ అని డా.మజుందార్‌ తెలిపారు. సామాన్యులు, విద్యార్థులలో అవగాహన పెంపొందిద్దాం.. పక్షులను, ప్రాణికోటిని కాపాడు కుందాం.
కాపాడుకోవడం మన బాధ్యత
జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి. సామాజిక అడవుల పెంపకాన్ని పర్యావరణ వేత్తలు ఉద్యమంలా చేపట్టాలి. ప్రభుత్వం పర్యావరణ సంబంధిత శిక్షణా కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేస్తూ జీవ వైవిధ్య అవశ్యకతను తెలియజేయాలి. జానపద కళలు,వీధి నాటకాల ద్వారా ప్రజల్లో జీవవైవిధ్యంపట్ల అవగాహన కలిగించాలి. సామా జిక మాధ్యమం, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వినూత్న శైలిలో జనాలకు సులభతరమైన భాషలో సరళంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలి. పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలు అనేక అంతర్జాతీయ ధరిత్రీ సదస్సులు ఏర్పాటు చేసి కార్యాచరణ అమలుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికి భూతాపం, అనావృష్టి, అతివృష్టి, అకాల వర్షాలు, వరదలు, కరవు తదితరాలు ఇటీవలి కాలంలో ఇంకా అధికమవుతూనే ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే లక్ష్యాల సాధనకు కార్యాచరణకు పొంతన లేదనే విషయం తెలుస్తుంది. కనుక వాతావర ణంలో వస్తున్న విపరీత మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ కార్యాచరణను సత్వరమే చేపట్టాలి. ప్రకృతి అందించిన జీవవైవిధ్య సంపదను కాపాడు కోవడం ఆధునిక మానవుడి ప్రాధమిక బాధ్యత అని గుర్తెరగాలి.
మన రాజ్యాంగం అధికరణం 48(ఏ) లో పర్యావరణ పరిరక్షణకు..అభివృద్ధికి, ప్రభుత్వం కృషి చేయాలి. దేశంలోని వనాలను, వన్యప్రాణులను కాపాడడం రాజ్యవిధి అని ఆదేశిక సూత్రాల్లో చెప్పింది. అంతేకాదు పర్యా వరణ రక్షణ పౌరుల ప్రాథమిక విధి అని 51 ఏ(జి) లో స్పష్టంగా పేర్కొంది. అంటే పౌరులుగా మనం జీవ వైవిధ్య పరిరక్షణ మన ప్రాధమిక బాధ్యత అనే విషయం గుర్తించిన నాడు జీవ వైవిద్యానికి జరిగే నష్టత అరికట్టబడుతుంది.
ఎందుకంటే అంతరించి పోయిన వృక్ష, జంతు జాలాన్ని ఎప్పటికీ పునరుద్ధరించుకోలేం. ఏ జీవి అయినా తనకు తానుగా స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. తప్పనిసరిగా ఇతర జీవుల మీద ఆధారపడాల్సిందే.ఈసత్యాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించి ఇప్పటికైనా పరిరక్షణ దిశగా అడుగులు వేయగలిగితే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము.దీనివలన ప్రస్తుత తరం వారమైన మనం ప్రయోజనం పొందటమే కాకుం డా రాబోయేతరాల వారి ప్రయోజనాలను కాపాడే దిశగా కొనసాగించే అభివృద్ధికి అవకాశం అందించిన వారం అవుతాం.

జీవుల మనుగడ జీవ వైవిధ్యం

ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం,ఒకటే గృహం.మనుషులంతా ఒకటే అనేది ఉట్టి మాట. పొడుగు,పొట్టి,లావు,సన్నం,నలుపు,తెలుపు,ఇంకా వీటి మధ్యస్థ రకాలు,భేదాలు.ఇంకా మనుషు లంతా ఒకటే అని అనుకోవడం ఏమిటి?ఒక్క మనుష్య జాతిలోనే ఇన్ని భేదాలుంటే, మనిషికి తెలిసిన మిగతా జంతు, వృక్ష జాతులలో మరిన్ని వైవిధ్యాలు ఉన్నాయి.ఈభూమ్మీద ఉండే జీవులలో ఉండే ఈ తరహా భేదాల న్నిటినీ కలిపి జీవవైవిధ్యం అంటున్నాం. జీవవైవిధ్యం భూమిపై జీవుల ఆరోగ్యాన్ని కొలిచే థర్మామీటర్‌ వంటిది.ప్రకృతిలో ప్రతి జీవి ఒకప్రత్యేక పాత్రనుపోషిస్తూ పర్యావరణవ్యవస్థల స్థిరత్వం,స్థితిస్థాపకతకు దోహ దం చేస్తుంది.ఒకపురుగో,అసలిప్పటివరకు సామాన్య మానవులకు కనిపించని ఒక మొక్కో లేదా ఏదో విషపు పాముల వంటి జంతువో అంతమైపోతే మనకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? అది మన దైనందిన జీవితాలపై నిజంగా ప్రభావం చూపుతుందా? పర్యావరణ వ్యవస్థలోని ప్రతిజాతి ఇతర జీవ రూపాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంక ర్షణ చెందుతుంది.పర్యావరణ వ్యవస్థను ఒకభారీ నెట్‌వర్క్‌గా భావించవచ్చు, ఇక్కడ ప్రతి జీవిఒకదారం ద్వారా ఇతరులతో అనుసంధానించబడి ఉంటుంది. ఒక దారం తెగిపోయినప్పుడు,దానితో నేరుగా అనుసంధానించబడిన జాతులు ప్రభావితమౌతాయి.అయితే అవి పరోక్షంగా దానితో సంకర్షణ చెందే వాటిపై ఎక్కువ లేదా తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. పర్యావరణ వ్యవస్థ ఎంత వైవిధ్యం గా ఉంటుందో,అది అంతబాగా అంతరాయాలను తట్టుకునే శక్తి కలిగి ఉం టుంది.జీవుల సహజ ఆవాసాల నాశనం,కాలుష్యం లేదా వాతావరణ మార్పుల ద్వారా కలిగే అంతరాయాలతో పర్యావరణం నిలకడగా ఉండదు.అందుకు కారణం జీవవైద్య నాశనమే. కొన్ని జాతుల నష్టం కూడా మానవ జనాభాకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది, మన జీవితాలను ప్రభా వితం చేస్తుంది.
ప్రకృతి అందించే అపరిమిత సేవలు :ప్రతిరోజూ,జీవవైవిధ్యం మనకు అనేక రకాలుగా సేవలను అందిస్తుంది. ఉదాహరణకు,మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తూ ఆక్సిజన్‌ను అందిస్తాయి. తేనెటీగలు మరి యు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహదపడతాయి, మాంసాహారులు శాకాహారి జనాభాను నియంత్రణలో ఉంచుతాయి.ఆక్సిజన్‌ ఉత్పత్తి, నేల నిర్మాణం, నీటి చక్రం వంటి క్రియలు పర్యావరణ వ్యవస్థలు సాఫీగా నడవడానికి తోడ్పడే ప్రాథమిక అంశాలు.నిజానికి జీవవైవిధ్యమే వాతావరణ మార్పులను తగ్గించ డానికిఉపయోగపడుతుంది.ఉదాహరణకు, మానవు లు ఉత్పత్తిచేసే కార్బన్‌ డయాక్సైడ్‌లో దాదాపు సగ భాగాన్ని పీల్చుకోవడంద్వారా వాతావరణాన్ని నియం త్రించడంలో సముద్రాలు,అడవులు కీలక పాత్ర పోషి స్తాయి.చిత్తడి నేలలు,మడ అడవులు,పగడపు దిబ్బల వంటి తీరపర్యావరణ వ్యవస్థలు తుఫానులు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి.వృక్షాలు గాలి నీటిశుద్దీకరణతోపాటు,ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి,తద్వారా వరదల ప్రమా దాన్ని తగ్గిస్తాయి. కానీ దురదృష్టవ శాత్తూ, ప్రస్తుతం వాతావరణ మార్పులే జీవవైవిధ్యాన్ని కుప్పకూలుస్తు న్నాయి.పర్యావరణం స్థిరంగా ఉండాలంటే,జీవ వైవి ధ్యం అధికంగా ఉండటం ముఖ్యం. వైవిధ్య భరి తమైన పర్యావరణం మరింత స్థిరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల జీవవైవిధ్యంపై అనేక దుష్పరిణామాలు కలుగుతాయి.ఎన్నో శాస్త్రీయ నివేది కలు ఈవిషయాన్ని నివేదించాయి. ఉష్ణోగ్రతలు 1.5 పెరిగితే, దాదాపు 6% కీటకాలు,8% మొక్కలు 4% సకశేరుకాలు వాటి భౌగోళిక పంపిణీలో (ఆవాసాల మార్పు)మార్పులకులోనవుతాయి.ఉష్ణోగ్రతల పెరుగు దల 2%మేర అయితే,ఈ శాతాలు రెట్టింపు అవుతా యి.ఈకారణంగా,ఆక్రమణ జాతులు కూడా అనూ హ్యంగా విస్తరించే ప్రమాదముంది. ప్రపంచ భూభా గంలో దాదాపు 7%పర్యావరణ వ్యవస్థలు మారే ప్రమాదం ఉంది, అందువల్ల సహజ ఆవాసాల క్షీణత రాబోయే సంవత్సరాల్లో వేగవంతం అవుతుంది. ఫినోలాజికల్‌ మార్పులు (కొన్ని జాతుల పుష్పించే లేదా పునరుత్పత్తి వంటి ఆవర్తన సంఘటనలు) ఎక్కు వగా నమోదు చేయబడుతున్నాయి, ఫలితంగా జాతు ల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపు తుంది.ఉష్ణోగ్రత1.5జలేదా2%జపెరిగితే, దాదాపు 70-99% పగడపు దిబ్బలు నాశనమవుతాయి. ఈ సృష్టిలో మనుషులకు,తోటి జీవులకు ఒకటే గ్రహం, ఒకటే గృహం.కంటికి సరిగ్గా కనిపించని బ్యాక్టీరి యా నుండి ఆకాశాన్ని అందుకునే ఎత్తైన చెట్ల వరకు అగాధాలలో అనాయాసంగా నివసించే సముద్ర జీవుల నుండి అలవోకగా ఆకాశంలోఎగిరే పక్షుల వరకు భూమికోట్ల కొద్దీ జీవజాతులకు నిలయం. నిత్యం కనుగొనబడే జీవజాతులు, వాటి శాస్త్రీయ వర్గీకరణ కారణంగా ఖచ్చితమైన సంఖ్య ఇప్పటికీ అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారి కంగా 17కోట్ల జాతులను మాత్రమే గుర్తించాము. యాభై నుండి మూడువందల కోట్ల జీవజాతులు ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఇంతటి విస్తృతమైన వైవిధ్యం రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది ఇప్పటి స్థితికి రావడానికి దాదాపు నాలుగు వందల కోట్ల సంవత్సరాల పాటు జీవపరిణామక్రమ ప్రక్రియ జరగవలసి వచ్చింది. కానీ ఆకోట్లాది జాతులలో కొన్ని జాతులు సమూలంగా అంతరించడం జరిగిం ది మాత్రం మానవుడు ఆవిర్భవించిన ఇటీవలి కాలంలోనే!భూమిచరిత్రలో జీవవైవిధ్యం అంతరించి పోవడం,పునరుద్ధరణ జరగడం సహజ ప్రకృతి చర్యనే.గతంలో కనీసం అయిదు సార్లు సహజ కార ణాలవల్ల సామూహికంగా జీవుల విలుప్తాలు (జుఞ్‌ఱఅష్‌ఱశీఅం)జరిగాయి.వీటిలో చివరిది 65 మిలి యన్‌ సంవత్సరాల క్రితం జరిగిన డైనోసార్ల విలు ప్తం.కానీ ఆందోళన కలిగించే విషయం ఏమి టంటే,ప్రపంచీకరణనుండి,జీవవైవిధ్య నష్టం ప్రమా దకర స్థాయిలో వేగవంతమైంది. ఇప్పుడో ఆరవ సామూహిక విలుప్తత జరిగే ప్రమాదం ఉందంటు న్నారు శాస్త్రవేత్తలు. చిక్కగా నేసిన వస్త్రంలో నుండి ఒక్కో దారం లాగేస్తుంటే, పల్చనైపోయి, వదులుగా మారి, క్రమేపీ కనుమరుగయ్యే వస్త్రం చందాన మన గ్రహం పైనున్న జీవవైవిధ్య పరిస్థితి ఉంది.అతి సూక్ష్మజీవుల నుండి భారీ నీలి తిమింగలాల వరకు, ప్రతిజాతి మన పర్యావరణవ్యవస్థ అనే వస్త్రపు సమ తుల్యతను కలిపి ఉంచే కీలకమైన దారాలు. ఇప్పుడు ఆ వస్త్రం నుండి దారపు పోగులు ఒక్కొక్కటిగా జారి పోతున్నాయి.మన కళ్లముందే ప్రకృతికను మరుగవు తోంది.భూగ్రహంపై జీవవైవిధ్యం ముప్పులో ఉండ టానికి ప్రధాన కారణం, దానిపైనే అధికంగా ఆధార పడే జీవి-మనిషి కావడం విశేషం.జీవవైవిధ్యం మానవ శ్రేయస్సు జీవనోపాధికి చాలా అవసరం. ఎందుకంటే ఇది అసలు జీవపు ఉనికికే ఆలంబన. కానీ,జీవుల సహజ నివాస స్థలాల నష్టం, కాలుష్యం, వ్యవసాయం,వేటాడటం,ఆక్రమణ జాతులు మరియు పెరుగుతున్న గ్లోబల్‌వార్మింగ్‌ కారణంగావక్ష, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగు తూనే ఉంది.గత కొన్నిసంవత్సరాలలో,జనాభా పెరుగు దల,దాంతోబాటే విపరీతంగా,అనిశ్చితంగా పెరిగి న,ఉత్పత్తి, వినియోగ విధానాలు జీవవనరు లకు వినియోగాన్ని పెంచాయి. దీని వలన జీవవైవిధ్యం నాటకీయంగా నష్టపోయింది. జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది మానవజాతి ముందున్న గొప్ప సవాళ్లలో ఒకటి.జీవవైవిధ్యం అనే పదాన్ని 1988లో అమెరికన్‌ శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ ఓ.విల్సన్‌ మొదటిసారి ప్రయోగించాడు. ఈ పదం, మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు మరియు సూక్ష్మజీవులు,అలాగే పర్యావర ణ పరస్పర చర్యలతో సహా గ్రహం మీద ఉన్న వివిధ రకాల జీవ రూపాలను సూచిస్తుంది. జీవవైవిధ్యాన్ని భూమిపై ఉన్న జీవసంపదగా నిర్వచించవచ్చు. జీవ వైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య ద్వారా కొలుస్తారు, ప్రతిజాతి జనాభాలో జన్యు వైవి ధ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు వివిధ వాతావరణాలలో జాతుల పంపిణీ అంచనా ద్వారా కూడా కొలుస్తారు. మానవ కార్యకలాపాల కారణం గా జీవ వైవిధ్యంలో గణనీయమైన తగ్గుదల సమస్య పై అవగా హన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్స రం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపు తుంది.
మనదేశంలో జీవవైవిధ్యం
భారతదేశం,32,87,263చదరపు కిలోమీటర్ల వైశా ల్యంతో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. భారత దేశంలో89,451జంతుజాతులున్నాయి.ఇది ప్రపంచజంతుజాలంలో7.31%. అలాగే 49,219 వృక్ష జాతులున్నాయి.ఇది ప్రపంచమొత్తంలో 10. 78% వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో ఉన్న పదిహేడు అతి పెద్ద జీవవైవిధ్య దేశాలలో భారత దేశం ఒకటి. భూవిస్తీర్ణంలో 2.4 శాతమే ఉన్నప్ప టికీ, ప్రపంచవ్యాప్త జీవజాతులలో 7.8 శాతం మన దేశంలో ఉన్నాయి. మన ప్రభుత్వం 2002లో జీవవైవిధ్య చట్టాన్ని తీసుకువచ్చింది. – (డా.కాకర్లమూడి విజయ్‌)

అరుదైన తాబేళ్లకు ఆపద

మానవ తప్పిదాలు..సముద్ర జలాల కాలుష్యం..అరుదైన ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల పాలిట శాపంగా మారుతున్నాయి.ఇక్కడి ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న క్రమంలో చేపల వలలకు చిక్కి,బోటు పంఖాలు తగిలి కొన్ని మృత్యువాత పడుతున్నాయి.కాలుష్యం కార ణంగా మరికొన్ని చనిపోతున్నాయి.పరిస్థితి తీవ్రత గమనింఎచిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వీటి మృతికి కారణాలు తెలసుకుని పూర్తిస్థాయిలో దరాస్యప్తు చేయాలని ఆదేశిం చారు. అధికారులు సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమకులు చెబుతున్నారు.విశాఖ తీరంలోనూ తాబేళ్ల మరణాలు కలవరపెడు తున్నాయి. ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ పలు ప్రాంతాల్లో నిత్యం వీటి కళేబరాలను చూసి సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాబేళ్లు ఎక్కడ పుడితే అక్కడకే చేరి గుడ్లు పెట్టే సుగణం వీటికి ఉంది.ఈనేపథ్యంలో ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లుపై ప్రత్యేక కథనం..
ఆలివ్‌ రిడ్లీల ‘అమ్మ ఒడి’శా
అరుదైన ఆలివ్‌ రిడ్లీ(సముద్ర తాబేళ్ల)లకు అమ్మ ఒడిలా ఒడిశా రాష్ట్రం ఆత్మీయత పంచుతోంది.ప్రపంచ నలుమూలల నుంచి ఏటా వేలాది ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు ఇక్కడకు వస్తున్నాయి.తీరంలో గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి పయనమవు తున్నాయి.ఒడిశా అటవీ అధికారులు అవి వదిలి వెళ్లిన గుడ్లను అపురూపంగా సంరక్షిస్తున్నారు.అవి పిల్లలుగా మారిన తర్వాత సముద్రంలోకి వదులుతున్నారు.ఆలివ్‌ రిడ్లీల పునరుత్పత్తికి ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాలు ఒడిశాలో ఉన్నాయి.ఆ రాష్ట్రంలోని గహీర్‌మఠ(కేంద్రపడ జిల్లా),రుషికుల్యా ముఖద్వారం(గంజాం జల్లా),దేవీ ముఖద్వారం(పూరీజిల్లా)తాబేళ్ల పునరుత్పిత్తికి ప్రధాన కేంద్రాలు.
రక్షణ చర్యలు భేష్‌..
వేల కి.మీ.దూరం ప్రయాణించి పునుత్పత్తి కోసం తాబేళ్లు ఒడిశాఖ తీరాలకు వస్తుంటాయి.తాబేళ్ల పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేందుకు భద్రతా శిబిరా లు,తీరాన ఇనుప జాలీలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు.ఆలివ్‌ రిడ్లీలు గుడ్లు పెట్టే తీరాన్ని శుభ్రపరుస్తున్నారు.ఒక్కో శిబిరంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించి గస్తీ నిర్వహిస్తున్నారు.ఇసుక లోపల ఉన్న వీటి గుడ్లను వీధికుక్కలు,నక్కలు తినేయ కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత ఆలివ్‌ రిడ్లేలు సముద్రంలో ఎంత దూరం వెళ్లుతున్నాయి?మళ్లీ ఎప్పుడు తీరానికి వస్తున్నాయి? అనేది తెలసుకునేందుకు వాటిలో కొన్నింటికి జియోట్యాగ్‌లు అమర్చు తున్నారు. పరిశోధనలకు ఆచర్య ఉపయుక్తం కానుంది.
ఏమిటీ ఆలివ్‌ రిడ్లీలు..?
సముద్ర తాబేళ్లలో ఎక్కువగా కన్పించేవి ఆలివ్‌రిడ్లీ.ఇవి చూడటానికి ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌లో ఉంటాయి.అందుకే వీటికి ఈపేరు వచ్చింది.పుట్టిన వెంటనే ఇవి బూడిద రంగులో ఉన్నప్పటికీ యుక్తవయస్సు వచ్చేసరికి పూర్తిగా ఆలివ్‌ వర్ణంలోకి మారి పోతాయి.వీటిపై రక్షణ పొర హృదయాకారంలో ఉంటుంది.పశ్చిమ అట్లాంటిక్‌ తీరంలో నివసించే ఆలివ్‌ రిడ్లీలు తూర్పుపసిఫిక్‌ ఆలివ్‌రిడ్లీల కంటే ముదురు రంగులో ఉంటాయి.యుక్తవయస్సు వచ్చినా వీటి పరిమాణం 2నుంచి 2.5అడుగులు మాత్ర మే పెరుగుతుంది.ఒక్కోక్కటి 36నుంచి 49కిలోల బరువుంటాయి.వీటిలో అతిపెద్దగా కన్పించే జాతి మెక్సికోలోని పసిఫిక్‌ తీరంలో ఉంది.
ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి..
ఆలివ్‌ రిడ్లీలు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్ట పడతాయి.పసిఫిక్‌,అంట్లాంటిక్‌,హిందూ మహాసముద్ర తీరాల్లో అవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.ఇక మన దేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం, బంగాళా ఖాతం తీరాల్లో ఆలివ్‌ రిడ్లీల సంతతి అత్యధికంగా ఉంటుంది.శ్రీలంకలోనూ ఇవి కన్పిస్తాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ అట్లాటిక్‌ మహాసముద్రంలో వీటి సంతతి గణనీయంగా క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.ఆలివ్‌ రిడ్లీలు సర్వభక్ష కాలు..అంటే ఇవి మొక్కలను తింటాయి.అలాగే జంతువులను కూడా భుజిస్తాయి. ఎక్కువగా తీరంలో దొరికే ఆల్గే,ఎండ్ర కాయలు,పీతలు,రొయ్యలు,చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి.కొన్నిసార్లు ఆలివ్‌రిడ్లీలు తమ ఆహార వేటలో భాగంగా సముద్రంలో500అడుగుల లోతుకు కూడా వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు.ఇక ఈఆలివ్‌ రిడ్లీలు తమజీవితాంతం ఎలా ప్రవర్తిస్తాయనే విషయంపై ఇంకా అధ్యయ నాలు జరుగుతున్నాయి.అయితే,చల్లని నీటి నుంచి తప్పించుకోవడానికి ఇవి సమూ హంగా ఏర్పడతాయి.ఎండలో అలాగుంపులుగా నిల్చోని పరస్పర తోసు కుంటూ కన్పిస్తాయి.ఈ సముద్ర తాబేళ్లు తీరంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ తాయి.ఇవి ఏడాది కాలంలో కొన్ని వందల,వేల మైళ్లు సునాయసంగా ప్రయాని స్తాయి.అలా వచ్చినవన్నీ ఒకచోట గూడు కట్టుకునే ప్రాంతాన్ని ‘అర్రిబడాస్‌’ అని అంటారు.ఇక్కడే ఆడతాబేళ్లు సంవత్సరంలో మూడు సార్లు..వందల సంఖ్యలో గుడ్లుపెడతాయి.-గునపర్తి సైమన్‌

నిస్సహాయంగా ముగిసిన కాఫ్‌`29 సదస్సు

భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్‌29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన వాతావరణ నిధిపై ముసాయిదా సత్వర కార్యాచరణకు ఏ మాత్రమూ అనువుగా లేదని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేలా కొత్త ఆర్థిక లక్ష్యాలతో ముసాయిదా వుండాలని వర్ధమాన, నిరుపేద దేశాలు భావిస్తున్నాయి. ఏడాదికి లక్ష కోట్ల డాలర్లు వుండాలని ఎల్‌ఎండిసి గ్రూపు సూచించింది. ముసాయిదాను క్లిష్టతరంగా మార్చ యడంపై పేద దేశాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న దుష్ప్రభావాలను తగ్గిం చేందుకు అజర్‌ బైజాన్‌లోని బాకులో జరిగిన కాప్‌ 29 సదస్సు ఫలవంతమైన కార్యాచరణను ప్రతిపాదించకుండానే ముగిసింది.ఈనెల 11వ తేదీన మొదలై,22వ తేదీవరకూ12రోజులపాటు జరిపిన చర్చలు సంపన్న దేశాల స్వార్థగుణాన్ని, పర్యావరణంపట్ల వాటి పాక్షిక దృష్టిని మరోసారి బయటపెట్టాయి. తాము సృష్టిస్తున్న కాలుష్యాన్ని,కర్బన ఉద్గారాల పాపాన్ని ప్రపంచం నెత్తిన వేసి,తాము చేతులు దులుపుకోవాలన్న అతి తెలివితోనే అవి వ్యవహరించాయి.
దేశాలకు సరిహద్దులు ఉంటాయి కానీ,పర్యావరణాన్ని హరించే కర్బన ఉద్గారాల వ్యాప్తికీ,వాటి పర్యవసానాలకు నియంత్రణ రేఖలు ఉండవు. ధనిక దేశాలు ఏళ్ల తరబడి అనుభవిస్తున్న సర్వ సౌఖ్యాలకు ప్రకృతి వనరులు దహించి వేసి,కీడు ఉద్గారాలను భూగోళం మీదికి వదులుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 75శాతం వాటా ధనిక దేశాలదే! సహజ వనరుల విచ్చలవిడి వినియోగంతో తరుముకొస్తున్న ఈ ఉద్గారాల విపత్తు భూరక్షక హరిత వలయానికి చిల్లులు పెట్టి, ప్రపంచం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈపాపం పూర్తిగా సంపన్న దేశాలది కాగా,దాని పర్యవసానాలకు బడుగు, వర్ధ మాన దేశాలు బలికావల్సి వస్తోంది.ఈ వాస్తవాన్ని అంగీకరించటానికి, పర్యావరణ పరిరక్షణలో తదనుగుణమైన పాత్ర వహించటానికీ ధనిక దేశాలు సంపూర్ణ సంసిద్ధతను వ్యక్తం చేయటంలేదు.అందువల్ల రోజుల తరబడి సదస్సులు జరిగినా తూతూమంత్రపు తలూపులతోనే అవి తంతుగా మిగిలిపోతున్నాయి.
కాప్‌`29 సదస్సులో వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నిలిచి,సంపన్న దేశాల నిర్దిష్ట బాధ్యతను గుర్తు చేశాయి.‘ఎంత హరిస్తున్నారో అంత భరించాలి’ అన్న న్యాయబద్ధమైన హితవుతో ఏటా 1.3లక్షల కోట్ల డాలర్లను పర్యావరణ రక్షణకు వెచ్చించాలని కోరాయి.కానీ,ధనిక దేశాల సన్నద్ధత 30వేల కోట్ల డాలర్ల దగ్గరే ఆగిపోయింది!ఈపాటిదానికి పన్నెండు రోజులపాటు పర్యావరణ హిత మంటూ ప్రపంచమంత రాగం తీయటం దేనికి?ఏదేశం ఎంత కాలుష్య కారక మవుతుందో,ఏదేశం ఎంతెంత పచ్చదనంతో ప్రపంచపు ఆరోగ్యానికి కారణమవు తుందో పక్కాగా లెక్కలను అనేక నివేదికలు ఘోషిస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు పర్యావరణ ధ్వంస సంపన్న దేశాలు హరిత సౌభాగ్యానికి తోడ్పడుతున్న వర్ధమాన దేశాలకు నిండుగా నిధులిచ్చి, ప్రోత్సహించటం అత్యంత అవసరమైన బాధ్యత. ఆ కనీస వివేచనను విడిచిపెట్టి, కొద్దిపాటి విదిలింపులతోనే సరిపెట్టటం, అదేదో తమ దాతృత్వ గుణానికి దాఖలాలా వ్యవహరించటం సబబు కాదు. పైగా ఈపాటి మాటకైనా ఆచరణ ఏమాత్రంగా ఉంటుందన్నది సందేహాస్పదమే! క్లయిమేట్‌ ఫైనాన్స్‌ కింద ఏటా 10వేల కోట్ల డాలర్లు ఇస్తామని 2009లో సంపన్న దేశాలు ఒప్పు కున్నాయి. కానీ, గడచిన పదమూడేళ్లలో దానిని పాటించింది ఒక్కసారే! ఇలాంటి మాట తప్పుడు తంతుతో పర్యావరణానికి ఏమాత్రమూ మేలు జరగదు.
ధనిక దేశాల పక్షపాత వైఖరిని, బాధ్యతారాహిత్యాన్ని వర్ధమాన దేశాలు గుర్తించి,గర్హించటం దాదాపు ప్రతి కాప్‌ సదస్సులోనూ జరుగుతోంది.ఈసారి కూడా తగిన మొత్తంలో పర్యావరణ నిధిని ఇవ్వాల్సిందేనని సంపన్న దేశాలను వర్ధమాన దేశాల ప్రతినిధులు నిలదీసిన ప్రతిసారీ హర్షధ్వానాలు మార్మోగాయి. ’’సంపన్న దేశాల వద్ద నిధులు లేక కాదుబీ అవి భౌగోళిక రాజకీయాలకు పాల్పడడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది’’ అని కొలంబియా పర్యావరణ శాఖ మంత్రి సుశానా మహ్మద్‌ వ్యాఖ్యానించినప్పుడు ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సదస్సు నీడన సంపన్న దేశాలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటానికి అనేక ప్రతిపాదనలను, ఒప్పందాలను ముందుకు తెచ్చాయి. క్లయిమేట్‌ ఫైనాన్స్‌ని అంతర్జాతీయ పెట్టుబడుల వ్యూహంగా మార్చే పన్నాగాలకు పదును పెట్టాయి. కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రాజెక్టులకు పెట్టుబడులు పెడతామంటూ కార్పొరేటు దిగ్గజాలు బరిలోకి దిగటం ఇందులో భాగమే! అసలు ప్రమాదాన్ని చిత్తశుద్ధితో ఎదుర్కోకుండా లాభార్జన దుర్బుద్ధితో వ్యవహరిస్తే భూగోళం మరింత రుజాగ్రస్తం అవుతుంది.ఈఎత్తుగడలను తుత్తనియలు చేస్తూ,సంపన్న దేశాల మెడ మీద బాధ్యతల కాడిని మోపటం వర్థమాన దేశాల ఉమ్మడి బాధ్యత.– గునపర్తి సైమన్‌

మన్యంలో సికిల్‌సెల్‌ మహామ్మారి

సికిల్‌ సెల్‌ అనీమియా జనాన్ని మింగేస్తోంది .పచ్చటి మన్యాన్ని ఓ మహామ్మారి మింగే స్తోంది. గిరిజనుల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తోంది. ఏజెన్సీలో మృత్యుఘటికలు మోగి స్తోంది. చిన్నారులే లక్ష్యంగా ప్రాణాలనే హరిస్తోంది.ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈవ్యాధి బారినపడి చనిపోతున్నారు. మన్యా న్ని వణికిస్తున్న ఆజబ్బు పేరు సికిల్‌ సెల్‌ అనీమియా.జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈరక్తహీనత జబ్బు చాపకింద నీరులా ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తుంది. ముఖ్యంగా అల్లూరి సీతారా మారాజు జిల్లా ఏజెన్సీప్రాంతాన్ని చుట్టు ముట్టుతోంది. భయంకరమైన ఈ వ్యాధి జన్యుపరమైన మార్పులవల్ల వచ్చే జబ్బుని వైద్యులు గుర్తిస్తున్నారు. ఈవ్యాధి నివారణకు ఇంతవరకు మందులు లేవు.ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈరోగం బారినపడి చనిపోతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 10లక్షల గిరిజన జనాభా ఉంది.ఇందులో కనీసం పదిశాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి.ఈ వ్యా ధికి గురై మరణించవారి సంఖ్య ఏటా పెరుగు తూ పోతుంది.యూనివర్శిటీ స్థాయిలో హ్యూ మన్‌ జెనెటిక్స్‌ విభాగం వారు జరిపిన పలు శాంపిల్‌ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివశిస్తున్న గిరినేతర కులాల్లో కూడా ఈవ్యాధి లక్షణాలు కనిపిస్తుం డటం మరింత ఆందోళన కలిగించే విషయం. అల్లూరిసీతారామారాజు,పార్వతిపురం మన్యం, అనకాపల్లి,ఏలూరు,శ్రీకాకుళం జిల్లాల్లో ఈవ్యా ధి లక్షణాలు కలిగిన రోగులు అనేక మంది బాధపడుతున్నారు.
నిర్లక్ష్యానికి పరాకష్ట..
పాడేరు పరిసర ప్రాంతాల్లో సికిల్‌ సెల్‌ అనీమి యా రోగుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. ఎత్తయిన ప్రాంతం(3,600అడుగులు)కావడం వల్ల ఈ ప్రాంతంలో ఆక్సిజన్‌ లభ్యతలో తేడా లుంటాయి.రోగులకు తరచూ రక్తం ఎక్కించా ల్సిన అవసరం ఉంటుంది.ఈరోగానికి మందు లు లేవు.సికిల్‌ సెల్‌ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడమే మార్గం.
సికిల్‌ సెల్‌ అనీమియా వ్యాధి లక్షణాలు ఇలా..
సికిల్‌ సెల్‌ ఎనీమియా అనే వ్యాధి వారస త్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహం.రక్తములో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులు లోపబూయిష్టంగా మారతాయి.ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలలో హిమోగ్లోవిన్‌ కొడవలి కణా లుగా మారి తద్వారా ఏభాగంలోనైనా కణజాలం,అవయవ వైకల్యానికి దారితీ స్తుంది.కొడవలి ఆకారంలో కణాలు మార డం వలన రక్తహీనత పరిస్థితులకు దారి తీస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారంగా ఉండడం,అవయవ వైఫల్యం కలుగుతోంది.రక్త కణాలు సంఖ్య తగ్గడం (రక్తహీనత) కళ్ళు పసుపు రంగులో మార డం,తీవ్రమైన కీళ్ల నొప్పులు,ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,అలసట, తరచూ వచ్చే అంటువ్యాధులు,గర్భాధారణ సమయంలో ఎదురయ్యే సమస్యలు,అవయవ వైకల్యం,పెరుగుదల వంటి సమస్యలు ఈవ్యాధి లక్షణాలు.ప్రతి ప్రాథమిక వైద్య శాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు 40ఏళ్లు ఉన్న వారందరూ చేయించు కోవాలి. జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి చిన్నపిల్లలకు ఈవ్యాధి సోకే ప్రమాదం ఉంది.ఈ వ్యాధి అంటువ్యాధి కాదు.ఒక వ్యక్తి నుండి ఒకవ్యక్తికి గాలి,నీరు,చర్మములైన వాటిద్వారా రాదు.ఆహార అలవాట్లువల్ల కూడా సంభవించదు.కేవలం జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్ర మిస్తుంది. ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో జీరో నుండి 45ఏళ్ల మధ్య వయస్సున్న జనాభాకు అవగాహన కల్పించడం,సార్వ త్రిక నిర్ధారణ పరీక్షలు కౌన్సిలింగ్‌ ద్వారా ఈ వ్యాధిని అరికట్టడానికి దోహదపడు తుందని పాడేరు సర్వజన ఆసుపత్రి సికిల్‌ అనీమియా వైద్యనిపుణ రాలు డాక్టర్‌ ఆశాలత తెలిపారు.
సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యం
సికిల్‌ సెల్‌ అనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర,కేంద్రప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.వ్యాధి గ్రస్తులకు నెలకు రూ.10వేలు చొప్పున ప్రొత్సహాకలు అంది స్తోంది.సికిల్‌ సెల్‌ అనీమియా లక్షణాలు కలిగిన రోగులకు నిరంతరం రోగనిరోధక పరీక్షలు చేస్తోంది.రోగం ఉందని నిర్ధారణ అయితే వారికి ప్రభుత్వం సర్టిఫికేట్లు అందజేస్తోంది.తద్వారా ప్రభుత్వం కల్పించే రాయితీ మంజూరు చేస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సికిల్‌ సెల్‌ ప్రభా విత గిరిజన ప్రాంతాల్లో అవగాహన చాలా అవసరం.40ఏళ్ల మధ్య గిరిజనుల్లో నిర్ధా రణ పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్‌ ఇవ్వాలి.హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వాళ్లకి ఈవ్యాధి వ్యాపిస్తోంది.దీనిని నిరోధించేం దుకు గిరిజనులకు స్కానింగ్‌ పరీక్షలు పాడేరు ఆసుపత్రిలో అందుబాటులోఉన్నాయి. సకాలంలో ఈవ్యాధి నిర్ధారిం చడంవల్ల చికిత్స ను వెంటనే ప్రారంభిం చడానికి అవకాశం ఉంది.ఈ వ్యాధి తీవ్రంగా మారకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. మెరుగైన జీవనశైలి అలవర్చు కోవాలి.ఈ వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని,సమతుల ఆహారం,పౌష్టికా హారం తీసుకోవాలని విపరీతమైన వాతా వరణ పరిస్థితిలకు ఎదురు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని,ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పాటు చేసుకోవాలని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకూడదని తెలియజేశారు.ఈ వ్యాధిని నిర్ధా రించడానికి ఎలక్ట్రోఫోరోసిస్‌ అనే రక్తపరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారించవచ్చని ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే ఈ పరీక్ష చేయిం చుకుని చికిత్స పొందినట్లయితే ఈ వ్యాధిని నివారించడం ద్వారా వారి జీవనశైలి మెరుగు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
సికిల్‌ సెల్‌ రోగుల లక్షణాలు…
సికిల్‌ సెల్‌ వ్యాధిని నివారించడానికి,దాని కారణాలను మొదట అర్ధం చేసుకోవడం చాలా అవసరం.ఒక్కోసారి ఈవ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభిస్తుంది.అంటే తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ దీని బారిన పడినట్లుయితే,అది పిల్లలకీ కూడా వచ్చే ప్రమా దం ఎక్కువగా ఉంటుంది.ఈ వ్యాధి జన్యుపు ఒకతరం నుంచి మరోక తరానికి వచ్చే అవకా శం ఉంది.అందువల్ల ముందు జాగ్రత్త కోసం వివాహానికి ముందు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.అంతేకాకుండా ఈవ్యాధి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఈ వ్యాధి నుంచి ఎలా బయ పడొచ్చు..
ఎర్ర రక్తకణాలను ప్రభావితం చేసే ఈవ్యాధి జన్యుపరమైన కారణాలవల్ల మాత్రమే వస్తుంది. ఎర్రకర్తకణాల ఆకారం మారిపోతుంది.దీనివ్ల శరీరానికి తగినంత ఆక్సిజన్‌ లభించదు. ఎందుకంటే హిమోగ్లోబిన్‌లో అసాధారణైన గొలుసులు ఏర్పడటంతో సికిల్‌ సెల్‌ అనీమి యా,సికిల్‌ సెల్‌ తలసీమియా వంటి వ్ధాఉలు వస్తాయి.అందువల్ల సకాలంలో సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యమని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
ఈవ్యాధిని నయం చేయడం సాధ్యమేనా ?..
వైద్యులు సాధారణంగా సికిల్‌ సెల్‌ అనీమి యాతో బాధపడుతున్న వ్యక్తులకు రక్తమార్పిడి అవసరమని సిఫార్సు చేస్తారు.శరీరంలోని ప్రతి భాగానికి తగినంత ఆక్సిజన్‌ అందనప్పుడు, దానివల్ల కలిగే తీవ్రమైన నొప్పి నుంచి ఉపశ మనం పొందేందుకు హైడ్రాక్సీ యూరియాని ఉపయోగిస్తారు.రానున్న కాలంలో ఈ వ్యాధి చికిత్సలో జన్యు చికిత్స ఎంతగానో ఉపకరి స్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.దీనివ్ల తీవ్ర లక్షణాలున్న రోగులకు ఎంతో మేలు చేకూరనుంది.
పరీక్ష ఖరీదు పది రూపాయలే..
జబ్బు నిర్దారణకు జరిపే ప్రాధమిక రక్త పరీక్ష ఖరీదు రూ.10లోపే ఉంటుంది. రక్తనమూనాను సోడియం మెటాట్రై సల్ఫేట్‌లో కలిపి మైక్రోస్పోప్‌ కింద చూస్తే రక్తకణాలు మామూలుగా ఉన్నాయా?వంపు తిరిగి ఉన్నాయా?అని తెలుస్తుంది.ఈ ప్రాధ మిక పరీక్షను ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల (పీహెచ్‌సీ)స్థాయిలోనే జరప వచ్చు.జిల్లాలో సికిల్‌ సెల్‌ అనీమియా ఎక్కువగా ఉన్న పాడేరు,అరకు పరిధిలో 22 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి.అయితే ఎక్కడా సికిల్‌ సెల్‌ పరీక్షలు జరపడం లేదు.రోగులు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీ హెచ్‌ ఆస్పత్రిక వచ్చినప్పుడు అక్కడ పరీక్షల్లో మాత్రమే వీరికి సికిల్‌ సెల్‌ అనీమి యా ఉన్నట్లుగా నిర్ధారణ అవుతోంది. ప్రస్తుతం పాడేరు సర్వజన ఆసుపత్రిలో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కొడుకు చనిపోయాడు..కుమార్తెకూ వ్యాధి…
రaూన్సీరాణి,క్రాంతిరాజు దంపతులకు ఒక కుమారుడు.ఒక కుమార్తె ఉన్నారు. రaూన్సీ రాణి పాడేరు సమీపంలోని కిండంగిలో ఎన్‌ఎన్‌ఎంగా పనిచేస్తోంది.క్రాంతారాజు గిరిజన కార్పొరేషన్‌లో సేల్స్‌మేన్‌,తొమ్మిదేళ్ల క్రితం 9వ తరగతి చదువుతున్న కొడుకు సురేష్‌కు విపరీతైన జ్వరం వచ్చింది.డాక్టర్లు సికిల్‌ సెల్‌ అనీమియా అన్నారు.అన్నీ రకాల వైద్యం చేయిస్తూ వచ్చినా 2013 సెప్టెంబర్‌లో చనిపోయాడు.ఆ దు:ఖం నుంచి కోలుకోక ముందే కుమార్తె శ్రీలతకూ అదే విధమైన జబ్బు వచ్చింది.కూతుర్ని దక్కించుకోవడమెలాగో తెలియక ఆ దంప తులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం.ఇది వీరి ఒక్కరి సమస్య కాదు.. ఉత్తరంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో గల పలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గుడెం లోను వందలాది కుటుంబాలు ఇలాంటి వ్యధ ను అనుభవిస్తున్నాయి.ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. వీటిన్నింటిపై ప్రజ లకు అవగాహన కల్పిం చాలనే లక్ష్యం.
సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత సమాజమే లక్ష్యం
సికిల్‌సెల్‌ ఎనీమియా రహిత గిరిజన సమాజ మే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పీవో వి.అబి óషేక్‌ తెలిపారు.ఏజెన్సీలో గిరిజనులను దీనిపై చైతన్య పరచాలన్నారు. ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (జన్‌మన్‌)లో భాగంగా ఏర్పాటు చేసిన సికిల్‌ సెల్‌ ఎనీమియా ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించాయన్నారు. తొలి విడతగా స్థానిక ఐటీడీఏకు రెండు ప్రచార వాహనాలు పాడేరు చేరుకున్నాయని, మరో నాలుగు వాహనాలు త్వరలో వస్తాయ న్నారు. పాడేరు డివిజన్‌ పరిధిలో 35 ప్రాథ మిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియాపై ప్రచారం చేసి గిరిజనులకు అవగాహన కల్పించా లన్నారు. డివిజన్‌ పరిధిలో 1,550 గ్రామాల్లో ప్రచారం చేయాలనేది లక్ష్యంగా నిర్దేశించామని, ప్రతి రోజు మూడు నుంచి ఐదు గ్రామాల్లో ప్రచార రథం పర్యటించాలన్నారు. ఎంపిక చేసిన గ్రామాలకు ప్రచార రథం వచ్చిన సమయంలో సంబంధిత వైద్యాధికారి, వైద్య సిబ్బంది, గ్రామ సర్పంచులు విధిగా భాగ స్వామ్యం కావాలన్నారు. సికిల్‌ సెల్‌ ఎనీమి యా లక్షణాలను, నివారణ చర్యలను ప్రజలకు వివరించాలని ఐటీడీఏ పీవో సూచించారు. ఐటీడీఏ పరిధిలో లక్షా పది వేల మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చగా వారిలో 1,050 మందికి సికిల్‌సెల్‌ ఎనీమియా పాజిటివ్‌ వచ్చిందని, వారికి మరో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 650 మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా ఉందని తేలిందన్నారు. దీంతో వారికి అవసరమైన మందులు, సికిల్‌ సెల్‌ ఎనీమియా పింఛన్‌ మంజూరుకు సిఫా రసు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ సి.జమాల్‌ బాషా, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విశ్వమిత్ర, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భారత దేశంలో ఈవ్యాధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, చత్తీష్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, తూర్పు గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమ ఒడిశా,ఉత్తర తమిళినాడ్‌లలో ప్రబ లంగా ఉంది.
తెలంగాణలో వరంగల్‌,ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,జయశంకర్‌ భూపాలపల్లి,ఖమ్మం,భద్రాద్రి కొత్త గూడెం, నల్లకొండ,మహాబూబ్‌నగర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల వారు,ఆదివాసులు అత్యధిక సంఖ్య లో ఈ వ్యాధికి గురవుతున్నారు.దీనికి సంబం ధించి వైద్య చికిత్సల కోసం నగరానికి రాకపోకు సాగిస్తున్నారు.
మేనరికపు వివాహాలు కూడా కారణమే…
తండాలలో ఈవ్యాధి ఎక్కువగా కనిపించడానికి మేనరిక వివాహాలు,దగ్గర బంధువుల్లో వివా హాలు కూడా కారణమే.ప్రణాళికబద్దంగా పరీ క్షల నిర్వహణ,అవగాహన పెంచడం,ముం దుస్తుగా వ్యాధిని గుర్తించడం,ఆయా ప్రాంతాల్లో వ్యాధి నిర్మూలనకు దోహద పడతాయి.జాతీ య ఆరోగ్య సర్వే ప్రకటించిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని చిన్నారులు పెద్ద సంఖ్యలో సికిల్‌ సెల్‌ అనీమియా బారిన పడుతున్నారు. సరైన అవగహణ లేక,గుర్తిం చడంలో ఆలస్యం వల్ల,అనేక ంది బాధితులుగా మారుతున్నారు. వచ్చే 2047కల్లా సికిల్‌ సెల్‌ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 0`40ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న 7కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించ డంవ్యాధి నిర్మూ లనకు దోహదపడుతుంది. గత కొన్నేళ్లుగా బాధితులకు స్వచ్చంధ సేవలు తలసీమియా, సికిల్‌సెల్‌ సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ అగర్వాల్‌ అందిస్తున్నారు.
– గునపర్తి సైమన్‌

సమత రవికి ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డు

వైవిధ్యం ఆయన జీవన శైలి.ఉద్యమం ఆయన ఊపిరి.ఎన్నో సమస్యలపై పోరాడారు.విజయం సాధించారు. గిరిజనులకు ‘నేనున్నా’..అంటూ భరోసా ఇచ్చారు.వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.ఆయనే రవి రెబ్బాప్రగడ. ఆయన సేవలకుగాను ఇప్పటికే ‘లక్ష్మీపత్‌ సింఘానియా యువ నాయకత్వం’ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించగా తాజాగా అక్టోబర్‌ 4న మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారం సమత రవిని వరించిన సందర్భంగా…
రవి పుట్టింది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి.సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అమాయకులైన నిరుపేద గిరిజనుల సాదక బాధకాలు ఆయన్ని బాగా కలచి వేశాయి.గ్రామీణాభివృద్ధి అంశంపై స్నాతకోత్తర పట్టా(పీజీ)పుచ్చుకున్న ఆయన బహుళజాతి సంస్ధల్లో వచ్చిన ఉద్యోగావకా శాన్ని వదులుకున్నారు.34ఏళ్ల క్రితం ఓసామా జిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఈ మూడు దశాబ్దాలలో ఆయన సేవలకు గుర్తింపుగా ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ‘ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డ్స్‌ 2024’పురస్కారాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తి ఎన్‌.కోటిష్వరసింగ్‌ అందుకున్నారు.ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రముఖ తీర్పులకు దారితీసిన న్యాయ పోరాటం చేసిన వ్యక్తులను,ప్రముఖ తీర్పులకు దారితీసిన విజేతలను సత్కరించడానికి ‘ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డ్స్‌ 2023’కార్యక్రమాన్ని ప్రారంభించింది.రెండవ సంచికను నిర్వహించిన న్యాయపోరాటం చేసిన వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఐదోవ షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని గిరిజన హక్కులు, పర్యా వరణం,వనరుల పరిరక్షణపై పనిచేస్తున్న రవికి ఈఅవార్డు లభించింది.
అవార్డు ఎంపిక జ్యూరీ..
సమత వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌,ఇతర రాష్ట్రాలలో న్యాయం కోసం సమత చేసిన అలుపెరగని పోరాటం కోసం ప్రముఖ జ్యూరీ ‘గిరిజన ఎస్సీ,ఎస్టీ విభాగంలో అవార్డు గ్రహీతగాఎంపిక చేసింది.ఈ అవార్డుల ఎంపికను ప్రముఖ జ్యూరీ అవార్డు గ్రహీతలను నిర్ణయించారు.ఢల్లీి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి,మీనన్‌, సాయుధ దళాల ట్రిబ్యునల్‌ ఛైర్మన్జస్టిస్‌ రాజేంద్ర,ఢల్లీి హైకోర్టు మాజీ న్యాయ మూర్తి,జస్టిస్‌ కైలాష్‌ గంభీర్‌,తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండ రామ్‌,ఢల్లీి హైకోర్టు బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షులు,సీనియర్‌ న్యాయవాది, మోహిత్‌ మాథుర్‌,సీనియర్‌ న్యాయవాది,ఢల్లీి హైకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజశేఖర్‌ రావు,ఢల్లీి హైకోర్టు వికాస్‌ పహ్వా,ఢల్లీి మాజీ ప్రత్యేక పోలీసు కమిషనర్‌ సంజయ్‌ సింగ్‌, సీనియర్‌ న్యాయవాది,ఢల్లీి హైకోర్టుమ ణిందర్‌ సింగ్‌ జ్యురీస్‌ సభ్యులుగా ఉన్నారు.
నేపథ్యం ఇదీ..
దేశం యావత్తూ ఒక్కసారిగా ప్రభుత్వేతర సంస్థల పదునేమిటో ప్రత్యక్షంగా చవి చూసిన సంఘటన 1997నాటి సమత తీర్పు.ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని తూర్పు కనుమల్లో గనుల తవ్వకాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు ద్వారా సమత వాదన సరైం దేనని తీర్పు పొందిన ఘనతకు మూల కారకు డాయన. సమతా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1997)లో సుప్రీంకోర్టు తీర్పు భారతదేశంలోని గిరిజన సంఘాల హక్కు లను,ముఖ్యంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో భూవినియోగం,సహజ వనరుల దోపిడీకి సంబంధించిన హక్కులను గణనీ యంగా సమర్థించే ఒక మైలురాయి తీర్పు. మైనింగ్‌ కార్యక లాపాల కోసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజనుల భూములను గిరిజనేతర కార్పొరేష న్‌లకు లీజుకు ఇచ్చినప్పుడు,అక్కడ నివసిస్తున్న ఆదివాసీ జనాభా హక్కులు,జీవనోపాధిని ఉల్లం ఘిం చినప్పుడు ఈ కేసు తలెత్తింది.
సమత ఉద్యమంగా విశాఖ కేంద్ర బింధువు..
విశాఖను సమత ఉద్యమాల కేంద్ర బింధువుగా తీర్చిదిద్దుతున్న నేపథ్యం పరిశీలిస్తే..సమాజ సేవ చేయాలనే సంకల్పంతో 1986లో రవి భాగవతుల చారిటబుల్‌ ట్రస్టులో చేరారు. ఆతర్వాత కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో స్వాతంత్య్ర సమర యోధుడు స్వర్గీయ కె.తిలక్‌ స్థాపించన స్పందన సంస్థలో పరిపూర్ణ అవగాహన ఏర్పరచుకున్నారు. 1990లో తానే స్వయంగా సమత స్వచ్చంధ సంస్థను స్థాపించి గిరిజన హక్కుల పోరాటం లో కొత్తపుంతలు తొక్కారు.ఏజెన్సీలోని కాకినాడ జిల్లా బవురవాక గ్రామంలో పేద గిరిజనులకు 298 ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేయడంలో రవి కృషి అనన్య సామా న్యం.ఏజెన్సీలో నెలకొన్నపలు సమస్యల పరిష్కారానికి మొక్కవోని దీక్షతో పనిచేశారు.
ఉద్యమమే ఊపిరిగా..
ఉమ్మడి విశాఖ అల్లూరి సీతారామారాజ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిం చడమే ధ్యేయంగా సమత కార్యకలాపాలను విస్తరించారు.గిరిజనులను చైతన్యవంతులను పర్చేపలు సామాజిక సేవా కార్యక్రమాలను చేయడంతో ఆసేవలను గుర్తించి అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ 1994లో అవార్డును బహుకరించారు.బొర్రా ప్రాంతో మైనింగ్‌,భూ సమస్యలను దృష్టి సారించి రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు కంపెనీలు చేపట్టే కార్యక్రలాపాలను వ్యతిరేకిం చారు.అనంతగిరి బొర్రా,అరకు,ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మైనింగ్‌ ఇచ్చిన లీజులను సమర్దవంతంగా అడ్డు కున్నారు.ఈఘటనతో తూర్పు కనుమల్లో గిరిపుత్రుల్నీ,వారి హక్కుల్నీ సంరక్షించడానికి ఉద్య మించిన ఉక్కు పిడికిలి రవి రెబ్బా ప్రగడ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. న్యాయపోరాటంచేసి 1997లో భారత అత్యన్నత న్యాయస్థానం ద్వారా సాధించిన ‘సమత తీర్పు’ దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రా ల్లోని గిరిజన హక్కుల పరిరక్షణకు ఓకవ చంలా ఉపయోగపడుతోంది.ఆనాటి పోరాట ఫలితమే నేడు ఫైట్‌ ఫర్‌ జస్టిస్‌ అవార్డు` 2024 పురస్కారం ఈసముచిత గౌరవాన్ని రవి రెబ్బాప్రగడ దక్కించుకున్నారు.– గునపర్తి సైమన్‌

పట్నం..పల్లెలు..కన్నీటిమయం

వర్షం విలయం సృష్టించింది.మిన్నుమన్నూ ఏకమైనట్టుగా కుంభవృష్టి కురడంతో విజయ వాడలో జనజీవనం అతలాకుత లమైంది. వానలకు వాగులు,వంకలు పొంగిపోర్లి కాలనీల్లోని లోతట్టు ప్రాంతా లను ముంచెత్తాయి. పధానంగా విజయ వాడ నగరపాలక సంస్థలకు భారీ నష్టం వాటిల్లింది.నగర శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి.నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడ మేరు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి.శివారు ప్రాంతాలవారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5`7అడుగుల మేర వరదనీరు చేరగా,ప్రధాన, అంతర్గత రహదారులపై నాలుగు అడుగల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది.ప్రజలు బయటకు వచ్చేందుకు అవకాశం లేక,నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలులేక బిక్కుబిక్కుమని ఇళ్లలోనే కాలం గడుపుతు న్నారు. వరదనీరు పెరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ చేరడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. దీంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి.ఎత్తయిన భవనాల్లో చిక్కుకు పోయినవారు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రులు, అధికారులు ప్రతిక్షణం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు.సహాయక చర్యలు ఆశాజనకంగా లేక ఆందోళన చెందుతున్నారు.చాలామంది ఇళ్లలోనే ఉండ పోియి అవస్థలు పడుతున్నారు.
భారీ వర్షాలకు విజయవాడ అస్తవ్యస్తం అయ్యింది. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.గత 30ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడలో రికార్డ్‌ వర్షపాతం నమో దైంది.బుడమేరు పొంగడంతో పలు కాలనీలు నీట మునిగాయి.నగరంలో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదైంది.ఒక్క రోజే 29సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలి పింది.భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కాలనీలు,ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది.బాధితులు సాయం కోసం ఎదురుచూ స్తున్నారు.విజయవాడను వరదనీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగుతోంది.దీంతో బడమేరు 11 గేట్లు ఎత్తివేశారు.కవులూరు వద్ద బుడమేరు కట్ట తెగి వరదనీరు కాలనీల్లోకి ప్రవేశిస్తుంది.
రికార్డు స్థాయిలో వర్షాలు
విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో 30ఏళ్ల రికార్డు బద్దలైంది. చరి త్రలో ఎన్నడూ లేనంతగా..ఒకేరోజు (ఆగస్టు 31 శనివారం) 29సెంటి మీటర్ల వర్షపాతం నమో దైంది.అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది.ఆటోనగర్‌ నుంచి బెంజి సర్కిల్‌ వరకు వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. సెప్టెంబర్‌ 1న కూడా బెజవాడలో భారీవర్షాలు కురువడంతో బెజవాడ గజగజ వణికిపోతోంది.
ముంపులో కాలనీలు :విజయవాడ,గుంటూరు నగరాల్లో అనేక కాలనీలువరద నీటిలో నాను తున్నాయి.అపార్ట్‌మెంట్లసెల్లార్లలోకి వర్షపు నీరు చేరి,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెల కొంది.నగర శివార్లలోని కండ్రిగ వద్ద రహ దారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది నివాసాలు నీటము నిగాయి.రైల్వేట్రాక్‌ అండ ర్‌పాస్‌ వద్ద 4బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు… బస్సులను బయటకు తీశారు.మైలవరంలో వెలగలేరు గేట్లుఎత్తి వేశారు.దీంతో చుట్టుపక్కల కాలనీ ల్లోకి వరద నీరు చేరింది.రాజరాజేశ్వరి పేట వరద నీటిలో చిక్కుకుంది.
బుడమేరు ఉగ్రరూపం
సరిగ్గా20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపునకు గురైంది.వాగులు,వంకలు ఆక్రమ ణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది.20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్‌ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు.20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగం గా విస్తరించడం,బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతోదశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజ వాడ పుట్టిముంచింది.2005సెప్టెంబర్‌లో వచ్చి న భారీ వర్షాలతో నగరం అతలాకు తలమైంది. విజయవాడ మూడొంతులు ముంపు నకు గురైంది. వరదల కారణంగా విజయవాడ లో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపం తో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్త డంతో అదంతా విజయవాడను ముం చెత్తింది. తాజాగా బుడమేరు పొంగడంతో సింగ్‌నగర్‌, చిట్టీనగర్‌,ఇతర కాలనీలు జలది గ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై 5అడుగుల మేర నీరు నిలిచిపోయింది.
ప్రకాశం బ్యారేజీ
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ ఫ్లో ,ఔట్‌ ఫ్లో 7,69,443 క్యూసెక్కులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని,ప్రజలు అప్రమ త్తంగా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రాజధాని ప్రాంతం
అమరావతి ప్రాంతంలో వరద నీరు చేసింది. చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కరకట్ట సమీపంలోకి వరదనీరు చేరుతోంది. హైకోర్టుమార్గంలో వరదనీరు చేరింది.విజయ వాడలో గత రెండు రోజులుగా కురిసిన కుండ పోత వర్షాలకు రోడ్లు చెరువులను తలపి స్తున్నా యి. మురుగు నీరురోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు,ద్విచక్రవాహనాలుకొట్టుకు పోయా యి. 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయ వాడ విలవిల్లాడిరది.పాతబస్తీ,బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు,జాతీయ రహదారి,ఆటో నగర్‌ లో భారీ వరద పోటెత్తింది.విజయవాడ సమీ పంలోని జాతీయరహదారుల నీటిలో చిక్కు కుపోయాయి.
మొగల్రాజపురం ప్రమాదం
విజయవాడలోని మొగల్రాజపురం వద్ద ఆగస్టు 31న కొండచరియల విరిగిపడ్డాయి. ఈ ఘట నలో ఐదుగురు మృతి చెందారు. అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు.పడిపోయిన కొండ రాళ్లను డ్రిల్లింగ్‌ చేసి, భారీ క్రేన్లతో శిథిలాల తొల గింపు ప్రక్రియ చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.మొగల్రాజపురం మృ తుల కుటుంబాలకు ప్రభుత్వంరూ.5లక్షల పరిహారం ప్రకటించింది.
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు
విజయవాడలో భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రొటోకాల్‌ ఆఫీస్‌,డోనర్‌ సెల్‌ ధ్వం సం అయ్యాయి.ఈప్రదేశంలో భక్తులు లేకపో వడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి ఘాట్‌ రోడ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఘాట్‌రోడ్‌ను మూసివేశారు.
రాయనపాడు ఘటన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభా వంతో ఏపీలోభారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విజయవాడ లోని బుడమేరు వాగు పొంగటంతో నగర ఔటర్‌ పరిధిలో ఉన్నరాయనపాడు రైల్వేస్టేషన్‌లోకి భారీ గా వరదనీరువచ్చిచేరింది రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు.ఆరో బెటాలియన్‌ ఎస్డీఆర్‌ఎఫ్‌ రెస్కూ టీమ్‌ రంగంలోకి దిగిసహాయక చర్యలను చేప ట్టింది.రాయనపాడులో నిలిచి పోయిన తమిళ నాడు ఎక్స్‌ ప్రెస్‌లోని ప్రయాణికులను రక్షించి, విజయవాడస్టేషన్‌కు తరలించారు. ప్రయాణికు లను ప్రత్యేక రైలులో తమిళనాడుకు తరలి స్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎంపర్యటన
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంద రికీ సాయం అందు తుందని చంద్రబాబు వివ రించారు.సీఎం మాట్లాడారు.ఈ క్రమం లోనే వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్‌ చేరుకున్నాయి.వీటి ద్వారా సింగ్‌నగర్‌ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. మరో వైపు ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి.మరోవైపు ప్రైవేట్‌ హోటల్స్‌,దుర్గగుడి,అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతర పర్య వేక్షణతో అధికారులుఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టారు.ఎవ్వరూ ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని,అందరికీ సాయం అందు తుందని పేర్కొన్నారు.మూడు పూటలా బాధితు లకు ఆహారం అందించాలని చెప్పారు.చిన్నా రులు,గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.ఒకేప్రాంతంలో కా కుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లా లన్నారు. -గునపర్తి సైమన్‌

అంబరాన్నింటిన ఆదివాసీ సంబరాలు

‘‘ గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారు.పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మించుకోవాలి.ఏపని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆదివాసీల్లో పేదరికం ఎక్కువగా ఉంది…వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు నేను తప్పకుండా శ్రద్ధ తీసుకుంటా. రాబోయే ఐదేళ్లలో నిర్థిష్ట ప్రణాళికతో పేదరికాన్ని తగ్గిస్తాం. పేరుకు పథకాలు ఇవ్వడం కాదు…వాటి ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. చేసే ప్రతి ఒక్క పనితో గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తాం.ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో డోలీ మోతలు కనబడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయ వివక్ష చూపించను…కక్ష సాధింపులకు పాల్పడను. కానీ రాష్ట్ర ప్రజల ఖజానాను, ఆస్తులను దోచిన వారిని శిక్షిస్తా. దోచిన సొమ్మును రికవరీ చేసి పేదలకు ఖర్చు పెడతా.ఈ రోజు నుండి చైతన్యం 2.0ప్రారంభమైంది.ఈ 2.0 చైతన్యం ఎక్కడ పేదవాడుంటే అక్కడికొచ్చి మీకు కావాల్సిన వనరులు ఇచ్చి పేదరికం నుండి బయటకు తీసుకొస్తాం. మీ జివితాల్లో వెలుగులు రావాలని కోరుకుంటున్నా..’’ `- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆగష్టు 9న జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సంబరాలు అంబరాన్నింటాయి.అంత ర్జాతీయ గిరిజన దినోత్సవం వేళ రాష్ట్రం లోని గిరిజనులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది ప్రభుత్వ సిద్ధాం తాలల్లో ఒకటని గుర్తు చేశారు. అందుకే నాటి తెలుగుదేశం హయాంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవానికి హాజరైన సీఎం గిరిజ నులతో మమేకమయ్యారు.మంత్రి గుమ్మడి సంధ్యారాణి,ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం చేశారు.అనంతరం గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించి, వారితో మమేకమయ్యారు.ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులను ఉత్సాహ పరిచారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటిం చారు.అనంతరం అరకు కాఫీ తాగిన సీఎం చంద్రబాబు, గిరిజనుల తయారు చేసిన ఉత్ప త్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల వద్దకు వెళ్లారు.గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జా తీయ గుర్తింపు కోసం ప్రోత్సాహాన్ని అందించా మని చెప్పారు.గిరిజన జాతులను కాపాడు కోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్న తంగా నిలబెట్టడమే అని పేర్కొన్నారు. రాబో యే రోజుల్లోనూ గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని గిరిజను లకు,వారి బిడ్డలకు మంచి భవిష్యత్‌ను అంది స్తామని హామీ ఇచ్చారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆదివాసీ ప్రజలను ఉద్దే శించి ప్రసంగించారు.‘గిరిజనులు పేదరి కంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారు. పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మించు కోవాలి.ఏపని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకోవాలి.ఆదివాసీల్లో పేదరికం ఎక్కువగా ఉంది..వారిని అన్ని విధాలా పైకి తీసుకొ చ్చేందుకు నేను తప్ప కుండా శ్రద్ధ తీసు కుంటా. రాబోయే ఐదేళ్లలో నిర్థిష్ట ప్రణాళి కతో పేదరికాన్ని తగ్గిస్తాం.పేరుకు పథకాలు ఇవ్వడం కాదు…వాటి ఫలితాలు ఇచ్చేలా ఉండాలి. చేసే ప్రతి ఒక్క పనితో గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తాం. ఆర్టిఫిషియల్‌ ఇంటి లిజెన్స్‌ గురించి మాట్లాడుకుంటున్న ఈరోజుల్లో డోలీ మోత లు కనబడటం చాలా బాధగా ఉంది. నేను రాజకీయ వివక్ష చూపించను…కక్ష సాధిం పులకు పాల్పడను.కానీ రాష్ట్ర ప్రజల ఖజా నాను,ఆస్తులను దోచిన వారిని శిక్షిస్తా. దోచిన సొమ్మును రికవరీ చేసి పేదలకు ఖర్చు పెడతా.ఈరోజు నుండి చైతన్యం 2.0ప్రారం భమైంది.ఈ 2.0 చైతన్యం ఎక్కడ పేదవా డుంటే అక్కడికొచ్చి మీకు కావాల్సిన వనరులు ఇచ్చి పేదరికం నుండి బయటకు తీసుకొస్తాం. మీ జివితాల్లో వెలుగులు రావాలని కోరుకుం టున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
డీఎస్సీ రాసే గిరిజన అభ్యర్థుల కోసం శిక్షణా కేంద్రాలు
‘ఇటీవల 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం.డీఎస్సీకి పోటీపడే గిరిజన అభ్య ర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తాం.గిరిజన విద్యార్థుల కోసం విశాఖ,విజయవాడ, తిరుపతి లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తాం.ఆదివాసీల్లో అనేక కళలున్నాయి.అరకు గిరిజన నృత్యం దేశంలోనే ప్రత్యేకమైంది. అనేక కళలున్న ఆదివాసీలు చాలా రంగాల్లో వెనకబడి ఉన్నా రు. ప్రతి యేడాది ఆగస్టు 9న ప్రపంచ ఆది వాసీ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని జీఓ నెంబర్‌ 123ను నాడు తెలుగుదేశం ప్రభుత్వం లోనే విడుదల చేసి నిర్వహించాం.కానీ గత ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిం చడం మానేసింది.మన దేవానికి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు, ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. పాఠశాలలో ఉపాధ్యా యిరాలిగా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయ్యారంటే అదీ ఆదివాసీల్లో ఉండే ప్రతిభ. ఆదివాసీలు అనగానే శౌర్యం, ప్రతిభ, నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రకృతిని ఆరాధి స్తారు.ఎగ్జిబిషన్‌ లో ఏకలవ్యుడి ఫోటోలు చూశాను. గిరిజన కుటుంబంలో పుట్టాడు. విలువిద్యను అందించేందుకు గురువులు నిరాకరిస్తే పట్టుదలతో విద్యనభ్యసించి అంద రికీ ఆదర్శంగా నిలిచారు.బిర్సాముండా, తాత్వాబిల్‌, మన తెలుగువారైన కొమరం భీం లాంటి వాళ్లు బ్రిటిష్‌ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అల్లూరి సీతారామరాజు మీ అండతోనే బ్రిటిష్‌ వారి ఆధిపత్యాన్ని అంతం చేయడానికి పోరాడి ప్రాణత్యాగం చేశారు. అందుకే దేశానికే ముద్దబిడ్డగా మిలిగిలారు.మీ త్యాగాలు, మీమద్దతు జాతి మరవదు. దేశంలో 10.42కోట్ల మంది గిరిజనులున్నారు. రాష్ట్రం లో 5.56శాత మంది ఉన్నారు.’అని సీఎం వివరించారు.
ఆదివాసీలు వెనకబాటుతనంపై సమగ్ర అధ్యయనం
‘మీలో అనేక కట్టుబాట్లు ఉన్నాయి. మైదా నంలో ఉండే వారి జీవన ప్రమాణాలు తక్కువ గా ఉన్నాయి…ఏజన్సీలో ఉండే వారికి కనీసం రోడ్లు కూడా సరిగా లేవు. సమైఖ్య రాష్ట్రంలో చైతన్యం అనే కార్యక్రమం పెట్టి పెనుమార్పు లకు శ్రీకారం చుట్టాం. మైదాన ప్రాంతాల్లో ఉండేవారి కంటే ఏజన్సీలో ఉండేవారికి వనరులు ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అరకు కాఫీని ప్రమోట్‌ చేశాం.అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను అందిం పుచ్చుకున్నాం.చాలామంది అర్గానిక్‌ ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారు.ఎక్కడా దొరకని తేనె మన ప్రాంతాల్లో దొరుకుతోంది.కాఫీకి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు సాగును ప్రోత్సహించాం.ప్యారిస్‌లో కూడా ప్రస్తుతం అరకు కాఫీ అమ్ముతున్నారు.కొన్ని పెద్ద పత్రి కలు కూడా అరకు కాఫీ గురించి రాస్తు న్నాయి. వ్యవసాయంలో అరకు కాఫీ కూడా భాగమని కథనాలు రాస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో అరకు కాఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్నారు. ఆదివాసీల మహిళలు డ్వాక్రా సంఘాల్లో కూడా ఉన్నారు. పేద మహిళలను సంఘటిత శక్తిగా మార్చాలని నాడు ఆలోచించాను.మారుమూల ప్రాంతా ల్లోని ఆడబిడ్డలు చేసే కుల,చేతివృత్తులను ప్రోత్సహించాం.మల్టీ గ్రెయిన్‌ బిస్కెట్ల తయా రీని ప్రోత్సహించాం.ఏపని చేసినా అనునిత్యం సాధన చేస్తూ నైపుణ్యం పెంచుకుంటే ఆదా యం వస్తుంది. కానీ ప్రభుత్వం నుండి ఆధా రం లేకపోవడంతో దెబ్బతిన్నారు.ఆదివాసీలు ఎందుకు వెనకబడి ఉన్నారో అధ్యయనం చేస్తున్నా’నని అన్నారు.
గత ప్రభుత్వం దుర్మార్గంగా16 సంక్షేమ పథకాలు రద్దు చేసింది
‘స్వాతంత్య్రం వచ్చి 78ఏళ్లైంది.చాలా వర్గాలు అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నాయి. కానీ ఎస్సీ,ఎస్టీ,బీసీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఆదివాసీల్లో పుట్టిన పిల్లలతో పాటు తల్లులు కూడా చనిపోతున్నారు.ఈ సంఖ్యను తగ్గిం చాలి. పిల్లల సంఖ్య తగ్గితే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. మన పిల్లలే మనకు ఆస్తి. వారిని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్న ప్పుడు చూసుకుంటారు. దేశంలో తలసరి ఆదాయం రూ.1.72లక్షలు ఉంటే ఏపీలో రూ. 2.20లక్షలు ఉంది. కానీ ఆదివాసీల్లో రూ.1.20లక్షలే ఉంది.పేదల జీవన ప్రమా ణాలపై శ్రద్ధ పెడతాం. అన్ని విధాలా పైకి తీసుకొస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 16పథకాలు తీసుకొచ్చాం.199 గురు కులాలు తీసుకొచ్చాం.2,705 విద్యాసంస్థల్లో ప్రస్తుతం 2,45,380 మంది విద్యార్థులు విద్యనభ్యసి స్తున్నారు.ఆదివాసీల్లో విద్యాభ్యాసం తక్కువగా ఉందని ఆలోచించిన ఎన్టీఆర్‌ ఏ ఊరిలో స్కూలు కావాలంటే ఆఊరిలోనే స్కూలు నిర్మిం చారు. గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉపాధ్యా యులుగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌.మీ పిల్లల విద్య కోసం 2014-19లో రూ.450 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం సగం కూడా ఖర్చు చేయలేదు. గిరిజన పిల్లలు అటవీ ప్రాంతాలకు పరిమితం కాకూడదని ఐఏఎస్‌, ఐఐఎంలలో చదవాలని శ్రద్ధ పెట్టాం. సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ కు వెళ్లేందుకు 1000మందికి రూ.13కోట్లు ఖర్చు చేశాం.కానీ గత ప్రభుత్వం రూ.3 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి ముగ్గురికే ట్రైనింగ్‌ ఇచ్చింది. గిరిజనుల్లో ప్రతిభ ఉంది… దాన్ని సానబెట్టి బయటకు తీయాలి. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విదే శాల్లో చదువుకునేందుకు రూ.15లక్షల చొప్పున సాయం అందించి 55మందిని విదేశాలకు పంపాం.దీనికోసం రూ.7.5కోట్లు ఖర్చు పెట్టాం. కానీ గత ప్రభుత్వం అంబేద్కర్‌ పేరు తొలగించి జగన్‌ పేరు పెట్టుకుని ఒక్కరికి మాత్రమే విదేశీ విద్యను అందించింది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, కార్పొరేట్‌ స్కూళ్లలో చదు వించుకునేవారి కోసం ప్రభుత్వం నుండి ఫీజు లు చెల్లించాం.గిరిపుత్రిక కింద 9,222 మంది గిరిజన యువతులకు రూ.56కోట్లు పెళ్లి కానుక అందించాం.దాన్ని కూడా గత ప్రభు త్వం నీరుగార్చింది.గిరిజనులు చనిపోతే రూ.5 లక్షలు ఆర్థిక సాయం బీమా ద్వారా అందిం చాం. రహదారి సదుపాయం లేని ప్రాంతాల నుండి ఆసుపత్రులకు డోలీల్లో వెళ్తున్నారని గుర్తించి ఫీడర్‌ అంబులెన్సులు తీసుకొచ్చాం. కానీ గత ప్రభుత్వం వాటిని కూడా నిర్వీర్యం చేయడంతో మళ్లీ డోలీల్లో మొసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది. డోలీల్లో తీసుకొచ్చే సమయంలో ప్రసవం అవుతున్నారంటే ఏంటి ఈ దౌర్భా గ్యం.ఆధునిక యుగంలో ఉన్నాం…అయినా డోలీల్లో తీసుకొస్తున్నారంటే అందరూ బాధ పడాలి.ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే మాతా,శిశు మరణాలు తగ్గుతాయి. సరైన పౌష్టికాహారం అందించేందుకు బాలింతలు, పిల్లలకు ఫుడ్‌ బాస్కెట్‌ ప్రవేశపెట్టాం. దోమల బెడద నుండి తప్పించుకోవడానికి దోమ తెరలు అందించాం. ట్రైకార్‌ ద్వారా ఉపాధి, భూమి కొనుగోలుకు రూ.685 కోట్లు ఖర్చు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేశాం.మేము ఉచితంగా కరెంట్‌ ఇస్తే దాన్ని కూడా గత ప్రభుత్వం రద్దు చేశారు. బాక్సైట్‌ తవ్వకాలు నిలిపేస్తే లేట్‌ రైట్‌ పేరుతో తవ్వ కాలు చేశారు’ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు
‘ఆరోగ్య,ఆర్థికంతో పాటు కుటుంబానికి కావా ల్సిన వసతులపై సమగ్ర విధానం తీసు కొస్తాం. ఇంకా విద్యుత్తు, మరుగుదొడ్లతో పాటు తాగునీరు లేని గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ప్రతి ఇంటికీ కనీస అవసరాలు కల్పిస్తాం. గిరిజన వాడల్లో రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. పాఠశాలకు పిల్లలందరూ వెళ్తున్నారో లేదో కూడా సమీక్ష చేస్తాం. గ్రామంలోని వనరులు ఉపయోగించి ఆదాయం పెంచే మార్గం చూపిస్తాం.ట్రైకార్‌ ద్వారా రుణా లు ఇస్తాం.2014-19 మధ్య ఇచ్చినట్లుగానే ఇన్నోవా కార్లు అందిస్తాం.గతంలో 80 స్కూళ్ల ను రెసిడెన్సియల్‌ స్కూళ్లుగా మార్చాం…వాటి కోసం కొత్త భవనాలు నిర్మిస్తాం.గిరిజనుల్లోని సమరయోధుల త్యాగాలను తెలియజేసేందుకు లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం. దేశంతో పాటు, ప్రపంచం లోని ముఖ్య నగరాల్లో అరకు కాఫీని ప్రమోట్‌ చేసి మరింత గుర్తింపు తీసుకొస్తాం.అరకు కాఫీ నాణ్యతను పెంపొందిస్తాం. వాణిజ్య పంటల కంటే కాఫీ పంటకు ఆదాయం అధికంగా వచ్చేలా చేస్తాం.మీరు పండిరచే ఆర్గానిక్‌ పంటల ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయం కల్పిస్తాం.తయారు చేసే వస్తువులను ఓఎన్డీసీ ఫ్లాట్‌ ఫాం ద్వారా వినియోగదారులకు నేరుగా వినియోగించేలా చేస్తాం.జీవో నంబర్‌ 3 నాకు బాగా గుర్తు ఉంది.నేనే తీసుకొచ్చా.విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉపఎన్నికలు ఉండ టంవల్ల మాట్లాడలేకపోతున్నా…మీ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలో అదంతా చేస్తా. సీతంపేట ఐటీడీఏలో రూ.7కోట్లతో సమగ్ర పసుపు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌ ను రూ.2.54 కోట్ల తో అభివృద్ధి చేస్తాం. పార్వతీపురం ఐటీడీఏ కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మిస్తాం.చింతూరు ఐటీడీఏ పరిధిలో 11 ఎత్తి పోతల పథకాలను రూ.2.5 కోట్లతో నిర్మిస్తాం. పాడేరులో మెడికల్‌ కళాశాలను రూ.500 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తాం.418 ఏకో పాధ్యాయ పాఠశాలలకు రూ.50 కోట్లతో భవనాలు పూర్తి చేస్తాం. అల్లూరి సీతారా మరాజు మన్యం జిల్లాలో ప్రధాన కేంద్రంలో మూడు ప్రధాన రహదారుల కారిడార్‌ను రూ.50కోట్లతో పూర్తి చేస్తాం.పాడేరు ఏజన్సీలో రూ.10కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. 2,191 గిరిజన గ్రామాలకు త్వరలో రోడ్డు మార్గాలు నిర్మిస్తాం. 16,816 గిరిజన నివాస ప్రాంతాలకు తాగునీరు లేదు,ఆ ప్రాంతాలకు కుళాయి ద్వారా నీళ్లు అందిస్తాం.’అని సీఎం హామీల వర్షం కురిపించారు.
మీ భూములు దోచుకునేందుకు గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేశాం
‘ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలపడమే కాదు…నిర్ధిష్ట ప్రణాలి కతో అభివృద్ధి చేస్తాం.అరకు పార్లమెంట్‌ పరిధిలో 5స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. మంచి పనులు జరగాలంటే ఆలోచనా విధానం కూడా మారాలి.మొన్నటి ఎన్నికల్లో సుడిగాలి వచ్చింది…ఆ సుడిగాలిలో తిరిగి రానంతగా జగన్‌ కొట్టుకుపోయారు. దీనికి కారణం అవినీతి, దోపిడీ, పేదల పొట్టకొట్టే పాలకులు ఉండటమే. ఇక్కడుండే వారిని అడుగుతున్నా….గత ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం జరిగిందా.? మీకు ఒక్క రుణమైనా ఇచ్చిందా.? మీ పిల్లల భవిష్యత్తు ను నిర్వీర్యం చేశారు.గిరిజనులపై దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టారు.అందుకే నిశ్వబ్ధ విప్లవం వచ్చి ఎవరూ ఊహించని విధంగా 93శాతం స్థానా లు కూటమికి వచ్చాయి. మీరు అనేక కష్టాలు అనుభవించారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్ష ల కోట్లు అప్పులు చేసింది..వాటికి ప్రతి నెలా వడ్దీలు కట్టాలి. ఇప్పటికే కొన్ని పథకాలు అమ లు చేస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పిన విధం గానే పింఛను రూ.3వేల నుండి రూ.4వేలకు పెంచి పెద్దకొడుకుగా ఉన్నా. వాలంటీర్ల లేకుం టే పింఛన్లు ఇవ్వలేరని చెప్పి 35 మంది వృద్ధు ల ప్రాణాలు తీశారు. కానీ మనం ఒక్కరోజు లోనే 97శాతం మందికి పింఛన్లు అందిం చాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి తెలుగు దేశం పార్టీకి ఉంది. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం.రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం.ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు ద్వారా మీభూములను దోచుకోవాలని చూశారు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశాం.’ అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
– గునపర్తి సైమన్‌

మడ అడవుల జీవ వైవిధ్య ప్రతీకలు

మడ అడడులు..పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి ప్రసాదించిన వరాలు.తీర ప్రాంతాలకు సహజ రక్షణ గోడలు.సముద్ర తీర జీవవైధ్యంలో వీటిదే కీలక పాత్ర.ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషల్ని,వన్యప్రాణుల్ని కాపాడుతు న్నాయి. కోట్ల మంది జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయి.వీటినిభద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాన వాళిపై ఉంది. జూలై26 అంతర్జా తీయ మడ అడువుల సంరక్షన దినోత్సవం సందర్భంగా…
ఉష్ణమండలం..ఉప ఉష్ణమండల ప్రాంతాలు, అత్యధిక వర్షపాతం నమోదయ్యే భూ భాగాలు,నదులు,సముద్రంలో కలిసేతీర ప్రాం తాల్లో మడ అడవులు ఏర్పడతాయి. అత్యధిక ఉప్పు సాంధ్రత,నీటినిల్వఉండి, తరచూ తుఫాన్లు సంభవించే ప్రాంతాల్లో అలలు,ఉప్పెనల ప్రభా వంతో నెలకొం టాయి.మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో తుఫానుల తీవ్రత,వాటివల్ల కలిగే నష్టం తక్కువగా ఉన్నట్లు కోనసీమ ఉప్పెన సహా పలుసందర్భాల్లో తేలింది.ఇవి ఉండే చోట మత్స్య సంపద అధికంగా ఉంటున్నట్లు అధ్యయ నాల్లో వెల్లడైంది.చేపలు,రొయ్యలకు ఆహారంగా మత్స్యసంపదను పెంపొందిం చడంలోనూ తోడ్ప డుతున్నాయి. పర్యాటక పరంగానూ వేల మందికి ఉపాధిని కల్పిస్తు న్నాయి.వాతావర ణంలో కర్బన్‌ ఉద్గారాలు కార్బొన్‌ డై ఆక్సైడ్‌ను తగ్గించు డంలో కీలక పాత్ర పోషిస్తు న్నాయి. సముద్ర తీరప్రాంతంలో నీటి నాణ్యత ను పెంచేందుకు దోహదపడుతు న్నాయి. పర్యా వరణ పరిరక్షనతోపాటు జీవవైధ్యానికి అండగా నిలుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో పలురకాల గ్రామీణ జీవనోపాధి అవకాశాలు కల్పించడం లో గణనీయ పాత్ర పోషిస్తున్నాయి.తుఫానులు, ఉప్పెనల నుంచి తీరప్రాంత గ్రామాలను కాపాడుతున్నాయి. బలమైన వేళ్లతో అల్లుకుపోయిన మడ అడు వులు అటుపోట్లకు అడ్డుగా నిలిచి భూమి కోతకు గురికాకుండా పరిరక్షిస్తున్నాయి. ప్రత్యేకమైన,విలువైన మరియు సున్నితమైన పర్యావరణాలుగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతపై ప్రపంచ అవగాహనను పెంచడం దీని ఉద్దేశ్యం..యునెస్కో జనరల్‌ కాన్ఫరెన్స్‌ 2015లో ఈఅంతర్జాతీయ దినోత్సవాన్ని అధికారికంగా ఆమోదిం చింది. అలాగే తాజాగా జీ20సదస్సులో వాతావరణ మార్పుల సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మడ అడవులను పరిరక్షించుకోవాలని ప్రపంచ దేశాల నేతలు పిలుపు నిచ్చారు.సదస్సు సాక్షిగా మడ అడవుల పరిరక్షణకు ఉద్దేశించిన మాం గ్రూప్‌ ఆలయన్స్‌ ఫర్‌ క్లైమేట్‌ వేదికలో భారత్‌ భాగస్వామిక చేరినట్లు ప్రధాని మోది ప్రకటిం చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థాలాల కేటాయంపు పేరుతో కాకినాడ తీరంలో పెద్దఎత్తున మడ అడవు లను ధ్వంసం చేయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) తప్పుపట్టింది.ధ్వంసం చేసిన మడ అడవులను అయిదేళ్లలో ప్రభుత్వం పునరుద్దరించాలని ఆదేశిం చింది.అందుకోసం అయిదుకోట్ల రూపా యలమేర మధ్యంతర పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని ట్రైబ్యునల్‌ ఆదేశించడం సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది.
భారతదేశంలోని మడ అడవులు
ఫారెస్ట్‌ సర్వే రిపోర్ట్‌ 2021ప్రకారం,2019 అంచనాతో పోలిస్తే భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం17చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది ఇప్పుడు 4,992 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. మడ అడవులు అత్యధికంగా పెరిగిన మూడు రాష్ట్రాలు- ఒడిశా (8చదరపు కి.మీ),మహారాష్ట్ర (4చదరపు కి.మీ) మరియు కర్ణాటక (3 చ.కి.మీ).వీటిలో తీర రక్షణ: మడ అడ వులు అలలు మరియు తుఫానుల ద్వారా ఏర్పడే కోతల నుండి తీరప్రాంతాలను రక్షిస్తాయి.వాటి చిక్కుపడినట్టు ఉండే వేర్లు అవక్షేపాలను బంధించడానికి,నీటి ప్రవా హాన్ని తగ్గించడానికి సహాయ పడతాయి. ఇది ఈ సహజ ప్రమాదాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
చేపలు,వన్యప్రాణుల ఆవాసాలు : మడ అడవులు వివిధ రకాల చేపలు, షెల్ఫిష్‌లు, పక్షులు మరియు ఇతర జంతు వులకు నిలయంగా నిలుస్తాయి. మడ చెట్ల వేర్లు మరియు కొమ్మలు ఈ జంతువులకు ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. ఈ అడవులు అనేక జాతుల చేపలకు నర్సరీగా కూడా పనిచేస్తాయి.
నీటిని శుద్దీచేయడం: మడ అడవులు కాలుష్య కారకాలు,అవక్షేపాలను ఫిల్టర్‌ చేయడం ద్వారా నీటిని శుద్ధి చేయడా నికి సహాయపడతాయి.అవి నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి, ఇది వరదలను నిరోధిం చడంలో సహాయ పడుతుంది.
కార్బన్‌ నిల్వలు: మడ అడవులు ఒక ముఖ్యమైన కార్బన్‌ సింక్‌గా పనిచేస్తుంది, అంటే అవి వాతావ రణంలో ఉన్న కార్బన్‌ డయాక్సైడ్‌ను నిల్వ చేస్తాయి. ఇది వాతావరణ మార్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.
నిర్లక్ష్యంతో తీరని నష్టం..
తీరప్రాంతాల్లో పర్యావరణానికి నష్టం కలిగించే రీతిలో సాగుతున్న అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ,వన్యప్రాణుల వేట తదితర అంశాలు మడ అడవులకు ముప్పుగా పరిణ మిస్తున్నాయి. వీటి సంరక్ష ణకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగంలో ఉదాసీనత పెరుగు తోంది. ప్రకృతి వైపరీ త్యాలతోపాటు మానవ చర్యలు దుష్ప్రభావం చూపుతున్నాయి.మడ అడవులు వ్యవసాయ భూములుగా మారే ముప్పు అంతకంతకూ అధికమవుతోంది.తీరం వెంబడి వేగంగా పెరుగుతున్న పారిశ్రామి కీకరణ,పారిశ్రామిక వ్యర్ధాలు,శుద్దిచేయని మురుగునీరు శాపాలుగా పరిణమిస్తు న్నాయి.తీరప్రాంతాల్లో జనాభా పెరుగుదల నేపథ్యంలో భూమికోసం పెరుగు తున్న డిమాండ్‌తోపాటు మానవ ఆవాసాలు, కలప,వంటచెరకు,పశుగ్రాసం,అటవీ ఉత్పత్తుల సేకరణ వంటివి ఆశనిపాతంలా మారాయి. అభివృద్ధి పేరట నదుల వెంబడి జరుగుతున్న పలురకాల కార్యకలాపాలు, నదీప్రవాహాల్లో మార్పులు మడ అడవుల సహజత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి.కొన్నిచోట్ల వీటికి అవసరమైన నీరు కూడా సరిగ్గా అందకపోవడం తీవ్రనష్టాన్ని కలిగిస్తోంది. వాతావరణ సమస్యలు,ఉష్ణోగ్రతల్లో తేడాలు, నదీప్రవాహంలో కొట్టుకొచ్చే మట్టి మేట వేయడం,కాలువపూడిక,నీటినిల్వతో ఉప్పు శాతం పెరిగి మొక్కలు నశించడం,మొల కెత్తకపోవడం వంటి సమస్యలు ఎదురవుతు న్నాయి.మరో వైపు, మడ అడువులు నరికివేత ముప్పునూ ఎదుర్కొం టున్నాయి. ఇలాంటి అనేక సమస్యలపై ఎన్నో అధ్యయ నాలు,ఎన్నిసార్లు హెచ్చకిరలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నష్టం తీవ్రత అంత కంతకూ పెరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా 113దేశాల్లో 1.4కోట్ల హెక్టార్లకుపైగా విస్తీర్ణం లో మడఅడవులు ఉన్నాయి. ఇందు లో 50లక్షల హెక్టార్లకుపైగా ఆసియా ఖండంలోనే ఉండటం గమనార్హం. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో విస్తరించిన సుందర్‌బన్స్‌ ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన మడ అడవులు కావడం విశేషం.ఇవి యునెస్కో వారసత్వసంపద గుర్తింపును సొంతం చేసుకు న్నాయి. గంగ,బ్రహ్మపుత్ర నదుల నడుమ వందకుపైగా దీవులుగా విస్తరించిన సందర్‌బన్‌ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా గుర్తింపు పొందింది.ఇక్కడ 55ఎకరాల జంతవులు,54ఎకరాల సరీసృపాలు,248రకాల పక్షలు జీవిస్తు న్నాయి.వృక్షజాతుల్లోనూ ఎంతో వైవిధ్యం కొనసాగుతోంది.రాయల్‌ బెంగాల్‌ పులులకు సుందర్‌బన్‌లే ఆవాసం.వీటితోపాటు మనదేశంలో భితర్‌కనికా,కోరింగ, పిచావరం, గుజరాత్‌ మడఅడవులు కీలకమైనవిగా పేరొందాయి.
బహుముఖ వ్యూహాలు..
మడ అడవుల సంరక్షణలో విస్తీర్ణం పెంపుదలలో ఒడిశా ఆదర్శంగా నిలు స్తోంది.నదీ తీరప్రాంతాలతోపాటు నదులు సముద్రంలో కలిసే భూభాగంలో మొక్కలు నాటడం ద్వారా విస్తీర్ణం పెరుగుతోంది.మడ అడువులు పెంచేందుకు అనువైన ప్రాంతా తలన్నింటినీ సమర్ధంగా ఉపయోగించు కుంటున్నారు. సముద్ర జలాలు చొచ్చుకుని వచ్చే ప్రాంతాల్లో వీటిని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం మడ అడవులను సంరక్షిం చాలి.ఈ అడవుల్ని పెంచేందుకు ఎక్కడ అవకాశం ఉన్నా వదులుకోకూడదు. ఒడిశా తరహాలో విస్తరించేందుకూ కృషి చేయాలి. మడఅడువుల నిర్వహణ ప్రణా ళికలు రూపొందించి అమలు చేయడం కీలకం.మడ అడవుల వైవిధ్యం,ప్రత్యేకతలపై మరింత లోతుగా పరిశోధనలు చేయట్టాల్సిఉంది.వీటి సంరక్షణలో బహుముఖ వ్యూహాల కార్యాచరణ ఎంతో అవసరం.మడఅడువుల్ని కాపాడు కోవడంలో ప్రభుత్వాలతోపాటు.. విశ్వవిద్యా లయాలు,పరిశోధన సంస్థలు,స్థానిక సంస్థలూ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉంది.
ఏపీలో తగ్గిన విస్తీర్ణం..
పలు రాష్ట్రాల్లో మడఅడవుల విస్తీర్ణం..ఎంత కొంత పెరుగుతుండగా,ఆంధ్రప్రదేశ్‌ మాత్రం తగ్గుతుండటం ఆందోళనకరం.ఏపీలో 1987 లో మడ అడవుల విస్తీర్ణం 495చదరపు కిలోమీటర్లు.ఇప్పుడు అది 405చదరపు కి.మీ.ఇందులో 70శాతం అంతకంటే ఎక్కువ సాంధ్రత కలిగిన దట్టమైన మడ అడవుల జాడే లేదు.213చదరపు కి.మీ ఒక మోస్తరు (40`70శాతం సాంద్రత)ఉన్నవి.మరో 162చదరపు.కి.మీ.40శాతం కంటే తక్కువ సాంద్రత కలిగినవి కావడం గమనార్హం.ఉమ్మడి తూర్పుగోదావరి,కృష్ణా,గుంటూరు జిల్లాలతో పాటు పరిమితంగా నెల్లూరు జిల్లాలోనూ మడ అడవులు విస్తరించాయి. ఏపీలోని ప్రధానమైన కోరింగ మడ అడువుల్లో 34రకాల మొక్కలు ఉన్నట్లు అంచనా.వీటి పిల్లి(మరకపిల్లి/ఏటిపిల్లి) అనే వన్యప్రాణితోపాటు అనేక రకాల జంతు వులు,పక్షులకు అవాసంగా నిలుస్తున్నాయి. విదేశీ పక్షలకూ విడిది కేంద్రంగా ఆకర్షిస్తున్నాయి.
మడ అడవుల పరిరక్షణ…
మడ అడవులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత ప్రజల శ్రేయస్సు, ఆహార భద్రత మరియు రక్షణ కోసం ముఖ్యమైనవి.వారు చేపలు,క్రస్టేసియన్లతో సహా గొప్ప జీవవైవిధ్యా నికి మద్దతునిస్తారు.ఇవి సునామీలు, తుఫా నులు,కోత,పెరుగుతున్న సముద్ర మట్టాలకు వ్యతిరేకంగా అవరోధంగా పనిచేస్తాయి.ఇవి సముద్రం మరియు భూమి మధ్య సరిహద్దు లుగా కూడా పనిచేస్తాయి అలాగే అనేక తీర ప్రాంత వర్గాలకు రక్షణ మరియు ఆహార భద్రతను అందిస్తాయి. మడ పర్యావరణ వ్యవస్థ యొక్క నేలలు కార్బన్‌ సింక్‌లుగా పనిచేస్తాయి మరియు భూమి ఆధారిత అడవులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేయగలవు.
మడఅడవులకు ఎదురౌతున్న ప్రమాదాలు
దురదృష్టవశాత్తు, గత నాలుగు దశాబ్దాలుగా, వివిధ మానవ చర్యల కారణంగా మడ అడవుల విస్తీర్ణం దాదాపు సగానికి పడిపో యింది. రొయ్యల పెంపకం ఇందులో ప్రాధ మిక ప్రమాదంగా తెలుస్తోంది. రొయ్యల పెంపకం కోసం చుట్టుపక్కల చెరువులను సృష్టించడానికి అడవిలో ఎక్కువ భాగాలను నరికేస్తున్నారు. వ్యాధులను నివారించడానికి మరియు దిగుబడిని పెంచడానికి యాంటీబ యాటిక్స్‌ మరియు రసాయనాలను అధికంగా ఉపయోగించడం వంటివి కూడా వీటికి హాని చేస్తున్నాయి. ఇది అడవుల పర్యావరణ సమతు ల్యతకు కోలుకోలేని నష్టానికి దారితీస్తుంది. అంతేకాక, ఈ అడవుల నుండి విలువైన కలప తరచుగా దోపిడీ చేయబడుతొంది మరియు గణనీయమైన లాభాలకు విక్రయిస్తున్నారు, అలాగే వీటిని బొగ్గు ఉత్పత్తిలో కూడా ఉపయో గిస్తున్నారు. అన్నింటివలన  తీవ్రమైన అటవీ నిర్మూలన జరుగుతోంది.రోడ్లు, భవనాల నిర్మాణం,నీటిపారుదల అవసరాల కోసం నదు లను మళ్లించడం మడ అడవుల ఆవాసాన్ని మరింత దెబ్బతీస్తుంది, ప్రత్యేకించి చాలా మడ అడవులు నదీతీరాల దగ్గర ఉన్నాయి.(జూలై26 అంతర్జాతీయ మడ అడువుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా…)
-గునపర్తి సైమన్‌

కొలువు దీరిన కొత్త ప్రభుత్వాలు

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కొత్తప్రభుత్వాలు కొలువు దీరాయి.ఇటు ఆంధ్రప్రదేశ్‌,అటు కేంద్రంలోను బలమైన జట్టుతో కూటమి ప్రభుత్వాలు కొలువు దీరాయి.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.వీరిలో 30మంది క్యాబినెట్‌,ఐదుగురు స్వతంత్ర, 36సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.పదేళ్ల అనుభవాలు 140కోట్లమంది ప్రజల ఆకాంక్షల మధ్య కొలువుదీరింది మోదీ సర్కారు 3.0. మూడవసారి దేశ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. ఆఅరుదైన ఘనత ఒకవైపు,పదేళ్ల తర్వాత సంకీర్ణ బలంపై ఆధారపడిన సమీకరణాలు మరోవైపు నేపథ్యంలో ఈ దఫా ఎన్డీయే పాలన ఎలా సాగనుంది?రాజకీయంగా,ప్రభుత్వ పరం గా వారి ముందున్న ప్రాధాన్యాలు,సవాళ్లు ఏంటి?ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళిక లో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం-ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లకు ఇకనైనా పరిష్కారం చూపగలరా ?ఇవే అంశాలపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లో కొలువు దీరిన ఎన్డీఏ3.0సర్కార్‌ కేబినెట్‌ లో బీజేపీకి 61,ఎన్‌డీఏ మిత్రపక్షాలకు11 బెర్తు లు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్‌ కొలువుదీరింది. ఎన్‌డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం,జేడీయూకి చెరో రెండు కేబినెట్‌ బెర్తులు దక్కాయి.ఎల్‌జేపీ(ఆర్‌ వీ),జేడీఎస్‌,శివసేన,రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా,రాష్ట్రీయలోక్‌దళ,అప్నాదళ్‌,హిందూ అవా మీ మోర్చాచెరో ఒక్కకేబినెట్‌ స్థానాన్ని దక్కించు కున్నాయి.
ఏనీలో కూటమి కొత్త కొలువు
ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆనందోత్సాహాలు, అభివాదాల మధ్య నారా చంద్రబాబునాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు.ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర గవ ర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయిం చారు.ప్రమాణస్వీకారం అనంతరం పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు చిరంజీవికి పాదాభి వందనం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు మరో 24మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెండుసార్లు,విభజన తర్వాత నవ్యాంధ్రó ప్రదేశ్‌కు రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌,కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు తమ స్థానాల్లోనే నిలుచుని చప్పట్లతో అభినందనలు పలికారు. అనంతరం వేదిక వద్ద ఉన్న ప్రముఖులంతా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియ జేశారు.ఆ తర్వాత వరు సగా 24మంది కొత్త మంత్రులచే గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిం చారు. జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌,టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్ర,నాదెండ్ల మనోహర్‌ (జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకు మార్‌యాదవ్‌(బీజేపీ),నిమ్మల రామా నాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌,ఆనం రాంనారా యణరెడ్డి, పయ్యావుల కేశవ్‌,అనగాని సత్య ప్రసాద్‌, కొలుసు పార్థసారథి,బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌,కందుల దుర్గేష్‌ (జన సేన),గుమ్మడి సంధ్యారాణి,బీసీ జనార్ధన్‌ రెడ్డి, టీజీభరత్‌, ఎస్‌ సవిత,వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌,మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రు లందరూ ప్రమా ణంచేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌లతో చంద్ర బాబు కొత్త కేబినెట్‌ గ్రూప్‌ ఫొటోదిగారు. ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి కేంద్ర మంత్రులు అమిత్‌షా,నితిన్‌ గడ్కరీ,జేపీనడ్డా,చిరాగ్‌పాశ్వాన్‌,అనుప్రియా పాటిల్‌,కింజారపురామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మ,పెమ్మ సాని చంద్రశేఖర్‌, మహా రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,(గవర్నర్‌,ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌, శ్రీలంక) తదితరులున్నారు.
-గునపర్తి సైమన్‌

1 2 3 7