శక్తిమంతులు…మట్టి మహిళలు

‘వేట వృత్తిగా బతికిన ఆటవిక యుగంలోన/ స్త్రీ రాజ్యం స్థాపించి సమానతను చూపినాము/ నాగలి కనిపెట్టినాము/ నాగరికత నేర్చినాము’ అనే జనపదం మహిళ సామర్థ్యాన్ని తెలుపుతుంది. మహిళ ఒక ఉత్పత్తి సాధనం. పునరుత్పత్తికి ఆమే ఆధారం. ఒకప్పుడు మానవ జీవన విధానంలో ప్రముఖపాత్ర మహిళదే. అయితే పరిణామ కమంలో ఆమె మనుగడ అనేక అవరోధాల వలయంలో చిక్కుకుపోయింది. తన శ్రమ అలానే ఉంది, కానీ గుర్తింపు మాయమైపోయింది. తన కష్టం అలానే ఉంది, కానీ గౌరవం కనుమరుగైపోయింది.బాధ్యతలూ, బరువులూ ఆమె నెత్తిమీదే. ప్రమోషన్లు, రిటైర్‌మెంట్ల ఊసే తెలీదు.వెరసి ఆమె ఓ నిరంతర ఉత్పాదక మరమనిషి. నాటు వేసి, కోత కోసి, కుప్ప నూర్చి మట్టిలో మాణిక్యాలు వెలికితీసే నైపుణ్యం ఆమెది. ఈరోజున మనుషులంతా వేళకింత అన్నం తింటున్నారంటే..అందులో మెజారిటీ కష్టం గ్రామీణ,ఆదివాసీ మహిళలదే. ప్రతిఫలంగా వాళ్లకు దక్కే మూట విప్పి చూస్తే.‘కొన్ని తిట్లు, కొన్ని కన్నీళ్లు, కొంత అలసట,కొంత గుర్తింపులేనితనం,రాత్రికి రోజువారీ ఒంటినొప్పులు’.మేల్‌ సుపీరియారిటీ సొసైటీలో ‘అవని ఆకాశంలో సగం’ అనే మాట ఒట్టి మాటే. తతిమా ప్రపంచానికి సరే..గ్రామీణ, ఆదివాసీ మహిళలకు వారి హక్కుల పట్ల వారికే అవగాహన లేదు. వారిలోనూ,ప్రజల్లోనూ ఆ అవగాహన తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సంబంధించి ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

‘అందరికీ మంచి ఆహారాన్ని పండిస్తున్న గ్రామీణమహిళలు’అనేది ఈ ఏడాది అంతర్జాతీయ గ్రామీ ణ మహిళల దినోత్సవం థీమ్‌. ప్రపంచమంతటా ఆహా రాన్ని పండిస్తున్న గ్రామీణ మహిళలను గుర్తించడం.. వారికున్న హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగిం చడం..అనే ముఖ్యోద్దేశ్యాన్ని చెప్పే థీమ్‌తో ఐరాస పిలుపు నిచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయానికి, ఆర్థిక వ్యవ స్థకి,ఆహార ఉత్పత్తికి గ్రామీణ మహిళలే అపారమైన కృషి చేస్తున్నారు.వారి శ్రమకు, సృజనాత్మకతకు గుర్తింపు తేవాలనే ఉద్దేశ్యంతో 2008,అక్టోబరు 15న గ్రామీణ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే దీనికి అంతగా ప్రాచుర్యం అందలేదు. అవగాహనా పెంపొందలేదు. సహజంగా గ్రామీణ ఉత్పత్తిలో ప్రధానంగా పాలుపంచుకుంటున్నది దళిత,బహుజన, ఆదివాసీ మహిళలే. ఆదివాసీ మహిళలు అడవుల్లో సేకరించి,ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. పోషకాల విషయంలోనూ అవి అంతే విలువైనవి. ప్రపంచ మహిళల్లో సగ భాగానికి పైగా భూమి లేక కూలి చేసే మహిళలే. చిన్న, సన్నకారు రైతు కుటుంబాల మహిళలు ఆహార ఉత్పత్తిలో, భద్రతలో ప్రధాన భూమిక నిర్వర్తిస్తున్నారు.పారిశ్రామిక వ్యవస్థ లోనూ మహిళల శ్రమా కీలకమైనదే.
నాటి ఆదర్శం..
గ్రామాలు, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీ జీ అన్నారు.గ్రామస్వరాజ్యం సాధిస్తేనే గ్రామాలు, పట్టణా లు,నగరాలు,రాష్ట్రాలు,దేశం అభివృద్ధి పథంలో పయనిస్తా యన్నారు. గ్రామాల్లోని వ్యవసాయ వనరులే దేశ ఆర్థిక పరిస్థితికి,ఆహార భద్రతకు ఆధారం.ఆ విషయం గ్రామీణ మహిళల శ్రమ ఫలితంలో కనిపిస్తుంది. పంటల సాగు, విత్తనాల సంరక్షణ,పశుపోషణ,పెరటికోళ్ళ పెంపకం, అటవీ వనరుల సేకరణ,చేపల పెంపకం (అమ్మకం), చేనేత రంగం,బీడీ పరిశ్రమలు..ఇవన్నీ గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలే. వీటిలో మహిళలదే ప్రధాన భూమిక.
నేటి ఆధునికం..
అయితే ప్రపంచీకరణ, ప్రైవేటీ కర ణస్థానం బలోపేతమౌతున్న కొద్దీ గ్రామీణ వనరులన్నీ పలచనవుతూ వచ్చాయి. దాదా పు రెండున్నర దశాబ్దాల నుంచి గ్రామా ల్లో పేదరికం తాండవిస్తోంది. ఆర్థిక వెసులు బాటు లేక ప్రజలు మగ్గిపోతున్నారు. ఈ పరిణామం ముఖ్యంగా గ్రామీణ మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది. పోషకాహార లేమితో అనారోగ్య సమస్యలకు గురవుతు న్నారు. విద్య, వైద్య సదుపాయాలు లేవు.ఈ ఇరవై ఏళ్ళలో దాదా పు 50శాతం మహిళలు తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామాల్లో సెజ్‌ల రూపంలో భూదోపిడీలు జరుగుతు న్నాయి. ప్రభుత్వాలే ప్రజలను మభ్యపెట్టి, పారిశ్రామిక వర్గాలకు భూములను కేటాయిస్తున్నాయి.దీంతో గ్రామాల్లో పేదప్రజలు తమ భూముల నుండి నిర్వాసి తులవుతున్నారు.ప్రభుత్వ అక్రమ విధానాల కారణంగా ఆదివాసీ ప్రాంతాల్లో గనుల తవ్వకం నిరాఘాటంగా సాగుతోంది. వారు సాగు చేసుకునే పోడు భూములను ప్రభుత్వాలు వివిధ కారణాలు చెప్పి,స్వాధీ నం చేసుకుం టున్నాయి. నిర్వాసితులు, నిరాధారులంతా వలస మార్గం పడుతున్నారు.
గిరిపుత్రుల గోడు..
అనాదిగా గిరిజనులుప్రకృతి ప్రేమి కులు. జీవనానికి తోడ్పడే ప్రతిదీ వారికి దైవంతో సమానం. అంతగా వారి జీవన విధానం పరిసరాలతో ముడిపడి ఉంటుంది. చెట్టు,పుట్ట,పక్షి..ఇలా తమ చుట్టూ ఉండే ప్రతిప్రాణీ వారి సొంతంగా బతుకు తారు. ఆట,పాట వారి జీవనంలో భాగం.అదే వారి సంస్క ృతి.గిరిజను లకు అటవీ భూమిలో నివసించే హక్కు ఉంది.ఆ భూమిని సాగు చేసుకునే హక్కూ ఉంది.అటవీ ఉత్పత్తులను సేక రించి,వినియోగించుకునే హక్కూ వారి కుంది.వారి ఆచార వ్యవహారాలకు ఆటంకం కలిగితే ఎదుర్కొని, న్యాయం కోరేందుకు చట్టాలున్నాయి. అయితే నిరక్షరా స్యత వల్ల వారికి వీటిపై అవగాహనే లేదు. అభివృద్ధి పేరుతో నెలకొల్పే ప్రాజెక్టులు, గనుల తవ్వ కాలు,అడవుల నరికివేత వంటివి వారి మనుగడకు పెనుభూతాలుగా మారి, నిర్వాసి తులను చేస్తున్నాయి.
అక్షరాస్యతతో అవగాహన వైపు..
గ్రామాల్లో సరైన విద్యా సౌకర్యాలు లేక నిరక్ష రాస్యత రాజ్యమేలుతోంది. ఆడ పిల్లల చదువు ప్రాథమిక పాఠశాల స్థాయి లోనే ఆగిపోతోంది.దాంతో వారికి తమ శ్రమకు విలువ కట్టడం తెలియడం లేదు.వారికున్న హక్కు ల పట్ల అవగాహన కలగటం లేదు.అనేక దుర్భర పరిస్థి తులను ఎదుర్కొంటున్నారు.అక్షరాస్యతను అభివృద్ధి పరచాలని‘బేటీ బచావో బేటీ పఢావో,సర్వశిక్ష అభియాన్‌, మధ్యాహ్న భోజన యోజన’లాంటి పథకాలను ప్రభు త్వాలు తెచ్చాయి. కానీ అవి అమలుకు నోచుకున్నాయా అని తరచి చూస్తే మనకి అన్నీ ‘అచ్చుతప్పులే’ కనిపిస్తా యి.ఈవిషయంలో మన పొరుగు రాష్ట్రం కేరళది ఆదర్శవంతమైనపాత్ర. మనదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం.2011జనాభాలెక్కల ప్రకారం 94శాతం అక్షరాస్యత ఉంది. ఇటీవలి అంచనాల ప్రకారం 96.2 శాతానికి పెరిగింది. మిగిలిన రాష్ట్రాలూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే దేశం అక్షరాస్యతతో సుసంపన్నమవుతుంది.
ఏరువాక విడిచి ఊరు దాటితే..
జీవనోపాధిని కోల్పోయి పట్టణాలకు,నగరాలకు పొట్ట చేతపట్టుకొని వలస పోతున్నారు గిరిజనులు, గ్రామీ ణులు.దారం తెగిన గాలిపటాలయ్యాయి వీరి జీవితాలు. తెలియని ప్రదేశాలలో ఇమడలేక,సరైన పనులు దొరక్క నానా యాతనలు పడుతున్నారు.మహిళలైతే పని ప్రదేశాల్లో హింసకు,లైంగిక వేధింపులకు,దాడులకు గురవుతున్నారు.బలవంతంగానో,బతకలేని పరిస్థితుల్లోనో వ్యభిచార వృత్తిలోకి నెట్టివేయబడుతున్నారు.గ్రామీణ మహిళలు బయటే కాదు ఇళ్లల్లోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తీవ్రమైన గృహ హింసను అనుభవిస్తు న్నారు. కుటుంబసభ్యుల నిరంకుశత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిని భరించాల్సి వస్తోంది. అలాంటి వాతావరణం లో పెరిగిన పిల్లలు చిన్నతనంలోనే వ్యసనాలకు లోనవు తున్నారు.తాము చేయని తప్పులకు అటు పిల్లలు, ఇటు భర్త వ్యసనాలబారిన పడుతున్నారు.చివరికి ఈ కష్టాలు మహిళలకు తీరని క్షోభను మిగుల్చుతున్నాయి.
ఘనత ఉన్న పంచాయితీరాజ్‌..
మన గ్రామీణ రాజకీయ నేపథ్యంలో పంచాయి తీరాజ్‌ వ్యవస్థ కీలకం.ఇది అతి ప్రాచీనమైనది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రయోగశాలగా చెప్పుకునే ఘనత దీనికి ఉంది.గ్రామ పరిపాలనకు వెన్నెముకగా పనిచేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 72 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారి భవిష్యత్తు పంచాయితీరాజ్‌ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది.ఈ వ్యవస్థలో ముఖ్యంగా గ్రామీణ మహిళల భాగ స్వామ్యం ఉంది. వారికి ఉండేది వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే.ఆ ఆసరా కూడా లేకుండా చేసే కార్య కలాపాలు ఆపి, వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది.
పథకాల అమలే పరిష్కారమా..?
మహిళా రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ గ్రామ స్థాయి లోని మహి ళలు ఆర్థికంగా,సామాజికంగా ఇంకా వెనుక బడి ఉన్నారు. పంచాయితీ రాజ్‌లో పది లక్షల మంది మహిళా ప్రతి నిధులు ఉన్నారు. అయినప్పటికీ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరటం లేదు.ఈ పరిస్థితిని అధిగ మించాలనే ఉద్దేశాన్ని చెబుతూ మహిళల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టాయి.డ్వాక్రా గ్రూపు లు,సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు,స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లాంటి రకర కాల పథకాల ద్వారా మహిళలకు కొంత వరకు తోడ్పాటు ను అందిస్తున్నాయి. అయితే అవి సక్ర మంగా అమ లుకు నోచుకోవడం లేదు. దీనికి పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో పాటు మహిళలకు వాటిపై అవగాహన లేకపోవడం కూడా కారణమే. రాజ్యాంగం అనేది ఒకటి ఉందనీ, దానిలో మహిళలకు అంటే తమ కోసం కొన్ని చట్టాలు ఉన్నా యన్న కనీస అవగాహన గ్రామీణ మహిళ ల్లో లేదని ఇటీవల ఒక అధ్యయనంలో తెలిసింది.ఆయా చట్టాల గురించి,హక్కుల గురించి వారికి తెలిసిన ప్పుడే మార్పు మొదలవుతుంది.
పితృస్వామిక పరిమితులు..
సమాజంలో పాతుకుపోయిన పితృ స్వామిక విలు వలు మహిళల హక్కులను తొక్కి పెడుతున్నాయి. చాలా వరకు గ్రామా ల్లో ఆస్తులన్నీ పురుషుల చేతుల్లోనే ఉన్నా యి.అవి మహిళలకు లభించే విధంగా అమలు జరగటం లేదు.బాంకు అకౌంట్లు కూడా జనధన్‌ యోజన,ఫైనాన్స్‌ఇంక్లూ జన్‌లో మహిళలను భాగస్వా మ్యం చేయాలి. ప్రభు త్వం ఇచ్చే స్థలాలు,ఇళ్ళ పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వాలి.అవి నేరుగా మహి ళలకు చేరేవిధంగా ఏర్పాటు చేయాలి.అంగన్‌వాడీ,జననీ సురక్ష యోజన లాంటి పథ కాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి.శ్రమకుతగ్గ వేతనం అందక పోయినా పురుషులతో సమానంగా శ్రమిస్తూనే ఉన్నారు.సామాజిక బాధ్యతలు మోస్తూనే ఉన్నారు.
విధిలేక వివక్షలో..
మహిళల శ్రమ పురుషులతో సమానం లేదా అంతకు మించి ఉంటుంది.వేతనం విషయంలో మాత్రం వివక్ష స్పష్టంగా,నిరాఘాటంగా కొనసాగుతోంది. మహిళ లకు పనికి తగ్గ వేతనం లేదు.ఆరుగాలం శ్రమించినా తిరిగి చూసుకుంటే శూన్యమని పిస్తోంది.అంతేకాదు.. ఇంత చేసినా మహిళలకు భూమిపై హక్కు లేదు. మహిళా రైతుగా గుర్తింపు లేదు. జీవనోపాధిలో నిర్ణయా ధికారం లేదు.ఆదాయంపై నియంత్రణ అనేది లేదు.తల్లిగా, భార్యగా,సోదరిగా ప్రతి పురుషుని జీవితాన్నీ తీర్చిదిద్దేది మహిళే. అయినా మన పితృస్వామ్య సమాజంలో స్త్రీకి ఉన్న విలువెంత అంటే సమాధానం శూన్యం.మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా,మన పురుషాధిక్య సమాజంలో వారికే మాత్రం గౌరవం, గుర్తింపు ఉండటం లేదు. చట్టపరంగా సమాన హక్కులు ఉన్నా,అవి తెలిసినవారు ఎక్కడో ఒకరుంటారు. ఇప్ప టికీ ఇంటాబ యటా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు.పైకి కనిపించే చిరునవ్వుల వెనుక కనిపించని కన్నీళ్ళెన్నో. మహిళల పరిస్థితులు మారాలని అందరూ చెబుతున్నారు. కానీ మహిళా కమిషన్‌ బిల్లును సైతం తొక్కిపెడుతూనేఉన్నారు.
తీర్పుతో మార్పు ఉందా..
సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం నియమాన్ని స్పష్టీకరించింది. రోజువారీ కూలీలకు, క్యాజువల్‌ సిబ్బందికి,కాంట్రాక్టు సిబ్బందికి ఈ నియమం వర్తిస్తుంది. అయినా ఇప్పటికీ ఆనియమం అమలు కాలేదు. స్త్రీ-పురుషుల వేతనాల విషయంలో తీవ్ర వ్యత్యా సాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వైనాన్ని కళ్ళకు కట్టింది మాన్‌స్టర్‌ సబ్‌వే. ఓవైపు వేతనాల్లో అన్యాయానికి గురవుతున్న స్త్రీలు ఇటు ఇల్లు, అటు ఆఫీసు పనుల్లో తీవ్ర మైన వత్తిడికి గురవుతున్నారు.పని ఒత్తిడిలో మగ్గుతున్న మహిళలు43శాతం మంది ఉన్నారని ఇటీవలి నివేదికలో తెలిసింది.వీరిలో దాదాపు 92శాతం మంది మహిళలు. స్త్రీల పథకాల అమలు లోనైనా మహిళల భాగస్వా మ్యం ఉంటే కొంతవరకు అమలుకు నోచుకునే అవకాశం ఉంటుంది.
వారసత్వపు హక్కులో సత్తువుందా..
సహజంగా మనదేశవారసత్వ చట్టంలో తాత ఆస్తి మనవడికి అని ఉండేది. స్త్రీకి గానీ,ఆమె సంతా నానికిగానీ చెందేలా లేదు. చట్టపరంగానే లింగ వివక్షను చవిచూ సింది మహిళ.అయితే వారసత్వచట్టం ఒక అడుగు ముందుకేసి స్త్రీలకూ పురుషులతో సమానంగా ఆస్తి హక్కును కల్పించింది.దీన్ని ఆధారం చేసుకుని భూమిపై హక్కును,వాటాను మహి ళలు సాధించుకోవాలి. మహిళలకు వీటిపై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలి. స్వచ్ఛం ద సంస్థలతో పాటు ప్రభుత్వాలూ బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మహిళలకు ఆస్తి హక్కు సరైన రీతిలో చెందేలా ప్రభుత్వాలే చట్టాలు రూపొందించాలి.
మహిళా రైతు దినోత్సవం..
నేడు మన దేశంలో చిన్న,సన్నకారు రైతుల విష యానికొస్తే..వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళా కార్మికులు 86శాతం పైనే ఉన్నారు. వారిలో 53 శాతం కుటుంబాలకు సాగుభూమి లేదు. భూమిని కౌలుకు తీసుకుని,వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. వర్షా భావం తో పంటలు పండకపోయినా కౌలు మాత్రం యజమానికి చెల్లించాల్సిందే. దీంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు భూమిపై హక్కులున్నాయా అంటే? లేవనే చెప్పాలి. మరి ఇలాంటివారికి ప్రభుత్వాలే భూపంపిణీ చేయాలి.అదీ మహిళ పేరుతో ఇస్తేనే లబ్ది చేకూరుతుంది. అప్పుడే స్త్రీలు ఒడిదుడు కులను ఎదుర్కొని పిల్లల బాధ్యత, కుటుంబ పోషణను సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. పథకాలు ప్రభుత్వాల ప్రకటనల వరకే పరిమితం కాక, అమలు చేయాల్సిన అవసరం ఎంతైనాఉంది.దీనివల్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరే అవకాశంఉంది.
మహిళా రైతుల వేదిక సభ్యులు వీటిపై కృషి చేస్తున్నారు. మహిళల హక్కుల గురించి, వారి శ్రమకు గుర్తింపు రావాలని చేస్తున్న కాంపెయిన్‌లు, సదస్సులు, జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి,కొన్ని సంఘాలు ముందుకెళ్తున్నాయి.గతేడాది కేంద్ర వ్యవసా య మంత్రి గ్రామీణ రైతుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.తమ హక్కు లూ, పథకాలూ గ్రామీణ మహిళలకు చెందా లి.అందుకోసం ప్రజాస్వామిక శక్తులూ, మానవహక్కుల సంఘాలూ, మహిళా సంఘా లూ గళమెత్తాలి.మహిళలంతాఒక్కటై నినదిం చాలి.ఇది మహిళా రైతుల కృషికి సత్ఫలి తాలిస్తుందని భావిద్దాం. మానవ మనుగడకు నిరంతర కార్యదర్శిని గుర్తించి,గౌరవిద్దాం. – (టి.టాన్య)

మహిళలు..బాలల హక్కులకేదీ భరోసా

రాజ్యాంగం మహిళలు,బాలలకు ప్రసాదించిన హక్కులను మనమెంత సమర్థంగా అమలు చేస్తున్నామో సింహావలోకనం చేసుకోవడం అవసరం. చట్టం ముందు అందరూ సమానులేనని, అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది. మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
చట్టం ముందు అందరూ సమానులేనని,అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది.కుల,మత,జాతి,మత,లింగ, ప్రాంతీయ పరంగా ఎవరిపైనా దుర్విచక్షణ చూపకూడదని నిషేధం విధించింది.మహిళలు,బాలలహక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏవైనాప్రత్యేక చర్యలు తీసుకోదలిస్తే,ఆపని నిక్షేపంగా చేయవచ్చునని15(3)వ రాజ్యాంగ అధికరణ ఉద్ఘాటించింది.మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
గణతంత్ర గమనం.. ఒడుదొడుకులమయం
మహిళా సమానత్వం,మహిళా హక్కుల గురించి రాజ్యాంగ నిర్మాతలకు మొదటి నుంచి పూర్తి అవగాహన ఉంది.వాటిని తప్పనిసరిగా అమలు చేయాలన్న దృఢసంకల్పమూ ఉంది.ఆరంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా,1950లలో హిందూస్మృతి బిల్లుల ఆమోదంతో ముందడుగు పడిరది. అయితే హక్కుల సంరక్షణా రథం జోరు అందుకోవడానికి మరికొంత సమయం పట్టింది.1961లో మాతృత్వ సంక్షేమ చట్టం,వరకట్న నిషేధ చట్టాలు ఆమోదం పొందాయి. కేవలం చట్టాలతోనే సమూల మార్పు సాధించలేమని అనుభవంలో తెలిసివస్తోంది.ఉదాహరణకు భారతీయ శిక్షాస్మృతిలోని 304 బి సెక్షన్‌ వరకట్న మరణాలను హేయమైన నేరంగా పరిగణిస్తోంది.అంతమాత్రాన వరకట్నం కోసం వేధించడం,కోడళ్ల హత్యలు,ఆత్మహత్యలు ఆగలేదు కదా! నేడు దేశంలో గంటకొక వరకట్న మరణం సంభవిస్తోందని జాతీయ నేరగణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడిరచడం ఓభీకర వాస్తవాన్ని కళ్లకు కడుతోంది.ఆచరణలో కొన్ని లోటుపాట్లున్నా మహిళలకు చట్టపరమైన రక్షణను కొనసాగించడం తప్ప నిసరి.అందుకే గృహహింస నిరోధానికి ఒకచట్టం చేశాం.పని చేసేచోట మహిళలను లైంగికంగా వేధించడం నిషిద్ధమని,అసలు అలాంటివి జరగకుండా ముందే నివారించాలని,లైంగిక వేధింపులు జరిగితే కఠినంగా శిక్షించాలని నిర్దేశిస్తూ ప్రత్యేక చట్టమూ చేశాం.ఎంతో కాలం చర్చలు, తర్జనభర్జనలు జరిగిన మీదట అవి రూపుదాల్చాయి.రాజ్యాంగం తమకు భరోసా ఇచ్చిన హక్కుల్లో కొన్నింటినైనా సాధించుకోవడానికి మహిళలకు అండగా నిలిచాయి. అయితే చట్టాలు ఆశించిన ఫలితాలు ఇచ్చేలా నిరంతరం జాగరూకత పాటించాలి.
మహిళలు,పురుషులనే భేదం లేకుండా పౌరులందరికీ సముచిత జీవనాధారం,ఒకే పనికి ఒకే విధమైన వేతనాలు అందాలని రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఆదేశి స్తున్నాయి.పంచాయతీలు,పురపాలక సంఘాల్లో షెడ్యూల్డ్‌ కులాలు,తెగలతోపాటు మహిళలకూ రాజ్యాంగం సీట్లు కేటాయించింది. అయితే కొన్ని సీట్లలో మహిళలకు బదులు వారి భర్తలు లేక బంధువులు అధికారం చలాయి స్తున్నారనే వార్తలు వస్తున్నాయి.కొందరు అగ్రశ్రేణి రాజకీ య నాయకులు సైతం మహిళలు ఉండాల్సింది వంటిం ట్లోనని,వారు బయటికొచ్చి గద్దెనెక్కడం సరికాదని వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం.కాబట్టి కేవలం చట్టా లతోనే పని జరగదని అర్థమవుతోంది. అందరి మనస్త త్వాల్లో, దృక్పథాల్లో మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా మహిళలకు సాధికారత చేకూర్చాలనే దృఢసంకల్పం అందరిలో పాదుకోవాలి.ప్రత్యేక సంరక్ష ణ, సహాయం పొందే హక్కు చిన్నారులకు ఉందని సార్వ త్రిక మానవ హక్కుల ప్రకటనలోని 25వ అధికరణ గుర్తించింది.1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశం ఆమోదించిన ఈ ప్రకటనను ప్రపంచ దేశాలన్నీ శిరసావహిస్తున్నాయి.తదనుగుణంగా భారత రాజ్యాంగం బాలలతో చాకిరీ చేయించడాన్ని నిషేధించింది.14 ఏళ్ల లోపు పిల్లలతో కర్మాగారాల్లో కాని, గనుల్లో కాని, మరెక్క డైనా కాని ప్రమాదభరితమైన పని చేయించకూడదని స్పష్టీకరించింది. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఎదిగేట్లు జాగ్రత్త తీసుకోవాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి.స్వేచ్ఛాయుత వాతావరణంలో హుందా గా పెరిగేలా పిల్లలకు అవకాశాలు, సౌకర్యాలు కల్పించా లన్నాయి.బాలలు,యువజనుల శ్రమను దోపిడి చేయడం, నైతికంగా,భౌతికంగా వారిని నిస్సహాయులుగా వదిలి వేయడం వంటివి జరగరాదంటున్నాయి.ఈ లక్ష్యాలను సాధించడానికి తగు విధానాలు రూపొందించి అమలు చేయాలని ఆదేశిస్తున్నాయి.ఇవి గొప్ప లక్ష్యాలే కాని, వాటిని ఎంతవరకు నెరవేర్చామో తరచిచూసుకోవడం ఆవశ్యకం.పిల్లల హక్కులను నిజంగా కాపాడగలుగు తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
లక్ష్యసాధనలో వైఫల్యాలెన్నో
ప్రగతిశీల సమాజంగా, సజీవ ప్రజాతంత్ర, గణ రాజ్యంగా వెలిగిపోతుందనుకొంటున్న భారతదేశం నిజంగా ఏమి సాధించిందనే ప్రశ్న సహజంగానే తలెత్తు తుంది. లక్ష్యసాధనలో కొన్ని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.మరి వాటిని అధిగమించడానికి మనమేం చేశాం, ఏం చేస్తున్నాం? మొదట దేశ ప్రజల ఆలోచనా విధానం మారాలి. కాలం మారుతోందని గుర్తించి తదను గుణంగా నడచుకోవాలి.చిరకాలం ఇంటి నాలుగు గోడల మధ్య మగ్గిపోయిన భారతీయ మహిళ నేడు బయటి ప్రపంచంలోకి వస్తోంది.‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే మను సూక్తికి కాలం చెల్లిపోయింది. తమకూ హక్కులు ఉన్నాయని, రాజ్యాంగం వాటికి భరోసా ఇచ్చిందని మహిళలు గ్రహించారు.సమానత్వం, గౌరవ మర్యాదల పరిరక్షణకు కట్టుబడిన రాజ్యాంగం వనితలను తమ హక్కులు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది.దీన్ని ఎవరూ కాదనలేరు.నాయకులు కాని, మరెవరైనా కాని మహిళల హక్కులను కాలరాయలేరు. మహిళలు కూడా సంస్థాగతంగా సంఘటితమై తమ హక్కులను కాపాడు కోవడానికి ఉద్యమిస్తున్నారు.మన దేశజనాభాలో 37 శాతం బాలలే అయినా గడచిన 70ఏళ్లుగా బాలల హక్కు లను అలక్ష్యం చేస్తూ వచ్చాం.ప్రపంచంలో యువ జనాభా అత్యధికంగా ఉన్నది భారత్‌లోనేనని గర్విస్తూనే బాలల గురించి పట్టించుకోకపోవడం క్షంతవ్యం కాదు. బాల్యం నుంచి చక్కని చదువులు చెప్పి,యౌవనంలో నైపుణ్యాలు గరపడం ద్వారా యువ జనాభాను దేశ ప్రగతికి చోదక శక్తిగా మలచుకోవలసిన బాధ్యత జాతి మీద ఉంది. మహిళలు,బాలలకోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ-అభివృద్ధి పథకాలు అమలవుతున్న తీరుపై సామాజిక తనిఖీ చేయాలి.వసతి గృహంలో లైంగిక అత్యాచారాలపై నిష్పాక్షికంగా,హేతుబద్ధంగా జరిపిన విచారణ ద్వారానే నేరస్తులకు శిక్షలు విధించగలిగాం. సామాజిక తనిఖీ కూడా అదే పంథాలో సాగాలి.
ఆచరణలో వెనకబాటు
పిల్లలు,ముఖ్యంగా ఆడ పిల్లల శ్రేయం కోసం జాతీయ విధానాలుచాలానే రూపొందించుకున్నాం. పిల్లల సంక్షేమానికి తరుణ వయస్కుల న్యాయ చట్టం రూపొందింది.14ఏళ్ల వయసువరకు బాలలకు ఉచిత విద్య ఒకహక్కుగా గుర్తించాం.ఇన్నిచట్టాలు చేసినా వాస్త వంలో పరిస్థితి వేరుగా ఉండటం శోచనీయం. కైలాస్‌ సత్యార్థి వంటివారు నిస్వార్థంగా కృషి చేసినప్పటికీ బాల కార్మికులతో పని చేయించే పద్ధతి ఇప్పటికీ కొనసాగు తోంది. సరైన వైద్య సౌకర్యాలు లేక వందల సంఖ్యలో శిశువులు ఇప్పటికీ మరణిస్తూనే ఉన్నారు.దేశంలో రోజుకు 250మంది బాలలు అదృశ్యమవుతున్నారని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు తెలుపుతున్నాయి. వసతి గృహా ల్లో,శరణాలయాల్లో బాలికలపై లైంగిక అత్యాచారాల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక శరణాల యంలో 30మంది బాలికలపై పదేపదే అత్యాచారం జరిపిన వ్యక్తులకు ఇటీవల శిక్షపడటం చూస్తే, రాజ్యాం గం నిర్దేశించిన రీతిలో బాలలకు ముందుగానే రక్షణ కల్పించలేకపోతున్నామని తేలుతోంది.బాలలు నేరాలకు ఒడిగట్టే ధోరణి తగ్గుతుంటే,వారి పట్ల నేరాలు పెరిగి పోతున్నాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడిరచింది.2016-2018 మధ్యకాలంలో బాలలపై నేరాలు గణనీ యంగా పెరిగా యని తెలిపింది. బాలలకు విద్యాహక్కును తొమ్మి దేళ్ల క్రితమే దత్తం చేసినా,ఆశించిన స్థాయిలో ఆహక్కు అమ లైందా అంటే గట్టిగా అవునని చెప్పలేని పరిస్థితి. అర్హులైన ఉపాధ్యాయులు,సరైన పాఠశాలభవ నాలు, ప్రయోగశాలలు,ఇతర మౌలిక వసతులు కొరవడటంవల్ల బాల లకు విద్యా హక్కు అరకొరగానే అమలవుతోంది. భారత గణతంత్ర రాజ్యానికి70ఏళ్లు నిం డిన సం దర్భంలో స్త్రీలు,బాలల అభ్యున్నతికి భావి కార్యాచరణ ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణ యించుకోవడం ఎంతైనా అవసరం. ఆలక్ష్య సాధనకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఐక్య రాజ్య సమితి లో సభ్యులైన 193దేశాలు సంతకం చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పత్రం సరిగ్గా అటువంటి ప్రణాళికే. భారత దేశం కూడా దాని మీద సంతకం చేసింది.సుస్థిరా భివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీల)ను సక్రమంగా అమలు చేస్తే,అన్ని వర్గాలతో పాటు స్త్రీలు, బాలలూ లబ్ధిపొందుతారు. ఎస్‌డీజీలలో అయిదోది స్త్రీలు,బాలికల గురించి పట్టిం చుకొంటోంది.లింగ సమానత్వం సాధించి, మహిళలు, బాలికలకు సాధికారత అందిం చాలని అందులోని అయిదోలక్ష్యం ఉద్ఘా టిస్తోంది.ఎస్‌డీ జీలలో ఇతర లక్ష్యాలైన పేదరికం,అసమా నతలనిర్మూలన,ఆరోగ్య సంరక్షణ,ఉపాధి,ఆర్థిక ప్రగతులను సాధిం చడానికి మహిళా సాధికారతే పునాది.కొత్త దశాబ్దంలో ఈలక్ష్యాల సాధనకు జాతి యావత్తు కలిసి కట్టుగా ప్రజాస్వామికంగా కృషి చేయాలి.- వ్యాసకర్త : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి

ఆగని ఆకలి కేకలు.. పేదరికానికి పడని పగ్గాలు

పేదరికం ఒక విషవలయం.కనీస అవస రాలతోపాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొంద లేని స్థితిని‘పేదరికం’అని ఐక్యరాజ్య సమితి నిర్వ చించింది.పేదరికం బాధను అంధుడుసైతం చూడ గలడంటూ నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ వాపోయారు.ఆకలి,అనారోగ్యం ఈ రెండూ పేదరి కం కవలలు. పోషకాహార లోపం, అనారోగ్యం, నిరక్షరాస్యత,నిరుద్యోగం వంటి మౌలిక సమ స్యలతో భారత్‌ నేడు సతమతమవుతోంది. స్వాతం త్య్రానంతరం సాధించిన అభివృద్ధి ఫలాలు కొంద రికే పరిమితం కావడంతో బీద ధనిక అంతరాలు కొనసాగుతున్నాయి.పోషకాహార లోపాలను అధిగ మించడంలో కొంత ముందడుగు పడినా, చేయా ల్సింది మరెంతో ఉందని క్షేత్రస్థాయి వాస్తవాలు చాటుతున్నాయి.2005-06 నుంచి 2015-16 మధ్య పదేళ్ల వ్యవధిలో 27.1కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులైనట్లు గణాంకాలు చెబుతున్నా, 130కోట్ల దేశజనాభాలో నేటికీ 28 శాతం పేదరి కంలోనే మగ్గుతున్నారని యూఎన్‌డీపీ నివేదిక స్పష్టీకరించింది.
పథకాలు ఎంత వరకు గట్టెక్కిస్తాయి?
ప్రధానిగా ఇందిర అయిదు దశాబ్దాల క్రితం ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదం తరవాత చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ నుంచి ఇప్పటి గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాల వరకు పేదల సంక్షే మం కోసం ప్రభుత్వాలు అనేకానేక పథకాలు చేపడుతూ వచ్చాయి. హరిత విప్లవం పుణ్యమాని 60వ దశకం చివరలో వ్యవసాయ ఉత్పత్తుల పెరు గుదల ఆహార భద్రతకు బాటలుపరచింది. అన్నా ర్తుల ఆకలి కేకలు కొంతవరకు తగ్గుముఖం పట్టా యి. పేద రైతులకు పెట్టుబడి సాయాలు, పేదలకు పింఛను పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. అయినా కిందకు దిగిరానం టున్న పేదరికం గణాంకాలు వెక్కిరిస్తూనే ఉన్నా యి.ఈ తరహా పథకాలద్వారా ఆకలి మంటల నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప పేదరికాన్ని నిర్మూలించలేమని ఇన్నేళ్ల అనుభవాలు స్పష్టీకరిస్తున్నాయి. పేదలకు ఆదాయ భద్రతతో పాటు విద్య,వైద్యం,రక్షిత తాగునీరు వంటివి అం దాలి.దారిద్య్ర రేఖను స్వయంకృషితో అధిగ మించేలా వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి.దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా వీటికోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆశించిన స్థాయి లో లేవు. సేవల నాణ్యతా పలు విమర్శలకు తావి స్తోంది.పేదరిక నిర్మూలనకు బహుముఖ వ్యూహాలు అవసరమని దీన్నిబట్టి బోధపడుతోంది.తాజా ప్రపంచ ఆకలిసూచీ-2019 నివేదిక ప్రకారం పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న చిన్నారులు 2008-12మధ్యకాలంలో 6.50 శాతం నమో దైతే, 2014-18 మధ్యకాలంలో వారి సంఖ్య 20.83 శాతానికి పెరిగింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడిరచింది. వాస్త వానికి పేదరికాన్ని ఎలా గణించాలన్న దానిపై ప్రభుత్వపరంగానే స్పష్టత కొరవడుతోంది. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం నియమించిన అలఫ్‌ు కమిటీ (1979), లకడాయీలా (1993), తెందూల్కర్‌(2009),రంగరాజన్‌కమిటీ(2014) లు పేదరికం గురించి భిన్నమైన నిర్వచనాలు ఇవ్వ డమే దీనికి దాఖలా.ఆ మేరకు తెంద్కూలర్‌ కమిటీ దేశంలో పేదలు 22శాతమని అంచనా వేయగా, రంగరాజన్‌ కమిటీ 29.5శాతమని చెప్పింది.

ఆ వర్గాల వారే ఎక్కువగా!
జీవితమంతా పేదరికంతో మగ్గినవారిని శాశ్వత పేదలంటారు. వీరు తరవాతి తరానికీ పేదరికాన్ని బదలాయించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివారు అధికంగా ఎస్సీ, ఎస్టీల్లో ఉంటున్నారు. ‘క్రానిక్‌ పావర్టీ రీసెర్చ్‌ సెంటర్‌’ పత్రాల ప్రకారం దేశం లోని పేదల్లో 50శాతం ‘శాశ్వత పేదరిక’ పరిధి లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎస్టీల్లో పేదరికం తగ్గుదల మిగిలినవారికన్నా తక్కువ. 1993-94,2004-05 సంవత్సరాలనాటి అంచ నాల ప్రకారం దేశవ్యాప్తంగా పేదరికం 37శాతం నుంచి 27శాతానికి దిగివస్తే, ఎస్టీల్లో మాత్రం 51.9 శాతం నుంచి 47.3 శాతానికే తగ్గింది. దీన్నిబట్టి పేదరిక నిర్మూలన పథకాలు వీరికి చేర వేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అవ గతమవుతోంది.పేదల స్థితిగతులు ఇలాఉంటే, దేశంలో సంపన్నులు మరింత కుబేరులవుతు న్నారు. 2018లో కేవలం ఒక శాతం ధనవంతుల సంపద 39శాతం అధికమైతే, అట్టడుగున ఉన్న సగం జనాభా సంపద మూడు శాతమే పెరిగింది. దేశంలో సగానికిపైగా సంపద కేవలం ఒక శాతం సంపన్నుల చేతుల్లోనే ఉంది. పదేళ్లపాటు జీడీపీలో తొమ్మిది శాతం వృద్ధి సాధ్యపడితే ప్రగతిఫలాలు అట్టడుగు స్థాయికి చేరి పేదరికం నిర్మూలన సాధ్య పడుతుందన్న అంచనాలు గురితప్పాయి. గ్రామీణ పేదరికానికి పగ్గాలు వేయగల వ్యవసాయానికి సరైన గిట్టుబాటు దక్కకపోవడం శాపమవుతోంది. గ్రామాల్లో జీవన ప్రమాణాలు క్షీణిస్తుంటే, పట్టణా ల్లో అవి పెరుగుతున్నాయి.
లోపాలను అరికట్టితే చాలు
భారతీయులెవరూ ఖాళీ కడుపులతో నిద్రపోకుండా చూడటమే దేశ స్వాతంత్య్ర పరమార్థమని మహాత్మా గాంధీ చెప్పారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆయన లక్షిం చారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ సైతం రాజకీ య స్వాతంత్య్రాన్ని మాత్రమే సాధించుకున్నామని అప్పట్లో అన్నారు. సాంఘిక, ఆర్థిక స్వాతంత్య్ర సాధన తదుపరి లక్ష్యాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక, ఆర్థికన్యాయం ప్రాతిపదికన సామాజిక వ్యవస్థ నిర్మాణం రాజ్యాంగ నిర్మాతల ఆశయం. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నేటికీ లక్ష్య సాధనకు దూరంగా ఉండటం మన వ్యవస్థల వైఫ ల్యాలనే చాటుతోంది. పన్నెండు పంచవర్ష ప్రణా ళికలు, మూడు వార్షిక ప్రణాళికలు కాలగర్భంలో కలిసిపోయినా,భారత్‌ ఇంకా దిగువ మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనుగడ సాగి స్తోంది. దేశంలో క్రమేపి పేదరికం తగ్గు ముఖం పడుతోందని చెబుతున్నా, ప్రభుత్వ సంక్షేమ పథ కాల అర్హుల సంఖ్య ఏటాపెరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు పేదలను దారిద్య్ర రేఖ దిగువ నుంచి వెలు పలికి తీసుకురావాలి. పథకాల అమలులో లోపా లను అరికట్టి అర్హులకే లబ్ధి నేరుగా చేరేలా జాగ్రత్త లు తీసుకోవాలి. సంక్షేమ ఫలాలను పేదలు సద్వి నియోగం చేసుకునేలా చైతన్యపరచాలి. తద్వారా పేదరికం కోరల నుంచి వారు బయటపడేలా చేయాలి.- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు

శిశు మరణాల్ని తగ్గిద్దాం భవిష్యత్తరాన్ని కాపాడుదాం

పోషకాహార లోపం.. మూఢ నమ్మకాలు.. సామాజిక..ఆర్థిక కారణాలరీత్యా ప్రతి ఏటా అనేక మంది శిశువులు మరణిస్తున్నారు. వైద్య రంగంలో నేడు ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. శిశువులకు సంబంధించిన వైద్య సేవలు ఎన్నో విస్తరిం చాయి.వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా నేటి కీ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాం తాల్లోని ప్రజల్లో మూఢ నమ్మకాలు పెరిగి పోవ డం..ఆకారణంగా ప్రతి ఏటాలక్షల సంఖ్యలో శిశు మరణాలు జరగడం విచారించదగిన అంశం. శిశు మరణాల రేటు తగ్గించేందుకుగాను ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబరు 7వతేదీన ‘శిశు రక్షణ దినోత్సవం’ నిర్వహి స్తున్నారు. అయితే కేవలం ఆ ఒక్కరోజున మాత్రమే వివిధ కార్యక్రమాలను నిర్వహించడం కాదు..నిరంతరం శిశు రక్షణా కార్యక్రమాలను చేయడం వలన ప్రజల్లో అవగాహన పెరిగి,శిశు మరణాల రేటును తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..
నేటికీ మూఢ నమ్మకాలతో గోల్డెన్‌ అవ ర్‌లో వైద్యం అందక, శిశువుల మరణాలు సంభవి స్తున్నాయి.అవిద్య,పేదరికం కూడా ఇందుకు ప్రధా న కారణంగా ఉంది.ఇదిసామాజికంగా రావాల్సిన చైతన్యం. ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుం టున్న దశలో నేడు మరింతగా మూఢ నమ్మకాలు ప్రబలడం విచారకరం. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిని రూపుమాపే విధంగా, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు ముమ్మరంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శిశువు అంటే..
అప్పుడే పుట్టినప్పటి నుండి మొదటి సంవత్సరం పూర్తయ్యే వరకు శిశువుగా పరిగణిస్తారు. ఈ సంవత్సర కాలంలో శిశువులను జాగ్రత్తగా చూడ టంతో పాటు ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ కల్పించా ల్సిన అవసరం ఉంది. అయితే మన దేశంలోగానీ లేదా ఇతర దేశాలలోగానీ చూస్తే ఎక్కువగా మర ణాలు ఏడాదిలోపు పిల్లల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలల పిల్లల్లో మరీ ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఏడాదిలోపు పిల్లల మరణాలు ఎందుకు సంభవి స్తున్నాయనే విషయాలను తెలుసుకోవాలి. శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ము ఖ్యంగా బిడ్డ పుట్టిన తరువాత మొదటి మూడు నెలలు అభివృద్ధికి కీలక దశ.ఈ సమయంలో వినికిడి, కంటి చూపు, ఆలోచన, స్పందన తదితర విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులతో అవినాభావ సంబంధం ఏర్పడు తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాను కనుక పరిశీలిస్తే 2019లో పుట్టిన శిశువులు మొదటి నెలలోనే 24 లక్షలకు పైగా శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రతిరోజూ ఏడు వేల కంటే ఎక్కువ మంది పిల్లలు మరణిస్తున్నారు. దీనిని నివారించేందుకు కృషి చేయాల్సిన అవసరం అందరిపైనా ఉంది.
కారణాలను పరిశీలిస్తే..
శిశు మరణాలకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. తల్లికి, బిడ్డకు సంబంధించినవి, సామాజిక, ఆర్థికపరమైనవి ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ నాలుగు కారణాల వల్లనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
తల్లికి సంబంధించి..
తల్లికి సంబంధించిన కారణాలను పరిశీలిస్తే చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవడం ప్రధాన కారణంగా ఉంది. వివాహ వయసు రాకుండానే వివాహాలు చేయడం వలన తల్లిలో సక్రమంగా శారీరక ఎదుగుదల ఉండకపోవడం..అలాగే పిల్లల సంరక్షణపైనా ఆమెకు సరైన అవగాహన లేకపో వడం..ప్రధాన కారణాలుగా ఉన్నాయి.అలాగే వివాహం అయిన వెంటనే గర్భం దాల్చడం వలన తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం జరుగుతుంది. శిశు మరణాలను కనుక పరిశీలిస్తే ఎక్కువ మంది బరువు తక్కువగా పుట్టడం వలన మరణిస్తున్నారు. గర్భిణీగా ఉన్న సమయంలో తల్లికి బిపి, షుగరు, గుర్రపువాతం వంటి లక్షణాలు ఉండటం కారణం గా బరువు తక్కువ పిల్లలు పుడుతున్నారు. అలాగే నెలలు నిండకుండానే ఎక్కువ మంది తల్లులు ప్రసవిస్తున్నారు. ఈ కారణాల రీత్యా పిల్లల ప్రాణా లకే ప్రమాదం పొంచి ఉంది. వీటిని నివారించా లంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబం ధించి వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిత్యం పరీక్షలు చేయించుకోవడంతో పాటు..చక్కటి పోషకాహారం తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. అంతకంటే ముఖ్యంగా ఆడపిల్లలకు వివాహ వయ సు వచ్చిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలి. అలా చేయ డం వలన ఆడపిల్లలకు అన్ని రకాలుగా అవగా హన ఉంటుంది. దాని కంటే ముఖ్యంగా శిశు రక్షణ ఎలా చేయాలో తెలుసుకోగలుగుతారు.
బిడ్డకు సంబంధించి..
బిడ్డకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే గర్భంలో ఉన్న బిడ్డ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసు కోక పోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోక పోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. చాలా మంది గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకో వడం లేదు..వీటన్నింటివల్ల పిల్లలు పుట్టిన తరు వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత కంటే ముఖ్యంగా జన్యుపరంగా ఎటువంటి సమ స్యలు వున్నాయో కూడా ముందుగానే తెలుసు కోవాలి.గర్భిణీగా ఉన్న సమయంలోనే బిడ్డ ఎదుగు దల గురించి, బరువు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలు న్నాయేమో గుర్తించేందుకు మూడు సార్లు స్కాన్‌ చేయాల్సి ఉంటుంది.ఒకవేళ అవసరమైతే రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.
సామాజిక కారణాలు..
సామాజిక కారణాలను అనేక విధాలుగా చూడ వచ్చు. నేటికీ మన సమాజంలో ఆడపిల్ల అంటే తక్కువగా చూసేదుస్థితి కనబడుతోంది. దీని నుండి ముందు మనం బయటపడాల్సిన అవసరంఉంది. శిశువు పుట్టగానే అమ్మాయిలు అయితే తక్కువగా చూడటం, అబ్బాయిలు అయితే అల్లారుముద్దుగా పెంచడం కూడా జరుగుతుంది. దీని కారణంగా తొలి రోజుల్లోనే శిశువు ఆరోగ్యం దెబ్బతినే అవకా శం ఉంది. అవిద్య,పేదరికం,సరైన సమయంలో ఇబ్బందులను గుర్తించకపోవడం,సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లలేకపోవడం వలన కూడా శిశు మరణాలు సంభవిస్తున్నాయి.
మూఢ నమ్మకాలు..
మూఢ నమ్మకాలు శిశు మరణాలకు ప్రధాన కార ణాలుగా చెప్పవచ్చు.సాధారణంగా శిశువు జన్మిం చగానే తల్లిపాలు పట్టించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది నేటికీ తేనె,పంచదార నీళ్లు పట్టిం చడం,కొన్నిచోట్ల గోమూత్రం పట్టించడం వంటివి చేస్తున్నారు.వీటి కారణంగా శిశువుల్లో అనేక రకా లైన‘ఇన్ఫెక్షన్లు’వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యం గా పిల్లల్లో విరేచనాలు అవుతుంటే అనాస పేరుతో నాటు వైద్యాలకు వెళుతున్నారు. ఇటీవలే విజయ వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇలాగే జరిగి, చివరకు శిశువు పరిస్థితి ప్రాణాంతకం కావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎట్టి పరిస్థితులలోనూ శిశువులకు నాటు వైద్యం మంచిది కాదు.ఈ విధం గా అనేక మూఢ నమ్మకాల వలన ‘గోల్డెన్‌ అవర్‌’ లో శిశువులకు వైద్యం అందడం లేదు. ఫలితంగా పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల నాటు వైద్యం, నమ్మకాలు పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. వైద్య రంగం అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు, విశ్వాసాలు కూడా అంతకం తకు పెరగడం విచారించాల్సిన విషయం. పురోగ మించాల్సిన దశలో ఈ తిరోగమన భావాలు శిశువుల ప్రాణాలను హరిస్తున్నాయన్న వాస్తవాన్ని ప్రజ లకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతై నా ఉంది. అంతకంటే ముఖ్యంగా శిశువుకు ఎటు వంటి సమస్య వచ్చినా తక్షణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు గానీ లేదా సమీపంలోని ఆసుపత్రికి గానీ తీసుకువెళ్లాలి.కచ్చితంగా శిశువుకు వైద్య సేవలను అందించాల్సిన అవసరం ఉంది.
స్నానం జాగ్రత్తలు..
శిశువుకు స్నానం చేయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.శిశువు టబ్‌లో ఉన్నప్పుడు మీ చేతికి అందేంత దూరంలో ఉండేలా చూసు కోవాలి.టబ్‌లో కొన్ని అంగుళాల వెచ్చగా ఉన్న నీటితో నింపాలి. నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు.
వ్యాక్సినేషన్‌..
మొదటి సంవత్సరం పూర్తయ్యే వరకూ శిశువులకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్స్‌ వేయించాలి.సూది ఇవ్వడం వలన జ్వరం వస్తుందని..లేదా ఇతరత్రా సమస్యలు వస్తాయనే మూఢ నమ్మకాలు ఇంకా బలంగా ఉన్నాయి.దీనివల్లే గ్రామీణ,ఏజెన్సీ ప్రాం తాలలో వ్యాక్సినేషన్‌ వేయించడానికి వెనకాడు తున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా అక్కడక్కడా కొంత మంది కుటుంబ పెద్దల అవగాహన లేని మాటల కారణంగా వ్యాక్సినేషన్‌ వేయించడం లేదు. కానీ మొదటి ఏడాదిలోపు క్యాలెండర్‌ ప్రకా రం కచ్చితమైన వ్యాక్సినేషన్‌ శిశువులకు అందిం చాల్సిన అవసరం ఉంది. ఇది బిడ్డకు రక్షణగా నిలుస్తుంది.ఆవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
ఆర్థిక కారణాలు..
సమాజంలో నేటికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి చాలా మంది వెనకాడుతున్నారు. ప్రస్తుతం ప్రయి వేటు,కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయిం చుకునే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా కొంతమంది వైద్యం చేయించు కునే అవకా శం కోల్పోతున్నారు.గిరిజన,మారుమూల ప్రాంతా లలో ‘రవాణా’ వ్యవస్థ అందుబాటులో లేక వైద్యం పూర్తిస్థాయిలో అందడం లేదు.వీరికి పట్టణ ప్రాం తాలకు వచ్చి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత ఉండటం లేదు.ఈ కారణంగా గ్రామీణ ప్రాంతా లలో నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.అయితే కొన్నిచోట్ల ఇంటి వద్దనే కాన్పు చేయిస్తున్నారు. అలా చేయడం వలన తల్లికి,బిడ్డకు కూడా ప్రమా దం కలిగే అవకాశం ఉంది.కాబట్టి కచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలోనే కాన్పు జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుప త్రులలో కూడా మెరుగైన వైద్య సేవలు,తగిన వైద్య పరికరాలు ఉండేలా చూడటం,ప్రజలకు అవగా హన కల్పింవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.
తల్లిపాలే బిడ్డకు రక్ష ..
బిడ్డకు తల్లిపాలేరక్ష.అసలైన పోహాకాహారం, ఆరో గ్యాన్నిచ్చేది తల్లిపాలే.కానీ నేటి సామాజిక పరిస్థి తులు,తల్లులు ఉద్యోగరీత్యా,కొన్ని అనారోగ్య కార ణాల వలన..మరికొందరు తమ అందం పోతుం దనే భయంతో బిడ్డకు పాలివ్వని పరిస్థితు లున్నాయి. శిశువులకు తల్లిపాలు జీవితాంతం రక్షణనిస్తాయి.ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా తల్లిపాలే బిడ్డను కాపాడేది.తల్లిపాలను బిడ్డకు ఆరు నెలలు కచ్చితంగా ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వకపో వడం వలన రోగనిరోధక శక్తి లేక బిడ్డకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తల్లిపాలు తప్పనిసరిగా ఇచ్చేలా కుటుంబం లో అందరూ బాధ్యత తీసుకోవాలి.
అవగాహన పెరగాలి..
శిశు రక్షణపై పూర్తిస్థాయిలో పెద్దఎత్తున అవగా హన పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహిం డంతో పాటు ప్రజలను పిహెచ్‌సి (ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు)కు రప్పించి,వైద్య సేవలు పొందేలా చూడాలి.దీంతో పాటు వైద్య సదుపాయాలు ప్రజల వద్దకే వెళ్లాల్సిన అవసరం ఉంది.ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్‌) ప్రచురించిన‘లెవెల్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ చైల్డ్‌ మోర్టా లిటీ’ రిపోర్ట్‌ 2020 ప్రకారం..భారతదేశంలో నవ జాత శిశు మరణాల రేటు 2006 నుంచి 2019కి సగటున 37నుంచి 22కు తగ్గింది.1990 నుంచి చూస్తే 2019కి 57నుంచి 22కు తగ్గింది. ఇదే పీరియడ్‌లో నవజాత శిశు మరణాల సంఖ్య 15 లక్షల నుంచి 5లక్షలకు తగ్గింది. శాతాలలో చూస్తే, నవజాత శిశుమరణాల రేటు 1990నుంచి 2005కు 39% తగ్గగా,2005 నుంచి 2019కి 41%తగ్గింది.1990 నుంచి 2019కి 60% తగ్గింది. అంటే నవజాత శిశు కేంద్రాలను ఏర్పా టు చేశాక నవజాత శిశుమరణాల రేటు ఎక్కువగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి ఇంటర్‌-ఏజెన్సీ గ్రూప్‌ ఫర్‌ చైల్డ్‌ మోర్టాలిటీ ఎస్టిమేషన్‌ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, నవజాత శిశువులు, ఐదేళ్ల లోపు పిల్లల నివారించగల మరణాలను అంతం చేయడంలో సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డిజి) చేరుకోవడానికి ప్రపంచం గణనీయంగా దూరంగా ఉంది. నివేదిక ప్రకారం 2030 నాటికి 50 కంటే ఎక్కువ దేశాలు ఐదేళ్లలోపు మరణాల లక్ష్యాన్ని చేరుకోలేవు. 60 కంటే ఎక్కువ దేశాలు తక్షణ చర్య లేకుండా నియోనాటల్‌ మరణాల లక్ష్యాన్ని కోల్పోతాయి. ఎస్‌డిజిలు నవజాత శిశువులు,5సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలను నివారించాలని పిలుపు నిచ్చాయి. అన్ని దేశాలు నవజాత శిశు మరణాల రేటు 1,000 సజీవ జననాలకు 12లేదా అంత కంటే తక్కువ మరణాలు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ మరణాల రేటు 25లేదా అంతకంటే తక్కువ మరణాలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.2030 నాటికి1,000 సజీవ జన నాలు.2020లో మాత్రమే ఐదులక్షలకు పైగా పిల్లలు వారి ఐదవ పుట్టినరోజుకు ముందే మరణిం చారు.22 లక్షల మంది పిల్లలు,5నుండి 24 సంవ త్సరాల వయస్సు గల యువకులు మరణించారని ఆ నివేదిక పేర్కొంది.
పిల్లలహక్కులు,శ్రేయస్సు అభివృద్ధి : యునిసెఫ్‌
పిల్లల శ్రేయస్సుపై ఎక్కువ ప్రభావం చూపే ప్రయ త్నాలను ఏకీకృతం చేసే కన్వర్జెంట్‌ సోషల్‌ పాలసీ విధానం,సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేయడం ప్రధానం. దీనిద్వారా సామాజికంగా మెరుగుపర చడం,పర్యావరణాన్ని బలోపేతం చేయడంపై యునిసెఫ్‌ ఎక్కువగా దృష్టి సారిస్తోంది.పిల్లల కోసం ఫలితాలను మెరుగుపరచడంలో కేరళలో వివిధ కార్యక్రమాలతో శిశు మరణాలను తగ్గించ డంలో గత రెండు దశాబ్దాలలో గణనీయమైన పురోగతి సాధించింది. కేరళ ప్రోగ్రామ్‌ ప్రయత్నాల కోసం యునిసెఫ్‌ రాష్ట్ర కార్యాలయం సామాజి కంగా మెరుగుపరచడం, సంఘటిత సామాజిక విధానం, సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ఎక్కువ గా దృష్టి సారిస్తోంది.పిల్లల శ్రేయస్సుకు ఉపయోగ పడేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది.
దేశంలోనే కేరళ ఆదర్శం..
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో కేరళ అగ్రగామిగా ఉంది.అత్యంత అట్టడుగువర్గాల్లోని పిల్లలు, మహిళల కోసం పేదల అనుకూల విధానాలు, సామాజిక రక్షణ కార్య క్రమాలను ప్రారంభించడంలో మనదేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో కేరళ ఒకటి. రాష్ట్రం సామా జిక భద్రతా చర్యలు,ఆరోగ్యం,పోషకాహారం, వాష్‌, విద్యావ్యవస్థల విస్తరణ,ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి ప్రగతిశీల చట్టాలు,పథకాలను ఆ రాష్ట్రం ప్రవేశ పట్టింది.యునిసెఫ్‌,వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యు హెచ్‌ఓ) కేరళను ప్రపంచంలోనే మొట్టమొదటి ’’బేబీ-ఫ్రెండ్లీ స్టేట్‌’’ గా గుర్తించాయి. ఎందుకంటే ఫార్ములాల కంటే తల్లి పాలివ్వడాన్ని సమర్థవం తంగా ప్రోత్సహించింది కేరళ. కేరళలో ప్రసవాలు 95 శాతానికి పైగా ఆసుపత్రిలో జరిగేలా ప్రోత్స హిస్తోంది. దేశంలోనే అతి తక్కువ శిశు మరణాల రేటు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదయింది. మూడవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వైద్య సదుపాయాలలో 100 శాతం జననాలతో ‘ఇన్‌స్టి ట్యూషనల్‌ డెలివరీ’లో కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
దశాబ్దాలుగా ఈ సామాజిక విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. సామాజిక రంగంలో అధిక ప్రభుత్వ పెట్టుబడితో,సమర్థవంతమైన ప్రణా ళికలు రూపొందించింది. పర్యవేక్షణను సులభత రం చేసే బలమైన పరిపాలనా నిర్మాణాలు, వ్యవ స్థలు సమర్థవంతంగా కేరళలో అమలు చేయ బడ్డాయి.ఇది ఆరోగ్యం,పోషణ, విద్యలకు సంబం ధించి పిల్లల శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.శిశు,నవజాత శిశు మరణాలు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలలో మరణాల పెరుగుదల తక్కువగా ఉంది.
-వ్యాసకర్త : ఎం.డి.(పీడియాట్రిక్స్‌), డిసిహెచ్‌.రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, సిద్దార్థ ప్రభుత్వ వైద్యకళాశాల,విజయవాడ-( డాక్టర్‌ ,ఎన్‌.ఎస్‌.విఠల్‌రావు)

బ్రతిక ఉన్నా లేనట్లే..

‘‘ ప్రపంచం ముందుకు వెళ్తోందని, సాంకేతి కతని అందిపుచ్చుకుంటున్నా మని మనమం దరం అనుకుంటాం.కానీ ఇప్పటికీ ఆధార్‌ అంటే ఏంటో తెలియని గిరిజనులు, ఆధార్‌ కార్డ్‌ ప్రయోజనం పొందలేనివారు, తద్వారా పభుత్వ సంక్షేమ పథకాలకు ఆమడ దూరంలో ఉన్నవారు ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారు.అనకాపల్లి, అల్లూరి సీతారామారాజు జిల్లాలో ఆధార్‌ కార్డు,రేషన్‌కార్డు,ఆరోగ్యశ్రీకార్డు లేని గిరిజన కుటుంబాలు అనేకం ఉన్నాయి. చాలా బడిఈడు పిల్లలు ఆధార్‌కార్డులు లేక చదువులకు దూరమవుతున్నారు.’’(గునపర్తి సైమన్‌)

అందరికీ ఆధార్‌ ఓవరం.ఆధార్‌ కార్డ్‌తో అన్ని పథకాలు అందిపుచ్చుకోవచ్చు. కానీగిరిజనులకు మాత్రం అది ఇంకా ఓశాపంగా మారింది.ఉమ్మడి విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నివశించే గిరిజనులు కూడా ఆధార్‌ సౌకర్యానికి దూరంగా ఉంటు న్నారు. చిన్నపిల్లల్ని స్కూల్‌లో వేయాలంటే ఆధార్‌ తప్పనిసరి,రేషన్‌ కార్డ్‌ కావాలంటే ఆధార్‌ ఉండాలి,అనుకోని ప్రమాదం జరిగితే ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి కూడా ఆధారే కీలకం.కానీ ఆధార్‌ గురించి, పథకాల గురించి సరైన అవగాహన లేక గిరిజనులు వీటన్నిటికీ దూరమైపోయారు. వీరితోపాటు సంచార జాతుల్లో సగటున 50శాతం మంది గిరిజనులకు ఆధార్‌ కార్డ్‌ అంటే ఏంటే తెలియదంటే అతిశయోక్తి కాదు.ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు ఎన్ని ఏర్పాటు చేసినా,ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆధార్‌ కార్డు పొందలేని స్థితిలో చాలామంది గిరిజనులు ఉన్నారు.దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ బల్లిపురం అనే ఓగిరిజన గ్రామం.అక్కడ కొండదొర,నూకదొర,భగత్‌, మన్నెదొర తెగలకు చెందిన సుమారు 39మంది కుటుంబాలున్నాయి.మొత్తం జనాభా120మంది.ఈ గ్రామంలో అధికశాతం వలస వచ్చిన గిరిజన జనాభా అధికం.దీంతో సుమారు 25మందికి పైగా ఆధార్‌ కార్డులు, రేషన్‌కార్డులు,ఓటర్‌ ఐడీ కార్డులు లేవు.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వీరంతా ఓటు హక్కు లేక ఓటును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిరది.అల్లూరి జిల్లా బొర్రా,కొయ్యూరు,అనంతగిరి మండ లాల్లోని మారుమూల పంచాయితీల నుంచి దశాబ్దాల క్రితం మైదాన గిరిజన గ్రామా లకు వలస వచ్చి కూలీ పనులకు వెళ్లే గిరిజన కుటుంబాలకు ఆధార్‌కార్డులుగానీ, రేషన్‌కార్డులుగానీ లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఆఖరికి వారికి పుట్టిన బడిఈడు పిల్లలు చదువుకు సైతం దూరమవుతున్నారు.అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ పరిధిలోగల బల్లిపురం తదితర గిరిజన గ్రామాలు మైదాన ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయి.అల్లూరి జిల్లా నుంచి వలస వచ్చిన అనేక మంది గిరిజనులకు నేటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచు కోలేదు.కనీసం అవ్వతాతలకు, వితంతువు లకు,దివ్యాంగులకు సామాజిక పింఛన్‌ అందని వైనం నెలకొంది.అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట గ్రామానికి చెందిన కర్రిచిలకమ్మకు సామాజిక ఫించన్‌ అందక వృద్దాప్యంతో కొట్టిమిట్టులాడుతున్నారు. కొయ్యూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రా రామచంద్రర్‌కు ఆధారకార్డు లేదు.జీకేవీధి మండలం దమ్మయన్న పల్లి గ్రామపంచాయితీ సింగనపల్లి గ్రామానికి చెందిన వీర్రాజి (11)ఆధార్‌కార్డు లేక చదువుకు దూరంగా ఉన్నారు. పంటపొలాలు,బొగ్గు,ఇటుకల బట్టీల వద్ద ఏడాదిలో తొమ్మిది నెలలు జీవనం సాగించే ఎస్టీలకు ఎలాంటి ధ్రృపత్రాలు లేకపోవడంతో ఆధార్‌ నమోదుకు అర్హత కోల్పోతున్నారు. ఆర్డీవో కార్యాలయం జారీ చేసిన జనన ధ్రువపత్రం కావాలని ఆధార్‌ కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో నిరుత్సాహంతో వెనుదిరుగు తున్నారు.ఇళ్లు,పొలాల్లో పురుడు పోసుకున్న చిన్నారుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయని కారణంగా పంచాయితీ కార్యాల యాల్లో జనన ధ్రువీకరణ పత్రాలు అందడం లేదు.దీంతో వారికి ఆధార్‌కార్డులు జారీ చేయడం లేదు.ఆధార్‌ కార్డు లేని కారణంగా వీరికి రేషను,ఓటరుకార్డులు లేవు.పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టిన ఏ సంక్షేమ పథకాలు వీరిదరి చేరడం లేదు. వృద్దులు,వితంతువులు,దివ్యాంగులు ఉన్నా పింఛను ఇతర సౌకర్యాలు అందడం లేదు. బడిలో పేరు నమోదు చేయాలన్నా ఆధార్‌ తప్పని సరి కావడంతో పిల్లలు చేరలేని పరిస్థితి నెలకొంది.ఎస్టీ కార్పొరేషన్‌ అంచనాల ప్రకారం జిల్లాలో అయిదువేల మందికిపైగా ఆధార్‌ కార్డు లేని గిరిజనులు ఉన్నాట్లు అంచనా.గతంలో ఐటీడీఏ ద్వారా గిరిజనులకు నమోదు కార్యక్రమం జరిగేది.ప్రస్తుతం ఆవిధానం నిలిపివేయడంతో ఇటీవల జన్మించిన పిల్లలు,ఇంకా ఆధార్‌ తీసుకోని వారు అవస్థలు పడుతున్నారు.అంగన్‌వాడీలో పోషణ,ఉచిత బియ్యం,ప్రబుత్వ ప్రయోజనాలు కోల్పోతున్నారు.అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో సుమారు 105మంది ఆధార్‌ లేనివారినిఅధికారులు గుర్తించారు. వీరిలో బల్లిపురంలో సుమారు 70మంది పాఠశాల విద్యార్థులు ఉండగా,50మందికిపైగా చిన్నారులు ఉన్నారు.వలస పనులకు వెళ్లేన గిరిజనులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే..కనీసం ప్రభుత్వ బీమా సొమ్ము కూడా వారికి రాదు.ఎందుకంటే వారికి ఆధార్‌ లేదు.దీంతో ఆరోగ్యశ్రీకార్డు,రేషన్‌ కార్డులు కూడా లేని పరిస్ధితి నెలకొంది. చాలామంది గిరిజనులు అసంఘటిత రంగంలో కార్మికు లుగా పనిచేస్తున్నారు.వీరంతా ఏదైనా ప్రమాదానికి గురైనా ఇచ్చే బీమాకు వారు అనర్హులు మారుతున్నారు.ఎలాంటి పత్రాలు లేకపోయినా,వారివద్ద వివరాలు సరిగా ఉంటే.. అక్కడికక్కడే ఆధార్‌ నమోదు చేసుకుంటారు.
పింఛన్‌ లేదు..
మాది బల్లిపురం గిరిజన గ్రామం. పదిహేనేళ్లక్రితం బొర్రా పంచాయితీ నుంచి బల్లిపురం వలస వచ్చేశాం. ఇప్పుడు నాకు 65సంత్స రాలు.ఆధార్‌కార్డు గానీ,రేషన్‌కార్డు కానీ లేదు. భర్త చనిపోయి పదేళ్లువుతుంది. అప్పటి నుంచి ఆధార్‌కార్డు లేక పింఛన్‌ ఇవ్వలేదు.ఆరోగ్యశ్రీ కార్డు లేక ముగ్గురు కొడుకులను అనారోగ్యం తో బాధపడుతూ మృత్యువాత పడ్డారు.వారికి పుట్టిన ఒక మగబడ్డ (15వయస్సు)ఆధార్‌కార్డు లేక చదవించలేకపోయాను.
తమ గ్రామంలో ఆధార్‌కార్డులు,రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు చాలామందికి లేవని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. సుమారు ఊరులో సగానికిపైగా కుటుం బాలకు ఆధార్‌కార్డులు లేవు.దీనివల్ల చాలా మంది బడిఈడు పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా అధికారులకు తమ గోడును చెప్పుకున్నా పట్టించుకునే నాధుడు కరవయ్యారు.`ఆగారి బంగారుబాబు,బల్లిపురం గ్రామ పంచాయితీ సభ్యుడు

వర్గీకరణ సమస్య..

సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ సమ స్యపై మరోసారి వాదోపవాదాలకు తెరతీ సింది. వర్గీకరణ రాజ్యాంగ బద్దమేనని, రాష్ట్రా లు నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం అడ్డు కాదని కోర్టు మెజారిటీ తీర్పు నిచ్చింది. ఏడుగురి ధర్మాసనంలో ఒక్కరు మాత్రమే ఈ అభిప్రాయంతో విబేధించారు. ఈ సందర్భం లోనే ధర్మాసనంలోని నలుగురు న్యాయవ ుూర్తులు ‘క్రీమీ లేయర్‌’ను కూడా ప్రవేశ పెట్టడం మంచిదని విడివిడి తీర్పుల్లో పేర్కొ న్నారు. ప్రధాన న్యాయ మూర్తి, మరొకరు మాత్రం ఈ విషయంపై మౌనం వహించారు. మొత్తంమీద సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా లేవనెత్తబడిన రాజ్యాంగ పరమైన అభ్యంతరాలపై స్పష్టమైన తీర్పునిచ్చింది. వర్గీకరణ చెయ్యాలా..? వద్దా…? అన్న నిర్ణ యాన్ని రాష్ట్రాలకు వదిలివేసింది. కోర్టుకు వచ్చిన వ్యాజ్యం రాష్ట్రాలకు సంబంధించిన విషయం అయినప్పటికీ తీర్పు కేంద్రానికి కూడా వర్తిస్తుంది.-బి.వి.రాఘవులు
గతంలో కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ సమస్య ముందుకొచ్చినప్పుడు సిపియం వర్గీకరణను సమర్థించింది. ఎస్సీల్లోనే వివిధ ఉపకులాల మధ్య విద్యా,ఉద్యోగాలలో కొట్టొచ్చినట్లు వ్యత్యాసాలు వున్నాయని అధ్యయన కమిటీలు స్పష్టమైన వివరాలు/ డేటాపై ఆధారపడి సమర్పించిన నివేదికల ఆధారంగా నిర్ధారించినప్పుడు సిపియం వర్గీకరణకు సానుకూలత ప్రకటించింది.
తీర్పు నేపథ్యం-కొన్ని అంశాలు
పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తమ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎస్సీ తరగతిలో వర్గీకరణ చెయ్యడానికి నిర్ణయాలు తీసుకున్నాయి. ఒక్క తమిళనాడులో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కోర్టు తీర్పుల మూలంగా ఈ నిర్ణయాలు అమలులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వచ్చిన వాజ్యంపై వర్గీకరణ రాజ్యాంగబద్దం కాదని సుప్రీం కోర్టు 2005లో తీర్పునిచ్చింది.ఈ తీర్పును సవాలు చేస్తూ వచ్చిన అనేక పిటిషన్లన్నింటిని కలిపి విచారించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం 2024 ఆగష్టు 1వ తేదీన తన తీర్పును వెలువరించింది. తీర్పులో వివాదాస్పదంగా మారిన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం.
రాజ్యాంగంలో 341 అధికరణం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేయడానికి అనుమతించదన్న వాదనను కోర్టు తిరస్కరించింది.ఎస్సీ,ఎస్టీ జాబితాలపై నిర్ణయించే హక్కు పార్లమెంటుదై నందున వర్గీకరణ అంశం కూడా పార్లమెంటు పరిధిలోనిదని,ఇందులో రాష్ట్రాలజోక్యానికి తావు లేదన్న వాదనను తిరస్కరిస్తూ, తమ పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. వర్గీకరణ చేసే హక్కు పార్లమెంటుదా,రాష్ట్రాలదా అనే అంశంకన్నా, అసలు వర్గీకరణ చెయ్యడం అవసరమా లేదా అన్నది ముఖ్యం.ఈ అంశంపై స్పష్టత వస్తే ఎక్కడి నుండి ప్రారంభించడం బాగుంటుందన్న అంశం క్ఱేవలం సాంకేతిక,ఆచరణాత్మక సమస్య అవుతుంది.
వర్గీకరణ చట్టబద్దమా కాదా అన్న అంశాన్నే కాకుండా సమానత్వం సాధించడం అన్న కోణంలో కూడా వర్గీకరణ సమంజసమేనని కోర్టు అభిప్రాయపడిరది. ఎస్సీ తరగతి అస్పృశ్యత ‘అంటరానితనం’ గురయ్యే కులాల బృందంగా ఏర్పడినందున అది ఒక ‘ఏకఖండ’ (హోమోజీనియస్‌) బృందం,అందువలన దాన్ని విడదీయడం సమంజసం కాదన్న వాదనను కోర్టు తిరస్కరించింది. అస్పృ శ్యతకు ఎస్సీ తరగతిలో ఉన్న ఉపకులాన్ని గురవుతున్నా వాటి మధ్య అన్ని విషయాలలో ఏకరూపత లేదు. సామాజిక,ఆర్థిక,విద్యావిషయాలలో వ్యత్యా సం వుందని, హెటటిరో జీనియస్‌ బృంద మని కోర్టు భావించింది.ఈ వ్యత్యాసాలను అధిగ మించ డానికి వర్గీకరణ సమంజసమేనని కోర్టు చెప్పింది.
విమర్శలు-ఆక్షేపణలు
ఈఅంశంపై కోర్టు సరైన సమాచా రం/ డేటా లేకుండానే నిర్ధారణ చేసిందని ఆక్షేపణ లు వచ్చాయి. ఈ విమర్శలో పసలేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నియమించిన అధ్యయన కమిషన్ల రిపోర్టులు అంతర్గతంగా ఎస్సీ ఉప కులాల మధ్య వున్న వ్యత్యాసాలను బహిర్గతం చేశాయి. 2011 జనరల్‌ సెన్సెస్‌లో ఎస్సీ ఉపకులాలపై ఉన్న సమా చారాన్ని పరిశీలించినా వ్యత్యాసాలపై నిర్ద్వం ద్వమైన సమాచారం దొరుకుతుంది. కొంత మంది వ్యత్యాసాలున్నాయని అంగీకరిస్తూనే, ఎస్సీలలో వెనకబడిన ఉపకులాలు, ముందంజలో ఉన్న కులా లతో పోటీ పడగల స్థాయికి రావడానికి అవసర మైన ప్రత్యేక సదుపాయాలను అదనంగా కేంద్రం, రాష్ట్రాలు కల్పిస్తే సరిపోతుందని వర్గీకరణ అవస రం లేదని అంటున్నారు. ఈసూచనలో అభ్యం తరం పెట్టాల్సిందేమీ లేదు కానీ ఇది వర్గీకరణకు ప్రత్యామ్నాయం కాదు. దానికి జత చేయాల్సింది మాత్రమే. వర్గీకరణ అనేది రిజర్వేషన్‌ హక్కులో భాగంగా వుంటుంది. వర్గీకరణ వలన లాభం ఏ కొద్దిపాటిదైనా, తక్షణం అందుబాటులోకి వస్తుంది. సదుపాయాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంటాయి.
‘వర్గీకరణ’రిజర్వేషన్ల వ్యవస్థను ఉని కిలోకి తెచ్చిన మౌలిక భావనకు భంగం కల్గిస్తుం దని గతం నుండి వస్తున్న విమర్శ.ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా వస్తున్నది.అణచివేత, అస్పృ శ్యత వంటి సామాజిక అంశాలు రిజర్వేషన్ల వ్యవస్థ ఉనికికి ప్రాతిపదిక అని ఇప్పుడు కోర్టు వెనకబాటు తనం, తగ్గిన ప్రాతినిథ్యం వంటి అంశాలను ప్రవేశ పెట్టి రిజర్వేషన్‌కున్న ప్రాతిపదికను బలహీనం చేస్తు న్నదని ఈవిమర్శ సారాంశం.
ఈవిమర్శకు తగిన ప్రాతిపదిక వుం దని అను కోలేం.ఎస్సీలలో అంతర్గత వ్యత్యాసా లను అధిగ మించేందుకు ముందుకు వచ్చిన అంశాన్ని రిజర్వే షన్ల మౌలిక భావనకు వ్యతిరేకం అని భావించ డానికి ఆస్కారం లేదు. మన దేశం లో రిజర్వేషన్ల చారిత్రక నేపథ్యం, అస్పృశ్యత లేని తరగతులకు కూడా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిం చిన తీరును పరిశీలిస్తే, రిజర్వేషన్లను, ప్రాతినిధ్యా లకు ఏదో ఒక్కఅంశం ప్రాతిపదికగా వున్నది అనుకో వడం సాధ్యంకాదు.సామాజిక అణచి వేత, అస్పృశ్యతలను నేరాలుగా రాజ్యాంగం ప్రకటిం చింది.వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చట్టా లు కూడా తెచ్చాయి. అవి అధ్వాన్నంగా అమలు చేయబడుతు న్నాయనేది వేరే విషయం.అయితే సామాజిక బలహీనత అధిగమించడానికి చట్టాలే సరిపోవని,విద్య,ఆర్థిక,రాజకీయ సాధికారతలను కూడా ఇవ్వడం అవసరమని భావించే,విద్య, ఉపాధి,రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించ బడ్డాయి.
జనరల్‌ కోటాకు మళ్లింపు-బ్యాక్‌లాగ్‌ విధానం
వర్గీకరణ మూలంగా నిండని ఖాళీల సంఖ్య పెరు గుతుందని,వాటిని జనరల్‌ కోటాలోకి మళ్ళించడం ద్వారా ఎస్సీలకు అన్యాయం జరుగు తుందని కొందరు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నిండని ఖాళీలను జనరల్‌ కోటాలోకి మార్చాలన్న ప్రయత్నం వర్గీకరణ అంశంతో ముడిపెట్టడం సరికాదు. జనరల్‌ కోటాలోకి మార్చాలనే ప్రయ త్నాలు వర్గీకరణ అంశం చర్చకు రాకముందు నుండి జరుగుతున్నాయి.వీటికి వ్యతిరేకంగా జరి గిన ఉద్యమాల మూలంగానే ‘బ్యాక్‌లాగ్‌’ అన్న పద్ధతి ప్రవేశ పెట్టబడిరది.అయినా ఇప్పటికీ ఇటు వంటి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. ఈమధ్య యుజిసి రిజర్వుడ్‌ ఖాళీలను జనరల్‌ కోటాలోకి ఎటువంటి పరిస్థితుల్లో మార్చవచ్చో వివరిస్తూ మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదిం చింది.తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హడా వుడిగా ఉపసంహరించుకుంది. ఇటువంటి ప్రయ త్నాలను అడ్డుకోవడం తప్ప ఈఅంశాన్ని వర్గీకర ణతో ముడిపెట్టడం తప్పు. అలాగే వర్గీకరణ అనేది ఎస్సీ తరగతి అంతర్గత అంశం: ఉన్న కోటాలో ఉప విభజన. అందువలన ఒక బృందంగా చూసి నప్పుడు ఎస్సీ తరగతిగా నష్టపోయేది వుండదు. ఒక ఉపతరగతిలో ఖాళీ మిగిలిపోతే ఇంకో తరగ తిలో అర్హులైన వారితో నింపవచ్చు. అన్ని ఉప తరగతుల నుండి కూడా భర్తీ కాకపోతే బ్యాక్‌ లాగ్‌లో పెట్టవచ్చు. ఈ పద్ధతి వలన కోటా ఎస్సీ తరగతి దాటి బయటకు పోవడం వుండదు. రాష్ట్రా లు గానీ కేంద్రంగానీ వర్గీకరణ తీసుకువస్తే ఎస్సీ కోటా బయటకు పోకుండా రాజ్యాంగ, చట్టబ ద్దమైన ఏర్పాటు చేసేట్లుగా చూడాలి.
అభివృద్ధిలో వ్యత్యాసాలు-పరిష్కార మార్గాలు
వర్గీకరణకు మరికొన్ని అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. వర్గీకరణ దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని వీటిలో ఒకటి.వాస్తవం ఏమంటే ఎస్సీల్లోని వివిధ ఉపకులాల మధ్య పెరు గుతున్న వ్యత్యాసాలే వర్గీకరణ డిమాండ్‌కు దారితీ శాయి.వ్యత్యాసాలను అధిగమించే చర్యలను సమ ర్థించడమే ఐక్యతకు మార్గం తప్ప,వాటిని వ్యతిరే కించడం కాదు.దీని ద్వారా వ్యత్యాసాల పేరుతో అనైక్యతను సృష్టించేవారి ఆటలు కట్టించడం సులభం. అలాగే బూర్జువా రాజకీయ పార్టీలు వర్గీకరణ అంశాన్ని తమ స్వార్థపూరిత ప్రయోజనా లకు ఉపయోగించు కొంటున్నాయనేది మరో విమర్శ. ఓట్లకోసం ఒకసామాజిక తరగతిని ఇం కొక సామాజిక తరగతికి వ్యతిరేకంగా రెచ్చ గొట్టడం, సమీకరించడం బూర్జువా పార్టీలు ఒక శాస్త్రంగా మార్చివేశాయనేది నిజం.ఈ కుటిల ప్రక్రియ ప్రయోగంలో బిజెపి అన్నిటికన్నా ముం దున్నది. ఎస్సీల మధ్య ఉన్న అభివృద్ధి వ్యత్యాసా లను గుర్తించి, పరిష్కార మార్గాలను కనుగొనడం ద్వారా మాత్రమే బూర్జువా పార్టీల అనైక్యత సృష్టిం చే ఎత్తుగడలను తిప్పికొట్టగలం.
వర్గీకరణ సర్వరోగ నివారిణి కాదు
సుప్రీం కోర్టు వర్గీకరణకు అనుకూ లంగా తీర్పిచ్చింది కాబట్టి ఇక ఎస్సీల్లోని వెనకబ డిన ఉపకులాల సమస్యలన్నిటికి పరిష్కారం దొరికి పోయిందని ఎవరైనా భావిస్తే వారికి నిరాశే ఎదుర వుతుంది.అలా చూస్తే రిజర్వేషన్లే సామాజిక అణ చివేతను,దళితుల వెనకబాటు పరిస్థితిని పరిష్కరిం చలేదు.సరళీకరణ విధానాలొచ్చిన తర్వాత (బూర్జు వా పార్టీలన్నీ వీటిని అమలు చేస్తున్నాయి) రిజర్వే షన్లు ఇంకా నామమాత్రం అవుతున్నాయి.ఈ స్థితిలో వర్గీకరణ పెద్ద మార్పు సాధిస్తుందని అను కోరాదు.ఎస్సీలలోని కొన్ని తరగతులలో అసం తృప్తి కారణమవుతున్న ఒక అంశానికి తక్షణ పరి ష్కారం చూపించడం ద్వారా ఐక్యతను పెంపొం దించడం జరిగితే, అదే మనం ఆశించ గల పెద్ద లాభం.అసలైన పరిష్కారం వెనకబాటుకు కారణ మైన మౌలికఅంశాలను పరిష్కరించడంలోఉంది. ఇప్పటికీ దళితులను అట్టడుగు స్థాయికి కట్టిపడ వేస్తున్న భూసంబంధాలను బద్దలుకొట్టాలి.భూ పంపిణీ జరగాలి.నాణ్యమైన విద్య,వైద్యం,ఉద్యో గం,ఆహారం,ఆవాసం హక్కులుగా మారాలి. ప్రయి వేటు రంగంలో రిజర్వేషన్లు రావాలి. వీటిని సాధిం చుకుంటేనే దళితులకు, ఇతర బలహీన వర్గాలకు రిజర్వేషన్ల పరిమితులను దాటి తమ వెనకబాటు తనాన్ని అధిగమించేందుకు సత్తా వస్తుంది.
క్రీమీ లేయర్‌ అవసరం లేదు
సుప్రీం కోర్టు తను పరిష్కరించాల్సిన ‘వర్గీకరణ’ వివాదంపై తీర్పు చెబుతూనే ‘క్రీమీ లేయర్‌’పై కూడా వ్యాఖ్యలను చేసింది. నలుగురు న్యాయమూర్తులు ‘క్రీమీ లేయర్‌’ను ఎస్సీ, ఎస్టీలకు కూడా అనువర్తింప చేయాలని అభిప్రాయపడ్డారు. ఇది అమలు చేయాల్సిన తీర్పులో భాగం కాకపో యినా, వివాదాస్పద అంశం. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీ లేయర్‌ వుండకూడదని సిపియం అభి ప్రాయం. చారిత్రకంగా ఎటువంటి ఆస్తిపాస్తులు కల్గివుం డడానికి నోచుకోని ఎస్సీలలో ఇప్పటికీ స్థిరమైన ఆస్తిపాస్తులు కల్గిన స్పష్టమైన ఒక తరగతి ఏర్పడ లేదు.కొద్దిమంది రాజకీయ నాయకులను, ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులను, కొద్ది మంది పరిశ్రమల యజమానుల పేర్లను చూపించి క్రీమీ లేయర్‌ను ప్రతిపాదించడం న్యాయం కాదు. ఈ కుటుంబాల చేతిలో తగినంత సంపద పోగుబడిరదని, వారి సామాజిక హోదా పెరిగిందని,అటువంటి కుటుంబాల సంఖ్య తగినంత మోతాదులో వుందని మాట వరసకు అంగీకరించినా వాటి సంపద, సామాజిక హోదా తర్వాతి తరాలకు పాస్‌ఆన్‌ అవుతుందన్న పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఎస్సీ తరగతిలో క్రీమీ లేయర్‌ గురించి ఇప్పుడు చర్చిం చడం అసందర్భం.
20 ఏండ్లుగా సుప్రీంకోర్టులో నాను తున్న కేసులో తమ అభీష్టం మేరకు తీర్పు రావ డంతో మాదిగల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్ని కల సమయంలో మందకృష్ణ మాదిగ ప్రధాని మోదీ తో కలిసిపోవడాన్ని విమర్శించిన వారున్నారు. పార్టీ విధానాలపరంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న మాదిగ కులస్థుల వర్గం మంద కృష్ణ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుపట్టింది. సొంత భావజాల పరంగా చూస్తే వ్యక్తిగా మంద కృష్ణ కూడా ప్రధాని మోదీ శరణులోకి వెళ్లడం విచిత్రమే. కోర్టులో కేసు కదలడానికి, అనుకూల తీర్పునకు ఇదే అదనుగా భావించిన మంద కృష్ణ ప్రధాని ముందు బహిరం గంగా కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్‌తో లొంగ దీసుకున్నాడు.అది బహిరంగ ఎన్నిక ప్రచార వేదిక కాబట్టి వర్గీకరణపై కమిటీ వేస్తామని మోదీ సభా ముఖంగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి శుభకరంగా ఉండటంతో ఈ వర్గీకరణకు కాలం కలిసివచ్చినట్లయింది.మాల, మాదిగ..రెండు కులాలు దళిత జాతివే అయినా రెండిరటి మధ్య సంస్కృతి, సంప్ర దాయాలపరంగా చాలా భేదాలున్నాయి. ఒకరి పిల్లను ఒకరు చేసుకోరు.ఎవరి అయ్యవార్లు వారి కున్నారు. మాదిగల కన్నా మేము గొప్ప అనే భావన మాలల్లో అన్ని విషయాల్లోనూ కనబడుతుంది. రెండు భిన్న కులాల్లో ఉండే సహజ వ్యత్యాసాలుగా వీటిని చూడవచ్చు.ఇదంతా కాలమాన జీవన విధానంలో భాగమే తప్ప కోరి విభేదిస్తున్నది కాదు. అయితే, సంఖ్యాపరంగా ఎక్కువున్న ఈ రెండు ఎస్సీ కులాల మధ్య రాజ్యాంగ ప్రయోజనాలు కూడా సమతూ కంగా ఉండాలని అందరు కోరు కుంటా రు.నిజా నికి ఈ సమస్యను కోర్టులో,ప్రభుత్వాలో తీర్చ వలసిన అవసరం లేదు.అంబేద్కర్‌ ఆలోచనా సా రాన్ని దళితులంతా ఆచరణలో చూపవలసిన బాధ్య త వారిపై ఉన్న ది.రిజర్వేషన్లు ఎస్సీ,ఎస్టీల ఉమ్మడి ఆస్తి.తండ్రి ఆస్తిని పిల్లలు పంచుకునే న్యాయ పద్ధతి ఇక్కడ అవసరం.ఒకే కడుపులో పుట్టిన బిడ్డలు తాము సమానంగా ఎదగాలని, ఆర్థికంగా బలహీనంగాఉన్న తోబుట్టువులకు ఎక్కు వ పాలు ఇవ్వాలని కోరుకుంటారు.పెద్దలు చెప్పిన పంప కాన్ని ఒప్పుకుంటారు.ఆస్తి విషయంలో పిల్లలు గొడవకు దిగితే పోయేది కుటుంబ పరువేననే స్పృహ అవసరం.దాయాదులుగా కాకుండా అన్నద మ్ముల్లా ఆలోచించాలి.మాల,మాదిగలు సామ రస్యంగా తమ వాటాల నిర్ణయాన్ని ప్రభుత్వం ముందుపెడితే ఇంత కాలహరణ జరిగేది కాదు. రిజర్వేషన్లు మనవి, దాని లెక్కలు మనమే తేల్చుకుం దామనే ధోరణి ఇప్పటికైనా అవసరమే. (ప్రజాశక్తి సౌజన్యంతో..) వ్యాసకర్త సిపియం పొలిట్‌ బ్యూరో సభ్యులు

మరో వయనాడ్‌ ఎలా ఆపాలి..?

వయనాడ్‌ ఒక ప్రదేశం మాత్రమే కాదు. పర్యావరణ దుర్ఘటనలకు అదొక ప్రతీక. అటువంటి విపత్తులు మరెన్నో సంభవిం చేందుకు ఆస్కారమున్న పరిస్థితులకూ వయనాడ్‌ ఒక తాజా ప్రతీక.సరిగ్గా నెల రోజుల క్రితం వయనాడ్‌లో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడిన దుస్సంఘటనకు బాధ్యులు ఎవరు? ఎవరి అలక్ష్యం ఆ ఉపద్ర వానికి దారితీసింది? ప్రాణనష్టం, ఆస్తినష్టం హృదయ విదారకంగా వాటిల్లేందుకు కారణ మైన ప్రమాదం అనివార్యమైనది కాదు.నేను నా గత కాలమ్‌లో ఈ అంశాలను చర్చించాను (ఆగస్టు15,‘వయనాడ్‌ విపత్తుకు కారకులు ఎవరు?’).
మన దేశంలో సున్నిత పర్యావరణ ప్రాంతాలు మానవ ఆవాస ప్రదేశాలే గానీ నిర్జన స్థలాలు ఎంత మాత్రం కావు. ఆ ప్రాంతాలను సంరక్షించే విధానాలు సమ్మిళితంగా ఉండి తీరాలి. పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజ లను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. విషాదసీమ వయనాడ్‌ ఘోషిస్తున్న సత్యమది. వయనాడ్‌ విలయం వాటిల్లి నాలుగు వారాలు గడిచిపోయాయి.మనదృష్టి వేరే ప్రదేశాలలో వాటిల్లిన ప్రాకృతిక విధ్వంసాల పైకి మళ్లింది. అక్కడా ఇక్కడా, ఈ ధరిత్రిపై మరెక్కడైనా కొట్టివేయలేని ఒక సుస్థిర సత్యంగా ఉన్న వాతావరణ మార్పు, వయనాడ్‌ వినాశనంలో నిర్వహించిన పాత్రనూ నా గత కాలమ్‌లో వివరించాను. పశ్చిమ కనుమలలోని వయనాడ్‌ ప్రాంతం ఇప్పటికే దుర్బల పర్యావరణ సీమగా మారిపోయింది. విచక్షణారహిత మానవ కార్యకలాపాల మూలంగా వాతావరణ వైపరీత్యం పెచ్చరిల్లడంతో వయనాడ్‌ ఒక విషాద సీమగా పరిణమించింది. అందుకే పర్యావరణ విపత్తులు సంభవించేందుకు ఆస్కారమున్న పరిస్థితులకు వయనాడ్‌ ఒక ప్రతీక అన్నాను. మరి మరో ‘వయనాడ్‌’ సంభవించకుండా ఉండాలంటే మనమేమి చేయాలి?
తొలుత వయనాడ్‌లో అభివృద్ధి కార్యకలాపాలు అమలవుతున్న తీరుతెన్నులను అవగతం చేసుకుందాం.నా సహచరులు రోహిణి కృష్ణమూర్తి, పులాహ రాయ్‌ ఆ‘అభివృద్ధి’ని నిశితంగా పరిశీలించారు.జూలై 29 అర్ధరాత్రి వయనాడ్‌ జిల్లాలో సంభవించిన దుర్ఘటన నివారింప సాధ్యం కానిదని వారి దర్యాప్తులో వెల్లడయింది.భీతి గొల్పుతున్న వాస్తవమది. మరింతగా వివరిస్తాను. వెల్లెరిమల గ్రామ పరిధిలో కొండచరియలు విరిగిపడ్డాయి.సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా కె.కస్తూరి రంగన్‌ కమిటీ నివేదిక (2013)పేర్కొన్న గ్రామాలలో వెల్లెరిమల కూడా ఒకటి. ‘పశ్చిమ కనుమల సమగ్ర సుస్థిరాభివృద్ధికి అనుసరించవలసిన పద్ధతులను’ సిఫారసు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆ కమిటీలో నేనూ ఉన్నాను. గ్రామ వైశాల్యంలో ఇరవై శాతానికి పైగా సున్నిత పర్యావరణ ప్రదేశాలు ఉన్న గ్రామాలు అన్నిటిలోనూ ప్రకృతి వనరులను మరింతగా ధ్వంసం చేసే అభివృద్ధి కార్యక లాపాలపై కఠిన ఆంక్షలు విధించి తీరాలని ఆ కమిటీ సిఫారసు చేసింది.ముఖ్యంగా మైనింగ్‌,క్వారీయింగ్‌ లాంటి విధ్వంస కార్యక లాపాలను అసలు అనుమతించవద్దని కూడా కస్తూరి రంగన్‌ కమిటీ స్పష్టంగా సూచించింది. నవంబర్‌ 2013లో కస్తూరి రంగన్‌ కమిటీ నివేదికను కేంద్రం ఆమోదించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఐదవ సెక్షన్‌ కింద వయనాడ్‌ జిల్లాలో 60,000చదరపు కిలో మీటర్ల సువిశాల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైనదని ప్రకటించింది. మైనింగ్‌,క్వారీయింగ్‌తో సహా ఆప్రాంతంలో నిర్దిష్ట అభివృద్ధి కార్యలాపాలు జరగకూడదని ఆంక్షలు విధించింది.అయితే కేరళ ప్రభుత్వం ఆ సిఫారసులకు ఒక సవరణను కోరింది సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా పేర్కొన్న గ్రామాలలో నిలిపివేయడానికి వీలులేని ఇతర అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగుతున్నందున అటువంటి గ్రామాలను పూర్తిగా సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా ప్రత్యేకించకూడదని తమ సొంత కమిటీ ఒకటి నిర్ధారించిందని, కనుక ఆ గ్రామాలను మాత్రమే పాక్షికంగా సున్నిత పర్యావరణ గ్రామాలుగా ప్రకటిం చాలని కేరళ ప్రభుత్వం అభ్యర్థించింది. కస్తూరి రంగన్‌ కమిటీ సున్నిత పర్యావరణ ప్రాంతా లుగా పేర్కొన్న 13గ్రామాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను పులహరాయ్‌ పరిశీలిం చారు.ఆ13గ్రామాలలోను15క్వారీయింగ్‌ ప్రదేశాలు ఉన్నట్లు వెల్లడయింది. ఒక్క నూల్‌ పూరa్హ గ్రామంలోనే 6 క్వారీయింగ్‌ ప్రదేశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంగా ప్రత్యేకించిన భూములలోనే అవన్నీ ఉన్నాయి. ఈ నియ మోల్లంఘన కథ ఇంకా ఉంది. 2017లో మైనింగ్‌ నిబంధనలను కేరళ ప్రభుత్వం సవరించిందని రోహిణి పరిశోధనలో వెల్లడయింది. ఒక నివాస గృహానికి 50 మీటర్ల ఆవల అటవీ భూములు, కొండ వాలు ప్రాంతాల్లోగానీ ఎక్కడైనా సరే పేలుడు సామగ్రిని ఉపయోగించేందుకు ఆ సవరణలు అనుమతిచ్చాయి.అంటే మీ ఇంటి వెనుక ఉన్న కొండలను అస్థిరపరిచే పరిస్థితులను సృష్టించడం చట్టబద్ధమే అవుతుంద!. ఈపరిస్థితులను నివారించేందుకు మనమేమి చేయాలి అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. పశ్చిమ కనుమల పర్యావరణ రక్షణకు తొలుత మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ సిఫారసులను,ఆ తరువాత కస్తూరి రంగన్‌ కమిటీ సూచనల అమలును సున్నిత పర్యావరణ ప్రాంతాల ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాంతాలలో పర్యటించి నప్పుడు పర్యావరణ పరిరక్షణ చర్యల పట్ల ప్రజల విముఖతను నేను స్వయంగా గమనిం చాను. పరిరక్షణ పద్ధతులు, చర్యలను ప్రజలు వీథులలోకి వచ్చి నిరసిస్తున్నారు. వారు తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారా? వాస్తవమేమిటంటే సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా తమ తోటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని, తాము అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులపై ఆంక్షలు విధించవచ్చని వారు భయపడు తున్నారు. వారి భయాందోళనలకు కారణమేమిటి? పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం, అదీ హేతుబద్ధం కాని నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తుండడమే సుమా! పర్యావరణ పరిరక్షణ విధానాల రూపకల్పనలో మనం ఈ వాస్తవాలను తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణ వ్యవస్థల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను మనం శీఘ్రగతిన మార్చుకోవల్సివుంది. వాతావరణ మార్పు పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది తప్పనిసరి. పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటు న్నందున ప్రకృతి వనరులకు హాని కలిగిస్తున్న సదరు కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు విధించి తీరాలనే భావన ప్రాతిదికన పర్యావరణ పరిరక్షణ విధానాలను రూపొందిస్తున్నారు. ఇది సరైన విషయమే కావచ్చు గానీ మన దేశంలో సున్నిత పర్యావరణ ప్రాంతాలు మానవ ఆవాస ప్రదేశాలే గానీ నిర్జన స్థలాలు ఎంత మాత్రం కావు.. ఇది వాస్తవం. ఆప్రాం తాలు జనవాసాలు మాత్రమే కాదు, వ్యవసాయ భూములకు నెలవులు కూడా. మరి అటువంటి సున్నిత పర్యావరణ ప్రాంతాలను సంరక్షించే విధానాలు సమ్మిళితంగా ఉండి తీరాలి. పర్యావరణ పరిరక్షణలో అక్కడి ప్రజలను సంపూర్ణ భాగస్వాములుగా చేసుకోవాలి. ఇందుకు ఆ ప్రాంతాలలోని సామాజిక సముదాయాలకు ప్రయోజనకరమైన ప్రోత్సాహకాలు సమకూర్చాలి.
కాఫీ,తేయాకు తోటల పెంపకం, పర్యావరణ-పర్యాటకం మొదలైన హరిత జీవనాధారాల ప్రాతిపదికన అభివృద్ధి పథకాలు రూపొందించు కోవడం చాలా చాలా ముఖ్యం. ప్రజల భూములను వారి భాగస్వామ్యంతో సంరక్షిం చడాన్ని మనం నేర్చుకోవాలి. వయనాడ్‌ విపత్తు చెప్పుతున్న సత్యమది. వాతావరణ మార్పు చిక్కులు జటిలమవుతోన్న ఈకాలంలో విషాదసీమ వయనాడ్‌ పాఠాలు స్పష్టంగా ఉన్నాయి. మనం వాటిని నేర్చుకోవాలి. నేర్చుకోవడమంటే పర్యావరణకు అనుసరించే పద్ధతులను మార్చుకోవడమే. పర్యావరణ పరిరక్షణలో గుణప్రదమైన మార్పును సత్వరమే సాధించలేనిపక్షంలో మన మనుగడ శాశ్వతంగా అపాయంలో పడుతుంది.
అదుపులేని వినియోగమే అసలు సమస్య
భారత్‌కు, వచ్చే నెల ప్రత్యేకమైనది. అవును, జూలైలో, జనాభా విషయంలో మనం చైనాను అధిగమించబోతున్నాం.ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధ్రువీకరించింది. ప్రస్తుతం చైనా జనాభా 145కోట్లుగా ఉన్నది.భారత్‌ జనాభా త్వరలోనే ఆ స్థాయికి చేరుకుని, అధిగ మించనున్నది.మరి కొద్ది రోజులలో ఈ మహా మార్పు సంభవించనున్నది. సరే, ప్రపంచ అగ్రగామి కానున్న జన భారతం పర్యావ రణంపై ఎటువంటి ప్రభావాన్ని చూపనున్నది? నేను పదే పదే అడిగే ఈ ప్రశ్నను ఇప్పుడు ప్రత్యేకించి మరీ అడుగుతున్నాను. పెరుగుతున్న జనాభా మనుగడకు మరిన్ని వనరులు అవసరం. జనాభా పెరుగుదల పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని భావించనవసరం లేదు. ఎందుకంటే ఇంచు మించు 37కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికా, రెండున్నర కోట్ల జనాభా మాత్రమే ఉన్న ఆస్ట్రేలియా భారత్‌ కంటే పర్యావరణంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆయా దేశాలు ఉపయోగించుకుంటున్న జీవ వన రులను గణించిన ‘ఎర్త్‌ ఓవర్‌ షూట్‌ డే’ అనే బృందం ఒకటి ఇలా అంచనా వేసింది: ఈ ధరిత్రిపై ఉన్న ప్రతి ఒక్కరూ అమెరికన్‌లా జీవించాలంటే ఐదు భూగోళాలు అవసరమవు తాయి. ఒక ఆస్ట్రేలియన్‌లా జీవించాలంటే 4.5 భూగోళాలు అవసరమవుతాయిబీ ఒక భారతీయుడులా జీవించాలంటే మన భూగోళం లో 0.8శాతం భాగం సరిపోతుంది! తక్కువ జనాభా ఉన్న దేశాలే వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ఉద్గారిస్తూ మానవాళి మనుగడకు ముప్పును ముమ్మరం చేస్తున్నాయి. చెప్పవచ్చిందేమిటంటే పర్యావరణ సమస్యలకు జనాభా పెరుగుదల నేరుగా కారణం కాదు. దేశ ప్రజల వినియోగ రీతులే పర్యావరణ శిథిలత్వానికి దారి తీస్తున్నాయి. సంపన్న దేశాల వినియోగంతో పర్యావరణానికి జరుగుతున్న హాని తీవ్రంగా,విస్తృతంగా ఉం టోంది.భూమి,నీరు,అడవులు మొదలైన సహజ వనరులను అవి అపరిమితంగా ఉపయోగించు కుంటున్నాయి. శిలాజ ఇంధనాలను ధనిక దేశాలు వాడుకొంటున్న తీరు తెన్నుల వల్లే భూ తాపం పెరిగిపోతోంది. మరి సంపన్న దేశా లలో గాలి స్వచ్ఛంగా ఉన్నట్టు కనిపించ డానికి కారణమేమిటి?వాయు కాలుష్యాన్ని సమర్థంగా ఎదుర్కోగల అధునాతన సాంకేతి కతలను అభివృద్ధి పరచుకోవడమే. అలాగే సంపన్న దేశాలలో ఆవాసమూ, వ్యవసాయమూ లేని ప్రదేశాలు చాలా విస్తృతంగా ఉండడం వల్లే వారి నివాస ప్రాంతాలు భద్రంగా ఉన్నాయనే వాదన ఒకటి ఉన్నది. ఇది నిజం కాదు. తమ తమ నివాస ప్రాంతాలలోని సహజ వనరులను అవి అపరి మితంగా వాడుకుంటున్నాయి. ఫలితంగా అడవులు తరిగిపోతున్నాయిబీ భూసారం క్షీణించిపోతోందిబీ జల వనరులు కలుషితమ వుతున్నాయి. పేద దేశాలూ తమ స్థానిక వనరులను విచక్షణా రహితంగా వినియోగిం చుకుంటున్నాయి. ఇప్పటికే నరికివేసిన అడవులు, బీడువారిన భూములను, కాలుష్య జలరాశులపై పేద దేశాల గ్రామీణ ప్రాంతాల వారు ఆధారపడుతున్నారు. పర్యా వరణ విధ్వంసం ఇంత స్పష్టంగా కనిపిస్తు న్నప్పటికీ పర్యావరణంపై ఆ దేశాల సంయుక్త ప్రభావం సంపన్న సమాజాలు నెరపుతున్న దానికంటే తక్కువే. పర్యావరణంపై భారత జనాభా ప్రభావం వాస్తవానికి తక్కువే. కారణమేమిటి? భారత ప్రజలు పేదవారు కావడమే. పేదరికం వల్లే వారు పొదుపుగా జీవించడం నేర్చుకున్నారు. అయితే మనం సంపన్నులం అవుతున్న కొద్దీ ప్రపంచ మధ్య తరగతి ప్రజల జీవన శైలిని అలవరచు కోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదని చెప్పక తప్పదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అమెరికన్‌ జీవన శైలికి మనం వెంపర్లాడు తున్నాం.సంపద్వంత జీవితానికి, ఆధునికతకు ఆ జీవన శైలినే ఒక ప్రమాణంగా భావిస్తున్నాం కదా. సంపన్న దేశాల మధ్యతరగతి ప్రజల వలే మనమూ అనారోగ్యకరమైన వినియోగ రీతులను అలవరచుకోకపోయినా, మన జనాభా అధికం గనుక పర్యావరణంపై మనం నెరపే ప్రభావం తక్కువగా ఉండబోదు. ఆదా యాలు పెరుగుతున్న కొద్దీ వ్యర్థాల ఉత్పత్తి కూడా పెరిగిపోతోంది. మన వీథులు చెత్తా చెదారంతో నిండిపోతుండడమే ఇందుకొక తార్కాణం..అలాగే వాయు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. పెరుగుతున్న ఆదాయాలతో అత్యధికులు పూర్తిగా సొంత వాహనాలను సమకూర్చుకుంటున్నారు.ఆవాహనాలను మెరుగైన సాంకేతికతలతో రోజూ కాలుష్య కారకం కానివిగా చేసినప్పటికీ వాటి సంఖ్యా ధిక్యత కాలుష్యం పెరుగుదలకు విశేషంగా దోహదం చేస్తోంది. కనుక, మనం మూడు అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలి. అవి: జనాభా పెరుగుదలను అదుపులో ఉంచడమె లా?ఈ జనాభా లబ్ధి (ఒక దేశంలో పని చేసే వయసు ఉన్న జనాభా పెరగడం వల్ల సమ కూరే ఆర్థిక వృద్ధి)ని ఎలా ఉపయోగించు కోవాలి? (ప్రతీ మానవుడూ ఒకఅద్భుత జీవి, ఒక విలువైన ఆస్తి అనడంలో సందేహం లేదు)బీ మన జనాభా పెరుగుతున్న కొద్దీ, మిగతా ప్రపంచం వలే స్వయం వినాశక రీతిలోకి పోకుండా ఉండేందుకు మనమేమి చేయాలి? మొదటి ప్రశ్నకు సమాధానం సాపేక్షంగా స్పష్టమే: భారత్‌ ఇప్పటికే తన ‘జీవితకాల సంతాన సాఫల్య రేటు’ (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌)లో తగ్గుదలను చూస్తోంది. బిహార్‌, జార?ండ్‌, మణిపూర్‌, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌లు మాత్రమే ఇందుకు మినహా యింపు. జననాల రేటు విషయంలో దేశసగటు కంటే అధిక సంతానోత్పత్తి రేటును ఈ రాష్ట్రా లు కలిగివున్నాయని ఇటీవలి ‘జాతీయ కుటుం బ ఆరోగ్య సర్వే’ వెల్లడిరచింది.ఈ రేటు ‘రీప్లేస్‌మెంట్‌ లెవల్‌ కంటే తక్కువకు పడిపోయింది (జనాభా సంఖ్య స్థిరంగా కొనసాగడానికి సరిపడా ఉండే కొత్త జననాల స్థాయిని ‘రీప్లేస్‌మెంట్‌ లెవల్‌’గా పిలుస్తారు). ప్రస్తావిత రాష్ట్రాలలో ప్రతీ మహిళ ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడం ఇప్పటికీ పరిపాటిగా ఉన్నది! బాలికలు విద్యావంతులు అయినప్పుడు, మహిళలకు ఆర్థిక సాధికారిత,ఆరోగ్య,ఆర్థిక భద్రత ఉన్న ప్పుడు సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. పిల్లలను కనాలా, వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకునే అధికారం మహిళలకు మాత్రమే ఉండాలి. అది మహిళల పురోగతిని సూచిస్తుంది. సరే, జనాభా లబ్ధి విషయానికి వద్దాం. విద్యతో ముడివడివున్న అంశమిది. విద్యాహక్కు మరింత మందికి సమకూరేలా మనం చూడవలసిన అవసరమున్నది. ఇక చివరగా పర్యావరణ భద్రత చాలా ముఖ్యం. అయితే ఇది చాలా కష్టతరమైన విషయం. ప్రపంచ వ్యాప్తంగా మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు వినియోగదారీ మనస్తత్వంతో వినూత్నంగా ఉంటున్నాయి.ఈ వాస్తవాన్ని విస్మరించలేము. మార్కెట్‌ శక్తులు ప్రపంచవ్యాప్తంగా వినియో గదారుల జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాయి. సుఖసంతోషాలతో కూడిన నివాసయోగ్యమైన ధరిత్రిని మనం కోరుకుంటున్నాం. ఈ విషయ మై మనం తక్షణమే, సమగ్రంగా చర్చించాల్సిన సమయమాసన్నమయింది.
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..)వ్యాసకర్త :(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు) – సునీతా నారాయణ్‌

మహిళలపై పెరుగుతున్న హింస

కోల్‌కతాలో ఆర్‌జికర్‌మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డాక్టర్‌పై ఆగస్టు 9నహత్యాచారం జరిగింది.ఈఘటనపై దేశం భగ్గు మంటోంది.దాదాపు అన్నిరాష్ట్రాల్లో మెడికల్‌ విద్యా ర్థులు,డాక్టర్లు,నర్సులు,మహిళలు,విద్యార్థి,మహిళా సంఘాలు,మేధావులు ప్రదర్శనలు,సభల ద్వారా తమ నిరసనను తెలుపుతున్నారు.ఈఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారిస్తున్నది. ఈ సమయం లోనే మహారాష్ట్రలోని బాద్లాపూర్‌లో ఇద్దరు మైనర్‌ అమ్మాయిలపై,అస్సాం రాజధాని గౌహతిలో విద్యార్థి నిపై, హిమాచల్‌ ప్రదేశ్‌లో నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యా చారాలు జరిగాయి.‘వియె వాంట్‌ జస్టిస్‌’ అని ప్రదర్శ నలో అరచిన ఆడబిడ్డల గొంతుల తడారక ముందే ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి.
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రతి గంటకు 51 కేసులు పోలీస్‌ స్టేషన్లలో రిజిష్టరు అవుతున్నట్లు జాతీయ నేర పరిశోధన బ్యూరో 2023 నివేదిక తెలిపింది. పోలీస్‌ స్టేషన్‌ వరకు రాని కేసులు ఇంతకు రెండిరతలు పైగా వుంటాయి. నిందితులు ఇన్ని దారుణాలు చేయగలుగు తున్నారంటే వారికి అంత ధైర్యం ఎక్కడిది? పాలకుల భీకరింపులు, పోలీసు కేసులు, న్యాయస్థానాల శిక్షలు ఈ దారుణాలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?
గత పది సంవత్సరాలుగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలగురించి ప్రధానమంత్రి మాట్లా డుతూనే వున్నారు. అయినా నేరాలు తగ్గకపోగా పెరుగుతూనే వున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రిపోర్టు ప్రకారం మహిళలపై 2016లో 3,38, 954బీ 2017లో3,67,000బీ,2018లో 3,92,136బీ 2019లో 4,12,000బీ 2020లో 3,71,503బీ 2021లో 4,28,278బీ 2022లో 4,45,256 నేరాలు జరిగాయి.ఇవన్నీ పోలీసు స్టేషన్లలోరిజిస్టరైన కేసుల వివరాలు.2016-2021 సంవత్సరాల మధ్య మహిళలపై నేరాలు 26.35 శాతం పెరిగాయి. 2021-2022 సంవ త్సరాల్లో అత్యాచారాలు 7.1శాతం పెరిగాయని ఈ రిపోర్టు తెలిపింది. గృహ హింస, కిడ్నాప్‌లు, దాడులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వున్నాయి. మహిళలపై జరుగుతున్న ఈఘోరాలకు పౌర సమాజం స్పందించడంతో కొన్ని చట్టాలు వచ్చా యి. 2012లో దేశ రాజధాని ఢల్లీిలో కదులుతున్న బస్సులో 23ఏళ్ళ ‘నిర్భయ’పై జరిగిన దారుణం తర్వాత ప్రజలు రోడ్లపైకి రావడంతో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.ఎస్‌.వర్మ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడిరది.వీరి సూచనలతో క్రిమినల్‌ లా (సవర ణ) చట్టం2013 అమలులోకి వచ్చింది. మహిళ లపై కొత్త తరహాలో జరుగుతున్న వేధింపులు, నేరాలను నిర్వచించింది.శిక్షలను కఠినతరం చేసిం ది.అయినా నేరాలు పెరుగుతున్నాయి. బాలికలపై పైశాచికత్వం ఏడాదికేడాది పెరిగిపోతుంది. చిన్నా రులపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టం వచ్చినా బాలికలపై నేరాలు తగ్గడం లేదు.2018లో37,798బీ 2019లో 45,270బీ 2020లో45,591బీ,2021లో51,863బీ 2022లో61,303 మంది బాలికలపై నేరాలు జరిగాయి.గత ఐదు సంవత్సరాల్లో మొత్తం నేరాలు 2,51,825కాగా,శిక్షలు పడినవి కేవలం25, 961మాత్రమే. నేరగాళ్లకు శిక్షలు పడుతున్న తీరు ‘బేటీ బచావో’ నినాదాన్ని హేళన చేయడంలేదా! మహిళల,బాలికల జీవితాలను ఇలా అర్థాంతరం గా బలి తీసుకోవడానికి ప్రధాన కారణాలు సనా తన పురుషాధిక్య భావజాలం, ఆధునిక వ్యాపార విష సంస్కృతి,పెరుగుతున్న మతతత్వ భావాలలు, వీటిని పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలు. స్త్రీల కంటే పురుషులు అధికమనే భావం మన సమాజంలో నరనరాన ఇంకిపోయింది. హక్కులు లేని జాతి స్త్రీలదనే హీన సాంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. చదువుకునే హక్కు కోసం, బాల్య వివాహాల రద్దు కోసం, వితంతు వివాహాల కోసం, ఆస్తి హక్కు కోసం,వరకట్న నిషేధం కోసం, అత్యాచారాల నిరోధం కోసం, చట్టబద్ద రిజర్వేషన్ల కోసం,ఉద్యోగం, ఆరోగ్యం ఇలా జీవితంలోని ప్రతి అంశం కోసం మహిళ పోరాడి సాధించుకోవలసి వచ్చింది. మహిళలకు కొన్ని హక్కులు, చట్టాలు సాధించుకున్నా దురాగతాలు ఇంకా కొనసాగ డానికి మూల కారణం మన సమాజంలో కొన సాగుతున్న భూస్వామ్య అవశేషాలు. విదేశీ పాల కులు, ఆ తర్వాత స్వదేశీ పాలకులు సమాజాన్ని పురోగతివైపు నడపడానికి కారణమైన భూ సమస్యను పరిష్కరించకుండా భూస్వామ్య వర్గా లతో రాజీ పడ్డారు. కాళ్ళు పాతళంలో ఆలోచనలు ఆకాశంలో వున్నట్లు ఆధునిక వ్యవస్థ గురించి కలలుగనమని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వెనుకటి వ్యవస్థ దుర్లక్షణాలవల్ల మహిళలు, అట్ట డగు వర్గాలపట్ల వివక్ష,హింస,అవమానాలు కొన సాగుతునే వున్నాయి.వీటిని చట్టాల ద్వారా మాత్ర మే పరిష్కరించలేమని,ఈభావాలు కొనసాగ డానికి మూల కారణాలను పరిష్కరించాలని జస్టిస్‌ భాను మతి 2017లో ఒకతీర్పు సందర్భంగా చెప్పిన విషయాలు అక్షరసత్యాలు. పాత భావాలు ఇంకా మన మనస్సు నుండి దూరం కాకుండానే విదేశీ వ్యాపార సంస్కృతి మన మెదళ్ళలోకి జొరబడిరది. ప్రపంచీకరణ విధానాల పేరుతో స్త్రీని వ్యాపార సరుకుగా మార్చివేశారు.అందమైన, అశ్లీలమైన స్త్రీ బొమ్మల ద్వారా తమ సరుకులను అమ్ముకునే నీచ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగింది. అశ్లీలత చట్టబద్దమైపోతున్నది.అడ్వరటైజ్‌మెంట్లు, సినిమా లు, సీరియళ్లు,రీల్స్‌, కామెడీ షోలు ఇలా అన్నింటా స్త్రీని అసభ్యంగా చూపడంతో పాటు, జుగుప్సాకర మైన ద్వంద్వార్థాల డైలాగులు నిత్యకృత్యమయ్యా యి.సోషల్‌ మీడియా ముఖ్యంగా యూట్యూబ్‌ చానెళ్లలో అశ్లీల వీడియోలు విచ్చలవిడిగా యువ తకు అందుబాటులో ఉంటున్నాయి.827 పోర్న్‌ వెబ్‌సైట్లను నిషేధించాలని 2015లోనే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.అన్ని రకాల పిల్లల అశ్లీల చిత్రాలను నిషేధించాలని 2016లో మరోసారి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాల్సి వచ్చింది.అయితే పోర్న్‌ హబ్‌ తాజా లెక్కల ప్రకా రం 2019 తర్వాత ఆన్‌లైన్‌ పోర్న్‌ వీడియోలు చూసే వారిసంఖ్య వేగంగా పెరిగింది. మన దేశం లో 18 నుండి 24 ఏళ్ళ లోపు వున్న పిల్లలు 44 శాతం మంది ఈ పోర్న్‌ వీడియోలు చూస్తున్నారట! ప్రపంచంలో ఇలాంటి వీడియోలుచూస్తున్న వారి లో మన దేశం ప్రస్తుతం మూడో స్థానంలో వుంది. గత పదేళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి భావజా లానికి పునాది మనుధర్మశాస్త్రం.ఈఅశాస్త్రం బోధంచే నీతి స్త్రీ బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త,వృద్ధాప్యంలో తండ్రి సంరక్షణలో పెరగాలని. మానవ సమాజంలో సగ భాగంగా వున్న స్త్రీలు ఇలా పరాన్న జీవులుగా వుంటే ఆ సమాజం ఎలా అభివృద్ధి సాధిస్తుంది? రాజుల కాలంలో రాజ్యాల ఆక్రమణలో భాగంగా పదుల సంఖ్యలో స్త్రీలను పెళ్ళిళ్లు చేసుకోవడం,పరాయి రాజ్య స్త్రీలను చెర చడం,వేశ్యలుగా,బసివినులుగా,జోగినులుగా మార్చి కామాంధులకు బలిపెట్టారు. కౌరవసభలో ద్రౌపదికి జరిగిన ఘోర అవమానాన్ని అటు పౌరాణిక నాటకాల్లో, ఇటు సినిమాల్లో, సీరియ ళ్లలో ఈనాటికీ చూపిస్తూనే వున్నారు. ఈ భావజా లం తలకెక్కిన మతోన్మాదులు పాలకులుగా మారి అదే నీచ పద్ధతులను అనుసరిస్తున్నారు. గుజరాత్‌ లో బిల్కిస్‌బానోపై జరిగిన సామూహిక అత్యాచా రం,మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగిం చడం,జెఎన్‌యూ,ఇతర యూనివర్శిటీలలో అమ్మా యిలపై దాడులు,హింస ఇందులో భాగమే. ప్రశ్నిం చే ఆధునిక మహిళలపట్ల సోషల్‌ మీడియాలో జరిగే వేధింపులు,ట్రోలింగ్స్‌ ఆనాటి నీచ మనస్త త్వానికి ఆధునిక వికృత రూపాలు. బిల్కిస్‌బానో కేసులో నిందితులకు శిక్ష తగ్గించడమే కాకుండా, వారిని జైళ్ల నుండి హారతులు పట్టి పాలక పార్టీనే స్వాగతించిన తర్వాత మహిళల మాన ప్రాణాలను ఎలా కాపాడుతారు?2023 ఎన్‌సిఆర్‌ నివేదిక ప్రకారంఉత్తరప్రదేశ్‌లో మహిళలపై 56వేల నేరా లు జరిగి మొదటి స్థానంలో వుండగా,40,738 కేసులతో రాజస్థాన్‌,39,526 కేసులతో మహారాష్ట్ర వరుస రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నేరాలు జరిగిన తర్వాత కేసులు నమోదు చేయకపోగా బెదిరింపులు,పెద్దల పంచాయితీల పేరుతో బాధిత మహిళలను మరింతగా వేధిస్తున్నారు. మహిళా నేరాలపై వచ్చిన ఫిర్యాదులను సకాలంలో చార్జిషీట్‌ వేసి దోషులకు శిక్షలు వేయించడంలో కేరళ ఆదర్శంగా వుందని ఎన్‌సిఆర్‌ రిపోర్టు తెలిపింది. ఆ రాష్ట్రంలో నమోదైన మహిళా నేరాల కేసుల్లో 96 శాతం వాటికి చార్జిషీట్‌ సకాలంలో వేస్తున్నా రు.మహిళలు, బాలికలపై ఘోరాలు జరిగినప్పుడు స్పందించడం కనీస మానవత్వం.ఆమాత్రం ప్రజా స్పందన వుంది కాబట్టే ప్రభుత్వాలు కొంతైనా స్పందిస్తున్నాయి. కానీ వీటితోనే నేరాలను అరికట్ట లేం.మూలమైన భూ సమస్య, వికృత వ్యాపార సంస్కృతి,మతతత్వ పాలక విధానాలను ప్రతిఘ టించి,ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం విభిన్న రూపాల్లో కృషి చేయడమే మహిళల మాన, ప్రాణా లకు నిజమైన రక్షణ.
వైద్య సిబ్బందికి రక్షణ ఏదీ !
కోల్‌కతా నగరంలోని ఆర్‌.జీ.కార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల,ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మహిళా వైద్యు రాలిపై అత్యాచారం, హత్య చేసిన దారుణ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి,తీవ్ర ఆందోళనకు గురి చేసిం ది. దేశంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థి తుల్లో, రక్షణ కొరవడిన స్థితిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా మహిళలు విధుల్ని నిర్వహిం చాల్సి వస్తుందో ఇంకోసారి తేటతెల్లం చేసిన దుర్ఘటన.ఆ పీజీ వైద్య విద్యార్థి36గంటలుగా విధుల్లో ఉన్నా రు.అర్ధరాత్రి దాటాక కాసేపు సెమి నార్‌ రూమ్‌లో విశ్రమించిన సమయంలో దారుణ సంఘటనకి బలయ్యారు. నగరం మధ్యలో ప్రభుత్వ ఆసుపత్రి లో,తమకి బాగా పరిచయమైన స్థలంలో తమ రక్షణకి ఇంత తీవ్రమైన ప్రమాదం ఉంటుం దని ఆమె కలలో కూడా అనుకుని ఉండరు. అక్కడ సీసీ కెమెరాలు పని చెయ్యడం లేదట. ఆగంతకులు రాకుండా సరిపడా భద్రత, సరిjైున వెలుతురు లేని క్యాంపస్‌. ఇవన్నీ ఆ కిరాతక చర్యకు దోహద పడ్డాయి.ఇది వ్యవస్థాగత లోపం.మహిళా ఉద్యో గులకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేని నిర్వాకం. ముఖ్యంగా వైద్యరంగంలో పనిచేస్తున్న వారు ఆరో గ్య సేవలు అందించడంలో తీవ్రంగా శ్రమ పడు తున్నారు. అయినా రోగి బంధువుల నుండి భౌతిక దాడులకు గురవ్వడం లాంటి సంఘటనలు పెరుగు తూ వస్తున్నాయి.వాటిని అరికట్టే కఠిన చట్టాలు, చట్ట ప్రకారం సత్వరం శిక్ష పడేలా ఏర్పాట్లు వ్యవస్థ లో అవసరం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి.ప్రాణాలు నిలిపే డాక్టరు, తానే ప్రాణ భయంతో చికిత్స అందించాల్సి వస్తే అది రోగికి మాత్రమే కాదు ప్రజారోగ్య వ్యవస్థకే ప్రమాదం. ఇక హత్యోదంతం విషయంలో ఆ వైద్య కళాశాల పెద్దలే కాకుండా ప్రభుత్వం కూడా బాధ్యతా రహితంగా వ్యవహరించింది. దుర్ఘటన జరిగిన పిమ్మట ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ రిపోర్ట్‌ ఇవ్వడానికి కూడా ఆలస్యంచేస్తే,ఆయనపై చర్యలు తీసుకోవా ల్సింది పోయి ప్రభుత్వం ఆయనకు వేరేచోట బాధ్యతలు అప్పగించడం ద్వారా గౌరవిం చింది. సమయానికి హైకోర్టు స్పందించి ఆయన్ని సెల వుపై పంపమని ఆదేశించడం ద్వారా, కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా కొంత న్యా యం చేసింది. ఇలాంటి హీన నేరం జరిగిన తర్వా త కూడా అక్కడి ప్రభుత్వం కోర్టుచెప్తే గానీ సరైన విధంగా స్పందించక పోవడం దారుణం.ఈ హత్యోదంతం నుండి పాఠాలు నేర్చుకుని వైద్యుల, ఆరోగ్య సిబ్బంది రక్షణకు, భద్రతకు ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలి. వారు పని చేసే స్థలం పూర్తి సేఫ్‌ జోన్‌గా ఉండాలి.
తిరోగమన చర్య
దేశ అత్యున్నత న్యాయస్థానం సూమోటోగా ఈ కేసును విచారణకు తీసుకుంది. విచారణ ప్రారం భించిన మొదటి రోజే ‘మరో అత్యా చారమో హత్యో జరిగేంతవరకు చూస్తూ ఊరుకోవాలా?’అని ప్రశ్నించింది. ఈ పరిణా మాలన్నీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగం గా మహిళల పనిగంటలు తగ్గించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘సాధ్యమైనంత వరకు మహిళలకు రాత్రి డ్యూటీని నివారించాలి’ అని మార్గదర్శకాలను జారీ చేసింది. భద్రత కోసం ఈనిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచర ణలో ఇది మహిళల ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటుగా మారనుంది. మహిళలకు అరకొరగా ఉన్న ఉపాధి అవకా శాలను సైతం ఈ నిర్ణయం గండి కొడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అందుకే, మమతా ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం తిరోగ మన చర్య.మభ్య పెట్టే ఈతరహా విధానాలకు బదులు అసలైన రక్షణ చర్యలు తీసుకోవాలి. కోల్‌ కతా వంటి మహానగరంలో వైద్యఆరోగ్య రంగంతో పాటు,గిగ్‌ వర్కర్లు,ఫ్యాక్టరీలు,కాల్‌ సెంటర్లు, హో టళ్లు, పారిశుధ్య కార్మికులుగా లక్షలాది మంది మహిళలు పనిచేస్తున్నారు.ఆటో డ్రైవర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. విధి నిర్వ హణలో భాగం గా పురుషులతో సమానంగా రాత్రి పూట కూడా వీరు పనుల్లో భాగస్వాములవు తున్నారు. ‘ఎక్కడైనా..ఎప్పుడైనా’వీరందరికి సురక్షిత వాతా వరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆపని చేయడానికి బదులుగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చేతులెతేస్తోంది. మరో విధంగా చెప్పా లంటే మహిళలు ఇళ్లనుండి బయటకొచ్చి రాత్రి పూట పనిచేస్తున్నారు కాబట్టే,అత్యాచారాలు జరుగు తున్నాయన్నట్టుగా వ్యవహరిస్తోంది.ఇది ఒక రకం గా సంఫ్న్‌పరివార్‌ వాదనే! ఈనిర్ణయంతో మహి ళల ఉద్యోగ,ఉపాధి అవకాశాలు గణనీ యంగా కుదించుకుపోతాయి.అంతిమంగా శ్రామి క శక్తి నుండి మహిళలను దూరం చేస్తుంది. అదే సమ యంలో వేధింపులు,అత్యాచారాల నుండి మహిళ లకు లభించే భద్రత మాత్రం ప్రశ్నార్థకమే! పగటి పూట వేధింపులు జరగవన్న గ్యారంటీ ఏమిటి? రాత్రిపూట ఇళ్ళ వద్ద ఉన్నా భద్రత ఉంటుం దన్న నమ్మకం ఏమిటి?మహిళలు రాత్రిపూట పని చేయ డంపై చర్చ ఇప్పటిదికాదు.స్వాతం త్య్రానికి పూర్వ మే రామ్‌ చంద్‌ వర్సెస్‌ మథురా చంద్‌ కేసులో న్యాయస్థానం భద్రత సాకుతో మహిళలను నైట్‌ డ్యూటీల నుండి దూరం పెట్టడాన్ని తప్పు పట్టింది. స్వాతంత్య్రం తరువాత కూడా అత్యున్నత న్యాయ స్థానంఇదేస్ఫూర్తిని కొనసాగించింది. కె.ఎస్‌ త్రివేణి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా,ఆర్‌ వసంత వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌14ను అత్యున్నత న్యాయ స్థానం ప్రస్తావించింది. ఎటువంటి వివక్షా లేని సమానత్వాన్ని ఆర్టికల్‌ 14దేశ ప్రజలందరికీ దఖ లు పరుస్తోందని స్పష్టం చేసింది.ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌లో దీనికి భిన్నంగా ఉన్న నిబంధనలను కొట్టివేసింది. ఈ తీర్పుల స్ఫూర్తితో పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం 2013, లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 రూపొందాయి. ఇప్పటికీ వీటి అమలు అంతంత మాత్రమే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈచట్టాల మేరకైనా భద్రతా చర్యలను తక్షణం అమలు చేయా లి.అమలు చేయని సంస్థలను గుర్తించి కఠిన చర్య లు తీసుకోవాలి.మహిళలపట్ల హింసకు, దౌర్జన్యా లకు,లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి.- (అన్విత్‌/ డా.డి.వి.జి.శంకరరావు)

ప్రకృతి విలయంలో వాయనాడ్‌

జూలై 30..అర్ధరాత్రి..కేరళలోని వయనాడ్‌ జిల్లా ముండక్కె గ్రామంలో భారీ శబ్దానికి సేల్స్‌మెన్‌ అజయ్‌ఘోష్‌ ఉలిక్కిపడి లేచారు. ఆ భారీ శబ్దం ఏమిటనేది వారికి కొంతసేపు అర్థం కాలేదు.కాసేపటి తరువాత భారీవర్షంతో పాటు పెద్ద ఎత్తున బురద ప్రవాహం మొద లైంది.వయనాడ్‌ జిల్లాలోని ముండక్కె, చూర ల్మలైతోపాటు నిలంబుర్‌ మలప్పు రం జిల్లాలోని నీలాంబుర్‌ అటవీప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో సుమారు 308 మంది మృతి చని పోయారు. ఇంకా కొందరి ఆచూకీ తెలి యాల్సి ఉంది. అర్ధరాత్రి 2గంటల నుంచి తెల్ల వారు జామున 4గంటల మధ్యన రెండు సార్లు కొండ చరియలు భారీగా విరిగి పడ్డాయి.ఇవి ఏస్థాయిలో పడ్డాయంటే 90కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్ల ప్పురం జిల్లాలోని అటవీ ప్రాం తం కూడా దీని ప్రభావానికి లోనైంది.ఈప్రాం తాలన్నింటినీ సున్నిత పర్యావరణ ప్రాంతాలుగా మాధవ్‌ గాడ్గిల్‌ నివేదికలో పేర్కొన్నారు. ఆనివేదిక పశ్చిమ కనుమల పర్యావర ణానికి సంబంధించినది.అత్యంత సున్నితమైనవి, తక్కువ సున్నితనమైనవి,అంతగా సున్నితం కాని ప్రాంతాల సమాచారాన్ని ఆ నివేదిక తెలియజేస్తుంది.ఈ నివేదికను అన్ని రాజకీయ పక్షాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వా లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇటీవలి కాలంలో ఈ ప్రాంతాలలో మొక్కల పెంపకమే కాకుండా మరికొన్ని ఇతర కార్యకలాపాలకు కూడా కేరళ ప్రభుత్వం అనుమతిచ్చింది….
కేరళలోని వయనాడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ప్రకృతి విలయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరు వాత సంభవించిన ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. బుధవారం మధ్యా హ్నానికి 160కి పైగా మృత దేహాలను వెలికి తీశారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుండపోత వర్షం కారణంగా ఒకటికి, రెండుసార్లు భారీ కొండ చరి యలు విరిగిపడటంతో వయనాడ్‌ జిల్లా మొత్తం పెను విపత్తులో చిక్కుకుంది. మెప్పాడి పంచాయతీ పరిధిలోని ముండకై, అట్టామల, నూల్‌పూజా గ్రామాలతో పాటు, చూరాలమల పట్టణంలోనూ బీభత్స దృశ్యాలు చోటుచేసుకు న్నాయి.నివాస స్థలాలు ఉండాల్సిన చోట బురద మట్టి దిబ్బలు కనపడుతున్నాయి. ముండకై గ్రామం స్థానంలో మట్టి,బురద,రాళ్లు నేలకూలిన చెట్లతో నిండిన నది ప్రవహిస్తోం దంటూ వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతను తెలియచేస్తాయి.ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన రెస్క్యూ టీమ్‌ బుధవారం మధ్యాహ్నం వరకు ఆగ్రామం లో అడుగు పెట్టలేకపోయింది.మరో వైపు సం ఘటన స్థలానికి కిలోమీటరు దూరంలో ఉన్న చలియార్‌ నదిలో ఛిద్రమైన మృత దేహాలు కొట్టుకువస్తూనే ఉన్నాయి. సంఘటన స్థలంలో కన్నా, ఈ నదిలోనే ఎక్కువ మృత దేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీస్తున్నారు.
కేరళకు ప్రకృతి విపత్తులు కొత్తేమీ కాదు.కానీ, వయనాడ్‌లో చోటుచేసుకున్నది ఆ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విపత్తులలో ఒకటి. కొండచరియలు విరిగి నదిలో పడటంతో రెండిరతలైన బురద మట్టి ప్రవాహం ఊళ్లకి ఉళ్లు ముంచెత్తింది. కిలోమీటర్ల పొడవునా, కొన్ని అడుగుల మేర ఎక్కడ చూసినా బురద మట్టే కనపడుతోంది.ఇళ్లు,ఆస్పత్రులు,బడులు, ప్రార్థనాలయాలు అన్నీ ఆ మట్టి కిందే. దీంతో సహాయ చర్యలు ఎక్కడి నుండి ప్రారం భించాలో కూడా రెస్క్యూ సిబ్బందికి అర్ధం కాని పరిస్థితి ఏర్పడిరదంటే ఏస్థాయిలో విపత్తు చోటుచేసుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న పుత్తమలలో 2019లో కొండచరియలు విరిగిపడి 17 మంది మరణించారు.60 మంది మృతి చెందిన కవలపర కూడా దగ్గరలోనే ఉంది.2020లో కూడా ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. తాజాగా ఈఅన్ని ప్రాంతాల్లోనూ గత ఆదివారం నుండి భారీ వర్షం కురుస్తోంది. 2019 ఆగస్టు 8న నమోదైన వర్షపాతానికి దగ్గరగా ఈ వర్షం ఉంది.మృత్యు రక్కసి విరుచుకుపడిన ప్రాంతంలో 48గంటల్లో 572 మి.మీ వర్షపాతం నమోదైంది.ఈస్థాయి వర్ష పాతం వయనాడ్‌ జిల్లా కనీవిని ఎరుగదు. భారత వాతావరణ పరిశోధన సంస్థ (ఐఎండి) కూడా ఈ వర్ష బీభత్సాన్ని అంచనా వేయ లేకపోయింది. అరేబియా సముద్రపు ఉష్ణోగ్ర తలు భారీగా పెరగడం కూడా ఉత్పాతానికి కారణంగా చెబుతున్నారు.
ఇంత భయానక పరిస్థితుల్లోనూ స్థానిక ప్రజానీకం కదులుతోంది.ముండకై గ్రామంలో తొలివిడత విధ్వంసం తరువాత పరిసర ప్రాం తాల్లోని ప్రజానీకం పెద్దఎత్తున సహాయ చర్య లు చేపట్టారు.ఆపనులు జరుగుతుండగానే, రెండవసారి కొండ చరియలు విరుచుకుపడి సర్వస్వాన్ని భూస్థాపితం చేశాయి.అయినా, స్థానికులు వెరవలేదు. రెస్క్యూ బృందాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.దాదాపు 50సహాయ శిబిరాలను ఏర్పా టు చేసింది. పలువురు మంత్రులు సంఘ టనా స్థలానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రి పినరయి విజయన్‌నిరంతరంగా సహాయ చర్యలను పర్య వేక్షిస్తున్నారు.2018 వరదలు,కోవిడ్‌ సంక్షో భాన్ని ఎదుర్కున్న అనుభవంతో యంత్రాంగా నికి దిశా నిర్దేశం చేస్తున్నారు.ఈ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఉదారంగా ఆదుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.ఈదిశలో తక్షణం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్రం ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలనైతే పంపింది కానీ,కేరళ ప్రభు త్వంపై హోంమంత్రి నిందా పూర్వక వ్యాఖ్యలు చేయడం తగని పని.బాధిత ప్రజానీకాన్ని ఆదు కోవడంపైనే అందరూ సర్వశక్తులను ఒడ్డి, సహకారం సమకూర్చి, ప్రకృతి విలయంలో చిక్కుకున్న వారిని ఒడ్డున పడేయాలి.
51 సార్లు విరిగిపడ్డ కొండచరియలు
వయనాడ్‌ జిల్లాలోని ఈ కొండప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం మామూలే. ఇందుకు సంబంధించిన సమాచారం గాడ్గిల్‌ నివేదికలో కూడా ఉంది.చూరల్మలై ముండక్కెకు 10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో 2019లో 17మంది మరణించారు.రాతి తవ్వకాలే కొండచరియలు విరిగిపడటానికి కారణమని కేరళ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (కేఎఫ్‌ఆర్‌ఐ) పేర్కొంది.2018,2019 సంవత్స రాలలో 51సార్లు కొండచరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో పుతుమాల, నిలాం బర్‌లో 34సెంటిమీటర్ల వర్షం కురిసింది.కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని అడ్వాన్స్‌ డ్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫియరిక్‌ రాడార్‌ రీసెర్చ్‌ డైరక్టర్‌ అభిలాష్‌ ఎస్‌.బీబీసీతో మాట్లాడుతూ..‘గత రెండువారాలుగా కురిసిన భారీ వర్షాల తరువాత, ఈ మంగళవారం మరోసారి అత్యంత భారీ వర్షం కురిసింది. దానిని మీరు ప్రధాన కారణంగా పరిగణిం చక్కరలేదు కానీ, కచ్చితంగా అదో పెద్ద కారణమే’’ అని చెప్పారు.
పర్యాటకం పెరిగింది.
కేరళ అటవీ పరిశోధనా సంస్థ (కేఎప్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్త డాక్టర్‌ టీవీ సంజీవ్‌ మ్యాప్‌ల సహా యంతో చూరల్మలై నుంచి 4.65 కిలోమీ టర్లు, ముందక్కె నుంచి 5.9కిలోమీటర్ల దూరంలో మైనింగ్‌ జరుగుతోందని చెప్పారు. ‘‘గనులలో పేలుళ్ళు ప్రకంపనలు పుట్టిస్తాయి. దాని ప్రభావం గ్రానైట్‌ ద్వారా చాలా దూరం వ్యాపిస్తుంది. ఈ మొత్తం ప్రాంతం చాలా పెళుసైనది. ఈ ప్రాంతంలో సాధారణంగా కనిపిం చేది వృక్షసంపద. అంటే చెట్లు, మొక్కలు’’ అని తెలిపారు.‘‘తోటల పెంపకానికి అనుమతించిన ప్రాంతాలలో కొంత భాగాన్ని ఇతర కార్యకలా పాలకు వినియోగించవచ్చని ఇటీవల ఓ కొత్త చట్టం తీసుకువచ్చారు. దీని ఫలితంగా ప్లాంటే షన్‌ యజమానులు పర్యాటక రంగంవైపు దృష్టి సారించారు. తదనుగుణంగా ఇక్కడ పెద్ద భవంతులు కట్టడం మొదలుపెట్టారు. ఇందు కోసం నేలను చదును చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.నాలుగేళ్ల కిందట వయనాడ్‌లో 20కు పైగా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని 25,000 మంది విదేశీ పర్యాటకులు, 1,00,000 మంది స్వదేశీ పర్యాటకులు వస్తుం టారని నాలుగేళ్ళ కిందట ఆ సంస్థ తమ నివేది కలలో ఒకదానిలో పేర్కొంది.‘‘సున్నితమైన భూభాగాలను ఎలా చూడాలనే విషయాన్ని పేర్కొన్న గాడ్గిల్‌ నివేదికను తిరగేయడం మాకు చాలా ముఖ్యం. ఆ నివేదికలో అత్యంత సున్ని తమైన ప్రాంతాలు, సాధారణ సున్నితమైన ప్రాంతాలు, తక్కువ సున్నితమైన ప్రాంతాల గురించి తెలిపారు.కానీ మొత్తం రాజకీయ పక్షాలన్నీ వీటిని వ్యతిరేకించడం విషాదం’’అని డాక్టర్‌ సంజీవ్‌ చెప్పారు.‘‘ఇక్కడి భూమి చాలా బలహీనంగా ఉండటంవల్ల ఈ సమస్య ముందుముందు మరింత పెరుగుతుంది. ఇక్కడ లోతైన లోయలు ఉన్నాయి. భారీవర్షాలను తట్టుకోలేనంత పెళుసుగా ఇక్కడి భూమి మారింది. దీనిని పరిష్కరించుకోవాలంటే అసలు మన పర్యావరణ వ్యవస్థ నిజంగా ఆరోగ్యకరంగా ఉందో లేదో నిర్థరించుకోవాలి. ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే..అప్పుడు ఎటువంటి వాతావరణ మార్పులైనా ఎదుర్కో గలదు’’ అని తెలిపారు.
కొండ ప్రాంతాలే ఎక్కువ
డాక్టర్‌ సంజీవ్‌ 2017లో ఓఅకడమిక్‌ పేపర్‌ కోసం గ్రానైట్‌ క్వారీలను గుర్తించారు. రెండేళ్ళ తరువాత కొండచరియలు విరిగిపడే ప్రాంతా లను కూడా గుర్తించారు.కొండచరియలు విరిగి పడే 31ప్రాంతాలను మాధవ్‌ గాడ్గిల్‌ బృందం, అదేవిధంగా డాక్టర్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వం లోని ఉన్నత స్థాయి వర్కింగ్‌ గ్రూప్‌ కూడా గుర్తించింది.
పశ్చిమ కనుమల కిందకు వచ్చే వయనాడ్‌ ఓ కొండ ప్రాంతం.ఇక్కడ అనేక తెగలు కనిపిస్తాయి.కర్ణాటకలోని కొడుగు, మైసూరు జిల్లాలు వయనాడ్‌కు ఉత్త రాన సరిహద్దుగా ఉన్నాయి. ఈశాన్యాన తమిళనాడు హద్దుగా ఉంది.దక్షిణాన మల ప్పురం,నైరుతి దిశలో కోజికోడ్‌,వాయవ్యంలో కన్నూరు ఉన్నాయి.
పశ్చిమ కనుమలు ఏ రాష్ట్రంలో ఎంతెంత…
గుజరాత్‌లో 449 చదరపు కిలోమీటర్లు మహారాష్ట్రలో 17,348 చదరపు కిలోమీటర్లు గోవాలో 1,461 చదరపు కిలోమీటర్లు కర్ణాటకలో 20,668 చదరపు కిలోమీటర్లు తమిళనాడులో 6,914 చదరపు కిలోమీటర్లు కేరళలో 9,993 చదరపు కిలోమీటర్లు మొత్తం 56 వేల 825 చదరపు కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు వ్యాపించి ఉన్నాయి. 13 ఏళ్ళ నిరీక్షణ పర్యావరణం పరంగా పశ్చిమ కనుమలు సున్నితమైన ప్రాంతాలుగా గాడ్గిల్‌ నివేదిక పేర్కొని 13 ఏళ్ళు గడిచాయి. ఈ విషయం తెలుసుకున్న తరువాత ప్రాణాంతక మానవ కార్యకలాపాలను ఆపేయాల్సిన అవస రం ఉంది.కేంద్రప్రభుత్వం 2014 మార్చి నుంచి ఐదు ముసాయిదా నోటిఫికెషన్లు జారీచేసింది.కానీ ఇంకా తుది నోఫికేషన్‌ జారీ కాలేదు.దీనికి ప్రధాన కారణం పొరుగు రాష్టాలైన కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యతిరేకత. ఇది ప్రజల జీవనోపాధిని ప్రభా వితం చేస్తుం దనే కారణంతో ముసాయిదా నోటి ఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కర్ణాటక కోరు తోంది.ఈ విషయంలో ఉదాసీనత కార ణంగా చెట్ల నరికివేత,మైనింగ్‌,భవనాల నిర్మాణం వంటి పర్యావరణానికి హాని కలిగించే మానవ కార్యకలాపాలు పెరిగాయి. తదీంతో భూమి కుంగిపోయి కొండలు అస్థిరంగా మారడానికి కారణమైంది.కొండచరియలు విరిగిపడటానికి ఇదే ప్రధాన కారణమని డాక్టర్‌ సంజీవ్‌ నమ్ముతున్నారు.(బీబీసీ సౌజన్యంతో..)

పర్యావరణ పరిరక్షణ పుడమికి సంరక్షణ

నానాటికీ తీవ్రతరమవుతున్న పర్యావరణ మార్పులతో ప్రకృతి విఫత్తులు ముమ్మరి స్తున్నాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పంటలు, భూము లు దెబ్బతింటున్నాయి.దానివల్ల పుడమిపై మానవాళి జీవనం నరక ప్రాయం గా మారుతోంది. వాతావరణంలో పెనుప్రభా వాలు పుడమిపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రకృతి విఫత్తులు నానాటికీ పేట్రేగిపోతున్నాయి. ఇటీవల కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో జరిగిన హృదయ విచారకర ఘటన యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ముఖ్యంగా దేశంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం పెను విషాదా లకు దారితీస్తోంది.తాజాగా కేరళలో చోటు చేసుకున్న విలయమే ఇందుకు ప్రబల నిదర్శ నం.విచ్చలవిడిగా ఆనకట్టల నిర్మాణంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ ఇటువంటి విఫత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. – గునపర్తి సైమన్‌
నదులపై ఆనకట్టలు దేశ ఆర్ధికాభివృ ద్ధికి కీలకం.కానీ,వాటివల్ల వినాశకర పరిణా మాలు కూడా ఉంటాయని నర్మదలోయ,ఉత్తరాఖం డ్‌ ప్రజలు ఎన్నడో గ్రహించారు.అభివృద్ధి కోసం ప్రకృతిని,మానవ జీవితాలనుపణంగా పెట్ట కూడ దు.ప్రసుతతం అరుణాచల్‌ప్రదేశ్‌కు ఈజంట ప్రమాదాలు ఎదురవుతున్నాయి.అక్కడ169కి పైగా ఆనకట్టల నిర్మాణానికి ప్రయత్నాలు మొదలయ్యా యి.అరుణాచల్‌ భూకంప ప్రమాదప్రాంతంలో ఉంది.పైగా వాతావరణ మార్పులవల్ల అక్కడి పర్వతా లపై ఉన్న హిమనదాల్లో మంచు కరిగిపోతూ వరదలకు కారణమవుతోంది.ఇటువంటి పరిస్థితు ల్లో అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆనకట్టలు దిగువన ఉన్న అస్సామ్‌కు వరద ముంపు ముప్పును తీవ్రం చేస్తాయి.ఇది చాలదన్నట్టు అరుణాచల్‌ సరిహద్దు సమీపంలోని టిబెట్‌ భూభాగంలో యార్లంగ్‌ జాం గ్బో (బ్రహ్మపుత్ర)నదిపై చైనా 60,000 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మిస్తోంది.అది చైనాలో యాంగ్జేనదిపై నిర్మించిన బృహత్తర త్రీగోర్జెస్‌ డ్యామ్‌కన్నా మూడిరతలు పెద్దది.ఈసూపర్‌ డ్యామ్‌ వల్ల అరుణాచల్‌లోకి నీటిప్రవాహం తగ్గిపోతుంది. కాబట్టి అక్కడ11,000మెగావాట్ల ఎగువ సియాం గ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి జాతీయ జల విద్యుదు త్పాదన సంస్థ(ఎన్‌హెచ్‌పీసీ)నడుం కట్టింది.
ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రకృతి విపత్తులు
ప్రపంచవ్యాప్తంగా అలా ప్రకృతి విప త్తుల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న 15 దేశాల జాబితాను 2018 వరల్డ్‌ రిస్క్‌ రిపోర్ట్‌ ప్రచురించి ంది.ఆ జాబితాలో భారత్‌ పొరుగు దేశం బంగ్లా దేశ్‌ కూడా ఉంది.భూకంపాలు,సునామీ, తుపాన్లు, వరదల లాంటి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉన్న172దేశాలనుఈరిపోర్ట్‌ అధ్యయనం చేసింది. దాంతోపాటు ఆవిపత్తులకు ఆయా దేశాలు స్పం దించే శక్తినికూడా అంచనా వేసింది.జర్మనీకి చెంది న వివిధ సంస్థలు సంయుక్తంగా చేసిన ఈ అధ్య యనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగు రు పిల్లల్లో ఒకరు ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు.గత ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా ఇళ్లను కోల్పోయి వలస వెళ్లిన వారిలో సగం మంది18ఏళ్ల లోపు వాళ్లేనని ఐరాస చెబుతోంది.ఈజాబితాలో ఎక్కువగా దీవులే ఉన్నా యి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుండటంతో, వాటికి పొంచి ఉన్న ప్రమాదం కూడా అంతకంతకూ పెరుగుతోంది.అన్నిటికంటే దక్షిణ పసిఫిక్‌ సము ద్రంలో ఉన్న వనువాటు దీవి పరిస్థితే మరింత ప్రమాదకరంగా ఉంది. ప్రకృతి విపత్తుల ప్రమాదం తో పాటు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈజాబితాను రూపొందిం చారు. అందుకే నిత్యం భూకంపాల బారిన పడే జపాన్‌,చిలీ లాంటి దేశాలు ఈ జాబితాలో కనిపిం చలేదు. అలాగే వందల ఏళ్ల పాటు పెరుగుతున్న సముద్ర మట్టం సమస్యతో పోరాడిన హోలాండ్‌ కూడా జాబితాలో 65వ స్థానంలోఉంది.ఈ దేశా లు విపత్తుల ప్రమాదాన్ని తగ్గించలేకపోవచ్చు, కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోగలవని ఆనివేదిక చెబు తోంది.2030 నాటికి 32కోట్ల మంది ప్రజలు విపత్తులు ఎక్కువగా పొంచి ఉన్న ప్రాంతాల్లో జీవిస్తారని అంచనా.ఈ విపత్తులు ప్రజల జీవితా లను నాశనం చేయడంతో పాటు దేశాలను మరిం త పేదరికంలోకి నెట్టేస్తాయి.
ఇథియోపియాతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ లోని కొన్ని ప్రాంతాల్లో అనారోగ్యం, వరకట్నాలతో పాటు కరవు లాంటి విపత్తులు కూడా ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తున్నాయని ఓవర్సీస్‌ డెవలప ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక చెబుతోంది.2012 నాటి ‘మ్యాపిల్‌క్రాఫ్ట్‌’ నివేదిక ప్రకారం… ఆసి యాకు చెందిన బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మయన్మార్‌, భారత్‌, వియత్నాం లాంటి దేశాలకే ఎక్కువగా ప్రకృతి విపత్తుల ప్రమాదం పొంచి ఉంది.విపత్తు లను నివారించలేకపోయినా,వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితే నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. ఆ విషయంలో ఒడిశాను స్ఫూర్తిగా తీసుకోవచ్చని పర్యావరణ నిపుణులు చెబుతారు.1999లో ఒడిశా లో సంభవించిన తుపాను ధాటికి పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తుపాను నుంచి ఒడిశా చాలాపాఠాలు నేర్చుకుంది. గత 20 ఏళ్లలో తుపాన్లను ఎదుర్కోవడానికి పక్కాగా సన్నద్ధమైంది. దానికోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని సైతం తీసుకుంది. ఈక్రమంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీ సహ కారంతో దాదాపు 900తుపాను సహాయక శిబి రాలను నిర్మించింది’1999 పెనుతుఫాను తరు వాత మేం పాఠం నేర్చుకున్నాం. ఆ పైన ఎలాంటి విపత్తు ఎదురైనా సమర్థంగాఎదుర్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం.వీలైనంత తక్కువగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండాలని భావించాం’ అని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్‌ బిష్ణుపాద సేథి అన్నారు.‘గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంభవిం చిన ఫైలిన్‌ తుపానునే తీసుకుంటే ఆతుపాను ధాటికి ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం తక్కువే.కాబట్టి ఆప్రాంతానికి ఆర్థికసాయం భారీగా అందలేదు. అది ప్రజల జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపింది. చనిపోయే వారి సంఖ్యకూ, ఆర్థిక సాయానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది’ అని ఓవర్సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఓడీఐ) కు చెందిన డాక్టర్‌ మిషెల్‌ వివరిస్తారు.ప్రకృతి విపత్తుల కారణంగా మరింత పేదరికంలో జారి పోయే దేశాలజాబితానూ ఓడీఐ తయారు చేసింది. అందులో బంగ్లాదేశ్‌ తొలి స్థానంలో ఉంది.
1999 తరువాత ఒడిశా ఏమేం చర్యలు తీసుకుంది?
ఐఐటీ-ఖరగ్‌పూర్‌ సహాయంతో 879 తుపాను, వరద సహాయక శిబిరాలను నిర్మించారు. లక్షమందికి పైగా బాధితులకు ఆవాసం కల్పించేం దుకు 17వేలకు పైగా ప్రత్యేక కేంద్రాలను నిర్మిం చారు.తీర ప్రాంతాల్లో 122సైరన్‌ టవర్లతో పాటు, తుపాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.17జిల్లాల్లో ‘లొకేషన్‌ బేస్డ్‌ అలారం వ్యవస్థ’ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజలకు తుపాను ప్రభావానికి సంబం ధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందిస్తారు.బలమైన గాలులను తట్టుకునేలా తీరప్రాంతంలో ఇళ్ల గోడ లు,పైకప్పులను పటిష్ఠ పరిచారు.మత్స్యకారుల కోసం ప్రత్యకవార్నింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మేల్కోలుపు అవసరం…
మానవాళిపై పడగవిప్పిన ప్రకృతి విఫత్తులను నిలువరించాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి.అందుకోసం అడవుల విస్తీర్ణా న్ని పెంచాలి.శిలాజ ఇంధనాల వినియోగాన్ని వీలై నంతగా తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలి.కర్బన్‌ ఉద్గారాలను తగ్గించుక పోతే 2100 సంవత్సరం నాటికి హిందూ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు 3.8డిగ్రీల సెల్సి యన్‌ మేర ఎగబాకే అవకాశం ఉందని వాతా వరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అదే జరిగితే కుండపోత వానలు,భీకర వరదలతో పెనువిలయం తప్పదన్న ఆందోళణలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఆరేబియా సముద్ర ఉష్ణోగ్రతలూ ఇటీవల పెరగడం తుఫానుల ముప్పును యాభైశాతం మేర పెంచింది.పుడమి పరిరక్షణకు కోరి కాఫ్‌ వంటి అంతర్జాతయ సదస్సులను నిర్వహిస్తున్నారు. వాటిలో చేసేతీర్మానాలను ప్రపంచదేశాలు సక్రమం గా అమలు చేయడం లేదు.భవిష్యత్‌ తరాలు భూ మిపై మనుగడ సాగించాలనే ఉష్ణోగ్రతలకు కళ్లెం వేయడం తప్పనిసరి.ఇందుకోసం కర్బన్‌ ఉద్గారా లను కట్టడి చేయడం,పుడమిని పర్యావర ణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత.
ప్రకృతితోనే భద్రమైన భవిష్యత్తు
భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రకృతే ఆధారం. ఇది సృష్టి,స్థితి,లయలకు కారణ మైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450కోట్ల సంవత్స రాలలో అభివృద్ధి చెందిందని జీవశాస్త్ర చరిత్ర చెబుతోంది.డార్విన్‌ సిద్ధాంతం ప్రకారం జీవ పరిణామానికి,జీవుల వికాసానికి ప్రకృతి పుట్టినిల్లు. మనం పీల్చేగాలి,తాగేనీరు,తినే ఆహారం, పండిరచే నేల,భూమిలోని ఖనిజాలు,రాయి,కాంతి,ఉష్ణం, చెట్లు,జంతువులు అన్నీప్రకృతిలోభాగాలుగాఉంటూ సమతుల్యతను కాపాడుతున్నాయి.ప్రకృతి మన మనుగడకు తోడ్పడుతూ రోజువారీ జీవన వినియో గానికి ఉపయోగపడే అనేక అవసరాలను నిస్వా ర్థంగా తీరుస్తున్నది. అందుకే ప్రకృతిని తల్లి అని అంటారు.ప్రకృతి మనకు భౌతికావసరాలనే కాకుండా మానసికోల్లాసం, మనశ్శాంతి, మానసిక ఆరోగ్యం,రసాత్మకత అంతిమ ఆనందం ఇవ్వడా నికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో భారతీయ పర్యావరణ సంస్కృతి మహోన్నతమైంది. అనాది నుండి కూడా భారతీయులు ‘ప్రకృతిని ఆవిష్కరిం చుకోవడం ద్వారా మనల్ని మనం ఆవిష్కరించు కోవచ్చు’ అనే నైతిక తాత్విక చింతనను కలిగివుండి ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనే భావనతో ప్రకృతిని ఆరాధిస్తూ, కాపాడుతూ ప్రకృతితో సామరస్య జీవనం గడిపేవారు. కానీ ఈ చరాచర జగత్తులో భాగమైన నేటి ఆధునిక మానవుడు అభివృద్ధి, విలాసవంతమైన జీవితం, శాస్త్ర పురోగతిల నెపంతో నేడు తనతో పాటు ప్రకృతిలో కోట్లాది జీవరాశులున్నాయని, ప్రకృతి సమస్త జీవరాశుల ఉమ్మడి ఆస్తి అనే విచక్షణను కోల్పోయి ప్రకృతిపై దాడి చేస్తూ అడవుల విధ్వం సం,ఆవాసప్రాంతాల విధ్వంసం జీవవైవిధ్య విధ్వం సం లాంటి రకరకాల విధ్వంసాలకు పాల్పడుతు న్నాడు.ఈ కారణంగా ప్రకృతి ప్రమాదంలోకి నెట్టి వేయబడటంతో అసంఖ్యాక వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి.
జీవించే హక్కును సైతం హరించి వేస్తున్న ప్రకృతి విధ్వంసం అనే సమస్య అణుబాం బు కన్నా ప్రమాదకరమైనదని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచటానికి, సుస్థిరా భివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రపంచ దేశాలన్నీ పూనుకున్నాయి. గత సంవత్సరం ప్రకృతితో సామ రస్య జీవనం గడపటం అనే నినాదంతో నిర్వహిం చగా, ఈ సంవత్సరం 28 జులై 2023 న ఫారెస్ట్స్‌ అండ్‌ లైవ్లీ హుడ్‌ -సస్టేనింగ్‌ పీపుల్‌ అండ్‌ ప్లానేట్‌ అనే ఇతివృత్తంతో ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సంర క్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రధానంగా అసాధారణ వాతావరణ మార్పులు, భూతాపం,తీవ్రమైన చలి,ఓజోన్‌ పొర క్షీణత, అడవుల కార్చిచ్చు,సునామీలు,కొండ చరి యలు విరిగిపడటం,ఎల్‌ నినో,-లానినో పరిస్థి తులు, హీట్‌ వేవ్స్‌,తుపానులు,వరదలు, కాలుష్యం, కోవిడ్‌ -19 లాంటి మహమ్మారి,వ్యాధులు ప్రబల డం వంటి తీవ్ర పర్యావరణసమస్యలు,-పరిష్కార మార్గాలు, సహజ వనరుల సంరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణల గురించి చర్చనీయాంశాలుగా ఉంటా యి.ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ పర్యా వరణ పరిరక్షణ సంస్థలతోపాటు జాతీయ పర్యావ రణ పరిరక్షణ సంస్థలు కూడా 2030 సంవత్స రాన్ని మైలు రాయిగా ఎంచుకొని, వారు రూపొంది స్తున్న పలు పరిశోధన అంశాలతో కూడిన పర్యావ రణ వ్యూహాల అమలు, వాటి లక్ష్యసాధనకు పాలకు లు, ప్రజలు సమష్టిగా నిరంతరం కృషి చేయాలని లేనిచో సమీప కాలంలో ప్రకృతి విలయం తప్పదని చేస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవల సిన అవసరం ఎంతైనా ఉంది. నేచర్‌-2030ప్రో గ్రామ్‌ అనేది ఇంట ర్నేషనల్‌ యూని యన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌నేచర్‌ (ఐయుసియన్‌) అనే పర్యా వరణసంస్థ ప్రవేశపెట్టిన ఒకబృహత్తర మైన ప్రకృతి సంరక్షణ కార్యక్రమం.ఐయుసియన్‌ అనేది 1400 లకు పైగా ప్రభుత్వ, పౌరసమాజ సంస్థల సభ్య త్వం,15000 లకు పైగా పర్యావరణ నిపుణులను కలిగిన ప్రపంచంలోని అతిపెద, అత్యంత వైవి ధ్యమైన నెట్‌వర్క్‌ కలిగిన అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థ.దీని ప్రధాన కార్యాలయం స్విట్జ ర్లాండ్‌లో ఉంది.ఈసంస్థ ప్రతినాలుగేండ్లకు ఒక సారి వరల్డ్‌ కన్జర్వేషన్‌ కాంగ్రెస్‌ (డబ్ల్యుసిసి) సమావే శాలను నిర్వహిస్తూ ప్రకృతి వనరులు జీవ వైవిధ్య సంరక్షణ, పునరద్ధర ణలే లక్ష్యాలుగా పర్యావరణ వ్యూహాలను రూపొం దిస్తూ ప్రపంచ దేశాలకు మార్గ నిర్దేశనంచేస్తుంది.ఒకే ప్రకృతి,-ఒకే భవిష్య త్తు (వన్‌ నేచర్‌-వన్‌ ఫ్యూచర్‌) అనే నినాదంతో నేచర్‌-2030 ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేసి 2021-2030 కాలాన్ని ప్రకృతి పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది.2020 తర్వాత వాతావరణ పరిస్థి తులు,గ్లోబల్‌ డైవర్సిటీ,సుస్థిరాభివృద్ధి అంశాల ప్రాతిపదికన నేచర్‌-2030 ప్రోగ్రామ్‌ ఎజెండాను రూపొందించింది.ఈపదేండ్ల కాలవ్యవధిలో 2030 నాటికి భూభాగం నీరు,సముద్రాలు, వాతా వరణం,జీవవైవిధ్యములను,మానవ ఆరోగ్యం, మానవ శ్రేయస్సులతో సమన్వయం చేసి సమగ్ర సుస్థిరాభివృద్ధి దిశగా ప్రోత్సహించడమే ఈప్రోగ్రా మ్‌ ముఖ్య లక్ష్యం.ఈ ప్రకృతి పరివర్తనాత్మక మార్పుకు రికగ్నైజ్‌,రిటేయిన్‌,రిస్టోర్‌,రిసోర్స్‌, రికనెక్ట్‌ అనే ఐదు(5-ఆర్స్‌) క్రాస్‌ కటింగ్‌ వాహ కాలు సహాయకారులుగా ఉపయోగపడుతాయి.

1 2 3 14