సరళీకృత ఆర్ధిక విధానాలపై ఎగిసిన కెరటం!

పద్దెనిమిదోసారి! ఇరవైకోట్లమంది! సరళీకృత ఆర్థిక విధా నాలపై ఉప్పెనలా ఎగిసిపడ్డారు. అనేక రాష్ట్రాలలో లక్షల్లో ప్రైవేటు పారిశ్రామిక వాడల కార్మికుల సమ్మెతో పారిశ్రామిక వాడలు బోసి పోయినాయి. ఇటీవలి కాలంలో పెరిగిన మిలిటెన్సీతో లాంగ్‌మార్చ్‌లు జరుపుతున్న రైతన్నలు వ్యవసాయ కార్మికుల్తో కల్సి అనేక రాష్ట్రాల్లో గ్రామసీమలు బంద్‌ పెట్టారు. గతంలో జరిగిన ఏసమ్మెలకన్నా ఈ 18వ సమ్మెలో అనేక కీలక రంగాలు మూతబడ్డాయి. అనేక రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి, దాని రవాణా దెబ్బతిన్నది. 70-75 శాతం బొగ్గు పరిశ్రమలో సమ్మె జరిగింది. 30లక్షల మంది విద్యుత్‌ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు కార్మికులు సుమారు3.5 కోట్ల మందిపాల్గొన్నారు. కేరళ,బీహార్‌, ఒడిసా, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాలు ఈకార్మికుల సమ్మెతో సంపూర్ణంగా బంద్‌ కాగా బెంగాల్‌లో 80శాతం జయప్రద మైంది. కర్నాటక,పంజాబ్‌,మహారాష్ట్ర,జార్ఖాండ్‌లలో అనేక జిల్లాల్లో ట్రాన్స్‌పోర్ట్‌ సమ్మె పెద్ద ప్రభావం చూపింది. పోర్టులలో సమ్మె పాక్షికంగా జరిగింది. కానీ హమాలీల సమ్మెతో పారదీప్‌, ట్యూటికోరిన్‌, కోల్‌కతా, కొచ్చిన్‌, హాల్దియా విశాఖల్లో సరుకు రవాణా నిలిచిపోయింది. విశాఖ, సేలం, భద్రావతి ఉక్కు కర్మాగారాల్లో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. రూర్కెలాస్టీల్‌ ప్లాంట్‌ శాశ్వత కార్మికులు సమ్మె చేసి, గేట్ల వద్ద పికెటింగ్‌ చేశారు. సుమారు కోటి మంది స్కీం వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ నాడీ మండలం స్తంభించింది. ఇన్సూరెన్స్‌ సేవలు పూర్తిగా నిలిచిపోగా, రిజర్వుబ్యాంకుతోపాటు లక్షలాది గ్రామీణ బ్యాం కులు, సహకార బ్యాంకులు,నాబార్డ్‌,అనేక జాతీయ బ్యాంకులు సంపూర్ణంగా మూతబడ్డాయి. 13 లక్షల మంది పోస్టల్‌, ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్లు సంపూర్ణంగా నిలిచిపోగా ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌, సివిల్‌ అకౌంట్స్‌,అటామిక్‌ ఎనర్జీవంటి మరో30శాఖల్లో సమ్మె జరిగింది. అసంఘటితరంగాలైన నిర్మాణ కార్మికులు, హమాలీలు మొదలగు వారు పెద్దఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.
8వతేదీ21.33 లక్షల మంది, 9వ తేది 19 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ చుట్టూ వున్న సంగారెడ్డి, మేడ్చెల్‌, రంగారెడ్డి, భువనగిరి జిల్లాలలోని పారిశ్రామిక వాడలు పెద్దఎత్తున మూతబడ్డాయి. క్ఱెసీఆర్‌ ఎన్నిమంత్రాలు పెట్టినా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి నిజామాబాద్‌,ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం (14జిల్లాల్లో) అంగన్‌వాడీ, ఆషా వర్కర్లు పెద్దఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్రమంతా మధ్యాహ్న భోజన మహిళలు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగం లో సమ్మె బలహీనంగా జరిగింది. ఎన్‌టీపీసీ కాంట్రాక్టు కార్మి కులు 3 వేల మంది సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణిలో 41శాతం మంది, బీడీఎల్‌లో 40శాతం మంది మొదటిరోజు సమ్మెలో పాల్గొన్నారు. బీడీకార్మికులు సంపూర్ణంగా రెండు రోజులూ సమ్మెలో వున్నారు. ఈరెండు రోజుల సమ్మెట్రేడ్‌ యూనియన్ల బలంతో పాటు బలహీనతలనూ, ఐక్యట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ లోపాలను బహిర్గతం చేసింది. ఆత్మవిమర్శనా పూర్వకంగా వాటిని అన్ని స్థాయిల్లో పరిశీలిం చుకోవాలి. రాష్ట్రంలో ఈసమ్మెకు ఒక పరిమితి ఉంది. ఈసారి సమ్మె ఏర్పాట్లకు సరిగ్గా నెల రోజులు మాత్రమే మిగిలింది. రెండు రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం సాగిన ఎన్నికల పోరాటం మళ్ళీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుతో కొన్ని సంఘాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏమైనా, అన్నిస్థాయిల్లోని సీఐటీయూ కార్యకర్తలు ఈఅతిపెద్ద వర్గ పోరాటంలో శక్తి వంచన లేకుండాకృషి చేశారు. తగుసమయం ఉండి ఉంటే సంస్థల్లో కృషిని మరింత సమగ్రంగా ప్లాన్‌ చేసి వుంటే ఇంకా మెరుగ్గా సమ్మె రాష్ట్రంలో జరిగి వుండేది.
ఈ సమ్మె ఒకసైద్ధాంతిక పోరాటం
ఏదో ఒక సమ్మె పిలుపు వచ్చింది, దాన్ని జయప్రదం చేయడానికి కృషి చేయాలన్న దృక్పథం మాత్రమే కలిగి ఉండటం తప్పు కొన్ని సంఘాల్లోకన్పడుతోంది. ఇది నయాఉదారవాద విధానా లపై ఎక్కుపెట్టిన ‘పాశుపతాస్త్రం’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ ఆర్థిక విధానాలపై అమీతుమీ తేల్చుకునే ప్రయత్నం. ఒకరకంగా చెప్పాలంటే ఇదిఅంబానీ, అదానీల అనుకూల విధానాలను భౌతి కంగానే కాక, సైద్ధాంతికంగా కూడా ఎదుద్కొనే ప్రయత్నం. మన ప్రభుత్వ రంగ పరిశ్రమలను అక్షరాల తినేస్తున్న బహుళజాతి కంపెనీ లపై దండెత్తిన పోరాటం. 70వ దశకంలో ఇందిరాగాంధీ బిహెచ్‌ఇ ఎల్‌ పై ఉసికొల్పిన సీమెన్స్‌ నుండి తాజాగా మోడీ ఆధ్వర్యంలో హెచ్‌ఏఎల్‌ను మింగేస్తున్న రాఫెల్‌ వరకు ఈ కోవలోవే. డీపీపీ పేర (డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ) డిఫెన్స్‌ రంగంలోకి అడ్డగోలుగా ప్రైవేటు వారిని అనుమతిస్తున్నారు. ఇది బీఈఎల్‌, బీడీఎల్‌, మిధానీ వంటి పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడ్తున్నది. మోడీ ప్రభుత్వ అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ట రాఫెల్‌ ఒప్పందం. ఇది హిందూస్థాన్‌ ఎయిరో నాటిక్స్‌ను ముంచుతుందని దేశమంతా గగ్గోలు పెడ్తున్నది. ఇంతకుముందే చెప్పినట్టు డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ కింద యుద్ధ పరికరాల తయారీకి 200 లైసెన్స్‌లు ప్రైవేటు వారికి కట్ట బెట్టింది మోడీ సర్కార్‌. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెచ్‌ఏఎల్‌ను, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను, బీడీఎల్‌ను ఎండబెట్టి ప్రైవేటు వారికి ఆర్డర్స్‌ ఇవ్వడమే మేక్‌ ఇన్‌ ఇండియా నేమో! ఇది బీఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, బీడీఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను, డీఆర్‌డీఓను ముంచుతున్నది. ఈ విషయాలు మన ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తల రోజువారి పనిలో అంతర్భాగంగా వున్నాయా? లేదా? పరిశీలించుకోవాలి. అంటే కార్మి కుల కొచ్చే సమస్యలు-ప్రమోషన్స్‌, ఇన్‌సెంటివ్‌లు రావడం/ రాకపో వడం వంటి వాటి వెనుక ప్రభుత్వ విధానాల లోతు పాతులు కార్మికుల ముందుచగల్గుతున్నారా?లేదా?అనేది ముఖ్యమైన విషయం. దీన్లో కీలకమైనది పెరుగుతున్న కాంట్రాక్టీకరణను అడ్డుకునేందుకు లేదా ఆ కాంట్రాక్టు కార్మికుల బాగోగులపై ప్రభుత్వరంగ యూనియన్లు ఏమేరకు, ఎటువంటి కృషి చేస్తున్నాయనేది కూడా మరో కీలక విషయం. ‘ఎవడెటుపోతే నాకేం?!చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష!’ అనేది సంస్కరణ వాద సంఘాల వాదన. ఈజబ్బు వదిలించకుండా కార్మిక వర్గం విప్లవకర పాత్ర పోషించజాలదు. ప్రభుత్వ విధానాలను అర్ధం చేసుకోవడం,వాటిని రోజు వారి కార్మికుల సమస్యలతో లింక్‌ చేయడం ప్రైవేటు రంగమైనా, స్కీంవర్కర్ల ఉద్యమమైనా,ఆటో,హమాలీ,భవన నిర్మాణరంగమైనా,అన్నింటికీ వర్తించేదే!
సంస్కరణ వాదం నుంచి బయట పడాలి
అది1998 ఏప్రిల్‌లో విద్యుత్‌ రంగంలోని 1104 ఆఫీసు లో1104 కార్యకర్తలకు, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూని యన్‌ కార్యకర్తలకు విద్యుత్‌రంగ ఆఫీసర్ల కాన్ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రీ అశోక్‌రావు ఏపీ విద్యుత్‌ సంస్కరణల చట్టాన్ని వ్యతిరేకిం చండని చేసిన ఉద్భోదలో భాగం. ‘మేంసమ్మె చేస్తే ఆగుతుందా’ అన్న చొప్పదంటు ప్రశ్నలకు ‘కనీసం స్పీడ్‌ బ్రేకర్లు పెట్టగలిగితే ప్రభు త్వాల వేగాన్ని తగ్గించగలుగుతార’ని అశోక్‌ రావు గారు వివరించారు. 2000 సంపప ఆగస్టు టారిఫ్‌ వ్యతిరేక ఉద్యమం ప్రపంచ బ్యాంకు ఎజెండానే ధ్వంసం చేసింది. డిస్కాంల ప్రైవేటీకరణకు పెట్టిన ముహూ ర్తాలు నాశనం అయ్యాయి. ఇరవయ్యేళ్ళు గడిచినా డిస్కాంల ప్రైవేటీక రణకు ఏప్రభుత్వమూ సాహసం చేయట్లేదు అటు ఆంధ్రలో,ఇటు తెలంగాణాలో. ఇదికార్మికుల,సామాన్య ప్రజలవిజయం.1978లో జనతాపార్టీ ప్రభుత్వం పారిశ్రామిక సంబంధాల బిల్లు తెచ్చినప్పుడు సమైక్య ప్రతిఘటనతో తిప్పికొట్టింది కార్మికవర్గమే. 1988లో మళ్ళీ రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఒకప్రయత్నం చేస్తే ప్రతిఘటించింది కార్మిక వర్గమే. 1991లో పీవీ – మన్మోహన్‌ల శకం ప్రారంభమైనప్పట్నించీ కార్మిక చట్టాల సవరణకు పెట్టుబడిదారుల మార్గం సుగమం చేసేం దుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నది కార్మికవర్గమే. ఈపాతికేండ్లలో ఈవిధానాలు ముదిరిపాకానపడ్డాయి. వ్యవసాయ సంక్షోభం తీవ్రమైంది. గత రెండేండ్లలో రైతాంగ ప్రతిఘటన పెరిగింది. నీటి సరఫరాకోసం,విద్యుత్‌ఛార్జీలు తగ్గించడం కోసం రాజస్థాన్‌ రైతాం గం, పంటరుణాలరద్దు, గిట్టుబాటుధర కోసం మధ్యప్రదేశ్‌ రైతాంగం, భూములను గుంజుకుని తమని నిర్వాసితులను చేయొద్దనీ, గిరిజన రైతాంగానికి పట్టాలివ్వాలనీ మహారాష్ట్ర రైతాంగం పెద్దపెద్ద ఆందోళ నలు చేసింది. ఆయా రాష్ట్రాల పాలక బీజేపీ ప్రభుత్వాల కూల్చివేతలో ముఖ్య భూమిక పోషించింది.
ఇవన్నీ సరళీకృత ఆర్థికవిధానాలకు బ్రేకు వేయడమే కదా. మనంబ్రేకులేస్తూంటే వాళ్ళు ‘వాషింగ్టన్‌ కన్సెన్సస్‌’ (వాషింగ్టన్‌ ఏకాభిప్రాయం) అంటున్నారు. అంటే పార్టీలు మారినా, నాయకులు మారినా అవే విధానాలు కొనసాగుతున్నాయి. అందుకే ‘ప్రజల జీవన విధానానికీ, జీవితాలకూ సంబంధించిన అంశాలపై వారిని సమీకరించాలి. వారికి ప్రధాన శత్రువులెవరో అర్ధం చేయిం చడమే మన ముందున్న కర్తవ్యం. అది మాత్రమే ఉదారవాద విధా నాలను వెనక్కితిప్పికొట్టగలదు. మనం మూలలపై గురి ఎక్కుపెట్టాలి. అప్రధాన విషయాలను పట్టించుకోవద్దు. అప్పుడు మాత్రమే పెట్టుబడి దార్ల, భూస్వాముల, వారి రాజకీయ ప్రతినిధుల నుండి దృష్టి మరల్చ కుండా చేయగలం. ప్రజల్ని వర్గేతర సమస్యలవైపు వెళ్ళకుండా చూడ గలం’ అని రాశారు. 18 దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలు ఐక్యంగా నడిపిన సీఐటీయూ అనుభవముంది. ప్రభుత్వాలు మారుతున్నా అవే సరళీక ృత ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయన్న సీఐటీయూ 14వ అఖిల భారత మహాసభ (కన్నూర్‌) విశ్లేషణ ఉంది. కార్మికవర్గానికి, సామాన్య ప్రజలకు విధ్వంసకరమైన విధానాలను మోసుకొచ్చినా ఆపలేకపోయామన్న బాధఉంది. కార్మికుల సమస్యలకు మూల కారణా లను, వాటి వెనుకున్న రాజకీయాలను అర్ధం చేయించడంలో విఫల మౌతున్నామన్న ఆత్మవిమర్శ ఉంది.
‘ ’కార్మికోద్యమంలో ఈఅనైక్యత ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. సంస్కరణవాద సంఘాల విషపూరితప్రచారం, ప్రభావాల వల్లనే ఇది ప్రాప్తించింది. ఇది భారతకార్మికవర్గం యొక్క వర్గచైతన్యాన్ని తుడిచి పెట్టుకుపోయేలా చేసింది. దీనివల్ల కార్మికుల వర్గ చైతన్యం మసకబారి పోయింది. ఫలితంగా వర్గశత్రువులపై చేయాల్సిన నిర్ణయాత్మక పోరాటం పలచబడిరది. కార్మికవర్గం యొక్క ప్రజాతంత్ర బాధ్యతలను, ముఖ్యంగా రైతాంగం యెడల తన బాధ్యతలను అర్ధం చేసుకోకుండా అడ్డుకున్నది. కార్మికోద్యమం సంకుచిత, ఆర్థికవాదంతో నిండిపోయి నా ఫ్యాక్టరీ, నారంగం అన్న మనస్తత్వం పెరిగింది’’-1971 సెప్టెం బర్‌ ‘వర్కింగ్‌క్లాస్‌’ పత్రిక సంపాదకీయంలోఈ హెచ్చరిక చేశారు. సమాజమార్పు కోసం కృషి చేసే బాధ్యత కార్మికో ద్యమ కార్యకర్తలది. దానికి అడ్డుగా నిలిచిన సరళీకృత ఆర్థిక విధానా లను ఓడిరచడం ప్రతికార్మికవర్గం బాధ్యత. – ఆర్‌.సుధాభాస్కర్‌

ఆదర‌ణ ప‌థ‌కం

  • రూ.3 వేల కోట్లతో ఆదరణ కింద 6 లక్షల మందికి లబ్ధి
  • మరో 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ పథకం
  • 2022 కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహం
  • 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు
  • ప్రతి ఒక్కరికి సంత ృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు
  • పరిశ్రమల స్థాపనకు 15 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
  • రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
  • ప్రతి కుటుంబానికి కనీసం నెలకు రూ.10 వేల ఆదాయం సమ కూర్చాలి అన్నది తమప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈలక్ష్యం సాకారం అయ్యేం దుకే పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. డిసెంబరు 28న అనకాపల్లి ఎన్టీఆర్‌ గ్రౌండ్స్లో నిర్వహించిన మెగా గ్రౌండిరగ్‌ మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారు లకు పనిముట్లు ఆస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని లక్ష్యంతో గత నాలుగేళ్లలో పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నా మన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆదరణ, ఎస్సీలకు ముందడుగు, ఎస్టీలకు చైతన్యం, వికలాంగులకు చేయూత, ముస్లింలకు రోషిని తదితర పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నా మన్నారు. ఆధునిక పనిముట్లు పంపిణీకి ఒకటి, రెండు విడతల ఆదరణ కార్యక్రమాలను విజయవాడ, తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించామని , ప్రస్తుతం అనకాపల్లిలో మూడు విడత ఆదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. ఈ మూడు విడతల్లో రూ.3 వేలకోట్లను వెచ్చిస్తూ 6 లక్షల మందికి లబ్ధిచేకూర్చడం జరుగుతున్నదన్నారు. మరో2లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ కార్యక్రమం నిర్వహి స్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ కల్పించేందుకు పెద్ద ఎత్తున గృహనిర్మాణ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. 2022కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో గృహాలు కావాల్సిన వారందరి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 2ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరికి సంత ృప్తికర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు, గ ృహాలు మంజూరు చేస్తున్నామన్నారు. విద్యా వైద్య ఆరోగ్య పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. 24 రకాలవైద్య సేవలను అందు బాటులోకి తెచ్చి వైద్య ఖర్చులను చాలా వరకు తగ్గించా మన్నారు. పరిశ్రమల స్థాపనకు 15లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని ముఖ్య మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100, 200 ఎకరాల్లో ఎంఎస్‌ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీరి ఉత్పత్తులకు ప్యాకింగ్‌, మార్కెటింగ్‌, వేర్‌ హౌసింగ్‌ సౌకర్యాలను కల్పిస్తామని ఆయన తెలి పారు. కుల వృత్తుల ఉత్పత్తుల కూడా వీటి ద్వారా మార్కెటింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
  • అనకాపల్లి నియోజకవర్గంపై వరాల జల్లు
  • అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరియు శాసన సభ్యులు పీలా గోవిందసత్యనారాయణ చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందిస్తూ పలు వరాల జల్లు కురిపించారు. అనకాపల్లి శ్రీనూకంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి సిజిఎఫ్‌ కింద ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు కాపులకు కులదృవీకరణ పత్రాలను మంజూరు చేస్తా మన్నారు. కసింకోట మండలం వెదురుపర్తి రోడ్డు నిర్మా ణానికి 3 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ముస్లింల పాఠశాల మదర్సా నిర్మాణానికి ఒక ఎకరం భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటిం చారు. అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివ ృద్ధికి సహకరిస్తామన్నారు. రూ.24 కోట్లతో తుంపాల ఆనకట్ట నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఈ సంద ర్భంగా శంకుస్థాపన చేశారు. తుంపాల షుగర్‌ఫ్యాక్టరీని పునఃప్రారం భించారు. గత నాలుగేళ్ల కాలంలో ఒక్కఅనకాపల్లి నియోజ కవర్గం నియోజ కవర్గంలోనే 98 వేల 724 పనులకు రూ.1,985కోట్లు ఖర్చు చేస్తు న్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప,రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రావత్‌, సాంగే సంక్షేమ శాఖ కార్యదర్శి విజయ కుమార్‌, బీసీ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఉదయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్కుమార్‌, శాసనసభ్యులు పీలా గోవింద్‌ సత్యనారాయణ, పంచకర్ల రమేష్బాబు, బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. – స‌తీష్ కుమార్‌

విశాఖ ఉత్సవ్‌

పర్యాటక అభివృద్ధిలో విశాఖను ప్రధమశ్రేణిలో తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాలుగు ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ‘విశాఖ ఉత్సవ్‌’’ ఈసంవత్సరం కూడా అంగరంగ వైభంగా నిర్వహించారు. డిసెంబరు 28,29,30 తేదీల్లో ఏర్పాటు చేసిన ఉత్సవాలు అంతర్జాతీయ ఖ్యాతిని ఇనుముడిరప చేశాయి. రామకృష్ణాబీచ్‌లో నిర్వహించిన ఉత్సవాలను రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను విశాఖనగరం ఆకర్షించే విధంగా పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖను మించిన పర్యాటకనగరం దేశంలో మరొకటి లేదన్నారు. ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి పర్యాటక రంగం దోహదపడు తుంద న్నారు. సేవల రంగంలో పర్యాటక రంగం ముఖ్యమని చెప్పారు. వ్యవసాయ అనుబంధరంగాల కంటే పర్యాటకరంగంలో ఉపాధి అవకా శాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
విశాఖనగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్తుతామని పేర్కొన్నారు. రానున్న కాలంలో విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నాలుగుయేళ్లలో 20వేల రూమ్‌లు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతినెల నగరంలో ఒక ఉత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. విశాఖపట్నంలో ఏమ్యూజిమెంట్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. స్కూభా డైవింగ్‌ ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. వచ్చే జూన్‌ నాటికి విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను అందిస్తామన్నారు. తొందరలో భోగాపురం ఎయిర్‌ పోర్టుకు టెండర్లు పిలుస్తామన్నారు. కాకినాడకు బీచ్‌లను ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని తెలిపారు. విశాఖనగరం ప్రశాంత నగరమని, భూకబ్జాలకు, నేరాలకు అవకాశం ఉండకూడదన్నారు. బుద్దిజం అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి లేపాక్షిలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామన్నారు. అరకువేలి, లంబసింగిలో సమ్మర్‌ రిసార్ట్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో పారిశుద్ద్యం బాగుందని జీవీఎంసీ కమిషన్‌ను అభినందించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి, నగరావాయిద్యాన్ని వాయించి ఉత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ విశాఖ ఉత్సవ్‌ నిర్వహణపై ప్రారంభోపన్యాసం చేశారు. విశాఖ ఉత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివా సరావు, కార్మికశాఖ మంత్రి కె.అచ్చెయ్య నాయుడు, ఎంపీఎం. శ్రీనివా సరావు, ఈస్ట్రన్‌ నేవిల్‌ కమెండ్‌ చీఫ్‌ కరంభీర్‌సింగ్‌, శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బసంత్‌ కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ ఎం.హరి నారాయణన్‌,జాయింట్‌ కలెక్టర్‌ జి. సృజన,సిపీ మహేంద్ర లడ్డా తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు సందర్భంగా నగరంలోని సిటీ సెంట్రల్‌ పార్కు లోను, వుడా పార్కులోఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనలు, ఆర్కేబీచ్‌కు కేంద్రంగా నిర్వహించిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు మూడు రోజుల పాటు నగరప్రజల్ని మైమరిపించాయి.
ఆకట్టుకున్న పుష్పప్రదర్శన :
విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డవలప్‌మెంట్‌ ఆధారిటీ (వీఎం ఆర్‌డీఏ) ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రకాల పూల ఆకృతులతో సుమారు 130 ఆకుల పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజను ఆకట్టుకునేలా థాయలాండ్‌, కోల్‌కొత్తా, బెంగళూరు, కడియం నుంచి ఆకర్షణీయమైన పుష్పాలను తెప్పించి ప్రదర్శనలో ఉంచారు. పుష్పఆకృతులతోపాటు డ్రై ప్లవర్స్‌, వెజిటబుల్‌ కార్వింగ్‌ తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి -స‌తీష్‌.

మెరిసిన మొద‌టి అక్ష‌రం

స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి జీవితం ఆదర్శప్రాయం. వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి. సావిత్రిబాయి పూలే దేశంలో సామాజిక చైతన్యాన్ని, స్త్రీ చైతన్యాన్ని కలిగించిన వారిలో ముఖ్యలు. ఆరోజుల్లో అణగారిన వర్గాలకు, స్త్రీలకు చదువుకోవడానికి పాఠశాలలు ఉండేవి కావు. అందుకే సావిత్రిబాయి పెళ్లికి ముందు మూడవ తరగతి వరకే చదివారు. పెళ్లి తర్వాత జ్యోతిబా పూలే చొరవతో తిరిగి చదువుకొనసాగించారు. అంతేకాదు. పూలే ఆమె చదువుకునే అవకాశం కల్పిండమే కాదు ఆమె చదువు పదిమందికి ఉపయోగపడేలా టీచర్‌ ట్రైనింగ్‌ కూడా ఇచ్చారు. అలా సావిత్రిబాయి తాను విద్య నేర్చుకుని, పదిమందికి నేర్పించారు. ఈ విధంగా సావిత్రిబాయి ఈ దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్త్రీలు చదవగలరు, రాయగలరు, పోరాటం చేయగలరని నిరూపించిన దార్శనికురాలు సావిత్రిబాయి పూలే. అట్టడుగు వర్గాలకు చదువు చెప్పడానికి వెళ్లేటప్పుడు ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. – గునపర్తి సైమన్‌
పూలే దంపతులు మహారాష్ట్రలో బలమైన సామాజిక ఉద్యమాలను నిర్మించారు. మహారాష్ట్రంలో అణగారిన వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో మొదట పాఠశాలు ప్రారంభించారు. తర్వాత ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలను పూలే దంపతులు ఏర్పాటు చేశారు. వారు స్థాపించిన పాఠశాలలో నాడు విద్యకు నోచుకోని స్త్రీలు, అణగారిన వర్గాల విద్యార్థులు ఎంతో మంది చదువుకున్నారు. సావిత్రిబాయి అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించడానికి అగ్రకులాల వారు సహించలేకపోయారు. ఆమెను అనేక అవమానాలకు గురిచేశారు. ఆమెపై కోడిగుడ్లు, టమాటాలు, బురద, రాళ్లు విసిరేవారు. వారి చర్యలతో విసుగు చెందిన సావిత్రి ఉద్యోగం మానాలని భావించారు. అయితే భర్త ఇచ్చిన ప్రోత్సహంతో సావిత్రిబాయి పోరాటాన్ని వదిలిపెట్టలేదు. ఏ సమాజం సంకెళ్లు విధించిందో వాటిని తెంపి స్త్రీ విద్య, వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమించారు. సావిత్రి బాయి అణగారిని వర్గాల వారినేకాకుండా బ్రహ్మణ స్త్రీలకు కూడా ఆదరించారు. అగ్రవర్ణాల్లోని వితంతువలను చేరదీశారు. వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. వితంతువుల కోసం, వారి పిల్లల కోసం జ్యోతిరావు శరణాలయాలను స్థాపించారు. ఇందులో కూడా సావిత్రిబాయి తన సేవలను అందించారు. జ్యోతిరావు పూలే 1837లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అందులో భర్తతోపాటు సావిత్రిబాయి క్రీయాశీలయంగా పాల్గొన్నారు.187677,189697లో మహారాష్ట్రంలో కరువు కాటకాలు సంభవించాయి. అప్పుడు ఉచిత భోజన వసతి హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, కరువు నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆసమయంలో సత్యశోధక సమాజ్‌ చేసిన సేవ, ముఖ్యంగా సావిత్రిబాయి చేసిన సేవ చిరస్మరణీయం.
బాల్యం :
శ్రీమతి సావిత్రి బాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధు త్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌ నాందేడ్‌ కొండల్‌ వాడి ప్రాంతంలో , అదిలాబాద్‌ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్‌ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి బంధువులు. శ్రీమతి సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆదంపతులకు పిల్లలు లేరు. వీరు యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు)ను దత్తత తీసుకున్నారు. ‘‘జ్యోతీరావు ఫూలె’’ ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్‌ నగర్‌లోఉపాధ్యాయునిగా శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. అట్టడుగువర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మ్నెట్టమ్నెదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశా లలను ప్రారంభించి ఉచితవిద్యనం దించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మ్నెదటి మహిళ ఉపాద్యాయురాలు, దళితుల, స్త్రీల విద్యా ్య్ష వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులు గృహ బహిష్కారానికి గురిచేశారు.
సామాజిక విప్లవకారిణి :
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో ‘‘సత్యాన్ని’’ శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి ‘‘సత్యశోధక్‌ సమాజ్‌ ‘‘ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్‌ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేత ృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన క ృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా ంసపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించారు. ప్రతీ భారతీయ మహిళ మూడాచారాలకు,మూఢనమ్మకాలు వ్యతిరేకంగా శ్రీమతి సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో ప్రజలలో చైతన్యం తీసుకురావాలి.
యుద్ధ వితంతువు పిల్లలతో జీవనం.
హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని వితంతువు అంటారు. వీరిని వ్యవహారంలో ముండమోపి , విధవ అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొనేవారు. ఇప్పటికీ అక్కడక్కడా వీరికి ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతూనే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహనరాయ్‌ వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రస్తుతము వీరు గౌరవ ప్రథమైన జీవితమును గడుపుతున్నారు. వితంతు కుమార్తె ,విడాకులు పొందిన కూతురూ కుటుంబ పింఛనుకు అర్హులే పింఛను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనపై ఆధారపడిన వితంతు, విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పింఛను పొందవచ్చు. ఈవిషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి.గతంలో ఉద్యోగి బతికి ఉండగానే కూతురు వితంతువై లేదా విడాకులు పొంది ఉంటేనే పింఛను అందేది. 25 ఏళ్ల వయోపరిమితి వరకే వర్తింపజేయాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం వితంతు, విడాకులు పొందిన కూతురు మళ్లీ వివాహం చేసుకున్నా, మరణించినా ,ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి లేదా స్వయంఉపాధి ద్వారా నెలకు రూ.2440 పొందుతున్నా పింఛను ఆగిపోతుంది. మానవ హక్కులు అనేవి ‘‘మానవులకు సంక్రమించే హక్కులు మరియు స్వేచ్ఛలు.’’ ఈ భావనను ప్రతిపాదించిన వారు సాధారణంగా ప్రతి ఒక్కరు వారు కేవలం మానవులు అయిన కారణంగానే కొన్ని హక్కులకు అర్హులని పేర్కొన్నారు. కాబట్టి మానవ హక్కులు అనేవి ఒక సార్వత్రిక మరియు సమసమాజ శైలికి చెందినవి. వాస్తవ మానవ నైతికత యొక్క భాగంగా మాత్రమే అటువంటి హక్కులు ఉంటాయి, ఎందుకంటే న్యాయబద్ధ నైతిక సూత్రాలు లేదా సహజ హక్కులు బలమైన కారణాలచే లభిస్తాయి, లేదా అంతర్జాతీయ చట్టం పరిధిలో లేదా జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన హక్కులుగానో లభిస్తాయి. కానీ, పైన చెప్పిన భావనలలో ఎందులోనూ దేనిని మానవహక్కుగా పరిగణించాలో, పరిగణించ కూడదో అనే విషయంపై ఏకాభిప్రాయం లేదు మరియు మానవ హక్కుల అమూర్త భావన అనేది ఎప్పుడూ తీవ్ర వేదాంత చర్చ మరియు విమర్శకు దారితీస్తూనే ఉంది.

గిరిజన ఉద్యమం

  • భారతదేశంలో బ్రిటిషర్ల కాలంలో వివిధ కారణాలతో ప్రారంభమైన గిరిజనోద్యమాలు స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగాయి. బ్రిటిషర్ల పాలనలో జరిగిన తిరుగుబాట్లను మూడు దశలుగా విభజించవచ్చు.
  • 1795-1860 మధ్య కాలం: బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన, విస్తరణ జరుగుతున్న కాలంలో చెలరేగిన తిరుగుబాట్లు.
  • 1861-1920 మధ్య కాలం: వలస పాలన, ఆర్థిక మూలధనం గిరిజనుల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల జరిగిన తిరుగుబాట్లు.
  • 1921-1947 మధ్య కాలం: స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్న కాలంలో జరిగిన తిరుగుబాట్లు.
  • బ్రిటిష్‌ కాలంలో జరిగిన ప్రముఖ గిరిజన తిరుగుబాట్లు
  • రంపా తిరుగుబాటు (ఆంధ్రా)
  • 1766లో నిజాం రాజు రంపా ప్రాంతాన్ని తూర్పు ఇండి యా కంపెనీకి ఇచ్చాడు. కంపెనీ అధికారుల మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా 1802-03లో రామభూపతి నాయకత్వంలో కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన తెగలు పోరాటం సాగించాయి. 1813లో బ్రిటిషర్లు రామభూపతిని ఈ ప్రాంతానికి అధిపతిగా అంగీకరిం చడంతో పోరాటాన్ని నిలిపేశారు. కానీ, ఆతర్వాత రామభూపతి కుమారుడు బ్రిటిష్‌ అధికారుల ప్రోద్బలంతో గిరిజనులపై అనేక రకాల పన్నులు విధించడంతో వారు తమ్మన్నదొర నాయకత్వంలో 1879లో మళ్లీ తిరుగుబాటు చేశారు. ఇదివిశాఖ, భద్రాచలం, రేకపల్లి, చోడ వరం మొదలైన ప్రాంతాలకు విస్తరించింది. 1880లో సైనిక బలంతో ఈ తిరుగుబాటు బలవంతంగా అణచివేశారు.
  • ఖోండుల తిరుగుబాటు (ఒడిశా)
  • ఖోండులు మొదటిసారిగా 1817లో తిరుగుబాటు లేవదీ శారు. తర్వాత 1830లో చినోయిదొర, 1850లో చక్రబోయి దొర, 1857లో సురేంద్రసాయి నాయకత్వంలో కంపెనీ అధికారులకు వ్యతి రేకంగా పోరాటం సాగించారు. 1894లో కొండసవరలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లన్నింటినీ సైనికబలంతో అణచివేశారు.
  • కోల్‌ తిరుగుబాటు
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో కోల్‌ గిరిజన తెగకు చెందిన వారు నివసించేవారు. బ్రిటిష్‌ పాలకులు గిరిజనేతర రైతులను గిరిజన ప్రాంతాల్లో స్థిరపడేలా ప్రోత్సహించడంతో భూ యజమానులతో కౌలు సంబంధాలు మొదలయ్యాయి. దీంతో ద్రవ్య విధానం కూడా ప్రారంభ మైంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, దోపిడీలు మొదలయ్యాయి. కోల్‌ గిరిజన ప్రముఖులు హిందువులుగా మారడంతో గిరిజనుల్లో అశాంతి అధికమైంది. గిరిజనులు వారిభూముల్లో వారే కట్టు బానిసలుగా మారారు. ప్రభుత్వ, గ ృహ అవసరాల్లోనూ శ్రమ దోపిడీ ఎక్కువైంది. వీటికి నిరసనగా కోల్‌లు 1831-32లో తిరుగుబాటు చేశారు.
  • సంతాల్‌ల తిరుగుబాటు
  • ఈ తిరుగుబాటు బిహార్‌,బెంగాల్‌,ఒడిశా ప్రాంతాల్లో సంభ వించింది. దీన్ని గొప్ప తిరుగుబాటుగా పేర్కొంటారు. దీనికి ప్రముఖ కారణం కార్‌నవాలీస్‌ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తువిధానం. దీనికి వ్యతి రేకంగా సంతాల్‌లు 1811,1823,1829లో తిరుగుబాట్లు చేశారు. 1854లో కన్హూ,సిద్ధుఅనే గిరిజన సోదరుల నాయకత్వంలో ఈ తిరుగు బాటు మరోసారి చెలరేగింది. వీరు జమీందార్ల భూముల ఆక్రమణకు ప్రయత్నించారు. 1855జూన్‌లో ఈ సోదరుల నాయకత్వంలో సంతా ల్‌ల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు ర్యాలీనిర్వహించారు. ఈ పోరాటంలో 15,000 నుంచి 25,000 సంతాల్‌లు బ్రిటిష్‌ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు.1856 ఫిబ్రవరిలో కన్హూ కూడా సైన్యం చేతిలో మరణించాడు. 1885 జూలైలో బ్రిటిష్‌ ప్రభుత్వం మార్షల్‌ లా విధించి ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసింది.
  • బస్తర్‌ తిరుగుబాటు (ఛత్తీస్‌గఢ్‌)
  • బస్తర్‌ ప్రాంతంలో మురియా, మరియా, హాల్భా మొదలైన గోండు తెగలు జీవించేవారు. బ్రిటిషర్ల రాకతో బనియాలు, రోహిల్లాలు మొదలైన వడ్డీ వ్యాపారులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు గోండుల భూములు ఆక్రమించుకోవడం, వెట్టిచాకిరీ చేయించడం, స్త్రీలను వేధించడం మొదలైన ఆక ృత్యాలకు ఒడిగట్టారు. దీంతో గిరిజనులు 1880లో తిరుగుబాటు చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం1891 నాటికి ఈ తిరుగుబాటును అణచివేసింది.
  • ముండాల తిరుగుబాటు (బిహార్‌)
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో నివసించే మరోగిరిజన తెగ ముండాలు. తెగలో అంతర్యుద్ధాల కారణంగా వీరి భూమిలో కొంత భాగం సమీప హిందూ రాజుల పాలనలోకి వెళ్లింది. దీంతో అనేక మంది గిరిజన నాయకులు హిందూ మతం స్వీకరించారు. క్రమంగా అధికసంఖ్యలో గిరిజనేతరులు స్థిరపడటంతో వీళ్ల పరిస్థితి దిగజా రింది. క్రైస్తవ మిషనరీల ప్రచారంతో ఆమతాన్ని స్వీకరిస్తే తమ పరిస్థితి మెరుగవుతుందని భావించి ముండాలు అధిక సంఖ్యలో మతమార్పిడి చేసుకున్నారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. చివరకు 1895లో బిర్సా ముండా నాయకత్వంలో తమ ప్రాంతాల్లో స్థిరపడ్డ గిరిజనేతరు లందరినీ తరిమివేయాలని తిరుగుబాటు ప్రారంభించారు. బిర్సా ముండాను 1895లో నిర్బంధించగా తెగ ప్రజలు విడిపించుకున్నారు. 1899 నాటికి తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరింది. 1900లో బిర్సా ముండాను మళ్లీ నిర్బంధించారు. కారాగారంలో హింసించడంతో ఇతడు మరణించాడు. దీంతో క్రమంగా ఈ ఉద్యమం బలహీనమైంది.
  • గోండుల తిరుగుబాటు (తెలంగాణ)
  • తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ‘కొమరం భీం’ నాయక త్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. ఈయన 1901 అక్టోబర్‌ 22న ఆదిలాబాద్‌ జిల్లాలో ‘జోడెఘాట్‌’ ప్రాంతంలో జన్మించారు. నిరక్షరాస్యుడైనప్పటికీ ఆప్రాంతంలో గోండు, కొలాం మొదలైన గిరిజన తెగలను ఏకం చేసి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపారు. జోడెఘాట్‌పై దాడికి ప్రయత్నించిన నిజాం సైన్యాన్ని సంప్రదాయ ఆయుధాలతోనే ఎదుర్కొన్నారు. ‘జల్‌, జంగల్‌, జమీన్‌ (నీరు, అటవీ, భూమి) మనవే’ అనే నినాదంతో గిరిజనులను చైతన్యపరిచారు. భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు ప్రభావంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. నిజాం ప్రభుత్వం ఈయణ్ని బంధించ డానికి స్థానిక తాలుక్‌దార్‌ ‘అబ్దుల్‌ సత్తార్‌’ను నియమించింది. ఆయన విఫలం చెందడంతో నిజాం సైన్యమే ప్రత్యక్ష దాడికి దిగింది.
  • 1940 అక్టోబర్‌ 8న జరిగిన దాడిలో ‘కొమరం భీం’ వీర మరణం పొందారు. ఈయణ్ని సైన్యానికి కుర్థం పటేల్‌ చూపించాడు. ‘కొమరం భీం’ను నిజాం పాలకుల నుంచి తెలంగాణ ప్రజల స్వాతంత్య్రానికి ప్రయత్నిం చిన మొదటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. కమ్యూనిస్ట్‌ నాయకులు ‘పుచ్చలపల్లి సుందరయ్య’ ఈయన జీవిత చరిత్రను రచించారు. గోండులు ఈయణ్ని దేవుడిగా ఆరాధిస్తారు.
  • తానాభగత్‌ ఉద్యమం (బిహార్‌, 1914)
  • ఛోటా నాగపూర్‌ ప్రాంతంలో ఓర్గాన్‌ అనే ఆదిమవాసులు నివసించేవారు. వీరు పెద్ద ఎత్తున హిందూ సంస్క ృతీకరణ కోసం పేరు చివరన భగత్‌ అనే పదాన్ని చేర్చుకొని తమ స్థాయి మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇతరప్రాంతాల గిరిజనేతరులు అక్కడ చేరి తమకు అన్యాయం చేస్తున్నారని వారిని తరిమేసేందుకు ఉద్యమించారు.
  • మన్యం తిరుగుబాటు (ఆంధ్ర,1922-24)
  • మద్రాసు రెసిడెన్సీలో ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతం 19,287 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండేది. ఇందులో గంజాం, విశాఖపట్నం, గోదావరి ప్రాంతాలు ఉండేవి. బ్రిటిష్‌ ప్రభుత్వం 1882లో మద్రాస్‌ అటవీ చట్టం చేసి పోడు వ్యవసాయంపై అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడి గిరిజన తెగల్లో కోయలు, కొండరెడ్లు అధిక సంఖ్యలో ఉండే వారు. బ్రిటిష్‌ అధికారుల సహాయంతో స్థానిక నేతలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన గిరిజనులను అల్లూరి సీతారామ రాజు సమైక్యపరిచి తిరుగుబాటు లేవదీశారు. గెరిల్లా పోరాట పద్ధతి లో ఈ తిరుగుబాటు సాగింది. పోలీస్‌ స్టేషన్లపై దాడి చేసి ఆయు ధాలను సేకరించేవారు. సీతారామరాజు అనుచరులతో మొదట చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. తర్వాత అడ్డతీగల, రాజ ఒమ్మంగి, కృష్ణదేవిపేట మొదలైన పోలీసు స్టేషన్లపై దాడి చేశారు.ఈ తిరుగుబాటును అణచివేసేందుకు మద్రాసు ప్రభుత్వం ‘రూథర్‌ ఫర్డ్‌’ను పంపించింది. సీతారామరాజు ముఖ్య అనుచరుడైన గొంముల్లు దొరను 1923 సెప్టెంబర్‌లో నిర్బంధించారు. మరో అనుచరుడు ‘అగ్గిరాజు’ను కాల్చి చంపారు.
  • దీంతో ఈ ఉద్యమం ముఖ్య నాయకు లను కోల్పోయింది. చివరకు 1924 మే7న సీతారామరాజును కాల్చి చంపడంతో ఈ ఉద్యమం అంతరించిపోయింది.
  • కొండ సవరలు తిరుగుబాటు (1943, ఒడిశా)
  • కోరాపుట్‌ జిల్లాలో గిరిజనులు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా లక్ష్మణ్‌ నాయక్‌ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం అతణ్ని నిర్బంధించి 1943లో బెరంపూర్‌ జైలులోఉరి తీసింది. దీంతో ఈ తిరుగుబాటు ఆగి పోయింది.
  • వర్లీ తిరుగుబాటు (1944) (మహారాష్ట్ర)
  • మహారాష్ట్రలోని థానే జిల్లాలో వర్లీ ఆదిమ తెగలు నివసిం చేవి. పంటకోతల సమయంలో కూలీ రోజుకు 12 అణాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ తిరుగుబాటు మొదలైంది. 1945లో కిసాన్‌సభ ఇచ్చిన పిలుపుతో భూస్వాముల భూములు దున్నవద్దని, వెట్టిచాకిరీ చేయొద్దని, అత్యాచారాలను ప్రతిఘటించాలనే లక్ష్యాలతో వీరు తిరుగుబాటును కొనసాగించారు. 1946లో వర్లీ మహాసభ జరిగింది. చివరకు వ్యాపారులు, భూస్వాములు రాజీకి వచ్చారు. వర్లీ గిరిజనులు డిమాండ్‌ చేసినదాని కంటే ఎక్కువ కూలీ సాధించుకున్నారు. ఈ తిరుగుబాటు ఘన విజయం సాధించింది.
  • ఛోటా నాగపూర్‌ పీఠభూమి ప్రాంతాలు
  • ా జార్ఖండ్‌ (అధిక భాగం)
  • ా ఒడిశా
  • ా పశ్చిమ బెంగాల్‌
  • ా ఛత్తీస్‌గఢ్‌
  • ా బిహార్‌
  • గిరిజనోద్యమాలకు కారణాలు
  • । గిరిజన ప్రాంతాలను బ్రిటిష్‌ సామ్రాజ్యంలో కలిపేందుకు ప్రయత్నించడం. దీనివల్ల తరతరాలుగా అనుభవిస్తున్న అటవీ సంపద, భూములపై గిరిజనులకు అధికారంకోల్పోయే పరిస్థితి తలెత్తింది. గిరిజనుల భూములను ఆక్రమించి, వారిని కట్టుబానిసలుగా మార్చడం.
  • । గిరిజనుల సంస్కృతి, ఆచారాల్లో జోక్యం చేసుకోవడం.
  • । వస్తు మార్పిడి స్థానంలో ద్రవ్య మార్పిడి విధానం చోటు చేసుకోవటంతో వడ్డీ వ్యాపారుల అక్రమాలు.
  • । గిరిజనుల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, హక్కులను హరించడం.
  • । అటవీ నియంత్రణ చట్టం-1865, భారత అటవీ చట్టం- 1878, భారత అటవీ చట్టం-1927 మొదలైన వాటిలో గిరిజనుల హక్కులను గుర్తించకపోవడం.
  • । స్వాతంత్య్రానంతరం అభివ ృద్ధి పేరుతో పరిశ్రమలు, ఆనకట్టల నిర్మాణం చేపట్టడంతో గిరిజనులు తమ ఆవాసాలు కోల్పోవడం. వారికి సరైన పునరావాసం కల్పించకపోవడం.- సకరణ : థింసా రీసెర్చ్‌ టీమ్‌

ఎన్నికల శాసనుడు..శేష జీవితంలో సేవకుడు

ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ సులువుగా జరుగుతున్నదంటే మాజీ భారతఎన్నికల అధికారి టి.ఎన్‌.శేషన్‌ చలువే అని ఒప్పుకోక తప్పదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లోని ఎన్నికల వ్యవస్థలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి ఆయన. దేశం లో10వ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా, గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా టి.ఎన్‌.శేషన్‌ పేరు గడిర చారు. కేరళలో పుట్టిన శేషన్‌ ఐఏఎస్‌ హోదాతో వివిధశాఖల్లో పదవులు నిర్వహించారు. తమిళ నాడులోనే ఎక్కువగా ప్రజాసేవలందించిన శేషన్‌ అక్కడే స్థిర పడ్డారు. భారత ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న సందర్భంలో ఓటు హక్కు కలిగిన భారతీయులందరూ చైతన్యం తో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకోసం భారత ప్రభుత్వం ఓటర్లను చైతన్య పరచాలనే 2016 నుంచి ‘జనవరి 25’ను జాతీయ ఓటర్ల దినోత్సవం’గా నిర్వహిస్తోంది. శేషన్‌ చేసిన ఎన్నికల సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం పదోతరగతి సాంఫీుక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠంలో చేర్చారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ జిల్లా తిరునెల్లు గ్రామంలో జన్మించిన తిరునెల్లు నారాయణ అయ్యర్‌ శేషన్‌ ఐఏఎస్‌ సర్వీసులో తమిళనాడులోని కోయంబత్తూరు, దిండి గల్‌ జిల్లాల్లో సహాయ కలెక్టర్‌గా, మధురై కలెక్టర్‌గా, రవాణా శాఖ డైరెక్టర్‌గా, వ్యవసాయ, కార్మికశాఖల కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. 10వ ఎన్ని కల ప్రధానాధికారిగా 1990 నుంచి 1996 వరకు పని చేశారు. దక్షిణ భారతదేశం నుంచి ఆర్థిక సంస్కరణలతో ప్రధానమంత్రి పి.వి. నరసిం హారావు పేరు ప్రఖ్యాతలు గడిరచగా, మరో ప్రక్క ఎన్నికల సంస్కరణలతో తనదైన శైలిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి శేషన్‌. శేషన్‌ తన విధులలో ముఖ్యంగా ఎన్నికల సంఘం నిర్ణయాలలో నిక్కచ్చి గా వ్యవహిరిస్తూ, మీడియాను సైతం దూరంలో ఉంచేవారు. శేషన్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలతోనే ఎన్నికల వ్యవస్థలో పలుమార్పులు చోటు చేసుకు న్నాయి. 1991 మధ్య జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ‘ఓటరు గుర్తింపు కార్డు’ ప్రవేశ పెట్టారు. ఓటరు కనీస అర్హత వయస్సు 21 సంవ త్సరాల నుంచి 18 సంవత్సరాలకు కుదించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చును పరిమితం చేశారు. ఒక అభ్యర్థి రెండు నియోజక వర్గాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయరాదు. కులం పేరుతో ఓట్లను అభ్యర్థించడం నిషేధం. పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్లను తరలిం చడం, ప్రభుత్వ యంత్రాంగం సాయం పొందటం చట్ట విరుద్ధం. పోలింగ్‌ సమయంలో ఇతరులు పోలింగ్‌ బూతుకు 200 మీటర్ల దూరంలో ఉండాలి. గుమిగూడి ఉండటం నేరం. పోలీసులు 144 సెక్షన్‌ విధించాలి. ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం 2 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తే ఆరు సంవత్సరాల పాటు పోటీకి అనర్హులు.
పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి. కాని రద్దు చేయకూడదు. ప్రచా రం పూర్తి అయిన తర్వాత 48గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి.ఎన్నికల సంఘం చరిత్రలో శేషన్‌ హయాం ఓస్వర్ణయుగం. ఎన్నికల్లో పారదర్శకత కోసం చేసిన క ృషికిగానూ, 1996లో ఆయన ‘రామన్‌మెగ్‌సేసే’ అవార్డు అందుకున్నారు. సీఈసీగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించని అజ్ఞాత వ్యక్తిగా మిగిలారు. శేషన్‌ పుట్ట పర్తి సాయిబాబాకు వీరభక్తుడు. సాయిబాబా శివై క్యం పొందినప్పటి నుండి తీవ్ర విచారానికి గుర య్యారు తన స్వగ్రామంలో సొంత ఇల్లు ఉన్నప్ప టికీ తమను సంరక్షించే వారసులు (పిల్లలు) లేక పోవడంతో తన ఆలోచనా ద ృక్పధం సేవా గుణంపై కదిలింది. తన శేషజీవితంలోనూ పేదల, అనాధల, వృద్ధుల బాధలు తిలకిస్తూ, వారికి తోచిన సహాయం చేస్తున్నారు. అందుకోసం సహచరిణి జయలక్ష్మీశేషన్‌తో కలిసి చెన్నైలోని ‘గురుకులం’ అనే వ ృద్ధాశ్రమంలో గడుపుతున్నారు. అసాధారణ ప్రతిభ కలిగిన శేషన్‌ సామాన్య వ్యక్తిగా ఆశ్రమం లోని తోటివారి కష్టాలను వింటూ, వారికి చేతనైన సాయం అందిస్తున్నారు, ఆదుకుంటున్నారు. శేషన్‌ తన పింఛను డబ్బుల్లో కొంత ఇతర సామాజిక సేవలకు వెచ్చించడం విశేషం.
7989134271

1 9 10 11