యురేనియంతో గిరిజనుల ప్రాణ సంకటం

రెండు తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తులుగా భావిస్తోన్న నల్లమల అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన యురేనియం తవ్వకాల ప్రతిపాదనలను నిరసిస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయట్లేదు. యురేనియం తవ్వకాలపై ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ పరిధిలో రహస్యంగా సర్వే నిర్వహిస్తోందనే సమాచారం గుప్పుమంది. దావానలంలా వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న అణు ఇంధన సంస్థ ఉద్యోగులు కొందరు నల్లమల అడవుల్లో రహస్యంగా సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయినట్లు సమాచారం. కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ పరిధిలోని మన్ననూర్‌ సమీపంలో అటవీ శాఖకు చెందిన క్యాంప్‌ ఆఫీస్‌ లో మకాం వేశారని, గుట్టు చప్పుడు కాకుండా సర్వే నిర్వహిస్తున్నారనే కలకలం పుట్టిస్తున్నాయి.
యురేనియం రేడియో యాక్టివిటి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యాలకు అత్యంత ప్రమా దం ఏర్పడు తుందని, పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగు తున్నాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సర్వే ప్రారంభించాలని కేంద్రం అనుమ తులు ఇవ్వ డంతో ప్రజా సంఘాలు, ప్రజలు, స్వచ్ఛందంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. యురేనియం తవ్వకాలు జరిగి నప్పుడు వెలువడే ‘డస్ట్‌’80 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది.డస్ట్‌ పడిన ప్రాంతమంతా విషపూరి తమవుతుంది. నల్లమలలోని చెంచుల ఉనికికి అత్యంత ప్రమా దం ఏర్పడుతుంది. యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే చెంచులను ఆ ప్రాంతం నుంచి తరలించాలి. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును తొలగించాలి. సాగర్‌ నీళ్ళు వ్యవ సాయానికి గానీ, తాగడానికి గానీ ఉపయోగపడవు. ఇంత ప్రమాద కరమైన యురేనియం తవ్వకాలను కార్పొరేట్ల లాభా ల కోసం బీజేపీ ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్నది.
యురేనియంతో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి తేలి కవుతుందని చెప్తూ తవ్వకాలకు కేంద్రం అను మతు లిచ్చింది. రష్యాలోని చెర్నోబిల్‌, జపాన్‌లోని పుకుషీ మాలో యురేనియం విద్యుత్‌ కేంద్రాలు పేలి పోవ డంతో వేలమంది మరణించడమేకాక,నేటికి ఆరేడి యో ధార్మిక శక్తి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు చెప్తున్నారు. ఆ భయంతో భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో యురేని యం తవ్వకాలను ఆపాలని ఆందోళనలు సాగుతు న్నా యి.1896లోహెన్రీ బెకరల్‌ రెడియో ధార్మిక శక్తి 92వ మూలకాన్ని కనుగొన్నాడు.చదరపు అడుగు యురేనియం500 కేజీలబరువు ఉంటుంది. న్యూక్లి యర్‌ ఎనర్జీ ద్వారా అణుబాంబులు తయారు చేసిన ఆమెరి కా జపాన్‌లోని హిరోషిమా, నాగసా కిలపై వేసింది.ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ రేడియో ధార్మిక శక్తి ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. యురేనియం తో విద్యుత్‌ శక్తి ఉత్పత్తి చేయవచ్చు. 10లక్షల కిలోల బొగ్గుతో ఉత్ప త్తి అయ్యే విద్యుత్‌ అరకిలో యురేనియంతో తయారు చేయవచ్చు. బొగ్గు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి వ్యయంతో కూడు కున్న పని అని యురేనియంతో ఉత్పత్తిని ప్రారంభించారు. మొదట ఈనిక్షేపాలు మేఘాలయ,ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ లోని దట్టమైన అడవుల కింద ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం భారత దేశంలో 7 కేంద్రాల్లో 22రియాక్టర్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి.1950లో యురేనియం గనులను ఏర్పాటు చేశారు.1967లో జాదూ గూడలో గని ప్రారంభించారు.యురేనియంద్వారా విద్యుత్‌ఉత్పత్తి జరిగే ప్రక్రియలో యురేనియం శుద్ధి అవుతుంది.శుద్ధి అయిన యురేనియంను పైపుల ద్వారా బోరు బావిలోకి పంపిస్తారు.వాస్తవానికి ఈ శుద్ధి అయిన యురేనియంతో అణుబాంబులు తయారు చేయవచ్చు.ఇక్కడ అణుబాంబులు తయా రుచేసే లక్ష్యం లేనందున శుద్ధి అయిన యురేని యాన్ని బావుల్లోకి పంపిస్తున్నారు.తటస్థీకరణ చర్యకు సున్నపురాయిని కూడా దానితోపాటు పంపాలి. యురే నియం భూమికి చాలా లోతులో ఉంటుంది. 1960లో వెయ్యి అడుగులలోతు వరకు బోర్లు వేసి తీశారు. అయినా తగినంత ఉత్పత్తి రాక పోవడంతో1990లో ఎన్‌ఎస్‌జీ దేశాల నుంచి (కజకస్తాన్‌,కెనడా,రష్యా) దిగుమతు లు చేసుకు న్నారు.ఈ దిగుమతులకు అమెరికా, ఐక్య రాజ్య సమితి అడ్డుపడ్డాయి. ఎన్‌జీఓ సంఘాలు యురేనియంవల్ల ప్రమాదాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చా యి. పిల్లలు పుట్టకపోవడం,ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం,క్యాన్సర్‌,చర్మ వ్యాధులు తదితర ప్రమా దాలు ఉన్నట్లు తెలిపారు. దీన్ని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ వారు కూడా పరిశీలించారు. ఆలోపాలు యురేనియంవల్ల కాదని తప్పుడు సమాచారం ఇచ్చారు. రేడియేషన్‌ వస్తుంది కానీ దాన్ని బయటకు సోకకుండా జాగ్రత్త తీసు కుంటున్నామని తెలిపారు. 1998లో ప్రధాని వాజపేయి జాదూగూడ కాక వేరే ఎక్కడైన యురేనియం లభ్యత ఉందా అని పరిశీలించారు. ఈస్థితిలో ప్లూటోనియాన్ని కనుగొ న్నారు. ప్లూటోనియంతో తయారు చేసిన అణు బాంబును పోక్రాన్‌లో పరీక్షించారు.చివరకు 2002లో చంద్రబాబు అనుమతితో జరిపిన అన్వే షణలో కడప జిల్లా తుమ్మలపల్లి,గుంటూరు జిల్లా కోపూరులోని 2,300 ఎకరాల్లో నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు.1.40లక్షల టన్నులు తుమ్మల పల్లి లో,2500 టన్నులు కోపూరులోనూ బయటకు తీశారు.2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. యుసీ ఐఎల్‌ దృష్టి ఇప్పు డు నల్లమలపై పడిరది. ఇక్కడ యురేనియం తవ్వకాల వల్ల కృష్ణానది కలుషితం అవుతుందని ప్రచారం సాగుతున్నది.ప్రస్తుతం దేశంలో మరో 7అణు రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి యురేనియం కావాలి. అందుకు దిగుమతులపై ఆధారపడాలి.లేదా స్వదేశంలో ఉత్పత్తి చేయాలి. విద్యుత్‌ ఉత్ప త్తి కేంద్రం తయార వ్వడానికి ఐదారు సంవత్సరాలు పడుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు కూ డా ప్రస్తుతం లభించే ధరకన్న ఎక్కువగానే ఉంటుంది. తక్కువ యురేని యంతో ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి జరిగి నప్పటికీ యురేనియం తవ్వకానికి అయ్యే పెట్టుబడి ఎక్కువ గానే ఉంటుంది. రేడియో ధార్మిక శక్తి బయటికి వెళ్ళకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త జరిగినా రేడియో యాక్టివిటి కిరణాలు అత్యంత ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇప్పటికే భారత దేశంలో 3దశాబ్దాల క్రితం భోపాల్‌లో ‘మిక్‌’ గ్యాస్‌ లీక్‌వల్ల 2వేలమంది ప్రాణాలు కోల్పోయా రు. నేటికి అక్కడ వాతావరణం బాగు పడలేదు. కానీ కేంద్రం అవేవీ పట్టించు కోవడం లేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో రక్షణ లేకుండా యురేనియంతవ్వకాలు,విని యోగం చేయడం తీవ్ర ప్రమాదకరం.
ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి.
దాదాపు 60ఏళ్ల వయసున్న చిగుర్ల ఐతయ్య చెంచు తెగ పెద్దమనిషి. నల్లమల అడవు ల్లోని కుడిచింత బయలు గ్రామంలో,ఆర్డీఎఫ్‌ ట్రస్టు వారు తనకు కట్టిచ్చిన చిన్న ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని వచ్చేపోయే బండ్లను చూస్తు న్నారు. ఎదురుగా ఉన్న కంకర రోడ్డు మీద దుమ్ము రేపుకొంటూ పెద్ద పెద్ద కార్లు మల్లెలతీర్థం వైపు వెళుతున్నాయి. శ్రీశైలం-హైదరాబాద్‌ దారిలో కొంత కాలం తరువాత ఆ ఊరు, ఆ మల్లెలతీర్థం, తమ అడవి, తమ వ్యవసాయం,పర్యటకుల సందడి..ఇవన్నీ ఉంటాయో ఉండవో అన్న బెంగ ఆయనలో ఉంది. కారణం-తమ అడవిలో యురే నియం తవ్వుతారన్న వార్తలేనని స్థానికులు వాపోయారు.
మేమెక్కడికీ పోం.
(యురేనియంను) తవ్వనీయం. తవ్వనీ యం. తవ్వనిస్తే మేం భంగపడిపోతాం. యురే నియం తవ్వితే ఊళ్లు నాశనమైపోతాయి. అందుకే తవ్వద్దు. తవ్వితే దాని విష పదార్థం కొట్టి భంగం అయిపోతాం’’ అని స్థానికుడు ఐతయ్య అన్నారు. ‘‘మేం మొదట్లో వాళ్లు తవ్వుకుని పోతారులే అనుకున్నాం. కానీ అది తవ్వితే విషం గాల్లో వచ్చి మనకు పారుతుంది అని చెప్పారు. మనుషులు బతకరు అన్నారు. అట్లైతే అసలే వద్దు. మనం చావనీకి అదెందుకు తవ్వాలి?’’ అని ప్రశ్నించా రాయన.కుడిచింత బయలు గ్రామం కానీ, మల్లెల తీర్థం కానీ ప్రస్తుతం ప్రతిపాదించిన యురేనియం సర్వే బోర్లు వేసే ప్రాంతంలో లేవు. అయినా వారి లో అంత బెంగ ఉండటానికి కారణం, పక్క ఊరు తవ్వినప్పుడు తమ ఊరినీ- తమ అడవినీ వదలి పెట్టరేమోననే ఆలోచన.పక్క ఊరిలో తవ్విన యురే నియం వల్ల తామూ ప్రమాదంలో పడతామేమోననే భయమూ ఉంది. యురేనియం సర్వే పరిధిలో లేని గ్రామంలోని పరిస్థితి ఇది. సర్వే చేసే ప్రాంతా ల్లోనైతే నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. ‘‘మీకు పునరావాసం కల్పించి,యురేనియంతవ్వితే సమ్మ తమేనా’’ అనే ప్రశ్నకు స్థానికులు ఆసక్తికర సమా ధానం ఇచ్చారు.‘‘పునరావాసానికి కూడా ఒప్పు కోం. మొత్తం మండలం అంతా మాట్లాడి చెప్పాలి. ఒప్పుకుంటే రూపాయల కట్ట ఇస్తారు. హైదరాబాద్‌ వెళ్తా. ఆ డబ్బులు మూడ్రోజులుంటాయి. తెల్లారి అవి ఎట్లా పోతాయో, మా బతుకులు ఎట్లా పోతా యో తెలీదు. అందుకే ఇదే భూమి,ఇదే ఆస్తి ఉం డాలి మాకు’’అంటూ ఐతయ్య అనే అసామి తెలి పారు. ‘‘యురేనియం తవ్వితే కృష్ణా నది కలుషి తమై, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆ నదిపై ఆధార పడ్డ ప్రాంతమంతా ఇబ్బంది పడుతుంది. పునరా వాసాలు ఎక్కడా సరిగా జరగలేదు.70వేల మం దిని ఎక్కడకు తీసుకువెళ్తారు? ఆదిమజాతి చెంచు లను అడవికి దూరం చేస్తే చనిపోతారు. పెద్దపు లులను ఎక్కడ పెంచుతారు? వన్యమృగాలను ఏం చేస్తారు? పర్యావరణాన్ని ఎక్కడ నుంచి తెస్తారు? ఇక్కడ యురేనియం తీస్తారు.అయిపోతుంది. మరొక చోట తీస్తారు. అయిపోతుంది. ఇలా దేశమంతా కాలుష్యం చేయడం ఎందుకు? దాని బదులు గాలి, సూర్యుడి నుంచి వచ్చే కరెంటు వాడుకోవచ్చు కదా’’ అంటూ యురేనియం మైనింగ్‌ వ్యతి రేక ఆందోళన లకు కె.నాజరయ్య నాయకత్వం వహిస్తున్న ప్రశ్నిం చారు.-(సారంపల్లి మల్లారెడ్డి)

మైనింగ్‌ తవ్వదు..!

తమ పంటపొలాలు నాశనమై పోతు న్నాయి..పర్యావరణానికిహాని కలిగించడంత పాటు గిరిజన ప్రజల ప్రశాంత వాతావర ణాన్ని దెబ్బతీ సేలా ఉన్న అక్రమ మైనింగ్‌ లీజులను శాశ్వతంగా రద్దు చేసి రక్షణ కల్పించాలని మైనింగ్‌ ప్రభావిత ప్రాంత గిరిజనులు డిమాండ్‌ చేశారు.మైనింగ్‌ తవ్వకాల కోసం ప్రజాభిప్రా యసేకరణకు వచ్చిన ఉన్నతాధికార బృందాన్ని చుట్టు ముట్టారు.వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమకు నష్టం కలిగి స్తున్న మైనింగ్‌లు మాకొద్దు అంటూ వ్యతిరేకించారు. మైనింగ్‌ తవ్వొద్దు..మా పొట్టలు కొట్టొద్దు అంటూ అధికారులను నిలదీశారు.అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు వాలసి పంచాయతీ గిరిజ నులు ముక్తకంఠంతో మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సైమన్‌ గునపర్తి అల్లూరి సీతారామరాజు జిల్లా అనం తగిరి మండలంలో వాలసీ పంచాయితీ పరిధి కరకవలస,రాళ్లగరువు వద్ద సర్వే నెంబర్లు 29,33, 34,35లలోదురియ రుక్మిణీ,రొబ్బ శంకర్‌ల పేర్లతో ఉన్న 124ఎకరాల్లో జరుగుతున్న కాల్సైట్‌ మైనింగ్‌ లీజులపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు జిల్లాజాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీని వాస్‌,కాలుష్యనియంత్రణ మండలిబోర్డ్‌, ఎపిఎండిసి అధికార్లు నిమ్మలపాడు బుధవారం విచ్చేశారు. అధికార బృందాన్ని మైనింగ్‌ ప్రభావిత గిరిజన గ్రామాలైన వాలాసి పంచాయతీ నిమ్మలపాడు, తూభూర్తి, కరకవలస,రాళ్లవలస గిరిజనప్రజలు, సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి రెబ్బా ప్రగడ, అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు, ప్రజాప్రతి నిధులు అడ్డుకున్నారు. అక్రమ బినామీ మైనింగ్‌ తవ్వకాలకు ఇచ్చిన లీజులను రద్దు చేయలని ముక్త కంఠంతో నినాదించారు.గిరిజనులకు నష్టం కలిగిస్తున్న మైనింగ్‌లు మాకొద్దు అంటూ వ్యతిరేకిం చారు.2006 నుండి 2023 వరకు 18సంవత్స రాల నుంచి బినామీలీజులతో అక్రమ మైనింగ్‌ తవ్వకాలు చేపట్టి అమాయక గిరిజనుల వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.ఇతర ప్రాంతా లకు చెందిన కొంతమంది బడాబాబులు, కొంత మంది ప్రభుత్వ పెద్దల అండదండలతో మైనింగ్‌ మాఫీయా చెలరేగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనచట్టాలు,హక్కులను తుంగలో తొక్కి తమ పంటపొలాల్లో నిక్షేప్తమైన గనులు, ఖనిజా లను తరలించుకు పోతున్నారని,మా అభిప్రాయా లను గౌరవించి అక్రమ మైనింగ్‌లు శాస్వతంగా రద్ధుచేయలని కోరారు.తర్వాత నిమ్మలపాడు గ్రామంలో ప్రారంభమైన ర్యాలీ కరకవలస, రాళ్ల గెడ్డలో ఏర్పాటు చేసిన సభా వేధిక వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
అధికారులను అడ్డుకున్న గిరిజనులు
ప్రజాభిప్రాసేకరణ చేపట్టేందుకు విచ్చే సినఅధికార బృందాన్ని స్థానిక గిరిజనులు, సమత సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రబ్బ ప్రగాడ రవి,సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజులు అడ్డుకుని అధికా రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌,ఖనిజ సంపద కాలు ష్య నియంత్రణ అధ్యక్షతన ఏపీఎం డిసి అధికారుల బృందం మైనింగ్‌ ప్రభావిత గిరిజన గ్రామాలైన నిమ్మలపాడు,రాళ్లగరువు గ్రామం మైనింగ్‌ ప్రదేశం వద్ద ప్రజాభిప్రాసేకరణ నిర్వహిం చారు. ఈసభలో కూడా గిరిజనులుఅధికార బృందాన్ని నిలదీశారు. స్థానిక సర్పంచ్‌తో సహా మైనింగ్‌ తవ్వకాలకు వ్యతి రేకంగా ఆందోళన చేపట్టా రు.ఆందోళన అనం తరం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ప్రజా ప్రతిని ధులు,గిరిజనులకు ఎటువంటి సమాచారం ఎందు కు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎటువంటి ప్రజాభిప్రా సేకరణ లేకుండా గత 18సంవత్సరాలుగా మైనిం గ్‌ జరపడం సరికాదని, దీంతో తమ పంట పొలా లు కాలుష్యంతో దెబ్బతిం టున్నాయని,పలు రోగు లతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అక్రమంగా తవ్వకాలు జరిపిన మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలిం చాలని అధికారులను చుట్టుముట్టి నిలదీశారు. దీంతో జేసీ శివశ్రీనివాస్‌,ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ,స్థానికతహాసిల్దార్‌,ఏపీఎండీసీ అధికా రులను ప్రజాప్రతి నిధులు,మైనింగ్‌ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అనం తరం సభావేదికకు వచ్చిన అధికారులు గిరిజన ప్రజలు,స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వేరువేరుగా అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు.
సభలో సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి మాట్లాడుతూ 1995 నుంచి ఈ ప్రాంతంలో సమత చేపడు తున్న వనరుల పరిరక్షణ ఉద్యమాన్ని అధికారులకు వివరించారు. నిమ్మలపాడు కాల్‌ సైట్‌ మైనింగ్‌ తవ్వకాలు నిర్వహించేందుకు టాటా,బిర్లా అప్పట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదిరించు కుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన సమత సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగిందని గుర్తుచేశారు. తమకు అనుకూలంగా 1997లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో టాటా, బిర్లా సంస్థలు వెనుక్కు వెళ్లి పోయారని తెలిపారు. ఇదే గతి నేడు ఏపీఎండిసికు కూడా పడుతుం దన్నారు. ఐదో షెడ్యూల్‌ ఏరి యాలో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు,పంచాయితీ రాజ్‌ విస్తీర్ణ చట్టం(పీసా) అనుమతులు లేకుండా ఇష్టం రాజ్యంగా మైనింగ్‌ తవ్వకాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకునేది లేద న్నారు. తర్వాత అనంతగిరి మండల జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లా డుతూ,వాలసి పంచా యతీ తూభుర్తి. కరకవలస, రాళ్లగెడ్డ గ్రామాలకు అనుకొనున్న కాల్‌సైట్‌ మైనింగ్‌ 2006 సంవత్సరం నుంచి బినామీదారులతో తవ్వ కాలు జరుపుతు న్నారన్నారు. బినామీ దారులైన దురియా రుక్మిణి, రొబ్బ శంకరరావులు మైనింగ్‌ కొల్లగొట్టి దోచుకు న్నారని విమర్శించారు. గ్రామ అభివద్ధి, పనిచేసిన రైతులకు కనీస కూలి చెల్లించ కుండా కోట్ల రూపాయలు మైనింగ్‌ మాఫియా దోచుకుందన్నారు. మైనింగ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామ పంచాయతీకి రాయల్టీ చెల్లించాల్సి ఉందన్నారు. ఏపీఎండిసి పేరుతో బినామీ వ్యవస్థను పెట్టి మై నింగ్‌ తవ్వకాలు జరితే చూస్తూ ఊరుకునేది లేదని, గిరిజనుల పక్షాన అంటూ న్యాయం జరిగే వరకూ తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరిం చారు. పూర్తిగా మైనింగ్‌ లీజులనురద్దు చేసి గిరిజన భూములు గిరిజనులకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ సాంబె సన్యాసిరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ,ప్రజలకు నష్టానికి గురి చేసే మైనింగ్‌ తవ్వకాలకు వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఉంటానన్నారు. ఇప్పటికైనా మా అభిప్రా యాలను గౌరవించి అక్రమ మైనింగ్‌ లీజులు, తవ్వకాలను శాస్వతంగా రద్ధుచేెయలని కోరారు
అనంతరం గిరిజనుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ మాట్లాడారు.గిరిజనులు వెల్లడిరచిన వారి మనో భావాలు,అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మైనింగ్‌ తవ్వకాలను పరిశీలించి ప్రభుత్వానికి,అధికారులకు తెలియపరచాలని ఆయన ఆదేశించారు ఈకార్యక్రమంలో ఖనిజ సంపద కాలుష్య నియంత్రణ ఇంజనీరింగ్‌ అధికారి. సుదర్శన్‌,తహసిల్దార్‌ రామభాయి,సమత డైరెక్టర్‌ సుశాంత్‌ ప్రాణగ్రహి,కందుకూరి సతీష్‌ కుమార్‌, సిపిఎం టోకూరు సర్పంచ్‌ కె.మొసియా,మండల కార్యదర్శి ఎస్‌.నాగులు,వాలసి మాజీ సర్పంచ్‌ ధర్మన్న, గురుమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రపంచ జీవకోటికి సముద్రమే ఆధారం

మన నివసించే ఈ భూ గ్రహంపై భూమి కేవలం 29 శాతం మాత్రమే ఉండగా.. మిగిలినదంతా సముద్ర నీరే. ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రాల పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తాచెదారంతో నిండిపోతు న్నాయి. విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి కడలి నీటిలో పడేస్తున్నారు మనుషులు. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని సముద్రజీవులు కూడా అంతరించిపోతున్నాయి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలా వరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతి సంవత్సరం జూన్‌ 8న ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రా న్ని చెత్తమయం చేస్తున్నారు. చాలా దేశాలు వ్యర్థాలను నౌకల్లో తరలించి సముద్రాల్లో పడేస్తున్నాయి. ఇలా రోజూ వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటుంది. భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు ఇతర జీవుల్ని చంపేస్తోంది. ఆ కాలు ష్యపు నీటిలో అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. సముద్రాలను కాపాడుకు నేందుకు తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమి కులు అంటున్నారు. ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచా లని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008లో తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి..జీవులూ బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌గా ఎంపిక చేశారు.సాగరం బాగుంటేనే సకల జీవరాసులు బాగుంటాయి అనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలావరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు అని, సముద్రానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్‌ 8 న సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. సముద్రాన్ని చెత్త మయం చేసేస్తున్నారని, చాలా దేశాల్లో వ్యర్థాలను నౌకలో తరలించి సముద్రంలో పడేస్తున్నారని, ఇలా రోజూ వేల టన్నుల్లో చెత్త సముద్రంలో కలుస్తుందనీ,అందులో ఎక్కువ భాగం ప్లాస్టిక్‌ ఉంటుందని, ఈ కాలుష్య కారకం వల్ల సముద్రా ల అరుదైన జీవజాతులు అంతరించి పోతున్నాప్రజలకు సముద్రాల యొక్క ఆవశ్యకత ఉంది. సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయో జనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యా వరణ ప్రేమికులు అంటున్నారు. బీచ్‌ల వంటి నీటి వనరుల చుట్టూ.. మన అజాగ్రత్త వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో సము ద్రంలోని అనేక వేల జీవరాశులు మరణిస్తు న్నాయి. కొన్ని కలుషితమైపోతు న్నాయి. వీట న్నింటి వల్ల ప్రకృతి విపత్తులు జరిగే అవకాశం కూడా ఉంది.అందుకే ఈ విషయాలన్నీ ప్రజల కు వివరించి..సముద్రాల సుస్థిర అభివృద్ధికి కృషి చేసేలా..వారికి అవగాహన కల్పిస్తారు.
ప్రాముఖ్యత
సముద్రం కనీసం 50% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని ఐక్యరాజ్యసమితి డేటా సూచిస్తుంది. మహాసముద్రాలు 30% కంటే ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయని.. ఇవి గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాలను తగ్గిస్తాయని రుజువు చేసింది. చెత్త, మురుగు, చమురు లీకేజీల వంటి మానవ కార్యకలాపాల చర్యల వల్ల.. విధ్వంసం జరిగే అవకాశముంది. ఈ విష యాలపట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకో వాలి.
సముద్రాలూ కలుషితం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి అటు జీవనోపాధిని ఇటు పౌష్టికాహారాన్ని సముద్రాలు అందిస్తున్నాయి. ప్రపంచ పటంలో మూడు వంతులకు పైగా సముద్రాలు విస్తరించి ఉన్నా యి. ప్రకృతి సంపదలో సముద్ర జలాలది కీలక స్థానం అయినప్పటికీ రానురానూ అవి కాలు ష్యం బారిన పడుతున్నాయి. మనం యథేచ్ఛగా సముద్ర జలాలను కలుషితం చేస్తూ, సముద్ర జీవుల మనుగడకే ముప్పు ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతున్నది. ప్లాస్టిక్‌ సంచులు, ఇతర వస్తువులు పర్యావరణానికి హాని చేస్తాయని అందరికీ తెలిసినా, వాటి వినియోగాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం గమనార్హం. ప్లాస్టిక్‌ వినియోగం విషయంలో యావత్‌ మానవాళి ‘తాను కూ ర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కొన్నట్లు’గా వ్యవహరిస్తున్నది. మానవ శరీర నిర్మాణంలో ప్రొటీన్లది చాలా కీలక పాత్ర. అటువంటి ప్రొటీన్లను సమృద్ధిగా అందజేసే సత్తా ఒక్క సముద్ర జీవులకే ఉంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సముద్రాలలో 5 ట్రిలి యన్‌ల మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నాయి. వీటిని సముద్ర జీవులు (చేపలు వంటివి) మింగడం, వాటిని మనం ఆహారంగా తీసుకోవడంతో పలువురు కాన్సర్ల బారిన పడుతున్నారు. 2025వ సంవత్సరం నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌, చేపల నిష్పత్తి 1:3గా ఉంటుందని అంచనా. పలు దేశాలు వ్యర్థ జలాల ను సముద్రంలోకి వి చక్షణా రహితంగా వ దులుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సముద్రం లో కలుస్తున్న డ్రైనేజ్‌ వాటర్‌లో 70 శాతం శుద్ధి చేయనందు న సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి. సముద్ర వాతవారణంలో పెను మార్పులు కలుగుతున్నాయి. దీనివల్ల సాలీనా 13 బిలి యన్‌ డాలర్ల నష్టం జరుగుతుందని యుఎన్‌ఇపి అంచనా వేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్ర జలాల్లో పారవేస్తున్న దేశాల్లో భారత్‌, చైనాలు ముందువరసలో ఉండటం గమనార్హం. మన దేశంలో సాలీనా ప్లాస్టిక్‌ వినియోగం 15 మిలియన్‌ టన్నులు. ఇది 2050 నాటికి 20 మిలియన్‌ టన్నులు అవుతుందని అంచనా. 2050 నాటికి సముద్ర జలాల్లోని ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించకపోతే, సముద్రాలలో ఉండే చేపల బరుకన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘రీ సైక్లింగ్‌’కు పనికిరాని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల తయారీని చాలా దేశాల్లో నిషేధించారు. అయితే దాని అమలు శూన్యం. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కొన్ని దేశాలు రోడ్ల నిర్మాణంలోను, విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగి స్తున్నాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వినియో గిస్తున్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. మనకన్నా అభివృద్ధిలో, ఆర్థికంగా వెనుకబడిన దేశాలైన రువాండా, బంగ్లాదేశ్‌, కీన్యాలు ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ, వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. ఇకనైనా సముద్ర జలాలలోకి ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదలడం ఆపకపోతే, చేపలకన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.- జిఎన్‌వి సతీష్‌

దళితులకు రక్షణ లేదా..ఎన్నాళ్లీ ఇలా?

దేశాన్ని కుల,మత జాఢ్యాలు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. పెత్తందారీ కుల కాలనాగులు అవకాశమొచ్చినప్పుడల్లా అణగారిన ప్రజానీకాన్ని కాటేసి ప్రాణాలు తోడేస్తూనేవున్నాయి. కులం వద్దు..మతం వద్దు.. భారతీయులంతా స్వేచ్ఛా స్వతం త్రాలు అనుభవిద్దామంటూ చేసుకున్న ప్రతినలన్నీ వెక్కిరింతకు గురవుతూనే వున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో పెత్తందారీ గూండాల దాడిలో దళిత యువకుడు బలైపోవడం, మరో తొమ్మిది మంది దళితులు గాయపడటం సమాజంలో వేళ్లూనుకున్న పెత్తందారీ దురహంకారాన్ని మరోమారు బయటపెట్టింది. కొన్ని నెలల కిందటే అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తన వద్దే డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని హత్య చేసి..మృతదేహాన్ని సదరు ప్రజా ప్రతినిధే నేరుగా బాధితుడి ఇంటికి డోర్‌ డెలివరీ చేసిన దారుణ ఉదంతం నుంచి జిల్లా తేరుకోక మునుపై మరో ఘోరం చోటు చేసుకుంది. శృంగవృక్షమనేది కాకినాడ జిల్లాలో చిన్న గ్రామం. ప్రతి యేటా ఇక్కడ జరిగే నూకాలమ్మ జాతరలో అన్ని సామాజిక తరగతు లవారు పాల్గొనడం ఆనవాయితీ. అందరూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకో వడం..మొక్కులు తీర్చుకోవడం గత కొన్ని తరాలుగా అనుసరిస్తూ వస్తున్న ఆనవాయితీ. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పరస్పరం కాళ్లూచేతులు రాసుకోవడం, ఒక్కో సందర్భంలో కిందామీదా పడటం సర్వసాధారణం. శృంగ వృక్షం జాతరలోనూ అదే జరి గింది. జనం రద్దీలో పెత్తందారీ కాలు..దళిత యువకుడి కాలు పరస్పరం రాసుకున్నాయి. ‘మన కులపోడి కాలు నెత్తిన తగిలినా బాధలేదయ్యా..దళితుడి కాలు సోకితే ఊరుకుంటామా?’ అంటూ కుగ్రా మమైన శృంగవృక్షంపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. జాతరలో కాలు రాసుకున్న నేరా నికి శృంగవృక్షం దళితపేటపై పెత్తందార్లు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా మూకు మ్మడి దాడికి పాల్పడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ దాడిలో తొం డంగి గ్రామానికి చెందిన నడిరపల్లి రాము అనే దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంత దారుణంగా దాడికి పాల్పడినా.. పెత్తందార్ల జోలికి వెళ్లకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపో యారే తప్ప ఎలాంటి తక్షణ చర్యలకు ఉపక్ర మించకపోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. తెల్లారితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సినవాళ్లం..కేసులుగీసులు ఎందుకయ్యా..సర్దుకుపోతే అందరికీ మంచి దంటూ దళితులకు మైండ్‌వాష్‌ చేసే పనిని ఖాకీలు భుజానికి ఎత్తుకోవడం దిగ్భ్రాంతి కరం.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) వంటి ప్రజాసంఘాలు నిలదీ యకపోతే అస్సలు కేసు కూడా నమోదు చేసేవారు కాదేమో ! విజయవాడలో స్వరాజ్య మైదానంలో ఆకాశాన్నంటేలా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తున్నా మని, దళితులకు, అణగారిన ప్రజానీకానికి తాము పెద్ద పీట వేస్తున్నామని పాలకులు మాటలు చెబితే సరిపోదు. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటామా?’ అంటూ ప్రశ్నించే పెత్తందారీ ఆధిపత్య భావా జాలాన్ని పూర్తిగా విడనాడాలి. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితు లకు శిరోముండనాలు చేయించడం, అత్యా చారాలు, హత్యలు వంటివి తరచూ చోటుచేసు కోవడం దేనికి సంకేతం. దాడులు జరిగిన ప్పుడు ఒంటికాలిపై లేవడం.. అరకోపరకో పరిహారమిచ్చి చేతులు దులిపేసుకుంటే సరి పోతుందా? ఇలాంటి దాడులకు పాల్పడిన వారి పీచమణచాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్దర వీడి దళితులు, ఆదివాసీలు, ఇతర అణగారిన ప్రజానీకం రక్షణకు గట్టి చర్యలు చేపట్టాలి. బాధిత దళితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
ప్రభుత్వంలో దళితులకు స్థానంలేదన్న వాస్త వం!
వైసీపీ ప్రభుత్వంలో దళితలకు స్థానం లేదు అన్నది అక్షర సత్యం. ఆ సత్యాన్ని బహు జనులు, దళిత సంఘాలు ఎప్పుడో గుర్తిం చాయి. ఉత్తరాంధ్రాను మొదలుకొని రాయలసీమ వరకు నిత్యం దళితలపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల అనేవి లెక్కకుమించినవి. ఇంత వివక్ష ఎందుకో అర్థకాదుకానీ ..స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ఇంతలా దేశ వ్యాప్తంగా ఇటువంటి దాడులు ఏపీలో తప్ప ఎక్కడ చోటు చేసుకోకపోవడం గమనార్హం. దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన జగన్‌ కు ఈ దాడుల లెక్క పట్టదా అని దళిత మేథావులు ప్రశ్నిస్తున్నా .. దున్నపోతుమీద వాన చందమే. ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై అధికార పార్టీకి చెందిన దళిత నాయకులతో అసభ్య పదజాలంతో విరుకుపడేలా పురికొల్పు తున్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే చాలు వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడటం, ఒప్పుకొకుంటే దాడులు చేయడం జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో పరిపాటిగా మారింది. ఇందుకు ఉదాహరణే ఏపిలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు జరగుతున్న ఎన్నికలే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వెంకటేశ్‌ అనే దళితుడిపై 30 వైసీపీ కార్యకర్తలు ముకుంబడి చేసిన దాడి, గుంటూరు జిల్లా గురజాల మున్సిపల్‌ ఎన్నికలలో మైనారిటీ మహిళా సుందగిరి నజీమూన్‌ నామినేషన్‌ చింపి, ఆమెపై దాడి, తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరం పంచాయితీ ఒకటో వార్డుకు నామినేషన్‌ వేసిన గిరిజన మహిళ శిరీష కు బెదింపులు వంటివి వైసీపీ ప్రభుత్వం పాల్పడు తున్న దమనకాండకు నిర్శనాలు కావా అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతిమంగా ప్రజాస్వామ్య పద్దతిలో పదవులకు పోటీ చేసే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దళితులకు లేదు అన్నది జరుగుతున్న ఘనటలకు సజీవ సాక్ష్యాలు.దళితుల సంక్షేమం మరిచారు .. దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు! ఉత్తరాం ధ్రాల్లో దళితులు ..బెదిరింపులు,దాడులు, శిరోముండనాలను చూస్తే ..రాయలసీమలో రక్తాలు కారేలా హింసిస్తున్నారు. వివక్షలు, చిన్నచూపు వంటివి పరిస్థితులను తరుచూ అక్కడ దళితులు ఎదుర్కొంటున్నారు. దాడులు, శిరోముండనాలు, ఎన్నికల్లో పోటీచేస్తే చంపే స్తాం అన్న అనాగరిక చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారం లోకి వచ్చిన నాటినుంచి దళితలపై సాగిస్తున్న నరమేథం, ఊచకోతలు అన్నీఇన్నీకావు. చంద్ర బాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారంలో వైకాపా చేస్తున్న పాపాలు అన్నీఇన్నీకావు.14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేష్‌ పై దాడి, నామి నేషన్‌ పత్రాలు చించివేయడం వంటివి చూస్తే అక్కడి మున్సిపల్‌ ఎన్నికలు సాధరణ ఎన్నికలు తలపించేంతగా అధికార పార్టీ సృష్టించే సీన్‌ సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే కుప్పంలో అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలపై మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు లేఖ రాశారు. వెంకటేశ్‌ ను 30 మందికి దాడికి దిగారని, ఆ దాడికి సంబం ధించి ఫోటోలను కూడా లేఖకు జతచేశారు. గడిచిన 30 నెలలో వైసీపీ ప్రభుత్వం చేతిలో చితికిన దళితుల గురించి వివరించాలంటే ఒక గ్రంథం రాయాలి. రెండు శిరోముండనాలతో దళితులపై దాడులు సెంచరీ దాటాయి. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు కిందా టీడీపీ హయంలో 2018 నుంచి 2020 వరకు రూ.24 వేల కోట్లును ఖర్చు చేస్తే ..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30 నెలల్లో కేవలం రూ.5వేల కోట్లు కూడా ఖర్చు చేయకా..ఆ నిధులను ఫిచన్లు, అమ్మఒడి, రైతు భరోసా పథకాలకు మరలించడం కడు విచారం. ఇదేక్కడి దౌర్భగ్యమోకానీ..టీడీపీ హయంలో దళితలకు భూమి కొనుగోలు పథకం కింద 5 వేల ఎకరాలు పంపిణీ చేస్తేఏపి ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో 4 వేల ఎకరాల అసైన్ట్‌ భూములను లాక్కొంది.
స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా దళితులపై ఆగని దాష్టీకాలు.
దేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. మధ్య ప్రదేశ్‌లో గ్రామపంచాయతీలో ఓదళి తుడు కుర్చీలో కూర్చున్నందుకు అగ్రకులస్థుడు అతడి తల పగలగొట్టడం.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో తరగతి నోట్స్‌లో తప్పులు రాశాడని టీచర్‌ ఓ దళిత విద్యార్థిని చితకబాదడంతో మరణించడం.. ఇదే యూపీలోని లఖింపూర్‌ లో ఇద్దరు దళిత అక్కాచెలెళ్లను రేప్‌ చేసి హత్య చేయడం..రాజస్థాన్‌లో నీటి కుండను తాకాడని ఓదళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఘటన.. ఇలా దళితులపై వివక్ష చూపేలా..వారిని వేధించేలా జరుగుతున్న ఘటనలు దేశంలో కొకొల్లలు. కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ఈ విష ధోరణి మరింత పెచ్చరిల్లుతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి దయనీయంగా మారింది.
11 శాతం పెరిగిన దాడులు
2019 నుంచి 2021 వరకు దేశంలో దళితులపై దాడులు 11శాతం పెరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) ప్రకారం..2019లో 45,961,2021లో 50,900 కేసులు నమోదయ్యాయి. దళితులపై జరుగుతున్న దాడుల్లో జాతీయ సగటు కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికంగా ఉన్నది. మధ్యప్రదేశ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగు తున్నాయి. రాజస్థాన్‌, తమిళనాడు వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది కని పిస్తున్నది. దళితులపై దాడుల ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నా.. వాటిపై ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం తగిన విధంగా స్పందించి, చర్యలు తీసుకుంటున్న సందర్భాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
లోపం చట్టాలదా? వ్యక్తులదా?
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో 19ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య ఆరోపణల వ్యవహారం మీడియాలో ప్రధానంగా కనిపించింది. ఈ ఘటన తర్వాత దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలైన తరువాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉ న్నారు.దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు ప్రతియేటా వినిపిస్తూనే ఉన్నాయి. 2015లో రాజస్థాన్‌ దంగవాస్‌ ఘటన, 2016లో రోహిత్‌ వేముల మరణం, తమిళనాడులో 17ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, 2017లో సహారాన్‌పూర్‌ హింస, 2018లో భీమా కోరేగావ్‌ ఘటన ఇలా ప్రతి సంవత్సరం సంచలనాత్మక కేసులు వస్తూనే ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, దళితులపై దాడులు,అత్యాచారాలు తగ్గక పోగా ఇంకా పెరిగాయి.2019 సంవత్సరం లో దళితులపై అత్యాచారాలు గతంకన్నా 7.3% ఎక్కువ కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్‌బీ తెలిపింది. దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదు కాగా, 2019 సంవత్సరంలో 45, 935 కేసులు రికార్డయ్యాయి. ఇందులో సాధా రణ దాడుల కేసులు 13,273 కాగా, ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నియంత్రణ) చట్టం కింద 4,129 కేసులు 3,486 అత్యాచారం కేసులు నమోద య్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2378 కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో అత్య ల్పంగా రికార్డయ్యాయి. జమ్మూ-కశ్మీర్‌, మణి పూర్‌, మేఘాలయ,మిజోరం,నాగాలాండ్‌, త్రిపు రలలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఒక్క కేసు నమో దు కాలేదు. 2019 సంవత్సరంలో షెడ్యూల్డ్‌ తెగలవారిపై నేరాలు 26.5శాతం పెరిగాయి. 2018లో ఎస్టీలలపై దాడులకు సంబంధించిన 6,528 కేసులు, 2019లో 8,257 కేసులు నమో దయ్యాయి. భారతదేశంలోనే కాదు విదే శాలలో కూడా దళితులపట్ల వివక్ష, దాడులకు సంబం ధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌ 30న కాలిఫోర్నియాలోని సిస్కో సంస్థలో ఒక దళిత ఉద్యోగి కుల వివక్షను ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత అమెరికా కేంద్రంగా పని చేస్తున్న అంబేద్కర్‌-కింగ్‌ స్టడీ సర్కిల్‌(ఏకేఎస్‌సీ) కులవివక్షను ఎదుర్కొన్న 60మంది భారతీయులకు సంబంధించిన ఘటనలను ప్రచురించింది.
అండగా చట్టాలు
భారతదేశంలో దళితుల రక్షణ కోసం షెడ్యూల్డ్‌ కులాలు/తెగల (అత్యాచారాల నివారణ)చట్టం-1989 అమలులో ఉంది. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై జరిగే దాడులను ఈ చట్టం కింద విచారిస్తారు.ఈ చట్టం ప్రకారం నేరం తీవ్రతను బట్టి బాధితులకు సహాయం, పునరా వాసం, నిందితులకు శిక్షలు నిర్ణయిస్తారు. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా అంటరానితనాన్ని అరికట్టడానికి అస్పృశ్యత నివారణ చట్టం-1955 కూడా ఉంది. దీనిని తర్వాత పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం అంటరానితనాన్ని పాటించడం, ప్రోత్సహిం చడం నేరం. అయితే చాలా కేసులు మీడి యాకు, రాజకీయ నాయకులకు కనిపించ కుండానే పోతాయని, ఫిర్యాదు దాకా కూడా రాని కేసులు చాలా ఉంటాయని నిపుణులు అంటున్నారు. మరి సమస్య ఎక్కడ ఉంది ? చట్టం బలహీనంగా ఉందా లేక దానిని అమలు చేసేవారికి సంకల్పం లేదా?
అవగాహన కల్పించకపోవడమే సమస్య
తమపై జరిగే హింసలో సామాజిక, రాజకీయ కారణాలే పెద్ద పాత్ర పోషిస్తున్నాయని దళితులు భావిస్తున్నారు. బాధిత వర్గంలో అవగాహన పెరగాలని దళిత మేధావి చంద్రభాన్‌ ప్రసాద్‌ అన్నారు. ‘‘అంతకు ముందు దళితులపై ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగలేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని మూక దాడులు చేయడం, చంపడం వంటివి ఉండేవి కాదు. గత 10-15 సంవత్సరాలలో ఇవి బాగా పెరిగాయి. దళితులు అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారిపై దాడులు పెరుగుతున్నాయి. ఇది చట్ట సమస్య కాదు, సామాజిక సమస్య’’ అన్నారు చంద్రభాన్‌ ప్రసాద్‌. ఒక దశలో అమెరికాలో నల్లజాతీయులపై రోడ్ల మీదనే దాడులు జరిగే వని చంద్రభాన్‌ ప్రసాద్‌ చెప్పారు.‘‘ జన వరి 1,1863న అబ్రహంలింకన్‌ బానిసత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి నల్లజాతీయులపై మూక హింసాత్మక దాడులు మొదలయ్యాయి. అంటే, నల్లజాతీయులు బానిసలుగా ఉన్నంత కాలం వారిని చంపాల్సిన అవసరం యజమానులకు రాలేదు. భారతదేశంలో గత76ఏళ్లుగా దళి తులు కూడా అందుకు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు’’ అని చంద్రభాన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యా నించారు.‘‘కుల వివక్ష ఇంకా కొనసాగుతుందన్న విష యాన్ని అందరూ ఒప్పుకోవాలి. విద్యావం తులు కూడా దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు’’ దళిత నేత ఉదిత్‌రాజ్‌. ఆవేదన వ్యక్తం చేశారు.- (వి.నానిబాబు )

చింతిస్తున్న చింతపండు రైతులు

ఈ ఏడాది చింతపండు గురించి మరిచి పోవాల్సిందేనా? ఇదేపరిస్థితి కనిపిస్తే..ధరలు మరిం త ఏడిపించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. చింత పండు సాగు కనుమరుగు అవు తుండడానికి కారణం ఏంటి?మద్దతుధర ఇస్తున్నా.. రైతులు ఎందుకు నో చెబుతున్నారు.
ప్రతి వంట గదిలో తప్పక ఉండా ల్సిన ఐటెమ్స్‌లో చింతపండు ఒకటి. అది లేనిదే రోజు వారీ ఏవంటా పూర్తి కాదు.. పప్పు నుంచి పులుసు వరకు.. పులిహార నుంచి కూడా వరకు అన్నింటిలోనూ చింతపండుతప్పని సరి.. దేనికైనా రుచిరావాలి అంటే చింతపండు పులుపు తగలా ల్సిందే?కానీ అలాంటి చింతపండు గురించి ఇక మరిచిపోవాల్సిందేనా?చింతపడు సాగు పూర్తిగాతగ్గిపోవడమే దానికి కారణమా..? మన్యంలో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు చింతపండు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేదు.దీంతో నిరాశతప్పడం లేదు. చింత పువ్వు దశలోనే ఈదురుగాలులు,వర్షాలు అధికం గా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడిరది. చాలాచోట్ల ఇదే పరిస్థితి..దీంతో సాగుపై గిరిజన రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. ఆశించిన స్థాయిలో జీడిపంట లేకపోగా,చింతదిగుబడి కూడా అం తంతమాత్రంగానే ఉంటోంది. అందుకే దాని మీద ఆధారపడిన వారికి ఈ ఏడాది నిరాశే తప్ప లేదు. వాస్తవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం,సాలూరు,కొమరాడ,పాచిపెంట ప్రాం తాల్లో5 వేల క్వింటాళ్లు,సీతంపేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది. సాధారణంగా మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్‌ ఉంది. మైదాన ప్రాంత వాసులు కూడా భారీగా కొనుగోలు చేస్తుంటారు. జీసీసీకి కూడా ప్రధాన ఆదాయం చింతపండు కొనుగోలు ద్వారానే వస్తుంది. అయితే గత ఏడాది జీసీసీలో చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొను గోలుకు మొగ్గు చూపలేదు. 2022లో కిలో చింత పండు మద్దతు ధర 36గా నిర్ణయించారు. గత ఏడాది నిల్వలు ఉండడంతో మద్దతు ధరను 32. 50కు తగ్గించారు. ఆ ధరకు కూడా గిరిజనుల నుంచి చింతపండును కొనుగోలు చేయలేదు. దీంతో గిరిజనులు మైదాన ప్రాంత వ్యాపారులకు కిలో 40 నుంచి 5కు పంటను అమ్ముకున్నారు.అయితే ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. కానీ ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో ఆర్థిక కష్టాల నుంచి ఎలా గట్టెక్కగలమని గుజ్జి, పెద్దూరు, కిరప,గాడిదపాయి, తాడిపాయి, కిల్లాడ గ్రామాలకు చెందిన గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ జీసీసీ చింత పండుకు మద్దతు ధర నిర్ణయించలేదు. ఏటా లానే ఈసారి కూడా బయట మార్కెట్‌ కంటే తక్కువగా ధర నిర్ణయిస్తే చింతపండును విక్రయిం చేదని లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్న కాస్త పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ఉన్న తాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున చింతపండు కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గత ఏడాది 32.50 పైసలకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మద్దతు ధరను ఇంకా నిర్ణయించలేదంటున్నారు. గిరిజనుల నుంచి సేకరించిన చింతపండుకు గతంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
పూర్వ వైభవాన్ని కోల్పోతున్న గిరి బజార్లు
గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వ ర్యంలో నెల కొల్పిన గిరిబజార్లు(సూపర్‌ మార్కెట్లు) వెలవెలబోతున్నాయి.ఏజెన్సీలోని గిరిజనులు సేక రించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆ ముడి సరుకుద్వారా వినియోగ వస్తువులను తయారు చేయడం,తేనె ఇతరత్రా వాటిని విక్ర యిండంతో పాటు సాధారణ సూపర్‌ మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల నిత్యావసరాలను అమ్మ కాలు సాగిస్తుంటారు.కానీ ప్రస్తుతం సాధారణ నిత్యావసర సరుకులు బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే లభ్యమవుతున్నప్పటికీ గిరిజన ఉత్పత్తులు మాత్రం లేకుండా పోయాయి.
ఒకప్పుడు భద్రాచలం జిసిసి పాయిం ట్లో అన్నిరకాల అటవీ అత్పత్తులు లభ్యమయ్యేవి కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్కఉత్పత్తి కూడా లేదు.ఎక్కడైతే ఐటిడిఎలు ఉంటాయో వాటికి అను సంధానంగా జిసిసి డివిజన్‌ కార్యాలయాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో భద్రా చలం,ఏటూరునాగారం,ఉట్నూరులలోని ఐటిడిఎల కేంద్రంగా జిసిసి డివిజన్‌ కార్యాలయాలు కార్య కలాపాలు సాగిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. నిర్మల్‌ జిల్లా కేంద్రంగా తేనె, భద్రాచలం డివిజన్‌ కార్యాలయం కేంద్రంగా సబ్బులు, షాంపూలు, ఏటూరు నాగారం కేంద్రంగా వాషింగ్‌ సోప్‌ యూనిట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ప్రస్తుతం జిసిసి సూపర్‌ మార్కెట్లలో కానరావడం లేదు. ప్రధానంగా జిసిసి అటవీ ఉత్ప త్తులను చాలా మంది వాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 142 జిసిసి సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అదే విధంగా అలోవీరా సబ్బులు,నీమూసబ్బులు,టర్మరిక్‌ సబ్బులు,తేనెతో తయారు సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు కూడా అందుబాటులో లేవు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్పుడు సూపర్‌ మార్కెట్లు కళకళాడేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవలి కాలం వరకు పలు రకాల జిసిసి ఉత్పత్తులు నిత్యం అందుబాటులో ఉండేవి. షికాకాయి,కుంకుడుకాయిపౌడర్‌, షాంపులు,చీపర్లు,పెసర్లు,కందులు,చింతపండు, అలోవీరా సబ్బులు, మారేడు చెక్కరసం, ఉసిరికాయ పొడి, కరక్కాయలు, అరకు కాఫీ పౌడర్‌ తదితర ఉత్పత్తులు దొరికేవి. ఇప్పుడు అవి కంటికి కూడా కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన చెందిన ఉత్పత్తులను ఇక్కడికి ఇవ్వడం లేదని, అందుకే షాపుల్లో పెట్టలేకపోతు న్నామని ఇక్కడి జిసిసి వర్గాలు చెబుతున్నాయి. కానీ మన దగ్గర తయారయ్యే తేనెను మాత్రం ఏపి జిసిసికి విక్రయి స్తున్నారు. అటు విక్రయించిన వారు ఇక్కడికి కొనేం దుకు ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో అర్ధం కావడం లేదని పలువురు అంటున్నారు.ఈ నేపథ్యంలో జిల్లాలో సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులు అందుబాటులో లేక పోవడంతో పలు వురు వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పుడు అవి కావాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చింతూరుకు వెళ్లాల్సి వస్తోంది. దూరా భారం కావడంతో వినియోగదారులు మనస్సు మార్చుకుని వేరే ఉత్పత్తులు వాడుతున్నారు. జిసిసి సూపర్‌ మార్కెట్లో అటవీ అత్పత్తుల నిల్వ లేకున్న ప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధరపైనే ‘చింత’
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) రaలక్‌ ఇచ్చింది. జిల్లాలో కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధాన మైన చింతపండుకు రివర్స్‌ గిట్టుబాటు ధర కల్పిం చింది. ఈ ఏడాది సీజన్‌లో కిలో చింతపండును 32.40రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.గత ఏడాదితో పోల్చుకుంటే నాలు గు రూపాయలు తగ్గించింది. ధర తగ్గింపుతో ఆగకుండా కొనుగోలుకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా నిబం ధనల ప్రకారమైతే ఏగిరిజనుడూ జిసిసికి చింత పండు విక్రయించే అవకాశం లేదు. చింతపండు పొడిగా వుండాలని,తేమ శాతం అసలు వుండ రాదని,చింత బొట్టలను చేతులతో కొట్టాలని, కర్రలు వినియోగించరాదని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే చింతపండు విక్రయించే గిరిజన రైతులకు నగదు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, ప్రతి గిరిజన రైతూ బ్యాంకు ఖాతా,ఆధార్‌ కార్డు జరాక్స్‌ కాపీలు అందజేయాలని నిర్దేశించింది. ఈ నిబంధనలపై జిసిసి సిబ్బంది ఇప్పటికే ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు. సాలూరు మండలం లోని పట్టు చెన్నూరు, పగులచెన్నూరు, నేరళ్లవల సలో జిసిసి సిబ్బంది స్థానిక గిరిజన ప్రజాప్రతి నిధుల సమక్షంలో అవగాహన సదస్సులు నిర్వహిం చారు. జిల్లాలో జిసిసి కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైంది చింతపండే. దీన్ని జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు సేకరించి విక్రయించుకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో వారి కుటుంబ అవసరా లను తీర్చుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో జిసిసి చింతపండుకు కనీస మద్దతు ధర తగ్గించడం గిరిజ నులకు ఆశనిపాతంలా పరిణమించింది. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న జిసిసి వారిని దూరం చేసే నిర్ణయాలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత రెండేళ్ల ధర కన్నా తక్కువ
గడిచిన రెండేళ్లలో జిసిసి నిర్ణయించిన చింతపండు ధర కన్నా ఈ ఏడాది తక్కువగా నిర్ణ యించింది. సాధారణంగా ఏటేటా అటవీ ఉత్పత్తుల ధరలు ఎంతో కొంత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2021-22లో కిలో చింతపండు రూ.32గా మొదట నిర్ణయించింది. అయితే ప్రయి వేటు వ్యాపారుల కన్నా ఈధర తక్కువ కావడంతో అప్పటి జిసిసి ఎమ్డీ మరో మూడు రూపాయలు పెంచి రూ.35గా నిర్ణయిం చారు. 2020-21సం వత్సరానికి కిలో చింత పండు ధర రూ.36గా జిసిసి ప్రకటించింది. ఈ ఏడాదిలో జిల్లాలో 780మెట్రిక్‌ టన్నుల చింత పండును కొనుగోలు చేసింది. గత ఏడాది కొను గోలు చేసిన చింతపండు పూర్తిగా అమ్మకం కాకపోవడం వల్లే ఈ ఏడాది చింతపండు ధరను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలు స్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన చింత పండు లాభదాయకమైన ధరకు అమ్ముకో వాల్సిన బాధ్యత జిసిసి సంస్థ ఉన్నతాధికారులదే. పాత చింతపండు కోల్డ్‌ స్టోరేజ్‌లో మూలుగుతున్న దనే సాకు చూపి ఈ ఏడాది ధర తగ్గించడంపై గిరిజ నులు ఆందోళన చెందుతున్నారు.అసలే కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గిరిజన రైతులకు చింతపండు ధర పెంపు ద్వారా మేలు చేయాల్సిన ప్రభుత్వంరివర్స్‌ గేర్‌ లో వెళ్ళడం వివాదాస్పద మవుతోంది.
ప్రయివేటు వ్యాపారులదే హవా
ఈ ఏడాదిలో చింతపండు కొనుగో లుకు సంబంధించి ప్రయివేటు వ్యాపారుల హవా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనీస మద్దతు ధర తగ్గించడం,కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం,ఆన్‌ లైన్‌ చెల్లింపులు చేస్తా మన డం వంటి నిర్ణయాలు గిరిజనులను పూర్తిగా జిసిసికి దూరం చేసేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తు న్నాయి. చింతపండు కొనుగోలు సీజన్‌కు ముందే ప్రయివేటు వ్యాపారులు గిరిజన రైతులకు అడ్వాన్స్‌ రూపంలో డబ్బులు చెల్లిస్తారు. జిసిసి మెరుగైన ధర కల్పించినా కొంతమంది గిరిజనులు ప్రయివేటు వ్యాపారులకే చింతపండు విక్రయిస్తారు. తాజా నిబంధనల ప్రకారమైతే గిరిజనులంతా ప్రయివేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. చింతపండు కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను తగ్గించిందనే అనుమానాలు వ్యక్త మవుతు న్నాయి. దీనివల్ల జిల్లాలోని గుమ్మలక్ష్మీ పురం, కురుపాం, జియ్య మ్మవలస, పార్వతీపురం, కొమరాడ, సాలూరు, పాచిపెంట,మక్కువ, మెం టాడ,ఎస్‌.కోట మండ లాలకు చెందిన వేలాది మంది గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ ప్రాం తంలోని గిరిజనులకు చింత పండు సేకరణతో వచ్చిన ఆదాయమే ఏడాది పొడవునా వారి కుటుం బ పోషణకు వినియోగిస్తారు.
కాఫీ ధర పెంపు, చింతపండు ధర తగ్గింపు
అరకు ప్రాంతంలో పండిరచే కాఫీ, స్ట్రా బెర్రీ పండ్లుకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాఫీ,స్ట్రా బెర్రీ పండ్లుకు గిరాకీ ఉండడంతో ధరలను పెం చింది. చింతపండుకు డిమాండ్‌ ఉన్నప్పటికీ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విక్రయిం చడంలో జిసిసి అధికారులు విఫలమయ్యారు. వారి అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి చింతపండు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపట్ల అసంతప్తి వ్యక్తమవుతోంది.
సోమవారం రోజంటే ఎందుకంత భయం..
గిరిజనులు ఎక్కువగా అటవీ ఉత్ప త్తులపైనే ఆధారపడి జీవిస్తుంటారు..అక్కడ పండిర చే పంటలకు ఆర్గానిక్‌ అనే పేరు ఉండటంతో మార్కెట్లో కూడా మంచి డిమాండ్‌ వస్తుంది. అయి తే చింతపండు విషయంలో విశాఖపట్నం లోని ఏజెన్సీలో ఉన్న గిరిజనులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రోజున చింతపండు అమ్మాలంటే వారు భయపడి పోతున్నారు. ఎందు కంటే ఆరోజు చింతపండు ధర చాలా తగ్గిపో తుంది. మిగతా రోజుల్లో మాత్రం ధర అటు ఇటుగా ఉన్నా సోమవారం రోజు వస్తే వివిధ కారణాలతో చింతపండు ధర తగ్గిపోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.. గిరిజనుల దగ్గర వార సంతలు వారంలో రెండు సార్లు జరుగు తాయి. సోమవారం మరియు గురువారం.. కానీ గిరి పుత్రులకు సోమవారం రోజున చింతపండు అమ్మకాలు అసలు కలిసి రాదట. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిరదనీ అంటున్నారు. సాధారణంగా చింతపండు మార్కెట్‌ విలువ పిక్క తీసింది అయితే 120 రూపాయలు కిలో.. పిక్క తీయనిది అయితే 80 రూపాయలకు కిలో. కానీ గిరిజనులు మాత్రం పిక్కతో ఉన్న దాన్ని కేజీ 40 మాత్రమే అమ్ముతున్నారు. అయితే చింతపండును గిరిజనుల నుంచి దళారులు కొనేసి ట్రాన్స్పోర్ట్‌ ప్యూరిఫైయర్‌ అనే పేరుతో రకరకాల ధరలు వేసి వినియోగదారుడికి వదిలేస్తున్నారు. దీంతో ధర బయటి మార్కెట్‌కి వచ్చేసరికి డబల్‌ అయి పోతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో గిరిపుత్రులు పండిరచిన చింతపండు మాత్రం అంత ధర రాదు. ఇందులోనూ సోమవారం చాలా సెంటిమెంట్‌ గా భావిస్తారు. గురువారం రోజున అమ్ముకుంటే వచ్చే లాభం సోమవారం రాదని అనుకుంటారు గిరి పుత్రుడు.అందుకే వారికి సోమవారం అంటే అంత భయం.-(కందుకూరి సతీష్‌ కుమార్‌)

విద్య హక్కు వీడని చిక్కు

-ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకే.. ` ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 26) జీవో విడుదల చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ ఒకటో తరగతిలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 7 వరకు విద్యార్ధులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసు కోవచ్చు. లాటరీ విధానంలో సీట్లను కేటాయి స్తారు. మొదటి రౌండ్‌లో ఎంపికై విద్యార్ధుల వివరాలు ఏప్రిల్‌ 13న వెల్లడిస్తారు. సెకండ్‌ రౌండ్‌ సెలక్షన్‌ లిస్టు ఏప్రిల్‌ 25న ప్రకటిస్తారు. మొత్తం 25 శాతం సీట్లలో అనాధలు, హెచ్‌ఐవీ బాధితు లకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, పేద ఓసీలకు 6 శాతం సీట్లను కేటాయించున్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఇతర వివరాలకు 14417 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

విద్యాహక్కు చట్టం ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రైవేట్‌ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయలేక పోతున్నాయి, దీనికి ప్రధాన కారణం అధికారుల లోపం? లేకపోతే ప్రైవేటు పాఠశాల లోపమా?విద్యా హక్కు చట్టం ప్రకారం6నుండి14సంవత్సరాల లోపు గల బాల బాలికలందరికీ విద్య ప్రాథమిక హక్కు, ప్రాథమిక పాఠశాలలు కనీస ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది, కానీ ఎక్కడా ఇవి అమలు కావడం లేదు, అన్ని ప్రభుత్వ పాఠశా లలు మరియు ప్రైవేటు పాఠశాలలో పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటా యించాల్సి ఉంటుంది కానీ ఇది ఎక్కడ ఏ ప్రైవేట్‌ పాఠశాలలో కనిపించడం లేదు. పాఠశాలలో అడ్మిషన్ల కోసం డొనేషన్ల క్యాపి టేషన్‌ ఫీజులు ఫీజులు వసూలు చేయడంపిల్లలు తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడం విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం అవు తుంది. డ్రాపౌట్‌ స్టూడెంట్‌లను వారి సమాన తరగతి విద్యార్థుల స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బడి వయసు పిల్లలందరినీ బడిలో తమ వయసుకు తగిన తరగతుల్లో చూడాలి. ఆవాస ప్రాంతానికి 1కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండాలి,3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమి కోన్నత పాఠశాల ఉండాలి.ఈ విద్యకు అయ్యే ఖర్చు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి,ఏ విద్యార్థిని కూడా ఒక విద్యా సంవత్సరంలో ఏ తరగతిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ నిలిపి ఉంచకూడదు..ఇది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం, ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడులు నిర్వహించే కూడదు, ప్రతి పాఠశాలలో యాజమాన్య కమిటీలు లను ఏర్పాటు చేయాలి , అదే విధంగా పాఠశాలలు అభివృద్ధి ప్రణాళి కను తయారు చేయాలి,ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వ హించ కూడదు,విద్యావిధానం ఆధునిక ధోర ణులులో మార్పులు సలహాలకు జాతీయ స్థాయిలో జాతీయ సలహా సంఘం,రాష్ట్రంలో రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు చేయాలి. పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించడం వంటివి చేయరాదు, నాణ్యమైన విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికలు తయారు చేయాలి, మూల్యాంకన విధానాలు రూపొందిం చేటప్పుడు పిల్లల సమగ్ర అభివృద్ధిని రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవా లని ఈ చట్టం పేర్కొంటోంది. ప్రభుత్వ టీచర్‌ ప్రైవేట్‌ ట్యూషన్లు ప్రైవేట్‌ బోధనా పనులు చేపట్టకూడదు. టీచర్‌ నిష్పత్తి ప్రతి బడుల్లో ఉండేలా సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం చూడాలి. కానీ నేటి వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిం చాల్సిన అటువంటి పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు ఇప్పటికీ అందలేదు, ప్రతి పాఠశాలలో 2009 ప్రకారం తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు తరగతి గదులు, వసతి సౌకర్యాలు మొద లైనవి ఉండాలి, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 45 గంటలు పని చేయాలి. ఉపాధ్యాయులు తమకున్న అపోహలు తొలగించుకొని బాలల హక్కుల దృక్పథంతో పనిచేస్తున్నారు, జ్ఞానం అంటే సమాచారం కాదని అది గత అనుభవాలు ఆలోచన ద్వారా ఉత్పన్నమవు తుందని ఉపాధ్యాయుడు భావి స్తాడు, పిల్లలను ఆలూరు ఆలోచింపజే సలా ప్రతి చర్యలో భాగస్వామ్యం చేసేలా బోధనా భ్యసన ప్రక్రియ ఉపాధ్యాయుడు నిర్వహించాలి.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రణాళిక (కరికులం) ఉంటుంది. దీని ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలి. అన్ని సహాపాఠ్య విషయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.బడి ఈడు పిల్లలు అందరు పాఠశాలలో చేరి విద్యను అభ్యసిం చాలి,విద్యా హక్కు చట్టం ప్రకారం చదువులో వెనుకబడిన పిల్లలకు అదనపు సమయంలో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించాలి. భయారహిత దండ న లేని పాఠశాల వాతా వరణం ఉండాలి. పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్త పరిచే విధంగా తరగతిగది ఉండాలి.పిల్లల యొక్క జ్ఞానాన్ని ఉపాధ్యా యుడు నిరంతరం మూల్యాం కన ద్వారా అంచ నా వేస్తాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు తాగునీరు మరుగుదొడ్లు కనీససౌకర్యాలు కల్పించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక స్కూలు నెలకొల్పాలి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం సరిగా అమలు చేయకపోవడంవల్ల వందలు స్కూలు మూతబడి పోతున్నాయి తద్వారా పిల్లలకు అందాల్సినటువంటి ఉచిత నిర్బంధ విద్య అందకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలావరకూ విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ ను తగ్గిం చాయి. దీని ద్వారా అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కొరతగా ఏర్పడుతున్నాయి. విద్యా వ్యవస్థకు బడ్జెట్‌ తగ్గించడంతో పాఠశా లల్లో సమస్యలు నాటికీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు దివాళా తీస్తున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని ద్వారా ఉచితం గా అందాల్సినటువంటి విద్య కాస్త ఖరీదైన సరుకుగా మారిపోతుంది.విద్యా హక్కు చట్టం అమలు చేయక లేకపోవడం వల్ల దేశ ప్రగతికి పట్టుకొమ్మలు గా ఉండాల్సిన అటువంటి ప్రాథ మిక విద్య పతనం అయిపోతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు లేకపోతే విద్య అనేది పేదవారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. విద్యా హక్కు చట్టం సార్వత్రిక ప్రాథమిక విద్యను అందిస్తుంది కానీ వ్యంగ్యంగా దీన్ని సాధ్యం చేయగల ప్రైవేట్‌ విద్యా ప్రదాతలను పరిమితం చేస్తుంది. చట్టం ప్రారంభానికి ముందు స్థాపించబడిన పాఠశాలలు మూడు సంవత్సరాలలోపు ఆర్‌టీఐ షెడ్యూల్‌లో పేర్కొ న్న నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగు ణంగా ఉండాలని లేదా లేకుంటే మూసి వేయ బడతాయని సెక్షన్‌ 19 పేర్కొంది. చట్టం ప్రకారం ఇప్పటికే గుర్తింపు పొందిన పాఠశా లలు ఆర్టీఈ షెడ్యూల్‌లోని నిబంధనలను మాత్రమే పాటించాల్సి ఉండగా,గుర్తింపు లేని పాఠశాలలు అదనంగా రాష్ట్ర నిబంధనలను కూడా పాటించాలి.చాలా వరకు గుర్తింపు లేని పాఠశాలలు ప్రణాళిక లేని కాలనీల్లోనే ఉండి ప్రాథమిక స్థాయి వరకు బోధిస్తున్నారు. గుర్తిం పు పొందిన పాఠశాలలను కొనుగోలు చేయలేని మరియు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులకు ఈ పాఠశాలలు చౌకైన ప్రత్యామ్నాయం. ఢల్లీిలో గుర్తింపు పొందని పాఠశాలల సాంప్రదాయిక అంచనా ప్రకారం ఒక్కొక్కటి 200 మంది పిల్లలతో దాదాపు 2000 మంది ఉన్నారు. ప్రస్తుత ఢల్లీి రాష్ట్ర నిబంధనల ప్రకారం, పాఠశాలలకు 800 చదరపు గజాల స్థలం ఉం డాలి మరియు ఆరవ వేతన సంఘం తర్వాత ప్రవేశ స్థాయిలో రూ.23,000 ప్రభుత్వ జీతంతో సమానంగా ఉపాధ్యాయుల జీతం చెల్లించాలి.అదనంగా,విద్యా హక్కు చట్టం ప్రతి పాఠశాలకు ఆట స్థలం ఉండాలని నిర్దేశి స్తుంది. ఈ స్థలం మరియు ఉపాధ్యాయుల జీతం అవసరాలు గుర్తించబడని పాఠశాలలకు చేరుకోవడం కష్టం.ఈ ప్రమాణాలను తనిఖీ చేయడానికి ఐదు గుర్తింపు పొందిన పాఠశా లలు,తొమ్మిది గుర్తింపు లేని పాఠశా లలను షహదారాలో సందర్శించారు. గుర్తింపు పొందిన ఐదు పాఠశాలల్లో ఏదీ ప్రస్తుత భూమి ప్రమాణాలకు అనుగుణంగా లేదు మరియు నిర్ణీత ఉపాధ్యాయుల వేతనాన్ని చెల్లించలేక పోయింది. ఒక గుర్తింపు పొందిన పాఠశాల నిర్వాహకుడు తన పాఠశాల 200 చదరపు గజాల స్థల ప్రమాణానికి అనుగుణంగా ఉన్నం దున గుర్తింపు పొందాడు, అయితే ఆ సమయం లో రూ.80,000లంచం చెల్లించాల్సి వచ్చిం ది. అతను ఒక పిల్లవాడికి నెలకు రూ. 250 రుసుము వసూలు చేస్తున్నప్పుడు, అది రూ. 500గా లెక్కించబడుతుంది, తద్వారా అతను ఉపాధ్యాయుని జీతం వాస్తవానికి చెల్లించే దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.గుర్తింపు లేని పాఠశాలలు ఏవీ భూ ప్రమాణాలకు అను గుణంగా లేవు. కనీసం ప్రణాళిక లేని కాలనీల్లోనైనా భూ నిబంధనలను సడలించా ల్సిన అవసరం ఉంది. పాఠశాలలో తగినంత సంఖ్యలో వెంటిలేషన్‌ మరియు కొంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే గుర్తింపు ఇవ్వడం ఒక ఎంపిక. అనేక గుర్తింపు లేని పాఠశాలల్లో తరగతికి 15-20 మంది విద్యార్థులు ఉన్నారు మరియు పిల్లలకి అవసరమైన స్థలం ప్రకారం గది పరిమాణాన్ని లెక్కించడం మరింత సమంజసంగా ఉంటుంది. అలాగే, ఉపాధ్యా యుల జీతాలు పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి ఉండాలని ప్రభుత్వం కోరుకోనప్పటికీ, అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠ శాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయితీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠ శాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. అవాస్తవ ప్రభుత్వ జీతాల కంటే పాఠశాలల ఫీజు ఆధారంగా నిర్ణయించాలి. మూడవది పాఠశాలలకు ఆటస్థలం కావాలని అడగడం కంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు వ్యాయామ విద్యను అందిం చడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించకుండా పొందగలిగేలా కొంత పర్య వేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు. ప్రభుత్వం ప్రతి పాఠశాలకు సమీపంలో ఒక పార్కు ఉండేలా చూసుకోవాలి పాఠశాలలు తమ విద్యార్థులకు శారీరక విద్యను అందించడాన్ని తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, గుర్తింపు కోసం అర్హత పొందిన పాఠశాలలు భారీ లంచం చెల్లించ కుండా పొందగలిగేలా కొంత పర్యవేక్షణ యంత్రాంగం అవసరం. ఈ రాయి తీలు మాత్రమే ఇస్తే, చిన్న బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశా లలు సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించ డంలో ప్రభుత్వంతో కలిసి పని చేయగలవు.
వ్యర్థమవుతున్న విద్యాహక్కు చట్టం
ఆర్టికల్‌ 51(కె) ప్రకారం బాల బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6 నుండి 14 సంవత్సరాల వరకు విద్యను అందించే సదుపాయాలను ఏర్పాటు చేయాలి. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 2009లో బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది, అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆర్థికం గా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది, ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో ప్రైవేటు విద్యా సంస్థలు సవాలు చేశాయి. సొసైటీ ఫర్‌ అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఆమోదిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కల్పించిన 25% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ, ఇందులో ఆర్టికల్‌ 30(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చింది. ఆర్టికల్‌ 21ఎ చెల్లుబాటును రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. అదేవిధంగా 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 15(5)ను చేరుస్తూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబిసి) వారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం వెసలుబాటును కల్పించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం 2008లో అశోక్‌ కుమార్‌ ఠాకూర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో కేంద్రీయ విద్యా సంస్థలలో ఓబిసి లకు 25% రిజర్వే షన్లకు ఆమోదం తెలుపుతూ ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్లపై తేల్చలేదు. సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం 2012 లో ప్రతిమా ఎడ్యుకేషనల్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండి యా మధ్య జరిగిన కేసును విచారించి 2014లో తుది తీర్పు వెలు వరిస్తూ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 21ఎ మరియు 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్‌ 15(5) లను ఆమోది స్తూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థ లలో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ వారికి రిజర్వే షన్ల కల్పనకు ఆమోదించి అదే తీర్పులో ఆర్టికల్‌ 13(1) ప్రకారం ఏర్ప డిన మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇటీవల జాతీయ నూతన విద్యా విధానం 2019ని అమలులోకి తేవాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై పార్ల మెంటు ఆమోదంతో చట్టం చేయవలసి ఉంది. సదరు నూతన విద్యా విధానం 2030 నాటికి100% అక్షరా స్యతను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజ్యాం గం నిర్దేశించి నట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25% రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల బాలికల కు నాణ్యమైన విద్యను అందించవలసిన అవ సరం ఉంది.-జిఎన్‌వి సతీష్‌

ప్రాంతీయ అసమానతలు` పరిణామాలు

ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకు ఉపయోగించు కొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
మనదేశంలో కొన్ని రాష్ట్రాలు అభి వృద్ధి చెందితే మరికొన్ని వెనకబడి వున్నాయి. ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరికొన్ని వెనకబడిఉన్నాయి.భారతదేశ అభి వృద్ధి సమైక్యతకు మూలాధారం సంతులిత ప్రాం తీయాభివృద్ధి. అందుకే ప్రణాళిక రూపకర్తలు ప్రణాళికాలక్ష్యాల్లో సంతులిత ప్రాంతీయాభి వృద్ధిని ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు.
కారణాలు..
సహజసిద్ధ అంశాలు
చారిత్రక అంశాలు
సహజ వనరులు
ప్రభుత్వ విధానం
కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి
ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర
పాలనా వ్యవస్థ
హరిత విప్లవం
అసమానతలు-కొలమానాలు
1) రాష్ట్ర తలసరి ఆదాయం 2) పేదరిక స్థాయి 3) మానవ అభివృద్ధి సూచిక 4) పారిశ్రామిక-ఉద్యోగిత 5) సహజ వనరుల లభ్యత, నీటి పారుదల సౌకర్యాలు 6)పట్టణీకరణ,7) విద్యు చ్ఛక్తి వినియోగం 8) బ్యాంకు డిపాజిట్లు
పారిశ్రామికాభివృద్ధి-ఉద్యోగిత మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రమైన అసమానతలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తర్వాత పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. పారిశ్రామిక స్థిర మూలధనంలో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర,గుజరాత్‌ల్లో 34. 60%,పశ్చిమబెంగాల్‌24.65%అనగా 59.25% కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు 63.03% ఉద్యోగిత,63.95%పారిశ్రామి కోత్ప త్తి కలిగిఉండటం తీవ్రమైన అసమానత లను తెలియజేస్తుంది. సహజ వనరుల లభ్యత,నీటి పారుదల సౌకర్యాలు పంజాబ్‌,హర్యానామొదలైనరాష్ట్రాల్లో నీటి పారుదల సౌకర్యాలు,సహజ వనరులు ఎక్కువ గా అందు బాటులో ఉండటం వలన వ్యవసా యం అభివృద్ధి చెందింది.ఆంధ్రప్రదేశ్‌,ఉత్తరప్ర దేశ్‌ల్లో కొన్ని ప్రాం తాల్లో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందింది.
పట్టణీకరణ
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పట్టణీ కరణ జరిగి పట్టణ జనాభా ఎక్కువగా ఉంటు న్నది.జాతీయస్థాయిపట్టణ జనాభా31.2% కాగాతమిళనాడు(48.4%),మహరాష్ట్ర(45. 2%),గుజరాత్‌(42.6%),కర్ణాటక (38. 6%), పంజాబ్‌ (37.5%)మొదలైన రాష్ట్రాల్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉంది.బీహార్‌ (11.3%), అసోం(14.1%)ఒడిశా (16.7%), ఉత్తరప్రదేశ్‌ (22.3%) వంటి రాష్ట్రాల్లో పట్టణజనాభా తక్కువ గా ఉంది.
విద్యుచ్ఛక్తి వినియోగం
తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం ప్రాం తీయ అసమానతలను తెలియ జేస్తుంది. 2009-10 గణాంకాల ప్రకారం జాతీయ స్థాయి తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం121.2కిలో వాట్లుకాగా ఢల్లీి 508.8,పంజాబ్‌257.3,తమిళనాడు 208.5కిలో వాట్లు ఉండగా బీహార్‌లో20.5,ఉత్తరప్రదేశ్‌ 83.4,మధ్యపదేశ్‌73.4కిలోవాట్లు మాత్రమేఉంది.
వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు
జాతీయస్థాయిలో తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2011మార్చి నాటికి రూ. 33,174వుండగాఢల్లీి రూ.2,85,400, మహ రాష్ట్ర రూ.82,380 కలిగి ఉండగా బీహార్‌ రూ. 9,667,అసోంరూ.16,393 తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు కలిగి ఉన్నాయి.
ప్రాంతీయ అసమానతలు -ప్రణాళికలు
దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు మళ్లించడానికి వీలుగా ఆప్రాంతాల్లో సంస్థలు స్థాపించే పెట్టు బడిదారులకు తగిన ప్రోత్సాహకాలను కల్పించ డమే గాకుండా అవస్థాపనా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం,నీటివసతి,నైపుణ్యంగల శ్రామి కుల లభ్యత మొదలైన సౌకర్యాలను అందు బాటులోనికి తేవలసి ఉంటుంది. ఇందుకు ప్రభు త్వం అనేక కార్యక్రమాలను చేపట్టాలి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల గురించిన ప్రస్తాన లేనప్పటికీ,రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాంతీయ అసమానతల తగ్గింపు అవస రాన్ని గుర్తించినారు. ఇందులో వెనుకబడిన ప్రాం తాల్లో పెట్టుబడులు కొనసాగించి సంతులిత ప్రాంతీయాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. మూడో పంచవర్ష ప్రణాలికలో సంతులిత ప్రాంతీ యాభివృద్ధి కొరకు 9 వఅధ్యాయాన్ని ప్రత్యేకంగా పేర్కొనారు.నాలుగో పంచవర్ష ప్రణాళికలో గ్రామీ ణ పేదలకు ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా మొద లైన కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు.ఐదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగిం చడం కోసం నాలుగో పంచవర్ష ప్రణాళిక లోని కార్యక్రమాలని కొనసాగించినారు. ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించ డానికి సమగ్ర విధానాన్ని రూపొందించారు. ఇం దులో భాగంగా ప్రాంతీయ ప్రణాళికలు,ఉప ప్రణాళి కలను అమలుచేసి జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం చేశారు. ఏడో పంచ వర్ష ప్రణాళికలో ప్రాంతీయ అభివృద్ధి స్థాయికి రెండు అంశాలను గుర్తించినారు.1)వ్యవసాయ ఉత్పా దకత,మానవ వనరుల సామర్థ్యం పెంపు2) ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించడం. వీటికి అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేయ డం.ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రణాళికా వ్యూహం సూచనాత్మక ప్రణాళికకు (Iఅసఱషa్‌ఱఙవ ూశ్రీaఅఅఱఅస్త్ర) మారడం మూలాన ప్రాం తీయ అసమానతల తగ్గింపునకు చూపే చొరవ తగ్గిన ప్పటికీ దీని కొరకు కొన్ని ప్రత్యేక కార్యక్రమా లను అమలు చేశారు. తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రాంతీయ అసమా నతలను తొలగించడానికి ప్రయివేటు పెట్టుబడులు దోహదపడలేదని కనుక తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ పెట్టుబడుల అవసరమని పేర్కొన్నారు. పదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయాభివృద్ధి కోసం రాష్ట్రాలవారీగా వృద్ధి లక్ష్యాలను నిర్ణయిం చారు.పదకొండో పంచవర్ష ప్రణాళికలో వెనుక బడిన ప్రాంతాల కొరకు ఏర్పాటు చేశారు. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో నిధుల వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొం దించారు.పారిశ్రామికంగా అభివృద్ధి చెందని ప్రాం తాల్లో,వ్యవసాయం,దాని అనుబంధ పరిశ్ర మలలో, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కార్యక్ర మాల్లో నిధులను వినియోగించాలని పేర్కొన్నారు.
వెనుకబడిన ప్రాంతాలు – అసమానతలు!
ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకుఉప యోగించుకొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46(3)లో రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పొందు పర్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2014ఫిబ్రవరి 20వ తేదీ రాజ్య సభలో మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లా లకు బోలంగీర్‌ కలహండి తరహాలో ప్రత్యేక ప్యాకే జీ ఇస్తామన్నారు.కాగామధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లో వ్యాపించివున్న బుందేల్‌ ఖండ్‌ తరహాలో ఈప్యాకేజీ వుంటుందన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభు త్వం రూ.24,350 కోట్లతో ప్రతిపాదన లు కేంద్రా నికి పంపితే ముష్టిగా జిల్లాకు రూ.50 కోట్లుచొప్పున మూడేళ్లు ఇచ్చి తర్వాత ఎగ్గొట్టారు. ఇప్పటికీ సవా లక్ష కొర్రీలు వేస్తున్నారు. విభజన చట్టం సెక్షన్‌ 94 (3)మేరకు వెనుక బడిన జిల్లాల్లో భౌతిక సామాజిక వనరులు అభివృద్ధి చేయాలి.ఈచట్ట బద్దహక్కులు హుష్‌ కాకి అయ్యాయి.ఇక ప్రత్యేక హోదా వుండనే వుంది. నాణేనికి ఇది ఒకవైపు అయితే మరో వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల ఫలితంగా ప్రజల్లో నివురు గప్పిన నిప్పులాగా వున్న అసంతృప్తిని కొందరు నేతలు తమ రాజకీయ అవసరార్థం ఉపయోగించు కొంటున్నారు. వాస్తవంలో ఆయా వెనుకబడిన ప్రాంతాల భౌతిక పరిస్థితులు ప్రజల అవసరాలు వీటితో పాటు వారి వాంఛలు ఆధారం చేసుకొని ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయా లి.కాని ఆదిశగా చర్యలు లేక పోవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు గాని రాయలసీమలో కొందరు నేతలే కాకుం డా ప్రత్యేకిం చి ఒకసెక్షన్‌ యువత వేర్పాటు వాదం తెర మీదకు తెస్తున్నది. ఉత్తరాంధ్రలో విస్తారమైన సముద్ర తీరం వున్నందున పైగా విశాఖలో నౌకాదళం కేంద్రం వున్నందున మిగతా జిల్లాలతో పోల్చుకొంటే విశాఖ జిల్లా కొంత మెరుగ్గా వుంది. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా వున్నప్పుడే వైయస్‌ రాజశేఖర రెడ్డి హ యాంలోఉత్తరాంధ్ర సుజల స్రవంతిరూపుద్దు కున్నది. ఈ పథకం అమలు జరిగితే ఉత్తరాంధ్రలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు 30లక్షల మందికి తాగునీటి వసతి ఏర్పడుతుంది. విజయ నగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు శ్రీకాకుళం జిల్లాలో0.85లక్షల ఎకరాలకు సాగునీరు అందు తుంది. ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడైనా మంత్రు లు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావులు ఈ పథకం అమలు జరగలేదని మంత్రి పదవులకు రాజీనామాకు సిద్ధమై వుంటే వీరి చిత్తశుద్ధి శంకించ లేము. కాని భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొట్టేం దుకు మంత్రి పదవులు త్యాగం చేస్తామంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి అనుసం ధానం ఏళ్ల కొద్దీ ఎందుకు నానుతుంది? వంశధా రపై నెరెడి బ్యారేజీ నిర్మాణంగుర్తు వుందా? వ్యవ సాయంపై ఆధారపడే లక్షలాది మంది ఉత్తరాంధ్ర రైతులకు సాగునీరు కావాలా?ఇవేవీ లేకుండా పరిపాలన రాజధాని కావాలా?పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖ తాగునీటికి23.99 టియం సిలు నీరు కేటాయించారు. పోలవరం గాలిలో దీప మైంది!
రాయలసీమ పరిస్థితి మరీ దుర్భరంగా వుంది.ఈ ప్రాంతంలో విస్తారమైన బీడు భూములు న్నాయి. ఎక్కువ భాగం వర్షాధార పంటలైనందున మొత్తంగా నీళ్లు,నీళ్లు అని ప్రజలు తుదకు తాగు నీటికి తపిస్తుంటారు. ఈ ఏడు విస్తారంగా వర్షాలు పడ్డాయి. కాని గ్రామాల్లో ఉపాధి లేక గ్రామాలకు గ్రామాల ప్రజలు వలసలు పోతున్నారు. మరీ దారుణమేమంటే కెసి కెనాల్‌ కింద ఆయకట్టులో పెట్టిన పంటలకు నీళ్లు అందే అవకాశం లేదని నేడు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే హంద్రీనీవా కింద కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం లో పంటలు ఎండిపోయాయి.
బచావత్‌ ట్రిబ్యునల్‌ కెసి కెనాల్‌కు తుంగభద్ర నుండి39.9టియంసిలు నీరు కేటాయిం చినది. దురదృష్టం ఏమంటే దశాబ్దాలు గడుస్తున్నా 2.65 లక్షల ఎకరాలు ఆయకట్టుగల కెసి కెనాల్‌ కు 1.25 టియంసిలు సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీ తప్ప నీళ్లు నిల్వ చేసే వసతి లేదు.2.965 టియంసిలు నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అలగ నూరు రిజర్వాయర్‌ లో నీరు నిల్వ చేసే అవకాశం లేక పశువుల మేత పొరంబోకుగా వుంది. బచా వత్‌ ట్రిబ్యునల్‌గాని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గాని సుంకేసులబ్యారేజీ నుండి(21ం10) టియం సిల నీరు మాత్రమే శ్రీశైలం జలాశయం చేరు తుందని తేల్చారు. కాని ఏటా వందల టియంసిలు కలుస్తున్నాయి. ట్రిబ్యునల్‌ కేటాయింపులు అరకొరగా వున్నా చట్టబద్దతగల నీళ్లువర్షపు నీరునిల్వ చేసుకొనే ఏర్పాట్లు జరిగి వుంటే రాయలసీమలో కొంతలో కొంత నీటి కొరత తీరేది.కెసి కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన గుండ్రేవుల రిజర్వాయర్‌ హుళక్కి అయింది. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం న్యాయ రాజధాని రెండు పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి రాయలసీమను కోనసీమ చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం కోర్టు వివాదంలో చిక్కుకున్నది. న్యాయ రాజధాని కాదు కదా తుదకు కృష్ణ యాజ మాన్య బోర్డు కార్యాలయం గతి లేకపోయింది. ఈ మధ్య సీమ రైతులు రోడెక్కి సిద్దేశ్వరం కోసం పోరాటం మొదలు పెట్టారు. దురదృష్టమేమంటే రాయలసీమలో చిన్న కాలువ తవ్వాలన్నా తెలం గాణ ఇంజనీరింగ్‌ చీఫ్‌ యాజమాన్యం బోర్డుకు రేఖరాసి అడ్డుకొంటున్నారు. ఇరువురు ముఖ్య మంత్రులు బాగానే వున్నా (చంద్రబాబుతో పోల్చితే) రెండు రాష్ట్రాల మధ్యగల అంతర్‌ రాష్ట్ర జల వివాదాలు సామరస్యంగా పరిష్కారానికి కృషి జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోం ది. కాగా గత ప్రభుత్వం ఏంచేసింది అనేది పక్కన పెడితే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల కాలం లో సాగునీటి రంగంలో 19 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిందంటే ఇందులో వెనుక బడిన ప్రాం తాల భాగం అతి స్వల్పమే. రాష్ట్రంలో వెనుకబడిన ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరంగా వున్నాయి. ప్రాంతీయ అసమానతలు నెలకొన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పరిష్కార మార్గాలు చూడ కుండా పాలకులు కాలం వెళ్లదీస్తే కుదరదు. -వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయులు- (వి.శంకరయ్య)

ఎస్టీలను అధికారికంగా గుర్తించిన ఆర్టికల్‌ ఏదీ?

దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థిక పరమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుం ది.2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా…షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం.సమాజం విసిరే సవాళ్లను అధిగమించడానికిగాను ప్రభుత్వం అవలంబించే విధానాన్ని సామాజిక విధానం అంటారు. ప్రభుత్వాల అంతిమ లక్ష్యం అణగారిన వర్గాల అభ్యున్నతి. అందువల్ల ప్రభుత్వాలు అణగారిన వర్గాల కోసం ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తున్నాయి. చారిత్రకంగా పరిశీలిస్తే యూరప్‌లో సంభవించిన పారిశ్రామిక, ఫ్రెంచ్‌ విప్లవం,అమెరికాలో ఏర్పడిన మహా ఆర్థిక మాంద్యం ఫలితంగా దేశ ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వాలు బలమైన శక్తిగా అవతరించాయి. ప్రభుత్వాలు ఆర్థిక లక్ష్యాలతోపాటు సామాజిక న్యాయం,సమానత్వం, సాధికారత వంటి సామాజిక లక్ష్యాలను రూపొందించుకొని అమలుచేస్తున్నాయి. 1834లో ఇంగ్లండ్‌లో రూపొందించిన పూర్‌ లా సంక్షేమ యంత్రాంగానికి ఆధారంగా నిలిచింది. ఐరోపాలో ఉదయించిన సంక్షేమ రాజ్య భావన క్రమంగా భారత్‌తో సహా అన్ని దేశాలకు విస్తరించింది. 1950వ దశాబ్దంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ప్రాంతాల్లో ఏర్పడిన తృతీయ ప్రపంచ దేశాలు సంక్షేమ రాజ్యాన్ని నిర్మించుకున్నాయి. ఇందులో భారతదేశం కూడా ఒకటి కావడం విశేషం. దేశంలో సంక్షేమ యంత్రాంగానికి మూలం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలుషెడ్యూల్డ్‌ కులాల సంక్షేమం భారతీయ సామాజిక చరిత్రలో సామాజిక దోపిడీకి గురైన షెడ్యూల్డ్‌ కులాలను స్వాతంత్య్రానంతరం సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రక్షించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో 16.6 శాతం జనాభాను కలిగి ఉన్న షెడ్యూల్డ్‌ కులాలను 1108 రకాల పేర్లతో పిలుస్తున్నారు. భారత ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమాన్ని మూడు మార్గాల ద్వారా కొనసాగిస్తున్నది.

  1. రాజ్యాంగ రక్షణలు
  2. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
  3. ఆర్థిక సహాయం అందించడం
    రాజ్యాంగ రక్షణలు
    ఆర్టికల్‌-14: చట్టం ముందు అందరూ సమానులే. సమన్యాయ పాలన అంటే షెడ్యూల్డ్‌ కులాలపరంగా సమాజం, ప్రభు త్వం సామాజిక సమానత్వం, భాగస్వామ్యం కల్పించాలి. ఆర్టికల్‌-15(4): ప్రభుత్వ అవకాశాలపరంగా ముఖ్యంగా సామాజిక, విద్య, ఆర్థికాంశాల పరంగా షెడ్యూల్డ్‌ కులాలకు ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించవచ్చు. ఆర్టికల్‌-16 (4): ఉద్యోగాలు, ఇతర సర్వీసులలో షెడ్యూల్డ్‌ కులాలకు సరైన భాగస్వామ్యం లేనప్పుడు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు.
    ఆర్టికల్‌-17: అంటరానితనం నిషేధం
    ఆర్టికల్‌-23: వెట్టిచాకిరీ, కట్టు బానిసత్వం, జోగిని, దేవదాసీ మనుషుల అక్రమ రవాణా నిషేధం
    ఆర్టికల్‌-24: బాలకార్మిక వ్యవస్థ నిషేధం
    ఆర్టికల్‌-46: షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర బలహీనవర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఆర్టికల్‌-330: లోక్‌సభలో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్‌ ఆర్టికల్‌-332: శాసనసభల్లో ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్‌ ఆర్టికల్‌-338: ఎస్సీ,ఎస్టీల రాజ్యాంగ రక్షణల అమలుతీరును, వారి సంక్షేమాన్ని సమీక్షించేందుకుగాను ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు్ఆర్టికల్‌-341: 1950లో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల గుర్తింపు
    షెడ్యూల్డ్‌ కులాలకు విద్య,ఉపాధిపరంగా రిజర్వేషన్లను కల్పించటం,వారి విద్యా భివృద్ధికి ఉపకారవేతనాలు,హాస్టల్‌ వసతులు,పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను అందిస్తున్నారు.
    ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో ఆరో పంచవర్ష ప్రణాళికలో స్పెషల్‌ కంటెంట్‌ ప్లాన్‌ను ప్రారంభించారు. చిన్న,సన్నకారు దళిత రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆదాయ మార్గాలను పెంచుతారు.
    ఎస్సీలకు ఆర్థిక సహాయాన్ని అందించి వారు స్వయం ఉపాధిమార్గాలను ఎంచుకొనే ఉద్దేశంతో 1989లో జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
    ప్రస్తుతం ఎస్సీలకు సంబంధించిన పరిపాలన,యంత్రాంగం సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్నది.
    స్వాతంత్య్రానంతరం భారతదేశంలో సంక్షేమ కార్యక్రమా లు 1952 నుంచి 1985 వరకు హోంశాఖ ఆధ్వర్యంలో కొనసాగాయి.
    1985లో సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
    1998లో దాని పేరును సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖగా మార్చారు.
    గిరిజన సంక్షేమం
    దేశంలో ఎస్టీలు ఆర్థికంగా దోపిడీకి గురైన వర్గం. అందువల్ల వీరి సంక్షేమంలో ఆర్థికప రమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. 2011జనాభా లెక్కల ప్రకారం ఎస్టీల జనాభా 8.6 శాతం.
    -దేశంలో అధికారికంగా 744 తెగలను గుర్తించారు. వీటిలో భిల్లులు,గోండ్‌, సంతాల్‌ తెగలకు చెందినవారు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు. దేశంలో ఎస్టీల సంక్షేమానికి మూడు మార్గాలను అవలం బిస్తున్నారు.
  4. రాజ్యాంగ రక్షణలు
  5. విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు
  6. ఆర్థిక సహాయం అందించడం
    । ఎస్సీల సంక్షేమానికి సంబంధించిరాజ్యాంగ రక్షణలోని 17,341 ఆర్టికల్స్‌ తప్ప మిగ తావి ఎస్టీలకూ రక్షణగాఉంటాయి.
    । ఆర్టికల్‌-19(5): గిరిజనుల ఆస్తుల రక్షణ
    । ఆర్టికల్‌-164: జార్ఖండ్‌, ఒడిశా, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
    । ఆర్టికల్‌-244: ప్రత్యేక ప్రాంతాల పరి పాలన కోసం5,6 షెడ్యూళ్లను ఏర్పాటు చేశారు.
    । ఆరో షెడ్యూల్‌ ప్రకారం అసోం, మేఘాలయ,మిజోరం,త్రిపుర రాష్ట్రాల్లో గిరిజన పరిపాలన వ్యవస్థ ఏర్పాటుచేశారు. ఆరో షెడ్యూల్‌లోని రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలను ఐదో షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
    । ఐదో షెడ్యూల్‌ పరిపాలనను గవర్నర్‌ నియంత్రణలో ఉంచుతుంది.
    । ఆర్టికల్‌-342: షెడ్యూల్డ్‌ తెగలను అధికారికంగా గుర్తించారు.
    । 1999లో కేంద్రంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు.
    । ఐదో ప్రణాళికలో గిరిజన ఉప ప్రణాళికను రూపొందించారు.
    । గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాల పరిపాలన,అభివృద్ధికి నాలుగు మార్గాలను ఎంచుకున్నారు.
    । నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న మొత్తం జనాభాలో గిరిజన జనాభా 50శాతం. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 194.
    । 10 వేలు లేదా అంతకంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో మాడా ప్రాజెక్టులనుఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 259.
    । 5 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో గిరిజన జనాభా 50శాతంపైబడి ఉన్న ప్రాంతాల్లో క్లస్టర్లను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య-82
    । గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన తెగలను గుర్తించి వాటిని అభివృద్ధి చెందించే ఉద్దేశంతో ప్రాచీన గిరిజన సముదాయ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 75.
    । గిరిజనులకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ ఉన్నందువల్ల వాటిస్థానంలో స్థానిక ప్రభు త్వాలను ఏర్పాటుచేసే ఉద్దే శంతో 1996లో పెసా (ూaఅషష్ట్రa వa్‌ష్ట్రఱ జుఞ్‌వఅంఱశీఅ ూషష్ట్రవసబశ్రీవస Aష్‌)ను రూపొందించారు.
    । గిరిజనుల అటవీ ఉత్పత్తులకు సరైన ధర, మార్కెటింగ్‌ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 1987లో గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్యను ఏర్పాటుచేశారు.
    । ఎస్టీలకు ఆర్థిక సహాయాన్ని అందించి స్వయం ఉపాధి ద్వారా వారి ఆదాయమార్గాలను పెంచే లక్ష్యంతో 2001లో జాతీయ షెడ్యూల్డ్‌ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
    వెనుకబడిన తరగతుల సంక్షేమం
    । భారతీయ సామాజిక నిర్మాణంలో అగ్ర వర్ణాలకు, అస్పృశ్యులకు మధ్యస్థంగా ఉన్న మధ్య తరగతి వర్గాలను వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తారు.
    । ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలు కూడా ప్రాచీన కాలం నుంచి సామాజికంగా, ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు.
    । భారత రాజ్యాంగ రూపకల్పన దశలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని వీరికోసం ప్రత్యేకంగా రాజ్యాంగ నిబంధనలను రూపొందించారు.
    । రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340లో వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన చర్యలను
    । సమీక్షించేందుకుగాను రాష్ట్రపతి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది.
    । దీని ప్రకారం జాతీయస్థాయిలో రెండు కమిషన్లను ఏర్పాటుచేశారు.
    । 1.1953లో కాకా సాహెబ్‌ కాలేల్కర్‌ కమిషన్‌
    । 2.1978లో బీపీ మండల్‌ కమిషన్‌
    । కాలేల్కర్‌ కమిషన్‌: ఇది 1953 జనవరిలో ఏర్పాటయ్యింది.
    । కమిషన్‌ ప్రధాన విధి ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర వర్గాలకు చెందిన ప్రజల విద్యాపరమైన, సామాజికపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రమాణాలను నిర్ణయించడం.
    । వీటి ఆధారంగా వెనుకబడిన తరగతుల జాబితాను గుర్తించడం
    । ఈ కమిషన్‌ సామాజిక అంతస్తు, కుల క్రమశ్రేణి ఆధారంగా 2700 కులాలతో కూడిన జాబితాను తయారుచేసి 1955లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
    । ఈ కమిషన్‌ మహిళలను కూడా బీసీలుగా గుర్తించింది.
    । ఈ కమిషన్‌ తన నివేదికను 1956లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే వివిధ కారణాల వల్ల ఇది ఆమోదం పొందలేదు. -జిఎన్‌వి సతీష్‌

రిజర్వేషన్ల విధానంలో కొత్త పోకడలు

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిధిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మునుపున్న షెడ్యూల్ద్‌ కులాల (ఎస్‌.సి.), షెడ్యూల్డు తరగతుల (ఎస్‌.టి.) జాబితాలో కొత్త వర్గాలను చేరు స్తున్నాయి. ఇలా విస్తరించడానికి ఆర్థిక వెనుకబాటు తనాన్ని కారణంగా చూపుతున్నాయి. ఆర్థిక వెనుక బాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేటట్టయితే అంతకనా వెనుకబడి ఉన్న సామాజిక వర్గాలను విస్మరించినట్టు అవుతుంది. లేవనెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే 10 శాతం, 13 శాతం కులాలకు ఎందుకు పరిమితం చేయాలి. ఈ సూత్రం ద్వారా ప్రభుత్వాలు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల ప్రాతిపదికగా రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తాయి. కొత్త రిజర్వేషన్ల విధానంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఇలాంటి రాజకీయాలవల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మైనారిటీలు ఓటర్లుగా అంత ఆకర్షణీ యంగా కనిపించక పోవచ్చు.
కొత్త రిజర్వేషన్ల విధానంతో మరో సమస్య కూడా ఉంది.ఈ పద్ధతి రాజ్యాంగ నిర్మా తల దృష్టిలో ఉన్న ‘‘పురోగమన’’ అంశాన్ని గమ నంలో ఉంచుకోదు. షెడ్యూల్డ్‌ జాబితాలో ఉన్న వారికి అవకాశాలు కలిగించడంలో ఉన్న ఇబ్బం దిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విధానాన్ని రూపొందించారు. ఈ కార ణంవల్లే మన దేశంలో అమెరికాలోఉన్న సాను కూల చర్య పద్ధతి కాకుండా రిజర్వేషన్‌ పద్ధతి అనుసరించారు.ఇది మొదట్లో అవకాశాలు కల్పిం చడానికి ఉద్దేశించింది. దీనివల్ల ఫలితం ఉండా లనుకున్నారు. సానుకూల చర్యవల్ల నిర్దిష్ట ఫలితం ఉంటుందన్న నమ్మకం లేదు.కొత్త రిజర్వేషన్ల విధా నంవల్ల సామాజికంగా వెనుకబడిన కులాల వారికి ప్రాతినిధ్యం అన్న సూత్రం మరుగున పడవచ్చు. ఎంపిక చేసే వారు, పోటీ పడే వారు ఒక సామాజిక నేపథ్యానికి చెందినవారు కావచ్చు. అలాంటప్పుడు ఎంపిక చేసే వారు నియామకాలు చేసేటప్పుడు మరింత నైరూప్య ప్రమాణాలను పాటిస్తారా? లేదా అగ్రవర్ణాలలో ఉప కులాలను దృష్టిలో ఉంచు కుంటారా? కొత్త విధానంవల్ల అయినా, మునుపటి విధానంవల్ల అయినా లబ్ధి పొందే వారు ప్రభుత్వ రంగానికే పరిమితం అవుతారు. అందువల్ల ప్రై వేటు రంగంలో అవకాశం ఉండదు. ప్రైవేటు రంగం రిజర్వేషన్ల పరిధికి దూరంగానే ఉండిపో తుంది.అందువల్ల రిజర్వేషన్లు వర్తించే వారు ప్రభు త్వ ఉద్యోగాల మీదే ఆధారపడాలి. అయితే నిర్దిష్ట కులం దృష్టితో చూసినప్పుడు సిద్ధాంత రీత్యా కోటా విధానాన్ని విస్తరించినందువల్ల ఫలితం ఉండ వచ్చు. అగ్ర కులాల వారికి, దళితులు కాని వారికి, వెనుకబడిన తరగతులకు చెందని వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. ఈ పద్ధతివల్ల అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కొందరిని వదిలివేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్న అవకాశాలను పోటీ తత్వంతో రిజర్వేషన్ల ద్వారా అందుకోవాలంటే ఎస్‌.సి.,ఎస్‌.టి.ల విష యంలో జరిగినట్టు అంతర్గతతేడాలకు దారి తీస్తుం ది.దీనివల్ల కులచైతన్యాన్ని వదిలి వ్యక్తులుగా నిల బడే వీలుంటుందని వాదించే వారూ ఉంటారు. వ్యక్తులుగా నిలబడితే కులం ప్రాతిపదికగా కాకుం డా సత్తా ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుం దనే వారూ ఉన్నారు. కుల చైతన్యం నుంచి బయ టపడి కులప్రాతిపదిక మీదఉన్న సామాజిక నైతిక తను అంతం చేసే వీలుంటుంది. అంటే వ్యక్తులు ఆధునిక విధానాల ఆధారంగా పోటీ పడతారు.ఇది అమాతం జరిగిపోదు. ఆధునికత విసిరే సవాళ్లను ఎదుర్కోలేనప్పుడు కులం మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు. మరో వేపున న్యాయాన్ని విస్తరించడం అంటే రిజర్వేషన్ల వల్ల లభ్ది పొందుతున్నారనే మచ్చ రూపు మాపే అవకాశం కూడా ఉంటుంది. అలాం టప్పుడు సామాజిక న్యాయం,దళితులు అన్న మాట లను ఒకసారి ఒకఅర్థంలో మరోసారి మరో అర్థం లో వాడతాయి. కొత్త కోటా విధానం వచ్చే లోపల రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు సామాజిక న్యాయం అన్న పదానికి పెడార్థం తీస్తారు.ఈపదాన్ని దళి తులను ఉద్దేశించి వాడే అలవాటు ఉంది. కొత్త కోటా విధానం సామాజిక న్యాయాన్ని సమానత్వ దృష్టితో చూడడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే సామాజిక న్యాయం అన్న భావన సర్వజనామోదం పొందుతుంది. దళితులు, ఆదివాసుల విషయంలో లాగా సామాజిక న్యాయాన్ని చులకన భావంతో చూసే వీలుండదు. సమానత్వం అన్న భావన బల హీనంగా ఉన్న సామాజిక సంబంధాలను పటి ష్ఠంచేస్తాయి.
ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన 103వరాజ్యాంగ సవ రణచట్ట బద్ధమేనని అయిదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ ముగ్గురు, వ్యతిరేకిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు విభజన తీర్పు చెప్పడంతో చర్చనీ యాంశమైంది. రిజర్వేషన్ల నిర్ణయానికి ఆర్థిక కొల బద్దను వినియోగించడం న్యాయ సమ్మతమేనన్న విషయంలో న్యాయమూర్తులందరూ ఏకీభావం వ్యక్తంజేశారు. కానీ ఇద్దరు న్యాయమూర్తులు ఇతర అంశాల ప్రాతిపదికన రాజ్యాంగ సవరణ న్యాయ బద్ధతను తిరస్కరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక వివాదాన్ని పరిష్కరిస్తూ మరికొన్ని వివాదాలకు తెర లేపుతున్నదని తనఆందోళనను వ్యక్తంజేస్తూనే ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పు ను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆహ్వా నించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కొంత శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ విషయా లలో ఇవ్వాలని సిపిఐ(ఎం)చాలాకాలం నుండి చెప్తున్నది. బీహార్‌లో కర్పూరీ ఠాకూర్‌ ప్రభుత్వం 1978లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 6శా తం రిజర్వేషన్లు కల్పించినపుడు సిపిఐ(ఎం) సమ ర్ధించింది. అదే వైఖరికి అనుగుణంగా పార్లమెం టులో 103వ రాజ్యాంగ సవరణను సమర్ధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పును కూడా ఆహ్వానించింది.సిపిఐ(ఎం) మూడు అంశాల ప్రాతి పదికగా ఇ.డబ్య్లు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తున్నది. మొదటిది, సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణిం చాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావి తం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్‌ యాక్షన్‌ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజ మైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలావిస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది. రెండ వది,రిజర్వేషన్ల పరిధిలోకిరాని తరగతులలో అత్య ధికులు ఆర్థికంగా వెనకబడినవారున్నారు. పెట్టు బడిదారీ విధానం దేశంలో విస్తరించేకొలదీ వీరి సంఖ్య పెరుగుతున్నది. వారి పరిస్థితి దుర్భరం అవుతున్నది. ఈ తరగతులలోని యువకులకు విద్యా ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. తమ దుస్థితికి ఇతరులకు రిజర్వేషన్లు ఉండడం, లేక తమకు లేకపోవడమేనన్న అపోహలకు గురవు తున్నారు.పాలకవర్గాలు,వారి మీడియా ఈ అపోహ లను పెంచు తున్నాయి. పర్యవసానంగా రిజర్వేషన్‌ వ్యతిరేక భావనలురోజురోజుకీ తీవ్రమవుతు న్నాయి. ఈ మానసిక స్థితి రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాల ద్వారా గతంలో వెల్లడవడం చూశాము. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు పూనుకున్నపుడు, రిజర్వేషన్లు లేని తరగతుల లోని పేద, మధ్య తరగతి ప్రజలను రెచ్చగొట్టి పాలకవర్గాలు రిజర్వే షన్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ఉసిగొల్పాయి. రిజర్వేష న్లను తొలగించాలనే స్వార్థపర శక్తులకు (వెస్టెడ్‌ ఇంటరెస్ట్స్‌కు) అవకాశం లేకుండా ఆర్థికంగా వెనక బడిన తరగతులలో రిజర్వేషన్‌ విధానానికి సాను కూలత సాధించాలంటే వారికి కూడా కొంత రిజ ర్వేషన్‌ కల్పించడం అవసరం. లేనియెడల రిజర్వే షన్లకే ప్రమాదం వస్తుంది. మూడవది, సమసమాజ సాధనలో పీడిత వర్గాల ఐక్యత కు ఎంతో ప్రాధా న్యత ఉంది. కార్మికులు, ఉద్యోగుల్లో రిజర్వే షన్‌ అంశం విభేదాలను, విభజనను సృష్టిస్తున్న సంద ర్భంలో దాన్ని అధిగమించి వర్గ ఐక్యతను సాధించా లంటే ప్రస్తుత రిజర్వేషన్‌ పరిధిలోకి రాని తరగతు లకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా సామాజిక విభజన వలన ఏర్పడే అనైక్యత ను కొంతవరకు నిరోధించే అవకాశం ఉంది. విధానపరమైన అంశంతోపాటు, రిజర్వేషన్ల పట్ల సానుకూల వాతావరణం ఏర్పర్చడానికి, వర్గ ఐక్య తను బలపర్చుకోవడానికి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లను కల్పించడం అవ సరం అన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. కొంత మంది రిజర్వేషన్లకు ఆర్థిక కొలబద్దను ప్రాతిపది కగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాం గంలో సామాజిక విద్యా విషయక వెనకబాటు తనాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ఉంది తప్ప ఆర్థిక వెనకబాటుతనం గురించి ప్రస్తా వన లేదని, అందువలన ఇ.డబ్ల్యు.ఎస్‌కు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని వాదిస్తున్నారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక న్యాయాన్ని అందించడం కూడా రాజ్యాంగ లక్ష్యమని, అందులో భాగంగా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజ ర్వేషన్లు ఇవ్వడం న్యాయమేనని కోర్టు అభిప్రా యపడిరది.ఇ.డబ్ల్యు.ఎస్‌తరగతులను ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయవచ్చు గదా, రిజర్వేషన్ల అవసరమేమిటని ఇంకో వాదన ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక తరగతులకు కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు జమిలిగా అమలవుతున్నాయి. అలా అయినపుడు సామాజిక తరగతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఇ.డబ్లు.ఎస్‌ తరగతులకు రిజర్వేషన్లు అమలుజేయడాన్ని వ్యతిరేకించడంలో ఔచిత్యం కన్పించదు. రిజర్వేషన్లనేవి సామాజిక అంశానికి వర్తిస్తాయి తప్ప ఆర్థికఅంశానికి విస్తరించడం అంటే రిజర్వేషన్‌ స్వభావానికే విరుద్ధం అనే వాదన కూడా ఉంది. ఇతర దేశాల అనుభవాలు, మన దేశంలో రిజర్వేషన్లు పరిణామం చెందిన తీరు చూస్తే ఈ వాదన నిలబడదు. రిజర్వేషన్లు ఆయా దేశాల పరిస్థితులను బట్టి,అవసరాలను బట్టి అమల య్యాయి. మలేషియాలో మెజారిటీ మలే జాతి ఆర్థిక వెనకబాటుతనం రిజర్వేషన్‌కు ప్రాతిపదికగా ఉంది. అమెరికాలో మూలవాసి అమెరికన్ల కోసం కొన్ని ప్రాంతాలను రిజర్వేషన్లుగా ప్రకటించారు. ఇక్కడ ప్రదేశం రిజర్వేషన్‌గా ఉంది.విద్యా ఉద్యో గాలలో మన లాగా కోటా పద్ధతి కాకుండా, న్యాయ వ్యవస్థ ద్వారా అమలు సాధ్యంగాని నిర్ణీత లక్ష్యాల ద్వారా వైవిధ్యాన్ని సాధించే పద్ధతులలో అఫర్మేటివ్‌ యాక్షన్‌ అమలవుతున్నది. ఐర్లండ్‌ రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక ఉన్నది.
మన దేశంలో రిజర్వేషన్‌ విధానం పరి ణామం చూసినా, సామాజిక అంశంతోపాటు అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకు న్నట్టు విదితమవుతుంది. బ్రిటిష్‌ వలస పాలకులు తమ విభజించు పాలించు విధానంలో భాగంగా 1909లో మత ప్రాతిపదికగా ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు.బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల ప్రభావంతో కొన్ని సంస్థానాలలో 20వ శతాబ్దం ప్రారంభంలో(ట్రావన్‌కోర్‌,బరోడా వగైరా) బ్రాహ్మణేతరులకు ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత రిజర్వేషన్లు కల్పించారు.1921లో మద్రాస్‌ ప్రెసి డెన్సీలో జస్టిస్‌ పార్టీ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు అమలుచేసింది.ఈరిజర్వేషన్లు ప్రధానంగా జమీం దార్లు,భూస్వాములు బలంగాఉన్న శూద్రకులాలకు ఉద్దేశించబడ్డాయి.అస్పృస్యతకు గురవుతున్న షెడ్యూ ల్డ్‌ కులాలకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిర్విరామ ఆందోళన,కృషి ఫలితంగా మొదటి సారి గా1935లో ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చా యి.స్వాతంత్య్రం వచ్చిన తర్వాతగానీ షెడ్యూ ల్డ్‌ తెగలకు రిజర్వేషన్లు కల్పించబడలేదు. షెడ్యూల్డ్‌ తెగలలో కుల వ్యవస్థ, అస్పృశ్యత లేకపోయినా సాంస్కృతిక, విద్య, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడ్డాయి.అప్పుడు కూడా వెనక బడిన కులాల అభివృద్ధి విషయం రాష్ట్రాలకు వదిలి వేయబడిరది.వర్ణ వ్యవస్థ లోని సామాజిక అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కులాలన్నీ రిజర్వే షన్లకు అర్హులు. ఈ అంశాన్నిబట్టే అనేక ఆధిపత్య శూద్రకులాలు బి.సిజాబితాలో చేర్చబడి రిజర్వే షన్లు అనుభవిస్తున్నాయి. ఇంకాఅనేక కులాలు అటు వంటి డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నాయి. కానీ వర్ణ వ్యవస్థలో సామాజికంగా అగ్రవర్ణాల కన్నా దిగువస్థాయిగా పరిగణించబడే శూద్ర కులా లన్నీ ఒకే మోస్తరుగా వెనకబడిలేవు.వాటిల్లో కొన్ని గ్రామీ ణ సమాజంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. స్వాతం త్య్రానంతరం ఈ కులాల్లో ధనాఢ్య వర్గాలు అభివృ ద్ధి అయ్యాయి. ఈ తరగతులలోని నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్‌ ప్రయోజనం అందాలంటే ఆర్థిక కొలబద్దను వినియోగించడం తప్ప మార్గం లేదు. అందుకే బిసి తరగతులకు క్రీమీలేయర్‌ను మినహాయిస్తూ ఆర్థిక పరిమితి విధించబడిరది.
సామాజిక అంశాన్ని రిజర్వేషన్లకు ఏకైక కొలబద్దగా ఉంచాలనేవారు సామాజిక వెనకబాటు తనం అన్ని కులాలకు, తరగతులకు ఏకరూపంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. సామా జిక పీడన అసలైన రూపం అస్పృశ్యత, అంటరాని తనం. ఇది దళితులకు మిగతా అందరికీ మధ్య ఉన్న సామాజిక అగాధం.దళితులు ఎదుర్కొం టున్న సామాజిక దుస్థితికి, ఇతరులు ఎదుర్కొనే సామాజిక వెనకబాటుతనానికి పోలిక లేదు. అలాగే సేవాకులాలకు మిగిలిన శూద్రకులాలకు, ముఖ్యం గా వ్యవసాయ కులాలకు మధ్య ఉండే సామాజిక వ్యత్యాసం అనేక రూపాలలో కొట్టొచ్చినట్లు కనపడు తుంది. చాలా సందర్భాలలో శూద్ర కులాలలోని ఆధిపత్య కులాలు సామాజిక వివక్ష పాటింపులో ముందుంటున్న స్థితిచూస్తున్నాం.అగ్రకులాల్లో సైతం ఉపశాఖల మధ్య సామాజిక తారతమ్యాలు,హోదా వ్యత్యాసాలు ఉంటున్నాయి. అందుకే కుల వ్యవస్థను డాక్టర్‌ అంబేద్కర్‌ నిచ్చెన మెట్లతో పోల్చారు. వైవిధ్య రూపాలలో కొనసాగుతున్న సామాజిక వివక్షపై పోరాడాలంటే అందరికీ ఒకే కొలబద్దలు సరిపోవు. దేశంలో ప్రస్తుతం సామాజిక బృందాలపై ఆధార పడిన వర్టికల్‌ రిజర్వేషన్లతో పాటు, ఇతర అంశా లను పరిగణనలోకి తీసుకున్న సమాంతర రిజర్వే షన్లు కూడా అమలవుతున్నాయి.మహిళలు, విక లాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు, వెనకబడిన ప్రాంతాలు, స్థానికులు-స్థానికేతరులు వగైరా రిజర్వేషన్లుకూడా అమలవుతున్నాయి. రిజర్వే షన్ల వర్తింపునకు సామాజిక అంశంతో పాటు అనేక అంశాలను పరిగణిస్తున్నారన్నది గమనించ వచ్చు. అందుకే ఈ సమస్యపట్ల ఒక సమగ్ర దృక్పథం అవసరం.
ఇ.డబ్యూ.ఎస్‌.రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముం దుకు వచ్చిన మరికొన్ని వివాదాలను పరిశీలించాలి. ‘ఆర్థిక కొలబద్ద’సమంజసత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మెజారిటీతో ఏకీభవిస్తూనే,10 శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ 50శాతం పరి మితిని దాటుతున్నందున అది న్యాయబద్ధం కాదని ఇద్దరు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అభిప్రా యాన్ని తిరస్కరిస్తూ మెజారిటీ తీర్పు 50శాతం పరిమితి అనుల్లంఘనీయమైనదేమీ కాదని కొట్టి పారేసింది.ఈవ్యాఖ్యానం1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విధించిన పరిమితిని వివా దాస్పదం జేసింది.సిపిఐ(ఎం)తో పాటు అనేక ఇతర శక్తులు50శాతం సీలింగును తొలగించాలని, అప్పు డే రిజర్వేషన్లకు అర్హులైన ఇతర తరగ తులను ఆ పరిధిలోకి తీసుకురావచ్చని వాదిస్తూ వస్తున్నాయి. తీర్పు ఈ వాదనలను బలపరుస్తున్నది. మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలయినప్పుడు ఓబిసి రిజర్వేషన్లు 27శాతంగా నిర్ణయించడానికి 50శాతం పరిమితి తప్ప వేరే కొలబద్దేమీ లేదు. ఇప్పుడు 50శాతం పరిమితి అనుల్లంఘనీయం కానప్పుడు ఓబిసిలకు, ఎస్‌సి, ఎస్‌టిల వలే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అవస రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓబిసి జనాభా నిష్పత్తిని నిర్ణయించేందుకు సరైన లెక్కలు ప్రస్తుతం లేవు. ఉజ్జాయింపుగా లెక్క వేయ డానికి బ్రిటిష్‌వారు నిర్వహించిన 1931సెన్సస్‌ వివరాలను వినియోగించుకుంటున్నారు.ఈ సమా చార లేమిని సరిజేసేందుకు అందరూ కోరుతు న్నట్లుగా జనగణన సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టితో పాటు అన్ని కులాల గణన చేయడం అవసరం. అప్పుడే కొన్ని వివాదాలు సక్రమంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం ఈవిషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ధర్మాసనం10శాతం ఇ. డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను వర్తింపజేసిన తీరు కూడా వివాదాస్పదం అయింది. ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ ఇప్పటివరకు రిజర్వేషన్‌ అనుభవించని తరగతులకు (నాన్‌ రిజర్వుడ్‌ కేటగిరీకి) మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. అంటే ఈ పది శాతానికి ఎస్‌సి,ఎస్‌టి,బిసిలోని పేదలను అనర్హులను చేయడం ద్వారా ఇంతకుముందు ఉన్న50శాతంలో పోటీపడే అవకాశాన్ని 40 శాతానికి కుదించినట్లయింది. 10శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను జనరల్‌ కేటగిరీగా భావించి దానికి అన్ని తరగతులలోని పేదలను అర్హులుగా చేయడంద్వారా లోపాన్ని సరి దిద్దాల్సి ఉంది. లేనియెడల ఎస్‌సి,ఎస్‌టి,బిసి పేదలు గతంలోఉన్న సౌకర్యాన్నికోల్పోతారు. అంతే కాక ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లు10శాతం ఉండాలని ఏకొలబద్ద ప్రకారం నిర్ణయించారన్న విమర్శకు తావు లేకుండా పోతుంది.ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వే షన్లకు అర్హత నిర్ణయించేందుకు ప్రభుత్వం ప్రతి పాదించిన ఆర్థిక పరిమితి, మంచి చెడుల జోలికి సుప్రీంకోర్టు పోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన 8 లక్షల రూపాయల ఆదాయం, ఐదెకరాల భూమి, వెయ్యి అడుగుల ఇల్లు, వంద గజాల స్థలం పరిమితి సంపన్నులను కూడా రిజర్వేషన్లకు అర్హులను చేస్తున్నది. నిరుపేదలు మాత్రమే అర్హులయ్యే పద్ధతి లో ఆర్థిక పరిమితిని తిరిగి నిర్ణయించకపోతే ఇ. డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్ల లక్ష్యం పూర్తిగా దెబ్బతిం టుంది.ఈ వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్క రించి అమలు చేయకపోతే వివాదాలు అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి జస్టిస్‌ దారువాలా రిజర్వేషన్ల విధా నాన్ని సమీక్షించాలన్న అభిప్రాయాన్ని వెల్లడిరచారు. ఇటువంటి వాదన కోర్టు బయట అనేకమంది వివిధ సందర్భాలలో గతంనుండి వ్యక్తంచేస్తున్నారు. ఆర్‌ఎ స్‌ఎస్‌ అధినేత గతంలో బహిరంగంగానే ఈ అం శాన్ని ప్రస్తావించారు. క్రమేణా కొన్ని తరగతులలో, మీడియాలో రిజర్వేషన్‌ వ్యతిరేక ధోరణి ప్రబలు తుందనడానికి ఇదొక నిదర్శనం. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాలలో ప్రభుత్వ రంగం విస్తరించి,పాలనా వ్యవస్థ పెరిగింది. దీని మూలంగా రిజర్వేషన్ల వలన విద్యా, వైద్య, ప్రజా ప్రాతినిధ్య రంగాలలోకి కొన్ని కుటుంబాలు అభి వృద్ధి కావడానికి తోడ్పడిరది. కానీ అత్యధికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నాలుగు దశాబ్దా లలో వచ్చిన విధాన మార్పులతో ఉన్న పరిమిత రిజర్వేషన్‌ సౌకర్యం కూడా నిరుపయోగం అవు తున్నది. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, యాంత్రీ కరణ మూలంగా విద్య, వైద్యం, ఉపాధి రంగా లలో రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడంలేదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి పాలక వర్గాలు,కార్పొరేట్లు సుముఖంగా లేవు. ఇటు వంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు,వాటిని విస్తరించి పటిష్టం గా అమలుచేయడం అవసరం. మన దేశంలో రిజర్వేషన్‌ అవసరం తీరిపోయిందని అనుకోవడం తప్పు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం రిజర్వేషన్‌ అవసరం తీరిపోదు. ఈ పరిమిత సదు పాయాన్ని కొనసాగిస్తూనే రిజర్వేషన్లు అవసరం లేని సమసమాజ స్థాపనకు సాగిపోవాలి.వ్యాసకర్త : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు,(ప్రజాశక్తి సౌజన్యంతో..)

విశాఖలో ప్రాణాలు తీస్తున్న ఫార్మా కంపెనీలు

విశాఖ ఫార్మా పరిశ్రమలు ప్రజల పాలిట శాపంగామారుతున్నాయి. వరస ప్రమా దాలు జరగడం, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ఏటా లాభాల లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు… ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల సంఖ్య పెరిగి పోతున్నా సరే ఖాతరు చేయడం లేదు. యాజ మాన్యాలు భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా, అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపోతోంది. యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగి నప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌ 19న జరిగిన అగ్ని ప్రమా దంలో నలుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది. 2022 జనవరి నుంచి డిసెంబర్‌ ఏడాదిలోనే పది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు పదిమంది వరకు మృత్యువాత పడగా అనేక మంది గాయాలకు గురై దివ్యాంగులగా మారారు.-– గునపర్తి సైమన్‌
విశాఖ జిల్లాలో ఫార్మాకంపెనీల్లో తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి.కార్మికుల భద్ర త,రక్షణపై పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రాణాధార మందులు తయారుచేసే ఫార్మా పరిశ్రమలు అక్కడ పనిచేసే ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను తోడేసే మృత్యుకుహరాలుగా మారడం దారుణం. యాజమాన్యాల తప్పి దాలు,డెవలపర్‌గా ఉన్న సంస్థ నిర్లక్ష్యం, తనిఖీ లు నిర్వ హించి ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన పలు విభాగాల అధికార యంత్రాంగం వైఫ ల్యం…వెరసి విలువైన ప్రాణాలను బలిగొంటు న్నాయి. అనకా పల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లారస్‌ ల్యాబ్స్‌లో తాజా ప్రమాదం నలుగురిని బలిగొనడం,మరొ కరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే…మృతుల కుటుం బాలకు,క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లిం చడం,గంభీర ఉపన్యాసాలు చెప్పి చేతులు దులు పుకోవడం ఆయా కంపెనీల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు,పాలకులకు పరిపాటిగా మారిపోయింది.ఈఏడాదిలోనే ఈఫార్మా సిటీ లో పది ప్రమాదాలు జరిగాయంటేనే నిర్లక్ష్యం ఏ మేరకు మేటలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో మూడు వేల ఎకరాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్దపెద్ద కొలి మిలతో పనిచేసే పరిశ్రమలకు కూడా…సొం తంగా ఒక్క అగ్ని మాపక వాహనం కూడా లేదంటే భద్రతపై వాటి నిర్లక్ష్యాన్ని అర్థం చేసు కోవచ్చు. పరిశ్రమల్లో భారీ ప్రమాదాలను గుర్తు చేసుకుంటేనే మానవ ప్రాణాలపట్ల ఎంత నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారో,పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కళ్లకు కడుతుంది. రెండేళ్ల క్రితం ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విషవా యువులు లీకై పరిసర ప్రాంతాలకు చెందిన 12 మంది మరణించగా, వందలాదిమంది ఆసుపత్రి పాలైన ఘటనను తలచుకుంటేనే కలవరం కలుగు తుంది. పరవాడ ఫార్మాసిటీ లోనే అజిక బయో ఫోర్‌లో ఐదేళ్ల క్రితం నాటి ప్రమాదంలో ఐదుగు రు,సాయినార్‌ ఫార్మాలో గత ఏడాది మరో ఘటన లో ముగ్గురు బలయ్యారు. సీడ్స్‌ దుస్తుల పరిశ్రమలో విషవాయువులు లీకై 200మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ పరవాడ ఫార్మాసిటీ లోని ఔషధ పరిశ్రమల్లో జరిగిన 70 ప్రమాదాల్లో49మంది ప్రాణాలు కోల్పోగా, 93 మంది క్షతగాత్రులయ్యారు.ఈ పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం ఈ ప్రమాదాల పట్ల, లీకవుతున్న విషవాయువులు,వ్యర్థజలాలపట్ల ఆందోళన చెందు తున్నారు.ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది,ఉద్యోగులు సైతం విషవాయువులను పీల్చి అనేక జబ్బులకు గురవుతున్నారు. పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా తనిఖీలు చేప ట్టాల్సి ఉంది.ఎప్పటికప్పుడు నివేదికలను రూపొం దించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్ట్లాలి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం మినహాయిస్తే… ప్రమాద కారణాలపై నివేదికలను విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట ప్రభుత్వ శాఖల నుండి జరగవలసిన తనిఖీలు దాదాపు నిలిపివేశారు. దాంతో కంపెనీల ఇష్టారాజ్యంగా ఉంది. ఫార్మా పరిశ్రమల్లో వినియోగించే హానికరమైన రసాయ నాలపై ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి అవగా హన కల్పించడం, రక్షణ పరికరాలు సమకూర్చడం తదితర చర్యలన్నింటినీ పరిశ్రమలు గాలికొదిలే శాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనా లను శుద్ధిచేయడం,పర్యావరణ పరిరక్షణకు, వాతా వరణంలో విషవాయువుల మోతాదును తగ్గించ డానికి గ్రీన్‌ బెల్ట్‌ను ఏర్పాటు చేయడం, రహదారు లను నిర్మించడం…లాంటి చర్యలను డెవలపర్‌గా ఉన్న సంస్థ చేపట్టాలి. పరిశ్రమల నుంచి విడుదల వుతున్న వ్యర్థ రసాయనాలను కొంతమేర శుద్ధి చేయకుండానే సమీపంలోని చెరువుల్లోకి, సముద్రం లోకి విడిచిపెట్టడం వల్ల భూగర్భజలాలు విషతు ల్యమవుతున్నాయని,అర్ధరాత్రి సమయంలో విష వాయువులను విడిచిపెడుతున్నారని ఆరోపణ లొస్తున్నాయి. ఇప్పటికైనా…ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను కాపాడటం…పరిసరప్రాంతాల వారికి సైతం కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిం చేందుకు అవసరమైన అన్ని చర్యలను పరిశ్రమల యాజమాన్యాలు, సెజ్‌ డెవలపర్‌ సంస్థ చేపట్టాలి. చట్టబద్ధంగా, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసి పర్యవేక్షిం చాలి. కార్మికుల ప్రాణాలకు,ప్రజల జీవనానికి అవసరమైన పర్యావరణాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి.
భద్రతా లోపాలు..కార్మికులే సమిధలు
పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మి కుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా,అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపో తోంది.యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుం టున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌19నజరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది.గతంలో పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలోనైనా,హెటిరో ఫార్మా పరిశ్ర మలోనైనా కార్మికుల భద్రతపై యాజమాన్యాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు.నక్కపల్లి హెటిరో ఫార్మా కంపెనీలో మొన్నజరిగిన ప్రమాదంలో ఓ కార్మి కుడు మృతి చెందారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ డీఎం ఎస్‌వో ప్లాంట్‌లో ఇటీవల పేలుడు సంభవిం చింది.భారీగాశబ్ధం రావడంతో కార్మికు లు భయంతో పరుగుతు తీశారు.రియాక్టర్‌ పేలడం తోనే ప్రమాదం జరిగినట్టు కార్మికులు చెబుతు న్నారు.రియాక్టర్లు పేలకుండా ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వ్‌, రప్చర్‌ డిస్క్‌ నియంత్రిస్తాయి. ఈ రెండు సరిగా పనిచేయకపోవడంతోనే రియాక్టర్‌ పేలినట్టు పరి శ్రమలో సిబ్బంది చెబుతున్నారు.రియాక్టర్‌ పేలుడు తో విడుదలైన వాయువులు..కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణంగా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశమున్నచోట కార్మికు లకు రెస్పిరేటరీ మాస్క్‌లు ఇవ్వాలి. అయితే కార్మి కులకు రెస్పిరేటరీ మాస్కు లు హెటిరో యాజ మాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు విన్పిస్తు న్నాయి. పదేళ్ల కాలంలో హెటిరో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. 2013లో ఐదుగురు, 2015, 2016,2020లో,2022ఫిబ్రవరి23న ఒక్కొ క్కరు చొప్పున ప్రమా దాల్లో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్ర గాయాలపాలయ్యారు. పరిశ్ర మలో అన్ని ప్రమా దాలు జరుగుతున్నా…కార్మికుల భద్రత, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ప్రమా దాలకు సంబంధించి, భద్రతా ప్రమాణాల నిర్వహణపై 2020 జులై16 న అప్పటి కలెక్టర్‌ వినరు చంద్‌ నాలుగు బృందా లను నియమించారు.ఆ మేరకు కార్మికులకు కార్మి కుల భద్రత, ఫైర్‌ సేఫ్టీ, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అంశాలతో పాటు నింబంధనల అమలుతీరుపై నాలుగు నివేది కను ఇచ్చింది. అయితే పరిశ్ర మల్లో లోపాలను సరి చేసే దిశగా మాత్రం ప్రయ త్నాలు చేయక పోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు.హెటిరో ఫార్మాలో జరిగిన ప్రమాదంపై సమ గ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాలు, రాజకీ య పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.ప్రమాదంలో మృతి చెందిన అల్లాడ సాయిరాం కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం,వారి కుటుంబంలో ఒకరిఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలనిపట్టు బడుతున్నాయి. క్షతగ్రా తులకు మెరుగైన వైద్యం అందించాలని పట్టుబడు తున్నాయి. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం తోనే ప్రమాదాల్లో కార్మి కులు మృత్యువాతపడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు…ఆ తరువాత పట్టనట్టు వ్యవ హరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్య నిబంధనలు,భద్రతా ప్రమాణాలు పాటించక పోయినా పట్టించు కోవ డం లేదని మండిపడుతు న్నారు. ఉన్నతాధికారు లు జోక్యం చేసుకొని హెటిరోలో ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టా లని కోరుతున్నారు. ఫార్మా కంపెనీల్లో వరస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధి కారులు సమగ్ర విచారణ చేపడుతారా? లేక ఎప్పటిలాగే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హాడావడిచేసి ఊరుకుంటారా?అనేది వేచి చూడా ల్సిందే.
వెంటాడుతున్న ప్రమాదాలు
ా రెండేళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ అనే విషవాయువు లీకయి 12మంది మృతిచెందారు. వీరంతా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నవారే.
ా గతేడాది నక్కపల్లిలోని హెటిరో మందుల పరిశ్రమలోని పీఎంఎస్‌వో సాల్వెంట్‌ తయారీ యూనిట్‌ వద్ద రియాక్టర్‌ పేలి ఒకరు చనిపోగా,నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ా అచ్యుతాపురం సెజ్‌లోని కొన్ని ఫెర్రో పరి శ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఓ ఫెర్రో కంపెనీలో కొలిమి పేలి 13మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ా రాంబిల్లి పరిథిలోని ఏషియన్‌ రంగుల పరిశ్ర మలో ప్రమాదం జరిగి ఒకరు మరణించారు.
ా గతేడాది సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో వరుసగా రెండుసార్లు వాయువులు లీకై వందలాది మందిమంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
నిత్యం భయం!
అచ్యుతాపురం సెజ్‌లోని సుమారు 9,2 97ఎకరాల్లో ఫార్మా కంపెనీలకు మూడువేల ఎకరాల వరకు కేటాయించారు. పరవాడ ఫార్మాతో పోల్చుకుంటే సెజ్‌లో భూమిధర తక్కువగా కేటా యించడంతో ఎక్కువ ఫార్మా కంపెనీలు ఏర్పాటవు తున్నాయి. పరవాడా ఫార్మాకంపెనీలతో పోల్చితే సెజ్‌ల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా యి. ఫార్మాసిటీ చుట్టూ తక్కువ జనాభా గ్రామాలు ఉండగా సెజ్‌ని అనుకొని రాష్ట్రంలోని అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ఉంది.ఈ ఒక్క గ్రామంలోనే 20వేల జనాభా నివాసం ఉంటు న్నారు. పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న అగ్నప్ర మాదాలు,రసాయనవ్యర్ధాల నిర్వహణలో లోపాలు, గ్యాస్‌ లీకేజీలు సమీప గ్రామస్థులను భయపెడు తున్నాయి.అచ్యుతాపురం సెజ్‌లో పెద్దపెద్ద కొలిమి లతో కూడిన ఫెర్రో పరిశ్రమలున్నాయి. వాటికి సొంతంగా ఒక్కఅగ్నిమాపక వాహనం కూడా లేకపోవడం గమనార్హం. సెజ్‌లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా ఏపీఐఐసీ వాహనమే దిక్కువు తోంది. సెజ్‌లోని యూనిఫార్ట్స్‌ కంపెనీలో కూడా గతంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ఒక్క ఏడాదిలో పది ప్రమాదాలు
2022 జనవరి నుంచి ఇప్పటి వరకూ పరవాడ ఫార్మాసిటీలో 10ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా డిసెంబర్‌ 19న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఫిబ్రవరి 7న అక్టోనస్‌ ఫార్మాలో రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగింది.ఈనెల 17న ఎమ్మె న్నార్‌ ఫార్మాలో,ఏప్రిల్‌ 23న ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫార్మాలో,మే 7న ఎస్‌ఈజెడ్‌ అలివిర ఫార్మాసంస్థలో,మే 25న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో,జూన్‌ 13న గ్లాండ్‌ ఫార్మాలో,జూలై 28నసాయిశ్రేయాష్‌ పార్మా కం పెనీలో,ఆగస్టు 22న ఆప్టిమస్‌ ఫార్మాసంస్థలో అగ్ని ప్రమాదాలతోపాటు గ్యాస్‌ లీకేజీలు జరిగా యి. సెప్టెంబరు 10న కోరి ఆర్గానిక్స్‌ రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగిగోడలు కూలిపోయాయి. ఈ ప్రమా దాల్లో ఆస్తినష్టం తప్ప ఎవరికీ ఏమీ కాక పోవడం తో కంపెనీ యాజమాన్యాలు ఊపరి పీల్చు కున్నా యి. ఇప్పటికైనా కర్మాగారాల,అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి ఫార్మాసిటీలో భద్రతా ప్రమా ణాలు పక్కగా అమలయ్యేలా చర్యలు తీసు కోవాలని కార్మిక నాయకులు,ఉద్యోగులు కోరు తున్నారు.

1 2 3 7