వాయు కాలుష్యంలో ఢల్లీి..ప్రమాద అంచన జనజీవనం

దేశ రాజధాని ఢల్లీిలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది.దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది.దేశంలో అత్యంత ప్రముఖలుండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదు.ఈఏడాది మళ్లీ కొరలు చాస్తోంది.వాయు నాణ్యత సూచీలో ఇది 422గా సూచిస్తోంది.కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపరితీసుకోలేకపోతున్నారు.కాలుష్యం దెబ్బకు విద్యాసంస్థలను మూసివేయాల్సి వచ్చింది.విమానాలకు అంతరాయం కలుగుతోంది.సాధారణ జన జీవనం ప్రభావితం అవుతోంది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు.
దేశ రాజధాని ఢల్లీి నగరం కాలుష్య రాజధానిగా కూడా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢల్లీితో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-ఎన్‌.సి.ఆర్‌)అంతా వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర రీతిలో పెరుగుతోంది.ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఎ.క్యు.ఐ)వరుసగా మూడు రోజుల పాటు 500మార్కును దాటడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. నిపుణులు ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా దీనిని అభివర్ణిస్తున్నారు.కొద్ది రోజుల నుండే దేశ రాజధానిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. జెఎన్‌యు ఆన్‌లైన్‌బాట పట్టింది. అనేక ప్రైవేటు సంస్థలు ఇప్పటికే వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమ లు చేస్తుండగా,తాజాగా ఢల్లీి ప్రభుత్వం సైతం 50శాతం ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని ఆదేశించింది.పెద్ద సంఖ్యలో ప్రజానీకం రోగాల బారిన పడటం,రోడ్లన్నీ పొగతోనిండి ఊపిరాడని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర పనులుంటేనే ప్రజలురోడ్ల మీదకు రావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.ఇళ్ల దగ్గర కూడా కిటికీలు మూసి ఉంచాలని, నాణ్యమైన ఎయిర్‌ ప్యూరిఫయర్లు వాడుకోవాలని సూచించింది.వీటన్నింటిని పాటించడం ఎందరికి సాధ్యమవుతుందన్న సంగతి అటుంచితే పరిస్థితి తీవ్రతకు నిదర్శనాలుగా భావించవచ్చు.ఈస్థాయి విపత్తును కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండటం, ఆప్‌ సర్కారుకు సహాయ నిరాకరణ చేస్తుండటం మోడీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.వర్షాలు కురిస్తే కాలుష్యం అదుపులోకి వచ్చే అవకాశం ఉండటంతో మేఘ మథనానికి అనుమతి ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం! రెండు సంవత్సరాల క్రితం ఇటువంటి పరిస్థితే నెలకొన్నప్పుడు వాయుకాలుష్యాన్ని రాజకీయ పోరుగా మార్చవద్దని సర్వోన్నత న్యాయ స్థానం సూచించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరం. వాయు కాలు ష్యంతో ఢల్లీి ప్రజానీకం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు జోక్యం చేసుకుంది.అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో పంజాబ్‌,హర్యానాతో పాటు ఢల్లీి పరిసరాల్లో ఉన్న అనేక రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబట్టే సంఘటనలు గత రెండు సంవత్సరాల్లో కొంత మేర తగ్గిన్నట్లు చెబుతున్నారు.అయినా కాలుష్యం తగ్గకపోగా, మరింతగా పెరుగుతోంది. దీంతో ఇతర కారణా లనూ అధికార యంత్రాంగం అన్వేషిస్తోంది.ఉదాహరణకు ఈ నెల 12వ తేది ఒక్కరోజే ఢల్లీి నగరంలో 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగినట్లు, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చినట్లు అధికారులు గుర్తించారు. వ్యక్తిగత వాహనాల వినియోగం సాధ్యమైనంత మేర తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సి.ఎస్‌.ఇ) అక్టోబర్‌లో చేసిన అధ్యయనం ప్రకారం ఢల్లీి స్థానిక వాయు కాలుష్యంలో రవాణా రంగ వాటా సగానికి పైగా ఉందని తేలింది. 2021లో విడుదలైన ఒకనివేదిక ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతంలో కాలుష్యానికి పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం కూడా ప్రధాన కారణాలే! 30శాతం ఢల్లీి నగరంలో నగర పాలక సంస్థ సేవలు అందకపోవ డంతో స్థానిక ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ తగల బెడుతున్నారు. ఈ పరిస్థితులే ఢల్లీిని కాలుష్య రాజధానిగా మారుస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ రెండు సంవత్సరాల క్రితం రూపొందించిన నివేదికలో కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢల్లీి ప్రజానీకం తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారంటూ హెచ్చరించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పులు రాలేదు. సమిష్టి చర్యల ద్వారానే కాలుష్య నియంత్రణ సాధ్యమవు తుందన్న అంశాన్ని కేంద్రం గుర్తించాలి. ఢల్లీి ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి.ఇప్పుడు కూడా ఈదిశలో కదల కపోతే, భవిష్యత్తులో చేయడానికి ఏమీ మిగలని పరిస్థితి ఏర్పడుతుంది.
గాలి కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారు? ఏక్యూఐ ఏ స్థాయికి పెరిగితే మనుషులకు ప్రమాదకరం?
విషపూరితమైన గాలి,పొగ కమ్మేసి,ఏమీ కనిపించని పరిస్థి తులతో దేశ రాజధాని దిల్లీతో పాటు చుట్టుపక్కల నగరా ల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం,సురక్షిత స్థాయిగా భావిం చే గాలి నాణ్యత (ఏక్యూఐ)కన్నా దిల్లీ,చుట్టుపక్కల ప్రాం తాల్లో 30నుంచి35రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంది. నాసా అంతరిక్షం నుంచి తీసినశాటిలైట్‌ చిత్రాల్లో ఉత్త ర భారతదేశంతో పాటు పాకిస్తాన్‌ను కూడా దట్టమైన పొగ కమ్మేసినట్టు కనిపిస్తోంది.దట్టమైన పొగతో విమా నాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.కొన్ని విమానాలు రద్దవుతున్నాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ)మానిటరింగ్‌ గ్రూప్‌ లెక్కల ప్రకారం, 2023లో ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన రాజధాని దిల్లీ.అత్యంత కాలుష్యపూరితమైన దేశాల జాబి తాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ కంటే ముందు స్థానాల్లో బంగ్లాదేశ్‌,పాకిస్థాన్‌ ఉన్నాయి.
ఏటా భారత్‌లో అక్టోబరు నుంచి జనవరి వరకు శీతాకాలంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతుంది.ఉష్ణో గ్రతలు పడిపోవడం,పొగ,దుమ్ము,చల్లని గాలులు, వాహ నాల నుంచి వచ్చే వ్యర్థాలు,చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంవల్ల వచ్చే పొగ కలిసి ఈ పరిస్థి తిని సృష్టిస్తాయి.భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ జనా భాలో 99శాతం మంది నాణ్యత లేని గాలిని పీల్చుక ున్నారు. పేద, వెనకబడిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
గాలి కాలుష్యం ఎలా లెక్కిస్తారు?
మనుషులు చేసే పనుల వల్ల కొంతమేర గాలి కలుషిత మవుతోంది.వాహనాలకు ఉపయోగించే ఇంధనం, వంట నుంచి వచ్చే ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఇక ధూళి తుపాను, కార్చిచ్చులు, అగ్నిపర్వతాలు పేలడం వంటివి గాలి కాలుష్యానికి ప్రకృతి పరమైన కారణాలు. కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి ఎయిర్‌ క్వాలిటీ మానిటర్లు సెన్సర్లను ఉపయోగిస్తాయని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ తెలిపింది.గాలి కాలుష్యం తీవ్రతను గుర్తించడానికి కొందరు లేజర్లను ఉపయోగిస్తే, మరికొందరు భూమి నుంచి విడుదలయ్యే శక్తిని అంచ నావేయడానికి శాటిలైట్‌ చిత్రాలపై ఆధారపడతారు. మనుషుల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాలలో పీఎం 2.5, పీఎం 10,ఓజోనో, నైట్రోజన్‌ ఆక్సైడ్‌,సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటివి ఉన్నాయి. పీఎం 2.5లో 2.5మైక్రోమీటర్లు అంతకన్నా తక్కువ మందమైన సూక్ష్మ రేణువులు ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.ఈసూక్ష్మ రేణువులు మన రక్తనాళా ల్లోకి ప్రవేశించి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగి స్తాయి.గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) స్కేల్‌ సున్నా స్థాయి నుంచి 500 వరకు ఉంటుంది. ఏక్యూఐ సున్నా ఉంటే గాలిలో ఎలాంటి కాలుష్యం లేదని అర్థం. 500 ఉంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. గాలి నాణ్యతకు సంబంధించిన సంక్లిష్ట సమాచారాన్ని, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోగ లిగే సమాచారంగా మార్చే కమ్యూనికేషన్‌ సాధ నం ఏక్యూఐ అని ఐక్యూఎయిర్‌ సంస్థ ప్రతినిధి అర్మన్‌ అరరా డియన్‌ చెప్పారు.
కచ్చితత్వం ఉందా?
ప్రభుత్వ కేంద్రాలు, ఇతర మార్గాలు, శాటిలైట్‌ మానిటర్ల నుంచి వచ్చే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సమాచారాన్ని సమ్మిళితం చేసి కాలుష్యాన్ని లెక్కిస్తారని యూఎన్‌ఈపీ తెలిపింది.వాస్తవ పరిస్థితులు, కాలుష్య కారకం ఆధారంగా ఎయిర్‌ క్వాలిటీ ఇండె క్స్‌ రీడిరగ్స్‌ ఉంటాయి.2001లో యూఎన్‌ ఈపీ,ఐక్యూఎయిర్‌ కలిసి తొలి రియల్‌ టైమ్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ ఎక్స్‌పోజర్‌ క్యాలి క్యులేటర్‌ను ప్రారంభించాయి.ఇది117 దేశాలకు చెందిన6,475మానిటర్ల నుంచి వచ్చే రీడిరగ్‌లను ఒకేసారి లెక్కిం చగలదు. ‘పీఎం2.5స్థాయి పెరిగేకొద్దీ వృద్ధులు, పిల్లలు,శ్వాస,గుండెసంబంధమైన సమస్య లున్నవారిపై మొదట ప్రభావం పడుతుంది’’ అని అరరాడియన్‌ చెప్పారు.‘‘పీఎం2.5 రేణువులస్థాయి ఇంకా పెరిగే కొద్దీ జనాభా లో ఎక్కువమంది ఆరో గ్యంపై నాణ్యతలేని గాలి ప్రభావం పడు తుంది.పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్య లకు గురయ్యే ప్రమాదముంది’’అని ఆయన చెప్పారు. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాల నుంచి తీసు కున్న లెక్కల ఆధారంగా ఏక్యూఐఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బిజీరోడ్లు, పారిశ్రామిక జోన్‌ల వంటి ప్రాం తాల్లో గాలికాలుష్యం భిన్నంగాఉం టుంది. బిజీగాఉన్న ప్రాం తాల్లో గాలి కాలుష్యం స్థాయిని లెక్కిం చడా నికి నగరమంతా విస్తృత నెట్‌వర్క్‌ ఉన్న మానిట రింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయా లని అరరాడి యన్‌ సూచించారు.
ఏ స్థాయి కాలుష్యం మనుషులకు ప్రమాదకరం?
డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏఐక్యూ) వంద లోపు ఉంటే..ఆగాలి మనిషికి సురక్షితమై నది. ఏఐక్యూ 400నుంచి 500ఉంటే గాలి లో కాలుష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు.ఈ వారంలో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 500కు చేరింది. నోయిడా, గురు గ్రామ్‌ వంటి ప్రాంతాల్లో కూడా ఏక్యూఐ లెవల్స్‌ 500కి దగ్గరలో ఉన్నాయి. 2021 లో యూఎన్‌ ఈపీ రిపోర్ట్‌ ప్రకారం,గాలి నాణ్యత పర్యవేక్షణ ప్రపంచంలోని 37శాతం దేశాల్లో చట్టపరమైన అంశం లా లేదు.అనేక పద్ధతుల్లో గాలి నాణ్యత లెక్కించ డంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాలి కాలుష్యాన్ని గుర్తించడం ప్రభు త్వాల బాధ్యతగా మారేలా చట్టపరంగా చర్య లు తీసుకోవాలని,సమాచారంలో కచ్చిత త్వాన్ని పెంచడానికి మౌలిక సదుపాల యాలు కల్పించాలని యూఎన్‌ఈపీ తెలి పింది.
గాలి కాలుష్యం వల్ల ఎలాంటి జబ్బులొస్తాయి?
సూక్ష్మకణాలు,ఇతర కాలుష్య కారకాలు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయని, రోగనిరోధక వ్యవస్థను బలహీ నం చేస్తాయని,రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గిస్తా యని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పిల్లలు, వృద్ధులు, పోషకా హార లోపం,సౌకర్యాల లేమితో బాధపడే పేదల్లో శ్వాస కోస సమస్యలు,గుండె సంబంధిత రోగాలు,గుండెపోటు, లంగ్‌ క్యాన్సర్‌ వంటివి వస్తాయని ఆయన తెలిపారు.ఉదాహ రణకు ఆస్తమాపై ఓజోన్‌,సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రో జన్‌ డై ఆక్సైడ్‌ వంటివి ఊపిరి తిత్తుల వాపు, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి వాటికి కారణమవు తాయి.గర్భస్థ శిశువుల ఆరో గ్యంపైనా నాణ్యత లేని గాలి ప్రభావం ఉంటుందని, కొన్నిసార్లు చనిపోయిన పిల్లలు పుడతారని, అబార్షన్లు జరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.గాలి కాలుష్యం ప్రభావంతో ప్రపం చవ్యాప్తంగా ఏటా70లక్షల మందితమ ఆయు ర్దాయం కన్నా ముందే చనిపోతు న్నారని డబ్ల్యూ హెచ్‌ఓ తెలిపింది. అందులో దాదాపు 85 శాతం మంది గుండె సంబంధిత వ్యాధు లు,గుండెపోటు,ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఆస్తమా,సీఓపీడీ,డయాబెటిస్‌,వంటి కారణా లతో మర ణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలి పింది. పొగా కు తర్వాత ఎక్కువ మరణాలకు కారణ మవు తోంది గాలి కాలుష్యమని, బహి రంగ ప్రదే శాల్లో గాలి కాలుష్యంవల్ల ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో 90శాతం పేద,అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారని తెలిపింది.ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ప్లాట్‌ ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో దిల్లీ,చుట్ట పక్కల నగరాల్లో 81శాతం కుటుం బాల్లో ఎవరో ఒకరు గడిచిన మూడు వారాల నుంచి కాలుష్యంవల్ల అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

కృత్రిమ మేథ ప్రపంచ భవిష్యత్తు

కృత్రిమ మేథ..ఇప్పుడిదే సర్వాంతర్యామి. ఇందుగలదందు సందేహం వలదన్న మాట కృత్రిమమేథకి సరిగ్గా సరిపోతుంది.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..అనగానే అదేదో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్ల భాష,మనకు సంబంధం లేదనుకుంటాం.కానీ..తెల్లారి లేచిందగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉ ంటోంది.ఒక వస్తువైనా,సేవ అయినా కృత్రిమమేథని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతోంది.అందుకే..విద్య నుంచి వైద్యం వరకూ,వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. విద్య,ఉద్యోగం,పాలనా రంగం..అసలు కృత్రిమమేథ ప్రవేశించని రంగమంటూ ఏదీ కనిపించడం లేదు.ఉద్యోగుల హజరు నమోదు చేసే బయోమెట్రిక్‌ సిస్టమ్‌తో మొదలుపెట్టి శాంతిభద్రతను పరిరక్షణకు,ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకూ పరిపాలనలో కృత్రిమమేథ ఎప్పడో ప్రవేశిచింది.
పిల్లలు బడికెళ్లి చదువుకోవటానికి ఏఐతో ఏమిటీ సంబంధం అనుకుంటే పొరపాటే.మన విద్యారంగంలో ఏఐ మార్కెట్‌ విలువ గతేడాది 75వేల కోట్లు.అది ఏటా 40శాతం చొప్పున పెరుగుతుందట.ఆన్‌లైన్‌ చదువులు వచ్చాక,తరగతి గదిలో టీచరు చెప్పాల్సిన పాఠాలను రకరకాల ఆప్స్‌ ద్వారా ఫోన్‌ తెరమీద చెప్పడానికీ,ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకీ ఏఐ సాయం కీలకమవుతోంది.విద్యార్ది సామర్ధ్యాలనూ నైపుణ్యాలనూ బేరీజువేసి ఒక్కోక్కరి బలాబలాలను గుర్తించడం ద్వారా టీచర్లు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ద తీసుకోవడానికి వీలు కలుగుతోంది.
తప్పులేకుండా ఉద్యోగానికి దరఖాస్తు రాయడమెలా అన్న సందేహం అక్కర్లేదిప్పుడు.గ్రామర్లీ లాంటి ఏఐ ఎనేబుల్డ్‌ సాప్ట్‌వేర్‌ తోడుంటే అది సాద్యమే.ఒక్కో వాక్యం రాసేటప్పుడే తప్పల్లేకుండా దరఖాస్తుని దిద్దిపెడుతుంది ఆ సాప్ట్‌వేర్‌.
కృత్రిమమేథ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు.రాయగలవు.మాట్లాడగలవు.మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి.కాబట్టి వాటికి ఆ పనులు అప్పజేప్పి మనుషులు అంతకన్నా పైస్థాయిలో సృజనాత్మకత,ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన.అంటే,ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభజంగా మారనుందన్న మాట.!
1950ల నుండి కృత్రిమమేధస్సు(ఎఐAI)విషయంలో అనేక పరిశోధనలు జరిగి,అది సిద్ధించి… ప్రస్తుతం మానవజాతిచేతిలో ఒక కొత్తసాధనం సమకూరింది.నవంబర్‌ 2022లో విడుదలైన చాట్‌ జిపిటి దీనికి ఒక తాజా ఉదాహరణ. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ భవితవ్యం ఏమి కానుంది అనే చర్చ కూడా మొదలయింది.ఇది కార్పొరేట్‌ ప్రపంచానికి అందివచ్చిన ఫాసిస్టు ఆయుధం అని కొందరు వ్యాఖ్యానించారు.కృత్రిమ మేధస్సు అంటే యంత్రాలు,ముఖ్యంగా కంప్యూటర్‌ వ్యవస్థల ద్వారా మానవ మేధస్సులో జరిగే ప్రక్రియలను అనుకరించడం.డేటాసేకరణ,డేటాఎంట్రీ,కస్టమర్‌ ఫోకస్డ్‌ బిజినెస్‌, ఇ-మెయిల్‌ ప్రతిస్పందనలు,సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌,ఇన్వాయిస్‌ జనరేషన్‌ వంటి యాంత్రికంగా పునరా వృతం చేసే సాధారణ(రొటీన్‌)పనులను ఆటోమేషన్‌చేసి పనిలో విసుగుదలను తగ్గించి మనిషి మరింత సృజనా త్మకంగా చేసుకోవాల్సిన పనులకు సమయం కల్పిస్తుంది.
పరిశ్రమల ఉత్పత్తులను పెంచడం,పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చేయడం, రవాణా సౌకర్యాలను సముచితంగా నిర్వహించటం,విద్యబోధన,ఆరోగ్య సంరక్షణ,వాతావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల కోసం అవసరమైనమార్పులు సూచిస్తుంది.పేదరికం,ఆకలికి వ్యతిరేకంగా పోరాడటం లో కూడా సహాయపడుతుంది.ఆరోగ్యసంరక్షణలో ఎఐ,వ్యాధి నిర్ధారణను మెరుగుపరచడానికీ,కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికీ సహాయపడుతుంది. ప్రాణాంతక వ్యాధుల నివారణలతో సహా ఔషధాలలో పురోగతికి ఇది తోడ్పడుతుంది.విద్యరంగానికి ఇదిమరింత ఆకర్షణీయమైన,అద్భుతమైన అభ్యాస అనుభ వాలను అందించగలదు.వర్చువల్‌,ఆగ్మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీలవల్ల పరస్పర సంభాషణా రీతిలోను (ఇంటరాక్టివ్‌’,బోధనలో పూర్తిగా లీనమయ్యే పద్ధతిలోనూ (ఇమ్మర్సివ్‌) నేర్చుకోవడం జరుగుతుంది. చదువుకోవటం ఒక ఆకట్టుకునే ప్రక్రియగా మారుతుంది.
కృత్రిమ మేధ సమాజంలోను,దైనందిన జీవితంలోను అనేక మార్పులు తెస్తోంది.సిరి,గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా వంటి కృత్రిమ మేధ ఆధారిత వ్యక్తిగత సహాయక యాప్‌లు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ స్పీకర్లు,ఇతర పరికరాలతో అనుసంధానించబడి అనేక రకాల పనులనుచేస్తుంది. మన జీవితాలను సులభతరం,సౌకర్యవంతం,సౌఖ్యవంతం చేస్తుంది.కాకుంటే మానవులు యంత్రాలపై ఆధారపడటం మరింత పెరుగుతుంది.అది సోమరితనానికి దారి తీస్తుంది.పనిలో సృజనాత్మకత,భావోద్వేగం లేకపోవడం వంటి లోపాలు వుంటాయి.అంతేకాక సమాజపరంగా కొన్నినష్టాలు కూడా సంభవిస్తాయి.చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు.ఎక్కువగా సమాచార కార్మికుల ఉద్యోగాలకు,వైట్‌-కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు వస్తుంది.కృత్రిమమేధ సాంకేతికపరిజ్ఞానం – (బప్పా సిన్హా,/ఆంజనేయ రాజు)

గ్రోత్‌ హాబ్‌గా మహావిశాఖనగరం

కణితి మార్కెట్‌ రోడ్లో జరిగిన దీపం -2 పథకం ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌
గాజువాక ప్రాంతంలో ఇళ్ల క్రమబద్దీకరణ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ
విశాఖపట్టణం(గాజువాక) ః ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకా రంతో విశాఖ మహా నగరాన్ని గ్రోత్‌ హబ్‌ గా తీర్చిదిద్దుతామని, ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అద్దం పడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ సహాయంతో ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు రూపొందించామని గుర్తు చేశారు.కేంద్ర, రాష్ట్ర డబుల్‌ ఇంజన్‌ సర్కారులో ప్రజలకు సత్వర సేవలను అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దీపం-2 పథకం ఉచిత గ్యాస్‌ సిలిం డర్ల పంపణీ జిల్లాస్థాయి కార్యక్రమం గాజు వాక పరిధిలోని కణితి మార్కెట్‌ రోడ్లో అట్ట హాసంగా జరిగింది. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివా సరావులతో కలిసి జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌,జాయింట్‌ కలెక్టర్‌ కె.మ యూర్‌ అశోక్‌ భాగస్వామ్యమయ్యారు.ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దీపం పథకం ద్వారా పేదల ఇళ్లల్లో కొత్త వెలుగులు వస్తా యని,శ్వాసకోస సంబంధిత వ్యాధులు దూరమ వుతాయని, మహిళలకు సాంత్వన చేకూరు తుందని అన్నారు.జిల్లాలో టీబీ కారణంగా ఎంతో మంది చనిపోయారని,దానికి ప్రధాన కారణం కట్టెల పొయ్యిల వినియోగమే అని గుర్తు చేశారు.డబుల్‌ ఇంజన్‌ సర్కారులో ప్రజ లకు సత్వరమే సేవలు అందుతున్నాయని, సంక్షేమం,అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నా యన్నారు.దానిలో భాగంగా టీసీఎస్‌ విశాఖ పట్టణానికి వస్తోందని,మెగా డీఎస్సీ కూడా వస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వ విధానాల ఫలి తంగా జిల్లాకు పరిశ్రమలు కూడా వస్తున్నా యని గుర్తు చేశారు.స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించిన ఇళ్ల స్థలాల క్రమ బద్దీకరణ,స్టీల్‌ ప్లాంటు విషయంలో అనుసరిం చే విధానాలపై కలెక్టర్‌ ఈ సంద ర్భంగా స్పందించారు.జీవో నెం.301విషయంలో సానుకూల నిర్ణయం తీసు కుంటామని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు.అలాగే స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో సానుకూలంగా ఉన్నామని దానిలో భాగంగా నే రెండో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలి పారు.అందరి సహకా రంతో అందరికీ న్యాయం చేస్తామని, మంచి సేవలు అంది స్తామని,జిల్లా అభివృద్ధికి అవిరళ కృషి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉం డగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాల పరిధిలో ప్రస్తుతం 3,76,924గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని వాటిలో అర్హులైన అందరికీ దీపం పథకంలో ఉచిత సిలిండర్ల పంపిణీ చేస్తామని జిల్లా సివిల్‌ సప్లై అధి కారి తెలిపారు.కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే, కలెక్టర్‌,జాయింట్‌ కలెక్టర్‌,డీఎస్వో తదిత రుల చేతుల మీదుగా ఉచిత సిలిండర్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా సివిల్‌ సప్లై అధికారి భాస్కరరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.-జి.ఎన్‌.వి.సతీష్‌

జాతీయ డ్రోన్‌ కాపిటిల్‌ అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ నిర్వహించడం సంతోషంగా ఉందని..ఇది భవిష్యత్తు నాలెడ్జ్‌ ఎకానమీలో గేమ్‌ ఛేంజర్‌ అని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. అక్టోబర్‌ 22న మంగళగిరిలోని సీకే కన్వెన్షన్స్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ,ఏపీ డ్రోన్స్‌ కార్పొ రేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ రావతి డ్రోన్‌ సమ్మిట్‌ను కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మౌలిక వసతులు,పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్ధన్‌ రెడ్డి తది తరులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభిం చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… 1995లో నేను ఐటీ విధానం గురిం చి మాట్లాడితే ఆరోజు ఆమాటలు కొందరికి అర్థం కాలేదని..సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఐటీ రంగాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని పెద్దఎత్తున ప్రమోట్‌ చేసినట్లు తెలిపారు.బెంగళూరులో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు గతంలో పరిస్థితులు అనుకూలంగా ఉండేవని..తాను వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి హైదరా బాద్‌కు ఐటీ పరిశ్రమలు తెచ్చేందుకు కృషిచే శానన్నారు. వాటి ఫలితమే నేడు హైదరాబాద్‌ ఐటీ రంగంలో అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. పీపీపీ విధానంలో హైటెక్‌ సిటీని నిర్మించినట్లు తెలిపారు.ఆ సమయంలో అమెరికాలో 15రోజులు పాటు పర్యటించి అనేక మంది ఐటీ నిపుణులతో సంప్రదించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. నాడు నేను ఒకటే చెప్పా…టెక్నాలజీలో ఇండియా బలమైన దేశమని. బ్రిటిష్‌ వారు మన దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు దేశ సంపదతో పాటు కోహినూర్‌ వజ్రాన్ని తీసుకెళ్లారు.అయితే ఇంగ్లీష్‌ను వదిలివెళ్లారు.నేడు ప్రపంచంలోనే ఇంగ్లీష్‌ మాట్లాడేవారు ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు.గణితంలోనూ ఇండియా వారు బలమైనవారు. సున్నాను కనిపెట్టింది కూడా ఇండియా వారే.బిల్‌ గేట్స్‌ను కూడా గతంలో హైదరాబాద్‌కు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితులు వివరించాం.టెలీ కమ్యూనికేషన్‌లో డీ రెగ్యు లేషన్‌ గురించి నాటి ప్రధాని వాజ్‌పేయ్‌ని ఒప్పించాం.సెల్‌ ఫోన్‌ అన్నం పెడుతుందా అంటూ వెకిలిగా మాట్లాడారు.ఐటీ రంగంలో భారతీయులు బలమైనవారు.బయో టెక్నాలజీ,ఫార్మాలో భారతీయులు సమర్థవం తులు.టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుం టారు.అడ్వాన్స్‌డ్రోన్స్‌,సీసీటీవీ కెమెరాలు, యాప్‌లు,ఇతర టెక్నాలజీ పరికరాల విని యోగంలో ముందున్నాం.ఐటీ గురించి మాట్లాడిన సందర్భంలో ఉద్యోగాలు చేయడమే కాదు…ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లాలని చెప్పాను.ప్రపంచంలో భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు. అందులో తెలుగువారు 30శాతం మంది ఉన్నారు. విమాన సదుపాయం లేని సమయంలో ఢల్లీి, ముంబైలో దిగి హైదరాబాద్‌ రావాలని చెప్పాను.వ్యాపారాలు చూసు కుని వెళ్లండని కోరాను…దానికి కారణం హైదరాబాద్‌కు నాడు సరైన విమాన సదుపాయం లేకపో వడమే.నాటి ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి ఓపెన్‌ స్కై పాలసీ తెచ్చేలా కృషి చేశాం. అప్పుడు మొదటి సారి ఎమిరేట్స్‌ నుండి హైద రాబాద్‌ విమానం నడిచింది.ఆ సమయంలోనే గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టుకు శ్రీకారం చుట్టాం. 32 సార్లు ప్రధానమంత్రి,విమానయాన శాఖ అధికారులతో చర్చించాం.
గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణం తర్వాత హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌రోడ్‌,బయోటెక్నాలజీ పార్క్‌,ఐటీ,ఫార్మా రంగాల్లో పెద్ద సంస్థలను తీసుకొచ్చాం. ఇప్పుడు దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ నివాసయోగ్య సిటీ అని గర్వంగా చెప్తుకుం టున్నాం.మన దేశానికి ఒక డైనమిక్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇండియన్‌ బ్రాండ్‌ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. వికసిత్‌ భారత్‌ 2047 ద్వారా ఇండియాను ప్రపంచంలో నెంబర్‌ 1లేదా నెంబర్‌ 2 స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. నేడు ప్రపంచంలోనే డిజిటల్‌ కరెన్సీని ఎక్కువగా ఉపయోగించేది ఇండియన్స్‌.జన్‌ ధన్‌,ఆధార్‌ మొబైల్‌ (జామ్‌) అనుసంధానం చేస్తున్నారు.ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.రాబోయే కాలం అంతా డేటాదే. ఎంత డేటా ఉంటే దేశానికి, పెట్టుబడిదారులకు అంత బాగుంటుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ),మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌)ద్వారా నిర్ధిష్టమైన సమా చారాన్ని పొందవచ్చు.డ్రోన్స్‌ను మనం ఎక్కడికైనా పంపవచ్చు…సరైన సమాచారాన్ని పొందవచ్చు. ఇటీవల విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి.ఆ సమయంలో బాధితులకు ఆహారం కలుషితం కాకుండా, వృధా కాకుండా అందించడానికి దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లు వినియోగించి బాధితు లకు ఆహారం అందించాం.హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన సందర్భంలో పైనుంచి వేయడంతో ఆహార పొట్లాలు పగిలిపోయేవి. కానీ..డ్రోన్ల ద్వారా సురక్షితంగా1.50లక్షల మందికి ఆహారం అందించాం.
అంతేకాదు డ్రోన్లు సిటీలోకి పంపి ఎంత చెత్త ఎక్కడ పేరుకుపోయిందో కూడా సర్వే చేశాం. సరైన సమయంలో అన్నింటిని గుర్తించి 20 మెట్రిక్‌ టన్నుల చెత్తను నాలుగు రోజుల్లోనే తొలగించాం.రోడ్లు ఎక్కడ సరిగా లేకపోయినా డ్రోన్లు పంపి సమాచారం తెప్పించాం.ఏరోడ్డు పక్కన చెత్త ఉన్నా పరిశీలించి శుభ్రం చేయిం చాం.వరద నీరు బయటకు పోవడానికి కారణం డ్రెయిన్లు మూసుకుపోవడమని.. బ్లాక్‌లను గుర్తించి,వాటిని తొలగించి నీటిని బయటకు పంపాం.భవిష్యత్తులో డ్రోన్లు గేమ్‌ ఛేంజర్లుగా చెప్పొచ్చు.వ్యవసాయం, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ తదితరాల్లో వాటిని వినియోగించవచ్చు. విజిబుల్‌ పోలీసింగ్‌…ఇన్‌ విజిబిల్‌ పోలీస్‌కు ప్రాధాన్యమిస్తున్నాం.టెక్నాలజీ సహాయంతో నేరగాళ్ల ఆటకట్టిస్తాం. ప్రతి అంశంలోనూ ఖచ్చితత్వాన్ని సాధించడంతో పాటు చివరి మైలు వరకు అభివృద్ధి,సంక్షేమ ఫలాలు అందించడంలో టెక్నాలజీని వినియోగించు కుంటాం.భూసార పరీక్షలు, పురుగుమందుల పిచికారీ,భూసర్వే,భూసార పరీక్షలు తదితరా లను డ్రోన్ల ద్వారా నిర్వహించవచ్చు. కనీసం100నుండి 150వరకు డ్రోన్‌ అప్లికే షన్స్‌ (డ్రోన్‌యూజ్‌ కేస్‌లు)వినియోగం లక్ష్యంగా పనిచేస్తున్నాం.అప్లికేషన్స్‌ను క్షేత్ర స్థాయిలో పరీక్షించి ఆయా కంపెనీలకు సరైన విధంగా ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేలా పైలట్‌ ప్రాజెక్టులకు వీలుకల్పిస్తాం.నాకు కావాల్సింది డ్రోన్ల ద్వారా అభివృద్ధి. ఇండియాకు రెండంకెల వృద్ధిరేటు సాధించే సత్తా ఉంది.నాలెడ్జ్‌ ఎకానమీలో గ్లోబల్‌ సర్వీస్‌లు అందించగల సత్తా కూడా మన దేశానికి ఉంది.పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తల నుండి సల హాలు,సూచలను తీసుకుని డ్రోన్‌ పాలసీని ప్రవేశపెడతాం.15రోజుల్లోనే డ్రోన్‌ పాలసీని ఆవిష్కరిస్తాం.కనీసం 35వేలకు పైగా డ్రోన్‌ ఫైలట్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టు కున్నాం.డ్రోన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అమ రావతిని తీర్చిదిద్దుతాం.ఏఐ,ఎమ్‌ఎల్‌.. ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మీఅందరికీ ఒక సూచన ఇస్తున్నా…థింక్‌ గ్లోబల్లీ..యాక్ట్‌ గ్లోబల్లీ విధానాన్ని అనుస రించాలి.ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ పార్కులో డ్రోన్‌ హబ్‌ కోసం 300ఎకరాలు కేటా యిస్తాం.అక్కడ డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తే పెద్ద నగరాలైన హైదరబాద్‌,చెన్నై,బెంగళూరు, అమ రావతికి దగ్గరగా ఉంటుంది.అక్కడ డ్రోన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌కు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం.నేను డ్రోన్లు తయారీదారులకు కూడా చెప్తున్నా….మీకు నేను అంబాసిడర్‌ గా ఉంటాను….మీ మార్కెట్‌ ను ప్రమోట్‌ చేస్తా. నేను చాలా మంది ప్రధాను లను చూశాను కానీ టెక్నాలజీని ఇంతగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధాని మోదీ. స్నేహ పూర్వక వాతావరణంలో విధానాల రూపకల్ప నకు సిద్ధంగా ఉన్నాం.స్టూడెంట్స్‌,టీచర్స్‌, ప్రొఫెసర్స్‌కు కూడా చెప్తున్నా నాలెడ్జ్‌ ఎకానమీకి ఇది మంచి సమయం.ప్రతిదీ అందుబాటులో ఉంది. ప్రతి దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తే ఇండియన్స్‌ను ఎవరూ ఎదుర్కోలేరు.నేడు మన దేశం యువ జనాభా తద్వారా యంగ్‌ టాలెంట్‌తో తొణికిస లాడుతోంది.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కూడా టెక్నాలజీ,ఇన్నోవేషన్‌లో భాగస్వాములవు తున్నారు. సమష్టి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని డ్రోన్‌ హబ్‌గా మారుస్తాం.రాష్ట్రంలోని యూనివర్సిటీలు కూడా థియరిటికల్‌ విద్యకే కాకుండా అప్లికేషన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. నవ టెక్‌ ఆవిష్కరణలు దిశగా యువతను ప్రోత్స హించాలి. రాష్ట్రంలో5రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.అమరావతిలో హెడ్‌ క్వార్టర్‌ ఉంటుంది..మిగతావి విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నాం.2047 నాటికి ఒక కుటుంబం…ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది నా అభిమతం.25ఏళ్ల క్రితం ప్రతి కుటుంబంలో ఒక ఐటీ వ్యక్తి ఉండాలని ఆకాంక్షించాని..అదే విధంగా ఇప్పుడు చెప్తున్నా ఒక కుటుంబంలో ఒకవ్యాపారవేత్త, ఒక స్టార్టప్‌ కంపెనీ ఉండా లని చెప్తున్నా. ఇది సక్సెస్‌ అయితే భారత్‌.. టెక్నాలజీ,గ్లోబల్‌ సర్వీసెస్‌లో ముందుంటుంది. -జిఎన్‌వి సతీష్‌

బంగారు భవితకు బాట

దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తోంది. యూత్‌కు ఉన్న బలం, అంకితభావం ప్రపంచంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. సమాజానికి ఉపయోగపడేలా తమ కార్యాచరణ ఉండేలా యోచిస్తుంది. అటువంటి యువతకు ప్రపంచీకరణ ఆధునిక కాలం ఎన్నో సవాళ్లు విసురుతోంది. అయినా పుంజుకుని ముందుకు వెళ్లేందుకే చూస్తోంది. ఉపాధి అవకాశాలు, సరైన నైపుణ్యాలు లేక వెనకబడుతున్నారే తప్ప, ప్రకృతి విపత్తులు, ఆపదల వచ్చినా ముందుకు వచ్చేది యువకులే. అందుకే వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అవరోధాలు దాటి, విజయాలెన్నో సాధిస్తారు.
దేశానికి నిజమైన సంపద బంగారు గనుల్లో, అద్దాల మేడల్లో,అందాల నగరాల్లో కాదు.. యువతలో ఉందని- అటువంటి యువశక్తిని సక్రమంగా వాడుకుంటే దేశం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందనే స్వామి వివేకా నంద మాటలు నిత్యసత్యం.యుక్త వయ స్సులో ‘ఏదైనా సాధిస్తాం.ఎంతటి కష్టాన్నైనా ఛేదిస్తాం.మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి.అందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమిస్తాం’ అనేలా యువత ఉం టుంది. కొంగొత్త ఆలోచనలు పుట్టేది కూడా ఈ వయస్సులోనే. పిల్లల్ని పెంచేది తల్లిదం డ్రులే అయినా వారికి విద్యాబుద్ధులు నేర్పి, మంచి మార్గంలో నడిచేలా చేసేది ఉపాధ్యా యులు. విజ్ఞానంతో బయటకు వచ్చిన యువతకు నైపుణ్యాలు నేర్పించి-వారిని దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా చేసుకునే బాధ్యత మాత్రం ఆయా ప్రభుత్వాలదే.
నిధులు లేక
ఒకప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్ర మాలను విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన నెహ్రూ యువజన సంఘాలు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. నిరక్షరా స్యత నిర్మూలన, సామాజిక చైతన్య కార్యక్ర మాల్లో పాల్గొనే యువతకు ఆదరణ కరువైంది. గతంలో గ్రామాల్లో వివిధ రకాలశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నింపే కార్యక్రమాలు నిర్వహించే వారు. కానీ ఇప్పుడు అటువంటి చర్యలు కనిపించడం లేదు. దాంతో యువత ఉపాధి హామీ,వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. పాలకులు సరైన దిశానిర్దేశం చేయకపోవడంతో యువతలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది.ఇది భవిష్యత్తుకే ప్రమాదం. అందుకే కొత్త జిల్లాల్లో యువజన సంఘాల ఏర్పాటు చేసి-ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.సామాజిక దృక్పథం పెంపొందించేందుకు వారిలో చైతన్యం కల్పించి-విద్య,ఉద్యోగ సాధనలో నైపుణ్య వికాసం నింపేలా శిక్షణ ఇవ్వాలి. మట్టిలో మాణిక్యాలు ఉన్నట్లే గ్రామాల్లో ప్రోత్సాహం లేక ప్రాథమిక స్థాయిలో నిలిచిపోతున్న క్రీడామణులు ఉంటారు. వారిని గుర్తించి ప్రోత్సహించాలి.వారికి కావలసిన ఆట వస్తువులు సరఫరా చేయాలి.సమాజావృద్ధిని కాంక్షించేలా యువజన సంఘాలను బలోపేతం చేయాలి.
రాజకీయాల్లోనూ..
యువతీ, యువకులు స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచి తమ గొంతును వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణాకు చెందిన శిరీష-డిగ్రీ చదివినా ఉద్యోగం – (పద్మావతి)

సమ్మిళిత ఆర్ధిక వృద్ధికి ఆలంబన

సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధానంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవాభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది. – (ఎం. సునీల్‌కుమార్‌)
ఇండియాలో బ్యాంకింగ్‌ సేవలు ఇంతగా విస్తరించడానికి 47ఏళ్లు పట్టేది.జన్‌ధన్‌వల్ల ఆ ప్రగతి అత్యంత వేగంగా వాస్తవ రూపం దాల్చింది.అని బ్యాంక్‌ ఆప్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ పరిశోధకుడు కితాబునిచ్చారు. దానికి గర్వించడంతోపాటు సరిదిద్దుకోవాల్సిన వ్యవస్థాగత లోపాలూ కొన్ని ఉన్నాయి. జనధన్‌ తదనంతరం అంతవరకూ వెళ్లని ఊళ్లలోకి బ్యాంకులు అడుగు పెట్టాయి.2013లో దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు శాఖలు దాదాపు1.06లక్షలు,2023కు అవి 46శాతం అధికమయ్యాయి.ఏటీఎంల సంఖ్య సైతం 30శాతం మేరకు పెరిగింది.కానీ, లావా దేవీలేమీ జరగని బ్యాంక్‌ ఖాతాలు ఎక్కువగా ఉండటమే విస్మయకరం!దేశంలో మొత్తం ఖాతాల్లో అటువంటివి 35శాతం వరకు ఉంటాయని ప్రపంచబ్యాంకు క్రోడికరించిన గ్లోబ్‌ ఫిన్‌డెక్స్‌ డేటా బేస్‌ వెల్లడిర చింది.అభివృద్ధి చెందుతున్న దేశాల సగటుతో పోలిస్తే ఇది ఏడు రెట్టు ఎక్కువ!జన్‌ధన్‌ ఖాతాల్లోనూ నిష్క్రియమైనవి 20శాతం దాకా ఉంటాయని అంచనా.అందుకు కారణాలేంటో అన్వేషించడంతోపాటు పీఎంజేడీవై ప్రధాన లక్ష్యమై న ఆర్ధికఅక్షరాస్తను పెంపొందించడం మరో సవాలు. ఆర్బీఐ నివేదిక ప్రకారం,గడిచిన పదేళ్లలో దేశీయ బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ రూ. 5.3లక్షలకోట్లు.సైబర్‌ నేరాల ఉధృతికి ప్రభుత్వాలు అడ్డు కట్టవేస్తేనే`ప్రజల కష్టార్జితాలకు రక్షణ లభిస్తుం ది.డిజిటల్‌ ఆర్ధికవ్యవస్థ పురోగతీ శ్రీఘ్ర తరమ వుతుంది.
సమ్మిళిత వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 11,12 ప్రణాళికల్లో సమ్మిళిత, సత్వర వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.11వ పంచవర్ష ప్రణా ళిక సమ్మిళిత వృద్ధి సాధించడానికి మొత్తం 27 ద్రవ్య విధాన లక్ష్యాలను 13 రాష్ట్రాలకు నిర్దేశిం చింది.దీనిలో భాగంగా పేదరికంతగ్గించి,ఉపాధి కల్పనను పెంచి సత్వర వృద్ధి సాధించడం, విద్య, ఆరోగ్యం వంటి అవసరమైన సేవలను అందిం చడం,విద్యా నైపుణ్యాలను పెంచడం ద్వారా సాధి కారతను సాధించడం,ద్వారా ఉపాధిని విస్తరిం చడం,పర్యావరణ కొనసాగింపు సాధించడం, లింగ వివక్షతను తగ్గించడం, పాలనలో మెరుగు దలను తీసుకురావడం వంటి అంశాల్లో దృష్టిని సారించింది.పై వాటిని సాధించడానికి వ్యవసాయ రంగంలో4శాతం వృద్ధిని, పారిక్షిశామిక రంగంలో 10-11శాతం వృద్ధిని,సేవారంగంలో 9-11 శాతం వృద్ధిని సాధించాలని వాటి ద్వారా ప్రణాళి కలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యమైన 9శాతం వృద్ధిని సాధించాలని నిర్ణయించారు.సమాచార సాంకేతిక రంగంలో విశిష్టమైన అభివృద్ధిని సాధించాం. సాఫ్ట్‌ వేర్‌ పరిక్షిశమ బాగా వృద్ధి చెందింది. వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి ‘ఇంటిక్షిగేటెడ్‌ యాక్షన్‌ప్లాన్‌ను దేశం లోని 60 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.
11వ ప్రణాళికలో వివిధ పథకాల్లో భాగంగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే పేదరి కపు రేఖకు దిగువన ఉన్నవారికి సంబంధించి ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ పథకాన్ని 2007 లో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కుటుంబాలకు బీమా రక్షణ కల్పించడానికి ‘ఆమ్‌ ఆద్మీ బీమా యోజన’ పథకాన్ని ప్రారం భించారు. దీనికి చెల్లించే ప్రీమియం రూ.200. దీని నిర్వహణ బాధ్యతను ఎల్‌ఐసీకి అప్పగించారు. దీనికి అవసరమయ్యే నిధులను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరిస్తాయి. వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పిం చడానికిగాను ‘ఉజ్వల’పథకాన్ని ప్రారంభిం చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకోవ డానికి దేశంలో వేతన ఉపాధి పథకాన్ని అమలు చేస్తున్నారు. పైవాటితో పాటుగా ప్రభుత్వం కొన్ని ఫ్లాగ్‌షిప్‌ పథకాలను అమలు చేసింది.దీనిలో భాగంగా ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన’ జాతీయ హార్టికల్చర్‌ మిషన్‌,సత్వర నీటి పారుదల ప్రయో జన పథకం గ్రామీణ తాగునీటి సదుపాయం, రాజీవ్‌గాంధీ విద్యుదీకరణ, ఇందిరా ఆవాస్‌ యో జన,సర్వశిక్షా అభియాన్‌,మధ్యాహ్నభోజన పథకం, నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌, సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వృద్ధిని సాధించడంతోపాటు దాన్ని సమాజంలో అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి అందించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్య మవుతుంది. సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధా నంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవా భివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది.
భారత ప్రభుత్వం 12వ ప్రణాళికలో ఆర్థిక వృద్ధిని 9 శాతానికి పెంచాలని పేర్కొన్నది. వ్యవసాయరంగంలో 4శాతంవృద్ధిని,పారిక్షి శామిక రంగంలో 9.5శాతం వృద్ధిని,సేవారంగంలో 10 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించింది.మొత్తం మీద ప్రణాళికలో వృద్ధిని 9-9.5శాతం వరకు సాధిం చాలని నిర్ణయించింది.
హరిత ఆర్థికం సమ్మిళితమేనా?
హరిత ఆర్థిక వ్యవస్థలుగా శీఘ్రగతిన పరివర్తన చెందేందుకు ప్రపంచ దేశాలు ఆరాట పడుతున్నాయి. ఇంధన వ్యవస్థలలో బొగ్గు, గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పునరుద్ధరణీయ పవన, సౌరశక్తి వనరులనుబీ రవాణా రంగంలో పెట్రోలియం ఉత్పత్తులకు బదులుగా విద్యుత్‌ను, పరిశ్రమలలో శిలాజ ఇంధనాలకు మారుగా హైడ్రోజన్‌ను ఉపయోగించుకునే దిశగా ప్రపంచ దేశాలన్నీ చురు గ్గా చర్యలు చేపడుతున్నాయి.అడ్డూ అదుపు లేకుం డా భూతాపం తీవ్రమవుతుండడం, తత్పర్య వసానంగా వాతావరణ వైపరీత్యాలకు కారణమ వుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు, ఇంధన వ్యవస్థలు,రవాణా రంగం,వస్తూత్పత్తి కార్య కలాపాలలో చోటు చేసుకుంటున్న మౌలిక మార్పు లు దోహదం చేయగలవని ప్రభుత్వాలు ఆశిస్తు న్నాయి. హరిత ఆర్థికవ్యవస్థ దిశగా ప్రపంచ దేశాలు మరింత వేగంగా,సమస్యను పరిష్కరిం చేందుకు అవసరమైన బృహత్‌ చర్యలతో పురోగ మించవలసి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే కొత్త హరిత ప్రపంచానికి మనం తీసుకువెళ్లే (వనరుల వినియోగ,ఉత్పాదక కార్యక లాపాల నిర్వహణ) విధానాలు,పద్ధతులు ఎలా ఉండనున్నాయి? అవి హరిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాల పరిపూర్తికి తోడ్పడుతాయా? సహజ వనరులను ఉపయోగించుకోవడంలో మనం అనుసరిస్తున్న పాత పద్ధతులలో స్వతస్సిద్ధంగా పలు సమస్యలు ఉన్నాయి. ఇవి సామాజిక, పర్యావరణ వ్యవస్థలను ప్రతికూలంగా,మరింత కచ్చితంగా చెప్పాలంటే విధ్వంసకరంగా ప్రభావితం చేస్తున్నందునే హరిత ఆర్థిక కార్యకలాపాలలో సైతం మనం పాటించే పద్ధతుల గురించి ప్రశ్నించడం అనివార్య మ యింది. ఖనిజాల వెలికితీతనే తీసుకోండి% బొగ్గు, ఇనుము,అల్యూమినియం మొదలైన ఖనిజాలు మన ఆర్థికవ్యవస్థలకు మౌలిక అవసరాలు. అయితే భూగర్భం నుంచి వాటి వెలికితీత పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది.భారత్‌లో ఈముడి పదార్థాలు అడవుల కింద,వన్యప్రాణుల ఆవా స ప్రదేశాలలోను,గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి. పర్యావరణ భద్రతకు, ప్రజా శ్రేయస్సుకు హాని వాటిల్లకుండా ఆ సహజ సంపదను ఉపయోగిం చుకోవడం ఎలా? ఇదొక విపత్కరమైన పరిస్థితి. వనరుల విపత్తు అనేది సంపద్వంత భూములు, పేద ప్రజలకు సంబంధించిన సమస్య. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన ఖనిజాలను సమ కూర్చుకునేందుకు మనం అడవులను నరికివే స్తున్నాం.స్థానిక జనసముదాయాలను నిర్వాసితు లను చేస్తున్నాము.ఖనిజాల వెలికితీత అనేది మనం అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి నమూనాలో చాలా కీలకమైన కార్యకలాపం. దానివల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం సమకూరుతున్నది.

నైపుణ్యం గల యువతతోనే ప్రపంచాభివృద్ధి

మానవుడు ఆదిమకాలం నుంచి శ్రమ ద్వారా నేటి కంప్యూటర్‌ యుగం తాజాగా ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) దాకా ప్రయాణం సాగిస్తున్నాడు. శ్రమకు ఆలోచనతో, సృజనాత్మకతతో, నైపుణ్యం జోడిరచడం ద్వారా మాత్రమే ఇంతటి ముందడుగు సాధించగలిగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలన్నా, నిలబడాలన్నా తప్పకుండా స్కిల్స్‌ ఉండాల్సిందే. ప్రపంచదేశాల్లో ఎక్కడాలేని యువశక్తి మన దేశంలోనే ఉంది. వారికి సరైన నైపుణ్యం కల్పించి, వారి సామర్థ్యాల్ని సద్వినియోగం చేసుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. పదేళ్లుగా కోట్లాది మంది యువత తమ కలల్ని సాకారం చేసుకోలేక, ఉపాధి లేక నిర్వీర్యంగా ఉన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ యువశక్తిని ఉపయోగించుకుంటేనే సాధ్యం. నైపుణ్యాలు గల యువతతోనే ప్రపంచ అభివృద్ధి, శాంతి సాధ్యమవుతుంది.
ఆధునిక పోటీ ప్రపంచంలో సరైన,నైపుణ్యాలు ఉంటేనే కొలువులు దక్కించుకోవడం సాధ్యమవు తుంది.ఆ నైపుణ్యాలను మప్పేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ఆశించిన ప్రయోజనాలను అందించడం లేదు.ప్రస్తుతం యువజనుల నైపుణ్యాల మెరుగుదలకు వృత్తి శిక్షణా,ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌, ఆన్లైన్‌ కోర్సులు,వర్క్‌షాపులు,సెమినార్లు,మెంటార్‌ షిప్‌,వెబ్‌నార్స్‌,సాఫ్ట్‌ స్కిల్స్‌ట్రైనింగ్‌,లాంగ్వేజెస్‌ ట్రైనింగ్‌, కెరియర్‌ కౌన్సెలింగ్‌,జీవన నైపుణ్యాలు,క్రీడలు, సృజనాత్మక సాధనాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, క్రిటికల్‌ థింకింగ్‌ వంటివి వేదికలుగా ఉన్నాయి.అయితే అవి అందరికీ అందుబాటులో లేకపోవడం లేదా వాటి గురించి ఎక్కువ మందికి ముఖ్యంగా యువతకు తెలియకపోవడం, తెలియజేసే పరిస్థితిలో పాలకులు లేకపోవడం మన దురదృష్టకరం.ఇప్పటికే గ్రామాల్లోకి అన్ని సౌకర్యాలు వస్తున్నప్పటికీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా-ఉన్న ఉపాధిని ఊడగొట్టే పరిస్థితి నెలకొంది.గ్రామీణస్థాయి నుంచే బేసిక్‌ స్కిల్స్‌ అభివృద్ధికి ప్రత్యేకకృషి జరగాల్సి ఉంది.ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న విద్యకు,చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయింది.విద్యకు,నైపుణ్యాలకి,ఉపాధికి అంతరాన్ని తగ్గించాలి.చదువుతోపాటు స్కిల్స్‌ నేర్చు కోవడంద్వారా నేటియువతకు బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
నైపుణ్యాలు-పథకాలు
ప్రస్తుతం సాంకేతిక విద్య అన్ని రంగాల్లో కీలకమైంది. యువతలో నైపుణ్యాలు పెంపొందిం చేందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు,అనేక వేదికలు-సంస్థల ద్వారా స్కిల్స్‌ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌యోజన,నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌,స్కిల్‌ ఇండియా మిషన్‌, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన,జమ్మూ కాశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ఉడాన్‌,రోజ్‌ గార్‌ మేళా, క్రాఫ్ట్‌ మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ వంటి పేర్లతో యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెంచడానికి ప్రభుత్వం పూనుకుంది. ఒక్క స్కిల్‌ ఇండియా మిషన్‌ ద్వారా ప్రతి సంవత్సరం కోటిమందికి పైగా స్కిల్స్‌ నేర్చుకొని బయటకు వస్తారని ప్రభుత్వం చెబుతుంది.కానీ అందులో ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయో చెప్పడం లేదు. అంతేకాదు..నాణ్యమైన నైపుణ్యాలు ఇంకా అందుబాటులోకి రావడంలేదు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే అందరికీ స్కిల్‌ నేర్పించడానికి చాలాకాలం పట్టే అవకాశం ఉంది. అక్కడక్కడ కొన్ని ప్రైవేటు సంస్థలు లేదావ్యక్తులు లాభాల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు నిర్వహి స్తున్నారు.అవి అందరికీ అందుబాటులో ఉండడం లేదు.ఫీజులు కూడా భయంకరంగా వసూళ్లు చేస్తుంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడున్న దానికి మూడిరతలు స్కిల్‌డెవలప్‌మెంట్‌ వేదికలను ఏర్పాటు చేయాలి.వాటికి నిధులు ఇవ్వాలి. నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి. అప్పుడుగానీ పరిస్థితి మెరుగుపడదు.నేడు సాధారణ డిగ్రీ చదివిన వారికి ఎటువంటి అవకాశాలు ఉండడం లేదనేది జగమె రిగిన సత్యం. కేవలం డిగ్రీ కాగితాలతో యువత కడుపు నిండదు. నాణ్యమైన శిక్షణా నైపుణ్యాలను మెరుగుపరచడానికి-నాణ్యమైన శిక్షణా కార్యక్ర మాలు ఉండాలి.పరిశ్రమల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి.గ్రామీణ ప్రాంతాల నుండి కూడా యువత ఈ శిక్షణా కార్య క్రమాలకు సులభంగా చేరుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వం మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం,నిధులను కేటాయించడం-నైపుణ్యా భివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం ఒక్కటే మార్గం.
2024 థీమ్‌
చాలా సంవత్సరాలుగా ఉపాధి, ఆర్థిక అసమానత వంటి ప్రపంచ సవాళ్లను యువత ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ‘శాంతి, అభివృద్ధి కోసం యువత కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, స్థిరమైన పురోగతికి ఏజెంట్లుగా యువత ఉండాలి’ అని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.
ప్రపంచ అనుభవం
కొన్ని రంగాల్లో అయితే కచ్చితంగా నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం లేదా ఆరంగంలో ప్రత్యేక శిక్షణ తర్వాతే ఉపాధి వంటి నిబంధనలు కూడా ఉన్నాయి.ఏరంగంలోనైనా బేసిక్‌ స్కిల్స్‌ అనేవి తప్పనిసరి. జర్మనీలో డ్యూయల్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌’ ద్వారా ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు పరిశ్రమల్లో శిక్షణ పొందుతారు.ఇది వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. సింగపూర్‌ స్కిల్స్‌ ఫ్యూచర్‌ వంటి కార్యక్రమాలు నిరంతరం నైపుణ్యా లను మెరుగుపరచే అవకాశాలను కల్పిస్తున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో సైతం 80శాతం నైపుణ్యం కలిగిన వారికే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ రోజు అమెరికా లాంటి దేశాల్లోనూ విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలు మెరుగుదలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. చదువు, దానికి తగ్గ శిక్షణ ఉంటుంది.ఈ రోజు ప్రపంచ దేశాలు అందరికీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో కొందరు యువతకు మాత్రమే నైపుణ్య శిక్షణా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరికొందరు అవగా హన, అవకాశాలు అందుబాటులో లేకపోవ డం వల్ల వెనుకబడుతున్నారు.యువతలో స్కిల్స్‌ పెంచేందుకు మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపట్టాలి.పాఠశాల, కాలేజీ స్థాయిల్లోనే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిం చాలి.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014జూన్‌లో యువజనులకు నైపుణ్య శిక్షణా,ఉద్యోగ అవకా శాలు కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించారు. యువత కు బేసిక్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పించేందుకు ముందుగా ఇంజనీరింగ్‌ కళాశాలలో టెక్నికల్‌ ఎంప్లాయిమెంట్‌ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. తర్వాత డిగ్రీ కళాశాలలో ఆతర్వాత నిరుద్యోగ యువతకు కుట్టు,బ్యూటీపార్లర్‌,టైలరింగ్‌, ఎంబ్ర యిడరీ,ఎలక్ట్రికల్‌, కొలిమి వంటి చేతి వృత్తులలో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తుంది.
ప్రస్తుతం 26నైపుణ్య కళాశాలలు, 192 స్కిల్‌ హబ్‌లు కేంద్రంగా నడుస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 70 శాతంపైన యువత బేసిక్‌ స్కిల్స్‌ రావడం లేదు. ప్రస్తుతం ఇతర పట్టణాలకు వెళ్లి, బతకడానికి ఎక్కువ స్కిల్స్‌ నేర్పుతున్నారు. భవిష్యత్తులో మాత్రం ఎక్కడికక్కడే ఉపాధి అవ కాశాలు కల్పించే స్కిల్స్‌ నేర్పించాలి. గ్రామ స్థాయి నుంచి సొంత భవనంతో పర్మినెంటు ఉద్యోగులచే సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి, నిధులు ఇవ్వాలి. ఇప్పటికే పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు సెజ్‌,నాన్‌సెజ్‌,యస్‌ఈజడ్‌ పేర్లతో తీసుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఐటి, ఫార్మా, వ్యవసాయ,ఎంఎస్‌ఎంఈ ఇండిస్టీస్‌ను అభివృద్ధి చేయాలి.ఈ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకున్న ఎంప్లాయ్మెంట్‌ ఎక్స్ఱెంజ్‌ ఆఫీసును నిరుద్యోగ యువతకు స్కిల్‌ శిక్షణ ఇచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిధు లు కేటాయించి, ఖర్చు చేయాలి. ఈరోజు సాంకే తిక విద్య కీలకమైంది. కాబట్టి ప్రతి కళాశాలలో ఇంటెన్సివ్‌ నిర్వహించాలి.రాష్ట్రంలో 245 ఇంజ నీరింగ్‌ కళాశాలలు ఉన్న కేవలం నాలుగైదు కళా శాలల్లో చదివినవారికి మాత్రమే ఉద్యోగాలు వస్తు న్నాయి.అంటే దానికి కారణం స్కిల్స్‌,దాని అను బంధ ఏక్విమెంట్స్‌ ఉండటమే.మన రాష్ట్రంలో విస్తారంగాఉన్న సహజ వనరులను శుద్ధి చేసుకునే స్కిల్స్‌ అందుబాటులోకి తెచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చు ఎంతో కొంత నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చు.ప్రభుత్వం విద్యా విధానాలను మెరుగుపరచడం, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం చేయాలి. అలాగే పరిశ్రమలతో కలసి శిక్షణా కార్యక్రమాలను రూపొందించ డం, నిధులు కేటాయించడం, యువతను ప్రోత్సహిం చడం వంటివి చేయాలి. నైపుణ్యాభివృద్ధికి కావాల్సి న వనరులు అందుబాటులో ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల అవసరాలను పరిగణన లోకి తీసుకుని అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలి. యువత భవిష్యత్తు కొరకు నైపు ణ్యాలు అత్యంత ముఖ్యమైనవి. మంచి నైపుణ్యాలు ఉన్నప్పుడే వారు సమాజంలో, పరిశ్రమల్లో మంచి స్థాయికి చేరుకుంటారు.ప్రస్తుత పరిస్థితుల్లో, టెక్నాలజీ ప్రగతితో పాటు, అనేక కొత్త నైపుణ్యా లను నేర్చుకోవడం అవసరం. యువతలో ఉన్న నిరుద్యోగాన్ని రూపు మాపడానికి మనరాష్ట్రంలో ఉన్న వనరుల ఆధారం గా చేసుకుని, విద్యార్థులకు ప్రాథమిక దశలోనే స్కిల్స్‌ నేర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం యూత్‌ పాలసీ ప్రకటించాలి.యూత్‌ పాలసీలో విద్య, వ్యవస్థాపకత-ఆవిష్కరణ, నైపుణ్యా భివృద్ధి,ఉపాధి,ఆటలు,సంఘసేవ,సామాజిక న్యా యం,దేశరక్షణ,ఐక్యత,సంక్షేమ పాలన రాజకీయ ప్రోత్సాహం వంటి అంశాలతో కూడిన పాలసీ ప్రకటించాలి.
రంగాల ప్రాధాన్యత
మన దేశంలో ఇప్పటికీ ప్రాథమిక రంగం వ్యవసాయమే. అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయం.కాబట్టి యువ రైతు లకు నూతన వ్యవసాయ పద్ధతులు, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. గ్రామీణ,మండలస్థాయిలో అయినా ఇటువంటి యంత్రాంగం ఏర్పాటు చేయడంద్వారా వ్యవసా యాన్ని లాభసాటి చెయ్యొచ్చు.వ్యవసాయంలో ఇప్ప టికీ పాతకాలపు పద్ధతులే ఉండటం,భూసార పరీ క్షలు,విత్తన పరీక్షలు,భూగర్భజలాలు గురించి, ఎరు వులు గురించి,వాతావరణ మార్పులు గురించి అవ గాహన లేకపోవడం వల్ల-రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు.దాని ఫలితంగా వలసలు వెళ్తున్నారు. రైతులు పండిరచిన ప్రత్తి,వేరుశనగ,టమోటా, ఉల్లి,వరి,మిరప,పండ్లుతోటలు ప్రాసెసింగ్‌ యూ నిట్లు ఏర్పాటు చేసి-శిక్షణ ఇవ్వాలి. స్కిల్స్‌ నేర్పిం చడం,డైరీఫాం,కోళ్ల పరిశ్రమ,చేపల పెంపకం మొదలైన వాటికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. ఇలాంటి చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయాల్సి ఉంది.స్వయంఉపాధిని పెంచాల్సిన అవ సరం ఉంది.ఇందులో ఎటువంటి స్కిల్‌, ట్రై నింగ్‌ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా జరిగే అన ర్థాలు మనం ఇటీవల చూస్తున్నాం. కేవలం లాభా లు కోసం కార్పొరేట్‌ సంస్థలు దారుణాలకి పాల్పడ్డ సంఘ టనలు కోకొల్లలుగా ఉన్నాయి.ఉదాహర ణకు పరిశ్రమలో కార్మికు లకు స్కిల్‌ నేర్పకుండా పని చేయించడంవల్ల ప్రమాదాలు జరగడం. గ్రామాలలో కనీసం విద్యుత్‌పై అవగాహన లేని వారు ఆపరేటర్లుగా,లైన్‌మెన్లుగా ఉంటున్న పరిస్థితి. వారందరికీ వారి వారి రంగంలో స్కిల్స్‌ నేర్పిస్తే మరింత మెరుగైన ఫలితాలు అక్కడ మనం చూడ వచ్చు.పరిశ్రమల్లో స్థానికులకు శిక్షణ ఇవ్వాలి. తద్వారా75శాతం స్థానిక యువతకే అవకాశం ఇవ్వొచ్చు. తృతీయ రంగం -సేవలు రోజు రోజుకు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలలో పెరుగు తున్న అభివృద్ధి. సమాచార రంగం అత్యధిక ఆదా యం వస్తున్నది. యువతకు ముఖ్యంగా స్కిల్‌ఉన్న యువతకు అత్యధిక అవకాశాలు ఈరంగంలో కనిపిస్తు న్నాయి.సమాచారం రంగం ఎంత వేగం గా పెరుగుతున్నా-సరైన స్కిల్స్‌ లేకపోతే అంతే ప్రమాదం జరుగుతుంది.విద్యార్థులకు కనీసం ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించ కుండా పాస్‌ చేస్తు న్నారు.ఇది నైపుణ్యాలు రాకపోవడంతో పాటు వారి భవిష్య త్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ప్రభు త్వంలో నెహ్రూ యువజన కేంద్రాలు నిధులు,సిబ్బంది లేక తీవ్రనిర్లక్ష్యానికి గురయ్యాయి. భారత నిర్మాణ వాలంటీర్లకు స్కిల్స్‌ నేర్పించి, వారి ద్వారా విద్యార్థులకు,నిరుద్యోగులకుబేసిక్‌ స్కిల్స్‌తో ట్రైనింగ్‌ ఇచ్చి-స్టయిఫండ్‌,వసతి సౌకర్యాలు కల్పించాలి.
నైపుణ్యం కలవాడే విజేత
చదువు పూర్తవగానే ఇక మనం నేర్చు కోవాల్సింది ఏం లేదు అని అనుకోవద్దు. నేర్చు కోవడం అనేది నిరంతర ప్రక్రియ,నేటిపోటీ ప్రపం చంలో ఎంత నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా తక్కువే అవుతుంది. జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా పురోభివృద్ధి సాధించాలంటే ఎప్పటిక ప్పుడు మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి,కొత్త నైపు ణ్యాలను నేర్చుకుంటూ ఉండాలి. నైపుణ్యా లను మెరుగుపరచుకోవడానికి మార్గాలను వెతక డం వ్యక్తిగత వృద్ధికి మొదటి మెట్టు. మిమ్మల్ని మీరు నవీకరించుకుంటూ ఉంటే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు,ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవచ్చు, కెరీర్‌లో పురోగతిసాధించవచ్చు.జీవితంలోఉన్నత స్థితికి చేరుకోవచ్చు.నైపుణ్యాల ఎంపిక కూడా చాలా కీలకం. మీరు మీ బలాలు, బలహీ నతల గురించి సరైన అవగాహన కలిగి ఉంటే, మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్న నైపుణ్యాలను ఎంచుకోవడం పై ఆలోచన చేయండి. మీరు మీ బలమైన నైపుణ్యా లపై పనిచేస్తూ వాటిని తదుపరి స్థాయికి తీసుకెళ్లా లనుకుంటున్నారా?లేక,బలహీనంగా ఉన్న నైపు ణ్యాలను సానపెట్టాలనుకుంటున్నారా? లేక కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అనేది నిర్ణయించుకోండి.మీరు ఏనైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలని ఎంచుకున్నా, అది మీరు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి, మీరు మీ లక్ష్యా న్ని సాధించడానికి, మీ కెరీర్‌లో ముందుకు సాగడా నికి సహాయపడేదై ఉండాలి.
ఇతరుల అభిప్రాయాన్ని అడగండి
ఎంచుకున్న నైపుణ్యాలపై మీ అంచనా అంత కచ్చితమైనది కాకపోవచ్చు.కాబట్టి ఈ మార్గంలో మీ సందేహాలు తీర్చడానికి,అపోహ లను తొలగించడానికి మీ స్నేహితులు,కుటుంబ సభ్యులు,సహోద్యోగులతో మాట్లాడండి,వారు ఏ నైపుణ్యాలను మెరుగుపరచాలని సిఫార్సు చేస్తారో అభిప్రాయాన్ని అడగండి
విమర్శలను స్వీకరించండి
పనితీరు బాగాలేదని మీపై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని వ్యక్తిగత దాడిగా తీసుకో కండి,వారికి విరుద్ధంగా ప్రవర్తించకండి. బదులు గా,ఇతరులు వారు చెప్పేది వినండి,దానిపై చర్చిం చండి.ఇతరుల విమర్శలు, సూచనలను తార్కిక దృక్కోణం నుండి విశ్లేషించడానికి ప్రయత్నించండి. అవి సరైన పాయింట్‌ని హైలైట్‌ చేస్తున్నాయో లేదో చూడండి.నిజమేనని భావిస్తే ఆ విమర్శలను స్వీకరించి నైపుణ్యాలను మెరుగు పరుచు కోడానికి సిద్ధంకండి.
నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వండి
నైపుణ్యాలను నేర్చుకోవడమే కాదు, వీటిని సాధన చేయడం కూడా ముఖ్యమే. ఏవస్తు వునైనా ఉప యోగించకుండా ఉంటే అదికొంత కాలానికి తుప్పు పట్టడం,పనిచేయకుండా పోతుం ది.నైపుణ్యం అయినా అంతే, మీరు వాడకుండా ఉంచే నైపుణ్యం సాధనచేయకపోతే కొంతకా లానికి నిరుపయోగంగా మారుతుంది.అప్పుడు నేర్చుకుని కూడా లాభం లేదు. కాబట్టి మీరు ఏదైనా ఒక నిర్దిష్ట నైపుణ్యంలో నైపుణ్యం సాధించాలను కుంటే, నిరంతరం శిక్షణ పొందాలి.
వ్యాసకర్త:-,డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి- (గుమ్మల రామన్న)

పంచాయితీలకు పునరుజ్జీవం

పంచాయితీలకు పునరుజ్జీవం కల్పించేం దుకు ఓ ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ్పభుత్వం ముందడుగు వేసింది ఆగస్టు 23న ప్రపధమంగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో భాగం గా రూ.4,500 కోట్లతో 87రకాల పనులను గ్రామాల్లో చేయించ డానికి ఉపక్రమించారు. పంచా యితీరాజ్‌ సంస్కరణల్లో భాగంగా పంచాయి తీలకు ఇచ్చే సొమ్ము ను రూ.10వేలకు,మేజర్‌ పంచాయితీలకు ఇచ్చే సొమ్మును రూ.25వేలకు పెంచినట్లు రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ,గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో ఆగస్తు23 నుంచి ప్రత్యేక కార్య కమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ‘గ్రామ సభలు’ ప్రారంభించారు. మైసూరువారిపల్లెలో నిర్వ హించిన గ్రామ సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంపై రాష్ట్రస్థా యి గ్రామ సభ నిర్వహించారు.
గ్రామాలు పచ్చగా ఉంటేనే: అన్నం పెట్టే రైతు బాగుంటే…అన్నీ బాగుంటాయి..గ్రామాలు పచ్చగా…ఉంటే మన మంతా హాయిగా..ఉంటామని పవన్‌కల్యాణ్‌ అన్నా రు.పార్టీకోసం పనిచేసేందుకు ముందు కొచ్చే వారి ని తాను వదలుకోనని, మనుషులను కలుపు కొనే వ్యక్తినని,విడగొట్టేవాణ్ని కాదని తెలిపారు. గ్రామా భివృద్ధికి ఏంచేయాలన్నఅంశంలో గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభు త్వం పంచా యతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీరాజ్‌వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్య లుచేపడుతున్నామన్నపవన్‌,13వేల 326 పంచా యతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని అభిప్రాయపడ్డారు. ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విజన్‌: గత ప్రభు త్వంలో రోడ్లపై రావడానికి కూడా భయపడేవారని, అనుభవం ఉన్న నాయకులు కూడా భయపడే పరిస్థితి తెచ్చారని పవన్‌ మండిపడ్డారు.భర్త ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మైసూరు వారిపల్లె సర్పంచ్‌గా సంయుక్త నిలబడి గెలిచారని ప్రశంసించారు. కారుమంచి సంయుక్త పట్టుదల చూసి నాకు చాలా ఆనందం కలిగిందన్న పవన్‌, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామన్నారు.ఉన్న నిధులను కూడా దారి మళ్లించిన పరిస్థితి గతంలో చూశామని, గ్రామా లకు ఏం కావాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌ అబి óవృద్ధి,స్వర్ణగ్రామాలు చేసుకోవాలనేదే తమ లక్ష్య మన్న పవన్‌,ఒకరి అనుభవం,ఇంకొకరి సంక ల్పం,మరొకరి విజన్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాల్లో కళాశాలలు,క్రీడా మైదా నాలు కూడా లేని పరిస్థితి ఉందని, ప్రభుత్వ భూములుంటే నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వపరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే అవుతుందని,దాతలు ముందుకొస్తే తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పా టు చేస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి వలసలు నివారించి, ఉపాధి అవకాశాలు పెంచు తామన్నారు.వలసలు ఆగడానికి స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ వర్సిటీ తీసుకొస్తామన్న పవన్‌, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరం నాయకులు తయారుకా వడానికి పంచాయతీలే పట్టుగొమ్మలని, పంచాయ తీల నుంచి కొత్త నాయకులు రావాలని పిలుపు నిచ్చారు. యువత, మహిళలు కల్పించుకుంటే తప్ప గ్రామపంచాయతీలు మారవన్నారు.
లక్ష్యం ఇదీ..
ఎన్నికలప్రచార సమయంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకివస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం.దాని ప్రకారమే పంచాయతీలు సుసం పన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామ’ని ఉప ముఖ్య మంత్రివర్యులుకొణిదల పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామపంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి,గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయ నున్నారని తెలియజేశారు.మహాత్మా గాంధీ జాతీ య ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ. 4,500కోట్లనిధులతో,87రకాల పనులను గ్రామా ల్లో చేయనున్నామన్నారు.దీనిద్వారా మొత్తం 9కోట్ల పనిదినాలు,54లక్షలకుటుంబాలకు ఉపాధి కల్పిం చే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొ న్నారు. దేశంలో ఎన్నడూ లేనట్లుగా పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల సంయుక్త ఆధ్వర్యం లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చి చేందుకు మొత్తం 13, 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను ఆగస్టు 23న ప్రారంభించారు.‘‘దేశంలోనే పంచాయతీ వ్యవస్థను మొదలు పెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌.73వరాజ్యాంగ సవరణ ద్వారా పంచాయ తీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశా బ్దాలు దాటింది.రెండో తరం సంస్కరణలతో పంచాయతీల నలుదిశల విప్లవం మన రాష్ట్రం నుంచే ఇప్పుడు మొదలు పెడుతున్నాం. గత మూడు దశాబ్దాలుగా పంచాయతీ లకు జాతీయ పండుగల నిర్వహణకు మైనర్‌ పంచాయతీలకు రూ.100, మేజర్‌ పంచాయతీలకు రూ.250ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్క రణల్లో భాగంగా మైనర్‌ పంచాయతీలకు రూ.10వేలు,మేజర్‌ పంచా యతీలకు రూ.25వేలు నిధులను పెంచి పంచాయతీలకు అండగా ఉం టామని భరోసాను ఇచ్చాం.
మన గ్రామాన్ని మనమే పరిపాలించుకుందాం
పంచాయతీ సంస్కరణలు కొన సాగిం పులో భాగంగా గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణ యాలు తీసుకునేలా నిర్వహిస్తాం. మన గ్రామా లను మనమే పరిపాలించుకుందాం అనేలా వీటి నిర్వహణ ఉంటుంది.భారతదేశపు మూలాలు, జీవం పల్లెల్లోనే ఉంటుం దని మహాత్మా గాంధీ చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సంకల్పంతో,ముఖ్యమంత్రి చ్రంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రపంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకు నేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పంచాయ తీలకు ఉండే అధికారాలను గ్రామాలఅభివృద్ధికి ఉప యేపడేలా చేసి…పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ కంలో భాగంగా గత ప్రభుత్వంలో 2019-2023 సంవత్సరం వరకు రూ.40,579కోట్లు నిధులు వచ్చాయి.ఈ పనుల పూర్తిస్థాయి ఫలితాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. గ్రామీ ణాభివృద్ది కోసం ఈనిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి.కానీ గత ప్రభు త్వంలో ఈ నిధులను ఇష్టానుసారం ఖర్చు చేశారు. కరోనా సమయంలో ఈనిధులను ఇష్టానికి వాడు కున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో పంచా యతీల ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపో యింది.2014-19వరకు రాష్ట్రవ్యాప్తంగా పంచా యతీల ఆదాయం రూ.240కోట్లు ఉంటే,2019 `23 సంవత్సరాల్లో ఆ ఆదాయం గణనీయంగా తగ్గి కేవలం రూ.170కోట్లే వచ్చింది.క్షేత్రస్థా యిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభు త్వ విధానాలే కారణం. కూటమి ప్రభుత్వం పంచా యతీలకు సర్వ స్వతంత్రత తీసుకురావాలనే సంక ల్పంతో పని చేస్తోంది. పంచాయతీలు వాటి కాళ్ల మీద అవే నిలబడి స్వయం సమృద్ధి సాధించేలా తయారు చేయాలనే పట్టుదలతో ఉన్నాం. పంచా యతీలకు సంబంధించిన విద్యుత్తును అవే ఉత్పత్తి చేసుకునేలా,వాటి ఆదాయం అవే సంపాదించు కునేలా తయారు చేస్తాం.రాష్ట్రాభివృద్ధిలోనే కాకుం డా దేశాభివృద్ధిలోనూరాష్ట్ర పంచాయతీలు కీలకం గా వ్యవహరించేలా తయారు చేస్తాం.
పంచాయతీల ప్రత్యేకతను గుర్తించి ఆదాయం సృష్టిస్తాం.
రాష్ట్రంలోని గొప్పదనం ఏమిటంటే ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కళలు, ఆహార పదార్ధాల తయారీ, వస్త్రాల తయారీ, ఇతర కళాకృతుల తయారీ వంటి వాటికి మన గ్రామాలు ప్రత్యేకం. విశాఖపట్నం జిల్లాలో ఆనందపురంలో పూలు ప్రసిద్ధి. అరకులో అరకు కాఫీకు ప్రత్యేకత ఉంది. మంగళగిరి చీరలు, సత్యసాయి జిల్లాలో లేపాక్షి, బాపట్లలో వేటపాలెం గ్రామం, కృష్ణాజిల్లా లో చిలకలపూడి, కొండపల్లి హస్త కళలకి ప్రసిద్ధి. ఇలాంటివి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వాటి ప్రత్యేకత లను గ్రామ సభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నాం. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగు మతులు చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషి స్తాం. గ్రామసభలకు యువత, మహిళలు విరివిగా పాల్గొవాలి. పంచాయతీల్లో మహిళలు ఎక్కువగా పాల్గొవాలని కోరుకుంటున్నాను.
పంచాయతీల ఆదాయం పెంచేలా సామాజిక అడ వుల పెంపకం
పంచాయతీల్లో చాలా భూమి నిరు పయోగంగా ఉంటోంది.దాన్ని క్రమపద్ధతిలో విని యోగించుకోవాలి.స్వచ్ఛభారత్‌ను మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీల్లో ఓప్రణాళిక ప్రకా రం ఎక్కడా చెత్త లేకుండా క్లీన్‌,గ్రీన్‌ గ్రామాలుగా తయారు చేసేలా దృష్టిపెడుతున్నాం.డెన్మార్క్‌ అనే చిన్నదేశం నుంచి కలపను మన దేశం అధికంగా దిగుమతి చేసుకుంటోంది.రూ.6వేల కోట్ల విలువైన కలపను ఏటా దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత మొత్తం విదేశీ మారక ద్రవ్యం కేవలం కలప కోసం ఇంత వెచ్చిస్తున్నాం.గ్రామ పంచాయతీలకు సం బంధించి వృథాగా ఉన్న స్థలంలో సామాజిక అడవి విభాగంలో కలపను పెంచాలని భావిస్తు న్నాం. దీని ద్వారా పంచాయతీల ఆదాయం గణనీయం గా పెరుగుతుంది. నరేగా పనులను అటవీ శాఖకు అనసంధానం ఉంది. మూగ జీవాలకు నీటి వసతి కల్పించేలా గుంతలను తవ్వడం వంటి వాటికి ఉపయోగిస్తాం.గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రత్యేకతలను తిలకించేలా పర్యాటకులను ప్రొత్సహిస్తాం.
గత ప్రభుత్వంలో సోషల్‌ ఆడిట్‌ బలహీనం చేశారు
గత ప్రభుత్వంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు,ఉపాధి పనుల్లోచాలా అవకతవకలు జరిగా యి.జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం పనులకు పైపు లైన్లు వేసి వదిలేశారు. వాటికి కనెక్షన్‌ ఇవ్వలేదు. మరోపక్క పైపులైన్ల కోసంతవ్విన పనులు ఉపాధి హామీ పథకంలో చేశారు. అసలు ఏ పనులు దేనికి చేశారో గ్రామ సర్పంచులకు తెలియదు. మస్తర్‌ బుక్‌లో సంతకాలు పెట్టించుకోవడం తప్పితే, సర్పంచులకు ఏపనులు ఎక్కడ చేశారన్న వివరాలు చెప్పలేదు.దీనిలో బోలెడు అవకతవకలు జరిగా యి.నిధుల దుర్వినియోగం దారుణంగా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పనులను పర్యవేక్షిం చాల్సిన,నిధుల దుర్వినియోగం అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పని చేయ లేదు. సామాజిక తనిఖీ విభాగానికి కూడా పోలీస్‌ అధికారిని హెడ్‌గా పెట్టాలని ఆలోచిస్తున్నాం. దీనిపై అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకుం టాం. గత ప్రభుత్వంలో సోషల్‌ ఆడిట్‌ విభాగం బాధ్యుడిని తప్పించాము. రకరకాల అభియోగాలు వచ్చిన అధికారులను పక్కన పెట్టాం. నిఘా విభాగంపై నిఘా పెట్టాల్సి వచ్చింది. పంచాయతీ ల్లో సిటిజన్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డులు ఉండాలి. దాన్ని ప్రతి పంచాయతీల్లో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వంలో పెండిరగ్‌ లో ఉండిపోయిన రూ.2 వేల కోట్ల నిధులను కూటమి ప్రభుత్వంలో విడుదల చేశాం. మెటీరియల్‌ కంపో నెంట్‌ గ్రాంట్‌ ను త్వరలోనే ఇస్తాం.
నీటి పునర్వినియోగంపై దృష్టి
నీటి కోసం గ్రామాల్లో బోర్లు హద్దులు దాటి వేస్తున్నారు.దీనివల్ల ఫ్లోరైడ్‌ ఎక్కువగా పడు తోంది. భూమి పొరలను దాటి నీటి కోసం లోతు లకు వెళ్తున్న కొద్దీ ఫ్లోరైడ్‌ వస్తోంది. నీటిని పునర్వి నియోగంపై దృష్టి సారించాలి. అప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయి. తక్కువ దూరంలోనే నీళ్లులభిస్తాయి.ప్రస్తుతం గ్రామాల్లో పల్స్‌ సర్వే చేస్తు న్నాం.పంచాయతీల్లో నీటి పరిస్థితిపై 16 అంశా లతో సర్వే నిర్వహిస్తున్నాం.22 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయింది. ఇది రాష్ట్రం మొత్తం మీద పూర్త యితే అన్ని పంచాయతీల్లో ఉన్న వాటర్‌ సోర్సు మీద ఓస్పష్టత వస్తుంది.అప్పుడు ఓప్రణాళిక ప్రకా రం నీటి సమస్యను తీర్చేందుకు ముందుకు వెళ్తాం.
విశాఖలో పరిశ్రమల కాలుష్యం మీద నిఘా పెడతాం
అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. వరుసగా పరిశ్ర మల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగి స్తున్నాయి.ఎసెన్షియా ఫాక్టరీలో రక్షణ చర్యలు చేపట్టడంలో ఆపరిశ్రమలకు చెందిన ఇద్దరు యజ మానుల మధ్యఉన్న వ్యక్తిగత గొడవలు కూడా ఓ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్‌ చేయడం మీద దృష్టి పెడతాం.సేఫ్టీ ఆడిట్‌ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలతో ఒకసారి కూర్చొని మాట్లాడదామని, తీసుకుంటున్న రక్షణ చర్యలు వివరించాలని కోరుతాను. ఇప్పటికే హిందూస్తాన్‌ షిపింగ్‌ యార్డు వారితో ఒకసారి మాట్లాడాను. మీరు తీసుకుంటున్న రక్షణ చర్యలు చెప్పాలని కోరితే, వారు బాగానే తీసుకుంటున్నాం అని చెబుతున్నారు కానీ పూర్తి భద్రత ఇవ్వాలనేది ప్రాథమిక బాధ్యత.సేఫ్టీ ఆడిట్‌ ను కఠినంగా అమ లు చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని, వారు ముందుకు రారని చెబుతున్నారు.అయితే పరిశ్ర మలు కచ్చితంగా అక్కడి పనిచేసే వారికి కనీస రక్షణ పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమ ల్లో రక్షణ అంశం మీద నేనే ప్రత్యేకంగా దృష్టి పెడతాను.ఈ నెల చివర్లో విశాఖపట్నంలో ప్రత్యే కంగా దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో రోజురోజుకీ కాలు ష్యం పెరుగుతోంది.దీన్ని అరికట్టడంపై దృష్టి పెడ తాం.పరిశ్రమల కాలుష్యం మీద నిరంతర నిఘా ఉండేలా,ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూడాలి’’అన్నారు.
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు – ప్రతీ పేదకు సొంత ఇల్లు : సీఎం చంద్రబాబు
మన గ్రామంలో ఏం చేసుకోవాలి.. ఏ పనులు పూర్తి కావాలి..ఎలా పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకోవాలి? అనే ఆలోచన ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి ఉండాలి.గ్రామసభల్లో గ్రామానికి అవసరం అయ్యే పనుల మీద గ్రామస్తులంతా సమగ్రంగా చర్చిం చాలి.అంతా ఒక్కటిగా తీర్మానాలు చేసుకొని గ్రామ అభివృద్ధిని, ప్రగతికి ముందుకు నడిపించే చైతన్యం ఉన్నప్పుడే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధిని సాధి స్తాయి.స్వర్ణ పంచాయతీలుగా మారి సంపన్న ఆర్థిక,అభివృద్ధి ప్రగతి సాధించేలా పటిష్టమైన ప్రణాళికను గ్రామస్తులే రూపొందించుకోవలసిన అవసరం ఉంది.గ్రామ పంచాయతీ మొదటి పౌరు డు అయిన సర్పంచులకు విశిష్టమైన శక్తి, అధికా రాలు ఉన్నాయని,దానిని సరైన రీతిలో ఉపయోగిం చుకుంటే ప్రతి గ్రామం రాలేగావ్‌ సిద్ధిగా మారు తుంది.ఇంట్లో ఆడపిల్ల చదివితే ఆ ఇంటికి వెలుగు అంటారు. అదే ఆడ పిల్ల చదివితే దేశానికి కూడా వెలుగు. పంచాయతీల నుంచే భారతదేశ రాష్ట్రప తిగా ఎదిగిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ప్రస్థా నం ఎంతో స్ఫూర్తిదాయకంమని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో సీఎం పర్యటించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఉమ్మడి తూ.గో.జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు.ఈక్రమంలో సీఎం వానపల్లి లోని పళ్లాలమ్మ అమ్మవారిని దర్శించు కున్న అనం తరం వానపల్లి గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయ తీల్లో ‘గ్రామ సభలు’ పెట్టామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది నరేగా కింద రూ.4,500కోట్ల పనులకు అను మతి తీసుకున్నామని నరేగా కింద వంద రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది 84లక్షల కుటుంబా లకు పని దొరుకుతుందని సీఎం తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నాకు.2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగమని సీఎం చంద్రబాబు తెలిపారు.గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహి ళలు ఇబ్బంది పడ్డారని వైఎస్సార్‌ సీపీ సభ లకు వెళ్లినవారు బయటకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టా రని మండిపడ్డారు.గ్రామాభివృద్ధిలో సర్పంచి పాత్ర కీలకమని సీఎం తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వంలో నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని అన్నారు. 2014-19మధ్య 27,444కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు వేస్తామని సీఎంచంద్రబాబు హామీ ఇచ్చారు.గ్రామాల్లోని పేద లకు ఇళ్లుకట్టించే బాధ్యత ప్రభు త్వంతీసు కుంటుం దని తెలిపారు. ఇళ్లకు విద్యుత్‌, సురక్షిత తాగునీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.నిరుద్యోగ యువ తకు ఉపాధి ఎలా కల్పించాలనే ఎప్పుడూ ఆలోచిస్తు న్నానని ఇంతా16వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టు లు భర్తీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరిం చారు.గత ఐదేళ్లలో ఉద్యోగులు, పింఛనుదారులకు జీతం సరిగా వచ్చేది కాదు. పేదవాడికి రూ.15కే మూడుపూటలా భోజనం పెడుతున్నాం. నైపుణ్యం ఉంటేనే యువత ఆదాయం పెరుగుతుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.-జిఎన్‌వి సతీష్‌

ప్రాధమిక హక్కులకు భంగం కలిగితే..!

నేటి సమాజంలో అధికారులు, ప్రభుత్వ కార్యాల యాలు, చట్టబద్దమైన వ్యక్తులు వారి విధులు, దేశ పౌరులు చేసే చర్యలు లేదా పలు అంశాలు చట్టానికి లోబడే ఉండాలి.లేని పక్షంలో చట్టపరమైన సంస్థలు, న్యాయస్థానాల నుంచి పలు రకాలైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశ ప్రజలు సుభిక్షంగా,స్వేచ్ఛగా బ్రతికేందుకు, నివసిం చేందుకు కొన్ని ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం మనకు ప్రసాదించింది. అటువంటి మన ప్రాథమిక హక్కులకు ఎవరైనా…భంగం వాటిల్లే విధంగా చేస్తే వారిపై మనం హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో ఈ రిట్‌ పిటిషన్‌ వేసి తద్వారా మన ప్రాథమిక హక్కులను కాపాడుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో చాలామంది ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినా…ఎలా రక్షణ పొందాలో తెలియదు. ఒకవేళ తెలిసినా పెద్దవారితో పెట్టుకుంటే ఏమవుతుందో అన్న సందేహం ఉంటుంది. కానీ మిత్రులారా మనం ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే… సమాజంలో వ్యక్తిగత అంతస్తుల్లో, పేద,గొప్ప, వీరు అధికారులు,వీరు పెద్దవారు,వారు చిన్న వారు అనే తేడాలు ఉంటుంది.ఇది సహజం. కానీ మనం నీతిగా,నిజాయితీగా ఉండి, మన తప్పు లేకుండా…వేరే వారు సో కాల్డ్‌ పెద్ద వారు మన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే..ఈ రిట్‌ పిటిషన్‌ను వారిపై హై కోర్టులో లేదా కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టులో వేసి చూడండి.తప్పు చేసిన వాడు బెంజ్‌ కారులో తిరిగేవాడు అయినా… సరే, ఒక్క సారి కోర్టు మెట్లెక్కితే,గెంజి తాగే నీతో పాటు సమానంగా కోర్టు హాల్లో న్యాయ మూర్తి ముందు నేలపైనే నిలబడాలి. తప్పు చేసిన వాడు బోయింగ్‌ విమానాల్లో తిరిగే పెద్దమనిషి అయినా సరే…కోర్టులో న్యాయ మూర్తి ముందు చేతులు కట్టుకొని నిలబ డాల్సిందే.ఇదే న్యాయానికి,చట్టానికి ఉన్న పవర్‌. న్యాయం,చట్టం ముందు అందరూ.. సమానులే. కాబట్టి ‘‘పవర్‌ కమ్స్‌ ఫ్రమ్‌ సిన్సియారిటి’’ అనే వాక్యాన్ని మనం మరువ కూడదు.మన బలం,బలగం నిజాయితీయే అయి ఉండాలి.మనం ఏ తప్పూ చేసి ఉండ కూడదు.
ఇక రిట్‌ అంటే తెలుసుకుందాం.
భారతదేశ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు వాటి న్యాయపరమైన అధికారంతో జారీ చేసే అధికారిక వ్రాతపూర్వక ఉత్తర్వు అని అర్థం. రిట్‌ అనేది ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు లేదా న్యాయస్థానాలకు, ప్రభుత్వ అధికారులకు ఓఅంశంపై చర్య తీసుకోమని లేదా కార్యకలాపాలు చేయకుండా ఆపమని ఆదేశించడం. మొత్తం భారతదేశ న్యాయ వ్యవస్థలోమొత్తం ఐదు రకాల రిట్‌లు ఉన్నాయి: 1) హెబియస్‌ కార్పస్‌, 2) మాండమస్‌, 3)క్వో-వారంటో,4) సెర్టియోరారి, 5) ప్రొహిబిషన్‌ (నిషేదం). భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే,పరి రక్షించేందుకు ఈరిట్‌ పిటిషన్‌ను హైకోర్టులో గాని,సుప్రీం కోర్టులో గాని పౌరులు దాఖలు చేయవచ్చు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు ద్వారా,భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టు ద్వారా రిట్‌లు (ఆదేశాలు) జారీ చేయబడతాయి.భారత రాజ్యాంగంలోని పార్ట్‌ (ఆర్టికల్‌12-35)లో పొందుపరచబడిన ప్రాథ మిక హక్కులు పౌర స్వేచ్ఛలకు హామీ ఇస్తున్నా యి.భారతీయు లందరూ భారతదేశ పౌరులుగా శాంతి,సామ రస్యంతో తమ జీవితాలను గడప వచ్చు.ఈరకంగా రాజ్యాంగం మనకు కల్పిం చిన హక్కులను‘ప్రాథమిక హక్కులు’అని పిలు స్తారు.ఇంతకు మునుపు మొత్తం ఏడు ప్రాథ మిక హక్కులు ఉండేవి వీటినుంచి 1978లో 44వ సవరణద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడిరది. చట్టబద్ధ మైన హక్కుగా ఆస్తిహక్కు మార్పు చెందింది.కాబట్టి ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులుఉన్నాయి.

  1. సమానత్వ హక్కు (ఆర్టికల్‌ 4-18)
  2. స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్‌19-22)
  3. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు (ఆర్టికల్‌ 23-24)
  4. మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్‌ 25-28)
  5. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు (ఆర్టికల్‌ 29-30)
  6. రాజ్యాంగ పరిష్కారాల హక్కు (ఆర్టికల్‌ 32-35) ఉన్నాయి.
    ప్రాథమిక హక్కులకు బంగంకలిగితే భారత రాజ్యాంగం,ఆర్టికల్‌ 32 మరియు 226 ప్రకా రం,ఏవ్యక్తి అయినా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ను ఆశ్రయించే హక్కును కలిగి ఉన్నాడు.
    1) హెబియస్‌ కార్పస్‌ :
    ‘హెబియస్‌ కార్పస్‌’అంటే చట్టవిరుద్ధంగా అరెస్టు చేయబడిన,నిర్బంధించబడిన లేదా ఖైదు చేయబడిన వ్యక్తిని విడుదల చేయడానికి ఈ రిట్‌ ఉపయోగించబడుతుంది.ఈహెబియస్‌ కార్పస్‌ రిట్‌ కారణంగా,అలా నిర్బంధించ బడిన వ్యక్తిని అతని నిర్బంధం చట్ట బద్ధతను పరిశీలించడానికి కోర్టులో హాజరుపరిచమని పోలీసులను కోర్టు నిర్దేశిస్తుంది.అరెస్టు చట్ట విరుద్ధమని కోర్టు భావిస్తే, ఆవ్యక్తిని వెంటనే విడుదల చేయాలని అదేశిస్తుంది.ఉదాహరణ: ఓవ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన 24 గంటల లోపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి. కానీ హాజరు పరచలేదు అప్పుడు ఆ అరెస్టయి న వ్యక్తికి సంబంధించిన వారు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను,నిర్బంధంలో ఉన్న వ్యక్తి స్వయంగా లేదా అతని తరపున బంధు వులు లేదా స్నేహితులు దాఖలు చేయవచ్చు. ఇది ప్రభుత్వ అధికారులు మరియు వ్యక్తులు ఇద్దరికీ వ్యతిరేకంగా జారీ చేయబడుతుంది.
    2)మాండమస్‌ రిట్‌ : దిగువ కోర్టులు,ట్రిబ్యునల్‌,ఫోరమ్‌ లేదా ఏదైనా పబ్లిక్‌ అథారిటీని తమ విధిని సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనా లేదా పూర్తి చేయని ఏదైనా చర్యను చేయమని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించదానికి ఉపయోగ పడును. ప్రభుత్వ అధికారి చట్టంప్రకారం నిర్వహించాల్సిన బాధ్యత చేయకుండా పౌరులను ఇబ్బంది పెడితే, మాండమస్‌ రిట్‌ పిటిషన్‌ వేయొచ్చు.ఉదాహరణ: ఒక ఎమ్మార్వో ఆఫీసులో పౌరులకు చట్టప్రకారం జరగాల్సిన ఏదైనా పనిని జరగకుండా చేయుట,ఆ ప్రభు త్వ అధికారి తన విధులను సక్రమంగా చేయ కుండా పౌరులను ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉన్నప్పుడు ఈ పిటిషన్‌ వేయొచ్చు.ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది.
    3) క్వో వారంటో రిట్‌ : క్వో-వారంటో రిట్‌ ఒకవ్యక్తి తనకు అర్హత లేక పోయినా ప్రభుత్వ కార్యాలయంలో నియమించ బడడం. అర్హత లేకపోయినా అధికారిగా చలా మణి అవడం.ఈ పరిస్థితుల్లో అర్హత లేని అతను ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించ కుండా నిరోధించడానికి ఈరిట్‌ జారీ చేయ బడును.‘క్వోవారంటో’అంటే ‘ఏవారెంట్‌ ద్వారా’ అని అర్థం.ఈ రిట్‌ ద్వారా,ప్రభుత్వ కార్యాల యాన్ని కలిగిఉన్న వ్యక్తి ఆపదవిని ఏ అధికా రం క్రింద కలిగిఉన్నారో చూపించమని కోర్టు ఆదేశిస్తుంది.ఆ పదవిని నిర్వహించేందుకు వ్యక్తికి అర్హత లేదని తేలితే,అతన్ని దాని నుండి తొలగించవచ్చు.దీని లక్ష్యం ఏమిటంటే,ఒక వ్యక్తి తనకు అర్హత లేని పదవిని నిర్వహించ కుండా నిరోధించడం,ఇది ప్రైవేట్‌ కార్యాల యానికి వర్తించదు.ఉదాహరణ: ఏదైనా ప్రభుత్వకార్యాలయంలో అర్హతలేని అధికారి ఉద్యోగం పొంది విధులు నిర్వహిస్తే,అది గమనించిన ఏవ్యక్తి అయినా ఈక్వో వారంటో రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో వేయొచ్చు.
    4) రిట్‌ ఆఫ్‌ సెర్టియోరారి :
    ‘సెర్టియోరారి’ అంటే ‘ధృవీకరణ’ఒక నివారణ వ్రాత.దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్‌ తన అధికా రాలకు మించిన ఉత్తర్వును జారీ చేసిందని లేదా చట్ట తప్పిదానికి పాల్పడిరదని హైకోర్టు లేదా సుప్రీం కోర్టు అభిప్రాయపడినప్పుడు , క్రింది కోర్టులకు సర్టియోరి రిట్‌ జారీ చేయ బడుతుంది.ఈరిట్‌ దిగువ కోర్టులు, ట్రిబ్యు నల్‌లు లేదా ఫోరమ్‌లు కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు,ఫైల్‌లు,సంబంధిత పత్రాలను తదుపరి సమీక్ష కోసం ఉన్నత న్యాయస్థానా లకు అందించాలని లేదా అవసరమైతే వాటిని రద్దు చేయాలని ఆదేశిసిస్తుంది.ఉదాహరణ: ఒక సబార్డినేట్‌ కోర్టు అధికార పరిధి లేకుండా లేదా దాని ఉనికిలో లేని తీర్పులు ఇవ్వడం లేదా క్రింది స్థాయి న్యాయస్థానం అధికార పరిధిని అధిగమించడం లేదా అధిగమించడం ద్వారా తన అధికార పరిధిని మించి వ్యవహ రించినప్పుడు,లేదా ఒకసబార్డినేట్‌ కోర్టు చట్టం లేదా విధివిధానాల నియమాలను విస్మరించి నప్పుడు,లేదా ఒక సబార్డినేట్‌ కోర్టు సహజ న్యాయం యొక్క సూత్రాలను ఉల్లంఘించి నప్పుడు సర్టియోరరీ పిటిషన్‌ ద్వారాక్రింది కోర్టులకు చట్టబద్ధంగా నడచుకొనుటకు ఉత్తర్వులు ఇస్తుంది.
    5) రిట్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ (నిషేదం): దిగువ కోర్టులు, ట్రిబ్యునల్‌లు లేదా ఫోరమ్‌లు తమకు అధికార పరిధి లేని కేసు విచారణను నిషేధించాలని సుప్రీం కోర్టులు లేదా హైకోర్టు ల ద్వారా ఈ రిట్‌ జారీ చేయబదుతుంది. దిగువ కోర్టులు,ట్రిబ్యునల్‌లు,ఇతర పాక్షిక-న్యాయ అధికారులు తమ అధికారానికి మించి ఏదైనా చేయకుండా నిషేధించడానికి కోర్టు ద్వారా నిషేధం యొక్క రిట్‌ జారీ చేయ బడిరది.ఇది డైరెక్ట్‌ ఇనాక్టివిటీకి జారీ చేయ బడుతుంది. మరియు ఆ విధంగా కార్యాచ రణను నిర్దేశించే మాండమస్‌ నుండి భిన్నంగా ఉంటుంది.దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్‌ అధికార పరిధి లేకుండా లేదా పరిదికి మించి లేదా సహజ న్యాయ నిబంధ నలను ఉల్లంఘించినప్పుడు లేదా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఇది జారీ చేయబడుతుంది.దిగువ న్యాయ స్థానం లేదా ట్రిబ్యునల్‌ స్వయంగా అల్ట్రా వైర్‌ అయిన చట్టం ప్రకారం పనిచేసినప్పుడు కూడా ఇది జారీ చేయబడుతుంది.
    ఎవరు రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చు
    రాష్ట్రంచే పౌరుల ప్రాథమిక హక్కులకు బంగం వాటిల్లితే ఏ వ్యక్తి అయినా రిట్‌ పిటిషన్‌ దాఖ లు చేయవచ్చు.అందువల్ల, ప్రభుత్వ అధికా రులు,ప్రభుత్వ సంస్థలు,రాష్ట్రానికి వ్యతిరేకంగా తమ హక్కులను అమలు చేయడానికి లేదా రక్షించడానికి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసే హక్కు ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. ఈ పిటిషన్లు వెయ్యడానికి ముందుగా వారి రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళాలి ఆ తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అయితే కొన్ని సందర్భాల్లో నేరుగా సుప్రీంకోర్టు లో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే,ముందుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదో పిటిష నర్‌ వివరించాలి.
    రిట్‌ పిటిషన్‌ ఎక్కడ దాఖలు చేయవచ్చు?
    ఆర్టికల్‌ 32ప్రకారం,సుప్రీంకోర్టులో రిట్‌ పిటి షన్‌ దాఖలు చేయవచ్చు.పిటిషనర్‌ తన ప్రాథ మిక హక్కును ఉల్లంఘించినట్లు రుజువు చేయ గలిగితే మాత్రమే సుప్రీం కోర్టు రిట్‌ జారీ చేయగలదు. ప్రాథమిక హక్కు ఉల్లంఘన విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు రాజ్యాంగంలోని పార్ట్‌లో ఉన్నందున అది ప్రాథమిక హక్కు అని గమనించడం ముఖ్యం. ఆర్టికల్‌ 226 ప్రకారం,ఏదైనాహైకోర్టు ముందు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయవచ్చు. ఒకవేళ రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించినట్లయితే ఆర్టికల్‌ 32ని సస్పెండ్‌ చేయవచ్చు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ ఆర్టికల్‌ 226ని సస్పెండ్‌ చేయడం కుదరదు.ఆర్టికల్‌ 32 మరియు 226 రెండూ భారత రాజ్యాంగం కింద అందించిన ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి మార్గాలను అందిస్తాయి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన ఏ వ్యక్తి అయినా సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో రిట్‌ దాఖలు చేయవచ్చును.
    కాబట్టి నేడు చాలా అంశాలు కుటుంబ పంచా యితీలు, గ్రామపెద్దల,కులపెద్దల పంచాయి తీలు దాటుకొని చివరకు తగిన న్యాయంకోసం కేసుల ద్వారా కోర్టులకు చేరుకోవడం గమని స్తున్నాం.ఈ కాలానికి అనుగుణంగా అందరూ చట్టాన్ని తెలుసుకోవడం విధిగా భావించి దేశం లో సుభిక్షంగా,సంతోషంగా జీవించాలని కోరుకుందాం!
    వ్యాసకర్త : ఫ్రీ లీగల్‌ అవేర్నెస్‌ పర్సన్‌- (చెన్నా ప్రమోదిని)

డోలీ మొత తీరని వ్యధ

ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని గిరిజనుల తలరాత.. మహిళకు పురిటి నొప్పులు.. డోలీలో తీసుకెళ్తుండగా మధ్యలోనే ప్రసవం స్వాతంత్య్రం వచ్చిన ఎన్ని ఏళ్ళు అయినా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా కష్టాలు మాత్రం తీరడం లేదు.. అంబరాన్ని తాకినా అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. కనీస అవసరాలైన విద్య, వైద్య సదుపాయాలు ఇప్పటికీ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. మారు మూల పల్లెల్లోని ప్రజలు.. ముఖ్యంగా అడవుల్లోని నివసించే గిరిజనలకు రవాణా సదుపాయాలు కూడా కరవు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేకపోతే డోలీ మోతలే శరణ్యం అంటున్నారు అడవి బిడ్డలు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మం డలం గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పలేదు. గ్రామానికి చెందిన వంతల కుషా యికి పురిటి నొప్పులు రావ డంతో 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి డోలీపై మోసుకుంటూ వెళ్తుం డగా మార్గ మధ్యలోనే గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చింది.అక్కడి నుంచి తల్లిబిడ్డలను మోసుకుంటూ పుణ్యగిరి కొండ దిగువకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ఆటోలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా ప్రజాప్రతి నిధుల్లో స్పందన కరవైందని గిరిపుత్రులు వాపోయారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించ డంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని గిరిజన సంఘాలు మండి పడుతు న్నాయి.గిరిజన గ్రామాలను 5వషెడ్యూల్లో చేర్చి ఉంటే ఈడోలి దుస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు.ఇప్పటికైన నాన్‌ షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను ఐటీడీ పరిధిలో చేర్చాలని గిరిజనసంఘాల ప్రతిని ధులు డిమాండ్‌ చేస్తు న్నారు.దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించింది.గిరిజన మహిళ పురిటి కష్టాలు,మారుమూల వైద్య సేవలు అందక మృత్యువాతపడుతున్న గిరి బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి,ఇతర సంబం ధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు`ఏపీ సీఎం
గిరిజన మహిళల సౌకర్యంకోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ట్రైకార్‌,జిసిసి,ఐటిడిఎలను యాక్టివేట్‌ చేస్తా మన్నారు. ఏపీలో కూతమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మరింత చేరువ పోతున్నారు. తాజాగా గిరిజన ప్రాంతాల సమస్యలపై దృష్టి పెట్టి ఆ ప్రాంతా ల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించ కూడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు..అధికా రులకు పలు ఆదేశాలు జారీ చేశారు.గిరిజన ప్రాంతాల్లోని మహిళల సౌకర్యం కోసం గర్భిణీ వసతి గృహాలు,ట్రైకార్‌, జీసీసీ,ఐటీడీఏలను యాక్టివేట్‌ చేయాలన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ విధానాలతో గిరిజన ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పూర్తిగా దిగ జారి పోయాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణా ళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లోని గర్భి ణీలు ఆసుపత్రులకు వెళ్లేందుకు నానా ఇబ్బం దులు ఎదుర్కొంటుండంతో ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల న్నారు.ఫీడర్‌ అంబులెన్స్‌ లను తిరిగి ప్రవేశ పెట్టాలన్నారు.గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ సర్కార్‌ తీసుకొచ్చినఎన్టీఆర్‌ విద్యోన్నతి, అంబేడ్కర్‌ ఓవర్‌ సీస్‌ విద్యానిధి పథకాలను వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండి పడ్డారు. గిరిజన గూడెంలను సైతం అభివృ ద్ధిలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం పాటుపడు తుందని..ఇందుకోసం అధికారులు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌళిక వసతులు కల్పించడం ద్వారా,ఫీడర్‌ అంబులెన్స్‌ లను తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అన్నారు. అలాగే నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగు దేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. తద్వారా గిరిజన మహిళలకు మేలు జరుగు తుందని చంద్రబాబు చెప్పారు.గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిపిన సమీక్షలో గిరిజనులకు విద్యా, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సియం సమీక్షించారు.2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సియం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.గిరిజన విద్యా ర్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్‌ విద్యోన్నతి, అంబే ద్కర్‌ ఓవర్‌ సీస్‌ విద్యానిధి,బెస్ట్‌ అవెయిలబుల్‌ స్కూల్స్‌ పథకాలను నిర్వీర్యం చేశారని అన్నారు. అలాగే గిరిజనులకు వైద్యం కోసం తెచ్చిన ఫీడర్‌ అంబులెన్స్‌ లను కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్‌ పై సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాడు అరకు కాఫీని ప్రమోట్‌ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం అరకు కాఫీతో పాటు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదని అన్నారు. ఈవిష యంలో సమగ్రమైన మార్పులు రావాలని గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉందని దాన్ని ఉపయో గించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చు అని సిఎం అన్నారు. గిరిజన ప్రాంతా ల్లో ఎంతో సారవంతమైన భూములు ఉన్నా యని ఆ ప్రాంతాల్లో పకృతి సేద్యాన్ని ప్రోత్స హించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్‌, కాఫీని ప్రొత్సహిస్తే మంచి ఫలి తాలు వస్తాయి అని అన్నారు. గంజాయి అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించ కుండా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. ట్రైకార్‌, జిసిసి, ఐటిడిఎలు పూర్తిగా యాక్టివేట్‌ కావాలని సిఎం అన్నారు. ఈ సంస్థల కార్యకలాపాల వేగం పెంచాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీ య గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహిం చాని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిం చారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాల పై కసరత్తు చేసి….రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సిఎం ఆదేశించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదా యం,అలాగే గిరిజన ఉత్పత్తుల, ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరా లతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు.
గిరిజన గ్రామ పంచాయతీల సమావేశాల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియాపై చర్చించాలి
గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్‌ ఎనీమియా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవా లని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ మరియు ఎండీ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ సి.హరి కిరణ్‌ ఆదేశించారు. గిరిజన గ్రామ పంచాయ తీల సమావేశం అజెండాలో సికిల్‌ సెల్‌ ఎనీమియా అంశం కూడా చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గ్రామ పంచాయ తీల్లో దీనిపై చర్చిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతమవుతుందన్నారు. ఇందు కోసం గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల్ని సంప్రదించాలన్నారు.జాతీయ సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలన మిషన్‌పై మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా కమీషనర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలనుగుణంగా సికిల్‌ సెల్‌ ఎనీమి యా బాధితుల్ని స్క్రీనింగ్‌ చేయాలని,ఈ ప్రక్రి యను నిరంతరం కొనసాగేలే చర్యలు తీసుకో వాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. సంబంధిత ఐటిడిఎ పీవోలతో దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు.సికిల్‌ సెల్‌ ఎనీ మియా నిర్మూలన కార్యక్రమాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని సంతృప్త స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకోసం వినూత్న విధా నాల్ని అవలింబిం చాలని సూచించారు. ఈమేరకు జరిగే రాష్ట్ర స్థాయి జిల్లా కలెక్టర్ల సమావేశంలో సికిల్‌ సెల్‌ ఎనీమియా అంశంపై మాట్లాడతానన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా దీనిపై మరింత దృష్టిని సారిం చాలన్నారు.2023 జులైలో సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలన మిష న్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిం చారని, 2047నాటికి దేశంలో సికిల్‌ సెల్‌ ఎనీమియా ను నిర్మూలించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నా రని తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో జీరో నుండి 40ఏళ్ల మధ్య వయసు గల 19,90,277 బాధితుల్ని మూడేళ్లలో ఏపీలో స్క్రీనింగ్‌ చేయా లని కేంద్రం లక్ష్యాన్ని నిర్ణయిం చిందని ఆయన తెలిపారు.ఇప్పటి వరకు 8,80,560 మందికి స్క్రీనింగ్‌ చేశారని,ఇందు లో19,046మంది సికిల్‌ సెల్‌ ఎనీమియా క్యారియర్లు కాగా, 1684 మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి ఉన్నట్లు తేలిందన్నారు.కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకా రం స్క్రీనింగ్‌ చేసిన ప్రతివ్యక్తికీ సికిల్‌ సెల్‌ స్టేటస్‌ ఐడి కార్డును జారీ చేస్తారని,ఇప్పటి వరకు 2,85,397 మందికి ఈకార్డుల్ని జారీ చేశారన్నారు.మరో 1,39,888 కార్డుల్ని త్వరలో జారీచేస్తారన్నారు. – జిఎన్‌వి సతీష్‌

1 2 3 11