కరువు నిబంధనలు జటిలం చేసిన కేంద్రం

దీర్ఘకాలంపాటు వర్షం లేకపోవడం,పంటలు పండక పోవడం,ప్రజలకు,పశువులకు ఆహారకొరత,మంచినీటి కొరత ఏర్పడటాన్ని కరువుగా పేర్కొంటారు.స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజులలో పెద్దలుడొక్కల కరువు గురించి చెప్పు తునేవారు. బ్రిటీష్ పాలకులు ప్రజలను పట్టించుకోకపోవడంతో ప్రజలుమట్టి జాపకానుకొని తాగినట్లు చెప్పుకునేవారు. స్వాతంత్య్రానంతరం 52లో రాయలసీమ కరువు ఏర్పడింది.ఆనాటి భారత ప్రభుత్వం రాయలసీమ కరువును గుర్తించ టానికి, సహాయ చర్యలు చేపట్టడానికి నిరాక రించింది.దానికై ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి కరువు ప్రకటింప చేసుకున్నారు.

కరువు నిబంధనలు – నష్టపరిహారాలు
1966లో దేశ వ్యాపితంగా కరువు ఏర్పడింది. భారత ప్రభుత్వం కరువు నిబంధనలు రూపొందించింది. సాధారణ వర్షపాతం కన్నా 25 శాతం తక్కువ వర్షం కురవటం, పంటల సాగు విస్తీర్ణం 50శాతం తగ్గటం, పంటల దిగు బడులు 33శాతం తగ్గటం కరువు నిబంధ నలుగా పేర్కొన్నారు. కరువు ప్రకటించాలంటే వర్షపాతంతో పాటు మరొక నిబంధన వర్తిం చాలని షరతు ప్రకటించారు. వర్షాన్ని లెక్కించ టానికి విధానం రూపొందించారు. 24 గంట లలో రంగున్నర మిల్లీమీటర్ల వర్షపాతం పడితే ఒక వర్షపు రోజు కింద లెక్క, అటువంటి వర్షం 21రోజులు పడకపోతే తేలికపాటి కరువు గాను,29రోజులు కురవకపోతే తక్కువ కరుపు గాను,12 రోజులు దాటితే తీవ్ర కరువుగాను పరిగణించేవారు. కరువు ప్రకటించగానే ప్రభు త్వం తీసుకోవాల్సిన సహాయడం చర్యల క్రింద పలలు ఉసారు కల్పించడం, ప్రజలకు,పశువులకు తాగునీరు సరఫరా చేయటం,పశుగ్రాసం సరఫరా చేయటం, ఉచిత రేషన్ ఇవ్వ టం,అంజలి కేంద్రాలు నిర్వహించడం, రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయటం,పేదలకు వినియోగ రుణాలు ఇవ్వడం తదితర కార్య క్రమాలు చేపట్టాలి.
బిజెపి ప్రభుత్వం తెచ్చిన చట్టాలు
2016లో దేశంలో తిరిగి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరువు విధా నాలను పునః పరిశీలించింది.“వేదాస” పేరుతో కొత్త నిబంధనలు ప్రకటించింది. విజువలై జేషన్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా అండ్ ఆర్కైనల్ సిస్టమ్ అనే విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో గతంలో ఉన్న మూడు నిబంధ నలకు తోడు నీటి నిల్వలను కూడా పరిశీలిం చాలని చేర్చింది. వీటిలో కనీసం మూడు అంశాలు ఉంటేనే కరువుగా గుర్తించాలని పేర్కొన్నది. భూమిపైన, భూమి లోపల ఉన్న నీటి నిల్వలను భూమిలో ఉన్న తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నది. వ్యవసా యం రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి లోనిది. కావున రాష్ట్ర ప్రభుత్వాలు కరువు ప్రాంతాలను నిర్ణయించి పంపితే,కేంద్రం పరిశీలించి ఆమో దం తెలుపుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభు త్వాలు నివేదికలు పంపిన అనంతరం కేంద్ర బృందాలు పర్యటించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నిర్ధారించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నిధి నుండి కొంత సహాయం చేస్తుంది. కేంద్రదళాలు పర్య టనకు రెండు నుండి నాలుగు మాసాల సమ యం పట్టేది. అప్పటికీ ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమయ్యేది.ఇది ఒక తంతు గా మారింది.
ప్రైవేటు బీమా కంపెనీల లాభాల కోసం
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథరం ప్రవేశ పెట్టింది. దిగుబడి ఆధారిత పంటల బీమా, పర్యావరణ ఆధారిత పంటల బీమా పథకాలను కలిపి ఒకే చట్టం వేసింది. బీమా పథకం అమలుకు వది ప్రైవేటు ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. 2019లో ప్రైవేటు బీమా కంపెనీలు వ్యవసా య శాఖ ఉద్యోగులు రూపొందించిన కరువు అంచనాలను అంగీకరించేది లేదని, శాటిలైట్ సమాచారం ద్వారా సేకరించే విధానం ప్రవేశ పెట్టాలని పేచీ పెట్టాయి.కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.ఈ కాలంలో ప్రైవేటు బీమా కంపెనీలు, రూ.24 వేల కోట్ల లాభాలు పోగేసుకున్నాయి.రైతులకు చెల్లిం చింది స్వల్పం.
ప్రస్తుతం ఇండియన్ స్పేస్ రీఛార్జ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వారు రూపొందించిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా సమాచారం సేకరించే విధా నం చేపట్టింది. స్వల్ప వర్షపాతం కలిగిన రాయలసీమలో విత్తనాలు మొలకెత్తని భూమి ఎంత శాతం, మొలకెత్తివా గిడసవారి వేలకు అంటుకుపోయిన విస్తీర్ణం ఎంత శాతం? మొల కొత్తి ఎండిపోయిన పంట ఎంత శాతం? అనేది ఎలా నిర్ధారిస్తారో అంతు పట్టదు, రాయ లసీమలో భూగర్భ జలాలు అడుగంటుతున్న వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ సమాచారంలో పృక్ష సమాచారం ప్రకారం పంటలు వేయక పోయినా అటవీ వృక్షాలు, హార్టికల్చర్ వంటలు పచ్చని వాతావరణం చూపిస్తాయి. ఇప్పుడు వర్షాభావానికి గురైన పండ్ల తోటలు అబ్బుపడి ఏడాది పొడవునా పూత పూయటం,పూత నిలపటం,పిందె కట్టడం, కాపు నిలపటం అన్ని దశలలోనూ బలహీనంగా ఉంటాయి. ఇవన్నీ శాటిలైట్ ద్వారా తెలియవు. ప్రత్యక్షంగా తీసుకోవాల్సిన వివరాలు.
నష్టపరిహారాలకు తిలోదకాలు
కేంద్ర ప్రభుత్వం 2025లో ప్రకృతి వైపరీత్యాల చట్టానికి సవరణలు చేసింది. గీత చట్టంలోని 12,13,61 క్లాజులను తొలగించింది. సెక్షన్ 12లో బాధితులను అదుకోవటానికి ఉన్న నిబంధనలు తొలగించారు.13లో పంటలు కోల్పోయిన రైతాంగానికి రుణాలు రీషెడ్యూల్ చేసే చాప్టర్‌ను తొలగించారు.61వరాజు ప్రకారం మహిళలకు, షెడ్యూల్ కులాలకు వివక్ష చూపకుండా పరిహారం ఇవ్వాలనే నిబం ధన తొలగించారు.ఈచట్టం అమలులోకి వస్తే వంట నష్టపరిహారాలు, రుణాల రీ షెడ్యూలు హుళక్కే, పంటల బీమా మాత్రమే దిక్కు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. రైతాంగం నారుమళ్ళు పోయటం, భూమిని కేంద్ర ప్రభుత్వం కరువు విధానాలను పునః పరిశీలించింది. “వేదాస” పేరుతో కొత్త నిబంధనలు ప్రకటించింది. “విజువలైజేషన్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా అండ్ ఆర్కెవల్ సిస్టమ”అనే విధానాన్ని ప్రకటిం చింది. ఈ విధానంలో గతంలో ఉన్న మూడు నిబంధనలకు తోడు నీటి నిల్వలను కూడా పరిశీలించాలని చేర్చింది. వీటిలో కనీసం మూడు అంశాలు ఉంటేనే కరువుగా గుర్తించా లని పేర్కొన్నది. భూమిపైన, భూమి లోపల ఉన్న నీటి నిల్వలను భూమిలో ఉన్న తేమ శాతా న్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి లోనిది. కావున రాష్ట్ర ప్రభుత్వాలు కరువు ప్రాం తాలను నిర్ణయించి పంపితే, కేంద్రం పరిశీ లించి ఆమోదం తెలుపుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు పంపిన అనం తరం కేంద్ర బృందాలు పర్యటించి, క్షేత్ర స్థాయి లో పరిశీలన చేసి నిర్ధారించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నిధి నుండి కొంత సహాయం చేస్తుంది. కేంద్ర దగాలు పర్యటనకు రెండు నుండి నాలుగు మాసాల సమయం పట్టేది. అప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమయ్యేది.
ఇది ఒక తంతుగా మారింది.
రైతాంగానికి బీమా ప్రీమియం చెల్లించమని పదేపదే చెప్పొంది.గత ప్రభుత్వం ఉచిత పం టల బీమా పథకం ప్రవేశపెట్టి రెండు సంవ త్సరాలు అమలు చేసింది.ఈ ప్రభుత్వం ఉచి త బీమా పడతాన్ని రద్దు చేసింది. గత రెండు సంవత్సరాల నుండి బీమా చెల్లంచిన వారికి బీమా ఇచ్చిన దాఖలాలు లేవు. ఫలితంగా రైతులు ఆసక్తి చూపటంలేదు. చెల్లించాలని ప్రభుత్వ పెద్దలు పడే పదే చెప్తున్నారు.
ముందుచూపు లేని ఫలితం
ఈ ఏడాది కేరళంకు రుతుపవనాలు ఆల స్యంగా వచ్చాయి. అప్పటికీ ముందు నుండీ ‘ఎల్సెనో ప్రభావం గురించి శాస్త్రవేత్తలు చెబు తూనే ఉన్నారు. అయినా మన మన రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణా, గోదావరి డెల్టాలకు ముందుగా నీరు వదులుకామని,ఒక నెల ముం దుగానే నాట్లు వేస్తే నవంబర్,డిసెంబర్ మాసా లలో వచ్చే తుఫానులకు ముందే వరి కోతలు పూర్తి చేసుకోవచ్చని, ముందుగా నారుమళ్ళు పోసుకోమని రైతులకు పిలుపు సిద్ధం చేయ టం,గట్లు వేయటం,నగైనా పనులు పూర్తి చేశారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేశారు. కొందరు రైతులు భూమిని దున్ని ఎద పెట్టారు. కొందరు గింజలు చల్లి పొడి కప్పం కప్పారు. జూలై చివరి నాటికి కృష్ణా డెల్టాలో వరి నాట్లు వేయవద్దని, ప్రత్యామ్నాయపంటలు వేసుకో మని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టారు. అంతర్జాతీయ నీటి యాజమాన్యం ఇన్ స్టిట్యూట్ వారు చెప్పిన వివరాల ప్రకారం భారత ప్రభుత్వం నెలకొల్పిన“సుఖ రక్షణ్ ‘అడ్వెర్ సిస్టమ్ ఈఏడాది వర్షపాతం అతి తక్కువగా ఉంటుందని మే 22వ తేదీనే సమా చారం ఇచ్చిందని పేర్కొంది.“సుఖ రక్షక్ దేశం లోని 22 భారతీయ భాషలలో ఈ విషయం ప్రకటించినట్లు అంతర్జాతీయ నీటి యాజ మాన్య ఇన్ స్టిట్యూట్ వారు పేర్కొన్నారు. అయి నా మనరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు సిద్ధం చేయకపోవటం దుర దృష్టం, ఇందుకు రాష్ట్ర ప్రజానీకం మూల్యం చెల్లిం చాల్సి వస్తున్నది.
నిర్వహణ భారంగా రైతువేదికలు
రైతు వేదికలు అలంకారప్రాయంగా మారా యి.రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వ్యవసాయ దారులకు సస్యరక్షణ చర్యలు కోసం కావాల్సిన సలహాలు,సూచనలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2021లో వీటిని ఏర్పాటు చేసింది.కానీ వీటి నిర్వహణకు సక్రమంగా నిధులు విడుదల కాక అధికారులు ఇబ్బంది పడుతున్నారు.నిధుల కొరతతో విద్యుత్ బిల్లు లు,పారిశుధ్య ఖర్చులూఅధికారులపైనే.. నెలకు రూ.9 వేల హామీ అమలు కాని వైనం అన్నదాతలకు అందు బాటులో ఉండి వ్యవ సాయ సలహాలు,సూచనలు అందించాలనే లక్ష్యంతోనిర్మించిన రైతువేదికలు ప్రస్తుతం నిర్వ హణ భారంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం నెలనెలా నిర్వహణ ఖర్చుల కోసం రూ.9వేలు ఇస్తామని ప్రకటించినా, నాలు గేళ్లు గా నిధులు విడుదల చేయకపో వడంతో వ్యవ సాయ విస్తరణ అధికారులే సొంత ఖర్చులతో నిర్వహణ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యుత్ బిల్లులు, మంచినీరు, పారిశుధ్యం, స్టేషనరీ, శిక్షణ కార్యక్రమాలు, కాపలాదారుల ఖర్చులు అధికా రులకు తలకు మించిన భారంగా మారాయి. దీంతో రైతువేదికల ఏర్పాటు లక్ష్యం నీరుగారు తోంది. 2021లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మిం చారు. ఒక్కో వేదికకు సుమారు రూ.22లక్షలు వెచ్చిం చారు. ఒక్కో రైతువేదికకు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి,ఉదయం, సాయం త్రం రైతులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. మిగతా సమయాల్లో వారు క్షేత్రస్థా యిలో పర్యటిస్తూ రైతులకు సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికత, పంటలపై సలహాలు,సూచనలు అందించాల్సి ఉంటుంది. అధికా రులు రైతులకు అందుబాటులో ఉం డేందుకు వేదికల్లో వసతి,ఫర్నిచర్, శిక్షణ కార్య క్రమాల కోసం కుర్చీలు,మైకులు తదితర సౌక ర్యాలు కల్పించారు.అయితే నిర్వహణకు ప్రభు త్వం ఇచ్చినహామీలు మాత్రం అమలుకు నోచు కోలేదు. పారిశుధ్యం,ఇతర పనుల కోసం సహా యకుడిని నియమిస్తామని చెప్పినా ఆహామీ అమలు కాలేదు. ఊరికి దూరంగా ఉన్న రైతు వేదికల్లో విలువైన సామగ్రిచోరీకి గురికా కుం డా వ్యవసాయ విస్తరణ అధికారులే తమ సొం త ఖర్చుతో వాచ్‌మెన్లను నియమించుకున్న సందర్భాలున్నాయి.
నాలుగేళ్లుగా నిధుల్లేవు
రైతువేదికల్లో మంచినీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.9 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది.2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలలకు ఒక్కో రైతువేదికకు రూ.45 వేలు మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 70రైతువేదికలు ఉం డగా,ఒక్కో కేంద్రానికి సుమారు రూ.2.70 లక్షల చొప్పున నిర్వహణ బకాయిలు పేరుకు పోయాయి.
సొంత డబ్బులతో భారం
నిధులు రాకపోవడంతో గత్యంతరం లేక వ్యవసాయ విస్తరణ అధికారులే నెలవారీ ఖర్చులు భరిస్తున్నారు.ఒక్కో రైతువేదికకు విద్యు త్ చార్జీల కోసం సుమారు రూ.1,000,స్టేష నరీ, జిరాక్స్‌లకు రూ.1,000,శిక్షణ కార్యక్ర మాలకు రూ.2,500, తాగునీటికి రూ.500, పరిశుభ్రత,కాపలాదారుల కోసం సుమారు రూ.3,000వరకు ఖర్చవుతోందని వారు చెబు తున్నారు.విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లిం చకపోతే సరఫరా నిలిపివేస్తుండటంతో తప్ప నిసరి పరిస్థితుల్లో తామే బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగు దొడ్ల నిర్వహణకు కూడా నిధులు లేకపోవ డంతో ఆ ఖర్చునూ తామే భరించాల్సి వస్తోం దని చెబుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని,తామే భరించుకోవాలని సూచి స్తున్నారని వాపోతున్నారు.రైతులకు నిరంతరం సేవలందించాల్సిన రైతువేదికల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయకుండా,పెండింగ్ నిధులను విడుదల చేయడంతో పాటు నెలవారీ నిర్వహణ ఖర్చులను సకాలంలో మంజూరు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులు కోరుతున్నారు.అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వ హణ వ్యవసాయ విస్తరణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది కానీ నిర్వహణకు నెలనెలా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో కనీ సం విద్యుత్ చార్జీలు చెల్లించే పరిస్థితి లేదు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, పంటల సాగులో వారికి అవసరమయ్యే సల హాలు,సూచనలు ఇవ్వడానికి 2021లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్లస్టర్ల వారిగా రైతు వేదిక లకు నిర్మించారు.ఒక్కో రైతువేదికకు రూ.22లక్షలతో నిర్మించారు.ఒక్కో వేదికకు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమిం చారు.వారు రోజు ఉదయం,సాయంత్రం వేదిక ల్లో అన్నదాతలకు అందుబాటులో ఉంటూ మిగితా సమయాల్లో క్షేత్ర సందర్శన చేసి కర్షకు లకు సలహాలు,సూచనలు అందించాల్సి ఉం టుంది. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వేదికలో వసతి కల్పించారు.ప్రత్యేకంగా ఫర్నిచర్‌ను సమకూర్చారు.శిక్షణ కార్యక్రమాలకు అవస రమైన కుర్చీలు,మైకు వంటివి ఏర్పాటు చేశా రు.వీటిని వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలు కూడా వినియోగించుకున్నాయి. ఊరికి దూరంగా నిర్మించిన వీటిలో పారిశుధ్య తదితర పనులకు సహాయకుడిని నియమిస్తా మని చెప్పిన ప్రభుత్వం ఆమాట మరిచి పోయింది. రైతువేదికల్లోని విలువైన సామగ్రి దొంగల పాలవుతుండడంతో వ్యవసాయ విస్త రణ అధికారులే తమ స్వంత ఖర్చుతో వాచ్‌మెన్ల ను నియమించుకున్నారు.ఆతర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి రావడంతో ప్రస్తుతం వాటి నిర్వహణ గాలికొదిలేసింది.రైతువేదికల్లో మంచినీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతీ నెల రూ.9వేలు ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. కానీ నాలుగేళ్లుగా నిధులు విడుదల చేయకపోవ డంతో పలు ప్రాంతాల్లో సంబధిత అధికారులు కొందరు వారి వేతనం నుంచి నెల ఖర్చులు చెల్లించారు. 2022ఏప్రిల్ నుంచి 2022ఆగస్టు వరకు ఐదు నెలలకు గాను ఒక్కో రైతువేదికలకు గాను రూ.45వేలు అందించింది. మొత్తం మోయలేని భారంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.-(వై.కేశవరావు)

సమిష్ట కృషితోనే అగ్రస్థానంలో విశాఖ అభివృద్ధి

స్వర్ణాంధ్ర సాకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని, అధికారులు సమష్టి కృషి చేసి విశాఖపట్టణం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. ప్రజలకు సంతృప్తికర రీతిలో సేవలందిస్తూ, అభివృద్ధి – సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, సమ్మిళిత ఆర్థిక విధానాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరూ వారి కర్తవ్యాలను నిర్వర్తించాలని సూచించారు.ఈ నెల 25,26వ తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మÖడో విడత కలెక్టర్ల సదస్సు అంశాలను శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన సమావేశంలో జిల్లా అధికా రులకు వివరించిన ఆయన పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అన్ని రంగాల్లో విశాఖ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపటమే లక్ష్యంగా బాధ్యతగా పని చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర ఏ2047 విజన్ ప్లాన్, విశాఖపట్టణం 2025-29 ప్లాన్ ప్రాతిపదికగా ముందుకు సాగాలని అధికారులను పేర్కొన్నారు. విశాఖపట్టం రూపురేఖలు మార్చేలా ప్రతి ఒక్కరూ ప్రణాళికా బద్ధంగా పని చేయాలని, అంకిత భావం ప్రదర్శించాలని సూచించారు.మహానగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపట్టాలని, ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా కృషి చేయాలన్నారు. రంగాలవారీగా వివిధ అంశాలపై పీపీటీ ఇచ్చారు.
15 శాతం వృద్ధి లక్ష్యాలను చేరుకోవాలి…
పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని, కొత్త ీVAటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రుషికొండ, గంభీరంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ కాంప్లెక్సులు నిర్మించాలని సూచించారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ పరిధిలో చేపట్టే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, అనుమతుల జారీ విషయంలో పారదర్శకత పాటించాలని, వేగం పెంచాలని సూచించారు. 15 శాతం వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, తలసరి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి నెలా ఒకటో తారీఖున ఠంచనుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఫింఛన్లు అందజేయాలన్నారు. రేషన్ సరకులను కూడా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలన్నారు. ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా అమలు కావాలని, మద్యం పాలసీకి అనుగుణంగా జిల్లాలో చర్యలు చేపట్టాలని, అవకవతకలు జరగకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. విద్యా, వైద్య రంగంలో ప్రమాణాలు మరింత మెరుగపడాలని, ప్రయివేటుకు ధీటుగా సేవలను విస్తృతం చేయాలని సూచించారు.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి….
అధిక శాతం పట్టణీకరణ కలిగిన జిల్లా అయిన్పటికీ ఉన్న గ్రామీణ మండలాల్లో వ్యవసాయంపై ప్రధాన దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఉద్యాన, ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో గుంతలు లేకుండా రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, పరిశుద్ధమైన తాగునీటిని సరఫర చేయాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండాలని పేర్కొన్నారు. దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో నూతన విధానాలను అవలంభిస్తూ ప్రజలకు చేదోడుగా నిలవాలన్నారు. వచ్చే ఏడాదికి 200 హెక్టార్ల బీడు భూములను సాగులోకి తీసుకురావాలని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, నగరంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు బాధ్యతగా పని చేయాలని, ఉత్తమ ఫలితాలను రాబట్టాలన్నారు. వివిధ వేదికల ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలు, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రతి నెలా 100 పారిశ్రామిక యÖనిట్లు నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఆరు నెలల్లో మెట్రో భూసేకరణకు చర్యలు…
విశాఖలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవసరాల నిమిత్తం ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఆరు నెలల్లో మొదటి దశ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉం టుందని అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలని, అంతర్గత రోడ్ల విషయంలో వేగం పెంచాలని సూచించారు. మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసే మార్గంలో కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని, కొత్త భవనాలు, లేఅవుట్లు వేసేందుకు ప్రణాళికలు తయారు చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ నుంచి అనుసంధానమయ్యే రోడ్ల అభివృద్ధికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు కర్మయోగి సర్టిఫికేట్ కోర్సులు చేయాలని, పీ-4 సర్వేకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ సేవలను మరింత విస్తృతం చేయాలని, సంబంధిత నంబర్ ను పబ్లిక్ ప్రాంతాల్లో ప్రదర్శించాలని సూచించారు.
పరిశ్రమలు నెలకొల్పేందుకు పక్కా ప్రణాళికలతో రండి…
చిన్నచిన్న యÖనిట్ల రూపంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక ఔత్సాహికులు పక్కా ప్రణాళికలతో రావాలని, వారికి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు సాంకేతిక సహాయం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరకు ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారికి అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. 2025-26 వార్షిక ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఔత్సాహికులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, వీలైనన్ని పారిశ్రామిక యÖనిట్లు నెలకొల్పాలని పేర్కొన్నారు.
జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు అనువైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో అధికారులు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గాజువాక, ఆటోనగర్ వద్ద గల రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్.వో.బి.), పెద గంట్యాడ, అగనంపూడి, ఆటోనగర్లలో ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణాలకు, పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి వనరులను సమకూర్చాలని, సౌసైటీ భవనాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.భూ సేకరణ,సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎంఎసఎంసీ సెక్టార్ల ఏర్పాటులో చురుగ్గా వ్యవహరించాలన్నారు. కోర్టు కేసులు, విజిలెన్స్ కేసుల విషయంలో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో భాగంగా ఐలా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ఆటోనగర్, ఐటీ హిల్స్ వద్ద కావల్సిన సదుపాయాలపై, అన్ని రకాల సమావేశాలకు, సభలకు ఉపయోగపడే విధంగా పెద్ద హాలు నిర్మాణంపై కలెక్టరుకు నివేదించారు.
రూ.23,870 కోట్లతో “పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన” విడుదల
విశాఖపట్నం జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచు కొని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (చీAదీA=ణ) 2025-26 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన “పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన” (PLP)ను కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా డీఐపీఈసీ సమావేశం అనంతరం విడుదల చేశారు. రూ.23,870.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ రూపొందించినట్లు నాబార్డ్ డెవలప్మెంట్ మేనేజర్ బసంత్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రణాళిక ముఖ్యంగా ఎం.ఎస్.ఎం.ఈ.లు, పునరుత్పాదక ఇంధనం, ఎగుమతి క్రెడిట్, సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఎంఎసఎంఈ రంగానికి రూ.16,207.50 కోట్లు, ఎగుమతి ఆధారిత వ్యాపారాల కోసం రూ.612 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.300.74 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.3,368.99 కోట్లు, ఇతర విభిన్న అవసరాల కోసం రూ.3,384.38 కోట్లు కేటాయించినట్లు వివరించారు.ఈ ప్రణాళిక అన్ని రంగాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో దోహదప డుతుందని బసంత్ కుమార్ పేర్కొన్నారు. – జి ఏ సునీల్ కుమార్

తీవ్ర వాతావరణ పరిస్థితులు..వైపరీత్యాలు..


భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్ర తలు.. ఆ కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మా ర్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరి స్తూనే ఉన్నారు.అందుకు తగ్గట్టే వాతావర ణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో గాలి దుమారాలు సహజం. కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి మహానగరాలను వణికిస్తున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. గాలి దుమారాలు, ధూళి తుఫాన్లు, వర్షాల తీవ్రత నానాటికీ పెరగడం ఒకెత్తయితే.. ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. గతేడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని ఘటన లను పరిశీలిస్తే..
. 2024 మే 13: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై ప్రచండ వేగంతో కూడిన గాలులతో ధూళి తుఫాను విరుచుపడింది.ఈధాటికి ఘట్కోపర్ ప్రాం తంలో ఓభారీ ీVAర్డింగ్ నిట్టనిలువుగా పక్కనేఉన్న పెట్రోల్ బంక్‌పై కుప్పకూలింది.దాని కింద నలిగి 14మంది ప్రాణాలు కోల్పోగా,మరో 74మంది తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇదే రోజు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, గాంధీనగర్ సహా పలు ప్రాంతాల్లో ధూళి తుఫాను బీభత్సం సృష్టిం చింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది.రహదారులపై వాహ నాల రాకపోకలను స్తంభింపజేసింది.
. మే 10: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని ధూళి తుఫాను అతలాకుతలం చేసింది.ఈ గాలి దుమా రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది గాయాల పాలయ్యారు.
. ఏప్రిల్ 13: భారత వాతావరణ శాఖ హెచ్చ రించినట్టే రాజస్థాన్‌పై అనేక ధూళి తుఫాన్లు విరుచుకు పడ్డాయి. తీవ్రమైన వేగంతో కూడిన గాలుల ధాటికి కచ్చా గృహాలు సహా అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.
భూతాపమే కారణం..
అతి భారీ వర్షాలు,తీవ్రమైన వేడి గాలులుతో పాటు తరచుగా సంభవిస్తున్న అతి తీవ్ర ధూళితుఫాన్లు,గాలి దుమారాలకు భూతాపమే కారణమని పాఠశాల విద్యార్థిని అడిగినా చెబుతాడు.ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అధ్యయనం ప్రకారం1950 నుంచి నమోదైన ఘటనలను పరిశీ లిస్తే వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వైపరీత్యాల సంఖ్య మÖడు రెట్లు పెరిగిందని తేలింది. ఈ సమాచారాన్ని ‘నేచర్ కమÖ్యనికేషన్స’ పేరుతో నిర్వహిస్తున్నసైన్స్ మ్యాగజీన్లో ప్రచురించింది. ఇలాం టి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు,విపత్తుల కార ణంగా అనూహ్య స్థాయి వరదలు సంభవిస్తూ ప్రజల ఆస్తి, ప్రాణనష్టాలు కలుగజేస్తున్నాయని పేర్కొంది. భారత్‌లో ఎక్కువగా ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి.గుజరాత్, మహా రాష్ట్ర,మధ్యప్రదేశ్,చత్తీస్‌గఢ్,తెలంగాణ, ఒడిశా, ఝా ర్ఖండ్, అస్సాం,మేఘాలతో పాటు పశ్చిమ కనుమలకు ఆనుకున్న గోవా,కర్ణాటక కోస్తా ప్రాంతం, ఉత్తర కర్ణాటకలో ఈతరహా విపత్తులకు ఎక్కువగా నమోద వుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎన్విరాన్ మెంట్, సస్టెయినబులిటీ అండ్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపక సీఈవో చంద్ర భూషణ్ ఇసుక తుఫాన్లు పెరగడానికి కారణం భూతాపమే అని చెబుతున్నారు.
భూతాపం ఎందుకు పెరుగుతోంది.?
భూతాపాన్ని పెరగడానికి కారణాల్లో ముఖ్యమైనది భూమ్మీద గ్రీన్ హౌజ్ వాయువుల స్థాయి పెరగడమే. కార్బన్ డై ఆక్సైజ్ సహా మరికొన్ని వాయువులను గ్రీన్ హౌజ్ వాయువులుగా పేర్కొంటారు. భూగోళంపై ఇవి ఒక మోతాదులో ఉండకపోతే ప్రాణికోటి బ్రతక డం కూడా కష్టమే. సూర్య కాంతి లేని సమయంలో (రాత్రి వేళల్లో) భూమి అత్యంత శీతల పరిస్థితిని ఎదుర్కోకుండా ఈగ్రీన్ హౌజ్ వాయువులు అడ్డుకుం టాయి. ఫలితంగా రాత్రివేళల్లో జీవరాశి మనుగడ సాగించగల్గుతోంది. అయితే వీటి మోతాదు వాతావర ణంలో పెరిగే కొద్ది అనర్థాలు, వైపరీత్యాలే. కర్బన ఉద్గారాలు పెరగడంలో శిలాజ ఇంధనాల (పెట్రోలి యం ఉత్పత్తులు)తో నడిచే వాహనాలు, నేల బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యం వంటివి ప్రధానమైనవి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక, లక్ష్యం నిర్దేశించుకుంది.
విపత్తులను ముందే గుర్తించగలమా?
ప్రకృతికి ఎదురొడ్డి నిలబడడం భూమ్మీద మనిషికే కాదు ఏజీవరాశికి కూడా సాధ్యం కాదు. కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగట్టగల్గితే..దాని బారిన పడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిశోధన సంస్థలు వాతావర ణంలో మార్పులను పసిగట్టి తగిన హెచ్చరికలు జారీ చేస్తుంటాయి.అయితే ప్రకృతిలో సంభవించే అన్ని రకాల వైపరీత్యాలను, వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందు కంటే వాతావరణం అన్నదే అత్యంత సంక్లిష్ట మైన అంశం.సుదీర్ఘ అనుభవం,లోతైన అవగాహన, అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భారత వాతావరణ శాఖ ఈ మధ్య కాలంలో చాలా అంశాల్లో ముందుగానే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హీట్ వేవ్ (వేడి గాలులు), తుఫాన్లు, వాటి తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలు దాదాపుగా నిజమవుతు న్నాయి.ఆ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వాలు చర్యలు తీసుకున్నప్పుడు ప్రాణనష్టాన్ని నివారిం చగల్గుతున్నాం.హీట్ వేవ్, తుఫాన్లను అంచనా వేయ గల్గినంతగా..ప్రకృతిలో సంభవించే అన్ని వైపరీత్యా లను పసిగట్టడం,లేదా వాటి తీవ్రతను అంచనా వేయ డం సాధ్యం కాదు. ఈ వైపరీత్యాలను అడ్డుకోవాలంటే తక్షణం భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టడమే ఏకైక మార్గమని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశో ధకులు,నిపుణులు చెబుతున్నారు.
2025లో ఇదేతీవ్ర వాతావరణ పరిస్థితులు
ఇదే కారణం2024 సంవత్సరలో కళ్లువిప్పే అనుభవంగా నిలిచింది,ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావంపై అవగాహన లేని వారికీ కూడా. ప్రపంచంలోని ఏదో ఒక ప్రాంతంలో తీవ్ర వాతా వరణ సంఘటనలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తం గా ఈ విపత్తుల ప్రభావం పెద్ద ఎత్తున కనిపించిన ప్పటికీ,భారత్ వాతావరణ మార్పుల కారణంగా అత్య ధికంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని బహిరంగం చేసేందుకు, న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (్పుSజు) విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వి రాన్‌మెంట్ 2025’నివేదిక ప్రకారం,2024లో గణనీ యమైన 274రోజులలో 255 రోజులు (93శాతం) కనీసం ఒక్క ప్రాంతంలో అయినా తీవ్ర వాతావరణ మార్పులను చవిచూశాయి. ఇది 2023లో నమోదైన 235రోజుల కంటే,2022లో నమోదైన 241 రోజుల కంటే ఎక్కువ.
2025 కూడా భయంకరమే!
2024 ఇంత దారుణంగా ఉంటే, 2025లో పరిస్థితి మరింత దిగజారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేశాయి.భారత వాతావరణ విభా గం (Iవీణ)ప్రకారం,ఈ ఏడాది వేసవి మామÖ లు కంటే తొందరగా ప్రారంభమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే తెగిన వేడిమి, అధిక ఉష్ణోగ్రతలు, తరచూ కనిపించే ఎండగాలి (Hవat ఔaఙవs) పరిస్థితులు ఉండబోతున్నాయి.ఇప్పటికే 2025 ఫిబ్రవరి నెలను 1901నుండి ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరి నెలగా ప్రకటించారు.
విపత్తుల ముప్పు
కేరళలోని వయనాడ్‌లో 2024 జూలైలో జరిగిన భారీ భూసలనం కారణంగా 350మంది కిపైగా ప్రాణాలు కోల్పోయారు, ఇంకా చాలా మంది కనిపించకుండా పోయి మృతులుగా ప్రకటించారు. మరోవైపు,రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఒక్కరోజులో 55% సీజన్ వర్షపాతం పడింది. ఇదే సమయంలో, లేహ్ వంటి హిమప్రాంతాల్లో కూడా 2024 జూలైలో ఉష్ణతరంగాలు(Hవatwaఙవs) నమోదయ్యాయి.
భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం
2024లో తీవ్ర వాతావరణ సంఘటనల కారణంగా3,238 మంది మరణించారు, ఇది 2022 లో నమోదైన 2,755మరణాలతో పోలిస్తే 18% పెరుగుదల. ప్రపంచ వ్యాప్తంగా 2024 సంవత్సరం సగటు ఉష్ణోగ్రత1.5ళ్పుీపెరిగిన మొదటి సంవ త్సరం.యÖరోపియన్ యÖనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ 2024లో గ్లోబల్ సర్ఫేస్ ఎయిర్ టెంపరేచర్ 11 నెలలపాటు 1.5ళ్పుీ కంటే ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
భారతదేశానికి ఎందుకు ఎక్కువ ప్రమాదం?
పుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ కి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డా. రాక్సీ మాథ్యూ కోల్ ప్రకారం, భారతదేశం సమీప హీలియో గ్రాఫికల్ దృష్ట్యా ఎక్కువ సూర్యరశ్మిని గ్రహిస్తుంది.అర్బన్ ప్రాంతాల్లో cశీఅcతీవtవ వల్ల రాత్రిపూట కూడా వేడిమితగ్గదు.ఈ మార్పుల కారణంగా ఉష్ణతరంగాల తీవ్రత3-6 రెట్లు పెరిగే అవకాశం ఉంది.గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరగడం ఎలా విపత్తులకు దారి తీస్తోంది.ఓషన్లు ఎక్కువ వేడిని గ్రహిస్తున్నాయి.దీనివల్ల అధిక ఆవిరి ఉత్పత్తి జరుగు తుంది.ఈ అధిక తేమ గాలికి అదనపు శక్తిని ఇస్తుంది, చెడిపోయే వాతావరణ పరిస్థితులను(స్టార్ములు, సైక్లో న్లు) ప్రేరేపిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు సంవత్సరానికి 3మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతు న్నాయి.భారతీయ మహాసముద్రం ఉష్ణోగ్రత 1.2ళ్పుీపెరిగింది, ఇది సముద్ర మట్టాలను ఇంకా వేగంగా పెంచే ప్రమాదం ఉంది.
ఆరోగ్యంపై ప్రభావం
వేడిగాలులు,అధిక ఉష్ణోగ్రతలు వేడి సంబం ధిత వ్యాధులను పెంచుతున్నాయి (ఉదాహరణకు, హీట్ స్ట్రోక్, డెంగ్యూ, మలేరియా, చికున్‌గునియా). మానవ సమÖహాలు ఎక్కువగా ఉండే నగరాల్లో మరింత భయంకరమైన ప్రభావాలు కనిపించనున్నా యి.2040నాటికి 2బిలియన్ మంది ప్రజలు 0.5ళ్పుీ అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనవలసి ఉంటుంది.
ప్రపంచ రాజకీయాలు చర్యలు
డైరెక్టర్ సునితా నరైన్ ప్రకారం,కొన్ని దేశాలు క్లైమేట్ చేంజ్ ను మేనేజ్ చేయడం మానేశాయి. అమెరికా వంటి దేశాలు మళ్లీ ఇంధన తవ్వకాలను (ణతీఱశ్రీశ్రీ,దీaby,ణతీఱశ్రీశ్రీ!) ప్రోత్సహిస్తున్నాయి, ఇది ఇతర దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ప్రపంచం ఇప్పటికే1.5ళ్పుీ గ్లోబల్ కార్బన్ బడ్జెట్ ను అధిగమిం చింది, కనుక మరింత ఆలస్యం మానవజాతికి చాలా తీవ్రమైన ఫలితాలు తీసుకువస్తుంది.
ముగింపు
ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన వాతావరణ మార్పులు, విపత్తులు మనల్ని చుట్టుముడతాయి. సుదీర్ఘకాలిక పరిష్కారాలు ఎప్పుడు ప్రారంభిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. (ఇన్‌ఫుట్ : రెబ్బాప్రగడ రవి)

రాష్ట్ర బడ్జెట్‌202526

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అమరావతి లోని అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359.33 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ సామాజిక సంక్షేమ పథకాలు, విద్య, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక అండ్‌ నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే ముందుగా పాఠశాల విద్య ఇంకా అభివృద్ధి కోసం రూ.31,806 కోట్లు కేటాయించింది.
2025-2026 సంవత్సరానికి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు ఇంకా హైదరాబాద్‌లలో పారిశ్రామిక కారిడార్‌ల కోసం రూ.837కోట్లు, పరిశ్రమలు, లు సహా ఆహార ప్రాసెసింగ్‌ కోసం రూ.1,400 కోట్లు కేటాయించింది.అలాగే 26 సంవత్సరానికి రాష్ట్రంలో ఆర్థిక,సాంకేతిక పురోగతి కోసం రూ.55,730 కోట్లు కేటాయించింది.ప్రభుత్వ హమీలోని తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో రూ 9,407 కోట్లను ప్రతిపా దించారు. అలాగే రూ.15వేలు చొప్పున తల్లుల ఖాతా ల్లో మే నెలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తేలిపింది. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ 6300కోట్లు ప్రతిపాదించారు. రైతు అనుబంధ రంగాలకు13,487కోట్లు కేటాయింపు చేసారు. అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతలుగా, కేంద్రం అమలు చేస్తున్న పీఎంకిసాన్‌ కలిపి ఈ పథకం అమలు కానుంది.
పెన్షన్ల కోసం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు కేటాయించారు. అదే విధంగా చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు ప్రతిపాదించారు. బడ్జెట్‌ లో పోర్టులు, ఎయిర్‌పోర్టులకి రూ.605 కోట్లు కేటాయింపులు చేసారు. మత్స్యకార భరోసా కోసం రూ 450 కోట్లను ప్రతిపాదించారు. తొలిసారిగా తెలుగు భాషకు నిధులను కేటాయిస్తూ తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంప్కె వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు అలాగే నవోదయం 2.0స్కీం కిందమద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం కూడా నిధుల కేటాయింపు చేశారు.ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మా ణానికి6,705కోట్లను,సాగునీటి ప్రాజెక్టులకు 11,314కోట్లను కేటాయించారు. ప్రకృతి వ్యవసా యం ప్రోత్సహించడానికి రూ.61 కోట్లు, మార్కెటింగ్‌ శాఖకు రూ.315 కోట్లు, సహకార శాఖకు రూ.239 కోట్లు, వ్యవసాయం యాంత్రీకరణ కోసం రూ.219 కోట్లు,పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.250 కోట్లు, ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.వెయ్యి కోట్లు, ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు,దీపం 2.కోసం రూ.2,601 కోట్లు, జల్‌జీవన్‌ మిషన్‌కోసంరూ.2,800కోట్లు కేటాయిం చారు.
తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్‌లో గత తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది. బడ్జెట్‌ లో నిధులు కేటాయింపులు చేసింది. 9,407 కోట్ల రూపాయలను కేటయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. తల్లికి వందనం అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించినా బడ్జెట్‌ లో నిధులు కేటాయింపు ఎలా ఉంటుదన్న దానిపై ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు.
మే నెల నుంచి…
వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మవొడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభు త్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది.
అర్హతలివే…దీంతో పాఠశాలలు జూన్‌ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.మేనెల నుంచి తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయిం చారు. ఇందుకోసం ప్రతి వాళ్లు రేషన్‌ కార్డు లేదా ఆధార్‌ కార్డు ఉండాల్సి ఉంటుంది. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలరూపాయలు ఇస్తా మని చెప్పడంతో ఇప్పటికే దీనిపై అధికారులు కసర త్తులు ప్రారంభించారు. హాజరుశాతం కూడా 75 శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది. దీంతో పాటు దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వారికే ఈ పథకం వర్తింప చేయను న్నారు. తెలుపు రంగు రేషన్‌ కార్డు తప్పనిసరి. కుటుం బంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభు త్వం ప్రకటించనుంది.-(జిఎన్‌వి సతీష్‌)

జనావాసాల్లో జంతువులు

అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు కొంత కాలంగా జనావాసాల బాట పడుతున్నాయి. దీంతో జనపథాలుగొల్లుమంటున్నాయి.తెగించి ఎదురునిలిచినా, తెలియక ఎదురుపడినా బతుకుపై భరోసా లేనట్టే. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిన స్థితి. చిత్తూరు జిల్లాల్లో ఏనుగు దాడిలో ముగ్గురు మరణిం చినా,తిరుమల కొండల్లో అభం శుభం తెలియని పసిపాప చిరుతకు బలైనా, వందలాది ఎకరాల్లో పంటపొలాలు ధ్వంసమైనా.. ఆ మూల నుండి ఈ మూల వరకు ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒకప్రాంతంలో వన్యమృగాలు సంచరిస్తు న్నట్లు వార్తలు వస్తున్నా కారణం ఒక్కటే.. అది మృగాలకి, మనుషులకి మధ్య పెరుగుతున్న ఘర్షణ. అనివార్యంగా మారుతున్న మనుగడ పోరాటం. ఎక్కడో కాకులు దూరని కారడవుల్లో ప్రశాంతంగా తమ మానాన తాము బతికే పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు నుండి వివిధ రకాల వన్యమృగాలు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? మనకు సమస్యగా ఎందుకు మారుతు న్నాయి? ఈ సంఘర్షణకు పరిష్కారం లేదా? అసలీ దుస్థితికి కారణం ఏమిటి? దీనిపై ప్రత్యేక కథనం..
వన్య మృగాలు జనావాసాల్లోకి రావడమనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్యేమీకాదు. అటవీ ప్రాంతాలకి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలకు వన్యమృగాలు తారసపడటం అనేది సహజమే. అయి తే, అది మృగాలకు మనుషులకు మధ్య ఘర్షణగా మారే సందర్భాలు మాత్రం అరుదు. పొరపాటున గ్రామాల్లోకి వన్యమృగాలు వచ్చినా, మనిషి తారస పడగానే అవి వెనక్కి తగ్గేవి. అనివార్యంగా జనావా సాలను దాటాల్సి వచ్చినా.. సాధ్యమైనంత మేరకు మనిషి కంటపడకుండా వెళ్లిపోతాయి. అడవులకు సమీపంలో నివసించే చెంచులను, గిరిజనులను అడిగితే ఇటువంటి సంఘటనలను కోకొల్లలు చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. కిలోమీటర్ల దూరం జనావాసాల్లోకి వన్యమృగాలు వచ్చేస్తున్నాయి. ఆ మేరకు మనుషులకు మృగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలూ పెరుగు తున్నాయి. జంతువుల దాడుల్లో మనుషులు, మను షుల దాడుల్లో జంతువులు మరణిస్తున్న సంఘటనలూ పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 నుండి 2025 సంవత్సరాల మధ్య కాలంలో వన్యమృగాల బారిన పడి రాష్ట్రంలో 139మంది మరణించారు. మృతులలో పురుషులే ఎక్కువ. ఏ జంతువుల బారిన పడి ఈ మరణాలు చోటుచేసు కున్నాయి అన్నది ఎన్‌సిఆర్‌బి అధికారికంగా ప్రకటిం చలేదు. అయితే, అటవీ, పోలీస్‌ అధికారులు చెబు తున్న సమాచారం ప్రకారం ఏనుగులు, ఎలుగుబంట్ల దాడుల కారణంగానే ఈమరణాలు చోటుచేసు కున్నాయి. ఇటీవల కాలంలో చర్చనీయాంశమైన చిరు తలు,పులుల దాడుల్లో మనుషులు మృతి చెందిన సంఘటనలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఇటీవల తిరుమలలో జరిగిన దురదృష్టకర సంఘటన దీనికి మినహాయింపు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలు ఏనుగుల గుంపుల బారిన తరచూ పడుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి నివేదికలను పరిశీలిస్తే అర్థమవుతోంది. సంవత్సరానికి సుమారుగా 30 మంది వన్యమృగాల బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్నారు. 2018 సంవత్సరంలో 31 మంది, 2019లో 25 మంది, 2020లో 32మంది మరణించారు. అనధికారికం గా మరికొన్ని సంఘటనలూ చోటుచేసుకుని ఉండ వచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్ల దాడులు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. నాలుగు ఏనుగుల మంద ఈప్రాంతంలో తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. మన్యం పార్వతీపురం జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఆరు ఏనుగులు కనిపించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో గడిచిన ఐదు సంవ త్సరాల కాలంలో ఏనుగుల దాడిలో ఆరుగురు రైతులు మరణించారు.వీటిని బంధించడానికి వచ్చిన ఒక ట్రాకర్‌ కూడా మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా లో ఐదు సంవత్సరాల కాలంలో పదిమంది రైతులు మరణించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో గత ఏడాది పెద్ద పులుల సంచారం కలకలం రేపగా, ఈఏడాది శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్దపులి కనిపించినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి.కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ శాంచురీ నుండి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి ఏనుగుల రాకపోకలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్నాటక నుండి కూడా ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓఒంటరి ఏనుగు బారిన పడి,చిత్తూరు జిల్లా లో కొద్దిరోజుల క్రితం ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.-(తిరుపతి రెడ్డి మద్దిగెడ్డ)

వృద్ధి రేటుతో ఒరిగేదెంత?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, గత వైసిపి ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అప్పులమయం చేసిందని, వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులపై వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని అందు వల్ల ప్రజలకిచ్చిన సంక్షేమ పథకాల వాగ్దానాలు వెంటనే అమలు చేయలేక పోతున్నామని ప్రచారంలో పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని, ఆతరువాతే సంక్షేమ పథకాలు అమలు అని తెగేసి చెబుతున్నారు.ఈధోరణి కేంద్ర ప్రభుత్వం యొక్క నయా ఉదారవాద స్వభావాన్ని తెలియజేస్తున్నది.ఈ విధానాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలుకు పూనుకున్నది. ప్రభుత్వ ఖర్చు తగ్గించుకొని, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనేది నయా ఉదారవాద విధానం యొక్క ముఖ్యమైన లక్షణం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏదో ఒక వంక చూపి అమలు వాయిదా వేస్తున్నది. ఒకవేళ అమలుకు పూనుకున్నా అనేక షరతులు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను చాల పరిమితం చేస్తారు. ఇప్పుడు సామాజిక పెన్షన్‌ పథకంలో అనర్హులు ఉన్నారనే ప్రచారం చేసి లబ్ధిదారులను కుదించ టానికి పూనుకున్న విషయం తెలిసిందే. పారిశ్రా మికవేత్తలకు, వ్యాపార, వాణిజ్యవేత్తలకు మాత్రం ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్లు పన్ను రాయితీలు ఇస్తున్నది.భూములు, గనులు, సముద్ర తీరం, అటవీ ప్రాంతం తదితర వాటిని ఈశక్తు లకు అభివృద్ధి పేర ధారాదత్తం చేస్తున్నది. ఈ చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి తీవ్ర గండి పడుతున్నది. ఉదాహ రణకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్ర మలకు, ఇతర వాణిజ్య సంస్థలకు పదేళ్లు రాష్ట్ర జీఎస్టి మినహాయిస్తున్నారు. భూములు ఉచితంగా బదలాయిస్తున్నారు. విద్యుత్‌, నీటి సరఫరా రాయితీలతో పాటు ఉత్పత్తి ప్రోత్సాహకాల పేర ప్రతి కార్మికుడికి నెలకు రూ. 7500 ప్రావిడెంట్‌ ఫండ్‌ రాయితీ పేర (యజమాని చెల్లించాల్సిన వాటా) చెల్లింపు, ఆ పరిశ్రమకు అవసరమైన ప్రధాన రోడ్లు, రైల్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం వంటి అనేక రాయితీలు కల్పిస్తున్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు బాగా పెరిగి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతా యని ప్రభుత్వం అంటున్నది. తదారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం పెరుగుతుందని, దీనిద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టొ చ్చని వాదిస్తున్నది. కానీ రాష్ట్ర విభజన తరువాత గడిచిన దశాబ్దంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం లేదనేది వాస్తవం.రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఈ పదేళ్ళలో మూడు రెట్లు అయ్యింది. రాష్ట్ర స్థూల వృద్ధి రేటు సగటున 9శాతం కొనసాగింది. కాని రాష్ట్ర ఖజానాకు ఈ సంపద పెరుగుదల వల్ల పన్నుల ఆదాయంలో గణనీయమైన పెరుగు దల రావాలి కాని రాలేదు. ఉదాహరణకు రాష్ట్ర జిడిపి 2024-15లో రూ.5.24 లక్షలకోట్లు వుండగా 2023-24కి రూ.14.39లక్షల కోట్లకు పెరిగింది. దాదాపు మూడు రెట్లు రాష్ట్ర స్థూల ఆదాయం పెరిగింది. ఇదే మోతాదులో కనీసం రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం పెరగాలి. ఇది జరగలేదు. 2014 నుండి 2024 కాలంలో రాష్ట్ర సొంత పన్నుల నుండి (రాష్ట్ర జీఎస్టీ, అమ్మ కపు పన్ను, ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డ్యూటీ వంటివి) వచ్చిన ఆదాయం కేవలం రూ. 42,618 కోట్లు నుండి రూ.78,026 కోట్లకు మాత్రమే పెరిగింది. మొత్తం రాష్ట్ర సొంత పన్నుల నుండి, కేంద్ర పన్నుల నుండి రాష్ట్రానికి వాటా రూపంలో వస్తున్న ఆదాయం మొత్తం కలిపి చూస్తే రాష్ట్ర జిడిపిలో 9శాతం లోపే పరిమితం అవు తున్నది. రాష్ట్ర బడ్జెట్‌ వ్యయం కూడా రాష్ట్ర జిడిపి పెరుగుదలలో పడిపోతున్నది. 2018-19లో రాష్ట్ర బడ్జెట్‌ వ్యయం రాష్ట్ర జిడిపిలో 17.2 శాతం ఉంటే 2022-23 నాటికి 15.96 శాతానికి పడిపోయింది. అలాగే ముఖ్యమైన మూలధన వ్యయం కూడా రాష్ట్ర జిడిపిలో 2018-19లో 2.2శాతం ఉంటే 20 22-23కి 0.13శాతానికి తగ్గిపోయింది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మోడీ పరిపాలనా కాలంలో బాగా తగ్గి పోతున్నది. కేంద్రం ఇచ్చే గ్రాంట్లలో కూడా కోత పెడుతున్నది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రా ల వాటా ఏకపక్షంగా పెంచేస్త్తున్నది. రాష్ట్ర విభ జన హామీలు అనేకం అమలు చేయటం లేదు. ఈ నిరంకుశ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపటం లేదు. రాష్ట్రాలకు అప్పులు సేకరించు కొనే అవకాశాలపై కూడా కేంద్రం ఆంక్షలు విధి స్తూ కోతలు పెడుతున్నది. దీనిపై కూడా స్పందిం చడంలేదు. గత వైసిపి ప్రభుత్వం సైతం ఇదే వైఖరి అవలంభించింది. అలాగే షరతులతో అప్పులు తీసుకొని ప్రజలపై భారాలు వేయటంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు నష్టకర మైన ప్రమాదకర విధానాల అమలుకు పూను కున్నది.ఈ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అమలు చేస్తూ రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టు పెడు తూ అప్పుల కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది. వైసిపి అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ ఆదేశిత సంస్కరణలు చాలా వేగంగా అమలుకు పూనుకుంటున్నది. ఇటీవల నీతి ఆయోగ్‌ దేశం లోని అతి పెద్ద 18 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక ఆరోగ్య సూచీ-2025 పేర ఒక నివేదికను విడుదల చేసింది.గత పదేళ్ళలో 2022-23 నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఆధారంగా విడు దల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచీలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున 17వ స్థానంలో ఉందనీ నివేదిక తెలి పింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించా లనే పేర ప్రజలపై భారాలకు వొడిగడుతున్నది. సుమా రు రూ.40వేల కోట్లపైబడి ప్రజల సంక్షేమంపై నిధులు ఖర్చు పెట్టకుండా దెబ్బ తీసింది. లక్షల మంది వాలంటీర్లను తొలగిం చింది. ట్రూ అప్‌ చార్జీల పేర రూ.18వేల కోట్లు విద్యుత్‌ చార్జీల భారం మోపారు.స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు బిగింపు కొనసాగిస్తున్నారు.గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని సమీక్షించి ప్రజలకు మేలు చేస్తామని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు రాష్ట్ర జీఎస్టీపై అదనంగా ఒక శాతం సర్‌ చార్జీ విధించాలని కేంద్రాన్ని కోరుతున్నది. ఇలాంటి పన్నుల భారాలు రాబోయే కాలంలో అనేక రూపాల్లో వస్తాయి. చెత్తపై యూజర్‌ చార్జీలు రద్దు చేసినా పీ4 (ప్రభు త్వ, ప్రైవేట్‌, పీపుల్‌ పార్టిసిపేషన్‌) పేర ప్రభుత్వ పౌర సేవలు, మౌలిక సదుపాయాలు,విద్య, వైద్యం వంటి సామా జిక సేవలు ప్రైవేట్‌ శక్తులకు బదిలీ చేయ టానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వంఈ బాధ్యతల నుండి పూర్తిగా వైదొలగబోతున్నది. అలాగే ప్రభు త్వం తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్‌లో వేతనాలు, రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌, వడ్డీ చెల్లింపులు, పరిపాలనా ఖర్చులు (కమిటెడ్‌ ఎక్స్‌ పెండిచర్‌)కు తగు వ్యయం చేయాల్సిఉం టుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 64.6శాతం నిధులు వీటికి ఖర్చు పెట్టాల్సి వస్తు న్నది. ప్రస్తుత కూటమి ప్రభు త్వం వేతనాలు, పెన్షన్ల మీద పెట్టే ఖర్చు తగ్గించు కునే విధానాన్ని అమలు చేస్తున్నది.గత దశాబ్దంలో వేతనాలు, పెన్షన్లపై ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 39.30 శాతం నుండి 37.90శాతానికి తగ్గి పోయింది.ఇప్పుడు ప్రభు త్వం ప్రజల సంక్షేమంపై వ్యయాన్ని కుదిస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, సంపన్నుల అవసరాల కోసం నిధులు ఖర్చు పెడుతున్నది. అదేమంటే 2047 నాటికి రాష్ట్ర జిడిపిని 2.4 ట్రిలియన్‌ డాలర్లలకు పెంచా లని తద్వారా రాష్ట్ర ప్రజలు అత్యంత సంపన్నల వుతారని ప్రచారం చేస్తున్నది. ప్రజలకు తక్షణ అవసరమైన మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రాధాన్యత కాకుండా విమానాశ్రయాలు, భారీ స్టేడియంలు,బుల్లెట్‌ ట్రైన్ల వంటి వాటికి ప్రాధా న్యత ఇస్తున్నారు. తీసుకొ స్తున్న అప్పులు కూడా వీటి కోసం ఖర్చు చేస్తు న్నారు. చివరికి విద్య, వైద్యం వంటి సామాజిక సదుపాయాలకు కూడా ఖర్చు తగ్గించేస్తున్నారు. వ్యవసాయంపై కూడా ఖర్చు పెంచటానికి నిరాకరి స్తున్నారు.రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న ఈవిధా నాలవల్ల ప్రజల ఆదా యాలు పడిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ శ్రామికుల ఆదాయాలు బాగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి దారు ణంగా దెబ్బతిన్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత చిక్కుల్లో పడుతున్నది. ప్రభుత్వం ప్రస్తుత విధానాన్ని విడనాడి సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, నీటి పారుదల, విద్య,వైద్యం వంటి సామాజిక రంగాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ విస్తరణ,ప్రభుత్వ ఉద్యోగ కల్పన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు, ప్రజ లకు తక్షణం ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై ఖర్చులు పెంచాలి. శ్రామి కుల వేతనాలు పెంచాలి.ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ అదుపు,జోక్యం,వ్యయం పెంచాలి.దీనివల్ల ప్రజ లకు ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరుగు తుంది.ఈ ప్రక్రియ జరిగితేనే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక సరుకులకు, సేవలకు డిమాండ్‌ పెరిగి పన్నుల ద్వారా రాష్ట్రానికి అద నంగా రెండు నుండి మూడు రెట్లు సొంత బడ్జెట్‌ ఆదాయం పెరుగు తుంది.అంతేగాక అదనపు ఉపాధి అవకాశాలు కూడా పెరుగు తాయి.కొంత మేరకైనా ఆర్థిక అసమానతలు తగ్గు ముఖం పడ తాయి.ఈదృష్టితో రాష్ట్ర ప్రభు త్వం క్రియాశీల విత్త విధానం అమలు చేపడితేనే రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సమస్యలనుండి బయట పడగలదు.-(బి.గంగారావు)

బడి మారుతోంది

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఇటీవలనే జిల్లాల వారీగా విద్యా సంబంధమైన సమాచారాన్ని విడుదల చేసింది.దాంతోపాటే2023లో-24లో మొత్తం విద్యార్థు ల నమోదు డేటా కూడా వుంది.విద్యా రంగంలో ఏదో గొప్ప అభివృద్ధి వచ్చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పల పసఏమిటో ఈసమాచారం తేల్చివేసింది. అంతకు ముందుతో పోలిస్తే 2023-24లో మొత్తం విద్యార్థుల నమోదు కోటికిపైగా తగ్గిపోయినట్టు చెబుతున్నది. 20 23-24లో మొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లు గా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37లక్షల మందివిద్యార్థులు తక్కువగా నమోదయ్యారు. అయితే 2018-19లోసూళ్లలోనమోదు26.02కోట్లుగా వుంది. తర్వాతి ఏడాది అంటే 2019-20లో ఇది 1.6శాతం పెరిగి,26.45 కోట్లకు చేరుకుంది. అంటే 42లక్షల కంటే ఎక్కువ మంది అదనంగా చేరారన్నమాట. వెనక్కుపోతే 2012-13లో కూడా 26.3కోట్ల నమోదు వుంది. 2012-24 మధ్య దేశ జనాభా పెరుగుదలను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈతగ్గుదల మరింత కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది.
2023-24లోమొత్తం విద్యార్థుల నమోదు 24.8 కోట్లుగా వుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 లక్షల మంది విద్యార్థులు తక్కువగా నమోదు కావడాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. 21 లక్షల మంది పురుష విద్యార్థులు తక్కువగా నమోదు కాగా సంఖ్య 16లక్షల మంది విద్యార్థినులు విద్యా రంగాన్ని వదలివెళ్లిపోయినట్టు చెబుతున్నది. నమోదు సంఖ్యను లెక్కగట్టడంలో గతంకన్నా మెరుగైన పద్ధ తులు తీసుకువచ్చినట్టు మంత్రిత్వశాఖ చెబుతున్నది. బహుశా అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే సంఖ్యలు తగ్గిపోవడానికి ఇది కారణమై వుండొచ్చు నంటున్నది. అయితే ఈతగ్గుదల ఆందోళనకర మైం దనీ ఈసమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆ శాఖే చెబుతున్నది.
నూతన విధానంతో పెద్ద ఎత్తున స్కూళ్ల మూత
బీహార్‌ ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్‌ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలలో ఈతగ్గుదల అత్యధి కంగా వుందని గమనించడం చాలా ముఖ్యం. 20 18-19లో బీహార్‌లో 2.49కోట్లమంది విద్యార్థులు నమోదుకాగా ఇప్పుడు2.13కోట్లకు తగ్గిపోయారు (అంటే35.65లక్షల కంటే ఎక్కువగాతగ్గారు).ఉత్తర ప్రదేశ్‌లో2018-19లో నమోదు 4.44కోట్లు కాగా తాజా నివేదికలో ఈసారి 28.26 లక్షల మంది తగ్గి ఇప్పుడు 4.16 కోట్లకు చేరుకున్నారు. మహారాష్ట్రలో గతంలో2.32కోట్ల మంది నమోదైతే తాజా నివేదిక లో ఆసంఖ్య 2.13కోట్లకు పడిపోయింది. ఈనివేదిక విడుదల తర్వాత ఈ తగ్గుదలకు కారణాలేమిటనే దానిపై వేర్వేరు నిపుణులు వేర్వేరు కారణాలు ముం దుకు తెస్తున్నారు.విద్యా విధానంలో మార్పులు, ఆర్థిక కడగండ్ల పెరుగుదల, స్కాలర్‌షిప్‌ మొత్తాలు సకాలంలో విడుదల చేయకపోవడమో ఎగవేయ డమో ముఖ్య కారణాలుగా వస్తున్నాయి. బిజెపి ప్రభు త్వం మూడేళ్ల కిందట ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ప్రైవేటు విద్యకే పెద్ద పీట వేసింది. హర్యా నా వంటి బిజెపి పాలిత రాష్ట్రాలు ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థులకు సబ్సిడీలిచ్చి ప్రభుత్వ స్కూళ్లలో ఫీజులు పెంచాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో అత్య ధిక భాగం (కాంగ్రెస్‌,బిజెపి రెండిరటి సర్కార్లు నడి చిన రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలతో సహా) ప్రభుత్వ స్కూళ్లను భారీ ఎత్తున మూసివేయడం లేదా కలిపే యడం జరిగింది.అంటే పిల్లలు మరీ ముఖ్యంగా పేదకుటుంబాలకూ దళితులకూ సంబంధించిన పిల్ల లు వెళ్లవలసిన స్కూళ్లు దూరమై పోయాయి. ఎంత దూరమంటే వారు వెళ్లడమే మానుకునేంత. ఇక బాలికల విషయంలో అంత దూరం ప్రయాణిం చడంలో భద్రతా సమస్యలు మరింత నిరుత్సాహ పరుస్తున్నాయి. 2018-19 మధ్య 50 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని యు.డి.ఐ. ఎస్‌.సి (యుడైస్‌) 2022 నివేదిక పేర్కొం టున్నది. 2024లో యు.పి ప్రభుత్వం 27వేలపాఠశాలలు మూసివేసింది.ప్రత్యేకించి బీహార్‌,మహారాష్ట్రలో ప్రైవే టు స్కూళ్లు ఉధృతంగా ప్రారంభమవుతున్నాయి.ఈ రెండు రాష్ట్రాల్లో విద్యార్థుల నమోదు తగ్గడం, ఉత్తర ప్రదేశ్‌లో స్కూళ్ల మూతలు చూస్తుంటే కేవలం ప్రైవే టు స్కూళ్లలో నమోదు పెరగడం ఒక్కటే సమ స్యను పరిష్కరించలేదని అర్థమవుతుంది.
కేరళలో మెరుగైన ఫలితాలు
విద్యార్థుల నమోదు పెంచడానికే గాక వారు కొనసా గేలా చూడాలన్నా ఉచిత ప్రభుత్వ విద్య అందించడం ఏకైక మార్గమని కేరళ అనుభవం మనకు నొక్కి చెబు తుంది.విద్య నాణ్యత పెంచేందుకూ అదే మార్గం. 2021-22లో కేరళలోస్థూలనమోదు నిష్పత్తి (జి.ఇ. ఆర్‌) 41.3శాతంగా వుంది. జాతీయ సగటు 28.4 శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. ఒక నిర్దిష్ట వయో బృందంలో ఉన్నత విద్యా భాగస్వామ్యం ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి జి.ఇ.ఆర్‌ కీలక సూచిక. తాజాగా2023-24 నివేదికలోకూడాకేరళ నమోదు సంఖ్యలు ఎంతో ప్రోత్సాహకరంగా వున్నాయి. ఈ రాష్ట్రంలో బాలికల చేరిక అబ్బాయిలను మించి వుం డటం నిజంగా ప్రశంసనీయమైన విషయం. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు, ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించడం, స్కూళ్లలో ఆరోగ్యవంతమైన సుహ్రృద్భావ పూర్వకమైన వాతావ రణంకోసం కేటాయింపు ఇవన్నీ విద్యార్థుల నమోదు పెరగడానికి, నిలబడటానికి దోహదం చేస్తున్నాయి.
కనీస సదుపాయాల లేమి
యుడైస్‌ తాజా నివేదిక వెల్లడిరచే అంశాలు విద్యా ర్థుల సమస్యలకోణం నుంచి కూడా చూడాలి. ప్రత్యే కించి పేదలు సామాజికంగా అణగారిన వర్గాల పిల్లలు అనేక రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితిని పరిశీలించాలి.చాలా స్కూళ్లలో అమ్మాయిలకు ప్రత్యే కంగా మరుగుదొడ్లు కూడా లేవని ఈ నివేదిక చెబు తున్నది. ఉన్నవాటిలో చాలా చోట్ల తలుపులు లేవు. చాలా బళ్లలో మంచినీటి సదుపాయం లేదు. అనేక స్కూళ్ల భవనాలు శిథిలావస్థలో వున్నాయి.తరగతి గదుల్లోకి వేటలుతురే రాదు. కుర్చీలు,టేబుళ్లు కూడా వుండవు. అనేక రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు, ప్రిన్సి పాళ్లు, ఉద్యోగులు పిల్లలపై అత్యాచారాలకు, లైంగిక హింసకు పాల్పడిన ఘటనలు జరిగాయి. దేశంలో అత్యధిక చోట్ల స్కూళ్లలో కుల వివక్ష సంఘటనలు లెక్కలేనన్ని జరిగాయి.విద్యారంగంలో విచారకర మైన ఈ పరిస్థితికి ఇవన్నీ కారణాలే.
ఏకోపాధ్యాయులు, పారా టీచర్లు
చాలా రాష్ట్రాల్లో ప్రస్పుటంగా కనిపించే పెద్ద లోపం ఏకోపాధ్యాయపాఠశాలలు పెద్ద సంఖ్యలో వుండటం. ఉదాహరణకు ఒకేటీచరు నాలుగు నుంచి ఆరు క్లాసులు ఇంకా ఎనిమిది క్లాసులు కూడా చూసుకునే పరిస్థితి వుంది.ప్రభుత్వ నివేదికల ప్రకారం 2023-24లో భారత దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,10,971వున్నాయి.ఇలాంటి పాఠశాలల్లో 89 శా తం గ్రామీణ ప్రాంతాల్లోనే వున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌,గోవా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌,జార్ఖండ్‌,ఉత్త రాఖండ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లలో ఏకోపాధ్యా య పాఠశాలలు ఎక్కువగా వున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అధికంగా వుండగా కేరళలో కూడా కొన్నివున్నాయి.కానివాటిలో విద్యా ర్థుల సంఖ్య చాలా తక్కువ. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ గా పిల్లలున్నారు. కేరళలోనైతే వాటిలో సగటున పది మంది పిల్లలున్నారు. నిజానికి కేరళలో ఏకోపాధ్యా య పాఠశాలలు అతి తక్కువగా వుండగా వాటిలో పిల్లల సంఖ్య కూడా దేశంలోకెల్లా తక్కువగా వుంది. సగటున ఒకఏకోపాధ్యాయ పాఠశాలలో 70, బీహార్‌ లో నైతే 96 మంది పిల్లలు వున్న పరిస్థితితో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా వుంటుంది.
అందువల్ల ఇక్కడ ప్రభుత్వ తాజా నివేదికలో ఆందోళన కలిగించేది పిల్లల నమోదు తగ్గిపోవడం ఒక్కటే కాదు. పాఠశాలల్లో వసతులు అధ్వాన్నంగా వుండటం,చాలా స్కూళ్లలో బోధనా ప్రమాణాలు కూడా దారుణంగా వుండటం. ఈ విషయంలోనూ కేరళ పరిస్థితి చాలా మెరుగ్గా వుంది. ఇక్కడ ముఖ్యం గా గమనించాల్సింది ఏమంటే కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో పారాటీచర్లు, కాంట్రాక్టు టీచర్ల నియా మకమే లేదు.అక్కడ టీచర్ల ఉద్యోగాలు పర్మనెంటు పోస్టులు. వారు తమ బోధనా నైపుణ్యాన్ని బోధనా పద్ధతులను నిత్యం మెరుగు పర్చుకుంటుంటారు. ఆ ప్రక్రియపై పర్యవేక్షణా నిరంతరంగా సాగుతుంటుం ది.దీంతో పోలిస్తే యు.పిలో24వేల మంది కాంట్రా క్టు పద్ధతిలో ఆదేశాల ఉపాధ్యాయులు వున్నారు. ఎనిమిదో తరగతి వరకూ బోధించేందుకుగాను వీరికి రూ.7000 ఇస్తారు. వారిలో చాలా మంది అవసరమైన అదనపు ఆదాయంకోసం టైలర్లు, ఆటో డ్రైవర్లు, దుకాణాలలో సహాయకులుగా పని చేస్తుం టారు. అంతేగాక 1,42,000 విద్యా మిత్రలను కూడా వార్షిక కాంట్రాక్టు పద్ధతిలో నియమించు కున్నారు.ఏ క్షణంలోనైనా ఉద్యోగం ఊడిపోవచ్చు ననే భయంలో కొట్టుమిట్టాడే వారు బోధనపై శ్రద్ధ పెట్టడం ఊహకందని విషయం. ఇంతేగాక ప్రభుత్వ పాఠశాలల్లో లక్షమంది ప్రిన్సిపాళ్లు, టీచర్ల పోస్టులు ఖాళీ పడి వున్నాయి. చాలా రాష్ట్రాల పాఠశాలల్లో నమోదు తగ్గిపోవడం, విద్యా ప్రమాణాలు నాసిగా వుండటం భవిష్యత్తుపై చాలా హానికర ప్రభావం చూపిస్తాయి.నమోదులోనూ పిల్లలను నిలబెట్టు కోవ డంలోనూ కేరళ విజయం ఉత్సాహకరంగా వుంది. దాంతోపాటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిరంతరం మెరుగుదల తీసుకురావడం, కూడా విస్తృతంగా ప్రచారం చేయవలసి వుంది. అత్యవసరమైన ఈ మార్పులు సాధించాలంటే ఆ విజయాలకు కారణ మైన అక్కడి పద్ధతులను అనుసరించడం కూడా కీలకమవుతుంది.
ఏపీలో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు ఆంధ్ర ప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.దీనిలో భాగం గా ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగిం చింది.అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హైస్కూల్‌ ప్లస్‌ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది.అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశా లలకు అనుసంధానం చేసి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు.బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ-1,2తో పాటు 1నుంచి 5తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యఆధారంగా టీచర్లను కేటా యిస్తారు.మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగ తులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి, ప్రతి తరగతికి ఒకటీచర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటారు.హైస్కూల్‌ ప్లస్‌లకు ప్రత్యామ్నా యంగా బాలికలకు ఇంటర్‌ విద్య అందించే ఉద్దే శంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్‌ కాలేజీల విధా నం తేవాలని భావిస్తున్నారు.దీంట్లో భాగంగా జిల్లాలో ప్రక్రియకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
హైస్కూల్‌ ప్లస్‌ వ్యవస్థ రద్దు..
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ బడులను ఉన్నతీకరించడం,లేదంటే ప్రాథమిక బడులుగా మార్చడం చేస్తుంది.ఇంటర్మీడియట్‌తో ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌ వ్యవస్థను తీసేయనుంది.వీటిల్లోని ఇంటర్‌ను ఇంటర్మీడియట్‌ విద్యాశాఖఖు అప్పగించ నుంది.గతేడాది డిసెంబర్‌ 31వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.జాతీయ రహదారులు,రైల్వే లైన్లు,వంతెనలు,పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల విధానాన్ని అమలు చేయనుంది.ఈవిధానాలపై అవగాహన కల్పించేందుకు,ఇప్పటికే జిల్లా,క్లస్టర్‌, మండలస్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. -(సుభాషిణీ అలీ)

వైవిధ్యాన్ని ప్రొత్సహిద్దాం..

‘ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణచి వేయా లని చూస్తే నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోనే మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలనిచూస్తే నేను చిన్న మతం వైపు నిలబడ తాను. ఆమై నారిటీ మతంలో కులాలు ఉం డి అది ఒక కులం మరొక కులాన్ని అణగదొక్కాలని చూస్తే ఆఅణచివేతకు గురయ్యే కులం వైపు నిలబ డతాను.ఆణిచి వేతకు గురైన కులంలో ఒక యజ మాని తన నౌకరుని అణిచివేస్తుంటే నేను ఆ నౌకరు వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్ని కాలరాస్తుంటే నేను ఆ నౌకరు భార్య వైపు నిలబడి గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేది అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏస్థితిలో ఉన్నా అది నా శత్రువు!’అంటాడు పెరియార్‌ ఇ.వి. రామస్వామి. భారత దేశ నాగరికత అతి ప్రాచీనమైనది. కాల ప్రవా హంలో కొన్ని నాగరికతలు, సంస్కృతులు కాల గర్భంలో కలిసిపోతుంటాయి. కొత్త నాగరికతలు, సంస్కృతులు పుట్టు కొస్తుంటాయి. ఎన్నో మతాలు, సంస్కృతులసంగమం మనదేశం. అనేక సాంప్ర దాయాలు, చారిత్రక నేపథ్యాలున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైనుల సహజీవనం మన సంస్కృతి. రాచరిక ప్రభువుల నిరంకుశత్వాన్నిదాటి, భూస్వాములఅరాచ కాలను, ఆగడాలను ఎదుర్కొని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన జీవన విధా నంగా చేసుకున్నాం. భిన్న సంస్కృతులను విశాల దృక్పథంతో అర్థం చేసు కొనేవారితోనే సమానత్వం సిద్ధిస్తుంది. ఈ వైవిధ్యా న్ని సమాజ రక్షణ కోసం ఏర్పడిన రాజ్యం దాన్ని విస్మరిస్తూ విద్వేషం వెదజల్లు తున్న వేళ..న్యాయమూర్తులే విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న సమయం. ఈ నేపథ్యంలో మైనార్టీల హక్కు ల దినోత్సవ ఆవశ్యకత ఎంతైనా ఉంది.
థీమ్‌..
ఈఏడాది మైనారిటీ హక్కుల దినోత్సవ థీమ్‌ ’’వైవిధ్యాన్ని ప్రోత్సహించడం,హక్కులను పరిర క్షిం చడం!’’ అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇంతకుముందు కూడా థీమ్‌లను ప్రకటించారు. మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణ గడప దాట లేదు.కేంద్రంలో మోడీ పదేళ్ల పాలనలో మైనార్టీల హక్కులపై ఎడాపెడా దాడులు జరుగుతున్న నేపథ్యం లో ఈథీమ్‌ కార్యరూపం దాల్చాలంటే పోరాటం మినహా మరో మార్గం లేదు.
మనిషితనాన్ని కోల్పోయి..మనిషి రక్తాన్ని మరిగినప్పుడు-ఈ దుష్ట సంస్కృతిని,నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ..‘మేమూ మనుషులమే..ఈ గడ్డలో మేమూ భాగమే..మమ్మల్నీ బతకనీయండి’ అంటూ నినదించే పౌర సమాజ బృందాలు,కార్యకర్తల గొంతులను, బిగించిన పిడికిళ్లను బుల్డోజ్‌ చేస్తూ..అణచివేస్తుంటే.. ఆఅణచివేతను,ఆనిరంకుశత్వాన్ని ఎదిరించే పోరా టాలే మానవ హక్కులయ్యాయి.ఏదేశంలోనైనా హక్కు ల ఉల్లంఘన, అణచివేత.. ఆందోళన కలిగించే విష యమే.‘ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే..వారిమానవత్వాన్ని సవాలు చేయడమే’ అంటా డు నెల్సన్‌ మండేలా.జాతీయత,మతం,వర్గం, జాతి నేపథ్యంతో సంబంధం లేకుండా సమాజ మంతటికీ లభించే సమానత్వం,గౌరవం,స్వేచ్ఛ కనీస అవసరం. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా,అనేక దేశాల్లో మానవ హక్కులకు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు పూర్తి భరోసా లేని పరిస్థితి ఏర్పడిరది. అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్‌లో సైతం మైనారిటీల హక్కుల హననం కొనసాగుతోంది.
ఇలా ఏర్పడిరది..
ఐక్యరాజ్యసమితి మొట్టమొదట మైనార్టీ హక్కుల దినోత్సవంగా1992,డిసెంబర్‌ 18వతేదీని పరిగ ణిం చింది.మతము,జాతి,భాషా,లింగం,సంస్కృతి పరంగా మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఈ రోజును గుర్తిం చాల్సిందిగా ప్రకటించింది.మనదేశంలో కూడా డిసెం బర్‌ 18ను మైనార్టీ హక్కుల దినోత్సవంగా ప్రకటించి, చట్టం చేసి జాతీయ మైనారిటీల కమిషన్‌ (ఎన్‌ఎంసి -1992) నియమించింది.2024 మైనారిటీ హక్కుల దినోత్సవం యొక్క థీమ్‌ (ప్రమోటింగ్‌ డైవర్సిటీ అండ్‌ ప్రొటెక్టింగ్‌రైట్స్‌)వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, హక్కు లను రక్షించడం.
రాజ్యాంగ హక్కు..
భారత జాతీయ మైనారిటీల కమిషన్‌ మనదేశంలోని ముస్లింలను (14.2) క్రైస్తవులను (2.3),సిక్కులను (1.7),బౌద్ధులను(0.7),పారశీలను(0.06), జైనులను (0.4) మైనార్టీలుగా గుర్తించింది. మైనార్టీలకు భద్రతా, సమానత్వం,సమన్యాయం అందించడం రాజ్యాంగ బద్ధమైన ఆదేశమే కాక సామాజిక అవసరం కూడా. గాంధీజీ అన్నట్లు’’ఒక దేశంగొప్పతనం అన్నది ఆ దేశంలో అణగారిన వారు ఎలా చూడబడు తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది’’.ఈరోజు మతం పేరు తో మనదేశంలో జరుగుతున్న దాడులు కొద్దిమంది మతోన్మాదులకు తృప్తిని కలిగించవచ్చు. కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగు తుందన్న స్పృహ అవసరం. గోరక్షణ పేరుతో మానవ హత్యలు గావించడం, మైనారిటీ మహిళలను నగంగా ఊరేగించి హత్యాచారాలు చేయించడం యథేచ్చగా కొనసాగుతోంది.హిజాబ్‌, హలాల్‌, అజాన్‌, నమాజ్‌ల పేర్లతో మతాచారాలపై, మైనారిటీల ఆస్తులపై బుల్డో జర్లను ప్రయోగించి నిరాశ్రయులను చేస్తోంది. ఇవన్నీ రాజ్యాంగ అతిక్రమణ చర్యలే కాదు అమానవీయ మైనవి.
మైనారిటీల స్థితిగతులు..
మనదేశంలోని మైనార్టీ స్థితిగతులపై నివేదిక కోసం 2005,మార్చి 9న ప్రధానమంత్రి జస్టిస్‌ రాజేందర్‌ సచ్చార్‌ నాయకత్వాన ఒకకమిటీ వేయడం జరిగింది. ఈదేశంలో ముస్లిం మైనార్టీలు,విద్యా,ఉపాధి, ఆర్థిక పరంగా ఎంత వెనుకబాటుతనంలో ఉన్నారో సమూల వివరణలతో ఆ కమిటీ రిపోర్టు సమర్పించింది. వీటిని అధిగమించటానికి సూచనలు కూడా చేసింది. కానీ కమిటీలు వేయడంలో ఉన్నంత చిత్తశుద్ధి, దాని సూచనలు అమలులో లేకపోవడం విచారకరం. ప్రధా నంగా విద్యను మాతృభాషలో అందించటానికి ప్రాధా న్యత నిస్తూ పాఠశాలలు ఏర్పాటు చేసినా,ఆంగ్ల భాష మీద చూపే ప్రేమ మైనార్టీ భాషనే కాదు మెజార్టీ స్థానిక భాషలపైనా ప్రభావం చూపుతుందన్నది సత్యం. ఈ పరిస్థితి మైనార్టీలను మధ్యలోనే విద్యకు దూరం చేసి, మరింత వెనుకబాటులోకి నెట్టివేస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉన్న జాతీయ స్కాలర్‌ షిప్‌,విదేశీ విద్యకు అందే స్కాలర్‌షిప్‌లను కేంద్ర ప్రభు త్వం నిలిపివేసింది. ప్రాథమిక విద్యలోనే ఆటం కాలు ఏర్పడితే ఉన్నత విద్యకు వెళ్ళడం అసాధ్యమైన విష యంగా మైనార్టీలకు పరిణమించింది. దీంతో పిల్ల లను బడి మాన్పించి,పనుల్లోకి పంపడం జరుగు తోంది. బాలికలలో ఇది మరింత పెరిగి బాల్యవివాహా లకు దారితీస్తుంది.- (యం.డి.షకీలా బేగం)

ఆంధ్ర అభివృద్ధికి అండగా`ప్రధాని నరేంద్ర మోడీ

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి పర్యటన సంద ర్భంగా,నరేంద్ర మోదీ విశాఖపట్నంలో రూ. 2.08లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో నేడు విశాఖ పట్నంలో రూ.2.08 లక్షలకోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ..ఆంధ్ర ప్రజల ప్రేమ,అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. చంద్రబాబు స్పీచ్‌తో సిక్సర్‌ కొట్టారని పేర్కొన్నారు.60 ఏళ్ల తర్వాత దేశంలో మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోదీ గుర్తు చేశారు.
అండగా ఉంటాం..
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని అన్నారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని మోదీ పేర్కొ న్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడిరచారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2030లోగా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని తెలిపారు. నవయుగ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌ డిమాండ్‌ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్‌ రాకతో వ్యవసా యంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్‌ అని మరోసారి గుర్తు చేశారు ప్రధాని మోదీ.
చిరకాల వాంఛ నెరవేరుతుంది: ప్రధాని
‘దేశంలో రెండు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు వస్తుంటే..అందులో ఒకటి విశాఖకు కేటాయిం చాం. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ద్వారా ఎంతోమం దికి ఉపాధి లభిస్తుంది. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశాం. 3 రాష్ట్రా ల్లోనే ఇలాంటి బల్క్‌ డ్రగ్‌ పార్కులు వస్తున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్‌ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్‌ కీలకం కానుంది. రైల్వే జోన్‌ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్‌ వల్ల వ్యవసాయ,పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి.’అని ప్రధాని మోదీ అన్నారు.
మేమంతా కష్టపడి పని చేస్తున్నాం`పవన్‌
‘అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్‌ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్ద డానికి మేమంతా కష్టపడి పని చేస్తున్నాం. గత ఐదేళ్ల చీకటి రోజుల నుంచి,అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు రాష్ట్రంలో పూయిం చడానికి అడుగులు వేస్తున్నాం.దీనిలో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ. 2.10లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సహకారంతో తీసుకువచ్చాం. ఈ నిరంతర అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి.ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ వారికి మరింత అండగా నిలుస్తామ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.గత ఐదేళ్ల అరాచక, అభివృద్ధిరహిత పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ కొత్తగా తన ప్రయాణాన్ని అభివృద్ధి పథంలో మొదలుపెట్టబోతుందని చెప్పారు. జనవరి 8న విశాఖపట్నం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పలు జాతీయ రహదారులు, ప్రాజెక్టు లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తూ ‘‘సదుద్దేశం..సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నడిచినా అది నిరర్ధక నడకగా చరిత్రలో మిగిలిపోతుంది.
అభివృద్ధిలో అందరికీ సమాన వాటామోదీ సంకల్పం
అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు,15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు.జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ 24గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధాన మంత్రి గారిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా..నమ్మకం..ప్రధాన మంత్రి గారిపై చూపిన నమ్మకం నేడు రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి.70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆగ్రామాలకు ప్రధాన మంత్రి సడక్‌ యోజన పథకం కింద ఈరోజున రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుం డడమే కారణం. భారత దేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌,ఉత్తరాంధ్ర,రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృ ద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ రోజుఈ పెట్టుబడులు. వారి సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శక త్వానికి మనస్ఫూర్తిగా కృతజ్నతలు.
రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం
ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలో కూరుకుపోయిన సమయంలో ఎన్డీఏ కూటమితో ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు మోదీ ఆశాజ్యోతిగా నిలిచారు.ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి అస్కారమే లేదు అనే పరిస్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్ర ప్రదేశ్‌ అని చెప్పుకొనేలాచంద్ర బాబునాయుడు నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తున్నాం. వారి సూచనలు,సలహాలతో రాష్ట్ర అభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడతాం.దేశ ప్రగతిలో భాగస్వా ములవుతాం. ప్రధాన మంత్రికి అండగా ఉంటాం. ప్రజలు నమ్మకం పెట్టారు.మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రూ.రెండు లక్షల పై చిలుకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి గారు, సమర్ధవంతులైన చంద్రబాబు గారు నాయకత్వంలో మా సహచర మంత్రులు, కార్యకర్తలు అభివృద్ధిలో భాగస్వాములవుతాము. ప్రజలంతా ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను’’ అన్నారు.ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మారు.. వారి నమ్మకాన్ని నిలుపుకొన్నాము..
రాష్ట్రానికి ఆక్సిజన్‌ అందిస్తున్న ప్రధాని మోడీజీ!
గత ప్రభుత్వ అసమర్థత వలన వెంటిలేటర్‌ పైకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్‌ అందిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రతి నెలా రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌ తో ఏపీ ప్రభుత్వం నడుస్తోంది. వెంటిలేటర్‌ పై ఉన్న రాష్ట్రానికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆక్సిజన్‌ అందిస్తున్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 12157 కోట్ల కేంద్రం నుంచి సాయం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అయ్యాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి మన విజనరీ లీడర్‌ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ పనిచేస్తున్నారు. వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్న గత ప్రభుత్వాన్ని చూసాం. కానీ చంద్రబాబు గారు ఒకే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచాం,దీపం పథకం ద్వారా ఉచి తంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నారు,త్వరలోనే మెగా డీఎస్సి, త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వ బోతున్నారు…దటీజ్‌ సిబిఎన్‌. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చరిత్రలో ఈరోజు సువర్ణాధ్యాయం.
వికసిత్‌ భారత్‌ స్పూర్తితోనే స్వర్ణాంధ్ర 2047
బ్యూటీఫుల్‌ సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖపట్నం తరపున గౌరవ ప్రధాని నరేంద్రమోడీజీకి స్వాగతం.ప్రతి భారతీయుడి గుండెల్లో నరేంద్ర మోదీ. డీజీ కారణంగా ఈరోజు ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది. నరేంద్రమోడీ పిఎం అనే పదానికి అర్థాన్ని మార్చేశారు, మామూలుగా పిఎం అంటే ప్రైమ్‌ మినిస్టర్‌,నరేంద్ర మోడీజీ పీపుల్స్‌ మ్యాన్‌.నరేంద్ర మోదీ జీ విజన్‌ గ్లోబల్‌. అయినా అతని హృదయం మాత్రం పేద ప్రజలతోనే ఉంటుంది. నమో అంటే పేదవాడి నమ్మకం, పేదవాడి భరోసా,దేశానికి ధైర్యం. పేదల చిరునవ్వు, మహిళల ఆత్మగౌరవం, యువత భవిత, అన్నదాత కళ్ళలో ఆనందానికి ప్రతిరూపం మోడీజీ.వికసిత్‌ భారత్‌ 2047విజన్‌ డాక్యు మెంట్‌ రిలీజ్‌ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చెయ్యాలనే లక్ష్యంతో మోడీజీ పనిచేస్తున్నారు.2014నాటికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ నేడు 5స్థానానికి వచ్చింది.వికసిత్‌ భారత్‌ -2047లక్ష్యంతో టాప్‌ 1లేదా 2ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు. నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి తో మన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర -2047 విజన్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేసారు.వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యువబుల్‌ ఎనర్జీ, పోర్ట్స్‌, ఎయిర్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ ఇలా అన్ని రంగాల్లో నిర్ణీత లక్ష్యాలతో ముందుకు వెళ్లడమే స్వర్ణాంధ్ర 2047 ముఖ్యోద్దేశం.
ప్రజల నీరాజనాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్‌ షోలో విశాఖవాసులు అడుగ డుగునా బ్రహ్మరథం పట్టారు.ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం విశాఖపట్నం చేరుకున్న పీఎం ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి సాయం త్రం స్థానిక వెంకటాద్రి వంటిల్లుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహించారు.ఈక్రమంలో ప్రధాని, ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజల నుంచి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. సుమారు కిలో మీటరు మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు,పవన్‌ కళ్యాణ్‌ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. రోడ్‌ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ.. మోదీ..అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్‌ రోడ్‌ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.- జి.ఎన్‌.వి.సతీష్‌

వాయు కాలుష్యంలో ఢల్లీి..ప్రమాద అంచన జనజీవనం

దేశ రాజధాని ఢల్లీిలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది.దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది.దేశంలో అత్యంత ప్రముఖలుండే కీలక ప్రాంతంలోనే వాయు కాలుష్యం అంతలా పెరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదు.ఈఏడాది మళ్లీ కొరలు చాస్తోంది.వాయు నాణ్యత సూచీలో ఇది 422గా సూచిస్తోంది.కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపరితీసుకోలేకపోతున్నారు.కాలుష్యం దెబ్బకు విద్యాసంస్థలను మూసివేయాల్సి వచ్చింది.విమానాలకు అంతరాయం కలుగుతోంది.సాధారణ జన జీవనం ప్రభావితం అవుతోంది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు.
దేశ రాజధాని ఢల్లీి నగరం కాలుష్య రాజధానిగా కూడా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢల్లీితో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-ఎన్‌.సి.ఆర్‌)అంతా వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర రీతిలో పెరుగుతోంది.ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఎ.క్యు.ఐ)వరుసగా మూడు రోజుల పాటు 500మార్కును దాటడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. నిపుణులు ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా దీనిని అభివర్ణిస్తున్నారు.కొద్ది రోజుల నుండే దేశ రాజధానిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. జెఎన్‌యు ఆన్‌లైన్‌బాట పట్టింది. అనేక ప్రైవేటు సంస్థలు ఇప్పటికే వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమ లు చేస్తుండగా,తాజాగా ఢల్లీి ప్రభుత్వం సైతం 50శాతం ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలని ఆదేశించింది.పెద్ద సంఖ్యలో ప్రజానీకం రోగాల బారిన పడటం,రోడ్లన్నీ పొగతోనిండి ఊపిరాడని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర పనులుంటేనే ప్రజలురోడ్ల మీదకు రావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.ఇళ్ల దగ్గర కూడా కిటికీలు మూసి ఉంచాలని, నాణ్యమైన ఎయిర్‌ ప్యూరిఫయర్లు వాడుకోవాలని సూచించింది.వీటన్నింటిని పాటించడం ఎందరికి సాధ్యమవుతుందన్న సంగతి అటుంచితే పరిస్థితి తీవ్రతకు నిదర్శనాలుగా భావించవచ్చు.ఈస్థాయి విపత్తును కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండటం, ఆప్‌ సర్కారుకు సహాయ నిరాకరణ చేస్తుండటం మోడీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.వర్షాలు కురిస్తే కాలుష్యం అదుపులోకి వచ్చే అవకాశం ఉండటంతో మేఘ మథనానికి అనుమతి ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం! రెండు సంవత్సరాల క్రితం ఇటువంటి పరిస్థితే నెలకొన్నప్పుడు వాయుకాలుష్యాన్ని రాజకీయ పోరుగా మార్చవద్దని సర్వోన్నత న్యాయ స్థానం సూచించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరం. వాయు కాలు ష్యంతో ఢల్లీి ప్రజానీకం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు జోక్యం చేసుకుంది.అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో పంజాబ్‌,హర్యానాతో పాటు ఢల్లీి పరిసరాల్లో ఉన్న అనేక రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబట్టే సంఘటనలు గత రెండు సంవత్సరాల్లో కొంత మేర తగ్గిన్నట్లు చెబుతున్నారు.అయినా కాలుష్యం తగ్గకపోగా, మరింతగా పెరుగుతోంది. దీంతో ఇతర కారణా లనూ అధికార యంత్రాంగం అన్వేషిస్తోంది.ఉదాహరణకు ఈ నెల 12వ తేది ఒక్కరోజే ఢల్లీి నగరంలో 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగినట్లు, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చినట్లు అధికారులు గుర్తించారు. వ్యక్తిగత వాహనాల వినియోగం సాధ్యమైనంత మేర తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా పెంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సి.ఎస్‌.ఇ) అక్టోబర్‌లో చేసిన అధ్యయనం ప్రకారం ఢల్లీి స్థానిక వాయు కాలుష్యంలో రవాణా రంగ వాటా సగానికి పైగా ఉందని తేలింది. 2021లో విడుదలైన ఒకనివేదిక ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతంలో కాలుష్యానికి పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం కూడా ప్రధాన కారణాలే! 30శాతం ఢల్లీి నగరంలో నగర పాలక సంస్థ సేవలు అందకపోవ డంతో స్థానిక ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ తగల బెడుతున్నారు. ఈ పరిస్థితులే ఢల్లీిని కాలుష్య రాజధానిగా మారుస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ రెండు సంవత్సరాల క్రితం రూపొందించిన నివేదికలో కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢల్లీి ప్రజానీకం తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారంటూ హెచ్చరించింది. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పులు రాలేదు. సమిష్టి చర్యల ద్వారానే కాలుష్య నియంత్రణ సాధ్యమవు తుందన్న అంశాన్ని కేంద్రం గుర్తించాలి. ఢల్లీి ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలి.ఇప్పుడు కూడా ఈదిశలో కదల కపోతే, భవిష్యత్తులో చేయడానికి ఏమీ మిగలని పరిస్థితి ఏర్పడుతుంది.
గాలి కాలుష్యాన్ని ఎలా లెక్కిస్తారు? ఏక్యూఐ ఏ స్థాయికి పెరిగితే మనుషులకు ప్రమాదకరం?
విషపూరితమైన గాలి,పొగ కమ్మేసి,ఏమీ కనిపించని పరిస్థి తులతో దేశ రాజధాని దిల్లీతో పాటు చుట్టుపక్కల నగరా ల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం,సురక్షిత స్థాయిగా భావిం చే గాలి నాణ్యత (ఏక్యూఐ)కన్నా దిల్లీ,చుట్టుపక్కల ప్రాం తాల్లో 30నుంచి35రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంది. నాసా అంతరిక్షం నుంచి తీసినశాటిలైట్‌ చిత్రాల్లో ఉత్త ర భారతదేశంతో పాటు పాకిస్తాన్‌ను కూడా దట్టమైన పొగ కమ్మేసినట్టు కనిపిస్తోంది.దట్టమైన పొగతో విమా నాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.కొన్ని విమానాలు రద్దవుతున్నాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ)మానిటరింగ్‌ గ్రూప్‌ లెక్కల ప్రకారం, 2023లో ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన రాజధాని దిల్లీ.అత్యంత కాలుష్యపూరితమైన దేశాల జాబి తాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ కంటే ముందు స్థానాల్లో బంగ్లాదేశ్‌,పాకిస్థాన్‌ ఉన్నాయి.
ఏటా భారత్‌లో అక్టోబరు నుంచి జనవరి వరకు శీతాకాలంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతుంది.ఉష్ణో గ్రతలు పడిపోవడం,పొగ,దుమ్ము,చల్లని గాలులు, వాహ నాల నుంచి వచ్చే వ్యర్థాలు,చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంవల్ల వచ్చే పొగ కలిసి ఈ పరిస్థి తిని సృష్టిస్తాయి.భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ జనా భాలో 99శాతం మంది నాణ్యత లేని గాలిని పీల్చుక ున్నారు. పేద, వెనకబడిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
గాలి కాలుష్యం ఎలా లెక్కిస్తారు?
మనుషులు చేసే పనుల వల్ల కొంతమేర గాలి కలుషిత మవుతోంది.వాహనాలకు ఉపయోగించే ఇంధనం, వంట నుంచి వచ్చే ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఇక ధూళి తుపాను, కార్చిచ్చులు, అగ్నిపర్వతాలు పేలడం వంటివి గాలి కాలుష్యానికి ప్రకృతి పరమైన కారణాలు. కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి ఎయిర్‌ క్వాలిటీ మానిటర్లు సెన్సర్లను ఉపయోగిస్తాయని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ తెలిపింది.గాలి కాలుష్యం తీవ్రతను గుర్తించడానికి కొందరు లేజర్లను ఉపయోగిస్తే, మరికొందరు భూమి నుంచి విడుదలయ్యే శక్తిని అంచ నావేయడానికి శాటిలైట్‌ చిత్రాలపై ఆధారపడతారు. మనుషుల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే కాలుష్య కారకాలలో పీఎం 2.5, పీఎం 10,ఓజోనో, నైట్రోజన్‌ ఆక్సైడ్‌,సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటివి ఉన్నాయి. పీఎం 2.5లో 2.5మైక్రోమీటర్లు అంతకన్నా తక్కువ మందమైన సూక్ష్మ రేణువులు ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.ఈసూక్ష్మ రేణువులు మన రక్తనాళా ల్లోకి ప్రవేశించి అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగి స్తాయి.గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) స్కేల్‌ సున్నా స్థాయి నుంచి 500 వరకు ఉంటుంది. ఏక్యూఐ సున్నా ఉంటే గాలిలో ఎలాంటి కాలుష్యం లేదని అర్థం. 500 ఉంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. గాలి నాణ్యతకు సంబంధించిన సంక్లిష్ట సమాచారాన్ని, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి కావాల్సిన చర్యలు తీసుకోగ లిగే సమాచారంగా మార్చే కమ్యూనికేషన్‌ సాధ నం ఏక్యూఐ అని ఐక్యూఎయిర్‌ సంస్థ ప్రతినిధి అర్మన్‌ అరరా డియన్‌ చెప్పారు.
కచ్చితత్వం ఉందా?
ప్రభుత్వ కేంద్రాలు, ఇతర మార్గాలు, శాటిలైట్‌ మానిటర్ల నుంచి వచ్చే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సమాచారాన్ని సమ్మిళితం చేసి కాలుష్యాన్ని లెక్కిస్తారని యూఎన్‌ఈపీ తెలిపింది.వాస్తవ పరిస్థితులు, కాలుష్య కారకం ఆధారంగా ఎయిర్‌ క్వాలిటీ ఇండె క్స్‌ రీడిరగ్స్‌ ఉంటాయి.2001లో యూఎన్‌ ఈపీ,ఐక్యూఎయిర్‌ కలిసి తొలి రియల్‌ టైమ్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ ఎక్స్‌పోజర్‌ క్యాలి క్యులేటర్‌ను ప్రారంభించాయి.ఇది117 దేశాలకు చెందిన6,475మానిటర్ల నుంచి వచ్చే రీడిరగ్‌లను ఒకేసారి లెక్కిం చగలదు. ‘పీఎం2.5స్థాయి పెరిగేకొద్దీ వృద్ధులు, పిల్లలు,శ్వాస,గుండెసంబంధమైన సమస్య లున్నవారిపై మొదట ప్రభావం పడుతుంది’’ అని అరరాడియన్‌ చెప్పారు.‘‘పీఎం2.5 రేణువులస్థాయి ఇంకా పెరిగే కొద్దీ జనాభా లో ఎక్కువమంది ఆరో గ్యంపై నాణ్యతలేని గాలి ప్రభావం పడు తుంది.పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్య లకు గురయ్యే ప్రమాదముంది’’అని ఆయన చెప్పారు. ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాల నుంచి తీసు కున్న లెక్కల ఆధారంగా ఏక్యూఐఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బిజీరోడ్లు, పారిశ్రామిక జోన్‌ల వంటి ప్రాం తాల్లో గాలికాలుష్యం భిన్నంగాఉం టుంది. బిజీగాఉన్న ప్రాం తాల్లో గాలి కాలుష్యం స్థాయిని లెక్కిం చడా నికి నగరమంతా విస్తృత నెట్‌వర్క్‌ ఉన్న మానిట రింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయా లని అరరాడి యన్‌ సూచించారు.
ఏ స్థాయి కాలుష్యం మనుషులకు ప్రమాదకరం?
డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏఐక్యూ) వంద లోపు ఉంటే..ఆగాలి మనిషికి సురక్షితమై నది. ఏఐక్యూ 400నుంచి 500ఉంటే గాలి లో కాలుష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు.ఈ వారంలో దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 500కు చేరింది. నోయిడా, గురు గ్రామ్‌ వంటి ప్రాంతాల్లో కూడా ఏక్యూఐ లెవల్స్‌ 500కి దగ్గరలో ఉన్నాయి. 2021 లో యూఎన్‌ ఈపీ రిపోర్ట్‌ ప్రకారం,గాలి నాణ్యత పర్యవేక్షణ ప్రపంచంలోని 37శాతం దేశాల్లో చట్టపరమైన అంశం లా లేదు.అనేక పద్ధతుల్లో గాలి నాణ్యత లెక్కించ డంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాలి కాలుష్యాన్ని గుర్తించడం ప్రభు త్వాల బాధ్యతగా మారేలా చట్టపరంగా చర్య లు తీసుకోవాలని,సమాచారంలో కచ్చిత త్వాన్ని పెంచడానికి మౌలిక సదుపాల యాలు కల్పించాలని యూఎన్‌ఈపీ తెలి పింది.
గాలి కాలుష్యం వల్ల ఎలాంటి జబ్బులొస్తాయి?
సూక్ష్మకణాలు,ఇతర కాలుష్య కారకాలు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయని, రోగనిరోధక వ్యవస్థను బలహీ నం చేస్తాయని,రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గిస్తా యని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పిల్లలు, వృద్ధులు, పోషకా హార లోపం,సౌకర్యాల లేమితో బాధపడే పేదల్లో శ్వాస కోస సమస్యలు,గుండె సంబంధిత రోగాలు,గుండెపోటు, లంగ్‌ క్యాన్సర్‌ వంటివి వస్తాయని ఆయన తెలిపారు.ఉదాహ రణకు ఆస్తమాపై ఓజోన్‌,సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రో జన్‌ డై ఆక్సైడ్‌ వంటివి ఊపిరి తిత్తుల వాపు, ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి వాటికి కారణమవు తాయి.గర్భస్థ శిశువుల ఆరో గ్యంపైనా నాణ్యత లేని గాలి ప్రభావం ఉంటుందని, కొన్నిసార్లు చనిపోయిన పిల్లలు పుడతారని, అబార్షన్లు జరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.గాలి కాలుష్యం ప్రభావంతో ప్రపం చవ్యాప్తంగా ఏటా70లక్షల మందితమ ఆయు ర్దాయం కన్నా ముందే చనిపోతు న్నారని డబ్ల్యూ హెచ్‌ఓ తెలిపింది. అందులో దాదాపు 85 శాతం మంది గుండె సంబంధిత వ్యాధు లు,గుండెపోటు,ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఆస్తమా,సీఓపీడీ,డయాబెటిస్‌,వంటి కారణా లతో మర ణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలి పింది. పొగా కు తర్వాత ఎక్కువ మరణాలకు కారణ మవు తోంది గాలి కాలుష్యమని, బహి రంగ ప్రదే శాల్లో గాలి కాలుష్యంవల్ల ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో 90శాతం పేద,అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారని తెలిపింది.ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ప్లాట్‌ ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో దిల్లీ,చుట్ట పక్కల నగరాల్లో 81శాతం కుటుం బాల్లో ఎవరో ఒకరు గడిచిన మూడు వారాల నుంచి కాలుష్యంవల్ల అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

1 2 3 11