శ్రమ జీవులు గిరిజన మహిళలు

8మార్చి 2025న,‘‘అందరికీ మహిళలు మరియు బాలికల కోసం: హక్కులు అనే థీమ్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాతో చేరండి. సమానత్వం. సాధికారత.’’ఈ సంవత్సరం థీమ్‌ అందరికీ సమాన హక్కులు, అధికారం మరియు అవకాశాలను అన్‌లాక్‌ చేయగల చర్యను మరియు స్త్రీవాద భవిష్యత్తును ఎవరూ వదలని చోటికి పిలుస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ దినోత్సవం.లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడానికి చర్యకు పిలుపుని కూడా సూచి స్తుంది. మహిళల విజయాలను జరుపుకోవ డానికి లేదా మహిళల సమానత్వం కోసం ర్యాలీ చేయడానికి సమూహాలు కలిసి రావడం తో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన కార్యాచరణ కనిపిస్తుంది.ఏటా మార్చి 8న గుర్తు పెట్టబడు తుంది, ప్రపంచ మహిళా ఆర్థిక సాధికారతను కల్పిం చడం,మహిళా ప్రతిభను నియమిం చడం, నిలుపుకోవడం మరియు అభివృద్ధి చేయడం. మహిళలు,బాలికలను నాయకత్వం, నిర్ణయం తీసుకోవడం,వ్యాపారంలోకి మద్దతు ఇవ్వడం, మహిళలు,బాలికల అవసరాలకు అనుగు ణంగా మౌలిక సదుపాయాల రూప కల్పన, నిర్మాణం మహిళలు,బాలికలు వారి ఆరోగ్యం గురించి సమాచారం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయప డటం. స్థిరమైన వ్యవసాయం ఆహార భద్రతలో మహిళలు,బాలికలను చేర్చడం. మహిళలు మరియు బాలికలకు నాణ్యమైన విద్య,శిక్షణను అందించడం.క్రీడలో మహిళలు మరియు బాలికల భాగస్వా మ్యాన్ని మరియు విజయాన్ని పెంచడం. మహిళలు,బాలికల సృజనాత్మక,కళాత్మక ప్రతిభను ప్రోత్సహిం చడం.మహిళలు, బాలికల అభ్యు న్నతికి తోడ్పడే మరిన్ని రంగాలలో ప్రసంగిస్తారు.
సమానత్వం ఎక్కడుంది!..
ఆకాశంలో,అవకాశంలో సగం అన్నది నినాదంగా మిగిలాల్సిందేనా?ఇది చేవికి ఇంపు కలిగించ డమే తప్ప..నేత్రానందం ప్రసాదించే అవకా శమే లేదా?జనాబా లెక్కల ప్రకారం, పురుషు లతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువన్నది ప్రపంచ స్థితి.స్త్రీలు ప్రవేశించని రంగం లేదని, నిపుణత కనబరచని పని.లేదని పదేపదే చెప్పడం సరే.వారు నిలబడగలిగేలా చేస్తున్న మా,ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చూస్తు న్నామా?అన్నదే మన దేశంలో నాటికీ నేటికీ ప్రశ్న.స్త్రీలంటే అప్పటికే ఇప్పటికీ చిన్నచూపే. విధి నిర్వహణ ప్రదేశాల్లో రక్షణ అంతంత మాత్రమే.శ్రమకు సరిపడా ప్రతిఫలం లభిస్తోందా అన్నది ఈనాటికీ సందేహాస్ప దమే.కాకుంటే..గతంలో కంటే వర్తమానంలో ప్రశ్నించే తత్వం పెరిగింది. నిలదీసి,నిగ్గదీసి నిలువునా కడిగి పారేసే ధీరత అలవాటుగా మారింది. ఆడవారిని కించపరిచే దుష్టశక్తుల పనిపట్టే తెగువా విస్తృతమవుతుంది. వీటన్నింటితో పాటు స్త్రీలపట్ల ఆలోచనా ధోరణిని ఇంకా మార్పుకావాల్సిన అగత్యమైతే ఇతర సమా జానికి చాలా ఉంది. ఆచరిస్తే సరి..!
సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. మహిళలూ మీకు జోహార్లు అంటూ ఏటేటా కవితలల్లే వారికీ కొదవ లేదు.ఆకాశం, అవకాశం వివాదాల జోరు సరేసరి.టన్నుల కొద్దీ పదజ్ఞానం కన్నా,ఎంతో కొంతైనా ఆచరించి చూపడం మిన్న.అది సాకార మైనప్పుడే ఆడపిల్ల పెదవి మీద దరహాసం మెరుస్తుంది.అంతేకానీ,ఇంటా బయటా.. మాటలు చేతలూ ఆమె కన్నీటికి కారణ మైతే,జాతికి నిష్కృతి ఉండదు.ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం దాకా ఇంతే!.
వరకట్న నిషేధ చట్టం-1961
భర్త, అతని తల్లిదండ్రులు, అడపడుచులు, అత్తింటి తరపున ఇతర బంధువులు ఎవరైనా వరకట్నం కోసం వేధిస్తే ఐదేండ్లకు పైగా జైలు,రూ.15 వేలకు తక్కువ కాకుండా జరి మానా విధిస్తారు.ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం,తీసుకోవడం రెండు నేరమే. వరకట్న వేధింపులకు సంబంధించి మహిళలు నేరుగా సంబంధింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులపై మొదటి శ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తుంది.
ర్యాంగింగ్‌ నిరోధక చట్టం-1997
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగ్‌ నిరోధక చట్టం నంబర్‌ 28ను తెచ్చింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 1800 18022 18055 నంబర్లకు విద్యార్థినులు ఫోన్‌చేసి సమస్యలను చెప్పవచ్చు. ర్యాగింగ్‌ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ర్యాగిం గ్‌కు పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటారు.
మహిళకు స్వేచ్ఛ కొంతే!
అందరూ ఒప్పుకోదగిన పరిణామం నాటికి, నేటికి స్త్రిల పరిస్థితులు మారాయి. నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతు న్నారు.ముఖ్యంగా అభినందించవలసిన విషయం- విద్యారంగం లో పాఠశాల మొదలు కళాశాల వరకు బాలికలదే అగ్రస్థానం.చదువులకోసం తాత్కాలిక ఉద్యోగాలు (మెహంది,అల్లికలు,శుభ కార్యాలలో పిండివంటలు తయారీ దార్లుగాను, హస్తకళలు, వాహనాలు నడిపే డ్రైవర్లుగాను) ఇలా ఎన్నో మరెన్నో పనులు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడుతూ ఉన్నత వ్యక్తిత్వంతో ప్రయో జకులైన మహిళలు నేటి భారతీయ సమాజంలో నిత్య ప్రకాశ దీపాలుగా చెమటను ఆజ్యంలా పోస్తూ దశదిశలా అఖండమైన కాంతులతో వెలిగిపోతున్నారు. ఆనందించవలసిన విషయం ఏమిటి అంటే వృత్తి విద్యాకోర్సులు, ఉద్యోగాలలో రాజకీయాలలో స్త్రిలకూ ప్రాముఖ్యం లభించడం. స్త్రిలు సమంగా నేర్పుగా అంకిత భావంతో గొప్పగా పనిచేయటం, వారు రాణించి నంత గొప్పగా పురుషులు రాణించలేకపోవడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి?
ఇలా పలు విధాలుగా వైద్య,విద్యా,విజ్ఞాన, రాజకీయ,క్రీడా,రక్షణ రంగాలలో ఎక్కడ చూసినా,ఏ నోటవిన్నా పదును పెట్టిన ఆయు ధంలా మహిళా శక్తి, యావత్‌ ప్రపంచం స్తంభించిపోయేలా ఉప్పెనలా పొంగి పొరలి నింగిని తాకుతున్న కెరటాలవలే ఎగసిన మహిళా స్ఫూర్తికి, ఎవరూ సాటిలేరు, పోటీ పడరు అనే విధం రాకెట్టులా ఆకాశంలో దూసుకుపోతున్న మహిళా చైతన్యం అందరూ హర్షించదగిన విషయం. ఈ ప్రపంచంలో మహిళలు రచయిత్రులుగా,కవయిత్రులుగా ఉపన్యాస కులుగా,ఉద్యమ కారిణులుగా ఉపాధ్యాయిని లుగా,గృహిణులుగా ఉన్నత ఉద్యోగస్తులుగా, మంత్రులుగా,శాసనస భ్యులుగా,న్యాయ మూర్తులుగా, న్యాయవాదు లుగా,ప్రాణాలను రక్షించే వైద్యులుగా,స్వచ్ఛంద సంస్థల అత్యున్నత అధికార సభలకు అధ్యక్షులుగా,ఆయా రంగాలలో వారు చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో మహిళలు ఆకాశంలో వెలిగే స్వయం ప్రకాశక నక్షత్రాలుగా వెలుగొం దుతున్నారు.
ఇకపోతే కొన్ని గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే- ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇంత గొప్పగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న ‘మహిళ పాత్ర’ సమాజంలో మమేకమవుతున్న ‘స్త్రి అభ్యుదయం’ ఇంకా మొదట్లోనే వుంది. మొక్కగానే వుంది. ఎక్కడో ఒకచోట దాని కూకటి వేరు కత్తిరించబడుతూనే వుంది. బాలికగా విద్యార్థినిగా, గృహిణిగా.. ఉద్యో గి నిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపొంతరాలు చెంది సమాజంలో భాగంగా మారినా స్త్రి యొక్క స్వయం నిర్ణయం ఇంకా పురుషుల చేతులలోనే వున్నది. స్త్రి పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలిసి నడవా ల్సిందే. కాని నియంతృత్వ ధోరణితో కట్టిపడే యటమే మహిళా స్వేచ్ఛకు ఇబ్బందిగా అభ్యం తరకరంగా ఉంది కాని అదే జరుగుతుంది కదా. కొన్ని చోట్ల అడుగడుగునా ఆటంకాలు. అలుపెరుగని మహిళా పోరాటాలు, మహిళల ఆత్మాభిమాన అణచివేతలు..ఆత్మవిశ్వాసానికి అవరోధం..ఇవన్నీ..కలిసి మహిళలను ఉప్పెనలా చుట్టుకుంటున్నాయి. తర తరాలనుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బాట్లు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థ కాలక్రమేణా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు జరగాలి. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా ఉద్యోగినిగా ఆర్థిక సేవలందిస్తూ, మాతృత్వంతో సంసారాన్ని పెంచే త్రిపాత్రధారిణిగా ఉప యోగపడే యంత్రంలా ఉందనుకుంటారు. కొందరి పురుషుల ఆలోచనలు కాని అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా స్త్రిలు శ్రమిస్తూనే వున్నారు. ఎలా అంటే నిరంతర నిత్య ప్రవాహంలా మహానదులై సముద్రాలై చరిత్రపుటంలో మహిళలు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. గృహ హింస, విడాకుల చట్టం- ఇలా ఇంకా ఎన్నో చట్టాలు స్త్రిలకి రక్షణ కవచాలుగా ఉన్నప్పటికి సగటు స్త్రి జీవితంలో రక్షణ కరువైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరూ అంగీకరించ వలసిందే.వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రిలపైన జరిగే అత్యాచారాలను అరికట్టే వౌలికమైన మార్పు పురుషులలో రావాలి.ఈ మార్పు ముఖ్యంగా ప్రతి ఇంటినుండి మొదలవ్వాలి. చట్టసబలో మహిళ లంతా ఏకతాటిపైకొచ్చినప్పటికీ మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికే ఎన్నెన్ని అవస్థలు పడ్డారో, ఎన్నెన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో యావత్‌ భారతావనికి తెలిసిన విషయమే. స్త్రిల యెడల ఇలాంటి పక్షపాత ధోరణి విడనాడాలి. మహిళా సాధికారత కార్యరూపం దాల్చాలి. మాటల రూపంలోనే మిగిలిపోకూడదు.
ఏది ఏమైనా సగటు స్త్రి జీవితంలో సంపూ ర్ణమైన, సమూలమైన మార్పు రావాలి. అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగా శిక్షించాలి. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో బ్రతుకగలగాలి. నిర్భయంగా నిర్ణయాధి కారాలు చేపట్టగలగాలి. అటువంటి సమ సమాజంలో అద్భుత ప్రపంచాన్ని ఆవిష్క రించాలి.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

మేమేమీ చేశాము పాపం?మాకెందుకీ శాపం?

విశాఖ ఉమ్మడి జిల్లాలో గల నాన్‌షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను పాడేరు ఐటీడీఏ పరిధిలో విలీనం చేస్తాం…అధికారం చేపట్టిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. నన్ము నమ్మండి…మీకు పూర్తి హామీ ఇస్తున్నా..2018లోవైసీపీనేత హోదాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వద్ద మైదాన ప్రాంత గిరిజనులకు జగన్‌ ఇచ్చిన హామీ నీటిమూటగా మారింది.ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభు త్వం గిరిజనులు నివసిస్తున్న నాన్‌షెడ్యూల్‌ ఏరియా లను షెడ్యూలు ఏరియాలుగా గుర్తించాలని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంప లేదు.జిల్లాల విభజన చేసినప్పటికీ నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయలేదు.కనీసం పాడేరు ఐటీడీఏలో కూడా విలీనం చేయలేదు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల పాడేరు,అరకులోయ అసెంబ్లీ నియోజక వర్గా లకు ఆనుకుని మైదానప్రాంత మండలాల్లో (నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియా) గలగ్రామాల్లోని గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.అటు ఐటీడీఏ పరిధి లో చేర్చక,ఇటు మైదానప్రాంత అధికారులు పట్టించు కోక పోవడంతో రెంటికీ చెడ్డరేవడిలా తయారైంది. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌, రహదారులు,పక్కా ఇళ్లు వంటి మౌలిక సదుపాయాలు కొరవడి, సమస్య లతో సతమతం అవుతున్నారు. కొద్దోగొప్పో చదువు కున్నా…ఐటీడీఏ పరిధిలో ఉద్యోగాలకు అర్హులు కారు.మైదాన ప్రాంతంలోని ఇతర గిరిజనులతో పోటీ పడే పరిస్థితి లేదు. తమ గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చి, ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలని సుమారు 300గ్రామాల గిరిజనులు దశాబ్దాలుగా ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నారు. మన్యానికి ఆనుకుని మైదాన ప్రాంతంలో వున్న గిరిజనుల గోడు నాధుడు కరవ య్యారు.
ఏజెన్సీలో అత్యంత వెనుకబడిన గిరిజనులు, ఆది వాసీల హక్కులను కాపాడడానికి, భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి, ఇతరుల నుంచి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఆయా ప్రాంతాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో చేరుస్తూ పార్లమెంటులో చట్టం చేసింది.దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70చట్టం అమల్లోకి వచ్చింది. కానీ మైదాన ప్రాంతానికి ఆనుకుని వున్న సుమారు 300 గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చలేదు.
కొరవడిన మౌలిక సదుపాయాలు
అనకాపల్లి జిల్లాలో కోటవురట్ల, నాతవరం, గొలుగొండ,రోలుగుంట,రావికమతం,చీడికాడ,వి. మాడుగుల,దేవరాపల్లి మండలాల్లో 37గ్రామ పంచాయతీల్లోని సుమారు 300 గ్రామాల్లో గిరిజనుల జనాభా అధికంగా ఉంది.అధికారుల అంచనా మేర కు ఈ పంచాయతీల్లో వాల్మీకి,భగత,కొండదొర, గదబ,నూకదొర,కొండకమ్మరి,కోందు,మన్నెదొర తెగలకు చెందిన గిరిజనులు లక్ష మందికిపైగా ఉన్నారు. పోడు వ్యవసాయం, జీవాలు, పశువుల పెంపకమే వీరికి జీవనాధారం. 5వ షెడ్యూల్‌లో వున్న ఏజెన్సీ ప్రాంతంతో పోలిస్తే ఈ గ్రామాలు మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత విషయాల్లో బాగా వెనుకబడ్డాయి. గిరిజన సబ్‌ప్లాన్‌ నిధులు కూడా మంజూరు చేయకపోవడంతో తాగునీరు, రహదారులు, విద్యుత్‌, పాఠశాలలు వంటి కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఈ గ్రామాల్లో ఎక్కడా ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు. ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నప్పటికీ ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండరు. నెలకు ఒకటి, రెండుసార్లు చుట్టంచూపుగా వచ్చి వెళుతుంటారు. తీవ్ర అస్వస్థతకు గురైనా, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా…డోలీలో మోసుకుంటూ వాహనాలు నడిచే ప్రాంతం వరకు తీసుకురావాలి. తాగునీటికి ఊటగెడ్డలు, చలమలే ఆధారం. దీంతో కలుషిత నీటి వల్ల వ్యాధులు, జ్వరాలు, అతిసార బారిన పడుతున్నారు. సాగునీటి సదుపాయం లేదు. చేద్దామన్నా కూలి పనులు ఉండవు. ఒక్క ఉన్నత పాఠశాల కూడా లేదు. ఉదాహరణకు రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలో చలిశింగం, రొచ్చుపణుకు, కడగడ్డ గ్రామాలకు చెందిన గిరిజన బాలబాలికలు హైస్కూల్‌ విద్య కోసం 14 కి.మీ. దూరంలో వున్న ఎంకేపట్నం ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలు సైతం దక్కడం లేదు. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలకు మైదాన ప్రాంత గిరిజనులు అనర్హులని అధికారులు అంటున్నారు. కనీస సదుపాయాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. మండల కార్యాలయాల వద్ద తరచూ ఆందోళనలు నిర్వహిస్తూ అధికారులు వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు.
గిరిజన సలహా మండలిలో తీర్మానం
రాష్ట్రంలో మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయాలని 2020 జూలైలో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్పవాణి నేతృత్వంలో గిరిజన సలహా మండలి (టీఏసీ) తీర్మానం చేసింది. ఈ మేరకు నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలోని గ్రామాల్లో సభలు నిర్వహించి 50 శాతానికిపైగా గిరిజనులు నివసిస్తున్న గ్రామాల జాబితాలను తయారుచేశారు. ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో 200 గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే అధికారులు చెప్పిన వాటికంటే ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయని, వాటిని కూడా ఏజెన్సీలో విలీనం చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గ్రామసభలు నిర్వహించి 22 నెలలు అయినా ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు.
కేంద్రానికి చేరని ప్రతిపాదనలు
మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరి యాలో (ఐటీడీఏ పరిధిలోకి) చేర్చేందుకు గల అడ్డం కులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. గిరిజనులు నివసిస్తున్న నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలను షెడ్యూలు ఏరియాలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపా దనలు పంపలేదని ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీన పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించారు. కనీసం జిల్లాల పునర్విభజన,కొత్తజిల్లాల ఏర్పాటు సమ యంలో అయినా తమను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేస్తారన్న ఆశలు సైతం ఆవిరయ్యాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఒత్తిళ్లే కారణమా?
మైదాన ప్రాంతానికి ఆనుకుని వున్న గిరిజన గ్రామా లను ఏజెన్సీలో విలీనం కాకుండా మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు గిరిజన సంఘం నాయకులు ఆరోపిస్తు న్నారు.నాతవరం,గొలుగొండ,రోలుగుంట, రావిక మతం,వి.మాడుగులమండలాల పరిధిలో పెద్ద మొత్తం లో లేటరైట్‌, గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మైనింగ్‌ లైసెన్సులు ఎవరైనా పొంద వచ్చు. అదే ఏజెన్సీ ఏరియాలో విలీనం చేస్తే గిరిజనే తరులకు అవకాశం లభించదు. మరోవైపు మైదాన ప్రాంతంలోని మండలాలను గత ఏడాది వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)లో చేర్చారు. ఈనేపథ్యంలో ఏజెన్సీని ఆను కుని వున్న మండలాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఈ మండ లాల్లోని గిరిజన గ్రామాలను ఏజెన్సీ ప్రాంతంలో విలీనం చేస్తే గిరిజనేతరులు భూముల క్రయవిక్ర యాలకు అనర్హులవుతారు.ఈకారణాల వల్లనే మైదాన ప్రాంత గిరిజన గ్రామాలు ఏజెన్సీలో విలీనం కాకుం డా మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అడ్డుపడు తున్నారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.-గునపిర్తి సైమన్‌

ప్రజా స్వామ్యం ఎక్కడ …?

ప్రజా శేయస్సును పక్కన పెట్టి కార్పొరేట్‌ దోపిడీకి అనుకూలంగా వుండే అభివృద్ధి నమూనాను విధించే ప్రయత్నంలో అటవీ భూముల నుండి తమని నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్న రాజ్యంతో ఆదివాసులు పోరాడుతున్నారు . సాంప్రదాయకంగా జీవించే భారతీయ ఆదివాసులు జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతూ నిరంతర పోరాటంలో చిక్కుకున్నారు. అనివార్యంగా విదేశీ మూలధనంపై ఆధారపడే ప్రాజెక్ట్‌ల కోసం, భారతదేశ సహజ వనరుల కార్పొరేట్‌ దోపిడీ కోసం అడవుల్లో నివసించేవారిని చట్టబద్ధంగా నిర్వాసితులను చేసేందుకు రాజ్యానికి అటవీ హక్కుల చట్టం 2006(ఫారెస్ట్‌ రైట్స్‌ యాక్ట్‌-ఎఫ్‌ఆర్‌ఎ), ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌ 1980 (ఎఫ్‌సిఎ) వంటి చట్టాలు రాజకీయ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.
‘‘పరిరక్షణ’’ అనే ముసుగు లేదా ‘‘నష్ట పరిహారం యిచ్చి అటవీ నిర్మూలన’’ వంటి ప్రహసనాల పేరుతో పర్యావరణంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసే సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను కూడా ఈ చట్టాలు సులభతరం చేస్తాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల, పులుల అభయారణ్యాలు వంటి ప్రత్యేక రక్షిత ప్రాంతాలను సృష్టించడం ద్వారా అటవీ భూముల్లోని విస్తారమైన ప్రాంతాలపై రాజ్యం తన నిర్దిష్ట ప్రభావాన్ని మరింతగా విస్తరిస్తుంది. ఎఫ్‌ఆర్‌ఎ, ఎఫ్‌సిఎ వంటి చట్టాలు ఆదివాసీలకు అందించడానికి ప్రతిపాదించబడిన ప్రజాస్వామిక అవకాశాలు కూడా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం యుగంలో నిరంతరం క్షీణిస్తున్నాయి.
ఆదివాసీల అటవీ భూములపై ప్రాజెక్టులను ఆమోదించడానికి ముందస్తుగా గ్రామసభ సమ్మతి అవసరాన్ని తొలగించడానికి 2022 సవరణ తర్వాత ప్రభుత్వం అనుమతించిందిబీ ఇప్పటికే పలుచన చేయబడిన, పనికిరాని ఆదివాసీల చట్టపరమైన రక్షణలపై దాడి ఎఫ్‌సిఎ కోసం ప్రతిపాదించిన కొత్త సవరణలతో మరింతగా కొనసాగింది.
వార్తల్లో వున్న అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు-2023 ప్రజలలో గణనీయమైన వివాదాన్ని రేకెత్తించింది. ప్రస్తుతం రాజ్యసభలో చర్చ కోసం వేచి ఉంది. బహుశా జూన్‌లో దాదాపుగా ఎటు వంటి చర్చ లేకుండా లోక్‌సభ ఆమోదించిన తర్వాత అమలులోకి వస్తుంది.
కొత్త సవరణలు ప్రవేశపెట్టిన మార్పులు స్థూలంగా
మొదటిది,చట్టం కింద రక్షిత ప్రాంతంగా ఉండా లనే దానికి సంబంధించి కొన్ని సుప్రీం కోర్టు తీర్పులు మంజూరు చేసిన సడలింపులను తొలగించడానికి ‘‘అడవి’’ అనే పదాన్ని మారుస్తుంది.
రెండవది,‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక వరుస ప్రాజెక్టులను’’ చేపట్టేందుకు సరిహద్దు భూముల్లో అడవులను నిర్మూలించడానికి అనుసరించాల్సిన విధానపరమైన అవసరాలకు మినహాయింపును మంజూరు చేస్తుంది, అటు వంటి ప్రాంతాలలో అటవీ భూములను, అక్కడి జనాభాను తొలగించి రోడ్డు మార్గాలు, రైల్వేలు, పారిశ్రామిక ప్రాజెక్టులను నిర్మించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా,‘‘వామపక్ష తీవ్రవాద’’ ప్రభావిత ప్రాంతాల్లో’’జాతీయ భద్రత’’ పేరుతో ప్రజల ప్రతిఘటనను అణచివేయడానికి ప్రభుత్వానికి మినహాయింపునిస్తుంది.
మూడవది, అటవీ భూములలో జంతు ప్రదర్శనశాలలు, ‘ఇకో-టూరిజం(పర్యావరణ హిత)’ సౌకర్యాలు వంటి కొన్ని అటవీయేతర కార్యకలాపాలను బిల్లు అనుమతిస్తుంది. ప్రధానంగా వీటికి ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తుందిబీ సామ్రాజ్యవాద సంపదకు సేవ చేస్తుంది. ఇది ఈ ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలపై, అటువంటి ప్రాజెక్టుల ప్రయోజనాల కోసం నిర్వాసితులయ్యే / జీవనోపాధిని కోల్పోయే జనాభాపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
‘ఫారెస్ట్‌’ (అడవి) పదంలో మార్పు అంటే అర్థం ఏమిటి?
భారతదేశపు చట్టపరమైన చట్రంలోపల ‘అడవి’ అనే పదానికి తిరిగి నిర్వచనం యివ్వడం చుట్టూ బిల్లు దృష్టి కేంద్రీకృతమై వుంటుంది. ఏదైనా సంబంధిత చట్టం లేదా అధికారిక ప్రభుత్వ రికార్డులతో సహా భారతీయ అటవీ చట్టం-1927 ప్రకారం ‘అడవులు’గా నమోదు అయినవి మాత్రమే ఈ చట్టం పరిధిలో ‘అడవులు’గా గుర్తింపు పొందాలనే నిబంధన యిందులో వుంది.
దీన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి,టి ఎన్‌ గోదావర్మన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 1996 తీర్పును ప్రస్తావించడం చాలా అవసరం. భారతదేశంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై ఈతీర్పు కేంద్రీకృతమై ఉంది. అడవులలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ, వన్యప్రాణ సంరక్షణను ప్రోత్సహించడం, పర్యావరణ చట్టాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఫలితంగా భారతదేశంలోని అటవీ ప్రాంతాలను సంరక్షించడానికి సుప్రీం కోర్టు ముఖ్యమైన ఆదేశాలు వచ్చాయి. తన నిఘంటువు నిర్వచనంని ‘‘అడవి’’కి అన్వయించడం ద్వారా ఈ తీర్పు అటవీ సంరక్షణ చట్టం పరిధిని విస్తృతం చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ తీర్పు ఫలితం ఆదివాసీ సముదాయాలకు ఏ మాత్రం అందడం లేదు.
వాస్తవానికి, ఈ తీర్పు పర్యావరణం, పరిరక్షణ ప్రయత్నాలలో సుప్రీం కోర్టుని ఒక ఛాంపియన్‌గా చూపవచ్చు, కానీ వాస్తవానికి సుప్రీం కోర్టు 2019 తీర్పులో అడవుల్లో నివసించే ఆదివాసీలను చట్టబద్ధం చేయడానికి, అలా కానివారిని తొలగించాలని ఆదేశించడంపై కేంద్రీకరించింది. ఆ తీర్పు అటవీ భూమిపై సాంప్రదాయ అటవీ నివాసుల 11.8లక్షల దావాలను తిరస్కరించడం తోపాటు,అలా తిరస్కరించబడిన జనాభాను త్వరగా తొలగించాలని కూడా 16రాష్ట్రాలను ఆదేశించింది.
అటవీ పరిరక్షణ చట్టానికి చేసిన సవరణలు గోదావరమన్‌ తీర్పు ఆదివాసీలకు అందించినట్లు కనిపించే స్పష్టమైన, నిజాయితీ లేని చట్టపరమైన రక్షణలను కూడా పలుచన చేస్తాయి. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023 ప్రకారం, 1980 అక్టోబర్‌ 25 తరువాత నుండి ప్రభుత్వ పత్రాలలో అధికారికంగా అడవులుగా గుర్తించిన ప్రాంతాలకు చట్ట పరిధి పరిమితం అవుతుంది. అందువల్ల ప్రత్యామ్నాయ ప్రయోజనాల కోసం విస్తృతంగా అటవీ భూముల బదలాయింపులకు దారితీయడంలో ఈ ప్రభావం కనిపిస్తుంది. అడవి తొలగింపుకు అనుమతులను పొందడం, స్థానిక సముదాయానికి అవసరమైన సమాచారం యిచ్చి సమ్మతి కోరడం లాంటి చట్టం అందించిన రక్షణ లను 2022లో చేసిన సవరణ ఇప్పటికే తొలగించింది.
ప్రత్యేకించి హానికిగురయ్యే ఆదివాసీ సమూహం (పివిటిజి-పర్టిక్యులర్లి వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌) డోంగ్రియా కోండ్‌ నివసించే ప్రాంతాలు వున్న ఆరావళి శ్రేణిలో సుమారు 40%, నియమగిరి కొండల శ్రేణిలో 95% పైన గణనీయంగా ప్రభావితమవుతాయి. ఈ సవరణలు అటవీ యేతర, కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం అడవులను బదిలీ చేయడానికి సంబంధించి రాజ్యానికి మరింత అధికారాన్ని ఇవ్వడమే కాకుండా,సామ్రాజ్యవాద,వర్గ ఆధారిత అభివృద్ధిని తప్పనిసరిగా ప్రోత్సహించడానికి మన సహజ వనరులను, భూమిని దోపిడీ చేయడానికి చట్టాన్ని ఎలా ఉపకరణంగా ఉపయోగించవచ్చనేది కూడా చూపిస్తాయి.
‘‘అభివృద్ధి భారం’’: అభివృద్ధి ఎవరి కోసం?
అభివృద్ధికి సంబంధించి ప్రజా వ్యతిరేక నమూ నాను ప్రతిపాదిస్తున్నట్లు అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు ప్రాథమిక విశ్లేషణలో స్పష్టమవు తుంది. ఇది ఆదివాసీ సముదాయాలపై పరాన్న జీవి. వారి జీవనశైలికి హాని కలిగించే అభివృద్ధి నమూనాకు మద్దతుగా అటవీ భూముల నుండి వారిని నిర్వాసితులను చేయడంపై ఆధార పడిరది.‘‘అభివృద్ధి’’ అనే రాజ్య దృక్పథానికి మద్దతుగా భారతీయ అడవులలో చారిత్రాత్మకంగా నివసించే ఆదివాసీ సమూహాలపై ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి చరిత్రనే భారత దేశంలోని అటవీ ‘‘పరిరక్షణ’’ చట్టాల చరిత్ర.
వలసరాజ్యాల కాలంలో, భారతీయ అడవులను ఆ రాజ్యాల ‘‘అభివృద్ధి’’ని ముందుకు తీసుకువెళ్ళే ప్రాజెక్టులకు వనరులను సమకూర్చే అజ్ఞాత గనిగానూ, రైల్వేలు, కార్యాలయాలులాంటి వలసరాజ్యాధిపతుల మౌలిక సదుపాయాల నిర్మాణంలో సహాయపడేవిగానూ గుర్తించారు.
అందువల్ల, డైట్రిచ్‌ బ్రాండిస్‌ అభివృద్ధి నమూనాను భారతదేశంలోని అటవీప్రాంతాలలో ప్రవేశ పెట్టారుబీ ‘‘శాస్త్రీయ అటవీ’’ పేరుతో అటవీ భూములు నరికివేసారు, వలసరాజ్యాల అభివృద్ధికి కలపను అందించే ప్లాంటేషన్‌ నమూనాను ప్రవేశపెట్టారు. (భారతదేశంలోని బ్రిటీష్‌ ప్రభుత్వం ఒక జర్మన్‌ వృక్షశాస్త్రజ్ఞుడు డైట్రిచ్‌ బ్రాండిస్‌ను భారతదేశపు మొదటి జాతీయ అటవీ విభాగానికి అధిపతిగానూ, నిర్వహణాధికారిగానూ నియమించింది. అదే 1864లో స్థాపించబడిన ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌. ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ స్థాపన,ఆతర్వాత ఏర్పడిన ఇంపీరియల్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (1867)ల వల్ల రాజ్య-అటవీ సంబంధాలలో పెద్ద ఎత్తున పర్యవసానాలు జరిగాయి. మరీ ముఖ్యంగా, చారిత్రకంగా అటవీ భూమి, వనరులతో ముడిపడి ఉన్న వారి స్థితిగతులను ప్రభావితం చేసాయి. అటవీ భూమి, వనరులపై సాంప్రదాయ హక్కు లను అనుభవిస్తున్న అటవీ నివాస సముదాయాల స్థానంలో త్వరలోనే నిరంకుశాధికారులు,అటవీ శాఖ అధికారులు వచ్చి చేరారు.ఆతర్వాత, భారతదేశంలోని వారి సేవక (హిజ్‌ మెజెస్టి) ప్రభుత్వం చేసిన శాసనాలు అటవీ నివాసులను నేరస్థులుగా పరిగణించాయి, వారిపై అటవీ భూమి ఆక్రమణదారులుగా ముద్ర వేసాయి. ఆదివాసీ సమూహాల తొలగింపులు,రాజ్య ఏజెంట్లు చేసిన మానవ హక్కుల ఉల్లంఘనలు, కోల్పోయిన అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోరాటాలు కొనసాగుతూండడం వల్ల ఈ వలసవాద సిద్ధాంత ‘పరిరక్షణ’ ప్రభావం నేటికీ కొనసాగుతోంది.) కాలక్రమేణా, శతాబ్దాలుగా ఈ భూముల మూల నివాసులను ఆదుకున్న సహజ వనరులను వలసరాజ్యాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవ డానికి, తద్వారా ఆదివాసీ సముదాయాలను నిర్వాసితులను చేయడానికి అటవీ చట్టాలు ఉపయోగపడ్డాయి.
బ్రిటీష్‌ ప్రభుత్వం క్రింద అటవీ హక్కుల చట్టం, కొన్ని అడవులను ‘‘రిజర్వ్‌’’గా వర్గీకరించింది. అటువంటి అడవులలో నివసించే ఆదివాసీ సముదాయాలు నిర్వాసితమయ్యాయి. వారి జీవనానికీ, జీవనోపాధికి ఆధారమైన అడవులలో లభించే వనరులను ఉపయోగించుకోడానికి అనుమతించలేదు. బస్తర్‌ ఆదివాసీ జనాభా తమ అడవిలో 2/3 వంతును ‘‘రిజర్వ్‌’’గా ప్రకటించ డానికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమ అణచి వేతలో,తమ భూమిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటులను బ్రిటిష్‌ సేనల క్రూర అణిచివేత కనపడుతుంది.
1947లో అధికార బదలాయింపు తర్వాత విస్తృత ప్రజానీకానికి కాకుండా రాజ్య ప్రయోజనాలకు ఉపయోగపడే, ఆదివాసీలను నిర్వాసితులను చేసే ఈ చారిత్రాత్మక అభివృద్ధి నమూనాను భారత రాజ్యం కొనసాగించింది.రాజ్యాంగం స్వయంగా ఆదివాసీ సముదాయాలు నివసించే కొన్ని ప్రాంతాలను ‘‘షెడ్యూల్డ్‌ ప్రాంతాలు’’గా గుర్తిం చింది.ఇవి ‘‘స్వపరిపాలన’’కు సంబంధించిన కొన్ని హక్కులను పొందుతాయి. ఏదేమైనప్పటికీ, ఈ నిబంధనయే రాష్ట్ర/కేంద్ర చట్టం ఈ ప్రాం తాలలో వర్తిస్తుందా లేదా అని నిర్ణయించే హక్కును రాష్ట్ర గవర్నర్‌కు యివ్వడంతో అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంచి నట్లయింది. ఆదివాసీ సముదాయాలకు స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్యం వున్నాయనే అపోహను బహిర్గతం చేస్తూ, ఈ ప్రాంతంలో ‘‘స్వయంప్రతిపత్తి కమిటీ’’ రూపొందించిన చట్టాలకు రాష్ట్ర గవర్నర్‌ సమ్మతి అవసరం అనే నిబంధన మరోసారి హానికరమైన అధికారాన్ని కేంద్రం చేతుల్లో ఉంచింది.
తాము నివసించే భూమిపై రాజ్యం చేపట్టే చర్యల విషయంలో ఆదివాసీ ప్రజల ప్రజాస్వామిక స్వరాన్ని వినిపించవచ్చనే అపోహను శాసన పరమైన చర్యలు కూడా కలిగిస్తాయి. స్వాతంత్య్రా నంతరం అటవీ హక్కుల చట్టం, ప్రత్యేకించి 2006లో చేసిన సవరణ, వ్యక్తిగత లేదా సమాజపర దావాల ద్వారా అటవీ భూములపై ప్రభుత్వ గుర్తింపు పొందిన హక్కులను పొందేం దుకు వీలు కల్పించడం ద్వారా ఆదివాసీ భూమిపై ఆదివాసీ రైతులు తమ హక్కులను సాధించు కోవడంలో సహాయపడే ప్రజాస్వామిక చట్టంగా ప్రకటితమయింది.
అయితే,అటువంటి దావాల వాస్తవ చరిత్ర అటవీ భూములపై ఆదివాసీ సముదాయాలు చేసిన దావాలను గుర్తించడానికి ప్రభుత్వానికున్న విముఖతను సూచిస్తుంది- మొత్తం గుర్తించబడిన దావాలలో 3.9% మాత్రమే (ఎఫ్‌.ఆర్‌.ఎ స్టేటస్‌ రిపోర్ట్‌, 2018 ప్రకారం) సాముదాయిక భూమికి అనుకూలంగా ఉన్నాయి, కానీ వాస్తవానికి 68.9% జనాభా సాముదాయిక భూమిగా బావించే అటవీ భూమిలో నివసిస్తున్నట్లు డేటా సూచిస్తుంది.
అంతేకాకుండా, మైనింగ్‌ ప్రాజెక్టులను సుల భతరం చేయడానికి అటవీ భూములపై ఆదివాసీల దావాలను తిరస్కరించిన చరిత్ర ఉంది, ఇటీవల 2015లో మైనింగ్‌ ప్రాజెక్ట్‌ ను సులభతరం చేసేందుకు జార్ఖండ్‌లోని రించి గ్రామం నుండి వచ్చిన 72దావాలు తిరస్కరణకు గురయ్యాయి. ఆ ప్రాంతంలో బొగ్గు బ్లాకులు వుండడమే ఆ తిర స్కరణకు కారణం. ఆదివాసీ సముదాయాల శ్రేయస్సు, మనుగడ కోసం కాకుండా, దాని ద్వారా నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టుల గురించి, వనరులను అందించడం గురించి ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తుందని ఈ వాస్త వం స్పష్టంగా వివరిస్తుంది.
ప్రజాస్వామిక నిర్మాణంగా చెబుతున్న 2006 సవరణ, తరువాత వచ్చిన చట్టాలు దాని సారాం శాన్ని తీవ్రంగా పలుచన చేసి అసలు ఏమీ లేకుండా చేసాయి. అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదానికి ముందు గ్రామసభ సమ్మతి తీసుకోవాల్సిన అవసరాన్ని 2022 నిబంధనలకు చేసిన సవరణ తిరస్కరించిందని, అప్పటికే ఆమోదం పొందిన అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ఆమోదించే దశకు అటువంటి ‘‘సమ్మతి’’ని తరలించిందని అటవీ పరిరక్షణ నియమాల శాసన చరిత్రను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.
2022 సవరణ, ఇతర చట్టాల ప్రభావం 2006 ఎఫ్‌ఆర్‌ఎ అందించిన బలహీనమైన ప్రజాస్వామిక హక్కులను మరింతగా పలుచన చేయడం గురించి భారతదేశంలోని కొత్త అటవీ సంరక్షణ నియమాల రాజకీయ ఆర్థిక వ్యవస్థలో మరింతగా అన్వేషణ జరిగింది.
సామ్రాజ్యవాద పెట్టుబడి ద్వారా నిధులు సమ కూర్చే టాటా బిర్లా,అదానీ,అంబానీల వంటి దళారీ బూర్జువాల (రాజ్యం మద్దతుతో సామ్రా జ్యవాద పెట్టుబడికి సేవ చేసే బూర్జువ ాజీలో ఒక సెక్షన్‌) ప్రాజెక్టుల ప్రయోజనాలకు మద్దతు నివ్వడానికి భారత రాజ్యం పూర్తిగా సైనిక అణచివేతను ఉపయోగించింది. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ వంటి సైనిక కార్యకలాపాల ద్వారా యిచ్చిన మద్దతు పస్తుత ఆపరేషన్‌ సమాధాన్‌-ప్రహార్‌ ద్వారా పరిపూర్తి అయింది. రాజ్యం చేసే ఈ సైనిక దాడులు అటవీ ప్రాంతాలలో నివసించే ఆదివాసీ జనాభాపై దాడి. ఆపరేషన్‌ సమాధా నన్‌-ప్రహార్‌ కింద, వామపక్ష తిరుగుబాటును ఎదుర్కోవడానికి భారత రాజ్యం ఛత్తీస్‌గఢ్‌లోని తన సొంత పౌరులపై వైమానిక బాంబు దాడికి దిగింది.ఆదివాసీ జనాభాపై భారత ప్రభుత్వం చేస్తున్న ఈ మారణహోమ యుద్ధానికి అటవీ పరిరక్షణ చట్టానికి ప్రతిపాదించిన కొత్త సవరణలు సహాయపడతాయి. ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక వరుస ప్రాజెక్టుల’’ కోసం సరిహద్దు భూములను, ముఖ్యంగా ప్రభుత్వం సవరించిన బిల్లులో ‘‘వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు’’గా వర్గీకరించిన భూమిని మినహాయించడం ద్వారా, ‘‘జాతీయ భద్రత’’ అనే పురాతన కవచం కింద ప్రభుత్వం చేసే నిర్థారణ అటవీ భూములను, జనాభాను తొలగించగలుగుతుంది, సామ్రాజ్యవాద దోపిడీకి మరింత వనరులను సమకూర్చగలుగు తుంది. భారతదేశంలోని అడవులలో నివసించే ఆదివాసీ జనాభాకు వ్యతిరేకంగా జరుపుతున్నఈ సంపూర్ణ యుద్ధాన్ని ‘‘అభివృద్ధి’’ పేరుతో రాజ్యం సమర్థిస్తోంది. ఈ అభివృద్ధి దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందని పట్టణీకరణకు, బహుళజాతి మైనింగ్‌ ప్రాజెక్టులకు సహాయం చేస్తుంది అని అంటోంది. హిరాకుడ్‌ డ్యామ్‌ ద్వారా నిర్వాసితులైన ప్రజలకు నెహ్రూ చెప్పినట్లుగా 1948 నాటికే ‘‘నిర్వాసితులను చేయడం ద్వారా అభివృద్ధి’’నమూనాకి నాంది పలికింది. ‘‘దేశ ప్రయోజనాలకు’’ సహాయం చేస్తుంది.2011లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ‘అభివృద్ధి’ ప్రాజెక్టుల కారణంగా భారతదేశంలో 50 సంవత్సరాలలో దాదాపు అయిదు కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
వీటిలో,డ్యామ్‌లు,గనులు,పారిశ్రామిక అభివృద్ధి మొదలైనవాటి కారణంగా రెండు కోట్లకు పైగా ‘అభివృద్ధి’ ప్రేరిత అంతర్గతంగా నిర్వాసితులైన వ్యక్తులు (ఐడిపి-ఇంటెర్నల్లి డిస్‌ప్లేస్డ్‌ పర్సన్స్‌) ఉన్నారు. వీరిలో 40%గా ఉన్న ఆదివాసీలు మరింత దారుణగా ప్రభావితమవుతున్నారు.
ఆదివాసీల నిర్వాసిత్వానికి పారిశ్రామికీకరణ అతిపెద్ద కారణం. ఆదివాసీల ప్రాంతాల్లో గని తవ్వకాల ప్రాజెక్టుల కారణంగా 3.13 లక్షల మంది దౌర్జన్యంగా నిర్వాసితులయ్యారు.13.3 లక్షల మంది ఆదివాసీలు తమ పూర్వీకుల భూమి నుండి నేరుగా నిర్వాసితులయ్యారు.
ఈ గందరగోళ స్థితి ముఖ్యమైన ప్రశ్నలను వేస్తుంది-మనం ఏ అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్నాం? ఈ అభివృద్ధి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ అభివృద్ధి ఆలోచన ఆదివాసీలు, గ్రామస్తులు, ఒక ప్రాంతంలోని స్థానికులపై ఎందుకు అసమాన భారంగా ఉంది.
ఈ‘‘అభివృద్ధి ప్రాజెక్టుల’’ వెనుక ఉన్న కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థల స్వభావంలో పై రెండు ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. ఇంతకు ముందు వివరించినట్లుగా-ఈ ప్రాజెక్టులను భారతదేశంలోని దళారీ బూర్జువాలు చేపట్టాయి- ఇవి సామ్రాజ్యవాద పెట్టుబడికి సేవచేస్తాయి, అయితే సర్దార్‌ సరోవర్‌, తెహ్రీ వంటి పెద్ద ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు లాంటి సామ్రాజ్య వాద ఏజెంట్ల నుండి నేరుగా నిధులు పొందుతాయి.
ముందుగా చర్చించినట్లుగా, అటవీ పరిరక్షణ నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు భారత ప్రభుత్వానికి ‘‘జాతీయ ప్రాముఖ్యత’’, ‘‘జాతీయ భద్రత’’ మొదలైన ప్రాజెక్టుల ముసుగులో ఆదివాసీ జనాభాను చట్టబద్ధంగా తరలించడాన్ని సుల భతరం చేస్తాయి. ఇటువంటి నిర్వాసిత్వం జీవితాలను నాశనం చేస్తుంది ఆదివాసీ ప్రజలు- శతాబ్దాలుగా వారు కలిగి ఉన్న తమ సామాజిక జీవనాన్ని, జీవనోపాధిని, సాముదాయిక భూమిని కోల్పోతారు.
ఒకసారి నిర్వాసితులవుతే, వారికి ద్రవ్య పరిహారం తప్ప మరింకేమీ సహాయం అందించే సమర్థత రాష్ట్రానికి లేదు. అనేక అభివృద్ధి ప్రాజెక్టు లలో చూసినట్లుగా,చట్టపరంగా రావాల్సిన వాటిని యివ్వడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది.
ఈ పరిహారం చట్టాల క్రింద,స్త్రీలు వారి మగ బంధువుల పొడిగింపులుగా పరిగణించబడతారు: వారికి ప్రత్యేక పరిహారం అందదు. నిర్వాసిత్వం వలన ఆదివాసీ సముదాయాలలోని మహిళలు మద్యపానం, వివాహాలలో హింసను లాంటి సమస్యలు ఎక్కువవుతాయి.బాల్య వివాహాలు, మనుగడ కోసం తరచూ వ్యభిచారం,మానవ అక్రమ రవాణాకు గురవుతారు.
నిర్వాసిత్వం చెందిన జనాభా తమ జీవనోపాధి వెతుకులాటలో నగరాలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు వలస వెళ్లవలసి వస్తుంది. వారు ఇక్కడ రాష్ట్ర ఇతర ‘‘అభివృద్ధి’’ ప్రాజెక్టులకు చౌక కార్మికులుగా మారతారు. నిర్వాసిత్వం చెందిన జనాభా తీవ్రమైన మానసిక వేదనతో పాటు పేదరికం, దీర్ఘకాలిక పోషకాహార లోపం, ఆకలిలాంటి అనారోగ్యాలకి కూడా గురవుతారు.
‘‘పరిరక్షణ’’ ముసుగులో పరిరక్షణ ముసుగులో, స్థానిక సముదాయాలను అడవుల నుండి బయటికి తరలిస్తున్నారు. వన్యప్రాణి పార్కులు, అభయారణ్యాలు నిర్మించినప్పుడు ఆదివాసీ సముదాయాలు నిర్వాసితులు కాకపోతే ఇది పర్యావరణానికి ఉత్తమమైనదని పరిరక్షకుల వాదనబీ అటవీ పరిరక్షణ పేరుతో తమ సాముదాయిక భూమిని చుట్టుముట్టినప్పుడల్లా తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.
పరిరక్షణ ముసుగులో, స్థానిక సముదాయాలను అడవుల నుండి బయటికి తరిమికొడుతున్నారు. వన్యప్రాణుల పార్కులు, అభయారణ్యాలు సృష్టించినప్పుడు ఆదివాసీ సముదాయాలను నిరాశ్రయులను చేయకపోవడం పర్యావరణానికి మంచిది అని పరిరక్షకులు వాదిస్తున్నారు. అయితే అటవీ పరిరక్షణ పేరుతో వారిని తమ సాము దాయిక భూమి నుండి తరిమివేయనప్పటికీ, వారు జీవనోపాధిని కోల్పోతున్నారు. ఉదాహరణకు, ఒడిశాలోని సునాబేడ టైగర్‌ రిజర్వ్‌ను నిర్మించడం కోసం, రిజర్వ్‌ అడవుల నుండి ఆదివాసీ కుగ్రామాలను వేరు చేస్తున్నారు. తమ రోజువారీ జీవనానికి, జీవనోపాధికి ఆధారమైన అడవుల నుండి కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరణను నిషేధిస్తున్నారు. అంతేకాకుండా, స్థానిక ఆదివాసీ సముదాయాలు అటవీ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగానూ, వారి జీవనశైలి అడవులను అల్లకల్లోలం చేసిందనీ పోరాడారు. వాస్తవానికి, కొత్త నిబంధనల ద్వారా జరిగే జీవావరణ రిజర్వ్‌లు, జంతుప్రదర్శనశాలలు, అభయార ణ్యాలు, పర్యావరణ-పర్యాటక సౌకర్యాలు మొదలైనవాటి నిర్మాణం, అడవుల సహజ పర్యావరణ వ్యవస్థకు మరింత హానికరం అవుతుంది.
ఆదివాసీ సముదాయాలు నివసించే అటవీ ప్రాంతాలలో అంతకుముందు ఉన్న పర్యావరణ వ్యవస్థలు, ఈ అడవుల సహజ పర్యావరణ వ్యవస్థతో సామరస్యంగా జీవిస్తున్న సముదా యాలను కలిగి ఉంటాయి. పర్యావరణ-పర్యాటక సౌకర్యాలను ప్రవేశపెట్టడం, పరిరక్షణ పేరుతో ‘‘రిజర్వ్‌లు’’ నిర్మించడం ఈ అడవుల్లో నివసించే ప్రజలకు, వన్యప్రాణులకు పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగిస్తుందని నిరూపితమైంది.
మెక్సికో పసిఫిక్‌ తీరంలో, ఆడ సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టడానికి తీరానికి రాకుండా నిరోధించే ప్రతికూల ప్రభావాన్ని పర్యావరణ పర్యాటకం కలగచేసింది(అవి ఇప్పుడు జనసమూహం, బీచ్‌లలో వెలుతురును చూసి భయపడుతున్నాయి), అందువల్ల ఇప్పటికే అంతరించిపోతున్న జాతులను మరింత ప్రమాదంలోకి నెట్టినట్లవు తుంది. పర్యావరణ పర్యాటక కార్యక్రమాలు సమాజంలోని పెటీ-బూర్జువా, ‘‘మధ్య’’ లేదా ఉన్నత తరగతులకు మాత్రమే ఆకర్షిస్తాయి.
జంతుప్రదర్శనశాలలు, సఫారీలు, బయో-పార్క్‌లు/రిజర్వ్‌లలో వారి వినోదం కోసం ఆదివాసీ సముదాయాలు కల్లోలభరిత నిర్వాసి త్వాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాలు దేశంలోని విశాల ప్రజానీకానికి వినోద కారకాలు కాకపోయినప్పటికీ, అందుకోసం వారు నిర్వాసితులవుతున్నారు. అంతేకాకుండా, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ ‘‘హరిత పెట్టుబడి’’ కార్యక్రమాలకు, ప్రత్యేకించి పర్యావరణ పర్యాటక ప్రాంతంలో ప్రైవేట్‌ రంగ వృద్ధిని పెంచే కార్యక్రమాలకు, చాలా వరకు ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ నిధులు సమకూరుస్తాయి. అందువల్ల, పర్యావరణ-పర్యాటక కార్యక్రమాల నుండి పొందిన మూలధనం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా చేరదు, అది దాని సామ్రాజ్యవాద యజమానులకు సహాయం చేస్తుంది.
ఇప్పటికే పర్యావరణంతో సామరస్యంగా జీవిస్తున్న ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేయడానికి పర్యావరణ పరిరక్షణ ఒక సమర్థనీయ కారణం కాదు, పర్యావరణాన్ని పరిరక్షించని లేదా దేశంలోని ప్రజలకు అందని పర్యావరణ స్థిరత్వ సామ్రాజ్యవాద నమూనాను ముందుకు తెచ్చింది.
ఈ నేపధ్యంలో, భారత రాజ్యం చేపడుతున్న ప్రస్తుత అభివృద్ధి నమూనాను పరిశీలిస్తే, అది సామ్రాజ్యవాద పెట్టుబడికి ప్రత్యక్ష సేవలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇది ‘‘భూ కబ్జా’’ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నమూనా మాత్రమే కాదు, స్థానిక జనాభా, శ్రామిక వర్గ హితాసక్తులపై ఆధారపడి జీవించే పరాన్నజీవి కూడా.
గత 77 ఏళ్లలో భారత పార్లమెంట్‌ గాని, శాసనసభలు గాని ఒక్క ‘శాసనం’ చేయలేదు. బ్రిటిష్‌వాడు వదిలి వెళ్లిన పాలనా పద్ధతులలోనే పాలన చేస్తున్నారు. ‘పాలనా అధికారంతో ఉన్న కొద్ది మంది’ బ్రిటిష్‌ పాలకుల వలే, మెజారిటీ సాధించిన రాజకీయ పక్షం ‘కేబినెట్‌’ రూపంలో ‘నిర్ణయాలు’ చేసి వాటిని చట్టాలుగా మారుస్తున్నారు. నిజమైన ప్రజాస్వామ్యంలో ఏదేనా ఒక విధానాన్ని రూపొందించాలంటే పలు కోణాల్లో సామాజిక అధ్యయనాలు నిర్వహించాలి. వాటి ఆధారంగా ఏ వ్యక్తికీ నష్టం లేకుండా అందరికీ సమానంగా వర్తించేలా విధానాలను రూపొందించాలి. సమాజంలోని ప్రతి వ్యక్తికీ సమాన అవకాశాలను కల్పించేదిగా, ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేసే హక్కులను అందించేదిగా ఉండడమనేది ప్రజాస్వామ్య ప్రథమ సూత్రం. ఇటువంటి సమున్నత సూత్రాన్ని నిర్దేశించని రాజ్యాంగంతో ప్రజాస్వామ్య నిర్మాణం అసాధ్యం.
స్వతంత్ర భారత్‌లోని ప్రజాస్వామ్య పరిస్థితులు ఒక విషయాన్ని కొట్టొచ్చినట్లు తేటతెల్లం చేస్తున్నాయి: భారతీయులకు ‘శాసనం %-% హక్కు %-% చట్టం’ మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తెలియదు. వాటిపై అవగాహన ఉన్న బ్రిటిష్‌ వాళ్ళు, మొదటి రెండిటిని తమకే పరిమితం చేసుకుని, చట్టాలను రచించి వదిలి వెళ్లారు. భారతీయులు వాటిని పట్టుకుని కాలం వెళ్లమారుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాకు తిరిగి ఏ సేవ ‘హక్కుగా’ ఇవ్వడం జరుగుతుందో కూడా ప్రతి చోట లిఖితపూర్వకంగా తాను ఇచ్చే రసీదులో క్లుప్తంగా వెల్లడిరచి తీరాలి. ప్రభుత్వం ఇలా చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజల హక్కులను తెలుపుతూ ప్రభుత్వ డబ్బు వసూళ్ల వలన ఉపయోగం అనే సదుద్దేశ్య వాతావరణం నెలకొల్పి ప్రజలను చట్టబద్ధులను చేసే బదులు, చట్ట ఉల్లంఘనకు పర్యవసాన జరిమానా/ శిక్షలను ప్రస్తావిస్తూ వసూళ్లు చేస్తుంటారు. రౌడీయిజం పంథాని ‘అధికారంతో అజమాయిషీ’ చేయడం అని భావిస్తున్నారు.
రాజకీయ పార్టీలు అధికారం కోసం రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి వేశాయి. వ్యాపార రాజకీయంలో ఉన్న నాయకులకు శాసనం%-% హక్కులు అనేవి వారి ఆలోచనకి అంతుపట్టని విషయాలుగా ఉన్నాయి. ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో అదే హక్కుగాను, కోర్టులు ఏవైతే చెప్తాయో అవి ‘న్యాయం’గాను పరిగణిస్తున్నారు. అయితే ఎవడిది పై చేయి అయితే వాడిది ‘న్యాయం’ అనే ఆటవిక వ్యవస్థతో దేశం నడుస్తున్నది. అందుకే ఒకే కేసుకు పలు తీర్పులు పలు కోణాల్లో వెలువడుతున్నాయి. భారత రాజ్యంకి సామ్రాజ్యవాద యజమానులతో ఉన్న అనుబంధం, శ్రామిక ప్రజలపై దాని విధ్వంసక ప్రభావాల ఈ విశ్లేషణ వేసే ప్రశ్న- ప్రజల-కేంద్రీకృత అభివృద్ధి నమూనా ఎలా ఉంటుంది. ప్రస్తుత నమూనా నుండి అది ఎలా భిన్నంగా ఉంటుంది.
ప్రజల అవసరాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నమూనా ప్రజల నుండి వస్తుంది. వారి సాంప్రదాయ భూమి నుండి జనాభాను నిర్వాసితులను చేయడంపై ఆధారపడి ఉండ డానికి బదులు అవసరమైన వనరులకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా జనాభా శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది.
ఎగుమతి మిగులు ద్వారా భారతదేశ ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, సహజ వనరులను విదేశాలకు తరలించేబీ త్రాగునీరు, ఆహారం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల వంటి ప్రాథమిక సౌకర్యాలు అట్టడుగు వర్గాల జనాభాకు, శ్రమించే కార్మికులకు అందని, ఒక క్రమపద్ధతిలో ఉన్నతవర్గాలకు మాత్రమే అందుబాటులో వుండే ప్రస్తుత నమూనా కంటే ఇది పూర్తిగా భిన్నంగా వుంటుంది.అటవీప్రాంతా ల్లోని సహజ వనరులను రాజ్యం స్వాధీనం చేసుకునే బదులు, అవసరాలకు అనుగుణంగా జనాభాకు సేవలందించేందుకు వినియోగిస్తారు. ఈ అభివృద్ధి నమూనాలో క్రూరమైన దోపిడీకి గురవుతున్నన కార్మికులు, చిన్న, భూమిలేని రైతులు, ఆదివాసీలు నిర్వాసితులై చౌక శ్రమ వనరులుగా మిగిలిపోయిన ఆదివాసీలు లేదా నిరుద్యోగులుగా కార్మిక రిజర్వ్‌ సైన్యంలోకి నెట్టబడ్డారు. ఈ కొత్త నమూనాలో కేంద్రంగా వుంటారు.విశాల శ్రామికవర్గ ప్రయోజనాలను రక్షిస్తుంది, సామ్రాజ్యవాద శక్తులతో అనుబంధం లో ఉన్న బూర్జువా వర్గానికి చెందిన ఒక చిన్న వర్గానికి కాకుండా శ్రామికవర్గ ప్రజానీక ప్రయోజనాలను రక్షించే విధంగా ఈ కొత్త నమూనాకు కేంద్రంగా ఉంటుంది.
ఎందుకంటే వరదలు,పర్యావరణ విపత్తులు, మారుతున్న వాతావరణం కారణంగా పంట నష్టం లేదా పర్యావరణ కాలుష్యం, క్షీణత వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వంటి వాటి ద్వారా జరిగే నష్టం ఎక్కువగా ప్రభావితమవుతుంది కాబట్టి అటువంటి పర్యావరణ నష్టాన్ని నివారించడం, తగ్గించడం విస్తృత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండడంవల్ల ఈ నమూనా పర్యావరణానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని నిర్దిష్టతతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా మూలధనం విస్తరణ, దండయాత్రల కోసం ప్రయత్నించే, విదేశీ మూలధనం విలువను పెంచే భారత రాజ్యం ప్రస్తుతం అనుసరిస్తున్న నమూనాకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
కొన్ని సమస్యలకు సరైన చట్టాలు లేనందువలన, కోర్టులు ఇచ్చే తీర్పులతో ‘న్యాయం’ ఏర్పడు తున్నది. పరిస్థితిని బట్టి న్యాయం మారుతున్నది, కానీ,హక్కు మాత్రం ఏర్పడటం లేదు. హక్కులు దిక్కులు లాంటివి,అవి మారవు.సమగ్ర, సహేతుక చట్టాలు లేని సందర్భాలలో కోర్టులు పార్లమెంట్‌కు కేసులను రిఫర్‌ చేస్తూ శాసనాలు అవసరం అని తెలియచేయడం లేదు. శాసన వ్యవస్థకు బదులు చాలా సందర్భాలలో ‘ప్రభుత్వాన్ని’ న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి. మరి ప్రభుత్వమే ‘పాలనా అధికారంతో ఉన్న కొద్దిమంది కేబినెట్‌’గా మారిపోయింది కదా. మన రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం, నాయకత్వ నిర్మాణం లేవు. వ్యక్తి పూజ, వ్యక్తి స్వామ్యం ఎన్నికల తంతు తరువాత ప్రభుత్వంలోకి చేరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. నిజమైన ప్రజాస్వామ్య పార్టీ విధ్యుక్త ధర్మం ప్రజలకు అవసరమైన పనులను చేస్తూ గుర్తింపుపొంది తరువాత ప్రజల ఆమోదంతో అధికారంలోకి రావడమే కాదూ? ఇందుకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు మందిని పోగేసుకుని, ఎవరి ప్రయోజనాలను వారు సాధించుకునే ఆశయంతో ఒక ముఠా మీద మరొక ముఠా కుట్రలు కుతంత్రాలు చేసుకుంటు న్నాయి. ఏమి చేస్తే పై చేయి అవుతుందో అవన్నీ చేస్తూ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ దేశాన్ని నాశనం చేస్తున్నాయి.ఈ ముఠాల స్వప్రయోజన అపేక్షలకు ఒక ఉదాహరణ 77 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ‘కరువు భత్యం’. బ్రిటిష్‌ వలస పాలకులు తమ ఉద్యోగులకు, సమాజంలోని మిగతా వారి కన్నా అత్యధికంగా డబ్బు అందుబాటులో ఉంచాలని సంకల్పించి, ‘కరువు భత్యం’ అనే ఆర్థిక సదుపాయాన్ని కల్పించారు. సంపదలను సృష్టించే ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం లేనిది ఈ ‘కరువు భత్యం’. ఇంతకూ బ్రిటిష్‌ వాడి ఉద్యోగులు ఎవరు? భారతీయులే. భారత సమాజం ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా, భారతీయుల నుంచి వసూలు చేసిన పన్ను రాబడిని కొద్ది మంది భారతీయులకు ఆదాయ మార్గంగా ఏర్పాటుచేశారు! ఇప్పటికీ కొనసాగుతోన్న ఇలాంటి అవకతవకలు దేశంలో కోకొల్లలు. ముఠాల ప్రయోజనాల కోసం ఇలాంటి దోపిడి పనులు భారత్‌లో ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. మరి మన భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పటికైనా నిర్మాణమవుతాయా?
ప్రస్తుత నమూనా వైఫల్యం పర్యావరణానికి, ప్రజలకు కలిగించిన తీవ్ర నష్టంలో స్పష్టంగా కనిపిస్తుంది.జోషిమఠ్‌లో రాజధాని విస్తరణ పర్యావరణ నష్టం, మరణాలు, నిర్వాసిత్వానికి దారితీసిందిబీ లేదా అటవీ ప్రాంతాలలో, పర్యావరణ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి, ఎఫ్‌సిఎ,ఎఫ్‌ఆర్‌ఎల ద్వారా చట్టబద్ధంగా ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు లేదా విశాల ప్రజానీకం కోసం కాకుండా కొద్దిమందికి ఉద్దేశించిన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సైనిక దాడులు కూడా జరుగుతున్నాయి.
ముగింపు
అటవీ పరిరక్షణ సవరణ బిల్లు అనేది ఆదివాసీ జనాభాపై భారత రాజ్య అప్రకటిత యుద్ధాన్ని మరింతగా పెంచే ఒక ప్రజా వ్యతిరేక చట్టం. బిల్లును ఆమోదించిన విధానం, దాని వెనుక ఉన్న అంతర్లీన ఉద్దేశం ద్వారా బూర్జువా ప్రజాస్వామిక కాల్పనిక గాథ బహిర్గతమైంది.
ఈ వ్యాసంలో చర్చించినట్లుగా, ఈ అభివృద్ధి నమూనావల్ల స్థానిక సముదాయాలు మూల్యం చెల్లించే సమయంలో, భారతదేశ దళారీ బూర్జువా, వారి సామ్రాజ్యవాద యజమానుల ప్రయోజనాలను నెరవేర్చడంలో రాజ్యానికి ఈ సవరణల బిల్లు మరింత సహాయం చేస్తుంది. లాభదాయకమైన అభివృద్ధి ప్రాజెక్టులకు మార్గం సుగమం చేయడం కోసం స్థానిక సముదా యాలను నిర్వాసితులను చేయడం,ఓటు హక్కును రద్దు చేయడం, వారిపై బాంబుదాడి చేసేంత వరకుకూడా వెళ్ళే ఈ బిల్లు వివరించిన అభివృద్ధి నమూనా జాతి నిర్మూలన తప్ప మరొకటి కాదు.
రైతాంగ భూ యాజమాన్యాన్ని కాపాడాలని, దున్నేవాడికే భూమినివ్వాలని డిమాండ్‌ చేసే సంఘటిత ప్రజాపోరాటం మాత్రమే తన స్వంత ప్రజలపై భారత రాజ్యం చేస్తున్న బహిరంగ భీభత్స కేంద్ర భాగంలో దెబ్బ కొట్టగలదు. అన్నింటికంటే ముఖ్యంగా, భూమి పోయినప్పుడు, ఆదివాసీలు బొగ్గును తిని బతకరు కదా.
ప్రజలచే పాలన అనే స్ఫూర్తికి కాని, పౌరులకు తాము కోరుకునే, తమ గొంతు వినే వ్యవస్థగా కాని ఆధునిక ప్రజాస్వామ్యం కట్టుబడిలేదనాలి. అప్పుడప్పుడో, ఒక క్రమపద్ధతిలోనో, న్యాయ బద్ధంగానో అన్యాయబద్ధంగానో నిర్వహిస్తున్న ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యానికి నిదర్శనం, గీటురాయి అనే అపోహ కలుగుతున్నది. కఠోర వాస్తవం ఏమిటంటే, ప్రపంచం మొత్తం ప్రస్తుతం ‘నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాలు’గా విడిపోయింది. వాస్తవానికి మనం అనుకుంటున్న మెజారిటీ ప్రజాస్వామ్యాలు కూడా దాదాపుగా అర్ధ నిరంకుశాలే. ప్రజాస్వామ్యం భవిష్యత్తు విషయంలో అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతున్నది.
పరిపక్వత చెందిన ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల భాగస్వామ్యాన్ని, సలహాలను, సూచనలను స్వాగతిస్తారు, ప్రోత్సహిస్తారు. అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి పుష్కలంగా అవకాశాలు కలిగించి, విభిన్న దృక్కోణాలకు విలువ ఇస్తారు. అలాంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర తక్కువ నియంత్రణలు కలిగిందిగా, ప్రజలు నమ్మినదాన్ని, కోరుకున్న దాన్ని సులభతరంగా పొందడానికి సహకరించేదిగా ఉంటుంది. ప్రజలు తాము ఎంపికచేసుకున్న రాజకీయ పార్టీలోకాని, ఇతర సమూహాలలోకాని నిరభ్యంతరంగా చేరే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం పరిపక్వత చెందక, నియంతృత్వ ధోరణులు ఉన్న చోట పార్టీ, ప్రభుత్వం, దేశంపై సంపూర్ణ నియంత్రణ చేసే ఒకే ఒక్క నాయకుడు వుంటాడు.
‘నిరంకుశ తరహా ప్రజాస్వామ్య నాయకత్వం’, ‘ప్రజాస్వామ్య నియంతృత్వం’ అనే రెండు విచిత్ర ప్రజాస్వామ్య విధానాలు ఇటీవలికాలంలో ఆవిర్భవించి, పుంజుకుంటున్నాయి. ఈ రెండిరటిలోనూ నిర్ణయాధికారాలన్నీ ఒకే ఒక్క వ్యక్తి (నాయకుడు) చేతుల్లో కేంద్రీకృతమై ఉం టున్నాయి. క్యాబినెట్‌ సహచరులతో సహా, పౌర సంఘాల, బ్యూరోక్రాట్ల, మేధావుల, వివిధ రంగాలకు చెందిన నిపుణుల సూచనలు కూడా ససేమిరా పట్టించుకోని పరిస్థితి ఉంటున్నది.-(సంయుక్త కణ్ణన్‌)

ఆదివాసులకు తీరని ద్రోహం

టూరిజం అభివృద్ధి పేరుతో‘విజన్‌ 2047’లో భాగంగా 1/70 చట్ట సవరణకు రాష్ట్ర కుటమి ప్రభు త్వం రంగం సిద్ధం చేస్తున్నది.ఇటీవల జరిగిన టూరిజం ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లా డుతూ ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు,రెస్టారెంట్లు, పార్కులకు పెట్టు బడులు పెట్టాలంటే 1/70 చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం,అధికార యంత్రాంగం లోతైన అధ్య యనం చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయడమే. పైగా షెడ్యూల్‌ ఏరియా లో టూరిజం అభివృద్ధికి 1/70చట్టం అడ్డంగా ఉందని,చట్టం సవరించాలని కూడా అయ్యన్న పాత్రుడు పేర్కొనడం వ్యక్తిగత అభిప్రాయమో లేక కూటమి ప్రభుత్వ విధానమో స్పష్టం చేయడం అవసరం. 2000 సంవత్సరంలో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు ఏజెన్సీలోని చింతపల్లి జర్రేలలో ఉన్న 515 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిక్షేపాల తవ్వకాలకు దుబారు కంపెనీతో ఒప్పందం చేసుకుని గిరిజన సలహా మండలిలో 1/70 చట్టం సవరించడానికి పూనుకున్నారు. అప్పటి సిపిఎం భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య మాత్రమే 1/70 చట్టం రక్షణకు నికరంగా నిలబడ్డారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నిలబడి అధికారం వచ్చిన వెంటనే 2006లో ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి రూ.8000 కోట్లతో రాస్‌ ఆల్‌ ఖైమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివాసి గిరిజన సంఘం, వివిధ ఆదివాసీ సంఘాలు,సిపిఎం,వామపక్ష పార్టీల అండతో చేసిన సుమారు 20ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో బాక్సైట్‌ తవ్వకాల ఒప్పందాలు రద్దు చేయడమైనది.1/70 చట్టం అమలులో ఉండగానే అరకు,పాడేరు,చింతపల్లి,రంపచోడవరం, జీలుగు మిల్లి,పార్వతీపురం,మన్యం జిల్లాలో,ఇతర ప్రాంతా లలో బినామీ పేర్లతో లాడ్జీలు,షాపింగ్‌ కాంప్లెక్సు లు,రిసార్టుల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతు న్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లి,ఎర్రవరం, పెదకోట,మన్యం జిల్లా సాలూరు,అనకాపల్లి జిల్లా చింతలపూడి దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకాయవారిపాలెం దగ్గర ఆయుధ కర్మాగారం నిర్మాణానికి 1/70చట్టం ఉల్లంఘించి ఒప్పందం చేసుకుని వేల ఎకరాల భూములు,అడవులు ధారాదత్తం చేస్తున్నది.ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో 3000ఎకరాల పరిధిలోని అదాని ఆయుధ కర్మాగారం నిర్మాణానికి ఆదివాసీల హక్కులను ఉల్లంఘించి నిర్మాణం ముమ్మరం చేసింది.గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఆదివాసీల హక్కులను ధ్వంసం చేస్తున్నది. 1970లో ఆదివాసీల పోరాట ఫలితంగా ఆదివాసీ అభివృద్ధి కోసం 1/70చట్టాన్ని సాధించాం.నేడు పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం ఆ చట్టాన్ని సవరించేందుకు కుట్ర చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రాంత చట్టమైన 1/70లో కలుగచేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.షెడ్యూల్‌ ప్రాంతంలో చట్టాలు చెయ్యాలన్నా తొలగించా లన్నా రాష్ట్రపతికే అధికారం ఉన్నది.షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసభ అధికారాలు,కేంద్ర అటవీ పర్యావరణ చట్టాన్ని సవరించి షెడ్యూల్‌ ప్రాంతంలో విస్తృతమైన అధికారాలు ఉన్న పీసా చట్టం అధికారాలు, 2006 వామపక్షాలు ఒత్తిడితో తెచ్చిన ఆటవీ హక్కుల చట్ట అధికారాలు ఇటీవలి కేంద్ర బిజెపి ప్రభుత్వం తొలగించింది.ఆ అంశా లనే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. కేంద్ర బిజెపి, రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
అరకు ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు జీవో నంబర్‌ 3చట్టబద్ధతకు హామీనిచ్చి ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదు.ఎన్నికల హామీ ప్రకారం ఏజెన్సీ షెడ్యూల్‌ ఏరియాలో100శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక సాధనకు,ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలకు పోరాటం చేస్తున్న ఆదివాసీల సమస్యలను పరిష్కరించనే లేదు.పైగా ఆదివాసీ భూములకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదివాసీలతో పాటు అందరం ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాల్సి వుంది.
స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్యాలపై నిరసన గళం..
ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించడాన్ని రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నిరసన సెగలు రేకెత్తించాయి.ఒక రాజ్యాంగ బద్దమైన పదవులో ఉండి గిరిజనులకు రాజ్యాం గం కల్పించిన రక్షణ చట్టాలను సవరించడం అనడంపై గిరిజనవర్గాలు భగ్గుమంటున్నాయి. అల్లూరి,పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తున్నాయి.
పార్వతీపురం: బెలగం కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణ మూర్తి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పాలమిట్ట రాము మాట్లాడుతూ ఆదివాసీ భూము లకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బం దీగా అమలు చేయాలని కోరారు. జనవరి 27వ తేదీన విశాఖ పట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ రాజ్యాంగంలో 5వ షెడ్యూలు కిందకు వస్తుందని తెలిపారు.దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని,వీటిని వెంటనే అరికట్టాలని కోరారు. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రని విమర్శించారు.ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని, ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తోందని వివరించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయని, 1/70 చట్టం 1970లో పెద్దఎత్తున జరిగిన ఆదివాసీ పోరాటాల ద్వారా సంపాదించుకున్నారని తెలిపారు. ఈ చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చిందని, 2006-07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభు త్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చాయని వివరిం చారు. భూమిపై గిరిజనులకు హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసిందని, మోడీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలను ఈ ప్రాంతంలో ఆదానీ పరం చేస్తున్నారు.
1/70 చట్టం జోలికొస్తే ఖబడ్దార్‌!
పాడేరు: ఏజెన్సీలో గిరిజన చట్టాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పదని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మండిపడ్డారు.1/ 70 చట్టం అమలులో సడలింపులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ పట్నంలో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడి దారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్‌అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిరచించారు.రిజన ప్రాంతంలో 1/70చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని స్పీకర్‌ వ్యాఖ్యలు చేయడం సరికాద న్నారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, గిరిజనులకు హానికలింగేలా స్పీకర్‌ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిగానే ఆదివాసీ సమాజం భావిస్తున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి పర్యాటక రంగం ద్వారానే ్షధ్యమనే తప్పుడు అభిప్రాయంలో కూటమి పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఏజెన్సీలోని సహజ వనరులు, సంపదను కార్పొరేట్‌ కంపెనీలో అప్పగించే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. 1/ 70 అమలులో నిర్లక్ష్యం వల్లే ఇప్పటికే వందలాది ఎకరాలను టూరిజం పేరిట ఆక్రమించారని, ఇపుడు చట్టాన్ని సడలిస్తే మన్యం మొత్తంగా ఆదివాసీలకు దూరమై కార్పొరేట్ల పరమౌతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కులను, ఆదివాసీచట్టాలను ధిక్కరించడమే అవుతుందన్నారు.ఏజెన్సీలో యువతకు ఉపాధి అవకాశాలు, చిన్నతరహా పరిశ్రమలను ఐటిడిఎ ద్వారా ఏర్పాటు చేయాలని కోరారు.మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అడ్డుగా ఉందని 1/70చట్టానికి సవరణలు చేయాలని నాటి టిడిపి ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అప్పట్లో ఉన్న ఒకేఒక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా వ్యతిరేకించడంతో అడ్డుకట్ట పడిరదని గుర్తు చేశారు. మన్యవాసుల మనుగడకు నష్టం కలిగించే ఇటువంటి కుట్ర పూరిత విధానాలకు ప్రభుత్వాలు స్వసి చెప్పాలని హితవు పలికారు.పర్యాటకాభివృద్ధి ముసుగులో 1/70 చట్టం సవరణ తగదు.
అరకులోయ: ఆదివాసి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటళ్ళు,రెస్టారెంట్లు, పార్కులు నిర్మాణం కోసం 1/70 చట్టానికి సడలింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌ ధర్మన్న పడాల్‌ పొద్దు బాలదేవ్‌ తీవ్రంగా ఖండిర చారు. అయ్యన్న ప్రకటన ఆదివాసి హక్కులు, చట్టాలకు తీవ్రమైన విఘాతం కలిగిం చేలా ఉం దని, ఆదివాసులకు ద్రోహం చేసే ఇటు వంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
అయ్యన్న వ్యాఖ్యలపె ్కఆదివాసీల ఆందోళన
హక్కుంపేట :టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేయాలని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించడం ఆదివా సుల హక్కులు చట్టాలకు తీవ్ర విఘాతం కలిగిం చడమే కాకుండా మన్యవాసులకు ద్రోహం చేయడమేనని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మండిపడ్డారు.. ఆదివాసీ అభివృద్ధి అంటే హోటళ్లు,రిసార్ట్స్‌ నిర్మాణం కాదని, కాపీ, చింతపండు, అడ్డాకులు వంటి గిరిజన అటవీ వాణిజ్య ఉత్పత్తులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, జిఒ3 ప్రయోజ నాలను పునరుద్ధరించి, శతశాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో హక్కుంపేట,అరకులలోని శరభగుడలో నిరసన చేపట్టారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మండల నాయకులు కిల్లో జగన్నాధం మాట్లాడుతూ, ఆదివాసులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం సవరణ చేస్తే షెడ్యూల్‌ ప్రాంతంలోని అడవీసంపద, గనులు, ఖనిజాలు, ప్రకృతి అందాలన్నీ బడా పెట్టుబడి దారులు కార్పొరేట్‌ కంపెనీల పరమౌతాయని, ఆదివాసుల జీవన విధానం, మనుగడ ప్రశ్నార్థర మౌతుందని ఆవేదన వెలిబుచ్చారు ఆదివాసీల హక్కుల పరిరక్షణలో గుండెకాయలాంటి 1/70 చట్టంపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఆదివాసీలకు ఉపాధి కల్పించే టూరిజం కావాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు టూరిజం ప్రమోట్‌ చేసే భాగంగా దేశ, విదేశీ యాత్రికులను ఆకట్టు కునేందుకు టూరిజంశాఖ ఆధ్వర్యంలో చలి ఉత్సా వాలు నిర్వహిస్తున్నది. ఇందుకోసం కోట్ల రూపా యల ఖర్చుకు సిద్ధం అవుతున్నది.ఆదివా సులకు కావాల్సింది చలి ఉత్సవాలు కాదు.జీవో నెం.3కు చట్టబద్ధత కల్పిస్తూ ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫ ికేషన్‌ విడుదల చేసి అరకు చలి ఉత్సవాలు నిర్వహించాలి. చలి ఉత్సవాల పేరుతో టూరిస్టు లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కన్నా చలి కాలంలో పాడేరు ఏజెన్సీలో సున్నా డిగ్రీల చలికి వణుకుతున్న 50 వేల మంది ఆదివాసీ హాస్టల్‌ విద్యార్థినీ విద్యార్థులకు చలి దుప్పట్లు పంపిణీ చేయాలి. ఆదివాసీలకు ఉపాధి కల్పించేలా టూరిజాన్ని అభివృద్ధి చెయ్యాల్సింది పోయి వారి సంస్కృతిని నాశనం చేసే విధంగా టూరిజాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. బినామీ పేర్లతో పెద్దపెద్ద లాడ్జీలు, రిసార్ట్స్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి వందలాది ఎకరాల ఆదివాసీల భూములను ధారాదత్తం చేస్తూ 1/70చట్టానికి తూట్లు పొడుస్తున్నది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా రోజురోజుకు అక్రమ కట్టడాలు పెరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు. సోమవారం నాడు విశాఖలో జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్‌ సదస్సులో పెట్టుబడు లను ఆకర్షించేందుకు 1/70 చట్టాన్ని సవరించా లని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించడం దారుణం.ఈ విషయ మై అధికారులు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని కూడా చెప్పారు. అంటే 1/70ని మార్చి వేయాలన్నదే వారి నిశ్చితాభిప్రాయంలా వుంది. గిరిజనుల మనుగడకు ప్రమాదకరమైన ఈ ప్రయ త్నాలను గట్టిగా వ్యతిరేకించాలి.టూరిజంలో వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులను స్థానిక ఆది వాసీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ బేఖాతరు చేస్తూ చలి ఉత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఏజన్సీ ప్రాంతంలో రోడ్లు, వంతెనలు లేనందున గర్భిణీలు,రోగులను హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్సులు రావడంలేదు.డోలీ మోతలతో మార్గ మధ్యలోనే మరణిస్తున్నారు. మరోవైపు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత, సికిల్‌ సెల్‌ ఎనీమియా,టైఫాయిడ్‌,మలేరియా తదితర వ్యాధు లతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వారి కోసం సరైన సదుపాయాలు కల్పించకపోగా ఆదివాసుల ప్రకృతి అందాలు చూపించి కోట్ల రూపాయల ఆదాయాలు పోగేసుకుంటూ దేశ, విదేశీ టూరిస్టులకు కోట్లు ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఆదివాసీ యువతకు వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించే జీవో నెం 3 రద్దవడంతో గంజాయి సాగు మాయలో పడి జైలు పాలౌతున్నారు. ఏజన్సీలో ఉపాధి అవకాశాలు లేక మైదాన ప్రాంతాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లి ఇటుక బట్టీల్లో, చేపలు, రొయ్యల చెరువుల్లో పనికి కుదిరి వంద లాది మంది మోసపోతున్నారు.ఆదివాసీల కళలు, సంస్కృతి రక్షణకు ఉత్సవాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడంలేదు.పైగా వారి సంస్కృతి నాశనమయ్యే విష సంస్కృతిని ప్రమోట్‌ చెయ్యడంతో భవిష్యత్‌లో ఆదివాసీల హక్కులకు, వారి అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. ఆదివాసీ సమాజం, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడ్డానికి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.పాడేరు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా, ట్రైబల్‌ మ్యూజియం, పద్మపురం గార్డెన్‌, చాపరా యి, కొత్తపల్లి జలపాతం నుండి ఏడాదికి సుమారుగా రూ.20కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం నిధులు స్థానిక ఆదివాసుల అభివృద్ధికి, విద్యా వైద్యం మౌలిక వసతులపై ఖర్చు పెట్టడం లేదు. మరోవైపు టూరిస్టులకు కోట్లు ఖర్చు చెయ్యడం ఆదివాసులకు తీవ్ర అన్యాయం చెయ్యడమే అవుతుంది. ఆదివాసీల సంస్కృతి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాల పరిరక్ష ణకు,టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం స్థానిక ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించడం కోసం,జీవో నెం.3చట్టబద్ధత కోసం,ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ సాధించుకునేందుకోసం ఆదివాసీలు ముందుకు రావాలి.- కిలో సురేంద్ర

వలస కూలీల అగచాట్లు

ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురవడంతో రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి, వాతావరణాన్ని బట్టి సకాలంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు, ప్రకాశం ప్రాంతాలలో జులై, ఆగష్టు మాసాలలో, దక్షిణ ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, కడపలలో లేట్‌ ఖరీఫ్‌ అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన పంట వరి. అలాగే మెట్ట ప్రాంతాలలో వివిధ రకాలైన పంటలు కూడా సాగవుతున్నాయి.
గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగు తున్నా స్ధానిక వ్యవసాయ కూలీలకు మాత్రం పనులు దొరకడం లేదు.సంవత్సరం మొత్తం మీద 30 రోజుల కూడాకూలీపనులు వుండటం లేదు.కారణం ముఖ్యం గా వ్యవసాయంలో యంత్రాలు రావడం.పంటల సాగులో మార్పులు రావడం (ఉదా:డ్రమ్‌ సీడిరగ్‌ చల్లటం లాంటి పనులు).ప్రస్తుతం ‘వలస కూలీలు’ మరో ముఖ్య కారణం.బయట రాష్ట్రాల నుండి (బెం గాల్‌,బీహార్‌) కూలీలు రావడంతో స్ధానిక కూలీలకు పనులు దొరకడం లేదు. కూలీలు గ్రామాల్లో పనులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వ్యవసా యేతర పనులకు వెళుతున్నారు.ప్రధానంగా ఇటుక బట్టీ పను లు,భవననిర్మాణపనులు,హోటళ్ళలో క్లీనింగ్‌ పనుల కు,అలాగే పట్టణాల్లో ఇళ్ళలో పాచి పనులకు (మహి ళలు) వెళుతున్నారు. ఒక వేళ కూలి దొరికినా కనీస వేతనం వచ్చే పరిస్ధితి లేదు.నారువేతలు మొత్తం కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఎక్కువ శ్రమను ధారపోయాల్సిన పరిస్ధితి వస్తున్నది.ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేస్తే కేవలం రూ.500, రూ.600 వచ్చే పరిస్ధితి.ఇది ఊళ్ళో కూలీల పరిస్ధితి. వలస కూలీల పరిస్ధితి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రధానంగా బీహార్‌,బెంగాల్‌ ప్రాంతాల నుండి పేదలు పొట్టచేత పట్టుకొని మహిళలను,పసిబిడ్డలను తీసుకొని ఇక్కడి గ్రామాలకు వస్తున్నారు. మధ్యవర్తు లు,డీలర్లు చూపిన పశువుల కొట్టాలు,పాడుబడిన ఇళ్లు,బస్‌ షెల్టర్లు, మొండి గోడల మధ్య ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకొని మురికి కూపాలలో, పురుగు, పుట్ర లెక్క చేయకుండా బిక్కు బిక్కుమంటూ దుర్భరంగా జీవిస్తూ కాయకష్టం చేస్తున్నారు.వీళ్ళు కూడా కాంట్రాక్టు పద్ధతులలోనే నాట్లు వేస్తున్నారు.ఒకఎకరా నారు పెరికి నారు మోసుకొని నాట్లు వేస్తే మధ్యవర్తి రైతు దగ్గర రూ. 4500 నుండి రూ.4600 తీసుకుంటారు. డిమాండ్‌ ఎక్కువైతే రూ.5000 వరకు తీసుకొని వీరికి మాత్రం కేవలంరూ.3200,రూ.3500 మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు వసతుల పేరు మీద(గ్యాస్‌, బియ్యం, గోధుమ పిండి,కూరగాయలు,ఆటో ట్రాన్స్‌ పోర్టు) మధ్యవర్తులు,డీలర్లు కాజేస్తున్నారు.ఒక్క నెల్లూరు జిల్లా లోనే ఈ లేట్‌ ఖరీఫ్‌లో 9లక్షల ఎకరాల వరి సాగు జరుగుతుంది.స్ధానిక కూలీలు 2లక్షల ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. మిగిలిన పొలమంతాకూడా రైతాం గం బెంగాల్‌ కూలీలచేతనే నాట్లు వేయిస్తున్నారు. వీళ్ళ చేత నాట్లు వేయించుకుంటే రైతుకు ఎటువంటి – (పుల్లయ్య మంగళ/ఆకారపు మల్లేశం)

గొంతెండుతున్న …మన్యం

వేల కోట్లు అందుబాటులో ఉంటున్నా వేలాది మంది సిబ్బంది ఉన్నా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకవైపు రహదారి సౌకర్యాలు లేక అనునిత్యం డోలీ కష్టాలు వెంటా డుతుండగా,మరోవైపు స్వచ్ఛమైన తాగునీటికి కూడా గిరిజనులు నోచుకోలేకపోతున్నారు.నీటికోసం కేం ద్రం నుంచి,రాష్ట్రంనుంచి భారీగానిధులు కేటా యిం పులు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన ప్రారతాల్లో అభివృద్ధికి పెద్ద మొత్తంలోనే ఏటా నిధుల కేటాయింపులు జరుగు తున్నాయి. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ)ల ద్వారా పనులకు నిధులు కేటాయిస్తున్నారు.విద్య, వైద్యం,ఆరోగ్యం,రోడ్లు,తాగునీరు,వ్యవసాయం వరటి అనేక రంగాలకు ఈ నిధులను కేటాయిస్తు న్నారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి కూడా పలు రంగా లకు నిధులు వస్తున్నాయి.ఇందులోనే తాగునీటి అవసరాలకు కూడా నిధులు సమకూరుతున్నాయి. అయితే ఈనిధులను మాత్రం సక్రమంగా ఖర్చు చేయ లేకపోతుండడంతో అనేక మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికే ఊట నీటికి, చెరువుల్లో నీటికి,వాగుల్లో ప్రవహించే నీటికే పరిమితమవుతు న్నారు.దీనివల్ల అనేక వ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తాజాగాఈ ఏడాది రాష్ట్రం లోని 9,934 గిరిజన ప్రారతాల్లో తాగునీటి కోసం 1,290కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈమొత్తం పనులను జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా చేయా లనిప్రతిపాదిరచారు.ఈ నిధులతో మొత్తం 12, 838 పనులను గుర్తిరచి పనులు ప్రారంభించారు. అయితే వాటిని పూర్తి చేయడంలో మాత్రం ఆశించిన ఫలి తాలు రావడం లేదు.ఇప్పటివరకు 5,718 పను లను మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 2,582 పనులు పలుస్థాయిలోఉండగా, 4,5 38 పనులను ఇంకాప్రారంభించడమే జరగలేదు. ఇక మొత్తం నిధుల్లో కేవలం 218కోట్ల రూపాయ లను మాత్రమే ఖర్చు చేయగలిగారు.
నీటివనరుల గుర్తింపులో అలసత్వం
గిరిజన ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ముందుగా నీటి వనరులను గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈప్రక్రియలో అలసత్వం, జాప్యం చోటుచేసు కుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్న వనరుల నుంచి నీటిని స్వచ్ఛంగా మార్చడం కూడా సక్రమంగా సాగడం లేదను భావన వ్యక్తమవుతోంది. పనులపై వారానికి ఒకసారి సమీక్ష చేయాలని గతంలోనే నిర్ణ యించినప్పటికీ అది కూడా అమలు కావడం లేదని తెలుస్తోరది.
అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో..
మన్యంలోని అధిక సంఖ్యలో గిరిజన గ్రామాల్లోని జనం తాగునీటికి అల్లాడిపోతున్నారు. ఎండాకాలం రాకుండానే నీటి సమస్య పెరుగుతుంది.కానీ గిరిజ నుల దాహం కేకలు పాలకులకు వినిపించని పరిస్థితి నెలకొంది.దీంతో గిరి పల్లెల్లోని జనానికి నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803గ్రామాల్లో లక్షా 55 వేల 756 గిరిజన కుటుంబాలున్నాయి. వాటిలో 2,025 గ్రామాల్లో పూర్తిగా,1,778 గ్రామాల్లో పాక్షిక తాగునీటి సదుపాయాలున్నాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ఏదో రకమైన తాగునీటి సదుపా యం ఉందనేది అధికారుల వాదన. కాగా ఇప్పటికీ సగానికిపైగా పల్లెల్లో తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారనేది జగమెరిగిన సత్యం. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ వంటివి కాగితాలకే పరిమిత మవ్వగా, నిధులు సక్రమంగా విడుదల కాని పరిస్థితు ల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ వంటివి ఆచరణలోకి రాని దుస్థితి ఏర్పడిరది.దీంతో అన్ని విధాలా గిరిజనానికి తాగునీటి కష్టాలు తప్పడంలేదు.ఇవే కాకుండా సోలార్‌ ఆధారంగా పని చేసే నీటి పథకాల పరిస్థితి మరీదారు ణం.వాటికి చిన్నపాటి మరమ్మతులు వచ్చినా పట్టిం చుకున్న దాఖలాలు లేవు.దీంతో అనేక గ్రామాల్లో తాగునీటి పథకాలున్నా వాటి నిర్వహణపై పాలకులు శ్రద్ధచూపని కారణంగా నిరుపయోగంగా మారుతు న్నాయి. ఫలితంగా గిరిజనులు ఊటగెడ్డలపై ఆధారప డాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
మన్యం వాసులకు ఊటగెడ్డ నీరే ఆధారం
ఏజెన్సీలోని గిరిజన పల్లెలకు పక్కాగా రక్షిత నీటిని అందించని కారణంగా అధిక సంఖ్యలోని గిరిజన పల్లెల్లో ఊటగెడ్డలే ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రుల బాధ్యతా రాహిత్యం, పంచాయతీల్లో పాలన పడకేయడం వంటి కారణాలతో గిరిజనులకు గుక్కెడు నీరు దొరకని దుస్థితి కొనసాగుతున్నది. ముఖ్యంగా ఏజెన్సీలో మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ముంచం గిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, జి.మాడుగుల మండలాల్లోని గిరిజన పల్లెల్లో స్థితి మరీ దారుణం. మత్స్యగెడ్డ తీరంలోని చెలమలు చేసుకుని నీటిని పట్టుకుంటున్నారు.ఇతర మండలాల్లో పంట పొలా లకు సమీపంలోని ఊటగెడ్డలను ఆశ్రయిస్తు న్నారు. పెదబయలు మండలం బొడ్డగొంది, లింగేటి, పన్నెడ, గుల్లెలు, హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పంతెలచింత, ముంచంగిపుట్టు మండలం చీపురుగొంది, దొరగూడ, డెంగాగుడ, కర్లాపొదర్‌ గ్రామాల్లోని గిరిజనులు దూర ప్రాంతంలోని ఊట గడ్డల నుంచే నీటిని మోసుకువస్తున్నారు. ఇలా ఏజెన్సీ లో వందల సంఖ్యలో గిరి పల్లెల్లో దాహం కేకలు వేస్తున్నా పాలకులకు అవేవీ వినిపించకపోవడం గమనార్హం.
పార్వతీపురం మన్యం జిల్లాలో
ఇంటింటికీ కుళాయిలు వేసి..తాగునీటి కష్టాలు తీరు స్తామని ప్రభుత్వాలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్ధితి భిన్నంగా ఉంది.పది రోజులుగా పార్వతీపురం మం డలంలోని 65గ్రామాలకు తాగునీరురాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శ్మశానాల్లో ఉన్నబోర్లు,ఊరి చివరనున్న పాడైన బావుల నీటితో గొంతు తడుపుకొంటున్నారు. మక్కువ మండ లండి.శిర్లాంలోని సువర్ణముఖి నది నుంచి పార్వతీపు రం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది.ఇక్కడ ఇన్‌ఫిల్టర్‌ బావుల్లో మోటార్లు పదిరోజులు క్రితం పాడువడంతో 65 గ్రామాలకు సరఫరా ఆగిపోయింది.నర్శిపురం, బొండ పిల్లి ఎమ్మార్‌నగరం,డోకిశీల,ములగ తదితర గ్రామాల ప్రజలు ఒకటి,రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లు,బావులకు వెళ్లాల్సిన పరిస్థితి.-జి.ఎన్‌.వి.సతీష్‌

శక్తిమంతులు…మట్టి మహిళలు

‘వేట వృత్తిగా బతికిన ఆటవిక యుగంలోన/ స్త్రీ రాజ్యం స్థాపించి సమానతను చూపినాము/ నాగలి కనిపెట్టినాము/ నాగరికత నేర్చినాము’ అనే జనపదం మహిళ సామర్థ్యాన్ని తెలుపుతుంది. మహిళ ఒక ఉత్పత్తి సాధనం. పునరుత్పత్తికి ఆమే ఆధారం. ఒకప్పుడు మానవ జీవన విధానంలో ప్రముఖపాత్ర మహిళదే. అయితే పరిణామ కమంలో ఆమె మనుగడ అనేక అవరోధాల వలయంలో చిక్కుకుపోయింది. తన శ్రమ అలానే ఉంది, కానీ గుర్తింపు మాయమైపోయింది. తన కష్టం అలానే ఉంది, కానీ గౌరవం కనుమరుగైపోయింది.బాధ్యతలూ, బరువులూ ఆమె నెత్తిమీదే. ప్రమోషన్లు, రిటైర్‌మెంట్ల ఊసే తెలీదు.వెరసి ఆమె ఓ నిరంతర ఉత్పాదక మరమనిషి. నాటు వేసి, కోత కోసి, కుప్ప నూర్చి మట్టిలో మాణిక్యాలు వెలికితీసే నైపుణ్యం ఆమెది. ఈరోజున మనుషులంతా వేళకింత అన్నం తింటున్నారంటే..అందులో మెజారిటీ కష్టం గ్రామీణ,ఆదివాసీ మహిళలదే. ప్రతిఫలంగా వాళ్లకు దక్కే మూట విప్పి చూస్తే.‘కొన్ని తిట్లు, కొన్ని కన్నీళ్లు, కొంత అలసట,కొంత గుర్తింపులేనితనం,రాత్రికి రోజువారీ ఒంటినొప్పులు’.మేల్‌ సుపీరియారిటీ సొసైటీలో ‘అవని ఆకాశంలో సగం’ అనే మాట ఒట్టి మాటే. తతిమా ప్రపంచానికి సరే..గ్రామీణ, ఆదివాసీ మహిళలకు వారి హక్కుల పట్ల వారికే అవగాహన లేదు. వారిలోనూ,ప్రజల్లోనూ ఆ అవగాహన తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సంబంధించి ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

‘అందరికీ మంచి ఆహారాన్ని పండిస్తున్న గ్రామీణమహిళలు’అనేది ఈ ఏడాది అంతర్జాతీయ గ్రామీ ణ మహిళల దినోత్సవం థీమ్‌. ప్రపంచమంతటా ఆహా రాన్ని పండిస్తున్న గ్రామీణ మహిళలను గుర్తించడం.. వారికున్న హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగిం చడం..అనే ముఖ్యోద్దేశ్యాన్ని చెప్పే థీమ్‌తో ఐరాస పిలుపు నిచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయానికి, ఆర్థిక వ్యవ స్థకి,ఆహార ఉత్పత్తికి గ్రామీణ మహిళలే అపారమైన కృషి చేస్తున్నారు.వారి శ్రమకు, సృజనాత్మకతకు గుర్తింపు తేవాలనే ఉద్దేశ్యంతో 2008,అక్టోబరు 15న గ్రామీణ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే దీనికి అంతగా ప్రాచుర్యం అందలేదు. అవగాహనా పెంపొందలేదు. సహజంగా గ్రామీణ ఉత్పత్తిలో ప్రధానంగా పాలుపంచుకుంటున్నది దళిత,బహుజన, ఆదివాసీ మహిళలే. ఆదివాసీ మహిళలు అడవుల్లో సేకరించి,ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. పోషకాల విషయంలోనూ అవి అంతే విలువైనవి. ప్రపంచ మహిళల్లో సగ భాగానికి పైగా భూమి లేక కూలి చేసే మహిళలే. చిన్న, సన్నకారు రైతు కుటుంబాల మహిళలు ఆహార ఉత్పత్తిలో, భద్రతలో ప్రధాన భూమిక నిర్వర్తిస్తున్నారు.పారిశ్రామిక వ్యవస్థ లోనూ మహిళల శ్రమా కీలకమైనదే.
నాటి ఆదర్శం..
గ్రామాలు, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీ జీ అన్నారు.గ్రామస్వరాజ్యం సాధిస్తేనే గ్రామాలు, పట్టణా లు,నగరాలు,రాష్ట్రాలు,దేశం అభివృద్ధి పథంలో పయనిస్తా యన్నారు. గ్రామాల్లోని వ్యవసాయ వనరులే దేశ ఆర్థిక పరిస్థితికి,ఆహార భద్రతకు ఆధారం.ఆ విషయం గ్రామీణ మహిళల శ్రమ ఫలితంలో కనిపిస్తుంది. పంటల సాగు, విత్తనాల సంరక్షణ,పశుపోషణ,పెరటికోళ్ళ పెంపకం, అటవీ వనరుల సేకరణ,చేపల పెంపకం (అమ్మకం), చేనేత రంగం,బీడీ పరిశ్రమలు..ఇవన్నీ గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలే. వీటిలో మహిళలదే ప్రధాన భూమిక.
నేటి ఆధునికం..
అయితే ప్రపంచీకరణ, ప్రైవేటీ కర ణస్థానం బలోపేతమౌతున్న కొద్దీ గ్రామీణ వనరులన్నీ పలచనవుతూ వచ్చాయి. దాదా పు రెండున్నర దశాబ్దాల నుంచి గ్రామా ల్లో పేదరికం తాండవిస్తోంది. ఆర్థిక వెసులు బాటు లేక ప్రజలు మగ్గిపోతున్నారు. ఈ పరిణామం ముఖ్యంగా గ్రామీణ మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపు తోంది. పోషకాహార లేమితో అనారోగ్య సమస్యలకు గురవుతు న్నారు. విద్య, వైద్య సదుపాయాలు లేవు.ఈ ఇరవై ఏళ్ళలో దాదా పు 50శాతం మహిళలు తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రామాల్లో సెజ్‌ల రూపంలో భూదోపిడీలు జరుగుతు న్నాయి. ప్రభుత్వాలే ప్రజలను మభ్యపెట్టి, పారిశ్రామిక వర్గాలకు భూములను కేటాయిస్తున్నాయి.దీంతో గ్రామాల్లో పేదప్రజలు తమ భూముల నుండి నిర్వాసి తులవుతున్నారు.ప్రభుత్వ అక్రమ విధానాల కారణంగా ఆదివాసీ ప్రాంతాల్లో గనుల తవ్వకం నిరాఘాటంగా సాగుతోంది. వారు సాగు చేసుకునే పోడు భూములను ప్రభుత్వాలు వివిధ కారణాలు చెప్పి,స్వాధీ నం చేసుకుం టున్నాయి. నిర్వాసితులు, నిరాధారులంతా వలస మార్గం పడుతున్నారు.
గిరిపుత్రుల గోడు..
అనాదిగా గిరిజనులుప్రకృతి ప్రేమి కులు. జీవనానికి తోడ్పడే ప్రతిదీ వారికి దైవంతో సమానం. అంతగా వారి జీవన విధానం పరిసరాలతో ముడిపడి ఉంటుంది. చెట్టు,పుట్ట,పక్షి..ఇలా తమ చుట్టూ ఉండే ప్రతిప్రాణీ వారి సొంతంగా బతుకు తారు. ఆట,పాట వారి జీవనంలో భాగం.అదే వారి సంస్క ృతి.గిరిజను లకు అటవీ భూమిలో నివసించే హక్కు ఉంది.ఆ భూమిని సాగు చేసుకునే హక్కూ ఉంది.అటవీ ఉత్పత్తులను సేక రించి,వినియోగించుకునే హక్కూ వారి కుంది.వారి ఆచార వ్యవహారాలకు ఆటంకం కలిగితే ఎదుర్కొని, న్యాయం కోరేందుకు చట్టాలున్నాయి. అయితే నిరక్షరా స్యత వల్ల వారికి వీటిపై అవగాహనే లేదు. అభివృద్ధి పేరుతో నెలకొల్పే ప్రాజెక్టులు, గనుల తవ్వ కాలు,అడవుల నరికివేత వంటివి వారి మనుగడకు పెనుభూతాలుగా మారి, నిర్వాసి తులను చేస్తున్నాయి.
అక్షరాస్యతతో అవగాహన వైపు..
గ్రామాల్లో సరైన విద్యా సౌకర్యాలు లేక నిరక్ష రాస్యత రాజ్యమేలుతోంది. ఆడ పిల్లల చదువు ప్రాథమిక పాఠశాల స్థాయి లోనే ఆగిపోతోంది.దాంతో వారికి తమ శ్రమకు విలువ కట్టడం తెలియడం లేదు.వారికున్న హక్కు ల పట్ల అవగాహన కలగటం లేదు.అనేక దుర్భర పరిస్థి తులను ఎదుర్కొంటున్నారు.అక్షరాస్యతను అభివృద్ధి పరచాలని‘బేటీ బచావో బేటీ పఢావో,సర్వశిక్ష అభియాన్‌, మధ్యాహ్న భోజన యోజన’లాంటి పథకాలను ప్రభు త్వాలు తెచ్చాయి. కానీ అవి అమలుకు నోచుకున్నాయా అని తరచి చూస్తే మనకి అన్నీ ‘అచ్చుతప్పులే’ కనిపిస్తా యి.ఈవిషయంలో మన పొరుగు రాష్ట్రం కేరళది ఆదర్శవంతమైనపాత్ర. మనదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం.2011జనాభాలెక్కల ప్రకారం 94శాతం అక్షరాస్యత ఉంది. ఇటీవలి అంచనాల ప్రకారం 96.2 శాతానికి పెరిగింది. మిగిలిన రాష్ట్రాలూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే దేశం అక్షరాస్యతతో సుసంపన్నమవుతుంది.
ఏరువాక విడిచి ఊరు దాటితే..
జీవనోపాధిని కోల్పోయి పట్టణాలకు,నగరాలకు పొట్ట చేతపట్టుకొని వలస పోతున్నారు గిరిజనులు, గ్రామీ ణులు.దారం తెగిన గాలిపటాలయ్యాయి వీరి జీవితాలు. తెలియని ప్రదేశాలలో ఇమడలేక,సరైన పనులు దొరక్క నానా యాతనలు పడుతున్నారు.మహిళలైతే పని ప్రదేశాల్లో హింసకు,లైంగిక వేధింపులకు,దాడులకు గురవుతున్నారు.బలవంతంగానో,బతకలేని పరిస్థితుల్లోనో వ్యభిచార వృత్తిలోకి నెట్టివేయబడుతున్నారు.గ్రామీణ మహిళలు బయటే కాదు ఇళ్లల్లోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తీవ్రమైన గృహ హింసను అనుభవిస్తు న్నారు. కుటుంబసభ్యుల నిరంకుశత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిని భరించాల్సి వస్తోంది. అలాంటి వాతావరణం లో పెరిగిన పిల్లలు చిన్నతనంలోనే వ్యసనాలకు లోనవు తున్నారు.తాము చేయని తప్పులకు అటు పిల్లలు, ఇటు భర్త వ్యసనాలబారిన పడుతున్నారు.చివరికి ఈ కష్టాలు మహిళలకు తీరని క్షోభను మిగుల్చుతున్నాయి.
ఘనత ఉన్న పంచాయితీరాజ్‌..
మన గ్రామీణ రాజకీయ నేపథ్యంలో పంచాయి తీరాజ్‌ వ్యవస్థ కీలకం.ఇది అతి ప్రాచీనమైనది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రయోగశాలగా చెప్పుకునే ఘనత దీనికి ఉంది.గ్రామ పరిపాలనకు వెన్నెముకగా పనిచేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 72 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారి భవిష్యత్తు పంచాయితీరాజ్‌ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది.ఈ వ్యవస్థలో ముఖ్యంగా గ్రామీణ మహిళల భాగ స్వామ్యం ఉంది. వారికి ఉండేది వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే.ఆ ఆసరా కూడా లేకుండా చేసే కార్య కలాపాలు ఆపి, వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది.
పథకాల అమలే పరిష్కారమా..?
మహిళా రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ గ్రామ స్థాయి లోని మహి ళలు ఆర్థికంగా,సామాజికంగా ఇంకా వెనుక బడి ఉన్నారు. పంచాయితీ రాజ్‌లో పది లక్షల మంది మహిళా ప్రతి నిధులు ఉన్నారు. అయినప్పటికీ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరటం లేదు.ఈ పరిస్థితిని అధిగ మించాలనే ఉద్దేశాన్ని చెబుతూ మహిళల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టాయి.డ్వాక్రా గ్రూపు లు,సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు,స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ లాంటి రకర కాల పథకాల ద్వారా మహిళలకు కొంత వరకు తోడ్పాటు ను అందిస్తున్నాయి. అయితే అవి సక్ర మంగా అమ లుకు నోచుకోవడం లేదు. దీనికి పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో పాటు మహిళలకు వాటిపై అవగాహన లేకపోవడం కూడా కారణమే. రాజ్యాంగం అనేది ఒకటి ఉందనీ, దానిలో మహిళలకు అంటే తమ కోసం కొన్ని చట్టాలు ఉన్నా యన్న కనీస అవగాహన గ్రామీణ మహిళ ల్లో లేదని ఇటీవల ఒక అధ్యయనంలో తెలిసింది.ఆయా చట్టాల గురించి,హక్కుల గురించి వారికి తెలిసిన ప్పుడే మార్పు మొదలవుతుంది.
పితృస్వామిక పరిమితులు..
సమాజంలో పాతుకుపోయిన పితృ స్వామిక విలు వలు మహిళల హక్కులను తొక్కి పెడుతున్నాయి. చాలా వరకు గ్రామా ల్లో ఆస్తులన్నీ పురుషుల చేతుల్లోనే ఉన్నా యి.అవి మహిళలకు లభించే విధంగా అమలు జరగటం లేదు.బాంకు అకౌంట్లు కూడా జనధన్‌ యోజన,ఫైనాన్స్‌ఇంక్లూ జన్‌లో మహిళలను భాగస్వా మ్యం చేయాలి. ప్రభు త్వం ఇచ్చే స్థలాలు,ఇళ్ళ పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వాలి.అవి నేరుగా మహి ళలకు చేరేవిధంగా ఏర్పాటు చేయాలి.అంగన్‌వాడీ,జననీ సురక్ష యోజన లాంటి పథ కాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి.శ్రమకుతగ్గ వేతనం అందక పోయినా పురుషులతో సమానంగా శ్రమిస్తూనే ఉన్నారు.సామాజిక బాధ్యతలు మోస్తూనే ఉన్నారు.
విధిలేక వివక్షలో..
మహిళల శ్రమ పురుషులతో సమానం లేదా అంతకు మించి ఉంటుంది.వేతనం విషయంలో మాత్రం వివక్ష స్పష్టంగా,నిరాఘాటంగా కొనసాగుతోంది. మహిళ లకు పనికి తగ్గ వేతనం లేదు.ఆరుగాలం శ్రమించినా తిరిగి చూసుకుంటే శూన్యమని పిస్తోంది.అంతేకాదు.. ఇంత చేసినా మహిళలకు భూమిపై హక్కు లేదు. మహిళా రైతుగా గుర్తింపు లేదు. జీవనోపాధిలో నిర్ణయా ధికారం లేదు.ఆదాయంపై నియంత్రణ అనేది లేదు.తల్లిగా, భార్యగా,సోదరిగా ప్రతి పురుషుని జీవితాన్నీ తీర్చిదిద్దేది మహిళే. అయినా మన పితృస్వామ్య సమాజంలో స్త్రీకి ఉన్న విలువెంత అంటే సమాధానం శూన్యం.మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా,మన పురుషాధిక్య సమాజంలో వారికే మాత్రం గౌరవం, గుర్తింపు ఉండటం లేదు. చట్టపరంగా సమాన హక్కులు ఉన్నా,అవి తెలిసినవారు ఎక్కడో ఒకరుంటారు. ఇప్ప టికీ ఇంటాబ యటా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు.పైకి కనిపించే చిరునవ్వుల వెనుక కనిపించని కన్నీళ్ళెన్నో. మహిళల పరిస్థితులు మారాలని అందరూ చెబుతున్నారు. కానీ మహిళా కమిషన్‌ బిల్లును సైతం తొక్కిపెడుతూనేఉన్నారు.
తీర్పుతో మార్పు ఉందా..
సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం నియమాన్ని స్పష్టీకరించింది. రోజువారీ కూలీలకు, క్యాజువల్‌ సిబ్బందికి,కాంట్రాక్టు సిబ్బందికి ఈ నియమం వర్తిస్తుంది. అయినా ఇప్పటికీ ఆనియమం అమలు కాలేదు. స్త్రీ-పురుషుల వేతనాల విషయంలో తీవ్ర వ్యత్యా సాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వైనాన్ని కళ్ళకు కట్టింది మాన్‌స్టర్‌ సబ్‌వే. ఓవైపు వేతనాల్లో అన్యాయానికి గురవుతున్న స్త్రీలు ఇటు ఇల్లు, అటు ఆఫీసు పనుల్లో తీవ్ర మైన వత్తిడికి గురవుతున్నారు.పని ఒత్తిడిలో మగ్గుతున్న మహిళలు43శాతం మంది ఉన్నారని ఇటీవలి నివేదికలో తెలిసింది.వీరిలో దాదాపు 92శాతం మంది మహిళలు. స్త్రీల పథకాల అమలు లోనైనా మహిళల భాగస్వా మ్యం ఉంటే కొంతవరకు అమలుకు నోచుకునే అవకాశం ఉంటుంది.
వారసత్వపు హక్కులో సత్తువుందా..
సహజంగా మనదేశవారసత్వ చట్టంలో తాత ఆస్తి మనవడికి అని ఉండేది. స్త్రీకి గానీ,ఆమె సంతా నానికిగానీ చెందేలా లేదు. చట్టపరంగానే లింగ వివక్షను చవిచూ సింది మహిళ.అయితే వారసత్వచట్టం ఒక అడుగు ముందుకేసి స్త్రీలకూ పురుషులతో సమానంగా ఆస్తి హక్కును కల్పించింది.దీన్ని ఆధారం చేసుకుని భూమిపై హక్కును,వాటాను మహి ళలు సాధించుకోవాలి. మహిళలకు వీటిపై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలి. స్వచ్ఛం ద సంస్థలతో పాటు ప్రభుత్వాలూ బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మహిళలకు ఆస్తి హక్కు సరైన రీతిలో చెందేలా ప్రభుత్వాలే చట్టాలు రూపొందించాలి.
మహిళా రైతు దినోత్సవం..
నేడు మన దేశంలో చిన్న,సన్నకారు రైతుల విష యానికొస్తే..వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళా కార్మికులు 86శాతం పైనే ఉన్నారు. వారిలో 53 శాతం కుటుంబాలకు సాగుభూమి లేదు. భూమిని కౌలుకు తీసుకుని,వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. వర్షా భావం తో పంటలు పండకపోయినా కౌలు మాత్రం యజమానికి చెల్లించాల్సిందే. దీంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు భూమిపై హక్కులున్నాయా అంటే? లేవనే చెప్పాలి. మరి ఇలాంటివారికి ప్రభుత్వాలే భూపంపిణీ చేయాలి.అదీ మహిళ పేరుతో ఇస్తేనే లబ్ది చేకూరుతుంది. అప్పుడే స్త్రీలు ఒడిదుడు కులను ఎదుర్కొని పిల్లల బాధ్యత, కుటుంబ పోషణను సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. పథకాలు ప్రభుత్వాల ప్రకటనల వరకే పరిమితం కాక, అమలు చేయాల్సిన అవసరం ఎంతైనాఉంది.దీనివల్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరే అవకాశంఉంది.
మహిళా రైతుల వేదిక సభ్యులు వీటిపై కృషి చేస్తున్నారు. మహిళల హక్కుల గురించి, వారి శ్రమకు గుర్తింపు రావాలని చేస్తున్న కాంపెయిన్‌లు, సదస్సులు, జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి,కొన్ని సంఘాలు ముందుకెళ్తున్నాయి.గతేడాది కేంద్ర వ్యవసా య మంత్రి గ్రామీణ రైతుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.తమ హక్కు లూ, పథకాలూ గ్రామీణ మహిళలకు చెందా లి.అందుకోసం ప్రజాస్వామిక శక్తులూ, మానవహక్కుల సంఘాలూ, మహిళా సంఘా లూ గళమెత్తాలి.మహిళలంతాఒక్కటై నినదిం చాలి.ఇది మహిళా రైతుల కృషికి సత్ఫలి తాలిస్తుందని భావిద్దాం. మానవ మనుగడకు నిరంతర కార్యదర్శిని గుర్తించి,గౌరవిద్దాం. – (టి.టాన్య)

మహిళలు..బాలల హక్కులకేదీ భరోసా

రాజ్యాంగం మహిళలు,బాలలకు ప్రసాదించిన హక్కులను మనమెంత సమర్థంగా అమలు చేస్తున్నామో సింహావలోకనం చేసుకోవడం అవసరం. చట్టం ముందు అందరూ సమానులేనని, అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది. మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
చట్టం ముందు అందరూ సమానులేనని,అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది.కుల,మత,జాతి,మత,లింగ, ప్రాంతీయ పరంగా ఎవరిపైనా దుర్విచక్షణ చూపకూడదని నిషేధం విధించింది.మహిళలు,బాలలహక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏవైనాప్రత్యేక చర్యలు తీసుకోదలిస్తే,ఆపని నిక్షేపంగా చేయవచ్చునని15(3)వ రాజ్యాంగ అధికరణ ఉద్ఘాటించింది.మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.
గణతంత్ర గమనం.. ఒడుదొడుకులమయం
మహిళా సమానత్వం,మహిళా హక్కుల గురించి రాజ్యాంగ నిర్మాతలకు మొదటి నుంచి పూర్తి అవగాహన ఉంది.వాటిని తప్పనిసరిగా అమలు చేయాలన్న దృఢసంకల్పమూ ఉంది.ఆరంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా,1950లలో హిందూస్మృతి బిల్లుల ఆమోదంతో ముందడుగు పడిరది. అయితే హక్కుల సంరక్షణా రథం జోరు అందుకోవడానికి మరికొంత సమయం పట్టింది.1961లో మాతృత్వ సంక్షేమ చట్టం,వరకట్న నిషేధ చట్టాలు ఆమోదం పొందాయి. కేవలం చట్టాలతోనే సమూల మార్పు సాధించలేమని అనుభవంలో తెలిసివస్తోంది.ఉదాహరణకు భారతీయ శిక్షాస్మృతిలోని 304 బి సెక్షన్‌ వరకట్న మరణాలను హేయమైన నేరంగా పరిగణిస్తోంది.అంతమాత్రాన వరకట్నం కోసం వేధించడం,కోడళ్ల హత్యలు,ఆత్మహత్యలు ఆగలేదు కదా! నేడు దేశంలో గంటకొక వరకట్న మరణం సంభవిస్తోందని జాతీయ నేరగణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడిరచడం ఓభీకర వాస్తవాన్ని కళ్లకు కడుతోంది.ఆచరణలో కొన్ని లోటుపాట్లున్నా మహిళలకు చట్టపరమైన రక్షణను కొనసాగించడం తప్ప నిసరి.అందుకే గృహహింస నిరోధానికి ఒకచట్టం చేశాం.పని చేసేచోట మహిళలను లైంగికంగా వేధించడం నిషిద్ధమని,అసలు అలాంటివి జరగకుండా ముందే నివారించాలని,లైంగిక వేధింపులు జరిగితే కఠినంగా శిక్షించాలని నిర్దేశిస్తూ ప్రత్యేక చట్టమూ చేశాం.ఎంతో కాలం చర్చలు, తర్జనభర్జనలు జరిగిన మీదట అవి రూపుదాల్చాయి.రాజ్యాంగం తమకు భరోసా ఇచ్చిన హక్కుల్లో కొన్నింటినైనా సాధించుకోవడానికి మహిళలకు అండగా నిలిచాయి. అయితే చట్టాలు ఆశించిన ఫలితాలు ఇచ్చేలా నిరంతరం జాగరూకత పాటించాలి.
మహిళలు,పురుషులనే భేదం లేకుండా పౌరులందరికీ సముచిత జీవనాధారం,ఒకే పనికి ఒకే విధమైన వేతనాలు అందాలని రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఆదేశి స్తున్నాయి.పంచాయతీలు,పురపాలక సంఘాల్లో షెడ్యూల్డ్‌ కులాలు,తెగలతోపాటు మహిళలకూ రాజ్యాంగం సీట్లు కేటాయించింది. అయితే కొన్ని సీట్లలో మహిళలకు బదులు వారి భర్తలు లేక బంధువులు అధికారం చలాయి స్తున్నారనే వార్తలు వస్తున్నాయి.కొందరు అగ్రశ్రేణి రాజకీ య నాయకులు సైతం మహిళలు ఉండాల్సింది వంటిం ట్లోనని,వారు బయటికొచ్చి గద్దెనెక్కడం సరికాదని వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం.కాబట్టి కేవలం చట్టా లతోనే పని జరగదని అర్థమవుతోంది. అందరి మనస్త త్వాల్లో, దృక్పథాల్లో మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా మహిళలకు సాధికారత చేకూర్చాలనే దృఢసంకల్పం అందరిలో పాదుకోవాలి.ప్రత్యేక సంరక్ష ణ, సహాయం పొందే హక్కు చిన్నారులకు ఉందని సార్వ త్రిక మానవ హక్కుల ప్రకటనలోని 25వ అధికరణ గుర్తించింది.1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశం ఆమోదించిన ఈ ప్రకటనను ప్రపంచ దేశాలన్నీ శిరసావహిస్తున్నాయి.తదనుగుణంగా భారత రాజ్యాంగం బాలలతో చాకిరీ చేయించడాన్ని నిషేధించింది.14 ఏళ్ల లోపు పిల్లలతో కర్మాగారాల్లో కాని, గనుల్లో కాని, మరెక్క డైనా కాని ప్రమాదభరితమైన పని చేయించకూడదని స్పష్టీకరించింది. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఎదిగేట్లు జాగ్రత్త తీసుకోవాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి.స్వేచ్ఛాయుత వాతావరణంలో హుందా గా పెరిగేలా పిల్లలకు అవకాశాలు, సౌకర్యాలు కల్పించా లన్నాయి.బాలలు,యువజనుల శ్రమను దోపిడి చేయడం, నైతికంగా,భౌతికంగా వారిని నిస్సహాయులుగా వదిలి వేయడం వంటివి జరగరాదంటున్నాయి.ఈ లక్ష్యాలను సాధించడానికి తగు విధానాలు రూపొందించి అమలు చేయాలని ఆదేశిస్తున్నాయి.ఇవి గొప్ప లక్ష్యాలే కాని, వాటిని ఎంతవరకు నెరవేర్చామో తరచిచూసుకోవడం ఆవశ్యకం.పిల్లల హక్కులను నిజంగా కాపాడగలుగు తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
లక్ష్యసాధనలో వైఫల్యాలెన్నో
ప్రగతిశీల సమాజంగా, సజీవ ప్రజాతంత్ర, గణ రాజ్యంగా వెలిగిపోతుందనుకొంటున్న భారతదేశం నిజంగా ఏమి సాధించిందనే ప్రశ్న సహజంగానే తలెత్తు తుంది. లక్ష్యసాధనలో కొన్ని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.మరి వాటిని అధిగమించడానికి మనమేం చేశాం, ఏం చేస్తున్నాం? మొదట దేశ ప్రజల ఆలోచనా విధానం మారాలి. కాలం మారుతోందని గుర్తించి తదను గుణంగా నడచుకోవాలి.చిరకాలం ఇంటి నాలుగు గోడల మధ్య మగ్గిపోయిన భారతీయ మహిళ నేడు బయటి ప్రపంచంలోకి వస్తోంది.‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే మను సూక్తికి కాలం చెల్లిపోయింది. తమకూ హక్కులు ఉన్నాయని, రాజ్యాంగం వాటికి భరోసా ఇచ్చిందని మహిళలు గ్రహించారు.సమానత్వం, గౌరవ మర్యాదల పరిరక్షణకు కట్టుబడిన రాజ్యాంగం వనితలను తమ హక్కులు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది.దీన్ని ఎవరూ కాదనలేరు.నాయకులు కాని, మరెవరైనా కాని మహిళల హక్కులను కాలరాయలేరు. మహిళలు కూడా సంస్థాగతంగా సంఘటితమై తమ హక్కులను కాపాడు కోవడానికి ఉద్యమిస్తున్నారు.మన దేశజనాభాలో 37 శాతం బాలలే అయినా గడచిన 70ఏళ్లుగా బాలల హక్కు లను అలక్ష్యం చేస్తూ వచ్చాం.ప్రపంచంలో యువ జనాభా అత్యధికంగా ఉన్నది భారత్‌లోనేనని గర్విస్తూనే బాలల గురించి పట్టించుకోకపోవడం క్షంతవ్యం కాదు. బాల్యం నుంచి చక్కని చదువులు చెప్పి,యౌవనంలో నైపుణ్యాలు గరపడం ద్వారా యువ జనాభాను దేశ ప్రగతికి చోదక శక్తిగా మలచుకోవలసిన బాధ్యత జాతి మీద ఉంది. మహిళలు,బాలలకోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ-అభివృద్ధి పథకాలు అమలవుతున్న తీరుపై సామాజిక తనిఖీ చేయాలి.వసతి గృహంలో లైంగిక అత్యాచారాలపై నిష్పాక్షికంగా,హేతుబద్ధంగా జరిపిన విచారణ ద్వారానే నేరస్తులకు శిక్షలు విధించగలిగాం. సామాజిక తనిఖీ కూడా అదే పంథాలో సాగాలి.
ఆచరణలో వెనకబాటు
పిల్లలు,ముఖ్యంగా ఆడ పిల్లల శ్రేయం కోసం జాతీయ విధానాలుచాలానే రూపొందించుకున్నాం. పిల్లల సంక్షేమానికి తరుణ వయస్కుల న్యాయ చట్టం రూపొందింది.14ఏళ్ల వయసువరకు బాలలకు ఉచిత విద్య ఒకహక్కుగా గుర్తించాం.ఇన్నిచట్టాలు చేసినా వాస్త వంలో పరిస్థితి వేరుగా ఉండటం శోచనీయం. కైలాస్‌ సత్యార్థి వంటివారు నిస్వార్థంగా కృషి చేసినప్పటికీ బాల కార్మికులతో పని చేయించే పద్ధతి ఇప్పటికీ కొనసాగు తోంది. సరైన వైద్య సౌకర్యాలు లేక వందల సంఖ్యలో శిశువులు ఇప్పటికీ మరణిస్తూనే ఉన్నారు.దేశంలో రోజుకు 250మంది బాలలు అదృశ్యమవుతున్నారని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు తెలుపుతున్నాయి. వసతి గృహా ల్లో,శరణాలయాల్లో బాలికలపై లైంగిక అత్యాచారాల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక శరణాల యంలో 30మంది బాలికలపై పదేపదే అత్యాచారం జరిపిన వ్యక్తులకు ఇటీవల శిక్షపడటం చూస్తే, రాజ్యాం గం నిర్దేశించిన రీతిలో బాలలకు ముందుగానే రక్షణ కల్పించలేకపోతున్నామని తేలుతోంది.బాలలు నేరాలకు ఒడిగట్టే ధోరణి తగ్గుతుంటే,వారి పట్ల నేరాలు పెరిగి పోతున్నాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడిరచింది.2016-2018 మధ్యకాలంలో బాలలపై నేరాలు గణనీ యంగా పెరిగా యని తెలిపింది. బాలలకు విద్యాహక్కును తొమ్మి దేళ్ల క్రితమే దత్తం చేసినా,ఆశించిన స్థాయిలో ఆహక్కు అమ లైందా అంటే గట్టిగా అవునని చెప్పలేని పరిస్థితి. అర్హులైన ఉపాధ్యాయులు,సరైన పాఠశాలభవ నాలు, ప్రయోగశాలలు,ఇతర మౌలిక వసతులు కొరవడటంవల్ల బాల లకు విద్యా హక్కు అరకొరగానే అమలవుతోంది. భారత గణతంత్ర రాజ్యానికి70ఏళ్లు నిం డిన సం దర్భంలో స్త్రీలు,బాలల అభ్యున్నతికి భావి కార్యాచరణ ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణ యించుకోవడం ఎంతైనా అవసరం. ఆలక్ష్య సాధనకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఐక్య రాజ్య సమితి లో సభ్యులైన 193దేశాలు సంతకం చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పత్రం సరిగ్గా అటువంటి ప్రణాళికే. భారత దేశం కూడా దాని మీద సంతకం చేసింది.సుస్థిరా భివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీల)ను సక్రమంగా అమలు చేస్తే,అన్ని వర్గాలతో పాటు స్త్రీలు, బాలలూ లబ్ధిపొందుతారు. ఎస్‌డీజీలలో అయిదోది స్త్రీలు,బాలికల గురించి పట్టిం చుకొంటోంది.లింగ సమానత్వం సాధించి, మహిళలు, బాలికలకు సాధికారత అందిం చాలని అందులోని అయిదోలక్ష్యం ఉద్ఘా టిస్తోంది.ఎస్‌డీ జీలలో ఇతర లక్ష్యాలైన పేదరికం,అసమా నతలనిర్మూలన,ఆరోగ్య సంరక్షణ,ఉపాధి,ఆర్థిక ప్రగతులను సాధిం చడానికి మహిళా సాధికారతే పునాది.కొత్త దశాబ్దంలో ఈలక్ష్యాల సాధనకు జాతి యావత్తు కలిసి కట్టుగా ప్రజాస్వామికంగా కృషి చేయాలి.- వ్యాసకర్త : సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి

ఆగని ఆకలి కేకలు.. పేదరికానికి పడని పగ్గాలు

పేదరికం ఒక విషవలయం.కనీస అవస రాలతోపాటు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పొంద లేని స్థితిని‘పేదరికం’అని ఐక్యరాజ్య సమితి నిర్వ చించింది.పేదరికం బాధను అంధుడుసైతం చూడ గలడంటూ నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ వాపోయారు.ఆకలి,అనారోగ్యం ఈ రెండూ పేదరి కం కవలలు. పోషకాహార లోపం, అనారోగ్యం, నిరక్షరాస్యత,నిరుద్యోగం వంటి మౌలిక సమ స్యలతో భారత్‌ నేడు సతమతమవుతోంది. స్వాతం త్య్రానంతరం సాధించిన అభివృద్ధి ఫలాలు కొంద రికే పరిమితం కావడంతో బీద ధనిక అంతరాలు కొనసాగుతున్నాయి.పోషకాహార లోపాలను అధిగ మించడంలో కొంత ముందడుగు పడినా, చేయా ల్సింది మరెంతో ఉందని క్షేత్రస్థాయి వాస్తవాలు చాటుతున్నాయి.2005-06 నుంచి 2015-16 మధ్య పదేళ్ల వ్యవధిలో 27.1కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులైనట్లు గణాంకాలు చెబుతున్నా, 130కోట్ల దేశజనాభాలో నేటికీ 28 శాతం పేదరి కంలోనే మగ్గుతున్నారని యూఎన్‌డీపీ నివేదిక స్పష్టీకరించింది.
పథకాలు ఎంత వరకు గట్టెక్కిస్తాయి?
ప్రధానిగా ఇందిర అయిదు దశాబ్దాల క్రితం ఇచ్చిన ‘గరీబీ హటావో’ నినాదం తరవాత చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ నుంచి ఇప్పటి గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాల వరకు పేదల సంక్షే మం కోసం ప్రభుత్వాలు అనేకానేక పథకాలు చేపడుతూ వచ్చాయి. హరిత విప్లవం పుణ్యమాని 60వ దశకం చివరలో వ్యవసాయ ఉత్పత్తుల పెరు గుదల ఆహార భద్రతకు బాటలుపరచింది. అన్నా ర్తుల ఆకలి కేకలు కొంతవరకు తగ్గుముఖం పట్టా యి. పేద రైతులకు పెట్టుబడి సాయాలు, పేదలకు పింఛను పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. అయినా కిందకు దిగిరానం టున్న పేదరికం గణాంకాలు వెక్కిరిస్తూనే ఉన్నా యి.ఈ తరహా పథకాలద్వారా ఆకలి మంటల నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప పేదరికాన్ని నిర్మూలించలేమని ఇన్నేళ్ల అనుభవాలు స్పష్టీకరిస్తున్నాయి. పేదలకు ఆదాయ భద్రతతో పాటు విద్య,వైద్యం,రక్షిత తాగునీరు వంటివి అం దాలి.దారిద్య్ర రేఖను స్వయంకృషితో అధిగ మించేలా వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడాలి.దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా వీటికోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆశించిన స్థాయి లో లేవు. సేవల నాణ్యతా పలు విమర్శలకు తావి స్తోంది.పేదరిక నిర్మూలనకు బహుముఖ వ్యూహాలు అవసరమని దీన్నిబట్టి బోధపడుతోంది.తాజా ప్రపంచ ఆకలిసూచీ-2019 నివేదిక ప్రకారం పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్న చిన్నారులు 2008-12మధ్యకాలంలో 6.50 శాతం నమో దైతే, 2014-18 మధ్యకాలంలో వారి సంఖ్య 20.83 శాతానికి పెరిగింది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడిరచింది. వాస్త వానికి పేదరికాన్ని ఎలా గణించాలన్న దానిపై ప్రభుత్వపరంగానే స్పష్టత కొరవడుతోంది. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం నియమించిన అలఫ్‌ు కమిటీ (1979), లకడాయీలా (1993), తెందూల్కర్‌(2009),రంగరాజన్‌కమిటీ(2014) లు పేదరికం గురించి భిన్నమైన నిర్వచనాలు ఇవ్వ డమే దీనికి దాఖలా.ఆ మేరకు తెంద్కూలర్‌ కమిటీ దేశంలో పేదలు 22శాతమని అంచనా వేయగా, రంగరాజన్‌ కమిటీ 29.5శాతమని చెప్పింది.

ఆ వర్గాల వారే ఎక్కువగా!
జీవితమంతా పేదరికంతో మగ్గినవారిని శాశ్వత పేదలంటారు. వీరు తరవాతి తరానికీ పేదరికాన్ని బదలాయించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివారు అధికంగా ఎస్సీ, ఎస్టీల్లో ఉంటున్నారు. ‘క్రానిక్‌ పావర్టీ రీసెర్చ్‌ సెంటర్‌’ పత్రాల ప్రకారం దేశం లోని పేదల్లో 50శాతం ‘శాశ్వత పేదరిక’ పరిధి లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎస్టీల్లో పేదరికం తగ్గుదల మిగిలినవారికన్నా తక్కువ. 1993-94,2004-05 సంవత్సరాలనాటి అంచ నాల ప్రకారం దేశవ్యాప్తంగా పేదరికం 37శాతం నుంచి 27శాతానికి దిగివస్తే, ఎస్టీల్లో మాత్రం 51.9 శాతం నుంచి 47.3 శాతానికే తగ్గింది. దీన్నిబట్టి పేదరిక నిర్మూలన పథకాలు వీరికి చేర వేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అవ గతమవుతోంది.పేదల స్థితిగతులు ఇలాఉంటే, దేశంలో సంపన్నులు మరింత కుబేరులవుతు న్నారు. 2018లో కేవలం ఒక శాతం ధనవంతుల సంపద 39శాతం అధికమైతే, అట్టడుగున ఉన్న సగం జనాభా సంపద మూడు శాతమే పెరిగింది. దేశంలో సగానికిపైగా సంపద కేవలం ఒక శాతం సంపన్నుల చేతుల్లోనే ఉంది. పదేళ్లపాటు జీడీపీలో తొమ్మిది శాతం వృద్ధి సాధ్యపడితే ప్రగతిఫలాలు అట్టడుగు స్థాయికి చేరి పేదరికం నిర్మూలన సాధ్య పడుతుందన్న అంచనాలు గురితప్పాయి. గ్రామీణ పేదరికానికి పగ్గాలు వేయగల వ్యవసాయానికి సరైన గిట్టుబాటు దక్కకపోవడం శాపమవుతోంది. గ్రామాల్లో జీవన ప్రమాణాలు క్షీణిస్తుంటే, పట్టణా ల్లో అవి పెరుగుతున్నాయి.
లోపాలను అరికట్టితే చాలు
భారతీయులెవరూ ఖాళీ కడుపులతో నిద్రపోకుండా చూడటమే దేశ స్వాతంత్య్ర పరమార్థమని మహాత్మా గాంధీ చెప్పారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆయన లక్షిం చారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ సైతం రాజకీ య స్వాతంత్య్రాన్ని మాత్రమే సాధించుకున్నామని అప్పట్లో అన్నారు. సాంఘిక, ఆర్థిక స్వాతంత్య్ర సాధన తదుపరి లక్ష్యాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక, ఆర్థికన్యాయం ప్రాతిపదికన సామాజిక వ్యవస్థ నిర్మాణం రాజ్యాంగ నిర్మాతల ఆశయం. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నేటికీ లక్ష్య సాధనకు దూరంగా ఉండటం మన వ్యవస్థల వైఫ ల్యాలనే చాటుతోంది. పన్నెండు పంచవర్ష ప్రణా ళికలు, మూడు వార్షిక ప్రణాళికలు కాలగర్భంలో కలిసిపోయినా,భారత్‌ ఇంకా దిగువ మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనుగడ సాగి స్తోంది. దేశంలో క్రమేపి పేదరికం తగ్గు ముఖం పడుతోందని చెబుతున్నా, ప్రభుత్వ సంక్షేమ పథ కాల అర్హుల సంఖ్య ఏటాపెరుగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు పేదలను దారిద్య్ర రేఖ దిగువ నుంచి వెలు పలికి తీసుకురావాలి. పథకాల అమలులో లోపా లను అరికట్టి అర్హులకే లబ్ధి నేరుగా చేరేలా జాగ్రత్త లు తీసుకోవాలి. సంక్షేమ ఫలాలను పేదలు సద్వి నియోగం చేసుకునేలా చైతన్యపరచాలి. తద్వారా పేదరికం కోరల నుంచి వారు బయటపడేలా చేయాలి.- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు

శిశు మరణాల్ని తగ్గిద్దాం భవిష్యత్తరాన్ని కాపాడుదాం

పోషకాహార లోపం.. మూఢ నమ్మకాలు.. సామాజిక..ఆర్థిక కారణాలరీత్యా ప్రతి ఏటా అనేక మంది శిశువులు మరణిస్తున్నారు. వైద్య రంగంలో నేడు ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. శిశువులకు సంబంధించిన వైద్య సేవలు ఎన్నో విస్తరిం చాయి.వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా నేటి కీ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాం తాల్లోని ప్రజల్లో మూఢ నమ్మకాలు పెరిగి పోవ డం..ఆకారణంగా ప్రతి ఏటాలక్షల సంఖ్యలో శిశు మరణాలు జరగడం విచారించదగిన అంశం. శిశు మరణాల రేటు తగ్గించేందుకుగాను ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నవంబరు 7వతేదీన ‘శిశు రక్షణ దినోత్సవం’ నిర్వహి స్తున్నారు. అయితే కేవలం ఆ ఒక్కరోజున మాత్రమే వివిధ కార్యక్రమాలను నిర్వహించడం కాదు..నిరంతరం శిశు రక్షణా కార్యక్రమాలను చేయడం వలన ప్రజల్లో అవగాహన పెరిగి,శిశు మరణాల రేటును తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..
నేటికీ మూఢ నమ్మకాలతో గోల్డెన్‌ అవ ర్‌లో వైద్యం అందక, శిశువుల మరణాలు సంభవి స్తున్నాయి.అవిద్య,పేదరికం కూడా ఇందుకు ప్రధా న కారణంగా ఉంది.ఇదిసామాజికంగా రావాల్సిన చైతన్యం. ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుం టున్న దశలో నేడు మరింతగా మూఢ నమ్మకాలు ప్రబలడం విచారకరం. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిని రూపుమాపే విధంగా, ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు ముమ్మరంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శిశువు అంటే..
అప్పుడే పుట్టినప్పటి నుండి మొదటి సంవత్సరం పూర్తయ్యే వరకు శిశువుగా పరిగణిస్తారు. ఈ సంవత్సర కాలంలో శిశువులను జాగ్రత్తగా చూడ టంతో పాటు ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ కల్పించా ల్సిన అవసరం ఉంది. అయితే మన దేశంలోగానీ లేదా ఇతర దేశాలలోగానీ చూస్తే ఎక్కువగా మర ణాలు ఏడాదిలోపు పిల్లల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలల పిల్లల్లో మరీ ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఏడాదిలోపు పిల్లల మరణాలు ఎందుకు సంభవి స్తున్నాయనే విషయాలను తెలుసుకోవాలి. శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ము ఖ్యంగా బిడ్డ పుట్టిన తరువాత మొదటి మూడు నెలలు అభివృద్ధికి కీలక దశ.ఈ సమయంలో వినికిడి, కంటి చూపు, ఆలోచన, స్పందన తదితర విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులతో అవినాభావ సంబంధం ఏర్పడు తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాను కనుక పరిశీలిస్తే 2019లో పుట్టిన శిశువులు మొదటి నెలలోనే 24 లక్షలకు పైగా శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రతిరోజూ ఏడు వేల కంటే ఎక్కువ మంది పిల్లలు మరణిస్తున్నారు. దీనిని నివారించేందుకు కృషి చేయాల్సిన అవసరం అందరిపైనా ఉంది.
కారణాలను పరిశీలిస్తే..
శిశు మరణాలకు ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. తల్లికి, బిడ్డకు సంబంధించినవి, సామాజిక, ఆర్థికపరమైనవి ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ నాలుగు కారణాల వల్లనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
తల్లికి సంబంధించి..
తల్లికి సంబంధించిన కారణాలను పరిశీలిస్తే చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవడం ప్రధాన కారణంగా ఉంది. వివాహ వయసు రాకుండానే వివాహాలు చేయడం వలన తల్లిలో సక్రమంగా శారీరక ఎదుగుదల ఉండకపోవడం..అలాగే పిల్లల సంరక్షణపైనా ఆమెకు సరైన అవగాహన లేకపో వడం..ప్రధాన కారణాలుగా ఉన్నాయి.అలాగే వివాహం అయిన వెంటనే గర్భం దాల్చడం వలన తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం జరుగుతుంది. శిశు మరణాలను కనుక పరిశీలిస్తే ఎక్కువ మంది బరువు తక్కువగా పుట్టడం వలన మరణిస్తున్నారు. గర్భిణీగా ఉన్న సమయంలో తల్లికి బిపి, షుగరు, గుర్రపువాతం వంటి లక్షణాలు ఉండటం కారణం గా బరువు తక్కువ పిల్లలు పుడుతున్నారు. అలాగే నెలలు నిండకుండానే ఎక్కువ మంది తల్లులు ప్రసవిస్తున్నారు. ఈ కారణాల రీత్యా పిల్లల ప్రాణా లకే ప్రమాదం పొంచి ఉంది. వీటిని నివారించా లంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబం ధించి వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిత్యం పరీక్షలు చేయించుకోవడంతో పాటు..చక్కటి పోషకాహారం తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. అంతకంటే ముఖ్యంగా ఆడపిల్లలకు వివాహ వయ సు వచ్చిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలి. అలా చేయ డం వలన ఆడపిల్లలకు అన్ని రకాలుగా అవగా హన ఉంటుంది. దాని కంటే ముఖ్యంగా శిశు రక్షణ ఎలా చేయాలో తెలుసుకోగలుగుతారు.
బిడ్డకు సంబంధించి..
బిడ్డకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే గర్భంలో ఉన్న బిడ్డ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసు కోక పోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోక పోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. చాలా మంది గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకో వడం లేదు..వీటన్నింటివల్ల పిల్లలు పుట్టిన తరు వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత కంటే ముఖ్యంగా జన్యుపరంగా ఎటువంటి సమ స్యలు వున్నాయో కూడా ముందుగానే తెలుసు కోవాలి.గర్భిణీగా ఉన్న సమయంలోనే బిడ్డ ఎదుగు దల గురించి, బరువు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలు న్నాయేమో గుర్తించేందుకు మూడు సార్లు స్కాన్‌ చేయాల్సి ఉంటుంది.ఒకవేళ అవసరమైతే రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.
సామాజిక కారణాలు..
సామాజిక కారణాలను అనేక విధాలుగా చూడ వచ్చు. నేటికీ మన సమాజంలో ఆడపిల్ల అంటే తక్కువగా చూసేదుస్థితి కనబడుతోంది. దీని నుండి ముందు మనం బయటపడాల్సిన అవసరంఉంది. శిశువు పుట్టగానే అమ్మాయిలు అయితే తక్కువగా చూడటం, అబ్బాయిలు అయితే అల్లారుముద్దుగా పెంచడం కూడా జరుగుతుంది. దీని కారణంగా తొలి రోజుల్లోనే శిశువు ఆరోగ్యం దెబ్బతినే అవకా శం ఉంది. అవిద్య,పేదరికం,సరైన సమయంలో ఇబ్బందులను గుర్తించకపోవడం,సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లలేకపోవడం వలన కూడా శిశు మరణాలు సంభవిస్తున్నాయి.
మూఢ నమ్మకాలు..
మూఢ నమ్మకాలు శిశు మరణాలకు ప్రధాన కార ణాలుగా చెప్పవచ్చు.సాధారణంగా శిశువు జన్మిం చగానే తల్లిపాలు పట్టించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది నేటికీ తేనె,పంచదార నీళ్లు పట్టిం చడం,కొన్నిచోట్ల గోమూత్రం పట్టించడం వంటివి చేస్తున్నారు.వీటి కారణంగా శిశువుల్లో అనేక రకా లైన‘ఇన్ఫెక్షన్లు’వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యం గా పిల్లల్లో విరేచనాలు అవుతుంటే అనాస పేరుతో నాటు వైద్యాలకు వెళుతున్నారు. ఇటీవలే విజయ వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇలాగే జరిగి, చివరకు శిశువు పరిస్థితి ప్రాణాంతకం కావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎట్టి పరిస్థితులలోనూ శిశువులకు నాటు వైద్యం మంచిది కాదు.ఈ విధం గా అనేక మూఢ నమ్మకాల వలన ‘గోల్డెన్‌ అవర్‌’ లో శిశువులకు వైద్యం అందడం లేదు. ఫలితంగా పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల నాటు వైద్యం, నమ్మకాలు పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. వైద్య రంగం అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు, విశ్వాసాలు కూడా అంతకం తకు పెరగడం విచారించాల్సిన విషయం. పురోగ మించాల్సిన దశలో ఈ తిరోగమన భావాలు శిశువుల ప్రాణాలను హరిస్తున్నాయన్న వాస్తవాన్ని ప్రజ లకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతై నా ఉంది. అంతకంటే ముఖ్యంగా శిశువుకు ఎటు వంటి సమస్య వచ్చినా తక్షణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు గానీ లేదా సమీపంలోని ఆసుపత్రికి గానీ తీసుకువెళ్లాలి.కచ్చితంగా శిశువుకు వైద్య సేవలను అందించాల్సిన అవసరం ఉంది.
స్నానం జాగ్రత్తలు..
శిశువుకు స్నానం చేయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.శిశువు టబ్‌లో ఉన్నప్పుడు మీ చేతికి అందేంత దూరంలో ఉండేలా చూసు కోవాలి.టబ్‌లో కొన్ని అంగుళాల వెచ్చగా ఉన్న నీటితో నింపాలి. నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు.
వ్యాక్సినేషన్‌..
మొదటి సంవత్సరం పూర్తయ్యే వరకూ శిశువులకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్స్‌ వేయించాలి.సూది ఇవ్వడం వలన జ్వరం వస్తుందని..లేదా ఇతరత్రా సమస్యలు వస్తాయనే మూఢ నమ్మకాలు ఇంకా బలంగా ఉన్నాయి.దీనివల్లే గ్రామీణ,ఏజెన్సీ ప్రాం తాలలో వ్యాక్సినేషన్‌ వేయించడానికి వెనకాడు తున్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా అక్కడక్కడా కొంత మంది కుటుంబ పెద్దల అవగాహన లేని మాటల కారణంగా వ్యాక్సినేషన్‌ వేయించడం లేదు. కానీ మొదటి ఏడాదిలోపు క్యాలెండర్‌ ప్రకా రం కచ్చితమైన వ్యాక్సినేషన్‌ శిశువులకు అందిం చాల్సిన అవసరం ఉంది. ఇది బిడ్డకు రక్షణగా నిలుస్తుంది.ఆవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.
ఆర్థిక కారణాలు..
సమాజంలో నేటికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి చాలా మంది వెనకాడుతున్నారు. ప్రస్తుతం ప్రయి వేటు,కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయిం చుకునే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా కొంతమంది వైద్యం చేయించు కునే అవకా శం కోల్పోతున్నారు.గిరిజన,మారుమూల ప్రాంతా లలో ‘రవాణా’ వ్యవస్థ అందుబాటులో లేక వైద్యం పూర్తిస్థాయిలో అందడం లేదు.వీరికి పట్టణ ప్రాం తాలకు వచ్చి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత ఉండటం లేదు.ఈ కారణంగా గ్రామీణ ప్రాంతా లలో నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.అయితే కొన్నిచోట్ల ఇంటి వద్దనే కాన్పు చేయిస్తున్నారు. అలా చేయడం వలన తల్లికి,బిడ్డకు కూడా ప్రమా దం కలిగే అవకాశం ఉంది.కాబట్టి కచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలోనే కాన్పు జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుప త్రులలో కూడా మెరుగైన వైద్య సేవలు,తగిన వైద్య పరికరాలు ఉండేలా చూడటం,ప్రజలకు అవగా హన కల్పింవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.
తల్లిపాలే బిడ్డకు రక్ష ..
బిడ్డకు తల్లిపాలేరక్ష.అసలైన పోహాకాహారం, ఆరో గ్యాన్నిచ్చేది తల్లిపాలే.కానీ నేటి సామాజిక పరిస్థి తులు,తల్లులు ఉద్యోగరీత్యా,కొన్ని అనారోగ్య కార ణాల వలన..మరికొందరు తమ అందం పోతుం దనే భయంతో బిడ్డకు పాలివ్వని పరిస్థితు లున్నాయి. శిశువులకు తల్లిపాలు జీవితాంతం రక్షణనిస్తాయి.ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా తల్లిపాలే బిడ్డను కాపాడేది.తల్లిపాలను బిడ్డకు ఆరు నెలలు కచ్చితంగా ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వకపో వడం వలన రోగనిరోధక శక్తి లేక బిడ్డకు పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తల్లిపాలు తప్పనిసరిగా ఇచ్చేలా కుటుంబం లో అందరూ బాధ్యత తీసుకోవాలి.
అవగాహన పెరగాలి..
శిశు రక్షణపై పూర్తిస్థాయిలో పెద్దఎత్తున అవగా హన పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహిం డంతో పాటు ప్రజలను పిహెచ్‌సి (ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు)కు రప్పించి,వైద్య సేవలు పొందేలా చూడాలి.దీంతో పాటు వైద్య సదుపాయాలు ప్రజల వద్దకే వెళ్లాల్సిన అవసరం ఉంది.ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్‌) ప్రచురించిన‘లెవెల్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ చైల్డ్‌ మోర్టా లిటీ’ రిపోర్ట్‌ 2020 ప్రకారం..భారతదేశంలో నవ జాత శిశు మరణాల రేటు 2006 నుంచి 2019కి సగటున 37నుంచి 22కు తగ్గింది.1990 నుంచి చూస్తే 2019కి 57నుంచి 22కు తగ్గింది. ఇదే పీరియడ్‌లో నవజాత శిశు మరణాల సంఖ్య 15 లక్షల నుంచి 5లక్షలకు తగ్గింది. శాతాలలో చూస్తే, నవజాత శిశుమరణాల రేటు 1990నుంచి 2005కు 39% తగ్గగా,2005 నుంచి 2019కి 41%తగ్గింది.1990 నుంచి 2019కి 60% తగ్గింది. అంటే నవజాత శిశు కేంద్రాలను ఏర్పా టు చేశాక నవజాత శిశుమరణాల రేటు ఎక్కువగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి ఇంటర్‌-ఏజెన్సీ గ్రూప్‌ ఫర్‌ చైల్డ్‌ మోర్టాలిటీ ఎస్టిమేషన్‌ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, నవజాత శిశువులు, ఐదేళ్ల లోపు పిల్లల నివారించగల మరణాలను అంతం చేయడంలో సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డిజి) చేరుకోవడానికి ప్రపంచం గణనీయంగా దూరంగా ఉంది. నివేదిక ప్రకారం 2030 నాటికి 50 కంటే ఎక్కువ దేశాలు ఐదేళ్లలోపు మరణాల లక్ష్యాన్ని చేరుకోలేవు. 60 కంటే ఎక్కువ దేశాలు తక్షణ చర్య లేకుండా నియోనాటల్‌ మరణాల లక్ష్యాన్ని కోల్పోతాయి. ఎస్‌డిజిలు నవజాత శిశువులు,5సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలను నివారించాలని పిలుపు నిచ్చాయి. అన్ని దేశాలు నవజాత శిశు మరణాల రేటు 1,000 సజీవ జననాలకు 12లేదా అంత కంటే తక్కువ మరణాలు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ మరణాల రేటు 25లేదా అంతకంటే తక్కువ మరణాలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.2030 నాటికి1,000 సజీవ జన నాలు.2020లో మాత్రమే ఐదులక్షలకు పైగా పిల్లలు వారి ఐదవ పుట్టినరోజుకు ముందే మరణిం చారు.22 లక్షల మంది పిల్లలు,5నుండి 24 సంవ త్సరాల వయస్సు గల యువకులు మరణించారని ఆ నివేదిక పేర్కొంది.
పిల్లలహక్కులు,శ్రేయస్సు అభివృద్ధి : యునిసెఫ్‌
పిల్లల శ్రేయస్సుపై ఎక్కువ ప్రభావం చూపే ప్రయ త్నాలను ఏకీకృతం చేసే కన్వర్జెంట్‌ సోషల్‌ పాలసీ విధానం,సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేయడం ప్రధానం. దీనిద్వారా సామాజికంగా మెరుగుపర చడం,పర్యావరణాన్ని బలోపేతం చేయడంపై యునిసెఫ్‌ ఎక్కువగా దృష్టి సారిస్తోంది.పిల్లల కోసం ఫలితాలను మెరుగుపరచడంలో కేరళలో వివిధ కార్యక్రమాలతో శిశు మరణాలను తగ్గించ డంలో గత రెండు దశాబ్దాలలో గణనీయమైన పురోగతి సాధించింది. కేరళ ప్రోగ్రామ్‌ ప్రయత్నాల కోసం యునిసెఫ్‌ రాష్ట్ర కార్యాలయం సామాజి కంగా మెరుగుపరచడం, సంఘటిత సామాజిక విధానం, సమగ్ర వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ఎక్కువ గా దృష్టి సారిస్తోంది.పిల్లల శ్రేయస్సుకు ఉపయోగ పడేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది.
దేశంలోనే కేరళ ఆదర్శం..
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడంలో కేరళ అగ్రగామిగా ఉంది.అత్యంత అట్టడుగువర్గాల్లోని పిల్లలు, మహిళల కోసం పేదల అనుకూల విధానాలు, సామాజిక రక్షణ కార్య క్రమాలను ప్రారంభించడంలో మనదేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో కేరళ ఒకటి. రాష్ట్రం సామా జిక భద్రతా చర్యలు,ఆరోగ్యం,పోషకాహారం, వాష్‌, విద్యావ్యవస్థల విస్తరణ,ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి ప్రగతిశీల చట్టాలు,పథకాలను ఆ రాష్ట్రం ప్రవేశ పట్టింది.యునిసెఫ్‌,వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యు హెచ్‌ఓ) కేరళను ప్రపంచంలోనే మొట్టమొదటి ’’బేబీ-ఫ్రెండ్లీ స్టేట్‌’’ గా గుర్తించాయి. ఎందుకంటే ఫార్ములాల కంటే తల్లి పాలివ్వడాన్ని సమర్థవం తంగా ప్రోత్సహించింది కేరళ. కేరళలో ప్రసవాలు 95 శాతానికి పైగా ఆసుపత్రిలో జరిగేలా ప్రోత్స హిస్తోంది. దేశంలోనే అతి తక్కువ శిశు మరణాల రేటు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదయింది. మూడవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వైద్య సదుపాయాలలో 100 శాతం జననాలతో ‘ఇన్‌స్టి ట్యూషనల్‌ డెలివరీ’లో కేరళ మొదటి స్థానంలో నిలిచింది.
దశాబ్దాలుగా ఈ సామాజిక విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. సామాజిక రంగంలో అధిక ప్రభుత్వ పెట్టుబడితో,సమర్థవంతమైన ప్రణా ళికలు రూపొందించింది. పర్యవేక్షణను సులభత రం చేసే బలమైన పరిపాలనా నిర్మాణాలు, వ్యవ స్థలు సమర్థవంతంగా కేరళలో అమలు చేయ బడ్డాయి.ఇది ఆరోగ్యం,పోషణ, విద్యలకు సంబం ధించి పిల్లల శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.శిశు,నవజాత శిశు మరణాలు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలలో మరణాల పెరుగుదల తక్కువగా ఉంది.
-వ్యాసకర్త : ఎం.డి.(పీడియాట్రిక్స్‌), డిసిహెచ్‌.రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, సిద్దార్థ ప్రభుత్వ వైద్యకళాశాల,విజయవాడ-( డాక్టర్‌ ,ఎన్‌.ఎస్‌.విఠల్‌రావు)

1 2 3 15