ఆదివాసులకు తీరని ద్రోహం

టూరిజం అభివృద్ధి పేరుతో‘విజన్‌ 2047’లో భాగంగా 1/70 చట్ట సవరణకు రాష్ట్ర కుటమి ప్రభు త్వం రంగం సిద్ధం చేస్తున్నది.ఇటీవల జరిగిన టూరిజం ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లా డుతూ ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు,రెస్టారెంట్లు, పార్కులకు పెట్టు బడులు పెట్టాలంటే 1/70 చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం,అధికార యంత్రాంగం లోతైన అధ్య యనం చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయడమే. పైగా షెడ్యూల్‌ ఏరియా లో టూరిజం అభివృద్ధికి 1/70చట్టం అడ్డంగా ఉందని,చట్టం సవరించాలని కూడా అయ్యన్న పాత్రుడు పేర్కొనడం వ్యక్తిగత అభిప్రాయమో లేక కూటమి ప్రభుత్వ విధానమో స్పష్టం చేయడం అవసరం. 2000 సంవత్సరంలో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాడేరు ఏజెన్సీలోని చింతపల్లి జర్రేలలో ఉన్న 515 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిక్షేపాల తవ్వకాలకు దుబారు కంపెనీతో ఒప్పందం చేసుకుని గిరిజన సలహా మండలిలో 1/70 చట్టం సవరించడానికి పూనుకున్నారు. అప్పటి సిపిఎం భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య మాత్రమే 1/70 చట్టం రక్షణకు నికరంగా నిలబడ్డారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నిలబడి అధికారం వచ్చిన వెంటనే 2006లో ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి రూ.8000 కోట్లతో రాస్‌ ఆల్‌ ఖైమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివాసి గిరిజన సంఘం, వివిధ ఆదివాసీ సంఘాలు,సిపిఎం,వామపక్ష పార్టీల అండతో చేసిన సుమారు 20ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో బాక్సైట్‌ తవ్వకాల ఒప్పందాలు రద్దు చేయడమైనది.1/70 చట్టం అమలులో ఉండగానే అరకు,పాడేరు,చింతపల్లి,రంపచోడవరం, జీలుగు మిల్లి,పార్వతీపురం,మన్యం జిల్లాలో,ఇతర ప్రాంతా లలో బినామీ పేర్లతో లాడ్జీలు,షాపింగ్‌ కాంప్లెక్సు లు,రిసార్టుల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతు న్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లి,ఎర్రవరం, పెదకోట,మన్యం జిల్లా సాలూరు,అనకాపల్లి జిల్లా చింతలపూడి దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకాయవారిపాలెం దగ్గర ఆయుధ కర్మాగారం నిర్మాణానికి 1/70చట్టం ఉల్లంఘించి ఒప్పందం చేసుకుని వేల ఎకరాల భూములు,అడవులు ధారాదత్తం చేస్తున్నది.ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో 3000ఎకరాల పరిధిలోని అదాని ఆయుధ కర్మాగారం నిర్మాణానికి ఆదివాసీల హక్కులను ఉల్లంఘించి నిర్మాణం ముమ్మరం చేసింది.గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఆదివాసీల హక్కులను ధ్వంసం చేస్తున్నది. 1970లో ఆదివాసీల పోరాట ఫలితంగా ఆదివాసీ అభివృద్ధి కోసం 1/70చట్టాన్ని సాధించాం.నేడు పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం ఆ చట్టాన్ని సవరించేందుకు కుట్ర చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రాంత చట్టమైన 1/70లో కలుగచేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.షెడ్యూల్‌ ప్రాంతంలో చట్టాలు చెయ్యాలన్నా తొలగించా లన్నా రాష్ట్రపతికే అధికారం ఉన్నది.షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసభ అధికారాలు,కేంద్ర అటవీ పర్యావరణ చట్టాన్ని సవరించి షెడ్యూల్‌ ప్రాంతంలో విస్తృతమైన అధికారాలు ఉన్న పీసా చట్టం అధికారాలు, 2006 వామపక్షాలు ఒత్తిడితో తెచ్చిన ఆటవీ హక్కుల చట్ట అధికారాలు ఇటీవలి కేంద్ర బిజెపి ప్రభుత్వం తొలగించింది.ఆ అంశా లనే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. కేంద్ర బిజెపి, రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రాంతంలో ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను తొలగించేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
అరకు ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు జీవో నంబర్‌ 3చట్టబద్ధతకు హామీనిచ్చి ఏడు నెలలు గడిచినా అతీగతీ లేదు.ఎన్నికల హామీ ప్రకారం ఏజెన్సీ షెడ్యూల్‌ ఏరియాలో100శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక సాధనకు,ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలకు పోరాటం చేస్తున్న ఆదివాసీల సమస్యలను పరిష్కరించనే లేదు.పైగా ఆదివాసీ భూములకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదివాసీలతో పాటు అందరం ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాల్సి వుంది.
స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్యాలపై నిరసన గళం..
ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించడాన్ని రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నిరసన సెగలు రేకెత్తించాయి.ఒక రాజ్యాంగ బద్దమైన పదవులో ఉండి గిరిజనులకు రాజ్యాం గం కల్పించిన రక్షణ చట్టాలను సవరించడం అనడంపై గిరిజనవర్గాలు భగ్గుమంటున్నాయి. అల్లూరి,పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తున్నాయి.
పార్వతీపురం: బెలగం కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణ మూర్తి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పాలమిట్ట రాము మాట్లాడుతూ ఆదివాసీ భూము లకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్బం దీగా అమలు చేయాలని కోరారు. జనవరి 27వ తేదీన విశాఖ పట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు,ఏలూరు,పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ రాజ్యాంగంలో 5వ షెడ్యూలు కిందకు వస్తుందని తెలిపారు.దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని,వీటిని వెంటనే అరికట్టాలని కోరారు. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రని విమర్శించారు.ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని, ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తోందని వివరించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయని, 1/70 చట్టం 1970లో పెద్దఎత్తున జరిగిన ఆదివాసీ పోరాటాల ద్వారా సంపాదించుకున్నారని తెలిపారు. ఈ చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చిందని, 2006-07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభు త్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చాయని వివరిం చారు. భూమిపై గిరిజనులకు హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసిందని, మోడీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలను ఈ ప్రాంతంలో ఆదానీ పరం చేస్తున్నారు.
1/70 చట్టం జోలికొస్తే ఖబడ్దార్‌!
పాడేరు: ఏజెన్సీలో గిరిజన చట్టాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పదని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మండిపడ్డారు.1/ 70 చట్టం అమలులో సడలింపులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ పట్నంలో నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడి దారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్‌అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిరచించారు.రిజన ప్రాంతంలో 1/70చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని స్పీకర్‌ వ్యాఖ్యలు చేయడం సరికాద న్నారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉండి, గిరిజనులకు హానికలింగేలా స్పీకర్‌ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. స్పీకర్‌ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిగానే ఆదివాసీ సమాజం భావిస్తున్న నేపథ్యంలో దీనిపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి పర్యాటక రంగం ద్వారానే ్షధ్యమనే తప్పుడు అభిప్రాయంలో కూటమి పాలకులు ఉన్నారని మండిపడ్డారు. ఏజెన్సీలోని సహజ వనరులు, సంపదను కార్పొరేట్‌ కంపెనీలో అప్పగించే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. 1/ 70 అమలులో నిర్లక్ష్యం వల్లే ఇప్పటికే వందలాది ఎకరాలను టూరిజం పేరిట ఆక్రమించారని, ఇపుడు చట్టాన్ని సడలిస్తే మన్యం మొత్తంగా ఆదివాసీలకు దూరమై కార్పొరేట్ల పరమౌతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కులను, ఆదివాసీచట్టాలను ధిక్కరించడమే అవుతుందన్నారు.ఏజెన్సీలో యువతకు ఉపాధి అవకాశాలు, చిన్నతరహా పరిశ్రమలను ఐటిడిఎ ద్వారా ఏర్పాటు చేయాలని కోరారు.మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అడ్డుగా ఉందని 1/70చట్టానికి సవరణలు చేయాలని నాటి టిడిపి ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అప్పట్లో ఉన్న ఒకేఒక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా వ్యతిరేకించడంతో అడ్డుకట్ట పడిరదని గుర్తు చేశారు. మన్యవాసుల మనుగడకు నష్టం కలిగించే ఇటువంటి కుట్ర పూరిత విధానాలకు ప్రభుత్వాలు స్వసి చెప్పాలని హితవు పలికారు.పర్యాటకాభివృద్ధి ముసుగులో 1/70 చట్టం సవరణ తగదు.
అరకులోయ: ఆదివాసి ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే హోటళ్ళు,రెస్టారెంట్లు, పార్కులు నిర్మాణం కోసం 1/70 చట్టానికి సడలింపులపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌ ధర్మన్న పడాల్‌ పొద్దు బాలదేవ్‌ తీవ్రంగా ఖండిర చారు. అయ్యన్న ప్రకటన ఆదివాసి హక్కులు, చట్టాలకు తీవ్రమైన విఘాతం కలిగిం చేలా ఉం దని, ఆదివాసులకు ద్రోహం చేసే ఇటు వంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
అయ్యన్న వ్యాఖ్యలపె ్కఆదివాసీల ఆందోళన
హక్కుంపేట :టూరిజం అభివృద్ధి పేరుతో 1/70 చట్టం సవరణ చేయాలని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించడం ఆదివా సుల హక్కులు చట్టాలకు తీవ్ర విఘాతం కలిగిం చడమే కాకుండా మన్యవాసులకు ద్రోహం చేయడమేనని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మండిపడ్డారు.. ఆదివాసీ అభివృద్ధి అంటే హోటళ్లు,రిసార్ట్స్‌ నిర్మాణం కాదని, కాపీ, చింతపండు, అడ్డాకులు వంటి గిరిజన అటవీ వాణిజ్య ఉత్పత్తులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, జిఒ3 ప్రయోజ నాలను పునరుద్ధరించి, శతశాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో హక్కుంపేట,అరకులలోని శరభగుడలో నిరసన చేపట్టారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మండల నాయకులు కిల్లో జగన్నాధం మాట్లాడుతూ, ఆదివాసులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం సవరణ చేస్తే షెడ్యూల్‌ ప్రాంతంలోని అడవీసంపద, గనులు, ఖనిజాలు, ప్రకృతి అందాలన్నీ బడా పెట్టుబడి దారులు కార్పొరేట్‌ కంపెనీల పరమౌతాయని, ఆదివాసుల జీవన విధానం, మనుగడ ప్రశ్నార్థర మౌతుందని ఆవేదన వెలిబుచ్చారు ఆదివాసీల హక్కుల పరిరక్షణలో గుండెకాయలాంటి 1/70 చట్టంపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఆదివాసీలకు ఉపాధి కల్పించే టూరిజం కావాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు టూరిజం ప్రమోట్‌ చేసే భాగంగా దేశ, విదేశీ యాత్రికులను ఆకట్టు కునేందుకు టూరిజంశాఖ ఆధ్వర్యంలో చలి ఉత్సా వాలు నిర్వహిస్తున్నది. ఇందుకోసం కోట్ల రూపా యల ఖర్చుకు సిద్ధం అవుతున్నది.ఆదివా సులకు కావాల్సింది చలి ఉత్సవాలు కాదు.జీవో నెం.3కు చట్టబద్ధత కల్పిస్తూ ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫ ికేషన్‌ విడుదల చేసి అరకు చలి ఉత్సవాలు నిర్వహించాలి. చలి ఉత్సవాల పేరుతో టూరిస్టు లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కన్నా చలి కాలంలో పాడేరు ఏజెన్సీలో సున్నా డిగ్రీల చలికి వణుకుతున్న 50 వేల మంది ఆదివాసీ హాస్టల్‌ విద్యార్థినీ విద్యార్థులకు చలి దుప్పట్లు పంపిణీ చేయాలి. ఆదివాసీలకు ఉపాధి కల్పించేలా టూరిజాన్ని అభివృద్ధి చెయ్యాల్సింది పోయి వారి సంస్కృతిని నాశనం చేసే విధంగా టూరిజాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. బినామీ పేర్లతో పెద్దపెద్ద లాడ్జీలు, రిసార్ట్స్‌ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి వందలాది ఎకరాల ఆదివాసీల భూములను ధారాదత్తం చేస్తూ 1/70చట్టానికి తూట్లు పొడుస్తున్నది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా రోజురోజుకు అక్రమ కట్టడాలు పెరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు. సోమవారం నాడు విశాఖలో జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్‌ సదస్సులో పెట్టుబడు లను ఆకర్షించేందుకు 1/70 చట్టాన్ని సవరించా లని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించడం దారుణం.ఈ విషయ మై అధికారులు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని కూడా చెప్పారు. అంటే 1/70ని మార్చి వేయాలన్నదే వారి నిశ్చితాభిప్రాయంలా వుంది. గిరిజనుల మనుగడకు ప్రమాదకరమైన ఈ ప్రయ త్నాలను గట్టిగా వ్యతిరేకించాలి.టూరిజంలో వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులను స్థానిక ఆది వాసీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ బేఖాతరు చేస్తూ చలి ఉత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఏజన్సీ ప్రాంతంలో రోడ్లు, వంతెనలు లేనందున గర్భిణీలు,రోగులను హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్సులు రావడంలేదు.డోలీ మోతలతో మార్గ మధ్యలోనే మరణిస్తున్నారు. మరోవైపు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత, సికిల్‌ సెల్‌ ఎనీమియా,టైఫాయిడ్‌,మలేరియా తదితర వ్యాధు లతో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వారి కోసం సరైన సదుపాయాలు కల్పించకపోగా ఆదివాసుల ప్రకృతి అందాలు చూపించి కోట్ల రూపాయల ఆదాయాలు పోగేసుకుంటూ దేశ, విదేశీ టూరిస్టులకు కోట్లు ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఆదివాసీ సమాజం తీవ్ర ఆందోళ చెందుతున్నది. ఆదివాసీ యువతకు వంద శాతం ఉద్యోగావకాశాలు కల్పించే జీవో నెం 3 రద్దవడంతో గంజాయి సాగు మాయలో పడి జైలు పాలౌతున్నారు. ఏజన్సీలో ఉపాధి అవకాశాలు లేక మైదాన ప్రాంతాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లి ఇటుక బట్టీల్లో, చేపలు, రొయ్యల చెరువుల్లో పనికి కుదిరి వంద లాది మంది మోసపోతున్నారు.ఆదివాసీల కళలు, సంస్కృతి రక్షణకు ఉత్సవాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడంలేదు.పైగా వారి సంస్కృతి నాశనమయ్యే విష సంస్కృతిని ప్రమోట్‌ చెయ్యడంతో భవిష్యత్‌లో ఆదివాసీల హక్కులకు, వారి అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. ఆదివాసీ సమాజం, ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడ్డానికి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.పాడేరు ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా, ట్రైబల్‌ మ్యూజియం, పద్మపురం గార్డెన్‌, చాపరా యి, కొత్తపల్లి జలపాతం నుండి ఏడాదికి సుమారుగా రూ.20కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం నిధులు స్థానిక ఆదివాసుల అభివృద్ధికి, విద్యా వైద్యం మౌలిక వసతులపై ఖర్చు పెట్టడం లేదు. మరోవైపు టూరిస్టులకు కోట్లు ఖర్చు చెయ్యడం ఆదివాసులకు తీవ్ర అన్యాయం చెయ్యడమే అవుతుంది. ఆదివాసీల సంస్కృతి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాల పరిరక్ష ణకు,టూరిజంలో వస్తున్న ఆదాయంలో 25 శాతం స్థానిక ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయించడం కోసం,జీవో నెం.3చట్టబద్ధత కోసం,ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ సాధించుకునేందుకోసం ఆదివాసీలు ముందుకు రావాలి.- కిలో సురేంద్ర

మన జాతి రత్నం లాల్‌ బహుదూర్‌ శాస్త్రి

భారతదేశానికి రెండో ప్రధానమంత్రి,భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి,భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు లాల్‌బహదూర్‌ శాస్త్రిగారి జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలను ఈకథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్టోబరు రెండవ తేదీ భారత ద్వితీయ ప్రధాని శ్రీలాల్‌ బహుదూర్‌ శాస్త్రిగారి జన్మదినం.1904వ సంవత్సరం అక్టోబరు2న ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో జన్మించిన లాల్‌బహదూర్‌‘జైజవాన్‌జై కిసాన్‌’ నినాదంతో దేశాన్ని మేల్కొలిపి చ్కెతన్యం రగిలించిన ధన్యజీవి. ఆకలి తీర్చే రైతుకు, దేశాన్ని కాపాడే సైనికుడికి మనం చేసే అభినందనలే వారిలో విజయమార్గంలో నడిపిస్తాయి అని అప్పటి మూడుకోట్ల జనాభాకి పిలుపు నిచ్చారు.భారతదేశాన్ని ప్రపంచదేశాల గుర్తింపు కార్యక్రమంలో భారత భవిష్యత్తును రూపొందిం చటంలో కీలక పాత్ర పోషించిన మేధావి. కాయస్థ వంశంలో శారదాప్రసాదుకు మరియు రామ్‌దులారీ దేవి దంపతులకు జన్మించిన ఈ బాలుడు, బాల్యమునందే తండ్రిని పోగొట్టుకున్నాడు.బీద కుటుంబముభర్త మరణించటంతో రామ్‌దులారీ దేవి తన ఇద్దరు కుమార్తెలను, కుమారుడు బహదూర్‌ని తీసికొని తండ్రి వద్దకు చేరినది.బహదూర్‌ని అందరూ ‘‘నానీ’’ అని ముద్ధుగా పిలుచుకొనేవారు.అది తాతగారు పెట్టిని ముద్దు పేరు.
బాల్యంలో ఆటల మైదానంలో ఆడుకుంటూ తోటి స్నేహితులతో కలసి ఒకరి జామచెట్టును, యజమాని అనుమతి లేకుండా కాయలు కోసుకొనే సమయంలో,ఆయజమాని చూసి కోపంగా అరచిన అరుపుకి అందరూ తప్పుకున్నారు గాని,నానీ మాత్రం తప్పించుకోలేదు.పైగా ఆయజమానితో ‘తండ్రిలేని వాడిని,నన్ను ఎక్కువగా దండిరచకు’అని బ్రతిమాలితేదానికి ఆయజమాని ‘నీకు తండ్రి లేడు కనుకనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పిన మాటను సందేశంగా భావించి,భవిష్యత్తును క్రమబద్ధంగా చక్కగా తీర్చిదిద్దుకున్నాడు.దాని ప్రభావము ఆయనకు బాగా తోడ్పడిరది.లాల్‌బహదూర్‌ ప్రాధమిక విద్య గంగానదికి ఆవలి ఒడ్డున గల మొగల్‌సరాయి, వారణాసిలలోని పాఠశాలలో జరిగింది. లాల్‌బహదూర్‌ నిత్యం పాఠశాలకు గంగానదిపై పడవలో ప్రయాణించి వెళ్ళి చదువుసాగించాడు. ఆ సమయంలో ఒకసారి పైకం చెల్లించే పరిస్థితి లేక బట్టలు,పుస్తకాలు సంచిలో చుట్టుకుని,వాటిని నడు ముకి కట్టుకుని నదిపై ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకుని పాఠశాలకు వెళ్ళటం జరిగింది. పడవకి డబ్బులు ఇస్తామని చాలామంది చెప్పినా సున్నితంగా తిరస్కరించి,ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్నాడు. సమ యస్ఫూర్తితో కార్యాలను సాధించుకునేవాడేగాని, పేదరికానికి మాత్రం చింతించలేదు,వెనుకంజ వేయ లేదు.లాల్‌బహదూర్‌ 13వసంవత్సరంలోనే గాంధీ గారి ప్రసంగాలకి, సిద్ధాంతాలకి ప్రభావితుడ్కె నాడు. విధ్యార్థి దశలోనే భారతసేవా సమితి అనే సంస్థలో సభ్యునిగా ఉండేవారు.బాలగంగాధర్‌ తిలక్‌గారి ఉపన్యాసాలకు ప్రీతిపాత్రుడ్కె దేశభక్తిని అమితంగా పెంచుకున్నాడు.1921లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణాద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడి, మైనరగుటచే వెంటనే విడుదలకాబడ్డారు. ఆకారణం చేత విధ్యాభ్యాసానికి హాని కలుగలేదు. కాని విశ్వవిధ్యాలయం నుండి‘‘శాస్త్రి’’ పట్టాను పొంది న కారణంగా లాల్‌బహదూర్‌ శాస్త్రి అయ్యారు. 192728 సం.లో లలితాదేవితో వివాహమైనది. వరకట్నంగా మామగారు కొయ్య చరఖాని బహు మతిగా ఇచ్చారు.అప్పుడప్పుడే స్వాతంత్య్ర పోరాటం ఉధృతమవుతున్న సమయంలో శాస్త్రికి,నెహ్రూగారితో సన్నిహిత సంబంధం ఏర్పడిరది.అది వారి మధ్య గొప్ప మైత్రికి దారితీసింది.1930లో లాల్‌బహదూర్‌ లొలిసారిగ జిల్లాకాంగ్రెస్‌ కార్యదర్శిగా ఎంపిక కాబ డ్డారు.పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభించిన కార ణంగా 2సంవత్సరాలకాలం కారాగార శిక్ష వేసారు బ్రిటిష్‌వారు.ఆయన ఆశిక్షను అనుభవించారు.
ఒకసారి అలహాబాదు నగరమధ్యలో జాతీయ పతాకం ఎగురవేయుటకు కాంగ్రేస్‌ సభ్యులందరూ భయాందోళనలో వుండగా, శాస్త్రిగారు స్త్రీ దుస్తులలో బురఖా వేసుకుని పైకిపాకి జెండాను ఎగురవేసి నారట. అతని ధ్కెర్యసాహసాలకు భారతీయులందరూ ప్రసంసించినా, అందుకుగాను మరల జైలు శిక్ష అను భవించవలసి వచ్చింది.1936లో ఆంగ్ల ప్రభుత్వానికి పోటీగా కేంద్ర,రాష్ట్ర శాసనసభలకు జాతీయ కాం గ్రెసు పోటీ చేసింది.శాస్త్రిగారు అలహాబాదు నియో జగవర్గం నుండి ఎన్నికైనారు.వారు ఎప్పుడూ సమ యాన్ని వృధా చేయలేదు.జ్కెలులో ఉన్న సమయంలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ‘మేడం క్యూరీ’ జీవితగాధను హిందీలోనికి అనువదించారు. కాలాన్ని వ్యర్ధం చేయక పఠనానికో, గ్రంధరచనకో ఖర్చుచేసేవారు.విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో భార్యను కూడా పాల్గొనమని ప్రోత్సహించారు. శాస్త్రిగారి జీవితం మిక్కిలిఆదర్శప్రాయమైనది. భారతీ యుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిన అమర జీవి.ప్రధానిగా కొంతకాలమే వున్నప్పటికీ, ముందు వారికంటే కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. పదవు లకోసం ప్రాకులాడలేదు.పదవులే వారిని వెదుక్కుంటూ వచ్చాయి.ఉక్కుమనిషి,ఆజాత శత్రువు, నిగర్వి,ధ్కెర్య శాలి, స్థిరచిత్తుడు వంటి పదాలకి సరైన నిర్వచనం శాస్త్రిగారు.భారత స్వాతంత్య్రానంతరం అలహాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో గెలిచి ‘అలహాబాద్‌ ఇంప్రూవ్‌ మెంటుట్రస్టుకు’ట్రస్టీగా నియమించ బడినారు. రెండు బాధ్యతలు నిర్వర్తించే సమయంలో ‘‘టాగూర్‌ నగర్‌’ అనే పేరుతో అర ఎకరం భూమిని ప్లాటుగా విభజించి శాస్త్రిగారు లేని సమయంలో మిగిలినవారు వేలానికి పెట్టారు.ట్రస్టు సభ్యులందరూ తలొక ప్లాటును స్వంతం చేసుకోవాలనుకున్నారు.
రెండు రోజులకి తిరిగి వచ్చిన శాస్త్రిగారికి ఈ విషయం తెలిసి,వారందరినీ పిలిచి,మనం ప్రజా ప్రతినిధులము,ప్రజల ముందు నిజాయితీగా నిల వాల్సిన వారం,అందరూ వాపసు ఇచ్చేయండి లేదా రాజీనామా చేద్దాం.కావలసివారు వేలం పాటలో పాల్గొని దక్కించుకోండి అని చెప్పి అందరిచేత వాపసు చేయించారు.శాస్త్రిగారు ప్రధానమంత్రిగా పనిచేసినా పదిరూపాయలు కూడా దాచుకోలేదు. స్వంత ఇల్లు కూడా లేని నిజాయితీకి మారు రూపం.రాజకీయంగా కీలక పదవులు చేపట్టిన సందర్భాలలో కూడా దేశానికి మేలు చేసే శాశ్వత కార్యక్రమాలు చేపట్టారు. రైల్వేమంత్రిగా 195156 వరకూ,హోంమంత్రిగా ఏప్రిల్‌ 61 నుండి ఆగస్టు 63వరకూ,ప్రధానమంత్రిగా జూన్‌ 64నుండి జనవరి 66వరకూ (మరణించే వరకూ) పనిచేసారు.ఈసమయలో ప్రధాన మంత్రి గాచేస్తూ అదనంగా కొంత కాలం హోం మంత్రి త్వశాఖను కూడా నిర్వహించారు. ఆ సమ యంలో ఎదురైన ఆహారధాన్యకొరత, పొరుగు దేశాల వత్తిడికి ధీట్కెన సమాధానం చెప్పి రెండు సమస్యలకు పరి ష్కారం చూపారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమ యంలో కూడా వారి సంతానం సిటీబస్సులలోనే ప్రయాణించే వారు.ప్రధానిగా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన సౌకర్యాలు సమ కూర్చలేదు.వారిలోని జాతీయ భావానికి శాస్త్రిగారి సంస్కారానికి ఆకుటుం బ సభ్యుల సహకారానికి నమోవాకాలు అర్పించ వలసినదే.వారి పెద్దకుమారుడు హరికృష్ణకు అశోక్‌లేలాడ్‌ సంస్థలో ఉద్యోగం చేసే సమయంలో, అకస్మాత్తుగా సీనియర్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పిం చారు.శాస్త్రిగారికి ఈవిషయం తెలిసి, ఆసంస్థవారు నీకు అర్హతలు చూడ కుండా పదోన్నతి కల్పించడం లోని ఉద్ధేశ్యం వారు ప్రధానిగా నానుండి ఏదో ఆశిం చవచ్చును.కనుక నేను ప్రధానిగా ఉన్న సమయంలో ఆసంస్థలో నీవు ఉద్యోగం చేయవద్దని ఖండిరచిన మహనీయులు శాస్త్రి గారు. రైల్వేమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రమాద సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారు. అనేక విశేష సలహాలు, నిర్ణయా లపై కేంద్రమంత్రి వర్గంలో విశిష్టస్థానంలో ఉన్న శాస్త్రిగారి నిర్ణయంతో జరిగేవి.ఏపదవీ లేన ప్పుడు కూడా ఇదే పంధాలో కొనసాగుతూ దేశానికి సేవ చేశారు.శాస్త్రిగారు ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థానుతో యుద్ధం సంభవిం చింది.వారి దురాక్ర మణను గుండె నిబ్బరంతో అణచివేసిన వీరుడు. శాంతి స్థాపనకై రష్యా నాయకుల ఆహ్వానంతో తాష్కెంటుకు వెళ్ళి సంధి పత్రంపైన సంతకం చేసి, గుండె పోటుతో 1966 జనవరి 11వారు మరణిం చారు.ఆయన విశ్రాంతి స్థానం‘విజయ్‌ ఘాట్‌’గా గుర్తింపబడినది.ఆయన మరణానంతరం ‘భారతరత్న’ బిరుదును ప్రకటించారు. శాస్త్రిగారు వాయిదాల పద్దతిలో తీసుకున్న కారు వాయిదా నాలుగు వేల రూపాయలను వారి సతీమణి,శాస్త్రి గారి మరణా నంతరం చెల్లించి వారి నిబద్ధతకు, నిరా డంబర జీవితానికి భర్తకి సహకరిం చిన ఆదర్శమహిళ లలితా శాస్త్రిగారు.‘జ్కె జవాన్‌జ్కె కిసాన్‌’నినాదాలు ఎప్పటికీ మనతోనే వుంటాయి. మహనీయుల పుట్టుకకు ఒకపరమార్థం వుంటుంది. భారతదేశాన్ని ఉద్దరించ టానికి జన్మించిన నిస్వార్థ మహనీయులలో శాస్త్రిగారి కీర్తి ఆచంద్రార్కం నిలచి వుంటుంది.వారికి నమోవా కములు.జై భారత్‌.(వ్యాసకర్త : సాహితీరత్న,ప్రముఖ రచయిత్రి
విశాఖపట్టణం`9849692414
) డాక్టర్‌ దేవులపల్లి పద్మజ

కామారం కలాల శోధన కోయతూర్‌ ఆఫ్‌ కామారం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ‘‘బీర్సా ముండా యూత్‌ సభ్యులు’’ పర్యటనలు, పరిశోధనల సాయంగా వెలువరించిన పుస్తకం’’ ‘‘ఇండిజినెస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ డా. అమ్మిన శ్రీనివాసరాజు
నేటి ఆధునిక కాలంలో అడవి బిడ్డల్లో పొడచూస్తున్న మార్పుల తీరు తెన్నులు గమనిస్తుంటే, అక్షరాల ఆనందదాయకంగా ఉంది. ఆదివాసీలు తమ చరిత్రను, తమ అస్తిత్వాన్ని, మూలాలను, తామే స్వయంగా నిర్మాణం చేసుకుంటున్న శుభతరుణం ఇది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పరిధిలోగల ‘‘సమ్మక్క సారక్క తాడ్వాయి’’ మండలంలోని గిరిజన గ్రామం కామారంకు చెందిన విద్యావంతులైన గిరిజన యువత ఏర్పాటు చేసుకున్న ‘‘బీర్సా ముండా యూత్‌ సభ్యులు’’ పర్యటనలు, పరిశోధనల సాయంగా వెలువరించిన పుస్తకం.
‘‘ఇండిజినెస్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ ది కోయతూర్‌ ఆఫ్‌ కామారం’’ ఇది విషయపరంగాను అలంకరణ పరంగాను ఎంతో ఆకర్షణీయంగా అందంగా విలువైనదిగా ఉంది ఒకరకంగా చెప్పాలి అంటే దీనిని ‘‘గిరిజన ఎన్సైక్లోపీడియా’’ అని కూడా అభివర్ణించవచ్చు.
296 కమ్మలతో అచ్చంగా 64 అంశాలను సచిత్రంగా అనుభవసారంతో అందించిన ఈ వ్యాసావళిలోని ప్రతి వ్యాసం ఒక ఆణిము త్యం లాంటిదే..!! ఆదివాసి జనజాతి అన్న, వారి ఆచారసాంప్రదాయాలు అన్న,అవి అతి ప్రాచీనమైనవి అనే భావన ప్రతి ఒక్కరిలో నాటుపోయి ఉంది.కానీ అది సరైనది కాదు అనే భావన కలుగుతుంది ఈ పుస్తకం చదివితే. దీనిలో ఆదివాసీలకు సంబంధించిన సమస్త అంశాలు పరిశోధనాత్మకంగా వివరించబడ్డాయి.వస్త్రధారణ,అలంకరణ, పండుగలు,గట్టు- గోత్రాలు,పెళ్లి, చావు,వేట, భాష, ఆహార సేకరణ,ఆటలు- పాటలు, వ్యవసాయ విధానం,పశువుల జంతువుల పెంపకం,తదితర విషయాల గురించిన సంపూర్ణ సచిత్ర విషయాలు సహేతుకంగా ఇందులో మనం చదవచ్చు.సాధారణంగా పరిశోధన గ్రంథాలు అంటే ఏదో ఒక అంశం మాత్రమే తీసుకుని దానిని పరిశోధించి ఫలితాలు రాస్తారు కానీ ఈబీర్సా ముండా యూత్‌ వారు సుమారు 200 విషయాలు ఎంచుకొని వృక్ష- జంతు శాస్త్ర, గణిత -భౌతిక శాస్త్ర, చరిత్ర, పురావస్తు, ఆంత్రఫాలజీ, వంటి అంశాలను కలగలిపి అధ్యయనం చేసి పరిశోధన చేయటం సాహసంతో కూడిన గొప్ప విషయం.
దీనిలో ప్రధానంగా ‘‘ఇండిజినెస్‌’’ (స్థానిక ప్రజల ఆలోచనలు ఆచరణ) జ్ఞానంపై ఎక్కువ విశ్లేషణ చేసి గిరిజన ప్రాకృతిక వైవిధ్య ఫలితమైన జ్ఞానాన్ని విపులంగా చిత్రించారు, ఇందులోని శోధన అంతా గిరిజన జీవనం ప్రాకృతిక జ్ఞానం కేంద్రంగా కొనసాగింది. ఆదివాసుల నాగరికతకు సంబంధించిన పరికరాలను వివరించడమే కాక వాటి యొక్క శాస్త్రీయ విశ్లేషణ కూడా చేయడం ఇందులో ఒక విశిష్టత, ఎడ్ల బండి మొదలు నాగలి , ముల్లుకర్ర, గొర్రు, బొనగ, తూతకొమ్ము, ఒడిసెల, గినుగు, బరిశ, ఇసుర్రాయి, రోలు, తదితర వస్తువుల నిర్మాణం ఉపయోగంతో పాటు వాటిలో గల శాస్త్రీయ విశ్లేషణలు కూలంకషంగా చేశారు.
వీటిలో ‘‘తూత కొమ్ము’’ గురించిన విశ్లేషణ గమనిద్దాం… అడవి దున్నల కొమ్ములను గిరిజనులు అడవుల నుంచి సేకరించి క్రమ పద్ధతిలో మొన భాగాన్ని, తొలగించి లోపల భాగం శుభ్రం చేస్తారు, పై భాగంలో నులుపుగా ఉండటానికి నూనె పూస్తారు, బోలుగా ఉన్న కొమ్ము మొన భాగం నుండి గాలిని ఊదటంతో భీకరమైన శబ్దం వస్తుంది,
ఈ ‘‘త్షుత కొమ్ము’’ గిరిజనులకు హెచ్చరిక చేసే సైరన్‌ లాంటిది, పశువులను మేత కోసం వదలడానికి, అడవుల్లో అవి మేత మేసే సమయంలో క్రూర మృగాల బారి నుంచి కాపాడటానికి, మందల నుంచి తప్పిపోయిన పశువులు తిరిగి మందలోకి రావడం కోసం, ఈ ‘‘తూతకొమ్ము’’ను ఉపయోగిస్తారు. అలాగే గిరిజన గ్రామాల్లో ఈ తూతకొమ్ము ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది, ముఖ్యంగా గ్రామ దేవతల జాతరలు పండుగల వేళ ఆయా దేవర్ల ఆగమనానికి గుర్తుగా తూతకొమ్ము ఊది జనాలను జాగృతం చేస్తారు. ఈ దూత కొమ్ముకు సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణ చేస్తూ దీని జ్ఞానం నుంచే నేటి ఆధునిక సౌండ్‌ సిస్టమ్స్‌ వచ్చాయని భావించవచ్చు అంటూ…అడవిలో జంతువులు పక్షులు ఆరుపులను బట్టి గుంపులు గుంపులుగా జీవిస్తాయి,వాటి క్రమం నుంచే జ్ఞానం తెలుసుకుని తూతకొమ్ము శబ్దంతో ఆదివాసీలందరూ ఏకమవడం నిజంగా ప్రకృతి నేర్పిన జ్ఞానం అంటారు ఈ పరిశోధకరచయితలు,ఇదే క్రమంలో వడిసెల, గినుగు, విల్లు, తదితర ఉపకరణాల గురించిన విశ్లేషణలు ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా ఇందులో చదవచ్చు.
కోయవారు పూర్వకాలం నుంచి కాలాన్ని కొలవడానికి కార్తెలను ఎలా ఉపయోగించారో చెబుతూ కార్తెల పేర్లకు గల జానపద కథనాలు, వాటితో ముడిపడి ఉన్న సామెతలు, కూడా ఇందులో పేర్కొనడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అలాగే ఆయా కార్తెల సందర్భంగా గిరిజనులు చేసుకునే పండుగల వివరాలు సైతం చెప్పడం జరిగింది.అడవిలోనే మృగాలు దాంపత్య జీవనం కోసం కలుసుకునే సందర్భంలో భీకరంగా అరుస్తాయి.ఆసందర్భంలో వచ్చే కార్తె కనుక దీనిని ‘‘మృగశిర కార్తె’’ అంటారు, ఎండలు తగ్గి వానలు రాకకు అనుకూలత చెందెసమయంలో ఈ కార్తె వస్తుంది.వర్షం లేకపోయినా భూమి చల్లగా ఉంటుంది. ఈ కార్తెలోనే భూమిలో విత్తనాలు వేస్తే పాడైపోకుండా సక్రమంగా మొలుస్తాయి అని వారి నమ్మకం, ఇలా కార్తెలను లెక్కించడం, కాలాన్ని విభజించడం, భూములు కొలవడం, తదితర విషయాల గురించి పరిశీలిస్తే ఈ ఆదివాసులకు, అక్షరజ్ఞానం అంతగా లేకపో యినా ప్రకృతిని అంచనా వేయడంలో వారు చక్కని పరిజ్ఞానం కలిగి ఉంటారు అనే నిజం నమ్మి తీరాల్సిందే.!! ఈ పుస్తకంలో సాధార ణమైన గిరిజన పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఉమ్మడి జీవన విధానం, కుటుంబ వ్యవస్థ, బంధుత్వాలు, ఆటలు, పాటలు, వ్యవసాయం, జంతువుల పెంపకం, గురించిన సాధారణ విషయాల గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా సహేతుకంగా వివరించడమే కాక శివుని చారిత్రక నేపథ్యం, సింధు నాగరికత కోయ నాగరికత, కోయ సిద్ధాంతం ప్రత్యేకత, కోయ తూర్‌, గోండ్వానా ధర్మచక్రాల గురించిన విశ్లేషణలతో పాటు, గొంతెమ్మ మడుగు పురాతన చిహ్నాలు – ఒక అధ్యయనం, వంటి వినూత్న విషయాల గురించిన వివరాలు చెప్పడం దీనిలో ఒక ప్రత్యేకత.
ఆదివాసి జాతి సంరక్షణ కోసం తమ అస్తిత్వాన్ని తామే వ్రాసుకోవడం ఒక కోణం, అయితే గిరిజనులకు గల పరిశీలన దృష్టి, ప్రకృతిని అంచనా వేయడంలో వారికి గల ప్రత్యేకతలు, కూలంకషంగా ఈ క్షేత్ర పరిశీలన తాలూకు పరిశోధన అధ్యయన గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఎంతో అవసరమైన గిరిజన విజ్ఞానం తాలూకు సైద్ధాంతిక పరమైన విషయ సేకరణలో కామారం బిర్సా ముండా యువజన ఉద్యోగ సంఘాల వారు చేసిన ఈ అక్షర కృషి ఎంతో శ్లాఘనీయం, భావి పరిశోధనలకు ఇది ఒక ‘‘నీటి చెలెమె’’లా, దోహదపడగదు, ఈ అద్బు Ûత అక్షర కృషికి సారథ్యం వహించిన గిరిజన పరిశోధక విద్యార్థి ‘‘మైపతి అరుణ్‌ కుమార్‌’’ ఎంతో అభినందనీయుడు.గిరిజన సంస్కృతి సైద్దాంతిక గ్రంథాలకు తలమాని కంగా నిలిచే ఈ సచిత్ర పుస్తకం ప్రతి పరిశోధక విద్యార్థి అధ్యయనకర్త, విధిగా చదవాల్సినది.

అపరా అనుభవసారం ఆదివాసీ ఆత్మగానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘‘ డాక్టర్‌ వి.ఎన్‌ .వి. కె, శాస్త్రి గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘ఆదివాసి ఆత్మగానం’ – డా. అమ్మిన శ్రీనివాసరాజు
గిరిజన జన జీవితాలను అత్యంత దగ్గరగా గమనించడమే కాక సుమారు 50సంవత్స రాల పాటు వారితో సహజీవత్వం చేసిన పరిశోధకుడు, ప్రభుత్వ ఉద్యోగి, రచయిత, ముఖ్యంగా కేవలం గిరిజనుల గురించి అనేక పుస్తకాలు పరిశోధనాత్మకంగా వ్రాసిన వ్యక్తి, తెలుగు గిరిజన రచయిత లలో ప్రథమ స్థానంలో నిలిచేవారు, వారే అందరికీ డాక్టర్‌విఎన్‌.వి.కె,శాస్త్రిగా సుపరిచి తులైన ‘‘వట్టిపల్లి నరసింహ వీరభద్ర కృష్ణశాస్త్రి’’ ఆయన ఇటీవల వెలువరించిన వ్యాససంపుట్టి ‘‘ఆదివాసి ఆత్మగానం’’ ఆదివాసి జీవన సంస్కృతులకు దర్పణం పడుతున్న ఈ వ్యాసవళిలో మొత్తం 34వ్యాసాలు ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో మన గిరిజన బిడ్డలు పడుతున్న ఇక్కట్ల గురించి సహేతుకంగా వివరించే నేపథ్యంలో ఒకవైపు సంస్కృతి పరంగా, మరోపక్క పాలకులు చేస్తున్న దురాగతాలు, అలాగే వలస గిరిజనుల వల్ల కలుగుతున్న నష్టాలు అదేవిధంగా గిరిజనే తరులు, ప్రపంచీకరణ సాయంతో సాగు తున్న ఆధునిక అభివృద్ధివల్ల వాటిల్లుతున్న నష్టం గురిం చి రచయిత పారదర్శకంగా ఆలోచింప జేసే విధంగా ఈవ్యాస ప్రస్థా నం కొనసాగించారు. ఆనాటి మొగ లాల సాయంతో మన తెలుగు ప్రాంతానికి వచ్చిన బంజారాలు తమదైన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అష్ట కష్టాలు పడి దుర్భర జీవితాలు అనుభ వించిన వారు ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో సుగాలీలుగా తెలంగాణలో లంబాడాలుగా పేర్లు కలిగి గిరిజ న సామాజిక వర్గ సౌక ర్యాలు పొందుతున్న తీరును వివరిం చిన శాస్త్రిగారి వ్యాసంలో కేవలం వారి చరిత్ర జీవితం మాత్రమే ప్రస్తావించారు, వారివల్ల నిజమైన కొండల్లోని గిరిజన సామాజిక వర్గం వారికి జరుగుతున్న ఉపాధి ఉద్యోగ ఆర్థిక నష్టాల ప్రస్తావన లేదు.కానీ ఇదే వ్యాస సంపు టిలో ‘‘నకిలీ గిరిజన సర్టిఫికెట్‌ గాళ్లు’’ అనే మరో వ్యాసంలో ఆయన స్వీయ అనుభవంలోని విష యాలు ప్రస్తావించారు. సుమారు 50 సంవత్స రాల క్రితమే నకిలీ సర్టిఫికెట్లు పొంది వివిధ ఉద్యోగ హోదాల్లో ఉన్నవారు ప్రస్తుతం వారి పిల్లలకు సైతం అదే సర్టిఫికెట్లతో రిజర్వేషన్‌ సౌకర్యాలు అనుభవిస్తున్న వైనం ఇందులో పేర్కొంటూ నకిలీ గిరిజనులు ఏర్పడుతున్న తీరును, తెలిపి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గూర్చి మాత్రం అస్పష్టంగా ముగించారు. కోసం మెరుపుగా ఏజెన్సీ బయట నివసిస్తున్న గిరిజనులు ఏజెన్సీ గిరిజనులుగా నకిలీ సర్టిఫికెట్లు పొంది స్థానిక గిరిజన కోటాలో ఉద్యోగాలు పొందుతున్న వైనం, ప్రస్తావించిన శాస్త్రిగారు తనదైన పారదర్శకత చూపించే ప్రయత్నం చేశారు. ఆధునికత పేరుతో ఆవిర్భవించిన పర్యాటక రంగం వల్ల అడవి బిడ్డల సంస్కృతి ఎలా నాశనం అవుతుందో వివరించే వ్యాసంతో పాటు మాయమవుతున్న సాంప్రదాయ నాయకత్వం, గిరిజనేతరులైన వడ్డీ వ్యాపారులు, గిరిజనులను ఆర్థికంగా దోచుకుంటున్న వైనంతో పాటు ప్రస్తుతం ఆధునిక గిరిజన జనాభా పోడు వ్యవసాయం నుంచి కాఫీ తోటలు సాగు చేసే స్థాయి వరకు సాధించిన అభివృద్ధిని కూడా వ్యాస ర చయిత ఇందులో పేర్కొనడం అభినందనీయం.
ఇక గిరిజనులు అంటేనే సాంస్కృతి సాంప్రదాయాల వారసులుగా చెప్పుకుంటాం. అంతేకాక వారిలో అబ్బురపరిచే జీవన సంస్కృతి ఆగుపిస్తుంది ఈ వ్యాస సంపుటలో ఈ కోవకు చెందిన వ్యాసాలు కూడా మనం చదివే వీలు కల్పించారు. గోండు గిరిజనుల సలహాదారులైన ‘‘ప్రధానులు’’ అనే గిరిజన ఉపతెగ ప్రస్థానంతో పాటు,యానాదులు కొండరెడ్లు చెంచులు రాచకోయలు గుండులు తదితర గిరిజన జాతుల వారి జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలను వివరించే విశేషమైన వ్యాసాలు ఇందులో ఉన్నాయి, మనం అంతా గోండులు అని వ్యవహరిస్తున్న వారు గోండ్లు కాదు కోయత్తుర్లు అనే సహేతుక విశ్లేషణ కూడా వ్యాస రచయిత ఇందులో చేశారు.ప్రస్తుత గిరిజన సాహిత్యంలో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్న విషయం’’ గిరిజన చట్టాలు’’ వీటికి సంబంధించిన విలువైన సమాచారయుతమైన వ్యాసాలు ఇందులో పొందుపరిచారు, ఉమ్మడి అటవీ యాజమాన్య చట్టం, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం గురించిన ఎంతో ఉపయుక్త సమాచారం ఇందులో వివరించబడిరది. అలాగే గిరిజన యువతలో విద్యావంతులతో పాటు పెరుగుతున్న నిరుద్యోగిత గురించి కూడా వివరిస్తూనే గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన లేని తీరు, భాష అంతరిస్తే జరిగే పరిణామాలు గిరిజన పాఠశాలల సంఖ్య తో పాటు పెరగాల్సిన సౌకర్యాలు గురించిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. వ్యవస్థాగత లోపాల కారణంగా గిరిజన అక్షరాస్యత దేశవ్యాప్తంగా 58.96% మాత్రమే కాగ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే గణాంకాలు ఉన్నట్లు చెబుతూ.. మైదాన ప్రాంతాల్లో కూడా గిరిజన అక్షరాస్యత ఆశించినంత ఎక్కువగా లేదనే అభిప్రాయం వెల్లడి చేశారు. అంతేకాక గిరిజన స్త్రీ అక్షరాస్యత 40% మాత్రమే ఉండటం మరింత అన్యాయంగా వ్యాసకర్త అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన జన జాతుల్లో ఒకటైన ‘‘సవర’’ తెగ గురించిన సంపూర్ణ వివరణలో భాగంగా చిత్రకళలో వారి నైపుణ్యాన్ని వారు ఇచ్చే ప్రాధాన్యతల గురించి ఎంతో ఆసక్తిగా విశేషంగా వివరించారు ‘‘ఇడి సింగ్‌ లేని ఇల్లుండదు’’ వ్యాసంలో. ఇలా ఈ 34 వ్యాసాలు వేటికవి ప్రత్యేకతలు కలిగి ఆసక్తి విశేషాలతో కూడిన విలువైన సమాచారం నిండి ఉన్నాయి. వ్యాసాలు అనగానే పాఠకుల దృష్టి అదో గణాంకాల సమూహం, అనే సాధారణ అభిప్రాయం ఉంటుంది కానీ ఈ వ్యాసాల రచయిత ఒక పరిశోధకుడు మాత్రమే కాక అర్థశతాబ్దం పాటు అచ్చంగా గిరిజనులతోనూ వారు నివసించే ప్రాంతాల లోను అత్యంత దగ్గర సంబంధాలతో నివసించిన వ్యక్తి అలాగే 1980 దశకంలో గోండు గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే లండన్‌ విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర ఆచార్యుడు, గిరిజన పరిశోధకుడు, నైజాం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, అయిన ‘‘హేమన్‌ డార్ప్‌’’ తో డాక్టర్‌ శాస్త్రి ప్రత్యక్ష పరిచయం, వారి పర్యటనల్లో భాగస్వామి కూడా అయిన అనుభవాల సారం తదితర ప్రత్యేక అర్హతలు గల ఈ వ్యాసర చయిత కలం నుంచి జాలువారిన ఈ అన్ని వ్యాసాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయి. వ్యాసాలు అన్నీ సాధారణ నిడివి అత్యంత సరళమైన భాష ఆసక్తిని పెంచే అనుభవ సంఘటనలు, తదితరాల మేళవింపుతో ఈ వ్యాస సంపుటి విలువ మరింతగా పెరిగింది, కేవలం గిరిజన జీవన విధానం, చరిత్ర, సంస్కృతి,తో పాటుగా పరిశోధనలకు అవసరమైన ప్రామాణిక విషయా లు గణాంకాలు దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోపాటు పరిశోధకులు విధిగా చదవాల్సిన వ్యాసావళి ఇది.
ఆదివాసి ఆత్మగౌరవం… వ్యాసకర్త: డాక్టర్‌ వి ఎన్‌ వి కె శాస్త్రి, పేజీలు: 152, వెల: రూ 90/-ప్రతులకు: నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలు. ఫోను: 040 – 27665420. సమీక్షకుడు: డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌:7729883223.

గిరిజన కథల పొది..ఇప్ప పూలు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘ ఐ.ఏ.ఎస్‌ అధికారి అయిన అపరమేధావి ‘‘ గూడూరు రాజేందర్రావు గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘విప ్పపూలు’ -డా. అమ్మిన శ్రీనివాసరాజు


తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలది ఒక ప్రత్యేక స్థానం,గిరిజనుల సంస్కృతి సాంప్రదా యాలు ఎలాంటి విశిష్టత,ప్రత్యేకతలు,కలిగి ఉం టాయో ఆ కథలు కూడా అంతే వైవిధ్యం నింపుకొని సాగుతాయి. 1910లో తెలుగు సాహిత్యంలో కథల తలుపులు తెరుచుకుంటే 1932లో గూడూరు రాజేంద్రరావు ‘‘చెంచి’’ కథతో గిరిజన కథల ప్రవేశం మొదలైంది. ప్రారంభంలో గిరిజన జన జాతికి చేరువలో జీవనం సాగించిన, అడవిబిడ్డలపై అభిమానం గల రచయితల నుంచి అరకొరగా గిరిజన ప్రత్యేక కథలు వెలువడ్డాయి.
అనంతర కాలంలో ఆదివాసుల్లో కూడా అక్షరాస్యత దినదిన ప్రవర్తమానమై వారిలో కూడా రచయితలు ఆవిర్భవించారు. అంతకు ముందుగల వారియొక్క ‘‘నోటి సాహిత్యం’’ను అక్షరబద్దం చేసే పని ప్రస్తుతం విస్తృతంగా జరుగుతుంది. గతంలో గిరిజనుల పోరాటాలు, అన్యాయా లకు గురవుతున్న తీరు,వారికష్టాలు మాత్రమే కథా వస్తువులుగా కథలు వెలువడి అవి అన్ని ‘‘సానుభూతి కథల’’ జాబితాలో చేరిపోయాయి. అనంతరం వచ్చిన గిరిజనులే వ్రాసిన గిరిజన కథల్లో విస్తృత మార్పులు చేరి వారి సంస్కృతి సాంప్రదాయాలే కథా వస్తువులుగా గిరిజన కథలు వెలబడుతూ..‘‘స్వానుభవ కథల’’ జాబితాగా తయారయ్యాయి, కథలు అవే అయినా వస్తువుల్లో భిన్నత్వం సంతరించుకొని అటు పాఠకులకు ఇటు పరిశోధకులకు పూర్తి సంతృప్తిని అందిస్తూ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
గిరిజన జీవితాలకు సంబంధించి విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తృత పరిశోధనలు జరిగిన గిరిజన కథల గురించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మంకు చెందిన ప్రముఖ సీనియర్‌ రచయిత, జీవన్‌ అవిశ్రాంత సాహితీ కృషిలో భాగంగా ఆయన సంపాదకత్వంలో2009 సంవత్సరంలో 29 కథలతో ‘‘ఇప్ప పూలు’’ గిరిజన సంచార తెగల కథా సంకలనం వెలువడిరది, దానికి లభించిన అత్యధిక ఆదరణతో మరో పదకొండు అచ్చమైన గిరిజన కథలు జోడిరచి మొత్తం 40కథలతో ‘‘ఇప్పపూలు’’ మలికథా సంకలనం ఇటీవల వెలువడిరది. దీనిలో 30% సంచార జాతుల వారి జీవన దర్పణాలైనా కథలు మినహాయిస్తే అన్ని అచ్చమైన అడవి జాతి బిడ్డల కథలే…!! జయధీర్‌ తిరుమలరావు, వంశీకృష్ణ, వంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల గీటురాళ్ల వంటి ఆప్త వాక్యాలు అదనపు ఆకర్షణగల ఈ కథా సంకలనం నిజంగా తెలుగు కథ సాహిత్యంలో వెలువడ్డ తొలి గిరిజన కథా సంకలనంగా చెప్పవచ్చును. బోయ జంగయ్య వ్రాసిన ‘‘ఇప్ప పూలు’’ కథ నే శీర్షికగా ఎంచుకున్న ఈ కథా సంకలనంలోని ప్రతి కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. లంబాడా గిరిజన కుటుం బాలలో పేదరికం వల్ల, పుట్టిన ఆడపిల్లల సంతానాన్ని డబ్బులకు అమ్ముకుంటున్న దీన పరిస్థితులకు అక్షర రూపం అయిన ‘‘ఇప్ప పూలు’’ కథలో ఇప్ప సారా తయారు చేయడం కుటీర పరిశ్రమగా చెబుతూ పోలీసులు ఆ నెపంతో లంబాడా సామాజిక వర్గం వారిని శారీరకంగా ఆర్థికంగా ఎలా దోచు కుంటున్నారో కూడా ఈ కథలో మరో కోణం ద్వారా చూపించారు. ముందు తరం గిరిజన కథకుడు గూడూరు రాజేంద్ర రావు మొదలు నేటితరం యువ గిరిజన కథకుడు రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ వరకు 40మంది కథకుల నవ్య కథా రీతులు ఇందులో మనం చదవవచ్చు. బహు విశేషాల వేదిక అయిన ఈ కథల పందిరిలో ప్రజావాగ్గేయ కారుడు పాటల పోరు బిడ్డ వంగపండు ప్రసాదరావు వ్రాసిన కథ కూడా ఉండటం మరో విశేషం!! ‘‘వంగపండు’’ అంటే పాట గాడు గానే అందరికీ తెలుసు, కానీ అతనిలోని అద్భుతమైన కథకుడిని ఆవిష్క రించింది ఆయన వ్రాసిన ‘‘కొండ పందికొక్కు’’ కథ, అమాయకపు అడవి బిడ్డలు వ్యాపారస్తుల మోసాలకు ఎలా బలి అవుతున్నారో తెలుపుతూ తద్వారా ఉద్య మాలవైపు, సంఘాల వైపు, గిరిజనులు మొగ్గు చూపుతున్న తీరు గురించి తనదైన ఉద్యమ శైలిలో ఈ కథను వంగపండు వ్రాశారు. ఇక గిరిజన రచయితలైన మల్లి పురం జగదీష్‌,భూక్యా తిరుపతి,పద్దం అనసూయ,రమేష్‌ కార్తీక్‌ నాయక్‌,తిమ్మక రాంప్రసాద్‌, వంటి వారి కథలు ఈ సంపుటికి మరింత ప్రత్యేకతను అందించాయి ఈ ఐదు కథలు గిరిజన సంస్కృతిసాంప్రదాయాలు ప్రధాన భూమికగా చెప్పబడ్డాయి. భూక్య తిరుపతి ‘‘కాక్లా’’ కథలో లంబాడా సామాజిక వర్గంలో గల కాకుల కలయికతో ముడిబడ్డ ఒక అపనమ్మకాన్ని వారు సంప్రదాయంగా ఎలా కొనసాగిస్తున్నారో చెబుతారు.మల్లిపురం తన ‘‘దారి’’ కథలో అడవి బిడ్డల రోజువారి దినచర్యలను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తూనే ఆదివాసులు ఐక మత్యంతో తమను మోసగిం చిన తమ ప్రాంతపు అధికారిపై ఎలా ఎదురు తిరిగారో ఆవిష్కరిం చారు.ఇక చావు నేపథ్యం లో కథలు వ్రాసి తనదైన ప్రత్యేకతను చాటు కున్న ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన ‘‘మూగ బోయిన శబ్దం’’ కథలో గిరిజన జన జాతి అన్యమత ఊబిలో ఎలా కూరుకుపోతున్నదో చక్కగా వివరించారు, సంస్కృతి సాంప్రదా యాలపై అన్యమత దాడి గురించి ఈ కథలో ఆలోచనత్మకంగా చెప్పారు.
‘‘ప్రాచీన పురుడు’’ తీరు గురించి సందేశాత్మకంగా ఆవిష్కరించిన మరో గిరిజన కథారచయిత రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ రాసిన కథ ‘‘పురుడు’’,పాత్రోచితమైన సంభాషణ తీరు దీనిలో మనకు ఆవిష్కరించబడిరది ఇదే తీరుకు తార్కాణకంగా నిలిచే మరో కథ ‘‘పిన్లకర్ర’’ గిరిజన యువత పట్టణాలపై మోజుతో అక్కడకు చేరి తమ చక్కని సంస్కృతితో పాటు విలువైన ఆరోగ్యాలను ఎలా కోల్పోతున్నారో.. ఈ కథ కళ్ళకు కట్టింది.మొత్తానికి ఈ కథా సంకలనంలో 40కథలు వ్రాయబడ్డ కాలాల రీత్యా 50సంవత్సరాల నిడివి ఉంది ఈ ఐదు దశాబ్దాల నడుమ అనేక ఆధునిక మార్పులు వచ్చి చేరాయి కానీ గిరిజన జీవన విధానంలో వారి అణిచివేతలు, దోపిడి, ఆధిపత్యం, తదితర మోసాల్లో మాత్రం తేడా రాలేదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు లోబడే వారి మీద అన్యాయాలు అక్రమాలు రూపాం తరం చెందాయి.ప్రాంతాలవారీగా విభజించ బడ్డ,ఈగిరిజన కథలసమాహారం లోని కథల తీరు గమనిస్తే,..ఆస్తులు అంతస్తులు కాదు పీడన,దోపిడి కూడా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ అదో గొలుసు వలయమై నిరంతరం కొనసాగుతుంది, కానీ దానిని ఎక్కడో ఒక చోట ఛేదించి నియం త్రించాలి, లేకపోతే భవిష్యత్తులో ఈ ఆదిమ తెగల మనుగడకు భారీ ప్రమాదం ఏర్పడి మహా ఉత్పాతం కలగవచ్చు, దాని నుంచి రక్షించే దిశగా సాగుతున్నదే ఈఅక్షర చైతన్య కథాయాత్ర. తరాలు మారిన తలరాతలు మారని గిరిజన స్త్రీల స్థితిగతులు, ఆందోళన కలిగిస్తున్న తీరును ఈ గిరిజన సంచార జాతుల కథాసంకలనం ఆవిష్కరించింది. గిరిజన హక్కులు మానవ హక్కులే అని ఎలుగెత్తి చాటిన ‘‘పోరాటశీలి’’బాలగోపాల్‌,స్మృతిగా ఈ ‘‘ఇప్ప పూలు’’ కథా సంకలనం ప్రచురించిన సంపా దకులు ప్రచురణకర్త జీవన్‌ గారికి అభినందనీయులు.అడవి బిడ్డలతో పాటు అణగారిన వర్గపు సంచార తెగల బతుకుల వెతలు కూడా ఇందులో మనం చదవవచ్చు, పెద్దింటి అశోక్‌ కుమార్‌,బిఎస్‌ రాములు, ఏ.విద్యాసాగర్‌, బోయ జంగయ్య, జాతశ్రీ, అల్లంరాజయ్య, అట్టాడ,గంటేడ వంటి లబ్దప్రతిష్టలైన వారి కథల్లోని భావ సొగసులతో పాటు వర్ధమాన కథా శీలురైన డా:జడా సుబ్బా రావు,బాల సుధాకర్‌ మౌళి,ఆప్త చైతన్య,ల ఆధునిక కథన రీతులు ఈ కథా సంకలనంలో మనం గమనించవచ్చు.బహురుచుల విందు భోజనంలా బహుముఖీయమైన కథల సమా హారం ఇది,కథ ప్రియులకే కాక పరిశోధక విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శి వంటి అపురూప కథా పేటిక, ఇదో చారిత్రక దీపిక.

తెలంగాణ గిరిజనులు`భాషా సాహిత్యాలు

గిరిజన భాష అనగానే అది ఒక ఆదిమ భాష లిపిలేని మౌకిక సాహిత్యానికే పరిమి తమైన పేద భాషగా చెప్పుకుంటాం కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పులు, విద్యాసాయంగా గిరిజన యువతలో పెరిగిన ఆలోచన తద్వారా గిరిజన జన జాతికి చెందినవారు విశ్వవిద్యాలయ స్థాయి విద్యలు పూర్తిచేసుకుని తమలోని పరిశోధన శక్తిని వెలికి తీసుకుని, తమ జాతి భాషా సంస్కృతుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న శుభ సమయం ఇది.
దీనికి తోడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద యం తరువాత తెలంగాణ సాహితీ సంస్కృతుల గురించి జరుగుతున్న ప్రత్యేక అధ్యయనాలలో భాగంగా రాష్ట్రంలోని రచ యితలు,విద్యావేత్తలు,విద్యాలయాలు సంస్థలు విశ్వవిద్యాలయాలు తెలంగాణ భాషా సంస్కృతల వికాసమే లక్ష్యంగా కృషి ప్రారంభించాయి.అందులో భాగంగానే 2015లో నాటి ఆంధ్ర సారస్వర పరిషత్‌ అయిన నేటి తెలంగాణ సారస్వత పరిషత్‌ తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాషా సాహిత్య వికాసం పనిలో భాగంగా‘‘తెలం గాణ గిరిజన భాషా సాహిత్యాలు’’అనే ఉపయుక్త గ్రంథం ప్రచురించింది. నాటి పది జిల్లాల తెలంగాణలో గల గిరిజన జాతులు వాటికి చెందిన ప్రజల భాషలు,వారి విశిష్ట జీవనశైలి గురించి విస్తృతంగా వివేచనాత్మకంగా చర్చించడం కోసం పరిషత్‌ ఒక సదస్సు ఏర్పాటు చేసి పరిణితి గల భాష సంస్కృతుల వికాసం కోసం సుదీర్ఘ కాలంగా కృషి చేస్తున్న భాషా సేవకులను వక్తలుగా ఆహ్వానిం చింది.వీరితోపాటు గిరిజన భాష సాహిత్యాల గురించి విభిన్నమైన కోణాల్లో పరిశోధనలు చేసిన వారు చేస్తున్నవారు ఈభాషా సదస్సులో పాల్గొని వారి వారి విలువైన అభిప్రాయాలు అనుభవాలు ప్రసంగ వ్యాసాలు ద్వారా అందించారు, వాటి అన్నిటిని అమూల్యమైన గ్రంథంగా వెలువరించారు.నాటి సంస్థ అధ్యక్షులు డా: సినారె.ప్రధాన కార్యదర్శిడా:జె.చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈపుస్తకం వెలువడిరది. తెలంగాణలోని వివిధ గిరిజనభాషల వైలక్ష్యాన్ని ఇందులో వ్యాసాలు ప్రతి భావంతంగా ఆవిష్కరించాయి అనడంలో అక్షర సత్యం ఉంది.దీనిలో మొత్తం 30 అంశాల గురించి 30మంది నిష్ణాతులైన వ్యాస రచయితలు అందించిన వ్యాసాలు ఇందులో నిక్షిప్తం చేయబడ్డాయి. తెలంగాణలోగల గిరిజనజాతి వారైనా గోండులు,ప్రధాన్‌లు,బంజారాలు, కొండరెడ్లు,ఆంధ్‌లు,కోయలు,ఎరుకల, యానాదులకు సంబంధించిన భాషలు సంస్కృతులు సామెతలు పొడుపు కథలు, జాతీయాలు,అలంకారాలు,గేయ సాహి త్యం,అంశాల గురించి కూలంకుశమైన చర్చలు విశ్లేషణలు ఈవ్యాసాల్లో మనకు కనిపిస్తాయి.ప్రాంతాలవారీగా విస్తరించి నివసిస్తున్న గిరిజన జాతుల గురించి ఆయా వ్యాసకర్తలు వివరించారు,సోయం భీంరావు,‘‘గోండి భాష సాహిత్యాలు’’అనే అంశం గురించి వ్రాసిన సుదీర్ఘ వ్యాసంలో గోండిభాష గురించిన సంపూర్ణ విశ్లేషణ చేస్తూ తరతరాలుగా అంతరించిపోతున్న గోండు భాష గురించి చెబుతూ…65 సంవత్సరాలు పైబడ్డ గోండుగిరిజనులు తమ మాతృభాషను స్వచ్ఛంగా అధికంగా మాట్లాడుతున్నారని,15-20సంవత్సరాల మధ్యవారంత తమసంభాషణల్లో ఆంగ్లం, హిందీ,తెలుగు,భాషలపదాలు కలగలిపి మాట్లాడుతూ తమదైన గోండు మాతృ భాషను నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.
అలాగే ఆధునిక పద్ధతుల్లో గోండిభాష విస్తరిస్తున్న తీరు కూడా వివరించారు. ఇంటర్నెట్లో గోండిసాహిత్యం,సంగీతం, పాటలు,పొందుపరిచి విశ్వవ్యాప్తం చేసిన వైనం గురించి కూడా పేర్కొన్నారు. వార్తా పత్రికల ప్రచురణలో గోండిభాష పాత్రను వివరించారు.
గిరిజన జాతులు అన్నిటిలోనూ ఉన్నతమైన గోండు జాతికి 17,18వశతాబ్ధాంల్లోనే లిపి ఉన్నట్టు చెబుతూ గోండు లిపి చదివిన పెందోర్‌లింగోజి,ఆత్రంరాంజీ, ఆత్రం మాన్కు,కోట్నకజంగు,ఆత్రం కమ లాబాయి,అనే మూడు తరాలకు చెందిన వ్యక్తులపేర్లు పేర్కొన్నారు.
గుండు భాషలోని పాటలు గోండిభాష మాట్లాడే ప్రాంతాలతో పాటు భాషాప రమైనవ్యాకరణం నామాచకాలు కొలతలు చెట్లు,గృహోపపకరణలు వంటి వాటికి తెలుగు అనువాదాలతో కలిపి వివరణలు ఇచ్చారు.
‘‘తెలంగాణ గిరిజనభాషా సాహిత్యాలు’’ అనే అంశం గురించి ‘‘పసుల బుచ్చయ్య’’ రాసిన మరో సుదీర్ఘ వ్యాసంలో నాయక పోడు గిరిజన తెగకు సంబంధించిన భాషా సాహిత్యాల గురించి సుదీర్ఘ వివరణ చారిత్రక ఆధారాలతో అందించబడిరది. గిరిజన తెగల్లోనే ఒక విశిష్టమైన ‘‘ఎరుకల’’జనజాతి గురించి కె.వివేక్‌ వినా యక్‌ రాసిన ఆంగ్ల వ్యాసం,పరిశోధక విద్యార్థిని బి.భీమమ్మ వ్రాసిన‘‘ఎరుకల వారి సంస్కృతి సాహిత్యం’’అనే వ్యాసం ఎరుకల సాహిత్యం భాషల గురించి తెలియజేశాయి.
ఇక కొండ రెడ్ల గురించి వారి జీవన విధానం నివాసం,ఆహారం,పండుగలు, తదితర సాధారణ విషయాలు తప్ప సాహి త్యం భాషల జోలికి పోలేదు. గోండుల తర్వాత అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్న వలస గిరిజన జనజాతి అయిన ‘‘బంజా రాలకు’’సంబంధించి దీనిలో అనేక విషయాలు చర్చించబడ్డాయి. బంజారా భాషలో అలంకారాలు, సామెతలు,పొడుపుకథలు,గేయసాహిత్యం, బంజారాభాషా స్వరూపం వైశిష్యం సంస్కృతి సాహిత్యం ప్రపంచీకరణలో మాయమవుతున్న బంజారా సంస్కృతి, తెలుగు బోధన భాషవల్ల బంజారా విద్యా ర్థుల సమస్యలు,తదితరాల గురించి అధిక వ్యాసాలు అగ్రస్థానంలో నిలిచాయి. వీటితోపాటు తెలంగాణ కథా సాహి త్యంలో గిరిజన స్త్రీ,తెలంగాణసాహిత్యం గిరిజనజీవితం,కొండాకోనల్లో కనిపించిన కోయ జీవితం,అనేవ్యాసాల ద్వారా తెలంగాణ తెలుగుసాహిత్యంలోగల నవలలు,కథల్లో గిరిజనులస్థానం గురించి పరిశోధనాత్మకంగావివరించడం జరిగింది. అన్ని గిరిజన జనజాతులకు సంబంధించి ఒకే ఒక సమస్య ఆభాషకు లిపి లేక పోవడం ఉన్నకొద్ది మాత్రంది కార్య క్రమంలో అంతరించిపోవడం ఈప్రధాన విషయాల గుండానే ఈ30వ్యాసాల పరిశ్రమ కొనసాగింది.
తెలంగాణ గిరిజన భాషాసాహిత్యాలపై పరిశోధన చేసే వారికి ఈగ్రంథం చక్కని దారిదీపంగా ఉంటుందని చెప్పవచ్చు మనకు గల అతితక్కువ తెలుగు గిరిజన భాషా సాహిత్య గ్రంథాలలో ఇది అత్యంత ఉన్నతమైనదిగా పేర్కొన వచ్చు.
చక్కటి పరిశోధనాత్మకమైన కృషితో సదస్సు నిర్వహించడమే కాక దాన్ని అంతటిని అక్షరబంధం చేసి గ్రంథరూపం తీసుకు రావడంలో తెలంగాణ సారసత పరిషత్‌ కృషి అభినందనీయం ఆచరణీయం, రేఖామాత్రంగా గల ఈఅంశాలు భవిష్య త్తులో మరింత కూలంకషంగా వివరణ తీసుకురావడమే కాక భాషా శాస్త్రవేత్తలు త్వరలోనే ఈఆదిమ భాషలకు లిపిని తయారు చేయడంలో సఫలీకృతులు కావాలని కోరుకుందాం.
డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

ఆదివాసీ జీవనం విధ్వంసం

సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులుగా, అడవుల సంరక్షకులుగా వాసికెక్కిన వనవాసుల జీవనం ఆధునికులకు ఆశ్చర్యంగా ఉన్న అసలైన మానవ సంస్కృతి వారి వద్దేఉంది అన్నది వంద శాతం నిజం.అటువంటి అడవి బిడ్డల జీవన సంస్కృతుల గురించి ఇంతకాలం వారిని పరిశీలించిన దగ్గరగా జీవించిన వారే వ్రాయడం చూసాం చదివాం కానీ 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక మార్పుల్లో భాగంగా అడవి బిడ్డల్లో అక్షరాస్యత విరివిగా పెరగడంతో వీధి బడి చదువులో నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి ఆదివాసుల చదువులు ఎదిగాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడువాయి మండలం కామారం గిరిజన గ్రామానికి చెందిన మైపతిఅరుణ్‌ కుమార్‌ అనే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి తన గిరిజన జన జాతికి చెందిన జీవనం గురించి,దాని విధ్వంసం గురించి కూలం కశమైన గ్రంథం వ్రాశారు. ఒక గిరిజన యువకుడు అందున పోరాట నాయకుడు, అయిన అరుణ్‌ కుమార్‌ ఈ రచన చేయడానికి 2012లో సుమారు నెలరోజుల పాటు 5848 కిలోమీటర్ల దూరం పర్యటించి తెలుగు ప్రాంతాలే కాక పక్క రాష్ట్రాల్లోని గిరిజన గ్రామాలను సందర్శించి స్థానిక చరిత్రలతో పాటు అక్కడి భౌగోళికత, గిరిజనజీవన స్థితి గతులు, ఆధునిక ప్రపంచీకరణ ద్వారా ఆదివాసులకు జరుగుతున్న నష్టాలు, భావితరం తీసుకోవలసిన జాగ్రత్తలు, గురించి, సవివరంగా సచిత్రంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.502 పేజీలు గల ఈ బృహత్తర రచనను 30 అధ్యాయాలుగా విభజించారు, ఆదివాసి స్వయం పాలన ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌ రావు గారికి అంకితం ఇవ్వబడ్డ ఈ గ్రంథం నాటి వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యం, మొదలుకొని దేవాదుల ప్రాజెక్టు, కమలాపురం కాగిత పరిశ్రమ, అశ్వాపురంభార జల కర్మాగారం, భద్రాచలం పేపర్‌ బోర్డు, మొదలుకొని.. రంప రాజ్యం రంప పితూరి శ్రీకాకుళం గిరిజన ఉద్యమం దాని కారకుడు సత్యం మాస్టారు వాకపల్లి అమాను షత్వం, బొండా,భగత,గిరిజన జీవన విధానాలు మర్రి కొమరయ్య పోరాటం ఇలా అనేక విషయాలు ఇందులో వివరించబడ్డాయి. అలాగే నల్లమల చెంచుల జీవితాలు, చెంచుల చెరవిడిన శ్రీశైల క్షేత్రం, చెంచుల జీవావరణ వ్యవస్థ, ప్రమాదంలో చెంచుల మనుగడ, గురించి కూడా ఇందులో హెచ్చరించారు రచయిత, ఇక ఆదిలాబాద్‌ గుండులు తొలి పోరాటయోధుడు రాంజీ గోండు,కేస్లాపూర్‌ నాగోబా జాతర,బాసర క్షేత్రం,గోండ్వానా రాజ్య పాలన చరిత్రతో పాటు గోండుల ఆరాధ్య దైవం హైమన్‌ డార్ప్‌,గుస్సాడి నృత్యం, తదితర జగద్వితమైన విషయాలను భిన్నకోణాల్లో క్షేత్ర పర్యటనల అనుభవసారం జోడిరచి, అనేక ప్రామాణిక విషయాలు, విశేషాలతో ఈరచన చేయబడిరది,
గిరిజన ప్రాంతాలలోని వాస్తవాలతో పాటు, చరిత్ర, గణాంకాలు, చిత్రపటాలతో ఈ బృహత్తర గ్రంథం పరిపూర్ణ ప్రామాణికత సాధించింది అనడంలో అతిశయం అనిపించదు.
రచన శైలి కూడా సరళమైన బాణీలో ఉండి పాఠకులకు అనుకూలంగా చదివించే విధంగా ఉంది.
అచ్చమైన ఆదివాసి జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర పూర్వకథ తోపాటు పూజా విధానాలు వారి ఆచారాల ప్రకారం ఎలా చేస్తారు వివరిస్తూ నీటి ఆధునిక సమాజం గిరిజన ఇతరులు జాతరను హస్తగతం చేసుకుని అసలు సాంప్రదాయాన్ని ఎలా కనుమరుగు చేస్తున్నారో చెబుతూ రచయిత అరుణ్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్వంచ అటవీ ప్రాం తానికి చెందిన గిరిజన పోరాట యోధుడు, చరిత్ర విస్మరించిన వీరుడు, అయిన ‘‘సోయం గంగులు’’ పోరాటతీరు అమరుడైన వైనం, గురించి ఇందులో పేర్కొనడం ద్వారా రచయిత అరుణ్‌ లోని సూక్ష్మ పరిశీలన, పరిశోధన దృష్టి అర్థమవుతుంది, ఇలా వ్యక్తులే కాకుండా ప్రాంతాలు ఆచారాలు, ఆహారాలు, పండుగలు, మొదలైన అనేక విషయాలు, విశేషాలు, గురించి భిన్నకోణంలో ఇందులో వ్యక్తీకరించబడి తద్వారా అనేక నూతన విషయాలు సంఘటనలు ఆవిష్క రించ బడ్డాయి.కేవలం గిరిజన ప్రాంతాల్లో ప్రపంచీకరణ సాయంగా జరుగుతున్న యుద్ధం, గురించి విమర్శించి వదిలేయలేదు, కానీ నిలుపుదలకు తీసుకోవలసిన చర్యలు చట్టాలు అమలుకు తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి కూడా నిర్మొహమాటంగా వివరించి జాగృతంతో కూడిన హెచ్చరికలు చేశారు రచయిత.
ఒక గ్రామాన్ని షెడ్యూల్‌ ఏరియాగా గుర్తించడానికి ఉండాల్సిన అర్హతలు గురించి చెబుతూ ప్రధాన లక్షణాలైనా అధిక శాతం ఆదివాసీలు ఉండటం,
ఆ గ్రామ అభివృద్ధి స్థాయి,ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటందుకు గల విస్తీర్ణం,వంటి ప్రాథమిక మార్గదర్శకాలు ఇందులో చెప్పారు, అలాగే చాలా గిరిజన గ్రామాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా షెడ్యూల్‌ గ్రామాలుగా ఎంపిక చేయబడక, అక్కడ గిరిజనులు అయిదవ షెడ్యూల్‌ హక్కులు ఎలా కోల్పోయి నష్టపోతున్నారో కూడా ఇందులో వివరించారు.
వాకపల్లి అడవితల్లి ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం, భూపతిపాలెం ప్రాజెక్టు, కన్నెధార గ్రానైట్‌ పరిశ్రమ వల్ల అక్కడి ఆదివాసీల జీవనానికి వాటిల్లుతున్న ముప్పు,
గుర్తు చేస్తూనే శ్రీకాకుళం ప్రాంత సవర గిరిజనుల నృత్యాలు, ఆచారాలు, తో పాటు వారి ఉన్నతికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి గురించి కూడా గుర్తు చేశారు.
అలాగే ఆదిలాబాద్‌ ప్రాంతానికే వన్నెతెస్తున్న ‘‘కుంటాల జలపాతం’’ ఎలా కనుమరుగు కాబోతున్నదో కూడా చెబుతూ ఇది శకుంతల దుష్యంతుల విహార కేంద్రమని, మొదట దీనిని ‘‘శకుంతల జలపాతం’’గా పిలిచేవారని కాలక్రమంలో ‘కుంటాల’గా రూపాంతరం చెందిందనే చారిత్రిక విషయాలను కూడా ఇందులో వివరించారు.
అదేవిధంగా కొమరం భీమ్‌ పోరాట క్షేత్రం జోడేఘాట్‌ గురించి, పోరాటం యొక్క నేపథ్యం గురించి కూడా ఆసక్తికర విషయాలు విశేషాలు ఇందులో పొందుపరిచారు.
గోండుల గుస్సాడి గురించి, నాగోబా జాతర నేపథ్యం వివరాలు ఇలా… ప్రసిద్ధ, అప్రసిద్ధ అనే తేడా లేకుండా సంపూర్ణ గిరిజన సమాచారం వెలికి తీసి అక్షరీకరణ చేయడమే లక్ష్యంగా అరుణ్‌ కుమార్‌ అక్షర కృషి కొన సాగింది అనడానికి నిండు నిదర్శనం ఈ బృహత్తర పుస్తకం.
ఆదివాసి జీవనం గురించి తెలుసుకోవాలి అనుకునే పాఠకులే కాదు, గిరిజన విజ్ఞాన పరిశోధకులు విధిగా చదివి తీరాల్సిన ఉత్తమ పొత్తం ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

స్వీయ అనుభూతి గురి

నేటితరం గిరిజనసాహిత్యంకు ప్రామాణికతను పెంపొందించే దిశగా జరుగుతున్న కృషిలో భాగంగా…’’వర్తమాన గిరిజన సమాజానికి కావలసింది సానుభూతి సాహిత్యం కాదు సహను భూతి సాహిత్యం’’ అని ఘంటాపధం గా చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తున్న నేటి కాలపు బంగారు భవిత కలిగిన రచయిత నేటి తరం యువతరానికి ఆదర్శనీయుడు ‘‘మల్లిపురం జగదీశ్‌’’ మలి కథా సంపుటి ‘‘గురి’’,2013 నుంచి 2018సం: మధ్యకాలంలో రాయబడ్డ ఈ 13 కథల్లో.. ఉత్తరాంధ్ర ప్రాంతపు గిరిజన సమాజం ప్రపంచీకరణ పడగ నీడన ఎలా విలవిలలాడుతుందో కళ్ళకు కట్టినట్టు అక్షర బద్ధం చేశారు.
అయితే ఈ వ్యధలు కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు యావత్తుదేశానిదికూడ…!! రచయిత తను స్వయంగా సవిచూసిన విషయాలను అక్షరబద్ధం చేసే బాధ్యతలో భాగంగా తనదైన కథా శైలిలో అభివ్యక్తీకరించారు, దీనిలో ప్రతి కథ తన గిరిజన సామాజిక కుటుంబాల చుట్టూ పరిభ్రమిస్తుంది.
మానవ సంబంధాలు అన్ని ‘‘మనీ సంబంధాలు’’గా రూపాంతరం చెందుతున్న క్లిష్ట పరిస్థితుల్లో.. అడవి బిడ్డల మునుగుట ప్రశ్నార్థకం అయిపోతున్న కాలంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం గురించి వివరిస్తూ జాగృతం చేసే లక్ష్యంతో వ్రాయబడ్డ కథలుగా కనిపిస్తాయి ఇవన్నీ.
అన్ని మార్గాల ద్వారా దాడికి గురి అవుతున్న అడవి బిడ్డల దయనీయ స్థితిని అద్దం పడుతున్న ఈ ‘‘గురి’’ కథాగుచ్చంలోని పతాక శీర్షిక అయిన కథ విషయానికొస్తే తరతరాలుగా ఆదివాసి బిడ్డలపై జరుగుతున్న అరాచకాలు దరిమిలా అడవి బిడ్డల్లో వస్తున్న తిరుగుబాటు తత్వం గురించి అక్షరీకరించిన కథ ‘‘గురి’’ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆదివాసి బిడ్డల జీవితాలపై పెట్టుబడిదారీ వ్యవస్థ సాగిస్తున్న అణచివేత ధోరణి తీరు ఆధునిక పాఠక లోకానికి ఆశ్చర్యం కలిగించక మానదు, ఆధునిక కాలంతో పాటు అడవి బిడ్డల బ్రతుకు చిత్రాల్లో ఆధునిక జీవన సరళి అగుపిస్తున్న అణచివేత కూడా అదే స్థాయిలో ఆధునిక పంథాల్లో సాగటం పట్ల రచయితతో పాటు పాఠకులు ఆగ్రహించి నివారణోపాయాలు గురించి ఆలోచించాల్సిన తరుణమిది.గురి కథలు మంగులు అతని కొడుకు సత్యం ఏవిధంగా పెత్తందారులైన భూస్వాముల అరాచకాలకు బలి అయ్యారో మల్లిపురం జగదీశ్‌ తనదైన కథన శైలిలో కళ్లకు కట్టారు. మంగులు,సత్యం తండ్రి కొడుకులు ఇద్దరి కథనాల్లోనూ సంఘవిద్రోహక శక్తులుగా భావించబడుతున్న నక్సలైట్ల పాత్రను కథా రచయిత భావ గర్భితంగా సూచించారు, వారివల్ల అడవి బిడ్డలకు మేలా? కీడా?? అనే విషయాన్ని కాలానికి వదిలివేసిన, తల్లి తండ్రి అన్యాయాలకు బలై అనాధ అయిన సత్యం బ్రతుకుతెరువు కోసం పట్టణం తరలి పోయిన అతని పోరాట దృక్పథంలో మార్పు రాలేదు సరి కదా అది వారసత్వంగా తన కూతురు గీతకు ఆపాదించిన వైనం పోరాటస్ఫూర్తి, అందులోని సజీవత్వం ఆవిష్కరించబడతాయి. మహానటి సమాజంలో అక్రమాలను ఎదిరించిన తండ్రి మంగులు మంత్రగాడి నేరంతో సమా జానికి దూరం చేయబడితే నీటి కాలానికి చెందిన అతడి కొడుకు సత్యం తండ్రిలో ధనవంతులు అన్యాయాన్ని ఎదిరించి ఇన్ఫార్మర్‌ గా నేరం మోపబడతాడు అక్కడ సత్యం తప్పించుకుని నగరం బాట పడితే ఇక్కడ అతని కూతురు గీత తండ్రికి జరిగిన అన్యాయానికి ఎదురునిలిచి గురి పెట్టడం ద్వారా రచయిత గిరిజన సమాజానికి స్ఫూర్తిని ధైర్యాన్ని అందిస్తూ కథను ఉత్తమ కథా లక్షణాలతో ముగిస్తారు. బిడ్డల కష్టాల గురించి కథా రచయిత పరిశీ లించిన తీరు కోణాలు ఔరా అనిపిస్తాయి.’’ నిత్య నిర్వాసితులు’’ కథలో ప్రభుత్వ అధికారులు వారికి గల నియమాలను బూచిగా చూపిస్తూ అమాయకులైన ఆదివాసి జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో వివరిస్తారు. ముఖ్యంగా ప్రాజెక్టులవంటి బహుళార్థక కట్టడాలకు మొదట బలయ్యేది అడవి బిడ్డలే !! పాలకులు ప్రాజెక్టుల ద్వారా పంట భూములు విస్తీర్ణం పెంచుకొని నీటి సౌకర్యం పెంచుతు న్నామని ఏక కోణం ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ఎప్పటినుంచో ఆ గ్రామాల మీద ఆధారపడి జీవిస్తున్న అడవి బిడ్డల జీవి తాలు నిత్యనిర్వాసితం అయిపోతున్నాయనే మానవత్వపు ఆలోచనలు మన అధికారులకు కానీ పాలకులకు కానీరాకపోవడంపై రచయిత తీవ్ర విముఖత వ్యక్తం చేశారు ఈ కథలో. పెల్లివలస అనే గిరిజన గ్రామం ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వలసరాగ దురదృష్టవశాత్తు ఆ గ్రామం అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయింది దానికి కేవలం తత్కాలిక తిండిగిం జలు పంపిణీ సాయంతో సరిపెట్టారు అధికా రులు,అది రెవెన్యూ గ్రామంగా గుర్తింపు కాలేదు కనుక పక్కా గృహాలు మంజూరు చేయలేమన్న అధికారుల అలసత్వం ఈ కథలో చూపించారు రచయిత. నిర్వాసిత గ్రామంలో ప్రకటించ డంలో అధికారులు చేసిన అలసత్వంవల్ల అమాయకులైన ఆదివాసీలు ఎలా నష్టపోయారో ఉదాహరిస్తూ ఇలాంటి చేయని నేరాలకు ఎలా శిక్షలు అనుభవిస్తున్నారో రచయిత ఇందులో వివరించిన వైనం హృద్యంగా సాగుతుంది, ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు అన్నట్టు ఇవి కతలు కావు ఆదివాసి వెతలు, అడవుల్లో జరుగుతున్న అభివృద్ధి ఆధునీకరణల వల్ల అడవి బిడ్డలకు దక్కే ఫలా లు గోరంత అయితే పెట్టుబడిదారులకు కొం డంత ఆదాయం దక్కుతుంది అనే వాస్తవ విష యాలు చెప్పడంలో రచయిత మల్లిపురం గారు విజయం సాధించారు. యుగయుగాలుగా అభి వృద్ధి యజ్ఞంలో మొదట బలయ్యే’’బలిపశువు’’ ఆదివాసినినే అన్న రచయిత భావనలో నిండు నిజాం దాగి ఉంది. అలాగే ఆదివాసీ లకు ఆరోగ్య రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు నగరా లను ఎంత అభివృద్ధి చేస్తే ఏమిటి అని ‘‘డోలి’’ కథలో రచయిత ప్రశ్నిస్తారు, అడవి బిడ్డల్లో వస్తువ్యామోహం పెంచి అధిక లాభాలతో వారిని అప్పుల పాలు చేస్తున్న నాగరిక వ్యాపా రుల తీరును ఎండగట్టిన తార్రోడ్డు కథ, భూ విముక్తి పోరాటంలో పాల్గొన్న ఆదివాసీలు చివరికి భూమిని పోగొట్టు కున్న వైనాన్ని ధైన్యం గా చూపించిన కథ ‘‘తాండ్ర చుట్ట’’. సభ్య సమాజానికి తెలియని అడవి బిడ్డల ఆగచాట్లు ఎన్నో ఈ ‘‘గురి’’ కథా సంపుటిలో కనిపిస్తాయి, ఈ కథల్లో ఇంత ఘాడతకు కారణం రచయిత ఓగిరి పుత్రుడు కావడమే, అతడు గిరిజనుల ను చూసి రాసిన కథలుకావు, వారితో మమేకమై వ్రాసిన కథలు నిజమైన గిరిజన కథలకు నిల యమైన మన మల్లి పురం జగదీశ్‌ కథలు ప్రతి ఒక్కరికి అవసరం, గిరిజన జీవితాల పరిశో ధకులు ప్రత్యేకించి చదవదగ్గది –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

విశాఖలో సి ఎం పర్యటన 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిభ కలిగిన యువ క్రికెటర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం ఉంటుందని, అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క రోజు పర్యటన నిమిత్తం గురువారం విశాఖపట్టణం చేరుకున్న ఆయన పోతిన మల్లయ్యపాలెం డా.వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా స్టేడియం ముందరి భాగంలో ఏర్పాటు చేసిన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టేడియం లోపల ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని యువ క్రీడాకారలు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, విశాఖపట్టణం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ముందుగా క్రికెట్ క్రీడా చారిత్రాత్మక విశేషాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన కె. అంజలి శర్వాణి, అండర్ -19 విభాగంలో ప్రాతినిధ్యం వహించిన శబనంకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు. మెడల్స్తో సత్కరించి అభినందించారు. ఈ క్రమంలో అక్కడకు విచ్చేసిన సుమారు 100 మంది యువ క్రీడాకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేసి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడాకారులు మరింత మంది తయారయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తగిన ప్రణాళికలు రచించి ముందుకు వెళుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు అన్ని విధాలుగా సహకారం లభిస్తుందని అన్నారు. శక్తి సామర్థ్యాలు ఉండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి తగిన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రిని రాష్ట్ర ఉపాధ్యక్షులు రోహిత్ రెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాకేష్, సిఈఓ వెంకట శివారెడ్డి, ట్రెజరర్ చలం పురుషోత్తం తదితరులు దుశ్శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బివి సత్యవతి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ, ప్రభుత్వ విప్ లు కరణం ధర్మశ్రీ, కోరుముట్ల శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజ్, రెడ్డి శాంతి, వివిధ కార్పొరేషన్ అధ్యక్షులు కెకె రాజు, ఓబుల్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేతలకు ముఖ్యమంత్రి ఆత్మీయ పలకరింపు
పర్యటనలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వారిని ఆత్మీయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు- జి ఎన్ వి సతీష్ 

అడవి బిడ్డల ఆత్మి చిత్రం

ప్రతి రచయిత తన రచనలు వెలు వరించడానికి అనుభూతి లేదా ఆవేదన ఒక్కోసారి రెండు కావచ్చు అలా ఆవిర్భ వించిన రచనలకే పట్టుత్వం వుండి, పదికాలాల పాటు ప్రజల అక్షర హృదయాలలో నిలిచిపోతాయి. అలా కాక ఊహాత్మకత కోసమో. సానుభూతి కోసమో, సందర్భోచితమో అయిఉండి వ్రాసే రచనలకు బోలెడు బలహీనతలు ఉంటా యి.రచయిత డా.దిలావర్‌ ఉద్యోగ రీత్యా ఉపాధ్యాయుడు,ఉపన్యాసుడుగా…సుమారు పాతికేళ్లు అచ్చంగా అడవి బిడ్డల ఆవాసాల నడుమ జీవనం చేసిన అను భవం తాలూకు అనుభూతులతో రాయబడిరది ఈడజను కథల ‘కొండ కోనల్లో….’ కథా సంపుటి,దీనిలో ప్రతికథ ఓగిరిజన ప్రాంతం జీవన్మరణగోస, సమస్య చూస్తూ రాయకుండా ఉండలేనితనం రచ యితది.ఈ కథలు వెలువటానికి అది కూడా ఓకారణం!!.రచయిత డా:దినార్‌ విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడైన రచయిత,భిన్నమైన ప్రక్రియలు చేపట్టినా కథా రచయితగా చేయి తిరిగిన వ్యక్తి, 2014 సంవత్సరంలో వెలువరించిన ఈ కొండ కోనల్లో…కథా సంపుటిలోని కథలన్నీ గిరిజనుల జీవితాలకు, సాంఘిక పరిస్థితులకు అద్దంపడ తాయి. కారడివిలో కాంతికిరణం,పాటకు మరణం లేదు, వేట,తునికాకు,చెట్లు కూలుతున్న దృశ్యం,అరణ్య రోదన,కొండ కోనల్లో… మొదలైన కథలన్నీ గిరిజన జాతుల బతుకు చిత్రాలను నింపుకున్నాయి.ఈ కథల్లోనే ప్రాంతాలు పాత్రలపేర్లు అన్ని ఇలా స్వీయ పర్యటనలు అనుకోవాలి అలాగే కథల్లో వాడిన జాతీయాలు,సామెతలు, ఉపమా నాలు, అన్నీ అందమైన అటవీ వాతావరణం అన్వయించి రాయడం ద్వారా రచయితలోని పరిణితి అనుభవం తేటతెల్లం కావడంతో పాటు, సుందర శైలి ఆసక్తికర అధ్యయ నానికి ఆయువుగా నిలుస్తాయి.అసౌకర్యాలకు నిలయమైన అడవుల్లోని అడవి బిడ్డల జీవితాల్లో అన్ని చక్కగానే అనిపిస్తాయి, ఆరోగ్య సమస్యలు రవాణా సదుపాయాలు లేమి తప్ప.!! వీటి వల్లే అన్ని కాలాల్లో కన్నా ‘వానాకాలం’లో అధిక సంఖ్యలో అడవి బిడ్డలు అనారోగ్యాల పాలై సకాలంలో సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్న ‘అనారోగ్య సమస్యలు’ అడవుల్లో అంతటా అగుపిస్తాయి.ఈ నేప థ్యంలో సాగిన కథ ‘‘కారడివిలో కాంతి కిరణం’’ వెంకటాపురం మండలంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‌గా వచ్చి న కిరణ్‌ అనే యువ వైద్య విద్యార్థి తన కార్యదీక్షతో అక్కడి గిరిజనుల ఆలోచనలో ఎలాంటి ధైర్యాన్ని, మార్పును, పెంపొందించ గలిగాడో తెలిపిన కథ ‘‘కారడివి లో కాంతి కిరణం’’, పిల్లలైనా, అడవి బిడ్డలైన,ఉపన్యా సాలు విని ప్రేరణ పొంది మారరు, కేవలం ఆచరణా త్మకమైన కార్యాల ద్వారానే మార్పుకు దారులు వేయవచ్చు అని చెబుతారు ఈ కథ ద్వారా రచయిత దిలావర్‌. కొత్తగా డాక్టర్‌ ఉద్యోగంలో చేరిన కిరణ్‌ గిరిజన గుడాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆధునిక వైద్యం వైపు కాక పాత వైద్య విధానాలకు, పసరు వైద్యాలకు, వారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, చేతబడి, దేవర్ల పూనకాలను ఎందుకు నమ్ముతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథలో దొరుకుతాయి. ‘‘గిరిజనుల వద్దకే సర్కారు వైద్యం’’ అన్న నినాదం నీరుగారడానికి గల కారణాల్లో శాఖ పరమైన అవినీతి, ఉద్యోగుల్లో అలసత్వం, ప్రధానంగా చూపిస్తారు. గిరిజన గుడేల్లో ప్రభుత్వాలు ఆనాడు చేపట్టిన మొక్కుబడి వైద్య విధానాల వల్లే గిరిజనులు తమనాటు వైద్యాల నుంచి బయటపడలేక పోతున్నారనే సత్యాన్ని కూడా ధైర్యంగా చెబుతారు ఇందులో. కిరణ్‌ తనదైన అంకిత భావంతో చేసిన పనులు ముఖ్యంగా గిరిజనగుడేనికి చెందిన సారమ్మ అనే గిరిజన గర్బిణి నిండు వానాకాలంలో ప్రాణాపాయ పరిస్థితిల్లో నుండి గూడెం యువకుల సాయంతో ఆమెను వాగు దాటించి సరైన సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం అక్కడ తను పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం ఈ కథలోని సారం, ఆ గర్భి ణీని తనదైన ఆధునిక వైద్యం ద్వారా కిరణ్‌ ఎలా కాపాడాడో ప్రత్యక్షంగా చూసిన గిరిజనుల ఆలోచనల్లో మార్పు రావడమే ఈ కథకు ప్రాణప్రదమైన ముగింపు.కాయకష్టాలకు చిరునామాదారులైన గిరిజనులు సంఘటిత కార్మికులు కాదు, భరోసా లేని సాధారణ కూలీలే,!! వారి వారి పనుల్లో అటవీ ఉత్పత్తుల సేకరణ సమయాల్లో జరిగే ప్రమాదాలకు ఎందరో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న వైనం దానికి స్వార్థపరులైన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారుల కారణం గురించి రచయిత ‘‘తునికాకు’’ కథలో చక్కగా చెబుతూ అందరిలో ఆలోచన కలిగించారు. గిరిజనులకు కన్నతల్లి తర్వాత తల్లి వంటి అడవిని సంరక్షించుకోవడం వారి ఆచార సంప్రదాయాల్లో అంతర్భాగంగా మొదటి నుంచి వస్తుంది, కానీ ఆధునిక సమాజంలో అడుగడుగునా మోసులెత్తుతున్న అవినీతి, స్వార్థం, సాయంగా అంతరించిపోతున్న అడవులు తద్వారా దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యం, గురించి ఓ గిరిజన యువకుడి ఆవేదన సాయంగా కళ్ళకు కట్టారు ‘‘చెట్లు కూలుతున్న దృశ్యం’’ లో కథా రచయిత. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన చేసిన ‘‘తేజ’’ అనే యువకుడు తన భార్య ఉష ఇతర మిత్రుల కుటుం బాలతో భద్రాచలం – పాపికొండల విహారయాత్రకు వెళ్లిన వైనం విహార యాత్ర సంబంధంగా భార్య ఉషకు జాతీయ,అంతర్జాతీయంగా గిరిజనుల చరిత వారి జీవన విధానం గురించి సహేతు కంగా చెబుతూ…కొమరం భీము నుంచి నేటి తరం గిరిజన పోరాట వీరుల దయాగుణం గురించి చెబుతూ.. పాపి కొండలు, పేరంటాలపల్లి, తదితర స్థల ప్రాసస్థ్యాల గురించి రచయిత ఈకథలో చక్కగా వివరించారు. అంతేకాక భద్రా చలం ఆలయానికి రామదాసుకు, తూము నరసింహదాసుకు, ఇచ్చిన ప్రాధాన్యత రామ కథకు కారణభూతురాలు అయిన గిరిజన మహిళ శబరికి ఎందుకు ఈయలేదనే ధర్మసందేహంతో పాటు అనేక పాత్రల స్వభావాలను పరామర్శిస్తూ వ్రాసిన చక్కని చరిత్రాత్మక విషయాల మేళవింపు గల కథ ‘‘కొండకోనల్లో…..’’ ఇంత చక్కని ప్రాముఖ్యత గల ఈ ‘‘మన్య సీమ’’ పోలవరం ముంపుతో అంతర్థానం అయిపోయినట్టు కలగన్న తేజ మానసిక స్థితి గురించి తన భావాలు జోడిరచి ఎంతో హృద్యంగా చెబుతారు రచయిత. ఇంచుమించు అదే భావనతో వ్రాసిన ఆ ‘‘ఏడు మండలాలు’’ కథ, పోలీసుల దాష్టి కాలకు అమాయకపు గిరిజ నులు బలవుతున్న వైనం తెలిపే ‘‘పాటకు మరణం లేదు’’ మృగ్యమవుతున్న అటవీ సంపద గురించిన ‘‘వేట’’ ‘‘బొందల గడ్డ’’ తదితర కథలు వేటికవే భిన్నంగా ఉండి గిరిజన సంస్కృతి,అందాల అడవిని, అంతే అందంగా అక్షరీకరించారు రచయిత డా: దిలావర్‌ . కథల్లో ఉపయోగించిన భాష, వ్యాకరణాం శాలు, సంస్కృతి,తదితర అంశాల ద్వారా రచయిత యొక్క పరిశీలన గుణం,సంస్కృతి శైలి వెల్లడవుతాయి. మనిషి శరీరంలోని నరాల్లా అడవి దేహం నిండా అల్లిబిల్లిగా అల్లుకున్న కాలిబాటలు, వాగు పలుపు విడిచిన లేగ దూడలుగా…. సుడులు,సుడులు,తిరిగి ప్రవహిస్తుంది, వాగులు వంకలు ఎండిపోయి అస్తిపంజ రాల్ల పడిఉన్నాయి, వంటి ఉదాహ రణలు మచ్చుకు కొన్ని మాత్రమే…!! ఇలా ప్రతి అంశాల్లో, విశేషాలు, కల్పనలు, వెరసి ఈ కథా సంపుటం నిండా అచ్చమైన అడవి వాతావరణం ఆవిష్కరించబడిరది. సందర్బో Ûచితమైన సంభాషణ శైలి రచయిత యొక్క విధివిధానాల గుండా ఈ కథలను అధ్యయనం చేయడం ద్వారా చక్కని వైజ్ఞానిక, సామాజిక, సమాచారం అందుకోవచ్చు.
పుస్తకం :- కొండుకోనల్లో..- (ఆదివాసి కథలు)
పేజీలు:152, ధర:-100/-
రచయిత: డా: డిలావర్‌,
సెల్‌:986692329.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాస రాజు 7729883223.

1 2 3 5