ద‌ఢ పుట్టిస్తున్న ఒమిక్రాన్‌-వ‌ణికుతున్న ప్ర‌పంచ‌దేశాలు

కరోనా వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ అంటు న్నారు. మరి ఇంది ప్రాణాం తకమా? కాదా?..అంటే కాదు అంటు న్నారు సౌత్‌ ఆఫ్రికన్‌ డాక్టర్‌. ఒమిక్రాన్‌ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన సౌత్‌ ఆఫ్రికన్‌ డాక్టర్‌ ఏంజెలిక్‌ కొయెట్జి తన దగ్గరకి ట్రీట్మెంట్‌కి వచ్చిన పేషెంట్స్‌ త్వరగా కోలుకున్నారు అని చెప్పారు. గత కొద్ది రోజులుగా దాదాపు 30 పేషెంట్స్‌ను చూడగా వారిలో తీవ్రమైన కోవిడ్‌ లక్షణాలు ఏమి కనిపించ లేదన్నారు. వీరెవరూ హాస్పిటల్‌?లో చేరకుండానే డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు
అందరు యువకులు అయినా బాగా అలసట కనిపించిందని ఏంజెలిక్‌ కొయెట్జి చెప్పారు. దానితో పాటు కొంచెం గొంతులో గరగర, పొడి దగ్గు, కండరాల నొప్పులతో తన దగ్గరకు వచ్చారని వివరించారు. ఎక్కువ మంది పేషెంట్లలో స్మెల్‌ రుచి పోలేదని అన్నారు. కొద్ది మందిలోనే హై టెంపరేచర్‌ కనిపించిందని పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలు చూపించే ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ అని ఏంజెలిక్‌ కొయెట్జి వెల్లడిరచారు.

Read more

72 ఏండ్ల రాజ్యాంగ‌మే మ‌న సార‌ధి

‘ప్రపంచ చరిత్రలో ఈ సమయంలో రూపొందించ బడిన రాజ్యాంగంలో కొత్త అంశం ఏదైనా ఉందా అని అడుగవచ్చు.మొదటి రాత రాజ్యాంగ రూపొందించి నేటికి ఒకవందకంటే ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. ఈసంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమతమ రాజ్యాంగాలను రాత లోకి తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాం గాల్లో ప్రధాన నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి.చేసిన కొత్త విషయమే మిటంటే మనంరూపొందించిన రాజ్యాం గంలో వివిధ రాజ్యాంగాల్లోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చు కోగలిగాం.’అలా అంబేద్కర్‌ కృషితో నేడు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.                                                        భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా...
ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగం గొప్పవిశిష్టత స్థానాన్ని సంతరించు కుంది. 1948, జనవరి నెలలో రాజ్యాంగం తొలిముసాయిదా ప్రతి విడుదలైంది. ఆముసాయిదాకు వివిధ వర్గాల నుంచి,ప్రజల నుంచి7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉపసం ఘం చర్చిం చింది.1949,నవంబర్‌ 26న నూతన రాజ్యాం గాన్ని, రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 1949 నవంబర్‌ 24న 284 మంది రాజ్యాంగపరిషత్‌ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవంబర్‌ 26ను రాజ్యాంగ దినోత్స వంగా పరిగణిస్తున్నారు. 1950జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
కొందరు న్యాయమూర్తులు, భారత రాజ్యాంగ ఆర్టికల్స్‌ను తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, అమలుజరుపకుండా వచ్చారు. దాంతో భారత రాజ్యాంగంలో 15(4),16(4),31బి,9వ షెడ్యూల్‌ వంటివి చేర్చి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఆయా చట్టాల,శాసనాల రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది.అలా 9వషెడ్యూల్లో285ఆయా రాష్ట్రాల, కేంద్రాల చట్టాలను చేర్చడం జరిగింది. జవాబుదా రీతనం లేని సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను జవాబుదారీగా ఉండేవిధంగా మలుచుకోవాలి. అందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతాధికారాలు ఇచ్చిన ఆర్టికల్స్‌ను తొలిగించాలి.1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత గణతంత్ర రాజ్యాంగం 1949, నవంబర్‌ 26న రాజ్యాంగ పరిషత్‌చే ఆమోదించబడిరది.70 ఏండ్లుగా భారత రాజ్యాంగం అనేక ఆటుపోట్లకు గురై మార్పు చేర్పులతో సుస్థిరంగా కొనసాగుతున్నది. భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఒకే విలువ,ఒకే ఓటు..ప్రాదేశిక నియోజకవర్గాలు,చట్టసభలు, పరి పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ అనేవి మౌలికాం శాలు.భారత రాజ్యాంగం ఒకఉత్కృష్టమైన గ్రంథం. దీని రచనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వాళ్లంతా మహనీయులు. స్వాతంత్య్ర ఉద్యమంలో కలలుగన్న భవిష్యత్‌ స్వప్నాలను సాకారం చేయ డానికి భారత రాజ్యాంగం ఒక ప్రతీకగా రూపొం దింది. రాజ్యాంగనిర్మాణం వెనుక శతాబ్దాల చరిత్ర, పరిణామం ఉన్నది.1948,జనవరినెలలో రాజ్యాం గం తొలి ముసాయిదా ప్రతి విడుదలైంది. ఆ ముసాయిదాకు వివిధవర్గాల నుంచి, ప్రజల నుంచి 7,635 సవరణలు వచ్చాయి. వాటిలో 2,473 సవరణలపై ఉపసంఘం చర్చించింది.1949, నవంబర్‌ 26న నూతన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. తొలి రాజ్యాంగ ప్రతిపై 1949 నవంబర్‌ 24న 284 మంది రాజ్యాంగ పరిషత్‌ సభ్యులు సంతకాలు చేశారు. అలా నవం బర్‌ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పరిగణిస్తున్నారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిణా మం: 1919 భారత ప్రభుత్వ చట్టం మాంటేంగ్‌ చేవ్‌ ఫర్డ్‌ అనే పేరుతో అనేక సంస్కరణలకు దారి తీసింది. ఈచట్టంద్వారా ఆంగ్లేయులు మన దేశంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టారు. ఈచట్టం ద్వారా శాసనసభ నిర్మాణంలో ఎక్కువ ప్రజా ప్రాతినిధ్యానికి అవకాశం ఏర్పడిరది. తొలిసారిగా కేంద్రంలో ద్విసభా విధానం అమల్లో కి వచ్చింది. దిగువసభను లెజిస్లేటివ్‌ అసెంబ్లీ అని ఎగువ సభను కౌన్సిలర్‌ స్టేట్స్‌ అని పిలిచేవారు.1919 నాటి చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిషు ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొం దించింది. దీనికితోడు కొన్ని ఇతర కారణాలు కూడా 1935చట్టానికి దోహదం చేశాయి. స్వరాజ్య వాదుల ఉద్యమాలు సైమన్‌ కమిషన్‌ నివేదిక పరిణామాలు నెహ్రూ నివేదిక, జిల్లా నివేదిక, గాంధీ ఆధ్వర్యంలో జరిగినశాసనోల్లంఘన ఉద్య మం, రౌండ్‌టేబుల్‌ సమావేశాల వంటివి ఈ చట్టం చేయడానికి దారి తీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. 1933లోబ్రిటిష్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం 1935 భారత ప్రభుత్వ చట్టానికి మూలా ధారం. అప్పటి బ్రిటిష్‌ ప్రధానిరావ్న్‌సేవ్న్‌కో డొనాల్డ్‌ 1932 ఆగస్టు 4న జారీ చేసిన కమ్యూనల్‌ అవార్డు పరిణామం కూడా ఈచట్టానికి కారణంగా భావిం చవచ్చు. ముస్లిం, ముస్లిమేతరులకు ప్రత్యేక నియో జకవర్గాలను కేటాయించారు. ఆక్రమంలో కమ్యూ నల్‌ అవార్డు పునా ఒప్పందంగామారి ఎస్సీ,ఎస్టీ లకు రిజర్వేషన్లు కొనసాగుతూ వస్తున్నాయి. 19 35లో భారత రాజ్యంగచట్టం రూపొందించ బడిరది. ఎన్నికలు జరిగాయి. 1946లో భారత రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడిరది. నాటి రాజ్యాంగ పరిషత్‌లో నేటి బంగ్లాదేశ్‌,పాకిస్థాన్‌ భూ భాగాలకు చెందినవారూ ఉన్నారు. 
1947ఆగస్టు29నాడు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చైర్మన్‌గా ఎన్నుకోబడినారు. ఈకమిటీలో ఏడుగురు సభ్యులున్నారు. వారు..డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌,ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌,అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్‌,డాక్టర్‌ కె.ఎన్‌.మున్షి,సయ్యద్‌ మహ్మద్‌,ఎన్‌.మాధవరావు(బి.ఎల్‌.మిట్టల్‌) రాజీ నామా చేయగా ఇతను నియమించబడ్డారు.టి.టి.కృష్ణమాచారి(1948లోడి.పి.ఖైతాన్‌ మర ణించిన తర్వాత ఇతడు నియమించబడినారు. ఫెడరలిజం సమానత్వం ప్రాతినిధ్యం: 1.ప్రజా ప్రాతినిధ్యం, 2.ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా ప్రాతినిధ్యం,3.పార్టిసిపేటింగ్‌ ప్రజాస్వా మ్యం, 4.రిప్రెజెంటేటివ్‌ ప్రజాస్వామ్యం,5.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనాశాఖలు, 6.న్యాయవ్యవస్థ,7.పత్రికాస్వేచ్ఛా, భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా, పత్రికలు. అందువల్ల ప్రజాస్వామ్యంలో మూలస్తం భాలైన మూడిరటిలో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దేశం ఒక సమాఖ్యగా కొనసాగుతుంది. దీన్ని సరిగ్గా ఆచరిస్తే స్వేచ్ఛా సమానత్వం, అందరికీ సమానావకాశాలు అందించే ఫెడరలిజం, కేంద్రీ కృత పరిపాలన చక్కగా ఏకకా లంలో కొనసాగుతాయి. ప్రస్తుతం చట్టసభలకు ప్రాదేశిక నియోజకవర్గాలుగా ప్రతినిధులున్నారు. పరిపాలనా యంత్రాంగంలో కూడా ఐఏఎస్‌ మొదలుకొని నాన్‌ గెజిటెడ్‌ అధికారి దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రకారం ఉద్యోగులు,అధికారులు ఎన్నికయ్యే వ్యవస్థ ను అమలు జరుపుకోవాలి. న్యాయవ్యవస్థలో కూడా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఇండియన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ ద్వారా ఎంపిక జరుగాలి. అలాగే ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా పారిశ్రా మికీకరణ,అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలి. పరి పానాధికారం యంత్రాంగంతో నియామకాలు, న్యాయవ్యవస్థలో నియామకాలు, ప్రాదేశిక నియోజక వర్గాలవారీగా జరుగడం అవసరం. నీట్‌ పరీక్ష వలె అఖిల భారతస్థాయిలో పరీక్షలు నిర్వహించి, స్థానికత ఆధారంగా నియామకాలు,ఎంపిక చేయా  కొందరు న్యాయమూర్తులు,భారత రాజ్యాంగ ఆర్టికల్స్‌ను తమకు తోచినవిధంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, అమలుజరుప కుండా వచ్చారు. దాంతో భారత రాజ్యాంగంలో 15(4),16(4),31బి,9వ షెడ్యూల్‌ వంటివి చేర్చి సుప్రీంకోర్టు పరిధిలోకి రాకుండా ఆయా చట్టాల, శాసనాల రక్షణచర్యలు చేపట్టడం జరిగింది. అలా9వషెడ్యూల్లో 285 ఆయారాష్ట్రాల,కేంద్రాల చట్టా లను చేర్చడం జరిగింది. జవాబుదారీతనం లేని సుప్రీంకోర్టు అపరిమిత అధికారాలను జవాబు దారీగా ఉండేవిధంగా మలుచుకోవాలి. అందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృతాధికారాలు ఇచ్చిన ఆర్టి కల్స్‌ను తొలిగించాలి. ఉత్కృష్టమైన ఈభారత రాజ్యాంగ పరిరక్షణ భారత పౌరులందరి కర్తవ్యం.భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బి.ఆర్‌.అంబే ద్కర్‌ రాజ్యాంగం గురించి ఇలా అంటారు. ‘ప్రపం చ చరిత్రలో ఈ సమయంలో రూపొందించ బడిన రాజ్యాంగంలో కొత్తఅంశం ఏదైనాఉందా అని అడుగవచ్చు.మొదటి రాత రాజ్యాంగం రూపొం దించి నేటికి ఒక వందకంటే ఎక్కువ సంవ త్సరాలు గడిచాయి. ఈ సంప్రదాయాన్ని అనేక రాజ్యాలు పాటించి తమతమ రాజ్యాంగాలను రాత లోకి తెచ్చాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అనేక రాజ్యాంగాల్లో ప్రధాన నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. చేసిన కొత్త విషయమే మిటంటే మనం రూపొందించిన రాజ్యాంగంలో వివిధ రాజ్యాంగాల్లోని లోపాలను సవరించి అవి మన దేశ అవసరాలకు అనుగుణంగా మార్చు కోగలిగాం.’అలా అంబేద్కర్‌ కృషితో నేడు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.                                             రాజ్యాంగమే సుప్రీం
విభిన్న జాతులు,సంస్కృతులు, ప్రాం తాలు, మతాలు,కులాలు,భాషలసంక్లిష్ట సమాజం భారత దేశం. ఏదో ఒకఅంశంలో ఎపుడూ కేంద్రం తో రాష్ట్రాలు ఏదో ఒక ఘర్షణకు దిగుతుంటాయి. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, రాష్ట్రాలు ఎదురుతిరిగేందుకు అవకాశం లేకుండా రాజ్యాంగంలోనే పకడ్బందీ ఆంక్షలు కూడా పొందుపరిచారు. ముందుగా రాష్టప్రతి, గవర్నర్‌ అనుమతి లేకున్నా శాసనం చెల్లుబాటు అయ్యే అవకాశం అధికరణం 255లో ఉంది.. అంతే కాదు అధికరణం 256లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు, 257లో రాష్ట్రాలపై కేంద్రం నియం త్రణ గురించి కూడా ఉంది. జీఎస్‌టీ అమలు చేయాలని అప్పట్లో కేంద్రం నిర్ణయిస్తే చాలా రాష్ట్రాలు తొలుత వ్యతిరేకించాయి, తర్వాత అన్ని రాష్ట్రాలు గాడిలో పడ్డాయంటే దానికి కారణం రాజ్యాంగంలో సంలీనంగా ఉన్న ఆదేశ సూత్రాలే ననేది సుస్పష్టం. స్వాతంత్య్రాన్ని సాధించి, ప్రజా స్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇతర ప్రజాస్వామిక దేశాలను అనుసరించి మన నాయకులు, పాలకులు దేశానికి చక్కని రాజ్యాం గాన్ని రూపొందించారు. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం. ప్రభుత్వానికి మూలచట్టం. అందు కే రాజ్యాంగ నిర్మాతలు ఆచర ణాత్మకమైన, సలక్షణ మైన రాజ్యాంగాన్ని నిర్మించ డమే ధ్యేయంగా పెట్టు కుని ప్రపంచంలోని ప్రజా స్వామిక రాజ్యాంగాలను అన్నింటినీ అధ్యయనంచేసి వాటిలో మన దేశ పరిస్థితుకు సరిపడే అంశాలను జోడిరచి వాటిని మన రాజ్యాంగంలో తగిన చోట పొందుపరిచారు.
అనేక దేశాల సంప్రదాయాలు
ఏక పౌరసత్వాన్ని, పార్లమెంటరీ విధా నాన్ని,స్పీకర్‌ పదవిని బ్రిటన్‌ నుండి,ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారం అమెరికా రాజ్యాంగం నుండి, ఆదేశిక సూత్రాలు, రాష్టప్రతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల వివరా లను ఐర్లాండ్‌ నుండి, ప్రాథమిక విధులను రష్యా నుండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా నుండి, అత్యవసర పరిస్థితిని వైమర్‌(జర్మనీ)నుండి ఉమ్మడి జాబితా,పీఠికలో వాడినభాషను ఆస్ట్రేలియా నుండి, గణతంత్ర వ్యవస్థను ఫ్రాన్స్‌నుండి దత్తత తీసు కున్నారు.
ప్రవేశికే హృదయం
రాజ్యాంగం తొలి పుటలోనే ప్రస్తావన ఉంటుంది.‘‘భారతదేశ ప్రజలైన మేము..1949 సంవత్సరం నవంబర్‌ 26వ తేదీన ఈభారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని మాకు మేమే సమర్పించుకుంటున్నాం…ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక ప్రజా స్వామిక గణతంత్రంగా ప్రకటిస్తున్నాం, భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కింది సౌలభ్యాలను కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది- సామా జిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ,నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటే స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు, ప్రజలందరిలో దేశ సమైక్య తను, అఖండతాభావాన్ని , సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం కొసం ఈ రాజ్యాం గాన్ని సమర్పించుకుంటున్నాం’’ అని పేర్కొని ఉంటుంది. మొత్తం రాజ్యాంగాన్ని రంగరించి, వడపోస్తే వచ్చే వ్యాఖ్యలివి. ఇందులో అర్థం మొత్తం ఉంది.
నందాలాల్‌ బోస్‌ స్వీయ లిఖిత గ్రంథం
రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత రాజ్యాంగాన్ని ప్రజలు తమకు తామే సమర్పించు కున్న దరిమిలా విశ్వభారతిలోని శాంతినికేతన్‌ కళాకారులు ప్రముఖ చిత్రకారుడు నందాలాల్‌ బోస్‌ నేతృత్వంలో చక్కనిరాతప్రతిని సిద్ధంచేశారు. రాష్ట ప్రతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ప్రధాన జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలైన ఆనాటి నేతలు ఆ ప్రతిపై తమ చేతిరాతతో సంతకాలు చేశారు.
ఘనకీర్తి
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ, విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగానికి ఉన్న ఘనకీర్తి అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి చెందిన భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని, తమకు నచ్చిన నేతనే ఎన్నుకునే మహద్భాగ్యం ఈ రాజ్యాంగంతోనే వచ్చింది. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం, ప్రభుత్వానికి మూల చట్టం.
వ్యక్తుల్లో ఆదర్శాలుండాలి
రాజ్యాంగ లక్ష్యాల ప్రాశస్త్యం అనేది దానిని అమలుచేసే పాలనావ్యవస్థల మీద, అంటే అమలుచేసే మనుష్యుల మీద ఆధారపడి ఉం టుంది. ఈవిషయాన్ని డాక్టర్‌ అంబేద్కర్‌, పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ, డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ అనేక మార్లు నొక్కి వక్కాణించారు. ఈ నూతన రాజ్యాం గం కింద పరిస్థితులు వక్రమార్గం తొక్కాయంటే ఆ అపరాధం రాజ్యాంగానిది కాదు, రాజ్యాంగాన్ని అమలుచేసే వ్యక్తుల వల్ల మాత్రమేనని అంబేద్కర్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే అది నవనవోన్మేషంగా ఉండాలి. దేశ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా వొదిగేదిగా ఉండా లి. సరళంగా ఉండాలి. మార్పులకు సిద్ధంగా ఉండాలి. సమాజ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాజ్యాంగం కూడా మారాలి. తగిన మార్పులకు సిద్ధంగా ఉండాలని ఆనాడే అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్ణయసభ సమాపక సమావేశంలో సభాధ్యక్షుడు డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ప్రసం గిస్తూ ‘‘రాజ్యాంగం అనేది ఎలాఉన్నా..అది దేశాన్ని పాలించే వ్యక్తులపై, దాన్ని పాలించే తీరుతెన్నులపై ప్రజల సంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఆ వ్యక్తులు నిజాయితీపరులై ఉండాలి.. వారికి దేశ ప్రయోజనాలు తప్ప మరో యావఉండరాదు’’ అని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. భారతదేశానికి దివ్యమైన భవిష్యత్‌ను అందించేందుకు, రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను సాక్షాత్కారం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆదిశలోనే ప్రభుత్వాలు కదలాలనీ,కదులు తాయని..సగటు భారతీయుడి ఆశ.
రాజ్యాంగం ఆసక్తికర సంగతులు
1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగాన్ని రాసేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.
మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు రూ.64 లక్షలు ఖర్చు చేశారు.
రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947లో ముసాయిదా కమిటీ ఏర్పడిరది. దీనికి అంబేడ్కర్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంట్లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రధాన కమిటీతో పాటు, కొన్నిఉప కమిటీలు ఏర్పడ్డాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనదే.
రాజ్యాంగాన్ని చేతి రాతతోనే రాశారు. ప్రేమ్‌ బిహారీ నారాయణ్‌ రాయ్‌జాదా..ఇటాలిక్‌ కాలిగ్రఫీ స్టైల్‌లో రాశారు. ప్రతి పేజీనీ కొందరు కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో చేతిరాతతో రాశారు.
‘భారత దేశ ప్రజలమైన మేము’ అనే ప్రవేశికతో మొదలయ్యే మన రాజ్యాంగం.. అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లు,22 భాగాలుగా ఉంది.
రాజ్యాంగం మూల ప్రతులను దిల్లీలో ఉన్న పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో చూడొచ్చు. వీటిని హీలియం వాయువు నింపిన పెట్టెలో భద్రపరిచారు.
మన రాజ్యాంగాన్ని ‘బ్యాగ్‌ ఆఫ్‌ బారోయింగ్స్‌’ అని సరదాగా అంటారు. జపాన్‌, ఐర్లాండ్‌ ఇంగ్లండ్‌, యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌.. లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాల్ని తీసుకున్నాం కాబట్టే ఆ విధంగా పిలుస్తారు. రాజ్యాంగం రాయడం 1949 నవంబరు 26వ తేదీ నాటికి పూర్తయ్యింది. ఈ తేదీనే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకొంటాం. మరో రెండు నెలల తర్వాత అంటే..1950, జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
ఏడు దశాబ్దాల రాజ్యాంగం… అందించిన ప్రజాస్వామ్యం
వందకోట్ల మందికి ఆమోద యోగ్యంగా వుండే పాలనా వ్యవస్థను రూపొందించడం అంత సులభం కాదు.అంతేకాదు..దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారిని జనజీవన స్రవంతిలో కలపడానికి కొన్ని చట్టాలు,వాటికి కొన్ని సవరణలూ తప్ప నిసరి..భారత దేశ స్థితి గతులను సమున్నతంగా మార్చేసిన కొన్నికీలక చట్టాలు,వారి సవరణల నొకసారి చూద్దాం..ఈ70ఏళ్లలో కాలానికను గుణంగా మనం ఎన్నో చట్టాలను రూపొందిం చుకున్నాం.. ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని సవరించు కున్నాం. కొన్ని చట్టాలు దేశ గతినే మలుపు తిప్పితే..మరికొన్ని వివాదాస్పదం కూడా అయ్యా యి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 నెలలకే మొదటి సవరణ జరిగింది. ఈసవరణద్వారా భూ సంస్కరణలకు ఎలాంటి సవాళ్లు ఎదురు కాకుండా దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ లో చేర్చారు. దీంతో రాష్ట్రప్రభుత్వాలు చేసిన ఎన్నో భూ చట్టాలకు ఇది రక్షణ కవచంలా నిలి చింది.ఒకటే బాణం..ఒకటే భార్య..ఇది శ్రీరాముడి విధా నమే కాదు..కోట్లాది భారతీయుల మనోగతం కూడా..హిందూ సంప్రదాయం..హిందూ సంస్కృతి సంప్ర దాయాలను కాపాడుకోవడానికి 1955లో హిందూ వివాహ చట్టాన్ని రూపొందించారు. ఈచట్టం ద్వారా బహుభార్యాత్వం రద్ద వడమే కా కుండా..మహిళల రక్షణకోసం విడాకుల భావ నను కూడా ప్రవేశపెట్టారు.ఇక 1986లోవచ్చిన ముస్లిం మహిళ విడాకు హక్కుల రక్షణ చట్టాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దేశంలో అప్పట్లో తలెత్తిన మత హింసకు ఈచట్టమే దోహదం చేసిం దని కొందరు కారాలు మిరియాలు నూరితే.. ముస్లిం ఛాంద సవాదుల్ని సంతృప్తి పరచడం కోసమే దానిని తెచ్చి నట్టు మరికొందరు మండిపడ్డారు. ఇక సామాజిక రుగ్మతైన అంటరానితనాన్ని తరిమి వేయడానికి మన ప్రభుత్వానికి అయిదేళ్లు పెట్టింది. అంటరాని తనాన్ని నేరంగా ప్రకటిస్తూ 1955లో చట్టాన్ని చేశారు. దేశంలోభాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం అప్పట్లో ఊపందుకుంది. దీంతో 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దేశాన్ని 14 రాష్ట్రాలు,7కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిం చారు. తెలుగు, మళయాళీ, కన్నడీ గులకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ప్రపం చంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.ప్రపంచంలో మరెక్క డాలేనన్ని రాజకీయ పార్టీ లున్న దేశం కూడా మనదే..1980వ దశకం భారత రాజకీ యాల్లో అనారోగ్యకర ధోరణులకు బీజం పడిన సమయం..అధికార కాంక్షకు తోడు ఆయారాం,గయారాం సంస్కృతి పెచ్చరిల్లిన తరుణమూ అదే..దీని నియం త్రణ కోసమే ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది.ఆమ్‌ఆద్మీ..ఈనినాదంతో అధికారం లోకొచ్చిన..యుపి ఏగ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా చేసి నిరుద్యోగాన్ని,ఆకలి కేకలను రూపుమాపాలని తలపెట్టింది. అన్నదే తడవుగా రాజ్యాంగ సవరణ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసింది. గ్రామీణ భారతావని రూపు రేఖలను సమున్నతంగా మార్చేసిన చట్టమది. సామా న్యుడి చేతిలో వజ్రా యుధం సమాచార హక్కు చట్టం..ప్రభుత్వ పాలనపై ఇదో డేగ కళ్ల పహారా.. అవినీతి, రెడ్‌ టేపి జం వేళ్లూనిన మన సమాజంలో తప్పు చేసిన అధికారి ఎంత పెద్ద వాడైనా నిలదీసే హక్కుని ఈచట్టం కల్పిస్తోంది.అంతేనా గతి తప్పి నడు చుకునే అధికారులపై కొరడా రaళిపిం చడానికీ ఈ చట్టం ఉపయోగపడు తోంది.
రాజ్యాంగమే రాచబాట
భారతీయ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే రాచబాటని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి పేర్కొన్నారు.72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ పట్నంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎండాడ ఎస్సీకాలనీ,జిల్లా పరిషత్‌,ఉన్నత పాఠశాలల్లో విద్యార్ధులకు రాజ్యాంగం`విలువలు అనే అంశంపై మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకెల్లా ఎంతో విశిష్టతను సంతరించుకుందని పేర్కొన్నారు. విద్యార్ధులంతా సమానత్వభావన కలిగి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలు,వారి సిద్దాంతాలను స్పూర్తిగా తీసుకుని విద్యావంతులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.న్యాయ,సాంఘిక,ఆర్థిక,రాజకీయ, స్వేచ్ఛా భావన,భావప్రకటన,నమ్మకం,విశ్వాసం,గౌరవం,సమానత్వం,అవకాశాలను పెంచుట.. సౌభ్రాతృ త్వం,వ్యక్తి హోదా,జాతిఐక్యత, సమగ్రతను పెంపొందించుటే రాజ్యంగం ఉద్దేశమని సూచించారు. దీన్ని గౌరవించడం మన అందరి కర్తవ్యమని పిలుపు నిచ్చారు.అంబేద్కర్‌ చెప్పినట్లుగా దేశం అభివృద్ధి చెందడ మంటే,అద్దాల మేడలు,రంగుల గోడలు కాదు..పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధిని పేర్కొన్నారని గుర్తిచేశారు.స్వయం పాలనాధికారాన్ని దక్కించుకున్న ఇండియాలోని అన్ని మతాలు,తెగలు,దళితులు,గిరిజనులు,వెనుకబడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా రాజ్యంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై పడిరది. ప్రభుత్వ విధివిధానాలు,శాసనసభల రూపకల్పనతోపాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారని విద్యార్థులకు వివరించారు.-గునపర్తి సైమన్‌

ఆదివాసీల కీర్తి…పోరాటాల‌కు స్పూర్తి

ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ’’స్వయం పాలన’’ నినాదంతో సమరశంఖం పూరించిన ఆదివాసీల తొలి బాణం శ్రీ భగవాన్‌ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి ప్రణామాలు. స్వతంత్ర భారతావనిలో గిరిజనులకు ఇంత గౌరవం దక్కడ ఇదే తొలిసారి’
‘‘ గిరిజనులు.. ప్రకృతి ఒడిలో జీవనం సాగి స్తూ.. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడు కుంటూ  వస్తున్నారు.దేశ స్వాతంత్య్ర సమరంలో బిర్సాముండా.. నిజాంకు వ్యతిరేకంగా జల్‌`జంగిల్‌`జమీన్‌ అన్న నినాదంతో కొమరం భీం లాంటి ఎంతోమంది గిరిజన యోధులు పోరాటాలు చేశారు. అలాంటివారికి సమున్నత స్థానం కల్పించాలని కేంద్రప్రభుత్వం ఏటా నవంబరు 15న భగవాన్‌ బిర్సాముండా పేరిట (15న జనజాతి) గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహించేందు కు సంకల్పించింది. మొట్టమొదటి సారిగా  షెడ్యూల్‌ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశంవ్యాప్తంగా ఉన్న తొమ్మిది షెడ్యూల్‌ రాష్ట్రాల్లో అంరగంగ వైభంగా జరిగింది.’ఆదివాసీ హక్కుల కోసం ఆంగ్లేయుల పాలనను ఎదరించిన బిర్సాముండా జయంతి రోజునే ఏటా గిరిజన గౌరవ దిరోత్సవం నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయించింది. రaార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన బిర్సాముండా ఆదివాసీ ముద్దుబిడ్డగా కీర్తి గడిరచారు.చరిత్రలో సమున్నత స్థానం కల్పించేందుకు ఆయన జయింతిని ఉత్సహంగా నిర్వహించారు.
భావితరాలకు తెలిసేలా
గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు,వారి జీవన విధానాలు, వినియోగించిన వస్తవులు,లిపి, సాహిత్యం, తదితర సమాచారాన్ని వరంగల్‌ హంటల్‌ రోడ్డులోని గిరిజన విజ్ఞాన పీఠంలో నిక్షిప్తం చేశారు. పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ విద్యార్ధులు విజ్ఞానపీఠంలో గిరిజనుల జీవనశైలిపై పరిశోధనలు చేస్తుంటారు. భావితరాలకు గిరిజనుల సంస్కృతిని తెలిపేందుకు ఇదెంతో ఉపయోగపడుతుంది. విశాఖ జిల్లా అరకు,మేడారంలో ఉన్న గితరిజన మ్యూజియంలు గిరిజనులు పూర్వం నుంచి నేటి వరకు వినియోగిస్తున్న వస్తువులెన్నో అందులో పొందుపర్చారు.కళాఖండాలు,అంతరించిపోతున్న కళాకృతులు,ఇతర వస్తువుల సేకరించిపెట్టారు. సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. విదేశాల నుంచి సైతం వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు.
ప్రకృతి ఆరాధకులు
పూజించే దేవతకు రంగు,రూపం,ఆకారం అంటూ ఏవీ ఉండకుండా ప్రకృతి మాతనే ఆదిశక్తి స్వరూపిణిగా భావిస్తారు. ప్రకృతి ఒడిలో సహజసిద్దంగా పుట్టి పెరిగిన చెట్లను,చెట్టు కొయ్యలను,బండరాళ్లను దేవతల ప్రతిరూపాలుగా భావించి పూజించడం ఆనవాయితీ.ఆలయాలు నిర్మించకుండానే కొలుస్తారు. ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలతో ఆదివాసీల్లో సుమారు 35వరకు తెగలుంటాయి. వర్షాకాలం ప్రారంభంలో మొదటిసారిగా వచ్చేది విత్తనాల పండు. విత్తనాలు వేసే ముందు వాటిని దేవతా మూర్తుల ముందు ఉంచి పూజలు నిర్వహి స్తారు. దేవుడి అనుమతితో పంట వేసినట్లు భావిస్తారు. దీంతో అధిక దిగుబడులు వస్తా యనేది నమ్మకం. పెద్దల పండుగ నాడు గ్రామ పెద్దల సమక్షంలో కొత్తగా పెళ్లైన జంటలను కలుపుకుంటారు.
వన వీరులను స్మరిస్తూ..
బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆయన జయంతిని ప్రతి ఏటా ‘జనజాతీయ గౌరవ్‌ దివస్‌’గా నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి అయిన నవంబర్‌ 15ను ఇక నుంచి ఏటా ‘జనజాతీయ గౌరవ్‌ దివస్‌?’గా జరుపుకో నున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బిర్సా ముండా స్మారకార్థం రaార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను మోదీ ఆవిష్కరించారు.‘‘ఆజాదీకా అమృత్‌ మహోత్స వాలు జరుగుతోన్న ఈ సమయంలో గిరిజన యోధుల సాహసాలు, సంప్రదా యాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. గిరిజ నుల కష్టసుఖాలను నేను దగ్గరుండి చూశాను. వారి జీవనవిధానం, అవసరాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. బిర్సా ముండా జయంతి సందర్భంగా చారిత్రక నిర్ణయం తీసు కున్నాం. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో జరిగిన జన జాతీయ గౌరవ్‌ దివస్‌ మహాసమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. బిర్స ముండాకు నివాళులర్పించారు. ‘‘ నేడు దేశం మొదటి జనజాతీయ గౌరవ్‌ దివస్‌ జరుపుకుంటున్నాం.స్వాంతంత్య్రం తర్వాత తొలిసారి గిరిజనుల కళ, సంప్రదా యాలు, స్వాతంత్య్రంలో వారి పాత్రకు తగిన గౌరవం లభించింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో తెలంగణా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హజరై బిర్సాముండాకి నివాళులర్పించారు. బ్రిటిష్‌ వలసవాదం,దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు, బెంగాల్‌ ప్రెసిడెన్సీ (ప్రస్తుత రaార్ఖండ్‌) ప్రాంతానికి చెందిన బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్‌ 15ను జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా పాటించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం నిర్ణయించగా, అఖిల భారత వనవాసి కల్యాణ పరిషత్‌ తెలంగాణ శాఖ ఇదివరకే ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జనజాతి గౌరవ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఆత్మీయ అతిథిగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపురావు పాల్గొననున్నారు. జాతీయ నాయకుడిగా బిర్సాముండాకు గుర్తింపు గిరిజన యోధుడు బిర్సాముండాను జాతీయ నాయ కుడిగా ప్రభుత్వం గుర్తించిందని.. ఎస్టీలకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు.
కేంద్రం మరియు రాష్ట్రాలు‘‘వాక్‌ ది టాక్‌’’ చేయాలి!
ఉమ్మడి ఏపీలో గిరిజన సంక్షేమ శాఖ మాజీ కమిషనర్‌ ఇఏఎస్‌శర్మ నవంబర్‌ 15, 2021న జనజాతీయ గౌరవ్‌ దివస్‌ కార్యక్ర మంపై ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్త రాన్ని యథా విధిగా తెలుగు అనువాదంలో ప్రధాన మంత్రి ప్రియమైన శ్రీ మోదీ..నవంబర్‌ 15న జరిగే మొట్టమొదటి జనజాతీయ గౌరవ్‌ దివస్‌కు మీరు నాయకత్వం వహిస్తారని నాకు అర్థమైంది. సంవత్సరం, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా. భారత జనాభాలో 8శాతం కంటే ఎక్కువ ఉన్న ఆదివాసీలు దీనిని స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటు న్నాను, కేంద్రం మరియు రాష్ట్రాలు రాజ్యాంగంలోని ఐదవ మరియు ఆరవ షెడ్యూల్‌ ప్రకారం తమకు లభించే హక్కులను ఇకపై పూర్తిగా గౌరవిస్తాయని ఆత్రుతగా ఆశిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతలు చాలా విస్తృతమైన మరియు అత్యంత జ్ఞానోదయమైన చర్చల తర్వాత స్పృహతో ప్రవేశపెట్టిన ఐదవ షెడ్యూల్‌లోని పారా5,షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తించే ప్రతి చట్టాన్ని సమీక్షించడానికి మరియు తీసుకురావడానికి కేంద్రం మరియు రాష్ట్రాలను అనుమతించే ఒక ప్రత్యేక నిబంధన. వారు ఆదివాసీల ప్రయోజ నాలకు అనుగుణంగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ఆమోదించి ఏడు దశాబ్దాలు గడిచినా, నేరస్థులకు సంబంధించిన చట్టాలు,ఆదివాసీల జీవితాలను విమర్శనాత్మకంగా ప్రభావితం చేసే చట్టాలను సమీక్షించి వాటిని మార్చేందుకు కేంద్రం లేదా రాష్ట్రాలు పట్టించుకోలేదు. పౌర న్యాయవ్యవస్థలు,మైనింగ్‌ కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు, అటవీచట్టాలు, భూమి మరియు ఇతర వనరులపై ఆదివాసీల ఊహాజనిత హక్కులను పరి రక్షించే చట్టాలు మొదలైనవి.ఉదాహరణకు, జాతీయ అటవీ విధానం లేదా అటవీ (సంరక్షణ) చట్టానికి ఇటీవల మీ ప్రభుత్వం ప్రతిపా దించిన సవరణలు,ఆదివాసీల గురించి ప్రస్తావించ వద్దు, ఆదివాసీల జీవితాలు సహజీవనంగా ఉన్నప్పటికీ, వారికి ఏది సరిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు. అవి విమర్శనాత్మకంగా ఆధారపడిన అడవులతో ముడిపడి ఉన్నాయి. రెండు కేంద్ర చట్టాలు ఉన్నాయి, అవి పంచా యితీలు (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 (క్లుప్తంగా ూజుూA అని పిలు స్తారు) మరియు షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం,2006 (క్లుప్తంగా అటవీ హక్కుల చట్టం (ఖీRA),ఇది వారి జీవి తాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లు మరియు కార్యక లాపాలపై నిర్ణయం తీసుకోవడంలో స్థానిక ఆదివాసీ గ్రామసభలకు తుది నిర్ణయం తీసుకునే అధికారం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం జిల్లాలోని షెడ్యూల్డ్‌ ఏరియాలో ఖనిజా భివృద్ధికి సంబంధించిన సుప్రసిద్ధ సమతా కేసులో, 1997జూలై 11న, ఒకటి వెలువ రించిన రెండు మైలురాయి తీర్పులలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ వైఖరిని అస్పష్టంగా పునరు ద్ఘాటించింది. రెండవది ఏప్రిల్‌ 18, 2013న రాష్ట్రంలోని కలహండి/రాయగడ జిల్లాల్లోని వేదాంత కంపెనీకి ఒడిశా ప్రభుత్వం మం జూరు చేసిన మైనింగ్‌ లీజుపై.ఈ రెండు కేసుల్లోనూ,సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ఆదివాసీ గ్రామసభలను విస్మరించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నించాయి, అత్యున్నత న్యాయస్థానం ఇది ఆమోదయోగ్యం కాదు. ఛత్తీస్‌గఢ్‌, రaార్ఖండ్‌,ఒడిశా మొదలైన షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో ఉన్న పెద్ద సంఖ్యలో ఖనిజాలు మరియు బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్రం ఏకపక్ష నిర్ణయం విషయం లో ూజుూA, ఖీRA రెండిరటినీ పూర్తిగా ఉల్లం ఘించిన ఇటీవలి ఉదాహరణ.వేలానికి ముందు ఏ సమయంలోనైనా, కేంద్రం మరియు రాష్ట్రాలు స్థానిక గ్రామసభలను ఈ ప్రతిపాద నను వివరంగా చర్చించడానికి మరియు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అనుమతిం చలేదు,అయినప్పటికీ దాని నుండి ఉత్పన్నమ య్యే మైనింగ్‌ కార్యకలాపాలు వారి నివాసాలను మరియు వారి జీవితాలను కోలుకోలేని విధంగా విఘాతం కలిగిస్తాయి. వాస్తవానికి, వేలం వేయ డానికి వీలుగా ఖనిజాభివృద్ధి చట్టాలకు గతం లో అనేక సుదూర సవరణలను కేంద్రం ప్రవేశపెట్టినప్పుడు, అది ఒక్కసారి కూడా ప్రయత్నించని ఆదివాసీల అభిప్రాయాలను ముందుగానే కోరింది! ఐదవ షెడ్యూల్‌లోని 5వ పేరాలోని స్ఫూర్తికి అనుగుణంగా,అటవీ మరియు ఖనిజాభివృద్ధి చట్టాలను సవరించ డానికి ప్రతిపాదించే ముందు, కేంద్రం మరియు రాష్ట్రాలు ఆదివాసీ గ్రామసభలు, ఎన్నికైన ఆదివాసీ శాసనసభ్యులు మరియు ఆదివాసీ సంఘాలను సంప్రదించి ఉండాలి. ప్రతిపాదిత చట్టాలు ఆదివాసీ ప్రయోజనాలను సమర్థించేలా చూసేందుకు. బదులుగా, కేంద్రం ఏకపక్షంగా ముందుకు సాగాలని ఎంచుకుంది! షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమీషన్‌ (చీజూు) రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 338A ప్రకారం షెడ్యూల్డ్‌ తెగ లకు సంబంధించిన అన్ని విధాన విషయా లపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి మరియు వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి రూపొం దించబడిన ఒక ప్రముఖ సంస్థ. ఆఆర్టికల్‌ క్లాజ్‌ (9) ప్రకారం యూనియన్‌ మరియు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘‘షెడ్యూల్డ్‌ తెగలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై కమిషన్‌ను సంప్రదించాలి’’. పైన పేర్కొన్న చట్టబద్ధమైన సవరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, నాకు తెలిసినంతవరకు,చీజూుతో ఇంత విస్తృతమైన ముందస్తు సంప్రదింపులు జరగలేదు. జనజా తీయ గౌరవ్‌ దివస్‌ వేడుకల్లో భాగంగా,శతా బ్దానికి పైగా తన కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడిన గొప్ప ఆదివాసీ నాయకుడి జ్ఞాపకార్థం మీరు రాంచీలో బిర్సా ముండా ఫ్రీడమ్‌ ఫైటర్‌ మ్యూజియాన్ని ప్రారంభించ బోతున్నారని నేను అర్థం చేసుకున్నాను. బిర్సా ముండా నేతృత్వం లోని చోటానాగ్‌పూర్‌లో జరిగిన ఆదివాసీ ఉద్య మాలు, ఎనిమిది దశాబ్దాల క్రితం కొమరం భీం నేతృత్వంలో తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా లో జరిగిన తిరుగుబాటు,శతాబ్దానికి పైగా ముర్ము వర్గం నేతృత్వంలోని సంతాల్‌ తిరుగు బాటు చట్టబద్ధమైన ముసుగులో జరిగింది. ఆదివాసీల హక్కులు,ఆ కాలంలో పూర్వపు పాలకవర్గం ద్వారా తుంగలో తొక్కివే యబడిరది. వారి జ్ఞాపకాలను గౌరవించా లంటే,ఆరోజుల్లో ఆదివాసీలు తిరుగుబాటుకు దారితీసిన పరిస్థి తులను అర్థం చేసుకోవడం మరియు ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆదివాసీ సంఘాలను మరియు వారి హక్కులను గౌరవించేలా చూసు కోవడం కంటే సరైన మార్గం మరొకటి ఉండ దు. తప్పులు.జన్‌ జాతీయ గౌరవ్‌ దివస్‌ దేశం లోని ఆదివాసీల హక్కులను పూర్తి స్థాయిలో గుర్తించడానికి నాంది పలుకుతుందని మరియు కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి ూజుూA,ఖీRA రెండిర టినీ పూర్తిగా అమలు చేయాలని సంకల్పిస్తా యని నేను ఆశిస్తున్నాను మరియు విశ్వసిస్తు న్నాను. ఆదివాసీ జీవితాలను ప్రభావితం చేసే విధానాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవ డంలో. ఆదివాసీల జీవి తాలను ప్రభావితం చేసే దేశం లోని అన్ని ముఖ్యమైన చట్టాలను సమీక్షిం చి,షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తించేంత వరకు వాటిని ఆది వాసీల ప్రయోజనాలకు అనుగు ణంగా మార్చా లని కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ కూడా సంకల్పించు కుంటాయని నేను ఆశిస్తున్నాను.దేశ నిర్మాణంలో ఆదివాసీలను సమాన భాగస్వాములుగా కేంద్రం,రాష్ట్రాలు గుర్తించాలి. దేశంలో ఎన్నుకో బడిన అన్ని ప్రభుత్వాలు ఆదివాసీలకు తమ రాజ్యాంగ పరమైన బాధ్యత లను గ్రహించి, నెరవేర్చడానికి జనజాతీయ గౌరవ్‌ దివస్‌ను రిమైండర్‌గా మార్చడంలో మీరు ముందుం టారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆది వాసీల రాజ్యాంగ హక్కులకు తగిన గుర్తింపును కల్పించడంలో విఫల మైతే, దేశం మొత్తం భవిష్యత్తు శ్రేయస్సుకు మేలు జరగదు.-గునపర్తి సైమన్‌

కొఠియా గ్రామాల వివాదంపై ఆంధ్ర‌-ఒడిశా జాయింట్ క‌మిటీ

ఒక ఓటరు...ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం. అలావేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు.కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న 34 గ్రామాలకు చెందిన దాదాపు 4 వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు. అది ఒక రాష్ట్రంలో కాదు.... రెండు రాష్ట్రాల్లో.అలా ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రెండూ రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి. దీంతో ఇక్కడ గిరిజనులకు రెండు రేషన్‌ కార్డులు, రెండు పింఛన్‌ కార్డులు, రెండు ఓటరు కార్డులు...ఇలా అన్నీ రెండేసి ఉంటాయి. అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకుంటారు. ఈ గ్రామాల కథేంటి? వీటిపై రెండు రాష్ట్రాలకూ ఇంత ప్రేమ దేనికి? అనే అంశాలపై సమగ్ర కథనం.!                                                                                                                        సర్వేతో మొదలైన సమస్య…
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్‌ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.ఇక్కడ దాదాపు 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,902 మంది ఓటర్లు. వీరు ఇటు ఆంధ్రాలోనూ,అటు ఒడిశాలో ఓటు హక్కును కలిగి ఉంటారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అవతరించి నప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామా లు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై 2000లో సుప్రీం కోర్టు ఓప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్‌ జిల్లా జడ్జి అధ్యక్ష తన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది. అందు లో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు,న్యాయ వాదులు ఉన్నారు. కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తర్వాత 2006లో ఈ సమస్యని పార్ల మెంటులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచిం చింది.
ఇప్పటికీ ఈ పంచాయితీ తేలలేదు.
కొటియా గ్రామాలుగా ఉన్న 21 గ్రామలు… మరికొన్ని గ్రామాలుగా విడిపోయి వాటి సంఖ్య ప్రస్తుతం 34కి చేరిందని కొటియా కమిటీలో ఏపీ తరపున స్పెషల్‌ కౌన్సిల్‌గా పని చేసిన విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ రాజు బీబీసీతో చెప్పారు. ‘1942లో పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. దానికోసం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ,ఒడిశా, మధ్య ప్రదేశ్‌,బిహార్‌ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయిం చేందుకు గిల్‌.జి అనే సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు కార్యాలయ అధికారి సర్వే నిర్వహిం చారు. ఇందులో ఏపీ,ఒడిశా సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయగా…కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చ లేదు. అప్పట్నుంచి ఈ గ్రామాలు తమవంటే తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి. ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే…కోర్టు స్టేటస్‌ కో విధించింది. దీంతో ఇప్పటికీ పరి ష్కారం లభించలేదు. అసలు కొటియా గ్రామాల సమస్యపై అవగాహన ఉన్నవారు కూడా లేరు. ఏపీ తరపున ఈ సమస్యపై పని చేసిన ఆర్జేడీ చనిపోయారు. కాకినాడకు చెందిన మరో సర్వే యర్‌ చలపతిరావు రిటైర్డ్‌ అయి పోయారు. ప్రస్తుతానికి ఈ సమస్యపై అవగాహన ఉండి పని చేసిన వారిలో నేను,చలపతి రావు మాత్రమే ఉన్నాం’’ అని ఆయన తెలిపారు.
పథకాలు ఆంధ్రా…పనులు ఒడిశా…
గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా స్థానిక ఎన్ని కల్లో ఓటేసిన ఈ గిరిజనం..ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును విని యోగించుకున్నారు.కొటియా,కురిటిభద్ర, మడ కార్‌,డోలియాంబ తదితర గ్రామలు ఒడిశాకు….నేరేళ్లవలస,ఎగువశెంబి, దిగు వశెంబి,ధూళిభద్ర,మూలతాడివలస,పగులు చెన్నేరు,పట్టుచెన్నేరులు,సొలిపిగుడ,శిఖపరువు గ్రామాలు ఏపీ భూభాగానికి సమీపంలో ఉంటా యి. మిగతావి రెండు సరిహద్దులకి దాదాపు సమాన దూరంలో ఉంటాయి.దీంతో ఏ రాష్ట్రా నికి సమీపంగా ఉన్న గ్రామాలపై ఆరాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో ఒడిశారాష్ట్రానిదే పైచేయిగా కనిపిస్తోంది.ఎందుకంటే రోడ్లు వేయడంతోపాటు అనేక కార్యాలయాలు ఆ రాష్ట్రం నిర్మిస్తోంది.ఎక్కడ చూసినా ఒడిశా కార్యాలయాలు,ఒరియా భాషలోని బోర్డులే కనిపిస్తున్నాయి తప్పా…తెలుగు భాషలో అరుదు గా బోర్డులు కనిపిస్తాయి. అయితే రెండు రాష్ట్రా ల ఫలాలను అందుకుంటున్న కొటియా గ్రామా ల గిరిజనం అభివృద్ధి కోసం ఒడిశా ప్రభు త్వాన్ని, సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వా న్ని నమ్ముకుంటున్నారు.‘‘మమ్మల్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చూసుకుంటున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం పథకాల ద్వారా మాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం ద్వారా తక్కువ వస్తున్నాయి. కానీ ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేయించింది. గత ఏడాది వరకు మా గ్రామాలకు ఎక్కడికి వెళ్లాలన్నా రాళ్లు రప్పులు తేలిన దారుల్లోనే వెళ్లేవాళ్లం. ఇప్పుడు కొత్త తారు రోడ్లపై వెళ్తున్నాం. అలాగే ఒడిశా మాకు ఇళ్లు కూడా కట్టించింది. మాకు రెండు ప్రభు త్వాలు కావాలి. రెండు ప్రభుత్వాలు అందించే పథకాలు కావాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయిస్తే…వాళ్లు ఏరాష్ట్రంలో ఉండమంటే అక్కడే ఉంటాం. అప్పటి వరకూ మాత్రం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మేం ఓటేస్తాం’’ అని కొటియా గ్రామాల్లో ఒకటైన పట్టుచెన్నూరు నివాసి బుట్రూ చెప్పారు.వివాదస్పద కొటియాలో రాజకీయాలు ఇప్పటివరకు రెండు రాష్ట్రాల సమస్యగా ప్రభుత్వాల మధ్య నలుగుతున్న సమస్యలోకి రాజకీయాలు చేరాయి. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నాయకులు ఈ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. కొటియా గ్రామాల్లో ఒడిశా బీజేపీ నాయకులు పర్యట నలు చేస్తున్నారు. ఆంధ్రా ప్రభుత్వం నిర్వహించ నున్న పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని కొటియా వాసులకి ఒడిశా బీజేపీ నాయకత్వం సూచించింది. అలాగే అయా ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తనది కాని ప్రాంతంపై పట్టుసాధించేందుకు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పుటికే ఒడిశా సరిహద్దులోని అనేక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌ ఆక్రమించుకుంది. ఇది పూర్తిగా ఒడిశా ఇంటిలిజెన్స్‌ విభాగం వైఫల్యం. ఒడిశా ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి… కేంద్రం తో మాట్లాడి భూభాగాన్ని కాపాడుకోవాలి. ఇప్పటీకే ఒడిశా సుప్రీంకోర్టులో కేసు వేసిందని తెలిసింది. ఈ ప్రాంతాలను ఒడిశా సాధించే వరకు పోరాటం ఆపకూడదు. దీనికి పూర్తిగా సహకరిస్తుంది’’ అని బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు.మరో వైపు కొటియా పంచాయతీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచా యతీ ఎన్నికలను ఆపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 10వ తేదిన (2021)హైకోర్టులో పిల్‌ నమోదైంది. భారత్‌ బికాస్‌ పరిషత్‌ అనే స్వంచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ పిల్‌ వేశారు.
కొటియాపై ప్రేమకు ఖనిజాలే కారణమా…?
కేసులు, క్షేత్రస్థాయి పర్యటనలు, రాజకీయాలు ఎలా ఉన్నా…అసలు ఈ ప్రాంతంపై ఇరు రాష్ట్రాలకు ఇంత ప్రేమ ఎందుకు?గిరి శిఖర ప్రాంతంలో ఎవ్వరికి పట్టనట్లు ఉండే ఈ కొటి యా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పోటీపడి మరీ రెండు రాష్ట్రాల ప్రభు త్వాలు అభివృద్ధి పనులు చేస్తున్నాయి?ఈ ప్రాం తంలో విలువైన ఖనిజాలు ఉన్నాయని…వాటిని దక్కించుకోవాంటే ముందుగా ఇక్కడి గిరిజనుల మనస్సుని గెల్చుకోవాలని… అందుకే ప్రభుత్వా లు పోటీపడి మరి పథకాలు ఇస్తూ పనులు చేస్తున్నాయని వామపక్షనాయకులు అంటున్నారు. ‘‘ఇక్కడ చాలా రోజులుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో సాకుతో కొండలు తవ్వడం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇక్కడ రహ స్యంగా ఖనిజ అన్వేషణ జరుగుతుందనే అనిపిస్తుంది. అయితే ఏదో ఒక రూపంలో ప్రజలకు మంచి జరగడం శుభపరిణామమే… కాకపోతే ఈ వివాదాన్ని త్వరగా తేల్చుకోక పోతే… ప్రస్తుతానికి గిరిజనులకి బాగున్నా… భవిష్యత్తులో సమ్యలు వచ్చే అవకాశం ఉంది’’ అని స్థానిక వామపక్ష నాయకులు కిల్లి సురేశ్‌ చెప్పారు. కొటియా గ్రామాల పరిధిలో ఖనిజ సంపద అనే మాట అందరి నోటా వినిపిస్తూనే ఉంది. అసలు నిజంగా ఇక్కడ ఖనిజాలు ఉన్నాయా అనే విషయంపై ఏయూ జియాలజీ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వెంకటేశ్వరావు వెల్లడిరచారు. ‘‘తూర్పు కనుమల్లో చాలా చోట్ల ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా బాక్సైట్‌ వంటి ఖనిజాలు విస్తరంగా ఉన్నాయి. మనం ఒప్పు కున్నా…లేకున్నా…ఖనిజాలను తవ్వడానికి ఏ ప్రభుత్వమూ సంకోచించదు. విలువైన ఖనిజా లున్న ప్రాంతాలను తమ పరిధిలోకి తెచ్చుకో వాలనే చూస్తాయి. కొటియా గ్రామాల పరిధి లోని కొండల్లో కూడా విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తూర్పు కనుమల్లోని ఈ బెల్ట్‌లో మాంగనీసు, ఇనుము,లైమ్‌ కంకర,క్వార్జ్‌,గ్రానెట్కట్‌, రంగు రాళ్లు వంటి ఖనిజ సంపద ఉంది. వీటితో పాటు జల,జంతుసంపద కూడా అపారం. వీటిని కాపాడుకోవాలి. అసలు తూర్పు కనుమల్ని బయోడైవర్సీటి హాట్‌ స్పాట్‌గా గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని ప్రొఫెసర్‌ వెంకటేశ్వరావు చెప్పారు.
ఏపీ వేసిన రోడ్లపైనే ఒడిశా రోడ్లు వేస్తోంది’
మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటి వరకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం ఇంకా తేలలేదు. ఏపీ ప్రభు త్వం కొటియా గ్రామాల విషయంలో పోరాటం చేయడం లేదని…అలాగే అక్కడ ఏపీ ముద్ర వేసే కార్యక్రమాలు ఎక్కువగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వీటి గురించి స్థానిక ఎమ్మేల్యే రాజన్నదొర తెలిపారు. ‘‘వివాదస్పద కొటియా గ్రామాలు విజయనగరం జిల్లా సాలూరు మండలంలోకి కొటియా ప్రాంతాలు వస్తాయి. బ్రిటిష్‌ హయంలో ఈ ప్రాంతాలు మద్రాస్‌ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేవి. అప్పట్లోనే ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాలు తమవని వాదించేది. అయితే దీనిని మద్రాస్‌ ప్రెడిడెన్సీ ఖండిస్తూ ఉండేది. బ్రిటిష్‌ హయాం నుంచి ఈ గ్రామాలను సాలూరు మండల పరిధి భూ భాగంలో చూపించారు. 1942లో జరిగిన గిల్‌ సర్వే ప్రకారం కూడా అదే వర్తిస్తుంది. గతంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి కొటియా గ్రామాల సమస్యను తీసుకువెళ్లాం. ఇరు రాష్ట్రాలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు నిర్వహించవద్దని బీజేపీతో పాటు ఒడిశాలోని కొన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ అక్కడ ఏపీ ప్రభుత్వం తరపున ఎన్నికలు జరగడం ఇదేమి కొత్త కాదు. నేను పుట్టక ముందు నుంచి ఆ ప్రాంతంలో ఏపీ గవర్నమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. దీనికి సుప్రీం కోర్టు లేదా పార్లమెంట్‌ పరిష్కారం చూపాలి. ఒడిశా మేం అభివృద్ధి చేశామని చెప్పుకోవడం కోసం….ఏపీ ప్రభుత్వం వేసిన రోడ్లపై మళ్లీ రోడ్లు వేసి మేమే వేశాం అని చెప్పుకుంటోంది. నిజానికి అక్కడున్న అపారమైన ఖనిజ సంపదను కొల్లకొట్టేందుకే ఒడిశా ఈ డ్రామాలు ఆడుతోంది’’ అని సాలూరు ఎమ్మేల్యే పీడిక రాజన్నదొర చెప్పారు.
‘కొటియా అభివృద్ధే లక్ష్యం’
‘‘ప్రస్తుతం కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. అంతా సజావుగా ఉంది. అధికారులు నిరంతరం గ్రామాలకు వెళ్లి సమస్యలను తెలుసు కుంటున్నారు. ‘‘కొటియా భౌగోళికంగా ఒడిశాకే చెందుతుంది.కోరాపూట్‌ జిల్లాలో భాగమే కొటియా గ్రామాలు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్‌కు ఎటువంటి హక్కులూ లేవు. 1951 లోనే ఒడిశా ఇక్కడ అసెంబ్లీ, పార్ల మెంట్‌ ఎన్నికలు నిర్వహించింది. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ కొటియా మాది అనడం హాస్యా స్పదం. దీనిపై ఇటీవలే సుప్రీం కోర్టుని ఆశ్రయించాం. ఇప్పటీకే కొటియా గ్రామాల్లో చాలా అభివృధ్ది చేసి చూపించాం. కొటియా గ్రామాల అభివృద్ధి,అక్కడి గిరిజనుల బాగోగుల కోసం కొటియా ప్రాంతంలో ఒడిశా అభివృద్ది పనులు నిరంతరం సాగుతూనే ఉంటాయి ‘‘అని ఒడిశా రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు డిప్యూటీ చైర్మెన్‌ సంజయ్‌ దాస్‌ వర్మ మీడియాతో చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన పంచా యతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహి స్తోందని, అందులో మూడు పంచాయతీల పేర్లు మార్చారని ఒడిశా ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌ ధర్మాసనం ఏపీ తరఫు న్యాయవాదికి పిటిషన్‌ కాపీ అందించాలని సూచించింది.
ఆంధ్రాలోనే ఉంటాం
కొటియాలో టెన్షన్‌కి తెరదించారు. ఏపీ అధికారుల కృషి ఫలించింది. 50ఏళ్లుగా నెలకొన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అక్కడి గిరిజనులు ఆకర్షితులయ్యారు. తాము ఏపీ పౌరుల మేనంటూ నినాదాలు చేశారు. ఒడిశా అధికా రులు, పోలీసులపై తిరగబడ్డారు. అక్కడి రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డులను విసిరి కొట్టారు. విజయనగరంజిల్లా అధికారుల విశేష కృషి కారణంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కొటియా విలేజ్‌ గ్రూప్‌ గ్రామ ప్రజ లకు చేరువయ్యాయి. ప్రభుత్వ పథకాలపై మొదటి నుంచి అధికారులు వారికి అవగాహన కల్పించారు. ఈ మేరకు సాలూరు వీూA పీడిక రాజన్న దొరను కలిసి ఏపీలోనే కొనసాగు తామని అంగీకారపత్రం ఇచ్చారు. ఒడిశాతో తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొటియా ప్రజలను ఎమ్మెల్యే రాజన్నదొర అభినందించారు.ఈ నేపథ్యంలో స్థానిక గిరిజనుల ధైర్యసాహసాలకు ముగ్థులైన విజయనగరంజిల్లా కలెక్టర్‌..కొటియా గ్రూప్‌ ప్రజలను కలెక్టరేట్‌కి పిలిపించారు. కలెక్టరేట్‌లో వారిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథ కాలు వారికి మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ విషయంలోనే గిరిజనులు, ఒడిశా అధికారులు మధ్య వివాదం తలెత్తింది. పెద్దయెత్తున పోలీసులు కొటియా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగు బోర్డులు పెడుతున్న గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒడిశా పోలీసులు, అధి కారుల ఓవరాక్షన్‌పై స్థానిక గిరిజనులు తిరగ బడ్డారు. పగలుచెన్నూరు, డోలియాంబల దగ్గర ఒడిశా పోలీసులతో బాహాబాహీకి సిద్ధమ వ్వడంతో యుద్ధ వాతావరణం కనిపించింది.
ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు
ముఖ్యంగా కొఠియా గ్రామాల్లో సమస్యపై పరిష్కారంపై ఫోకస్‌ చేయనున్నారు. ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికా రులు తాజాగా సీఎం జగన్‌కు తెలియ చేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొ న్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందిం చే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సరిహద్దు భూ సమస్యలను పరిష్కారానికి వినతి..!! ఆంధ్ర`ఒడిశా సరిహద్దు గ్రామాలైన కొల్లాపుట్టుపంచాయితీని చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర పీసా చట్టం గ్రూప్‌ చైర్‌పర్సన్‌ రవి పర్యటన రెబ్బాప్రగడ రవి పర్యటించారు.ఇక్కడ సమస్యపై గిరిజనులు చైర్‌పర్సన్‌ రవికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం కొల్లాపుటు గ్రామ పంచాయితీలో సరిహద్దు అంశంపై గ్రామసభలో తీర్మానించిన అంశాలను ఆయనకు స్థానిక గిరిజనులు అందజేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు అంశంపై అధికారులు దృష్టికి తీసుకెళ్లడంపై చర్చించడం జరిగిందని,డెక్కపారు,బొడ్లమామిడి,నిట్టమామిడి,కొల్లాపుట్టు గ్రామ రెవెన్యూ,అటవీ హక్కుల పట్ట భూములు కొల్లాపుట్టు గ్రామ పంచాయితీకి చెందినవి అంటూ పలు అంశాలను గ్రామసభ తీర్మాణంలో తీర్మాణించారు.అలాగే ఒడిశావాసులు ఆక్రమించిన భూములను ఇప్పించాలని కోరారు.-శ్రీ‌నివాస్‌

పోడు రైతుల పోరు

తరతరాలుగా పొడు భూములనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న జిల్లా పోడు రైతుల పరిస్థితి అగమ్య ఘోచరంగా మారుతోంది. వానాకాల సీజన్‌ మొదలైనప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అటవీ శాఖాధికారుల నుంచి అడుగ డుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి పొడు భూములపై హక్కులు కల్పిం చాలని అధికారుల చుట్టు కాళ్లరిగేలా తిరుగు తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతర రైతులు కూడాపోడు భూములను సాగు చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబరు 31లోపు సాగు చేసుకున్న అటవీ భూములకు హక్కు పత్రాలు అందించాలని కేంద్ర అటవీ హక్కుల చట్టం పేర్కొంటుంది. అలాగే 70 ఏళ్లకు పైగా పోడు భూములను సాగు చేసు కుంటున్న గిరిజనేతర రైతులకు కూడా భూమిపై హక్కు కల్పించాలని చట్టం స్పష్టం చేస్తుంది. అసలే నిరక్షరాస్యులైన పోడు రైతులకు చట్టాలపై ఏ మాత్రం అవగాహన లేక పోవడంతో భూమిపై హక్కు పొందేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో 1లక్ష ఎకరాల వరకు పొడుభూములు ఉన్నట్లు అటవీ శాఖాధి కారుల అంచనా వేస్తున్నారు. అనాధికారికంగా మాత్రం పొడు భూముల విస్తీర్ణం మరింత అధికంగానే ఉంటుందని గిరిజన సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56వేల 358మంది పోడు రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గ్రామ సభల ద్వారా 37వేల 372 దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు లక్ష 35వేల 99ఎకరాలకు గాను హక్కు పత్రాలను అందజేశారు. మరో 18వేల 886 దరఖాస్తులను వివిధ రకాల కారణాలతో తిరస్కరించారు. అయినా రైతులు ఆ భూము లను సాగు చేసుకోవడంతో అటవీ శాఖాధి కారులు దాడులు చేస్తూ లాక్కునే ప్రయత్నం చేయడంతో వివాదాస్పదంగా మారుతోంది. ఇలాంటి భూముల్లో హరిత హారం మొక్కలు నాటేందుకు అటవీ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. అటవీ హద్దుల చుట్టు భారీ కందకాలు తవ్వడంతో పంట చేనులోకి వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏటా ఖరీఫ్‌ ప్రారంభంలో పోడు భూములపై వివాదం చెలరేగుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోడు భూములకు హక్కుపత్రాలు కల్పించాలన్న డిమాండ్‌తో రైతులు రహదారుల దిగ్బంధానికి సిద్ధమవుతున్నారు.

Read more

బాలల దినోత్సవం సందడే సందడి

‘‘ భయం మనలో ఎప్పటికీ ఉండ కూడని విషయం. మనం ధైర్యంగా ముంద డుగు వేసినప్పుడు మనకు మద్దతుగా బోలెడు మంది ఉంటారు.ఉర్దూ,హిందీ,ఇంగ్లిష్‌.. భాష ఏదైనా సరే.. అక్షరమాల నుంచే క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏ విషయమైనా అంతే. మూలం నుంచే క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దానిపై మనకు పట్టు వచ్చేస్తుంది. (నెహ్రూ ఇందిరతో చెప్పిన మాట ఇది. మన పాఠ శాల ల్లో పిల్లలను గమనిస్తే.. పై తరగతులు చదువు కునే వాళ్లు కూడా సరిగ్గా అక్షరాలు గుర్తు పట్ట లేరు. ఇలాంటి వారికి నెహ్రూ చెప్పిన విషయం అనుసరణీయం’’

Read more

రాజ్యాంగ విలువలకు ప్రతీకలు…చట్టం…న్యాయం..ధర్మం..!

సమాజంలో ఒకకట్టుబాటు,క్రమ పద్దతి ఏర్పరచేటందుకు ఏర్పాటు చేసుకున్న నియమ నిబం ధనలే చట్టంగా చెప్పబడుతున్నాయి. చట్టం సామా జిక వాస్తవాలపై ఆధారపడివుంటుంది. న్యాయ స్థానాల ద్వారా,ప్రభుత్వ సంస్థలద్వారా అమలు చేయబడే విధి విధానాలు చట్టంగా చెప్పవచ్చును. సమాజంలో నీతి, న్యాయం ధర్మం క్రమ పద్దతితో అమలు పరచాలంటే కొన్ని నిర్దుష్ట విధానాలు అవస రము. ఏవ్యక్తికో, సమాజా నికో,కులానికో ఇష్టం ఉన్నా లేకపోయినా అమలు పరచ టానికి చట్టాలు అవసరం. వీటిని అతిక్రమించుట ఎవ్వరికీ సాధ్య ము కాదు. అతిక్రమించినవారు శిక్షార్హులౌతారు. చట్టం అనేది ప్రభుత్వాలు ప్రజలను భయపెట్టడం ద్వారా వాటికిలొంగి ఉండేలా చేసే ఆదేశాలు అన్నాడు‘ఆస్టిన్‌’. సామాజికంగా అంగీకరించబడిన సూత్రాలకు అను గుణంగా చట్టాలు రూపొందించ బడతాయి.
చట్టానికి ఎంత వరకు నిబద్ధత ఉం టుందనేది నైతిక అంశాల మీద ఆధారపడి వుం టుంది.‘‘హెచ్‌.ఎల్‌.హార్టు’’ప్రకారం శీలానికి సంబం ధించిన ప్రాధమిక నియమాలు మరియు ప్రాథమిక నియమాలు అమలు పరచేందుకు అధికారులకు ఇవ్వబడిన అధికారాలను సెకండరీ నియమాలుగా వర్ణించాడు. ఈ నియమాలు న్యాయబద్ధమైన నియ మాలయ్యాయి. వివాదాలను పరిష్కరించేందుకు, మార్పుకు సంబంధించిన నియమాలు, చట్టాలలో మార్పుకు అనుమతిచ్చేవి మరియు గుర్తింపుకు, చట్టాల యొక్క ప్రామాణికతను పరిరక్షించేందుకు అవకాశం ఇచ్చే నియమాలుగా వీటిని వర్గీకరించ వచ్చును.

Read more

వ్యవసాయ రంగాన్ని కమ్మేసిన సంక్షోభం

రైతాంగ ఉద్యమాలకు అశోక్‌ ధావలే గత ముప్పై సంవత్సరాలుగా దిశా నిర్దేశం చేస్తున్నారు. ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’ (ఎస్‌.కె.ఎం)లో ప్రధాన భాగస్వామిగా ఉన్న ‘ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ’ (ఎ.ఐ.కె.ఎస్‌) అఖిల భారత అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్నారు. వ్యవసాయ రంగంపై మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాల ప్రభావం గురించి…బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దుకు రైతాంగం చేపట్టిన చారిత్రాత్మక పోరాటం గురించి….ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు….
మన దేశ జనాభాలో మూడిరట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. సరళీకరణ ఆర్థిక విధానాల ప్రభావం వల్ల నేటికీ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న తీరుపై మీ అభిప్రాయం ఏమిటి ? 75 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలో మూడిరట రెండొంతుల జనాభాకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న మాట నిజం. సరళీకరణ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను వేగవంతం చెయ్యడంలో విఫలం చెందాయి. వ్యవసాయంలో అతి తక్కువ వృద్ధిరేటు ఉన్న కారణంగా సగానికి పైగా వ్యవసాయ కుటుం బాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గింది. వ్యవసాయ వృద్ధిరేటు తక్కువగా ఉన్న కారణంగా పారిశ్రామిక వృద్ధి రేటుపై కూడా ప్రతికూల ప్రభావం పడిరది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలు మినహా, దేశంలో వ్యవసాయ సంస్కరణలు, గ్రామీణ వ్యవసాయ నిర్మాణంలో ప్రభుత్వ పెట్టుబడుల కొరత వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిరది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ గ్రామీణ అసమానతలు ఉన్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉంది. గ్రామీణ వ్యవస్థలో అప్పటికే ఉన్న అసమానతలను..1991 తరు వాత వ్యవసాయ రంగాన్ని కమ్మేసిన సంక్షో భం..మరింత తీవ్రతరం చేసింది. వ్యవ సాయ వృద్ధి రేటు మందగించింది. ప్రభుత్వ పెట్టు బడులు పూర్తిగా తగ్గిపోయాయి. పెట్టుబడి సబ్సిడీలలో కోతల ఫలితంగా పెట్టుబడి ఖర్చు లు భారీగా పెరిగాయి.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దాల ఫలితంగా ఆర్థిక దోపిడికి అవకాశం ఉన్న దిగుమతుల ప్రవాహం పెరగడం వల్ల సరుకుల ధరలు కుప్పకూలాయి. దాంతో అన్ని పంటలపై లాభదాయకంగా ఉండే ధరలు తగ్గిపోయాయి. చిన్న, సన్నకారు రైతులకు అందాల్సిన ఆర్థిక వనరులను ధనిక వర్గాలకు, బడా కార్పొరేట్‌ సంస్థలకు మళ్ళించారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, గత మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాలే ప్రధాన కారణం. 1992లో హర్యానా లోని హిస్సార్‌ లో జరిగిన ఎఐకెఎస్‌ జాతీయ మహాసభ, ఈ నయా ఉదార వాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా హెచ్చరిం చింది. ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ, వ్యవసాయ రంగం గణనీయమైన వృద్ధిని పొందలేదు. చిన్న రైతులు విముక్తి కాలేదు. ఎందువల్ల ?గ్రామీణ అభివృద్ధి ఏమైనా జరిగిందా ?వారు వ్యవసాయ రంగం అవసరా లను తప్పుగా అర్ధం చేసుకోవ డంతో ఈ రంగంలో సంస్కరణలు విఫలమ య్యాయి. ఈరంగా నికి వ్యవసాయ సంస్కరణ లు, భారీ ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. వ్యవసాయ రంగంలో దేశీయంగా, బయట కూడా మార్కెట్లు తెరిస్తే, వ్యవసాయ రంగం దానంతటదే పెరగడం ప్రారంభమవుతుందని మన విధాన నిర్ణేతలు ఊహించుకున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రభుత్వం చేయాల్సిన వ్యయంలో కోత విధింపు…భారతదేశ ఆహార భద్రతకు ప్రమాదమని స్థూల ఆర్థిక శాస్త్రవేత్తలు పదే పదే చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ?ఒక వ్యవస్థగా స్వేచ్ఛా వాణిజ్యం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అపనమ్మకం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీఓ) ఒక విశ్వసనీ యమైన సంస్థగా భావించడం లేదు. అందుకే ఈ దేశాలు ప్రాంతీయ, ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నాయి. డబ్ల్యూటీఓ ప్రయోజనకరంగా ఉన్నట్లైతే, మళ్ళీ కొత్త ఒప్పందాలతో అవసరం ఏమిటి? ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాల్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయ రంగానికి ప్రమాదం తెచ్చిపెట్టాయి. చౌకగా లభించే వస్తువులను దిగుమతి చేసుకోవడంతో ధరలు బాగా పడిపోయి, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం లోకి నెట్టబడిరది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో బాగా వెనుకబడిన దేశాల్లోని ఆహార భద్రతపై స్వేచ్ఛా వాణిజ్యం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వారు వాణిజ్య పంటలను ఎగుమతి చేసే ప్రయత్నం చేసి, ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే విధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతారు. కానీ వాణిజ్య పంటల ధరలు బాగా పడిపోతున్నాయి కాబట్టి, ఎగుమతుల ద్వారా పొందే ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. అందువలన ఈ దేశాలు ఇంతకుముందు చేసుకున్న పరిమాణంలో దిగుమతి చేసుకోడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇది వారి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. మంచి లాభాలతో ధాన్యాలను ఉత్పత్తి చేసే చిన్న, సన్నకారు రైతుల సామర్థ్యంపై ప్రభుత్వ వ్యయంలో కోతలు ప్రభావం చూపుతాయి. కార్పొరేట్ల లాభాలు, సబ్సిడీలలో కోతలు విధిస్తున్న కారణంగా పెట్టుబడి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. రైతులు బహుళజాతి కార్పొరేషన్‌లపై ఆధారపడేవారిగా మారిపోతున్నారు. ఇవన్నీ చిన్న, సన్నకారు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. 1980లో భారత వ్యవసాయ వృద్ధి రేటు, నయా ఉదారవాద విధానాలను అమలు చేసిన 30 ఏళ్ళ కాలం లోని వ్యవసాయ వృద్ధి రేటు కంటే ఎక్కువ. సంస్కరణలు వ్యవసాయ రంగంలో వృద్ధిని సాధించడంలో విఫలమ య్యాయని చెప్పడానికి ఈ ఒక్క సూచిక చాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2015-2022 మధ్య కాలంలో వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసింది. ఇది ప్రస్తుత బిజెపి పాలకుల అతి పెద్ద వైఫల్యం. వాస్తవానికి ఈ కాలంలో రైతుల ఆదాయాలు బాగా పడిపో యాయి. పెద్దనోట్ల రద్దు, అనాలోచితమైన జీఎస్టీ పన్ను విధానం, అనాగరికంగా విధించిన లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయాలు రైతాంగాన్ని దెబ్బతీశాయి. ఈ సంస్కరణలు తమ స్థితిగ తులను దుర్భరం చేశాయని వారు ఆగ్రహంగా ఉన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా మీరు నాయకత్వం వహిస్తున్న రైతాంగ ఉద్యమాల అనుభవాలను వివరిస్తారా ? గత ముప్పై ఏళ్ళుగా అమలవుతున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఏర్పడిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం,4లక్షల మంది రైతుల ఆత్మహ త్యలకు దారి తీసింది. ప్రాథమిక సమస్యగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు… పెట్టుబడికి అయిన ఖర్చుకు అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధరగా హామీ ఇవ్వాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసం హరించుకోవాలని, పెట్రోల్‌-డీజిల్‌-గ్యాస్‌ ధరలను సగానికి తగ్గించాలని, రైతులు వ్యవసాయ కార్మికుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలని, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కాకుండా బాధల్లో ఉన్న రైతాంగానికి పంట బీమా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని, సన్న-చిన్నకారు రైతులకు తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ కార్మికులకు రెట్టింపు పని దినాలు, రెట్టింపు వేతనాలను అమలు చేయాలని, గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, రైతుల నుండి బలవంతంగా భూసేకరణను నిలిపి వేయాలని, భూ సంస్కర ణలను చేపట్టాలని కోరుతూ పోరాటాలు జరిగా యి. అదే విధంగా కార్మికులకు వ్యతిరేకంగా చేసిన నాలుగు లేబర్‌ కోడ్‌ లను రద్దు చేయా లని, ప్రైవేటీకరణను నిలుపుదల చేసి, బిజెపి పాలకులు దేశాన్ని తెగనమ్మే చర్యలకు అంతం పలకాలని పోరాటాలు జరిగాయి. గడచిన ఏడు సంవత్సరాల కాలంలో కార్పొరేట్‌ కంపెనీల అనుకూల విధానాలను అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమా లను తీవ్రతరం చేస్తున్నాం. ఈ ఉద్యమాలకు పరాకాష్టగానే ఢల్లీి సరిహద్దుల్లో జరుగుతున్న చారిత్రాత్మక రైతు ఉద్యమాన్ని చూడాలి. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంలో 2020 నవంబర్‌ 26న దేశ వ్యాప్తంగా ప్రారంభమైన రైతు ఉద్యమం పది నెలల కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ ఉద్యమం మతం, కులం, ప్రాంతం, రాష్ట్రం, భాషలను అధిగమించి కొనసాగుతోంది. అణచివేత, అపఖ్యాతిపాలు చేసే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొం టోంది. విజయం సాధించే వరకు ఈ పోరా టాన్ని తీవ్ర తరం చేయాలని రైతులు పట్టు దలతో వున్నారు. కాంట్రాక్టు వ్యవసాయం వలన కలిగే లాభాలను, అనర్థాలను వివరిస్తారా ? కొంత కాలంగా మన దేశంలో కాంట్రాక్టు వ్యవసాయం అమలులో ఉంది. కార్పొరేట్‌ కంపెనీలు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన ధరను చెల్లించి రైతులను మోసం చేయకుండా హామీ ఇవ్వాలి. అయితే మన చట్టాలు అందుకు భిన్నంగా వున్నాయి. కాంట్రాక్టు వ్యవసాయంలో కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వున్నాయి. రైతులు తమ భూములను ఈ కంపెనీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందే మోనని భయపడుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎఐకెఎస్‌ అనేక నిరస నోద్యమాలను నిర్వహిస్తున్నది. ఆ చట్టాల గురించి వివరిస్తారా?వ్యవసాయ చట్టాలు దేశంలోని రైతుల బతుకు తెరువుపై తీవ్ర దాడిగా చెప్పవచ్చు. అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ (ఎపిఎంసి), ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ (ఇసిఎ)లు 1960 నుండి రైతులకు, వినియోగదారులకు రక్షణగా ఉన్నాయి. అవి రైతులు మెరుగైన ప్రయోజనాలు, స్థిరమైన ధరలు (ఎపిఎంసి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ) పొందడానికి సహాయపడ్డాయి. ఎపిఎంసి వ్యవస్థను ఉపసం హరించి…వాటిని ఆదానీ, అంబానీ గ్రూప్‌ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్‌ వ్యవస్థ పతనంతో రైతులు పూర్తిగా కార్పొరేట్‌ కంపెనీల అదుపు లోకి నెట్టివేయబడతారు. ఇది పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో రైతుల మరణాలకు దారి తీస్తుంది. అదేవిధంగా ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌, రిటైల్‌ మరియు రవాణా రంగాలను కార్పొరేట్‌ చేతుల్లోకి చేర్చుతుంది. అంటే దీనర్థం, వినియోగదారులు ఆహార పదార్థాలను మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కనీస మద్దతు ధరను కల్పించే వ్యవస్థను, ప్రభుత్వ ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో ధ్వంసం చేసే లక్ష్యంతోనే…బిజెపి ప్రభుత్వం ఈ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. భారతదేశంలో 81 కోట్ల మంది ఉపయోగిం చుకొనే ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా ధ్వంసం చేయబడుతుంది. కాబట్టి ఈ వ్యవసాయ చట్టాలు కేవలం రైతులకు మాత్రమే కాక, ప్రజలందరికీ వ్యతిరేకమైనవి. ఈ వ్యవ సాయ చట్టాలు రాజ్యాంగబద్దం కావు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండాల్సిన అంశాలు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అగౌరవ పరస్తూ, సమాఖ్య నిబంధనలను తుంగలో తొక్కి, రాష్ట్రాల హక్కులను కాలరాసి పార్లమెంట్‌లో చట్టాలను తెచ్చింది. – భాస్కరరావు

ప్రజా సమస్యలు వదిలి పథకాలతో కాలక్షేపం

ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే పరిష్కారం చేయకుండా జగన్‌ ప్రభుత్వం కొన్ని పథకాలపైనే దృష్టి పెడుతూ కాలయాపన చేస్తోంది. రైతులు, కార్మికులు, చేతివృత్తి దారులు, గిరిజనులు వారు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పాకులాడవలసిన దుస్థితి ఉత్పన్నం కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలు ప్రాధాన్యతా సమస్యలుగా అనిపించకపోవడం శోచనీయం. ఈ సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రాభివృద్ధి నిలకడగా సాగుతుంది. సంక్షేమ పథకాల పంగల కర్రల మీద ఎన్నాళ్లు నడుపుతారు? రాష్ట్రంలో రైతులు, చేతివృత్తిదారులు, కార్మికులు, ప్రాజెక్టు నిర్వాసితులు, గిరిజనులు ముఖ్యమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటిపై తక్షణమే దృష్టి సారించి పరిష్కరిం చాల్సిన అవసరం ఉంది. కాని జగన్‌ ప్రభుత్వం ఈ సమస్యల్ని విస్మరిస్తూ రాజధాని సమస్యను ముందుకుతెచ్చింది. రాష్ట్ర పురోగమనం పట్టాలు తప్పే స్థితి తెచ్చింది. ఇంకో వైపు కేంద్రం, రాష్ట్రానికి చేసే అన్యాయం విషయంలో మెతకవైఖరి ప్రదర్శిస్తోంది.‘స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తానని, మంచి రోజులు తెస్తానని, 2022 కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాన’ని నరేంద్రమోడీ ఎన్నికల్లో చెప్పారు. కానీ ఆయన స్వామినాథన్‌ సిఫార్సును ఎగ్గొట్టారు. స్వామినాథన్‌ సిఫార్సు ప్రకారం క్వింటాల్‌ ధాన్యానికి రూ.2418 ధర ప్రకటించాలి. కానీ సాధారణ రకానికి రూ.1815, నాణ్యమైన రకానికి రూ.1835 కనీస మద్దతు ధరను మోడీ ప్రకటించారు. ఇలా అన్ని పంటల ధరల నిర్ణయంలోనూ రైతులకు ప్రధాని తీవ్ర అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. 1710 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని, 41లక్షల టన్నులు కొన్నామని ప్రకటిస్తున్నారు. కాని ఆచరణ తీరు వేరుగా ఉంది. ఎక్కడా ప్రభుత్వం ధాన్యం కొని రైతుకు నేరుగా డబ్బు చెల్లించడం లేదు. ప్రయివేటు వ్యాపారులే బ్రోకర్ల ద్వారా ధాన్యం కొని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్లు బినామీ పేర్లతో రికార్డు చేస్తున్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటలో 82 కిలోల ధాన్యం రూ.1070లకు బ్రోకర్ల ద్వారా రైస్‌ మిల్లు కొన్నది. 82 నుండి 84 కిలోల వరకు గల బస్తా ధాన్యాన్ని జిల్లాలో ఎక్కడా రూ.1350ల కంటే ఎక్కువకు కొనడం లేదు. అంటే క్వింటాల్‌ రూ.1300 నుండి రూ.1600ల మధ్యలో కొంటున్నారు. ఈ విధంగా క్వింటాల్‌కు 500 నుండి 200 వరకు రైతు నష్టపోతున్నాడు. ఇందుకు కేంద్రంతో పాటు రాష్ట్రమూ బాధ్యత వహించాలి. జిల్లాల్లో పంట దిగుబడిని బట్టి రైతుకు నష్టం వుంటుంది. జిల్లా జిల్లాకు వ్యత్యాసం వుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తానని ప్రకటించారు. ధరల స్థిరీకరణ నిధి సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. కాని నిజంగా అవసరం వచ్చిన సమయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రైతుకు అండగా లేరు. మరో పంట పత్తికి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. ఇక్కడా రైతు నష్టపోతున్నాడు. కందుల్లోనూ రైతుకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర టన్నుకు రూ.4,000 ఇవ్వాలి. కానీ ఇస్తున్నది రూ.2,700 మాత్రమే. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమస్యలు చర్చించిందీ లేదు. చర్యలూ లేవు. జ్యూట్‌, ఫెర్రో ఎల్లాయిస్‌, స్పిన్నింగ్‌, షుగర్‌ మిల్లులన్నీ మూతపడుతున్నాయి. వేలకు వేల కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు. ఈ పరిశ్ర మలు మూత పడడానికి కారణాలను తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి బదులు ఎమ్మెల్యేలు, మంత్రులే దగ్గరుండి మరీ పరిశ్రమలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మించేస్తున్నారు. చిట్టివలస జ్యూట్‌ మిల్లును మంత్రి అవంతి శ్రీనివాస్‌, బొబ్బిలి లక్ష్మీ శ్రీనివాసా జ్యూట్‌ మిల్లును బొబ్బిలి శాసన సభ్యులు సంబంగి చిన్నప్పల నాయుడు, లచ్చయ్యపేట ఎన్‌సిఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ భూమిని పార్వతీపురం శాసనసభ్యులు అమ్మేసే బాధ్యత తీసుకున్నారు. ‘నన్ను గెలిపించండి, మిల్లులను తెరిపించి ఉపాధి గ్యారంటీ చేస్తాన’ని స్వయంగా జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర లోనూ, ఎన్నికల సభల్లోనూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా జరుగుతోంది. పోలవరం మొదలు వంశధార వరకు ప్రాజెక్టు నిర్వాసితుల భూముల ధరల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేస్తానని అదనంగా రైతుకు నష్టపరిహారం ఇస్తానని జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు 105 లక్షలని వారి పునరావాసానికి అయ్యే ఖర్చు రూ.33 వేల కోట్లని లెక్క వేసింది చంద్రబాబు ప్రభుత్వం. జాతీయ ప్రాజెక్టయినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ‘పునరావాసం నా బాధ్యత కాద’ని చెప్పేసింది. ఇది అన్యాయమని నాడు చంద్రబాబు కాని, నేడు జగన్‌ కాని అనడం లేదు. నిర్వాసితులను మాత్రం ముంచేస్తున్నారు. వెలుగొండ, వంశధార, తోటపల్లి, తారక రామా నిర్వాసితులందరూ జగన్‌ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురు చూస్తున్నారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి, భృతికి అన్నింటిలో న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత వరకు చేసిందేమీ లేదు. నిర్వాసితుల ఇళ్లకు గత చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు కూడా ఇవ్వలేదు. ఆ ఇళ్ళు కూడా పిట్ట గూళ్ళ వలె ఉన్నాయి. నివాస యోగ్యంగా లేవు. విజయనగరం జిల్లా పాచిపెంట మండల కేంద్రం దగ్గర పెద్ద గెడ్డపై రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మించింది. అందులో ఆ గిరిజన గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఆ గ్రామాల్లో గిరిజనులంతా ఫారెస్టు భూముల్లో ఇళ్ళు కట్టుకుని, ఫారెస్టు భూములను సాగు చేసుకుని వందల సంవత్సరాలు బతికారు. ఫారెస్టు భూమి కనుక నష్టపరిహారం ఇవ్వలేదు. ఎర్రొడ్లు వలస పునరావాస కాలనీ కొండ పక్కనే నిర్మించారు. కొండను ఆనుకుని వున్న భూమిని సాగు చేసుకుని బతకమని ఆనాడు కలెక్టర్‌, జె.సి చెప్పి ఒప్పించారు. ఇప్పుడు ఇళ్ళ స్థలాల కోసం భూమిని తీసుకుంటామని మండల అధికారులు ఆ గ్రామం మీద దాడి చేస్తున్నారు. ఒకసారి నిర్వాసితులైన ఆ పేదలనే మళ్లీ రెండోసారి నిర్వాసితులను చేస్తున్నారు, ఇదేం న్యాయం?25 లక్షల మందికి రేపు ఉగాది నాటికి ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. అందుకు భూమి సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పేదల భూమిని తీసుకుని ఇళ్ళ స్థలాల పంపిణీకి పూనుకున్నారు. డీపట్టా భూమి, పేదల సాగులో వున్న ప్రభుత్వ భూమి తీసుకుంటామని అధికారులు పేదలపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వమే భూమి కొని పేదలకు పంచి ఇస్తామని ప్రకటనలు చేస్తూ పేదల స్వాధీనంలో ఉన్న భూమిని ఎలా తీసుకుంటారు? పేదలకు అన్యాయమే కదా? భూస్వాముల దగ్గర భూమి కొని ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే అభిప్రాయం ఎందుకు కలగలేదు. విశాఖ ఉడా పరిధిలో డీ-పట్టా భూమిని రాజధానిలో చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన విధంగానే భూమిని సేకరిస్తామనడం పేదలకు అన్యాయం చేయడమే కదా! రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ‘పునాదులు వేయండి, ఇళ్ళు కట్టండి బిల్లులు ఇస్తామని అధికారుల తోనూ, వారి పార్టీ నాయకులతోనూ చెప్పి పేదలతో ఇళ్ళు కట్టించింది. జనంఆ మాటలు నమ్మి పునాదులు వేశారు. ఇళ్లు కట్టేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఇళ్ళకు బిల్లులు ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పేదలను నిర్మించు కోమన్న ఇళ్ళకు, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం మీద కోపంతో ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌తో అనేక ప్రయివేటు కాలేజీలు నడుస్తున్నాయి. జూన్‌ నుండి నడుస్తున్న కాలేజీలకు డిసెంబర్‌ నెలలో ఫీజు రియింబర్సుమెంట్‌ ఇవ్వనని ప్రభుత్వం జి.వో జారీ చేయడంతో ఆ కాలేజీలన్నీ గందరోళంలో పడ్డాయి. ఆదివాసీలకు 2006 అటవీ చట్టం ప్రకారం పోడు పట్టాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇస్తామని మోసం చేసింది. జగన్‌ ఎన్నికల హామీ ఇచ్చారు. తరువాత ఆ ఊసే లేదు. భూమి సర్వేలు చేయడం లేదు. సర్వే చేసిన వారికి పట్టాలు ఇవ్వడం లేదు. 554 నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలను 5వ షెడ్యూల్డు గ్రామాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని గిరిజన సలహా మండలి ప్రకటించింది. వాస్తవంగా 1250 గ్రామాలు షెడ్యూల్డ్‌ గ్రామాలుగా ప్రకటించాల్సి ఉండగా కేవలం 554 గ్రామాలకే పరిమితం చేయడం గిరిజనులకు అన్యాయం చేయడమేనని గిరిజన సంఘాలన్నీ ఆందోళన చేశాయి. బంద్‌ కూడా నిర్వహించాయి. రీ సర్వే చేస్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు పుష్పశ్రీవాణి ప్రకటించి నెలలు గడుస్తున్నాయి. అన్ని లెక్కలూ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వారం రోజుల్లో చేయాల్సిన పనిని 4 నెలలైనా చేయలేదు. భూస్వాముల ఒత్తిడికి లొంగిపోయి వుండకపోతే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నట్లు అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. చేనేత కార్మికులకు చేయూత పథకం ఇస్తామన్నారు. 80 శాతం చేనేత కార్మికులు మాష్టర్‌ వీవర్ల దగ్గర పని చేస్తున్నారు. ఆ కారణం చేత వారికి పథకం ఇవ్వ నిరాకరించారు. గొర్రెలు, మేకల పెంపకందార్లకు ఎన్‌.సి.డి.సి అప్పు ఇస్తామ న్నారు. ఒక్కరికీ ఇచ్చింది లేదు. హుదూద్‌ తుఫానులో నష్టపోయిన కల్లుగీత కార్మికుల నష్టపరిహారాన్ని, చంద్రబాబు ప్రభుత్వం కొంత మందికే ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గీత వృత్తిదార్లకు ఇవ్వలేదు. ‘మా ప్రభుత్వం వస్తే ఇస్తామ’ని జగన్‌ మోహన్‌ రెడ్డి వాగ్దానం చేశారు. ఈ రోజు వరకు ఆ ఊసే లేదు. ఇలా ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే పరిష్కారం చేయకుండా జగన్‌ ప్రభుత్వం కొన్ని పథకా లపైనే దృష్టి పెడుతూ కాలయాపన చేస్తోంది. రైతులు, కార్మికులు, చేతివృత్తి దారులు, గిరిజనులు వారు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పాకులాడవలసిన దుస్థితి ఉత్పన్నం కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలు ప్రాధాన్యతా సమస్యలుగా అనిపించకపోవడం శోచనీయం. ఈ సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రాభివృద్ధి నిలకడగా సాగుతుంది. సంక్షేమ పథకాల పంగల కర్రల మీద ఎన్నాళ్లు నడుపుతారు? ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు జరపకపోయినా సుతిమెత్తని అభ్యర్థనలతో, వేడికోళ్లతో సరిపెడుతున్నారు. దేశమంతా పౌరసత్వ సమస్యపై ఆందోళన జరుగుతుంటే రాష్ట్ర ప్రజలలో కలుగుతున్న ఆందోళన పట్ల ఉదాసీనంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల పౌరసత్వాన్నే ప్రశ్నార్ధకం చేసినా ఆ మోడీ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునీయడం మరీ దారుణం. అనేక పార్టీలు, పార్లమెంటులో సిఎఎకు మద్దతునిచ్చినా ప్రజల నుండి ప్రతిఘటన రావడంతో నిర్ణయం మార్చుకున్నాయి. ఎన్‌.ఆర్‌.సి.ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. చివరికి బిజెపి కర్నాటక ముఖ్యమంత్రి కూడా ప్రజా ప్రతిఘటనకు జడిసి కర్నాటకలో అమలు జరపనని ప్రకటించారు. కానీ జగన్‌ నేటి వరకు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించలేదు. పలు ఎన్నికల వాగ్ధానాల అమలులో వెనకబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని, పాదయాత్ర సందర్భంలో గాని ప్రస్తావించని రాజధాని సమస్యను హఠాత్తుగా ముందుకు తెచ్చింది. అన్ని పక్షాలను, పార్టీలను సంప్రదించి కలుపుకుపోయే వైఖరి కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం అతి కేంద్రీకరణ పేరుతో ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం అర్థం లేని విధానాన్ని చేపట్టి, దానికి వికేంద్రీకరణ పేరుపెట్టి జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. మొత్తం మీద అటు కేంద్రంలో బిజెపి ఎన్నార్సీ పేరుతోనూ, ఇటు రాష్ట్రంలో వైసిపి మూడు రాజధానుల పేరుతోనూ అప్రధాన అంశాలను ముందుకు తెచ్చి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి.

ఆగని అన్నదాత పోరు

పంటలకు చట్టపరంగా కనీస మద్దతు ధరల హామీ,రైతు వ్యతిరేకకార్పోరేట్‌ అనుకూల మూడు సేధ్యపు బిల్లుల రద్దును కోరుతూ దేశ రాజధాని ఢల్లీి నగర శివార్లలో అన్నదాతలు పట్టుదలతో సాగిస్తున్న పోరాటం నానాటికీ ఉన్నతమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ రైతు వ్యతిరేక,ధనవంతులకు లక్షల కోట్లు లాభాలు కట్టబేట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పంటలకు కనీస మద్దతు కల్పిస్తూ చట్టపరంగా హామీ ఇవ్వాలని రైతాంగం కోర్కెలకు మద్దతుగా యువద్భారతం సెప్టెంబరు 27న బంద్‌ పాటించి సంఫీుభావం ప్రకటిచింది. గత పదినెలలుగా అన్నదాతలు ఆందోళన సాగిస్తున్నా మోదీ ప్రభుత్వం మొక్కుసూటిగా రైతు సంఘాలతో చర్చలు జరిపినా ఎలాంటి నిర్ధిష్ట హామీ ఇవ్వకపోవడంతో పోరు ముందుకు సాగుతోంది. కాలయాపన చేస్తే పట్టించుకోకపోతే రైతాంగ ఆందోళన అదంతకదే నీరుగారిపోయిందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ సెప్టెంబరు 5న జాట్‌ భూమిగా పిలిచే పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్‌లో జరిగిన బ్రహ్మండమైన బహిరంగ సభలో యూపీ,ఉత్తరాఖాండ్‌, హర్యానా,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి లక్షలాది మంది రైతులు పాల్గొని మోదీ ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ వివాదస్పదమైన మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగించాలని ప్రతిబూనారు. సంయుక్త కొసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కిసాన్‌ మహా పంచాయిత్‌లో మూడువందలకు పైగా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూపీ,పంజాబ్‌ఉత్తరాఖండ్‌,గోవా,మణిపూర్‌ శాసనసభలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నఇకలు జరగున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వఆనికి గుణపాఠం నేర్పేందుకు ముజఫర్‌నగర్‌లో ఈభారీ కిసాన్‌ బహిరంగ సభను నిర్వహించారు. యూపీ శాసనసభ 303స్థానాలకు,గోవా కనీసం125 అసెంబ్లీ స్థానాల ఫలితాలను రైతాంగ ప్రదర్శనధర్నాల ప్రభావితం చేయగలవని అంచనా. 2013లో ముజఫర్‌ నగరం ప్రాంతంలో జరిగిన హిందూముస్లిం ఘర్షణ వలల రైతాంగ వ్యతిరేకత నెరవేర్చనుంది. అన్నదాతల కనిపిస్తుంటే జాట్‌లో ముస్లింలు ఘర్షణ పదివేరై,జాట్‌లు బీజేపీకి మద్దతులు ఇవ్వగా 2014 మే ఎన్నికల్లో గెలిచి నరేంద్రమోడీ సారధ్యంలో కమలం పార్టఈ అధికారంలోకి రాగాలిగింది. 2017 యూపీశాసనసభ 2019లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తంతు కొనసాగింది. అధికారపార్టీకి రాజకీయ లబ్దిచేకూరింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో తెచ్చిన మూడు సేధ్యపు చట్టాలు కార్పొరేటు వర్గాలకు లక్షల కోట్లు కట్టబెట్టేవని రైతు నాయకులు రాకేష్‌ తికాయల్‌ విమర్శించారు. ఈ పోరాటం కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదని జాతిని,రాజ్యాంగాన్ని రక్షించకోవడానికి జరుగుతున్న ఆందోళనలో 14కోట్ల భారత యువకలు క్రియాశీలపాత్ర వహించాలని తికాయల్‌ కోరారు. మోదీ ప్రభుత్వం భారత్‌ను అమ్ముకానికి పెట్టందని, రైళ్ళు,రేవులు, జాతీయరహదారులు, విమానాశ్రయాలు,ఎల్‌ఐసీ,ఓన్‌జీసీ,బీపీసీఎల్‌, తదితర ప్రతిష్టాత్మక సంస్థలను అదాన్న అంబానీ వంటి బడా పెట్టుబడిదార్లకు కారుచౌకగా కట్టబెట్టి దానికి చేస్తున్న ప్రయత్నాలపై దేశ ప్రజల్లో ఆగ్రహాం రగులు తోంది. ఎన్నో పోరాటాల తర్వాత సాధించు కున్న ప్రతిష్టాత్మకమ విశాఖ ఉక్కు కర్మాగారాన్నఇ ప్రైవేటీకరించేందుకు నిర్ణయిం జరిగి పోయిందని కమలానాధుల చేసిన ప్రకటనలకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలు, కార్మికులు మహిళలు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. పశ్చిమ యూపీలో రైతాంగం పండిరచే చెరకు క్వింటాల ధరకు రూ.450కి పెంచుతామని హామీ ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయు కూడా పెంచలేదు.పైగా చెరకు రైతుకు చక్కెర ప్యాక్టరీలు రూ.12వేలకోట్ల భారీ బకాయిలివ్వాలని రైతులు ఆందోళన చేస్తే అవి రాజకీయపరమైనవని,కమలానాధులు ప్రకటించడం సిగ్గు చేటు. యూపీలో మత విభజన వాణిని కొనసాగించి, హిందువుల ఓట్లును గంపగుత్తగా పొంది మళ్ళీ అధికారంలోకి రవాలన్నదే కమలనాధుల పన్నాగం. 2013 హిందూ ముస్లిం కల్లోలంలో 42మంది ముస్లింలు,20మంది హిందువులు మరణించారు. రైతుల ఆందోళనను ఆందోళనను పోలీసు తుఫాకుల్లో భాష్ప వాయువు గోళాలతో దమనకాండతో అణిచివేయాలని నరేంద్ర మోదీ యోగి ప్రభుత్వం ఎన్నో యత్నాలను లక్షలాది మంది రైతులు కదలి వచ్చి తిత్తాయల్‌ దీక్షకు మద్దతుగా నిలబడి వమ్మఉ చేశారు. మద్దతు ధరలు మూడు వందలకేనా? ఢలీి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాల వారే అధికంగా పాల్గొంటున్నా దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘనేతలు,మహిళలు,కార్యకర్తలు వెళ్లి దీక్షల్లో పాల్గొని సంఫీుభావం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు బీమా పేరిట ప్రభుత్వానికి రూ.2500 కోట్ల బీమా కంపెనీలకు లాభాలే చేకూరుతున్నాయి. రైతుల ఆందోళన వల్ల ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగి తదుపరి ఉత్తర్వఉలు వచ్చేవరకు ఎలాంటి వివాదస్పద సేధ్యపు బిల్లులు అమలు చేయవద్దని ఆపేసింది. రైతుల సమస్యలను తెలుసుకున్న సుప్రీం కోర్టు విరమించినా కనీసం రైతులు ఎవ్వరూ పాల్గొనేదు. రైతుదినోత్సవం నాడు జనం,వ్యాపార ప్రొత్సహం,సహకార చట్టం2020,రైతుల సాధికారిత మరియు కనీస ధరల హామి ఒబ్బందం,రైతుల సేద్య చట్టం`2020,నిత్యఆవసర సరకులు(సవరణ) చట్టాలు పూర్తిగా రైతులను దోపిడికి గురిచేసి అదానీ తదితర కార్పొరేటు శక్తులకులాభాలు కట్టబెటేవని,వాటిని ఉపసంహరించుకోనేవరకు ఆందోళన వీడబోమని రైతు సంఘాల నేతలు స్పుష్ట్రం చేశారు. దీనికి తోడు గత ఏడాదిన్నరగా దేశంలో కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్‌లు విధించడం,రవాణా స్తంభించించడంవల్ల పండ్లు,కూరగాయలు,పూలు,పాలను ఎక్కడెక్కడ దొరక్కపోవడం వల్ల చాలా మంది రైతాంగం అప్పులు పాలైనారు. అందుకే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దత ధరలు కల్పించే ఇచ్చే చట్టాలను కావాలని రైతులు కోరుతున్నారు.

సరికొత్త చరిత్రను సృష్టించిన భారత్‌ బంద్‌
ప్రభుత్వం రైతులపై రుద్దిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కె ఎం) పిలుపు మేరకు సెప్టెంబరు 27న నిర్వహించిన భారత్‌ బంద్‌ జయప్రదమైంది. రైతు,కౌల రైతు,వ్యవసాయకార్మిక,కార్మిక,ఉద్యోగ, మహిళా,విద్యార్థి,యువజన,ప్రజా సంఘాల భాగస్వామ్యాలతో బంద్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రజల నుండి ఎన్నడూ లేని విధంగా అపూర్వ స్పందన,మద్దతు, సంఫీు భావం బంద్‌కు లభించాయి. మోడీ ప్రభుత్వ విధానాలు,పెట్రోల్‌,డీజిల్‌,గ్యాస్‌,నిత్యావసరాల ధరలకు తాళలేకున్న ప్రజ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ నిరసనాగ్రహాన్ని తెలియజెప్పారు. బంద్‌కు కాంగ్రెస్‌,లెఫ్ట్‌ సహా 19బిజెపి యేతర రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సైతం బంద్‌కు మద్దతుగా ప్రకటన చేసింది. కేరళ,పంజాబ్‌,రాజస్థాన్‌,తమిళనాడు, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలు మద్దతు తెలపడం బంద్‌ ఘనంగా విజయవంతం కావడానికి దోహదపడిరది. రాష్ట్రాల అధికారాలను,ఫెడరల్‌ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఉన్న మోడీ ప్రభుత్వ వైఖరి వలన ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం బంద్‌ అనుకూల వైఖరి తీసుకున్నాయి. బిజెపి పాలిత గుజరాత్‌,ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌,కర్నాటక,ఉత్తరాఖండ్‌లలో బంద్‌ను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజలు బారికేడ్లను చేధించుకొని మరీ వీధుల్లో కదం తొక్కడం విశేషం.ఈపరిణామం బిజెపి పట్ల ప్రజల్లో గూడు కట్టుకుంటున్న ఆక్రోశానికి అద్దం పడుతుంది. నిరుడు కరోనా విజృంభిస్తున్న వేళ ఇదే అదనుగా వ్యవసాయ పంటల మార్కెట్‌ కమిటీలు ఎత్తివేసే,కాంట్రాక్టు సేద్యం మరింత పాదుకొనే, నిత్యావసరాల నిల్వలపై పరిమితులు ఎత్తేసే మూడు చట్టాలను మోడీ సర్కారు ఏకపక్షంగా చేసింది. తమ ఉనికికే ముప్పు కలిగించే వినాశకర నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్‌ 26న రైతులు ఢల్లీి పీఠాన్ని కదిలించేందుకు పయనమయ్యారు. శివార్లలో నిలువరించగా అక్కడే బైఠాయింపు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దాంతో తమ ఆందోళన మొదలై పది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భాన, తామెందుకు ఎండ, వాన,చలి,కరోనాలను లెక్క చేయకుండా పోరాటం చేయాల్సి వచ్చిందో దేశానికి తెలియజెప్పేందుకు 27న భారత్‌ బంద్‌కు నడుం కట్టారు రైతులు. ఈ నెల5న బిజెపి పాలిత యు.పిలోగల ముజఫర్‌నగర్‌లో లక్ష లాది రైతులతో ‘మహా పంచాయతీ’ నిర్వహించి బంద్‌ బావుటా చేతబూనారు. బంద్‌ ఆవశ్యకత ను వివరిస్తూ ఊరూ వాడా సదస్సులు, సమా వేశాలు,ర్యాలీలు,కరపత్రాలు,పోస్టర్లతో విస్తృత ప్రచారం చేసి మోడీ పాలనలో కడగండ్ల పాలైన వారిని సమీకరించి సన్నద్ధం చేశారు. ఇంతటి అకుంఠిత దీక్ష,కఠోర కృషి ఉన్నందునే బంద్‌ ఘన విజయం సార్ధకమైంది. ఈభారత్‌ బంద్‌ది ప్రత్యేక నేపథ్యం, చరిత్రాత్మకం. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఐక్య పోరాటాలు మరింత బలపడటానికి బంద్‌ దిశా నిర్దేశం చేసింది. కార్మిక, కర్షక ఐక్యతను పటిష్టమొనర్చింది. కార్పొరేట్ల దోపిడీని ఐక్యంగా ప్రతిఘటించాలని మార్గ దర్శనం కావించింది. కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తున్న పార్టీలు, ప్రభు త్వాలకు గట్టి హెచ్చరిక అయింది. హిందూత్వ, కార్పొరేట్‌ దోపిడీకి ఊతం ఇచ్చే నయా-ఉదార వాద విధానాలను కలగలిపి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కుటిల పన్నాగాలను రైతు ఉద్య మం పటాపంచలు చేయనా రంభించింది. రైతు ల ఆందోళనలు కొన్ని రాష్ట్రాలకే, కొన్ని ప్రాంతా లలోనేనని తక్కువ చేసి చూస్తున్న బిజెపికి ఒకటి కాదు రెండు కాదు 540 సంఘాల మద్దతుతో ఆసేతు హిమాచలం జనాన్ని కదిలించిన భారత్‌ బంద్‌తోనైనా కనువిప్పు కలిగి ఉండాలి. ‘కార్పొ రేట్ల కబంధ హస్తాల నుండి వ్యవసాయ పరి రక్షణ, మోడీ గద్దె దిగాలి’ అనే నినాదం బంద్‌ లో దేశ వ్యాప్తంగా పెక్కటిల్లింది.జాతి వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక సాగు చట్టా లను రద్దు చేయకపోతే ప్రజలు ఆ కార్యాచరణ ను నిజం చేసే రోజు ఎంతో దూరం లేదు.

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌,సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

1 4 5 6 7 8 11