పోలవరం ముందుకు సాగేనా..?

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో మెలిక పెట్టింది. మరోసారి సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహించాలని రాష్ట్రానికి షరతు విధించింది. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంపీలు బ్రహ్మానంద రెడ్డి, సత్యవతి, రెడ్డప్పలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిస్వేస్వర్‌ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌ తయారు చేయాల్సిందేనని నిబంధన విధించినట్లు జల్‌శక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు షెడ్యూల్‌ చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది. పోలవరం నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15668 కోట్ల వరకే తమ బాధ్యత అని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 14336 కోట్లు మాత్రమే అని.. దీనిలో రూ. 12311 కోట్లు కేంద్రం రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని తెలిపారు. అలాగే రూ. 437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. కేంద్రం కొత్త నిబంధనలతో పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కేంద్రం కొత్త మెలికపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెకు నిర్వా సతుల కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఒకపక్క ప్రధాన ప్రాజెక్టు ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు ఇంతవరకు మొదలెట్టలేదు. స్పిల్‌వే సుమారుగా పూర్తయింది. కానీ ఇంకా కొన్ని గేట్లు అమర్చాలి. ఎగువ కాఫర్‌డ్యామ్‌ గ్యాప్‌లను పూర్తి చేసి,ఇప్పటికే అక్కడ కొంత నీటిని నిల్వ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్టు ఏస్థాయిలో కదులు తుందో చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే నిధు లు కొరత.ఇటీవల కేంద్రం మంజూరు చేసిన రూ. 320 కోట్లు తిరిగివెళ్లిపోయాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టు సంగతి ఎలా ఉన్నా పోలవరం ముంపు గ్రామాల నుంచి బయటకు వచ్చిన వారికి ఇంకా రావలసిన సౌకర్యాలు ఇవ్వలేదు.
కొందరికి పునరావాస కాలనీలు నిర్మిం చారు. కానీ వారికి మనిషి ఒక్కరికి రూ.6.66 లక్షల వంతున రావలసిన సొమ్ము కూడా పూర్తిగా ఇవ్వలేదు.భూమికి భూమి ఇవ్వలేదు. అటు దేవీ పట్నం,మడుపల్లి,కె.వీర వరం తదితర గ్రామాలను గత జూన్‌లోనే ఖాళీ చేయించారు. కానీ ఇంత వరకూ వాళ్లకు కాలనీలు నిర్మించలేదు. పరిహార మూ పూర్తిగా ఇవ్వలేదు. ఇళ్ల పట్టాలు మాత్రం ఇచ్చారు. కానీ అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. పైగా అక్కడ పట్టాలు ఇవ్వడానికి సేకరించిన భూ మి యజమానికి సైతం ఇంకా డబ్బు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో నిర్వాసితులంతా, ఏజెన్సీలోని మిగతా ప్రాంతాల్లోనూ,గోకవరం వంటి ప్రాంతా ల్లోనూ అద్దె ఇళ్లలో ఉంటున్నారు. బలవంతంగా ఖాళీ చేయించిన అధికారులు కనీసం వాళ్లకు ఇళ్ల సౌకర్యం కూడా కల్పించలేదు. ఒక్కో కుటుంబం రూ.3వేల నుంచి అయిదు వేల వరకు అద్దె ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. అక్కడ అడవిని, పొలాలను వదిలిరావడంతో వారికి జీవనోపాధి కూడా లేదు. పునరావాస కాలనీల్లో ఉంటున్న ప్రజల పరిస్థితీ దయనీయంగా ఉంది. పనులు లేకపస్తులు ఉం టున్నారు. ఈనేపథ్యంలో వారంతామళ్లీ తమ గ్రామాలకు వెళ్లి ఏదొక విధంగా బతుకుదామనే నిర్ణయానికి వచ్చారు. దేవీపట్నం, మడుపల్లి గ్రామ ప్రజలు ఇప్పటికే రెవెన్యూ అధికార్లకు ఈ విషయం చెప్పారు.ఈనేపథ్యంలోనే తమ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ దేవీపట్నం సర్పంచ్‌ కుంజం రాజా మణి ఆధ్వర్యంలో గోకవరం మండలం కృష్ణుని పాలెంలో నిరశన దీక్ష కొనసాగిస్తుండగా,33వ రోజుకు చేరుకుంది.నిర్వాసితులు మాట్లాడుతూ ఇటీ వల మొదలెట్టినట్టు మొదలెట్టి, పనులు ఆపేసిన ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు, ఎందుకు మా బతుకులతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకూ ఆగుతాం,ఈలోగా పరిహారం ఇచ్చి,ఇళ్లను చూపించకపోతే తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోతామని దేవీపట్నం,పూడుపల్లికి చెందిన నిర్వాసితులు అల్టిమేటం ఇచ్చారు. వాస్తవానికి దేవీ పట్నం మండలంలో పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలు 44.అందులో 18గ్రామాలకు పునరావాసం కల్పించి అధికారులు ఖాళీ చేయిం చారు.కానీ వారికి కూడా ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు. ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా చూపించలేదు. కొండమొదలు ప్రాంతంలోని 11 గ్రామాలప్రజలు అధికారుల మాట బేఖాతర్‌ చేశా రు. తమకు అన్ని పరిహారంతోపాటు భూమికి భూమిఇచ్చి,కాలనీలు నిర్మించిన తర్వాతే వస్తామని ఖరాఖండీగా చెప్పారు.మిగతా గ్రామాలను మా త్రం నయోనో భయానో ప్రభుత్వం ఖాళీ చేయిం చింది. ఎంత దారుణమంటే గత ఏడాది జూన్‌ తర్వాత వరద సమయంలో వరదతో ఊళ్లన్నీ మునిగిపోతే కనీస వరద సహాయం కూడా చేయ లేదు.ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి కావడం 32 మీటర్ల ఎత్తువరకూ వరద నీరు రావడంతో ఊళ్లన్నీ వరద గోదావరిగా మారిపోయాయి. దీంతో చాలామంది ఊళ్లు ఖాళీ చేశారు.
ఇక ప్రభుత్వ అధికారులు ఎవరినీ తిరిగి గ్రామాలకు వెళ్లనీయలేదు. దీనితో దిక్కులేని బతుకు బతుకుతున్నారు. ఇంతవరకూ పరిహారం అందక పోవడం,పునరావాస కాలనీలు కూడా పూర్తి కాక పోవడంతో,అసలు ఈప్రాజెక్టు పరిస్థితి అర్థం కాక, తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోవడానికి ప్రజ లు సిద్ధమవుతున్నారు. ఒకగ్రామంకదిలిందంటే మిగతా వారు కూడా కదిలే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పోలవరంకథ మళ్లీ మొదటికి వస్తుందేమోననే అను మానం ఉంది.
నిర్వాసితులకు ఏ సమస్యా రానివ్వం
పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితుల త్యాగం మరవలేనిదని, అందుకు అనుగుణంగా గతంలో తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోపక్క అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో రూ.488 కోట్లతో 3,905 ఇళ్లతో నిర్మిస్తున్న ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ, తూర్పుగోదావరి జిల్లా దేవీ పట్నం మండలం ఇందుకూరు-1 పునరా వాస కాలనీలను కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. పోల వరం ప్రాజెక్టుకోసంఎంతో మంది గిరిజనులు తమ గ్రామాలను,గృహాలను ఖాళీచేసి ప్రాజెక్టు నిర్మా ణానికి త్యాగం చేశారన్నారు. ప్రస్తుతం వారి కోసం గృహ నిర్మాణాలు చకచకా సాగుతున్నాయని, ప్రతి ఒక్కరికీ మంచి గృహ వసతి,పునరావాసం కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్వాసితులకు ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను అమలు చేసేందుకు కేంద్రంతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకు కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖ రరెడ్డి గతంలో ఇచ్చిన రూ.1.50లక్షల నష్టపరి హారానికి మరో రూ.3.50లక్షలపరిహారాన్ని అద నంగాఅందించేందుకుచర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగత ప్యాకేజీకి సంబంధించి కేంద్రం రూ.6.80 లక్షలకు అదనంగా మరో రూ.3.20 లక్షలు కలిపి మొత్తంరూ.10లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటా మని చెప్పారు.‘పునరావాస పనులపై జిల్లా కలెక్టర్లు, ఆర్‌అండ్‌ఆర్‌ అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది.కాలనీలో పర్యటించినప్పుడు నిర్వాసి తులు కొన్ని సమస్యలు చెప్పారు. వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపుతుండటం సంతోషం. మిగిలిన అన్ని సమస్యల పరిష్కారానికి మరింత చొరవ తీసుకోవాలి’ అని సూచించారు.
గిరిజనులతో మాటామంతి
నిర్వాసితుల సమస్యలు ఆలకిస్తూ వారికి భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి షెకావత్‌ల పర్యటనసాగింది. ఇందు కూరు-1 కాలనీ ముఖద్వారంవద్ద గిరిజనులు వారికి నుదుట బొట్టుపెట్టి, గిరిజన సంప్రదా యంగా కొమ్ములతో తయారు చేసిన తలపాగాలను ధరింపచేసి అభిమానాన్ని చాటుకున్నారు. కాసేపు వాటిని తలపై ఉంచుకుని సీఎం, కేంద్ర మంత్రి కాలనీలో నడుచుకుంటూ గిరిజనులను ఆనందింప చేశారు. కాలనీలో అభివృద్ధి కార్యక్రమాల గురించి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ ఆదిత్యవారికి వివరించారు. కాలనీలోఉన్న ఏను గులగూడెంకు చెందిన తురసం లక్ష్మి ఇంటికి వెళ్లి మంచంపై కూర్చుని ఇంట్లో ఉన్న వారితో కాసేపు ముచ్చటించారు. సీఎం ఆఇంటిని ఆసాంతం పరిశీ లించారు. ఫొటో గ్యాలరీని తిలకించారు. కాలనీ లో ఉన్న 350ఇళ్లలో 40 మినహా మిగిలిన ఇళ్లల్లోకి నిర్వాసితులు అంతా వచ్చేశారని, భూమికి భూమిగా 161ఎకరాలు 87మంది నిర్వాసితులకు అంద జేసినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ సీఎంకు వివరించారు. అనం తరం సీఎం, కేంద్ర మంత్రి లబ్ధిదారులతో ముఖా ముఖి నిర్వహించారు. వారు చెప్పిన సమస్యలను ఓపిగ్గా విన్నారు. మధ్యలో కేంద్రమంత్రి కల్పించు కుం టూ.. సొంత గ్రామ అనుభూతిని ఈ కాలనీలో పొందుతున్నారా.. అని ప్రశ్నించగా, లబ్ధిదారులు చాలా బాగుందని చెప్పారు. అనంతరం అందరి వినతులు స్వీకరించి అక్కడి నుంచి ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇళ్లు బావున్నాయి: షెకావత్‌ ప్రశంసలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అవసరతను గుర్తించి, ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు కదిలారని కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. ఏపీవిభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోం దన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌, ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల ఢల్లీిలో సుదీర్ఘంగా చర్చించారని, త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్త య్యేలా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు.నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తా మని స్పష్టం చేశారు.అంతకు ముందు సీఎం, కేంద్ర మంత్రి..నిర్వాసితులు లక్ష్మీకాంతం, వెంకట స్వామి గృహాలను ప్రారంభించి, వసతులను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితులకు అన్ని వస తులతో కూడిన గృహాలను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌ నిర్మిస్తున్నారని అభినందించారు. ‘పునరా వాస కాలనీలో మౌలిక వసతులు చాలా బాగున్నా యి. నిర్వాసితులు మాదృష్టికి తెచ్చిన ఉపాధి, ఇతర సమస్యలను ఎలా పరిష్కరించాలని ముఖ్య మంత్రి జగన్‌, నేను మాట్లాడుకున్నాం. ఈ ప్రాజెక్టు కోసం ఏసహకారం కావాలని రాష్ట్రం అడిగినా సహాయ పడతాం.మరోసారి ఇక్కడికి వస్తాను’ అని చెప్పారు. నిర్వాసితుల డిమాండ్స్‌
ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పెంచి రూ. పది లక్షలు ఇవ్వాలని.(దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 244 జీ. ఓ. ను తేవడమే కాకుండా,500 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది.) ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకే జీకి అర్హులుగా గుర్తించి సర్వేలో ఉన్న వారు మర ణించి నట్లయితే ఆ సొమ్మును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని. సర్వే రిపోర్టులో ఉన్న 18 సం.లు నిండిన ఆడపిల్లలపేర్లు పెండ్లి చేసుకు న్నారని తొలగించారని, వారికి కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌ ఓఎఫ్‌ఆర్‌ చట్ట ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు,భూమికి భూమిఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా చాలా మంది గిరిజ నులు నుండి సేకరించిన భూమికి భూమి,నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పునరావాస కాలనీలలో చాలా సమస్యలు అసం పూర్తి గా ఉన్నాయి.చట్టప్రకారం 25రకాల సౌక ర్యాలు పూర్తి చేయాలనీ డిమాండ్‌ చేస్తున్నారు.
నిర్ణీతగడువులోగాపోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యం : కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్య మని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్ల మెంటరీ సమావేశాల్లో రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించిప్రశ్నించారు. దీనిపై కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు లిఖిత పూర్వకంగా సమాధాన మిచ్చారు. 2022 ఏప్రిల్‌ నాటికి పోలవరం ప్రాజెక్టుపూర్తి కావాల్సి ఉందని… అయితే సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం, పునరా వాసం తో పాటు కరోనావల్ల కూడాజాప్యం జరిగిం దని బిశ్వేశ్వర్‌ తెలిపారు.డ్యామ్‌ స్పిల్‌ వే చానల్‌ పనులు 88శాతం,అప్రోచ్‌ చానల్‌ ఎర్త్‌ వర్క్‌ పనులు73 శాతం, పైలట్‌ చానల్‌ పనులు34శాతం మాత్రమే పూర్తయ్యా యని చెప్పారు.
అయితే ‘‘పోలవరం ప్రాజెక్టును 2018 మార్చి నాటికేపూర్తి చేస్తాం. రాసిపెట్టుకో..’’ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట లివి. 2016 మార్చి 10న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ లో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘తొందరెందుకు కన్నా! 2021 డిసెంబర్‌ 1కే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్‌లో పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తాం’’ ఈ మాటలు ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అసెంబ్లీ లోనూ,వెలుపలా చెప్పినవి. 2020 డిసెంబర్‌లో ఆయన ఇలాంటి ప్రకటనలు చేశారు.ఈ ఇద్దరు మంత్రులుచెప్పినమాటలూ అమలుకి నోచు కోలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. ప్రాజెక్టులో కీలక పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం కేంద్రమే అందించాలి. పార్లమెంట్‌ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు అదే సమాధానం చెప్పా రు. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’అని ఎద్దేవా చేశారు.- జి.ఎన్‌.వి.సతీష్‌