భద్రచలం మన్నెంకతలు

తెలుగు సాహిత్యంలో గిరిజన సాహిత్య విభాగం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అటువంటి ప్రత్యేక స్థానం గల గిరిజన సాహిత్యాన్ని కథలు, కవితలు, వ్యాసాలు, పరిశోధనలతో ఎందరో మేధావులుసు సంపన్నం చేశారు. అటువంటి రచయితల్లో ఒక కథా రచయిత, ఆయన సాధారణ రచయిత మాత్రమే కాదు..పోటీ పరీక్షల్లో తెలుగు సాహిత్యం ప్రధాన అంశంగా తీసు కుని విజయం సాధించి ఐ.ఏ.ఎస్‌ అధికారి అయిన అపరమేధావి.. ఆయనే ‘‘అంగలకుర్తి విద్యాసాగర్‌’’ ఆయన ఉద్యోగ జీవనంలో భాగంగా ఐ.టి.డి.ఎ.ప్రాజెక్ట్‌ అధికారిగా 1988 – 1990 మధ్యకాలంలో రెండు సంవత్సరాల పాటు భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో పాల్వంచ కేంద్రంగా పనిచేశారు. స్వతహాగా సాహితి పిపాసి అయిన విద్యాసాగర్‌కు సృజనాత్మకత కూడా అలవడిరది రెండేళ్ల పాటు నిత్యం అడవుల్లోని ఆదివాసులతో మమేకమై తిరిగారు. వారి జీవితాలను దగ్గరగా గమనించారు. అలా కలిగిన అనుభవం సాయంగా 20 కథలు రాశారు. కొన్ని కథలుగా అనిపించవు అయినా కథను చదువుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ అనుభవాల అనుభూతులను ‘‘భద్రాచలం మన్నెంకతలు’’ పేరుతో ప్రచురించారు. ఆధునిక తెలుగు కథ సాహిత్యంలో అత్యంత పాఠ కాదరణ పొందిన గిరిజన కథలుగా వీటిని చెప్పవచ్చు. ఈ కథా సమూహంలోని కథలన్ని గిరిజన జీవితాల మధ్యే తిరుగాడుతాయి. ప్రతికథ రచయిత అనుభవించిన ఒకవ్యధగా చెప్పవచ్చు. ఆ రెండేళ్ల కాలంలో విద్యాసాగర్‌ గారు చేసిన క్షేత్ర పర్యటనలు, గిరిజనాభివృద్దికోసం ప్రభుత్వాలు,అధికారులు,చేస్తున్న కృషి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టి చూపించడంలో రచయిత సఫలీకృతులయ్యారు.
కొన్ని ఆశయాలు ఆశలు నెరవేరకుండానే ఆయన బదిలీ అయి వెళ్లిపోయిన, తర్వాత కాలంలో అవి కార్యరూపం దాల్చడం వంటివి గమనిస్తే గొప్ప పనులు ఏనాటికైనా లక్ష్యాలు సాధిస్తాయనే నమ్మకం ఈకథలు చదవడం వల్ల కలుగుతుంది.
ఈ కథల్లో రచయిత తాను ప్రభుత్వ అధి కారిని అన్న భావన ఎక్కడ చూపించరు. అంతటా మానవతావాదంనిండి ఉంటుంది. అందుకే ఒక్కోచోట గిరిజన అభివృద్ధి పనుల్లో ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను కూడా ఎత్తిచూపుతారు.
‘‘నామొకంమల్లొచ్చింది సారు’’ కథలో అడవుల్లోని క్రూర మృగాల బారిన పడి గిరిజనులు అనుభవిస్తున్న హృదయ విదారక బాధలను రచయిత ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ ఆసుపత్రులు అవలంబిస్తున్న అలసత్వం గురించి నిర్మొహమాటంగా రచయిత ఇందులో చెప్పారు. అంతేకాక గిరిజనులకు పుట్టిన భూమి మీద ఉండే మమకారం కూడా అంతర్లీనంగా చెబుతు,అడవి బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లోనూ పుట్టిన ప్రాంతాలు విడిచిపోవడానికి ఇష్టపడరు. అందునా కన్న భూమి మీదే కన్నుమూయాలనే తత్వం వారి సొంతం.ఇక గిరిజన యువత చదువులకు ఎలా దూరం అవుతున్నారు? ఉన్నత చదువులు ఎందుకు చదవలేక పోతున్నారు? వాటి పరిస్థితులను అనుసరించి వ్రాసిన కత ‘‘ఇవి కూడా జరిగి ఉంటే…’’ దీనిలో గిరిజన గుడాలు వెనుకబాటుకు కారణాలు అన్వేషించిన రచయిత తన ఆలోచనలు కార్యరూపం దాల్చకుండానే కార్య స్థానం నుంచి బదిలీ అయిపోయిన అవినేటి కాలంలో అమలు కావడం, ముఖ్య ప్రణాళికలోని ప్రామాణికతను స్పష్టం చేస్తుంది.గిరిజన వివాహం వ్యవస్థను తెలుపుతూ… ‘‘మనిషిని మనిషి వంచించ నంతవరకు మనిషిని మనిషి హింసించనంత వరకు ఏఆచారము ఏ నమ్మకము తప్పు కాదు’’ అనే విలువైన సందేశాన్ని అందిస్తూ… , బిడియం,భయం,అనే లక్షణాలు గల అడవి బిడ్డల్లో సరైన అవగాహన,శిక్షణలు కల్పించడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఆవిష్కరించబడతాయి.
అనే సత్యాన్ని కూడా చెబుతారు రచయిత ‘‘ఇద్దరుండాల సారు’’ కథ ద్వారా ….. అదేవిధంగా సొంత భూముల్లో గిరిజనులు కూలీలుగా మారుతున్న వైనం వివరించే ‘‘ప్రశ్నల శర్మగారు’’ కథ,. మూడు దశాబ్దాల క్రితం గోదావరి వరదలు, వానాకాలం సమయంలో గిరిజన గుడాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రయాణ ఇక్కట్లు, వరదల బాధలు,గురించి వివరించడంతోపాటు నాటి అధికారులు అంకితభావంతో పడ్డ పాట్లు గురించి హృదయ విదారకంగా చెప్పిన కథ ‘‘ఆకాశ వాణి నందిగామ! రోడ్డు మీద లాంచి!!’’ తమ సొంత అడవుల్లో పరాయి బ్రతుకులు బతుకుతున్న గిరిజనుల వింత పరిస్థితిని వివరించే కథ ‘‘శాపలు దాగితే సెరువెండు ద్దాసారు?!’’ నిజంగా అధికారుల అనాలోచిత చర్యలకు చెంపపెట్టు లాంటిదిఈ కత. గిరిజన జీవన విధానాలు మార్పు కోసం ప్రభుత్వాలు అధికారులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న పరిణామాల గురించి వ్యాస కథనంగా చెప్పిన’’ ప్రొఫెసర్‌ హేమండార్ప్‌’’ కత.దీని ద్వారా ఖమ్మం జిల్లాకు డార్ప్‌కు గల అనుబంధం అవగతం అవుతుంది. వెనుకబడిన గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో అవలంబించాల్సిన ఆచరణాత్మక క్రియల గురించి మార్గదర్శనం చేసే మంచి కథ ‘‘చీకటి మండలం’’ ఇలా ప్రతి కథ విద్యాసాగర్‌ గారి అనుభవాల దొంతరల గుండా, గిరిజన స్థితిగతుల మీదుగా,మూడు దశాబ్దాల క్రితం భద్రాచలం మన్యంలోని గిరిజన గ్రామాల దుస్థితికి అద్దం పడుతుంది. ప్రతి కథలో కాలం, ఆనాటి మనుషులు,గ్రామాల పేర్లు, యదాలాపంగా నమోదు చేశారు రచయిత, ఒకానొక సందర్భంలో విద్యాసాగర్‌ గారి ‘‘స్వీయకథ’’గా అనిపిస్తుంది ఈ కథ సంపుటి, కారణం ప్రతి కథకు రచయిత ఒక పాత్ర కావడమే..!
కథల పేర్లు కూడా విచిత్రంగా ఆసక్తికరంగా ఉండి పాఠకులను కథల్లోకి ఆహ్వానిస్తాయి, అలాంటి వాటిల్లో ముఖ్యమైనవి చెట్టు కింద ఆఫీసు, కొండకు కట్టెలు మోయమంటారా సారు?, కూసున్నకొమ్మ కొట్టుకుంటామా సారు??, మొదలైన కథలు.
ఇక కథల్లో వాడిన భాష కూడా పాత్రో చితంగా స్థానిక గిరిజనుల భాష ఉపయో గించడం అభినందనీయం,రచయిత విద్యాసాగర్‌ గారు పుట్టిన ప్రకాశం జిల్లా యాస అక్కడక్కడ వున్న, తెలుగు భాష మీద, సృజనాత్మకత పట్ల ఆయనకు గల పట్టు ప్రతి చోటా కనిపిస్తుంది.ప్రతి కథలో రచయిత గొంతు, అడవి బిడ్డల ఆవేదన స్వరాలు మేళవించబడి వినిపిస్తాయి. 1990 సం:లో రాసిన ఈ ‘‘భద్రాచలం మన్నెంకతలు’’ తెలుగు కథా సాహిత్యపు గిరిజన కథా విభాగంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ప్రామాణిక కథలుగా చెప్పవచ్చును. అనుభవాలకు కథల రూపం ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి అనుకునే వారితో పాటు, కథా ప్రియులంతా తప్పక చదివి తీరాల్సిన కథా సంపుటి ఇది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

నిండైన సహచర్యంతో నేనూ సైతం

అర్థ శతాబ్ద కాలం పాటు అడవి బిడ్డలతో మమేకమై జీవించి వారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అత్యున్నత అధికారి అనుభవాల నిధి ‘గిరిజనాభివృద్ధికి నేను సైతం’పుస్తకం రచయిత డాక్టర్‌ వి.ఎన్‌.వి.కె.శాస్త్రి రాసిన ఈ పుస్తకం బహుముఖ ప్రయోజనకారి అనడంలో అతిశ యం లేదు. బాహ్యంగా చూడటానికి ఒక అధికారి స్వీయ అనుభవాలు పొందుపరిచిన సాధారణ పుస్తకమే అన్నట్టు కనిపించిన, ఇందులోని ప్రతి విషయం భావి పరిశోధకులకు విలువైన సమాచార దిక్సూచి. అంతేకాక గిరిజనులు అభివృద్ధికి పాటుపడాలి అనుకునే వారికి మంచి మార్గదర్శి కూడా.. ప్రస్తుతం మనం చూస్తున్న పలు గిరిజన చట్టాల నేపథ్యం గురించి తెలుసుకోవాలి అంటే విధిగా నేను సైతం చదవాల్సిందే. ఎంతో విలువైన గిరిజన సమాచారం గల ఈ పుస్తకాన్ని గిరిజన పోరాట యోధుడు ‘కుంజా బొజ్జి’ గారికి అంకి తం ఇవ్వడంలో రచయిత శాస్త్రి గారి విశాల హృదయం ఎంతటిదో అర్థమవుతుంది.
స్థానిక గిరిజనులే ఉపాధ్యాయులు,గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక సొసైటీలు,జీవో నంబరు 3 కొట్టివేత పర్యవ సానాలు, మొదలైన ప్రధాన వ్యాసాల సమా హారంగా ప్రచురించబడిన ఈ ‘…నేను సైతం’ పుస్తకం చదువుతుంటే ఒక మేధావి స్వీయ చరిత్ర చదువుతున్న మధురానుభూతి కలుగుతుంది. ప్రారంభం అంతా డాక్టర్‌ శాస్త్రి గారు గిరిజన సంక్షేమానికి వచ్చిన తీరే ఆసక్తిగా సాగిపోయి పాఠకుల కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెడతాయి.‘మానవ శాస్త్రం’ అనబడే ‘ఆంత్రోపాలజీ’ విద్యార్థి పరిశోధక విద్యార్థిగా గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థలో చేరి తనకు ఇష్టమైన రంగంలో కష్టం లేకుండా మునుముందుకు దూసుకుపోయి మూలాలనుంచి విషయ సేకరణ చేయడం ఈ రచనలో మనకు అడుగడుగునా ఆగుపిస్తుంది. శాస్త్రి గారు తన అర్థ శతాబ్ది ఉద్యోగ ప్రస్థానం లో తను చూసిన క్షేత్రస్థాయి విషయాలను క్రోడీకరిస్తూ ఇప్పటికే 9 పుస్తకాలు రాశారు, ప్రస్తుతం జరుగుతున్న గిరిజన అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంగా ‘…నేను సైతం’ వ్యాస సంపుటి రాయడం జరిగింది. 1968 70 సం: మధ్య కాలంలో ఆంథ్రో పాలజీ విభాగంలో రెండేళ్లపాటు పరిశోధక విద్యార్థిగా, అనంతరం1970-1971మధ్య పరిశోధన సహాయకుడిగా సేవలు అందించారు, అనంతరం 1971నుంచి 2005 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖలోని గిరిజన సంస్కృతి పరిశోధనా శిక్షణా సంస్థలో పని చేశారు. ఈ ఉద్యోగ ప్రస్థానంలోనే ఏటూరు నాగారం, ఉట్నూర్‌, శ్రీశైలంలో ఐటిడిఎల ప్రాజెక్ట్‌ అధికారిగా సేవలు అందించారు,అలా ఆయన ఆసక్తి, ఉద్యోగరీత్యా ఆదివాసులతో సహచర్యం చేసే భాగ్యం కలిగింది అలా సంగ్రహించిన అనుభవ సారంతో రాయడం వల్ల ఈ పుస్తకానికి మరింత ప్రామాణికత, ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆధునిక కాలంలో పరిశోధన చేయాలి అంటే అంత కష్టం కాదు..కానీ 1968 ప్రాంతంలో పరిశోధన చేయాలంటే గొప్ప సాహసంతో కూడుకున్న పనే..!! అలాంటి సాహసాన్ని సునాయాసంగా చేసి డాక్టరేట్‌ సాధించారు శాస్త్రిగారు.వీరి అనుభవాలద్వారా వ్రాసిన ఈ వ్యాసం సంపుటి ద్వారా గిరిజనులు వారి జీవన విధానాల్లో అంచలంచెలుగా వచ్చిన మార్పులు కనిపిస్తాయి.
అడవి బిడ్డల జీవన సరళిలో వచ్చిన ఈ మార్పు కు ప్రధాన కారణం వారి చదువే అని స్పష్టం చేశారు రచయిత. నేను సైతం వ్యాస సంపుటిలో మొత్తం 11 వ్యాసాలు వేటికవే భిన్నమైన సమాచారం కలిగి ఉన్నాయి,గిరిజన సంక్షేమానికి ఎలాగ వచ్చాను మొదలు జీవో నెంబరు 3కొట్టివేత పర్యవ సానాలు, వరకు ఈ వ్యాసావళి కొనసాగింది.
1986 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక గిరిజన యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన వైనం దాని నేపథ్యం. 1986 87 సంవత్సరంలో పదవ తరగతి అర్హతతో గిరిజన యువతకు స్థానికత ఆధారంగా అందించిన ఉపాధ్యాయ ఉద్యోగాల ద్వారా గిరిజన యువతలో వచ్చిన సామాజిక,ఆర్థిక,మార్పులు పర్యవసానాలు డాక్టర్‌ శాస్త్రి అక్షర బద్దం చేసిన వైనం ఆసక్తిగా సాగుతుంది.
ఏ ఉద్యోగైన తన ఉద్యోగ ప్రస్థానంలో విజయం సాధించాలి అంటే ముందు సమైత విషయం మీద ఆసక్తి ఆపైన తన చదువుకు సంబంధించిన ఉద్యోగం అయినప్పుడు దానిని ఇష్టంతో విసెషష్క్ప్డతతో ప్రామాణిక బద్ధంగా పూర్తి చేయగలరు.అచ్చంగా శాస్త్రిగారి ఉద్యోగ ప్రస్థానం ఆ విధంగా సాగింది కనుక తన ఉద్యోగ జీవితంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రచించి అమలు అయ్యేటట్టు కృషి చేయగలిగారు ఇది అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శనీయం. భారత రాజ్యాంగంలో గిరిజ అభివృద్ధికి ఎన్నో ప్రత్యేక వ్యవస్థషసౌకర్యాలు కల్పించిన, అధికార వ్యవస్థలో మాత్రం అడుగడుగున వ్యతిరేకత కనిపిస్తుంది, అందుకు అధికార ఘనంలోనే వ్యతిరేకత తదితర విషయాలు గిరిజనులకు జరుగుతున్న నష్టం గురించి కూడా శాస్త్రి గారు ఇందులో నిర్మొహమాటంగా వివరించారు . చివరిగా ‘జీవో నెంబర్‌ 3 కొట్టివేత పర్యవసనాలు’ గురించి వివరిస్తూ అది రాక ముందు గల జీవో నెంబర్‌ 275 / 1986 ఉంది దీని ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% ఉపాధ్యాయ పోస్టులు స్థానిక గిరిజనులకు రిజర్వ్‌ చేయబడ్డాయి దానిని ట్రిబ్యునల్‌ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుని దొడ్డి దారిన జీవో నెంబర్‌ 3/2000 జారీ చేసినట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు తాను భావిస్తు న్నట్టు రచయిత అభిప్రాయం వ్యక్తం చేశారు, చిత్రంగా ఈ రెండు జీవోలు వెలువడే సమయంలో అప్పటి ప్రభుత్వ సెక్రటరీలకు డాక్టర్‌ శాస్త్రి సహాయకుడిగా ఉండటం ఒక విశేషం. ఇలాంటి ప్రామాణిక స్వాను భావిక విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో మనకు అడుగడుగున అగుపిస్తాయి, అచ్చంగా గిరిజనుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థలు, సంఘాలతో పాటు గిరిజన సామాజిక వర్గాలపై పరిశోధన చేసే వారికి ఈ ‘…నేను సైతం’ పుస్తకం ఒక దారి దీపం లాంటిది.
50 సంవత్సరాల పూర్వం నాటి గిరిజన గ్రామాలు, అప్పటి గిరిజనుల వెనుకబాటు తను, అందుకు ప్రభుత్వాలు చేసిన కృషి, అధికార గణం అలసత్వం, తదితర ఎన్నో విషయాలు నిర్మొహమాటంగా నిజమైన రచయిత దృష్టి కోణంతో ఈ పుస్తకం వ్రాశారు రచయిత ‘డాక్టర్‌ వట్టిపల్లి కృష్ణశాస్త్రి’. ఈ గిరిజన సమాచార దర్శని ప్రతి విద్యావేత్త విధిగా చదవదగ్గన్న పుస్తకం అనడంలో ఎలాంటి అతిశయం లేదు. –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

అవునూ వారే స్వయంగా రోడేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం ఓ చిన్న చీమలపాడు పంచాయితీలో జీలుగులోవ గిరిజనగ్రామం. ఇది కొండ శిఖరంపై ఉంటుంది. ఇక్కడ పది కుటుంబాలు. మాడుగుల నియోజకవర్గం అవురువాడ పంచాయతీ కొండ శిఖర గ్రామమైన పశువులు బంద గ్రామంలో 7 కుటుంబాలవారు 38 మంది జనాభా కలిగిన కొందు ఆదివాసి గిరిజనులు కొండ శిఖర్‌ గ్రామం పై జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని రోడ్డు మార్గం నుండి వెళితే రెండు రోజుల సమయం పడుతుంది. బైకు రాకపోకల కోసం రోడ్డు ఏర్పాటు చేసుకుంటే మంచిదని గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ని సంప్రదించి తమకు ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని, రోడ్డు పనులు చేసుకుంటామని వేడుకున్నారు. చాలాసార్లు కలెక్టర్‌ చుట్టూ తిరిగి బతిమాలారు. నర్సీపట్నం ఆర్డిఓ గిరిజన గ్రామాన్ని సంద ర్శించి వారికి ఉపాధి కార్డులు ఇస్తామని చెప్పారు. కార్డులు ఇచ్చినట్టు రిపోర్టులో రాసుకున్నారే తప్ప ఇంతవరకూ ఎవ్వరికీ ఉపాధి హామీ కార్డులేవీ అందలేదు. కనీసం పాదం పని కూడా ఇవ్వలేదు. ఎంత విన్న వించుకున్నా.. అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో గిరిజనులంతా నడుం బిగించారు. వారే సొంతంగా గత 15 రోజుల నుండి శ్రమదానంతో రోడ్డు నిర్మాణం చేసు కుంటున్నారు. అధికారులు గిరిజన ఉత్స వాల పేరు మీద, టూరిజం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప తమ గిరిజన గ్రామాలకు కనీసం నడవడానికి తోవలేని పరిస్థితి ఉందని గుర్తించడం లేదంటూ గిరిజనులు వాపోయారు. ఈ మధ్య కాలంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ గర్భిణీ స్త్రీలను డోలిలో తీసుకురావడానికి వీల్లేదని అన్నారు. మండల అధికారి బృందం వచ్చి గిరిజనుల గ్రామాన్ని సందర్శించారు. రోడ్డు మార్గం దగ్గరగా ఉందని..కొర్ర సంధ్య (20) గర్భిణీ స్త్రీ అమ్మగారి ఊరైన ఎదురిపల్లి వెళ్ళి పోయింది. కానీ ఈ గిరిజన గ్రామంలో ఎవ రికైనా అనారోగ్యం వస్తే, ఇతర నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా శనివారం పెట్టే సంతనాడు మాత్రమే వెళ్ళాలి మిగతా సమ యాల్లో వెళ్లాలంటే కనీసం 15 కిలోమీటర్లు కాలి నడకన కొత్తకోటకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కలిసి తమ కోసం తామే నడుం బిగించారు. పలుగూ పారలు పట్టుకున్నారు. నిర్విరామంగా 15 రోజులు కష్టపడుతూ రోడ్డు మార్గాన్ని సరిచేసు కుంటున్నారు. 3 నెలల్లోపు ఈ రోడ్డు నిర్మా ణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో తీర్మానం చేసుకున్నారు. ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ తమ గ్రామానికి ఉపాధి పథకం ద్వారా రోడ్డును మంజూరు చేయాలని ఆ గిరిజనులు కోరుతున్నారు. తమకు ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ని వేడుకుంటున్నారు.-జిఎన్‌వి సతీష్‌

మహా విశాఖ మధ్యలో ఓ అడవి..
మహానగరం మధ్యలో

అభయారణ్యం… అందులో రహస్య గిరిజన గ్రామం…విశాఖ నగరం అద్దాల మేడలు, ఆకాశాన్నితాకుతున్నట్లు ఉండే భవనాలతో కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది. అయితే ఇదే నగరం నడిబొడ్డున ఓ గిరిజన గ్రామం కూడా ఉంది. అది కూడా దట్టమైన అడవి మధ్యలో.విశాఖ మహానగరంలో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. అసలు నగరంలో అడవి ఎలా ఉంది? ఆ అడవిలో ఊరు ఎందుకుంది?-
గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 98 వార్డులలో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 350 మంది జనాభాతో శంభువా నిపాలెం ఉంది. ఇది ఒక గిరిజన గ్రామం. మన్నెందొర అనే గిరిజనం ఇక్కడ ఐదు తరాలుగా ఉంటున్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉన్న ఈ గిరిజన గ్రామం…జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది.
చెక్‌ పోస్టు పడతాది…
జీవీఎంసీ విస్తీర్ణం దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎటువంటి అడ్డుకులు ఉండవు. అయితే శంభు వానిపాలెం వెళ్లాలన్నా… వెళ్లిన తరువాత బయటకు రావాలన్నా కూడా చెక్‌ పోస్టు తనిఖీలు ఎదుర్కోవాల్సిందే. పీఎం పాలెం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తే అక్కడొక చెక్‌ పోస్టు కనిపిస్తుంది. శంభువానిపాలెం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల ముందే అటవీశాఖ చెక్‌ పోస్టు ఏర్పాటు చేసింది. గ్రామస్థుల రాకపోకలపై కూడా నిఘా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండేవాళ్లు తప్ప ఇంకెవరు వెళ్లలేరు. దీంతో ఈ గ్రామం ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. ‘‘మా గ్రామం ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మేం మన్నెందొర గిరిజనులం. ఐదు తరాలుగా మా తెగ ఇక్కడే ఉంటున్నట్లు మా పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్లంతా ఇక్కడ పుట్టినవాళ్లమే. ఎన్నికల సమయంలో తప్ప, మా గ్రామానికి అధికారులు, రాజకీయ నాయకులు పెద్దగా ఎవరు రారు. అసలు మేం ఇక్కడ ఉంటున్నట్లు చాలా మందికి తెలియదనే అనుకుంటున్నాం’’ అని చెప్పారు శంభువానిపాలేనికి చెందిన సీతారాం.
‘‘మాకు ఏ అవసరమున్నా…దగ్గర్లోని హనుమంతవాక, మధురవాడ, పోతిన మల్లయ్యపాలెం వెళ్తుంటాం. మేం గ్రామం బయలకు వెళ్లాలన్నా…తిరిగి లోపలికి రావా లన్ని చెక్‌ పోస్టులో వివరాలు చెప్పాలి. మా గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఎవరూ ఉండరు. అలాగే మా గ్రామంపై నుంచి రాకపోకలు చేసేందుకు కూడా అవకాశం లేదు. అడవిలో ఉన్నాం మేం’’ అంటూ ఆయన మాట్లాడుతుండగానే, ‘రాముడు’ అని కేక వినిపించింది. ఫోన్‌ సిగ్నల్‌ వచ్చినట్లుందంటూ నీటి ట్యాంక్‌ వైపు పరుగు తీశారు సీతారాం.
బేసిక్‌ మోడల్‌ ఫోన్‌… వాటర్‌ ట్యాంక్‌
శంభువానిపాలెంలో జీవీఎంసీ నిర్మించిన ఎత్తైన నీటి ట్యాంక్‌ ఉంది. ఈ ట్యాంక్‌ పై ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు కచ్చితంగా కనిపిస్తుంటారు. చేతిలో బేసిక్‌ మోడల్‌ ఫోన్‌ పట్టుకుని…దాని వైపు తదేకంగా చూస్తూ ఉంటారు…ఫోన్‌లో సిగ్నల్‌ కనిపించగానే వారి ముఖంలో ఆనందం కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ సెల్‌ ఫోన్‌ సిగ్నలే ఉండదు. సిగ్నల్‌ రావాలంటే నీటి ట్యాంక్‌ ఎక్కాల్సిందే.
‘‘మా ఊర్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఉండదు. అడవి మధ్యలో ఉండటం…అటవీశాఖధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సెల్‌ టవర్లు వేయలేదు. అయితే మధురవాడ,పీఎం పాలెం, జూ పార్కు పరిసరాల్లో ఉన్న టవర్ల నుంచి వచ్చే సిగ్నలో…ఏమో…బేసిక్‌ మోడల్‌ సెల్‌ ఫోన్లకు అప్పుడప్పుడ సిగ్నల్‌ వస్తుంది. అది కూడా వాటర్‌ ట్యాంక్‌, ఎత్తైన మేడలు ఎక్కితేనే. దాంతో మా ఊర్లో ఫోన్లు మాట్లాడాలి అనుకునే వారంతా ఈ ట్యాంకులు, మేడలపైనే కనిపి స్తారు. ఇప్పుడంతా ఆన్‌ లైన్‌ చదువులు వచ్చినా…సెల్‌ ఫోన్‌ పని చేయకపోవడంతో మా పిల్లలకు అది కూడా వీలుకావడం లేదు’’ అని ఫోన్‌ మాట్లాడేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన పరశురాం చెప్పారు.
ఇది మరో ప్రపంచం
శంభువానిపాలెం జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోకి వస్తుంది. అక్కడికి వెళ్లాంటే ఫారెస్ట్‌ సిబ్బంది అనుమతి తప్పనిసరి.‘‘మా గ్రామం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది 7,200 హెక్టార్లున్న కంబాల కొండ అభయారణ్యంలో ఉంది. నగరంలోకి అడవి వచ్చిందా…? అడవే నగరంగా మారిందా…? తెలియదు కానీ… మేం నగరానికి చెందిన గిరిజనుల్లా జీవిస్తున్నాం. కంబాలకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోనే సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్‌లుగా మాలో కొందరికి పనులు ఇచ్చారు. మిగతా వారు ఊర్లో మేకలు కాసుకుని జీవనం సాగిస్తుంటారు’’ అని కంబాల కొండలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న శంభువానిపాలెం నివాసి ఒకరు చెప్పారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌ వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి సంబం ధించిన ఏ భవనమూ లేదు. ఆసుపత్రి లేదు. వైద్యం కోసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సిగ్నల్‌ సమస్య కారణంగా రేషన్‌ కూడా ఊరి బయట సిగ్నల్‌ ఉన్న చోటుకి వెళ్లి తీసుకుంటాం. మా ఊరు రావడానికి కూడా మా బంధువులు ఇష్టపడరు. వస్తే వారికి ప్రపంచంతో సంబం ధాలు కట్‌ అయిపోతాయి. ఎందుకంటే శంభు వానిపాలెం మరో ప్రపంచం’’ అని ఆయన అన్నారు.
కొండ జమీందార్లు… సేవకులు
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని 11మండలాల్లో అనేక గిరిజన తెగలున్నాయి. అయితే విశాఖ నగర పరిధిలో గిరిజన తెగలు ఉండటం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడంటే నగరం కానీ…ఒకప్పుడు విశాఖ అంటే 50 శాతం అడవే. కొన్ని తెగల గిరిజనులు వ్యాపారం కోసం లేదా విడిది కోసం కూడా… వారు ఉండే ప్రాంతాలకు దూరంగా వచ్చేవారని ఏయూ చరిత్ర విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు. ‘‘జమీందార్ల కాలంలో మైదాన జమీందార్లు, కొండ జమీందార్లు అని ఉండేవారు. గిరిజన తెగల్లో ఉండే పెద్ద తెగలను కొండ జమీందార్లు అనేవారు. వీరు కొండల్లో దొరికే ఉత్పత్తులతో వ్యాపారం చేసేందుకు మైదాన ప్రాంతాలకు వస్తుండేవారు. అలా వచ్చిన వీరు కొందరు మైదాన ప్రాంతాలకు సమీపంగా ఉండే అటవీ ప్రాంతాల్లోనే తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే వారు. అలా కొందరు మైదాన ప్రాంతాల్లోనే స్థిరపడిపోయారు’’ అని ఆయన వివరించారు. ‘‘కొన్ని గిరిజన తెగల్లో వాళ్లు మైదాన ప్రాంతంలో ఉండే జమీందార్లకు సేవకులుగా ఉండేందుకు వచ్చేవారు. వారు వ్యవసాయం అటవీ ఉత్పత్తుల సేకరణకు వీలుంటుందని స్థానిక అటవీ ప్రాంతాల్లోనే నివాసం ఏర్పాటు చేసుకునేవారు. తరాలు గడుస్తున్న కొద్దీ వారు మైదాన ప్రాంతాల ప్రజలతో కలిసిపోయారు. విశాఖ ఒకప్పుడు పెద్ద వ్యాపార కేంద్రం, అలాగే ఎక్కువ అడవులున్న ప్రాంతం కావడంతో శంభు వానిపాలెం గిరిజనులు అలా వచ్చినవారై ఉంటారు’’ సూర్యనారాయణ తెలిపారు.
ప్రవేశం నిషిద్ధం
శంభువానిపాలెం వెళ్లాలంటే చెక్‌ పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి…ఊరిలోని ఎవరైనా తెలిసినవారు ‘మావాళ్లే’ అని చెప్తే అన్ని వివరాలు తీసుకుని లోపలికి అనుమతిస్తారు. థింసా బృందం కూడా అటవీ శాఖ అనుమతితో శంభువానిపాలెంలోకి ప్రవేశించింది. చెక్‌ పోస్టు నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత శంభువానిపాలెం గ్రామం కనిపిస్తుంది. గ్రామంలోకి వెళ్తుండగానే తుమ్మిగెడ్డ రిజర్వాయర్‌ కనిపిస్తుంది. అది దాటు తుండగా…సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ కట్‌ అయి పోతుంది. జీవీఎంసీ పరిధిలో ఉండటంతో చెక్‌ పోస్టు నుంచి గ్రామం వరకూ తారురోడ్డు వేశారు.
‘‘శంభువానిపాలెంలోకి ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే ఇది కంబాలకొండ అభయా రణ్యంలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇది పూర్తిగా అటవీశాఖ అధ్వర్యంలో ఉంది. శంభువానిపాలెంలో అటవీశాఖ తరపున బేస్‌ క్యాంపు కూడా ఏర్పాటు చేశాం. అభయారణ్య ప్రాంతంలో ఇది ఉండటంతో…ఇక్కడ చేపలు పట్టడం, వన్యప్రాణులను వేటాడటం, తుపాకీ ఉప యోగించడం,చెట్లు తగలబెట్టడం,చెత్త వేయడం,మద్యం తాగడం,రిజర్వాయర్‌లో ఈతకొట్టడం వంటి పనులు చేయకూడదు. అది వన్యప్రాణి చట్టం సెక్షన్‌ 51 ప్రకారం నేరం. నగరపరిధిలో ఉన్న ప్రత్యేకమైన గ్రామం ఇది’’ అని విశాఖపట్నం ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ అనంత్‌ శంకర్‌ చెప్పారు. – గునపర్తి సైమన్‌

ఆదివాసులను విస్మరిస్తున్న నాగరికత

మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధారపడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదితరాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.చెట్టు,పుట,్టనీరు వంటివాటిని పూజిస్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవనశైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
త్యాగాల చరిత్ర కనుమరుగు
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారు,పాల్గొ నని వారు కూడా వజ్రోత్సవాల పేరుతో ఎన్ని కల లబ్ధి ఎంత పొందవచ్చు అని మాత్రమే పోటి పడుతున్నారు.విచిత్రం ఏమిటంటే భారత దేశం మీద ఏ విదేశీయులు దాడి చేసినా మొట్టమొదట తిరుగుబాటు జెండా ఎగుర వేసింది స్వేచ్ఛా ప్రియులైన ఆదివాసులే . భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఆది వాసుల పోరాటాల చరిత్రను విస్మరించి నట్లుగనే ఇప్పుడు కూడా మొత్తం ఆదివాసులనే విస్మరిస్తున్నారు .
ఉత్సవాలను పట్టించుకోని పాలకులు
ఐక్య రాజ్య సమితి 1994 నుండి ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని,ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించింది.1995 నుండి ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో ప్రపంచ ఆదీ వాసీ దినోత్సవాన్ని జరుపుకుంటు వస్తున్నారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా90దేశాలలో దాదాపు48కోట్ల మంది ఆదివాసులు ఉన్నారని అంచనా.వారు ప్రపంచ జనాభాలో 5శాతం కంటే తక్కువనే.కానీ పేదలలో 15శాతం ఉన్నా రు.మొత్తం ప్రపంచంలో ఉన్న 7000 భాష లలో ఎక్కువ భాషలు మాట్లాడుతారు.5000 విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇవన్నీ ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థలు మొత్తం ప్రపంచం గురించి ఇచ్చిన అంచనాలు మాత్రమే. పేదరికం ఇంకా ఎక్కువగనే ఉంటుంది. సాంప్రదయక జ్ఞానాన్ని రక్షించడంలోనూ ప్రసారం చేయడంలోనూ ఆదివాసీ మహిళల పాత్ర ఈసంవత్సర ఆదివాసీ దినం యొక్క విషయం. ప్రతి సంవత్సరం ఆదివాసులకు చెందిన ఏదో ఒక విషయాన్ని చర్చించడానికి ఎంచుకుని ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు. మరో వైపు ఆదివాసుల పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నది .
ఆదివాసీల పరిస్థితి అధ్వాన్నం
మన దేశ విషయానికి వస్తే ఆదీవాసుల పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయి . భారతదేశ జనాభాలో ఆదివాసులు దాదాపు 9 శాతం ఉంటే,అందులో 40శాతం పేదరి కంలోనే ఉన్నారని ఒక అంచనా.ఈ పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి ఇప్పుడు కేంద్రంలో అధికారం కలిగి ఉన్న పార్టీ,అసలు ఆది వాసులను,ఆదివాసులుగానే గుర్తించని ఆలో చనతో ఉన్నది.ఆదివాసులను,అడవులలో ఉంటున్న హిందువులే అని చెప్పుతూ వారిని వనవాసులు అని పిలుస్తున్నది. ఇప్పటికే జనభా లెక్కింపు సందర్భంగా చాలా రాష్ట్రాలలో తెలిసీ తెలవక, స్పష్టమైన కోడ్‌ లెకపోవడం వలన ఆదీవాసులను, హిందువులుగా లెక్కిస్తు న్నారు. దీనితో ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతలు కూడా 5వషెడ్యూల్‌ లోకి రాకుండా పోతున్నాయి. ఆదివాసులకు దక్కాల్సిన అవకా శాలు,హక్కులు,రక్షణలు దక్కకుండా పోతు న్నాయి.1871నుండి1951వరకు జనభా లెక్కలలో స్పష్టంగా మతం కాలమ్‌లో ఆదివా సులగా గుర్తించే కోడ్‌ ఉండిరది.కానీ1951 తరువాత జనాభా లెక్కలలో మతం కాలమ్‌ కింద ఉన్న ఆదివాసుల ఆప్షన్‌ తీసివేసి, ‘‘ఇతరులు’’అని చేర్చడం జరిగింది.చివరికి 2011 వరకు ఉండిన ‘ఇతరులు’అనే ఆప్షన్‌ ను కూడా తీసివేశారు.మతం కాలమ్‌లో ఆరు మతాలనే ఉంచారు.1) హిందూ,2) ముస్లిం, 3)క్రిస్టియన్‌,4) బౌద్ధులు,5) జైనులు,6) సిక్కులు. జనాభా లెక్కింపులలో ఇలా చేస్తూ వచ్చిన మార్పులతోనే ఆదివాసీల జనాభా తక్కువగా లెక్కించబడుతూ వస్తున్నది. అంటే భారత దేశ ఆదివాసులు అందరూ 6 మతా లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలన్న మాట. విచిత్రం ఏమిటంటే బౌద్ధులు జైనులు కంటే మన దేశంలో ఆదివాసుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నది.కానీ ఆదివాసులకు జనాభా లెక్కలలో తమ మతం గురించి, తమ విశ్వాసాలను గురించి ప్రకటించుకునే, గుర్తించే అవకాశమే ఇవ్వలేదు.ఆదివాసులందరిని హిందువులుగా లెక్కించే కుట్రనే ఇది.అయితే 2019లో 19 రాష్ట్రాలకు చెందిన ఆదివాసులు వారి ప్రతి నిధులు,2021 జనాభా లెక్కింపులో మతం కాలమ్‌లో ఆదివాసులను గుర్తించే కోడ్‌ పెట్టాలని డిమాండు చేస్తూ డిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా కూడా చేశారు.జార్ఖండ్‌ అసెంబ్లీ ఈ సందర్భంగానే, జనభా లెక్కింపులో ఆదివాసులను గుర్తించడానికి,ఆదివాసుల మతం అయిన సర్నాను మతం కాలమ్‌ లో పెట్టాలని తీర్మానం కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ అంగీ కారం లేకుండా అది అమలు అయ్యే విషయం కాదు. కాని ఆదీవాసులను హిందువులగా మాత్రమే గుర్తించే ప్రభుత్వం వాళ్ళను పట్టించుకోనే లేదు. ఇతర పార్టీలన్ని గట్టిగా కళ్ళు మూసుకుని మౌన వ్రతం పాటించాయి.
మతముద్రకు కుతంత్రాలు
ఇక జరిగేదెమిటంటే,ఆదివాసులు అందరూ హిందువులే కావున వారి ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు ప్రత్యేక రక్షణలు, హక్కులు అవసరం లేదంటారు. ఇటువంటి రక్షణ చట్టాల వల్లనే ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదని ఇప్పటికే కొందరు వాదిస్తున్నారు. అందుకే తెలంగాణా ఆంధ్రాలో1/70చట్టాన్ని ఎత్తి వేయా లని చర్చలు,వాదనలు కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందరం హిందువులమే పేరు మీద ఇటువంటి చట్టలన్నింటిని తుంగలో తొక్కవచ్చు. అంబానీ అదానీలకు ఆదివాసి ప్రాంతాలలోని ఖనిజాలను,ఇతర సంపదలను ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా తరలించుకు పోవడానికి అవకాశం ఏర్పడు తుంది. ఆదివా సులను వారి ప్రాంతాలనుండి తరిమి వేయ వచ్చు. ఇప్పటికే మన దేశంలో కట్టిన పెద్ద ప్రాజెక్టుల వలన గనుల వలన నిర్వాసితులు అయ్యింది 70శాతం మంది ఆదివాసులే. యురేనియం లాంటి గనుల వలన అకాల మరణాలకు గురవుతున్నదీ,అంతుపట్టని రోగా లకు బలి అవుతున్నది ఆదివాసులే. ఒక ప్రణా ళిక లేకుండా ఎటువంటి పర్యావరణ జాగ్రత్తలు తీసుకోకుండా చిత్తం వచ్చినట్లు గనుల తవ్వకా లు చేపడుతూ ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు. రోగాలపాలు చేస్తున్నారు. పర్యా వరణ సమస్యలను సృష్టిస్తు న్నారు. అటవీచట్టా లలో పారిశ్రామిక అధిప తులకు అనుకూలంగా సవరణలు చేసి వేల ఎకరాల అడవులను నరికి వేయడానికి అను మతులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి చట్టాలు ఇంకా కొత్తవి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటున్నది. ఇవన్నీ ఆదివాసుల అస్తి త్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తుండగా,అన్ని ఇబ్బం దులను ఎదుర్కొంటూ ఆదివాసులు తమ అస్తిత్వం కొరకు రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వారి అస్తిత్వ పోరాటాలకు పునాదే లేకుండా చేయడం కొరకు,జనాభా లెక్కలలో ఆదివాసుల గుర్తింపు నే మాయం చేస్తున్నారు. ఇది వారి మొదటి అడుగు మాత్రమే .
సంఘటితమే హక్కుల రక్షణకు మార్గం
ఆదివాసుల హక్కులను రక్షించడం,విద్య వైద్య సంస్కృతులను అభివృద్ధి చేయడం కొరకే ప్రపంచ ఆదివాసి దినోత్సవాలను జరుపు కుంటున్నట్లుగా ఐక్యరాజ్యసమితి చెప్పు కుంటున్నది.కానీ ముందే చెప్పినట్లు ఆదివాసులు నిర్వాసితులు అవుతుండగా వారి సంస్కృతిపై అన్ని దిక్కుల నుండి దాడి జరుగుతున్నది. ఆది వాసుల భాషల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఆదివా సులలో చాలామందికి వారి మాతృభాష రాకుండా పోయింది.ఏ రాష్ట్రంలో ఏభాష అధికార భాషగా ఉంటే ఆ భాషను ఆ రాష్ట్రం లోని ఆదివాసుల పైన రుద్ద పడుతున్నది. చత్తీస్గఢ్‌,మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై హిందీ రుద్ద పడుతున్నది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు రుద్ద పడుతున్నది.ఒరిస్సాలో, ఒడియా రుద్ద పడుతున్నది.భారతదేశం అంతటా పరిస్థితి ఇదే విధంగా ఉన్నది.కనీసం1980 వరకు మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం లోనూ కొన్ని ఇతర రాష్ట్రాల లోనూ హిందీ లిపిలోనే అయినా,ఆదివాసులకు ప్రాథమిక విద్య వారి మాతృభాషలోనే బోధించ బడిరది.కానీ తరువాత అది కూడా ఎత్తి వేశారు.ఇప్పటికే భారతదేశంలో ఎన్నో ఆది వాసుల భాషలు అంతరించి పోయాయి. మిగిలిన ఆదివాసి భాషలు కూడా అంతరించి పోయే పరిస్థితిలో ఉన్నాయి.విద్య,ఆరోగ్యం విష యంలో ఈ రోజుకు కూడా ఆదివాసీ ప్రాంతా లు వెనకపడే ఉన్నాయి. సులువుగా తగ్గించ గలిగే మలేరియా వైద్యాన్ని కూడా సరిగా అందించపోవడం వలన ప్రతి యేడు ఆది వాసులు చనిపోతునే ఉన్నారు. ఇక, ఒక ప్రాం తంలో ఒకప్పుడు ఆదివాసులు ఉండే వారని గుర్తించడానికి కూడా వీలు లేకుండా వారి గుర్తులు అన్నింటినీ కూడా తుడిచివేయ చూస్తున్నారు. ప్రాంతాల పేర్లను గ్రామాల పేర్ల ను మనుషుల పేర్లను నదుల పేర్లను చివరికి కొండల పేర్లను అన్నింటినీ అన్నింటిని మార్చి వేస్తున్నారు. మరో వైపు ఆదివాసుల మతం మార్చడానికి వివిధ మత సంస్థలు, ముఖ్యంగా క్రైస్తవ,హిందూ సంస్థలు పోటీ పడి పని చేస్తు న్నాయి. చివరికి ఈ మత సంస్థలు ఆదివాసులను కులాలుగా చీల్చుతున్నాయి. ఏ కులంలోకి మతంలోకి వెల్లని ఆదివాసులను అంటరానివారుగా చూస్తున్నారు,మారుస్తు న్నారు.మొత్తంగా ఆదివాసీ సమాజాన్ని ధ్వసం చేయడానికి కార్పోరేట్‌ వర్గాలు,పాలకవర్గాలు, పార్టీలకు అతీతంగా ఒక్కటై పని చేస్తున్నాయి. ఆదీవాసి సమాజం కూడా పార్టీలకు,మతాలకు అతీతంగా ఐక్యం అయ్యి తమ అస్తిత్వం కొరకు ఒక్కటిగా పోరాడాల్సి ఉంది.అప్పుడే ఆదివాసి సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకో గలుగు తుంది.
కొండెక్కుతున్న గిరిజన సంస్కృతులు
మానవ సమాజం 21వ శతాబ్దంలో ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించి పోతున్న ఆదివాసీ భాషలు, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధార పడిన ప్రస్తుత తరుణంలో వీరు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదిత రాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు.చెట్టు,పుట,్టనీరు వంటివాటిని పూజి స్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్ప రచుకున్నారు. స్థిర అభివృద్ధి అనేది వీరి జీవన శైలిలో భాగమైంది. ఇంత గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఆదివాసుల జనాభా, భాష క్రమంగా అంతరించిపోతుండటం ఎంతో బాధాకరం!
ఐక్యరాజ్య సమితి చొరవ
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచంలో 47.60కోట్ల ఆదివాసులు సుమారు 20 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచంలో వీరి జనాభా సుమారు ఆరు శాతం. ఏడు వేలకు పైగా భాషలు, అయిదు వేలకు పైగా సంస్కృతులు వీరి సొంతం. యునెస్కో అంచనాల ప్రకారం ఈ శతాబ్దం చివరకు సుమారుగా మూడు వేలకు పైగా అంటే నలభై భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంతటి అసాధారణ చరిత్ర, సంస్కృతి, భాషలు కలిగిఉన్న ఆదివాసులను కాపాడుకునేందుకు ప్రజల్లో చైతన్యం పెంచేం దుకు ఐక్యరాజ్య సమితి ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినంగా నిర్వహిస్తోంది.2019ను అంతర్జాతీయ ఆదివాసీ భాష సంవత్సరంగా,2022-2032 కాలాన్ని అంతర్జాతీయ ఆదిమ భాషల దశాబ్దంగా ప్రకటించడం ద్వారా వీరి సంస్కృతులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి చాటింది. ఆదివాసుల భాష, వారి సంస్కృతి సంప్రదా యాలను భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఈ తరంపై ఉంది. ఈ భాషలకు లిపి లేదు.మరో తరానికి అవి మౌఖికంగానే బదిలీ అవుతున్నాయి. ప్రపంచీ కరణ యుగంలో వచ్చిన సాంకేతిక విప్లవం, ఆధునికత,సైనిక ఆక్రమణలుబీ సామాజిక, ఆర్థిక,రాజకీయ,మతపరమైన అణచివేతలుబీ ఇతర బాహ్య కారణాలు,ఆత్మన్యూనత వంటి అంతర కారణాలవల్ల ఈ భాషలు క్రమక్ర మంగా అంతరిస్తున్నాయి. వీటి ప్రభావం వారి అస్తిత్వంపై ప్రభావం చూపడమే కాకుండా, దీంతో ముడివడిన ఆచారాలు, కట్టుబాట్లు, ఆహారపుటలవాట్లు,సంప్రదాయాలు మొదలైనవీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. యునెస్కో- ప్రపంచంలోని 6,912 భాషల్లో 2473 భాష లు వివిధ రూపాల్లో కనుమరుగు అవుతున్నా యని అంచనా వేసింది.భారత్‌లో10.45కోట్ల ఆదివాసులు(130 కోట్ల దేశజనాభాలో 7.5 శాతం)ఉన్నారు.700కు పైగా విభిన్న జాతు లున్నాయి. యునెస్కోకు చెందిన ‘అట్లాస్‌ ఆఫ్‌ వరల్డ్‌ లాంగ్వేజెస్‌’ ప్రకారం ఇండియా 197 భాషలతో మొదటిస్థానంలో ఉంది.అమెరికా 192 భాషలతో, ఇండొనేసియా147భాషలతో తరవాతి స్థానాలను ఆక్రమించాయి. ఇటీవలి కాలంలో అండమాన్‌ ద్వీపంలో నివసించే ‘గ్రేట్‌ అండమానీస్‌’ ప్రధాన భాష అక-జెరు-తం బొల అనే వ్యక్తి మృతితో అంతరించిపోవడం బాధాకరం.జరావా,సెంటీనేలే,షోపెన్‌,ఓనగీ, బిరహోర్‌,గదబా,పహరియా,బొండోలు మాట్లా డే భాషలూ అంతరించే దశలో ఉండటం ఆందోళనకరం.
యుద్ధప్రాతిపదికన చర్యలు
ఆదివాసుల సంరక్షణ, అభివృద్ది కోసం రాజ్యాంగంలోఆర్టికల్‌ 16(4),46,275,330, 332,243డి,5,6షెడ్యూళ్ల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉండే గవర్నర్లకు విచక్షణ అధికా రాలను కల్పించారు. వీటిని ఉపయోగించి జాతీయ, రాష్ట్ర చట్టాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటివల్ల ఆదివాసుల సంస్కృతికి ఏమన్నా ముప్పు సంభవిస్తే, వాటిని ఆపే హక్కు ఉంది. అయితే గిరిజనేతరుల ఆశయాలమేర చట్టాలు అమలు పరుస్తుండటం దురదృష్టకరం. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన మంత్రిత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ వంటివి నిరంతరం పనిచేస్తున్నప్పటికీ- వారి భాషను, సంస్కృతులను కాపాడలేకపోతున్నాయనడానికి అంతరిస్తున్న భాషలే నిదర్శనం. వీటి సంరక్షణ కోసం మానవ వనరుల శాఖ 2013లో అంతరించే భాషల సంరక్షణ, పరిరక్షణ పథకాన్ని భారతీయ భాషల సంస్థ, విశ్వవిద్యాలయాలు, భాష పరిశోధన సంస్థల సమన్వయంతో ప్రారంభించింది. ప్రమాదపుటంచున ఉన్న భాషలను గుర్తించి వాటిని సేకరించి భద్రపరచడం (డాక్యుమెంట్‌) ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గిరిజనుల భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం దేశంలో గిరిజన విశ్వవిద్యా లయాలను, సాంస్కృతిక కేంద్రాలను యుద్ధప్రాతి పదికన ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు, భారత్‌ కూడా ఆదిమ భాషలను కాపాడుకోవడం కోసం మాతృభాషను తప్పనిసరి చేస్తూ 2020 నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. గిరిజన భాషల లిపి తయారు చేయడం,వాటిని భారత రాజ్యాం గంలో పొందుపరచడం వంటి చర్యల ద్వారానే ఆదివాసీ సంస్కృతి, భాషలను కాపాడగలు గుతాం.తద్వారా భారత జాతి గొప్పతనాన్ని భావితరాలవారికి అందించాలి!-(లంకా పాపిరెడ్డి/డాక్టర్‌ డి.వి.ప్రసాద్‌)

ఆర్టీఐ స్పూర్తికి తూట్లు

పౌరులే అసలైన పాలకులని, ప్రభుత్వానికి వారే యజమానులని సమాచార హక్కు చట్టం ఉద్గాటిస్తోంది. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారాన్నే ప్రజలు నిక్కచ్చిగా పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాల్సిందే. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)2005 అక్టోబరు 12న విజయదశిమి నాడు అమలులోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందుతుందని ఈ చట్టం ఆశలు రేకెత్తించింది. లోపభూయిష్ట భారత ప్రజాస్వామ్యం నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా ఎదగడానికి సమాచార హక్కు చట్టం(సహ)చట్టం తోడ్పడుతుందని చాలామంది ఆశించారు. `– సైమన్‌ గునపర్తి
సమాచార హక్కు చట్టానికి అధికార యంత్రాంగం తూట్లు
‘హమార పైసా హమారా హిసాబ్‌’ అంటూ రాజస్థాన్‌ లో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమమై సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెంది ప్రస్తుతం దేశవ్యాప్తమైంది. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనంను పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గదర్శిగా నిలిచింది. గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంట్‌ వరకు ఒక్క దరఖాస్తుతో కావాల్సిన సమాచారం పొందే హక్కును కల్పించింది. కానీ అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం, సమాచార కమిషన్‌ చట్టాన్ని చట్టబండలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. పెండిరగ్‌ దరఖాస్తులు, అప్పీళ్లు, ఫిర్యాదులతో సామాన్యుడికి సమాచారం అందడం గగనంగా మారింది. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం సవరణలతో సహ చట్టానికి తూట్లు పొడుస్తుంటే మరోపక్క సమాచార కమిషన్‌ ఉదాసీన వైఖరి వల్ల చట్ట స్ఫూర్తికి భంగం వాటిల్లుతున్నది.
సవరణలతో బలహీనపరిచే యత్నం
ప్రభుత్వ పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి 2005 అక్టోబర్‌ 12 నుంచి సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు ఇస్తే ప్రజా సమాచార అధికారులు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని సెక్షన్‌ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైతే ఆ శాఖలోని సీనియర్‌ అధికారులకు మొదటి అప్పీల్‌ చేస్తారు. అక్కడ కూడా స్పందన లేకపోతే సమాచార కమిషన్‌ కు రెండో అప్పీలు చేసుకుని సమాచారం పొందవచ్చు.
జవాబుదారీతనం పెంచాలి
సహ చట్టం అమలుకు కొత్తగా సమాచార కమిషన్లను నెలకొల్పారు.సమాచారం గురించి పౌరులకు,అధికారులకు మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను ఈ కమిషన్లకే అప్పగించారు. మినహాయింపులు ప్రకటించిన పది విభాగాల సమాచారాన్ని తప్ప మిగతాదాన్ని ప్రభుత్వం పౌరులతో పంచుకోవలసిందేనని చట్టం చెబుతోంది. పౌరుడు కోరిన సమాచారాన్ని 30రోజుల్లో అందించాలని పేర్కొంది. సమాచారాన్ని అందించడంలో చేసిన జాప్యానికిగాను ప్రభుత్వ ఉద్యోగికి రోజుకు రూ.250చొప్పున జరిమానా విధించవచ్చు. ఆ మొత్తం జరిమానా రూ.25వేలు మించకూడదు.దీన్ని సంబంధిత ఉద్యోగి జీతం నుంచే వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్టీఐ చట్టం గురించి ప్రజల్లో అవగాహణ పెరగడం తో మొదట్లో దాన్ని ఉత్సాహంగా ఉపయో గించుకున్నారు.అయితే,అధికారంలో ఉన్నవారి నుంచి మాత్రం వ్యతిరేకత పెరిగింది.ఎక్కువగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులనే సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నందువల్ల వారు సమాచారాన్ని అందించడానికి మొండికేసే ఉద్యోగులకు జరిమానా విధించడానికీ మొగ్గు చూపడం లేదనే విమర్శలున్నాయి. సమాచార కమిషనర్ల నియామకంలోనూ పారదర్శకత కరవైంది. వారి అలసత్వంవల్ల సహాచట్టం సరిగ్గా పౌరుల ప్రాథమిక హక్కులను గౌరవించాలనే స్పృహ వారిలో కనబడటం లేదు. అందుకే నిర్ణయాలు తీసుకోవడంలో ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తున్నారు. సహచట్టం పకడ్బందీగా అమలు కావడానికి కొన్ని రకాల పద్దతులు పాటించాలి. సమాచార కమిషనర్ల నియామకానికి నిర్ధిష్ట అర్హతలు,అనుభవాలను ప్రమాణాలుగా నిర్ణయించి,వాటిని కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ప్రభు త్వం పరిష్కరిస్తున్న కేసుల సంఖ్య ఏడాదికి సగటున రెండువేల లోపుగానే ఉంటోంది. ఒక్కో కమిషనర్‌ ఆరువేలదాకా,వీలైతే అంతకన్నా ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. కేసులను 90రోజుల్లోగా పరిష్కరించాలనే నిర్ధిష్ట పరిమితుల్నీ విధిం చాలి.ప్రతి కమిషనర్‌ పనితీరును ఆరు నెలలకు ఒకసారి సమీక్షించాలి. తదుపరి రెండేళ్లలో సమాచారం కోసం అందే దరఖాస్తులు,వాటి పరిష్కారం గురించి అంచనా వేయాలి.దాన్ని వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెలా అందుకుముందు నెలలో కమిషనర్‌ పనితీరు గురించి వెల్లడిచేయాలి. అవసరాన్ని బట్టి ఎందరు సమాచార కమిషనర్లను నియ మించవలసిందీ ప్రభుత్వం ఆరునెలల ముందే ప్రకటించాలి. ఈ పదువులకు ప్రముఖులు నుంచీ దరఖాస్తులు స్వీకరించవచ్చు. ఇతరులు నామినేట్‌ చేసినవారినీ పరిశీలించి ఎంపిక చేయవచ్చు.అందుబాటులో ఉన్న సమాచార కమిషనర్‌ పదవులకు మూడురెట్లు ఎక్కువ పేర్లతో జాబితాను రూపొందించే పనిని యూపీఎస్సీ సభ్యులతో ఏర్పాటయ్యే కమిటీకి అప్పగించాలి. లేక మరేదైనా పద్దతినీ అనుసరించవచ్చు. ఆజాబితా నుంచి ఎవరిని ఎందుకు ఎంపిక చేసిందీ స్పష్టంగా వివరిం చాలి. పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సంబంధిత అన్వేషణ కమిటీ బహిరంగంగా ముఖాముఖి నిర్వహించాలి. పౌరులు,మాధ్యమాల అభిప్రాయాలనూ స్వీకరించాలి. తర్వాత అందుబాటులో ఉన్న సమాచార కమిషన్‌ పదవులకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేయాలి. ప్రధానమంత్రి/ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రితో కూడిన కమిటీ ఈ జాబితా నుంచి తుది నియామకాలు జరపాలి. సమాచార కమిషనర్లలో సగం మంది వయస్సు 60ఏళ్లకన్నా తక్కువ ఉండాలి. సమాచార హక్కు అమలుకు పాటుపడుతున్న ఉద్యమాకారులలో అరునలైన వారిని కమిషనర్లుగా నియమించాలి. సమాచార కమిషనర్ల ఎంపికను పారదర్శక ప్రక్రియను పాటించి,వారు తమ విధులను పకడ్బంధిగా నెరవేర్చలా నిరంతరం ఒత్తిడి తెస్తూ జవాబు దారీతనం పెంచినట్లుయితే సహచట్టం నుంచి మెరుగైన ఫలితాలను సాధించగలుగుతాం. అలాంటి ప్రక్రియనే ఇతర అనేక కమిషన్లకూ వర్తింపచేయవచ్చు.
సరైన ఫలితాలు శూన్యం
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పనితీరును తనికీ చేసి,పొరపాటు జరిగితే సరిదిద్ది సమతూకం సాధించే బాధ్యత సంబంధిత కమిషన్లపై ఉంది. ప్రస్తుతం పలు కమిషన్లు ఆశించిన స్థాయిలో విధులను నిర్వహించడం లేదు. చాలా కమిషన్లు సీనియర్‌ పౌరుల క్లబ్బుల్లా తయారయ్యాయి. పనిలేకుండా పదివిని, దాంతోపాటు వచ్చే సౌకర్యాలు,పారితోషకాలను అనుభవించే మార్గాలుగా మారాయి. నేడు మానవ హక్కుల కమిషన్‌,మహిళా కమిషన్‌, లోకాయుక్త వంటి కమిషన్లు ఉన్నా..వాటి నుంచి ఆశించిన ఫలితాలు లభించడం లేదు. సము చిత అర్హతలున్న వ్యక్తులను కమిషన్లుగా నియమిస్తూ,వారి పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ సమాచార కమిషన్లను సమర్ధంగా పనిచేయించడంపై దృష్టి కేంద్రీకరించాలి.
సమీక్ష అవసరం
పౌర సమాజం సైతం సమాచార కమిషనర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేయాలి. వారి నిర్ణయాలను ప్రతినెలా పారదర్శకంగా సమీక్షించాలి. ప్రతి కమిషనర్‌ పనితీరుపై మూడు నెలలకు ఒకసారి మూల్యాంకన పత్రాన్ని ప్రచురించాలి. సమాచార కమిషనర్ల నిర్ణయా లను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ మూల్యాం కన పత్రాన్ని రూపొందించే పనిని న్యాయ కళాశాల విద్యార్ధులకు అప్పగించ వచ్చు.
జీవోలు ఇచ్చి వెనక్కి తగ్గిన సర్కారు
తెలంగాణ ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో విడుదల చేసిన మెమో నంబర్‌ 3476 ప్రకారం సహ చట్టం కింద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులకు సమాచారం ఇవ్వాలంటే సదరు ప్రజా సమాచార అధికారి వారి ప్రభుత్వ విభాగానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హైకోర్టు ఆ ఉత్తర్వు లను నిలిపివేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం వివరణ కోరడంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసి వాటి స్థానంలో నవంబర్‌12 న అంతర్గత ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకా రం కోరిన సమాచారం తన వద్ద పూర్తిగా లేదని ప్రజా సమాచార అధికారి భావిస్తే ఉన్నతాధికారుల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు ఉత్తర్వుల్లో కొన్ని పదాలు మారినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం ఒకటే అన్నది స్పష్టమవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఆర్థిక వనరు లను,నిధుల వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జీవోలను దాస్తూ పారదర్శకతకు తిలోదకాలు ఇస్తున్నది. అలాగే సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్ర సమాచార కమిషన్‌ లో11 నుంచి-12 మంది సమాచార కమిషనర్లు పనిచేయాలి. కానీ మన రాష్ట్ర కమిషన్‌ లో ప్రస్తుతం కేవలం ఆరుగురు సమాచార కమిషనర్లు మాత్రమే ఉన్నారు. మిగతా కమిషనర్లను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.
పనితీరు సరిగా లేక..
2017 సెప్టెంబర్‌లో కొత్తగా తెలంగాణ సమాచార కమిషన్‌ ఏర్పాటైంది. బదిలీ అయిన పిటిషన్లు 6,825 కలుపుకొని మొత్తం38 వేల పిటిషన్లు కమిషన్‌?కు అందగా ఇప్పటివరకు 31 వేల పిటిషన్లను పరిష్కరించామని కమిషన్‌ చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో లెక్కలు మరోలా ఉన్నాయి. కొందరు సమాచార కమిష నర్ల షోకాజ్‌ నోటీసులు, జరిమానాల విషయం చూస్తే అర్థమవుతుంది. 2017 సెప్టెంబర్‌ నుంచి జూన్‌ 2022 వరకు సమాచార కమిషన్‌ 27,877 కేసుల్లో 753 కేసులకు సంబంధించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. వాటిలో కేవలం 38 మంది ప్రజా సమాచార అధికారులపై రూ.1,13,000 జరిమానాలు మాత్రమే విధించారు. ఒక్క కేసులో కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అప్పీళ్లు, ఫిర్యాదులు పరిష్కరించడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుందని ‘సతార్కు నాగరిక్‌ సంఘటన్‌’ నిరుడు అక్టోబర్‌ నెలలో విడుదల చేసిన తన నివేదికలో స్పష్టం చేసింది. కమిషన్‌ ఏర్పడిన ఈ ఐదేండ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్‌ ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. చట్టం అమలుకు సంబంధించి కమిషన్‌ ఏటా వార్షిక నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం కేసులు, పరిష్కరించినవి ,పెండిరగ్‌లో ఉన్నవి, జరిమానాలు విధించినవి, క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయాలను ప్రస్తావించాలి. కానీ కమిషన్‌ ఏర్పడిన ఐదేండ్ల లో ఒక్కసారి కూడా వార్షిక నివేదికను విడుదల చేయలేదు.
స్వచ్ఛంద సమాచార వెల్లడి ఎక్కడ?
సమాచార హక్కు చట్టంలో సెక్షన్‌ 4(1)బి చట్టానికి గుండెకాయ వంటిది. ఇందులో 17 అంశాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల వివరాలు వారి విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆ కార్యాలయానికి వస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు వీటన్నిటిని సంబంధిత ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా ప్రజలకు తెలియజేయాలనేది నిబంధన. రాష్ట్రంలో దాఖలవుతున్న దరఖాస్తులు 60 శాతం ఈ సెక్షన్‌ పరిధిలో సమాచారం కోరుతూ వస్తున్నవే. కానీ చాలా ప్రభుత్వ కార్యాల యాల్లో అయిదారేండ్ల కిందటి పాత సమాచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ శాఖలను ప్రశ్నించాల్సిన సమాచార కమిషన్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. ప్రజా సమాచార అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కార్యాలయ సమాచారాన్ని సరైన విధంగా డిజిటలైజ్‌ చేయలేకపోతున్నారు.అన్ని ప్రభుత్వ విభాగాలు తమ బడ్జెట్‌లో ఒకశాతాన్ని డిజిటలైజేషన్‌తో పాటు,సమాచారం మెరుగ్గా నిర్వహించడానికి వ్యయం చేయాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దాన్నెవరూ పట్టించుకోవడం లేదు.జాగృత జన వాహిని పిడికిలి బిగించకుంటే సమాచార హక్కుకు గ్రహణం తథ్యమని యూఎఫ్‌ఆర్టీఐ రాష్ట్ర కో కన్వీనర్‌ అంకం నరేష్‌ అభిప్రాయపడ్డారు.
సహ చట్టాన్ని నీరుగారుస్తున్నారు – నార్నె వెంకట సుబ్బయ్య
ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు,అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు తెలియచెప్పేం దుకు, పౌరులకున్న హక్కును చట్టబద్దం చేసేందుకు సమాచార హక్కు (సహ) చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం పెద్ద పోరాటమే జరిగింది. ఈ చట్టం రాకముందు ఆఫిస్‌కి వెళ్ళి బల్ల మీద చెయ్యి పెట్టడానికి కూడా వుండేది కాదు. ఈ చట్టం వచ్చిన తరు వాత ఖచ్చితంగా అడిగిన సమాచారం ఇవ్వా ల్సిన అవసరం వచ్చింది. పౌరునికి చదువు రాకపోయినా వారు కోరినవిధంగా అధికారులే ఫిర్యాదు రాసి అప్లికేషన్‌ పూర్తిచేసి పెట్టాలి. ఒకవేళ ఫిర్యాదులో అచ్చుతప్పులు దొర్లినా, భాషా పరిజ్ఞానం లేకపోయినా విషయం అర్ధమైతే చాలు. సమచారం ఇవ్వాలి.అలాంటి చట్టం వున్నప్పటికీ ఈరోజు అధికారులు కావల సిన సమాచారం ఇవ్వకుండా తప్పించు కుంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది అధికారులు కావాలని, ‘మీరు అడిగింది సెక్షను 8.1లోకో రెండు లోకో వస్తుంది కనుక సమాధానం ఇవ్వం’ అంటూ తప్పించుకుంటున్నారు. దేశ రక్షణకు సంబంధించినది అయితే ఇవ్వకూడదు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అవి నీతి గురించి మీరేం చర్యలు చేపట్టారు,సదరు పని జరగకపోవటానికి కారణాలు తెలపండి అనడిగితే అవి చెప్పటానికి ఇష్టంలేక ‘దీనికి సమాధానం మా కార్యాలయంలో లేదు. మా పరిధి లోకి రాదు’ అని తిప్పి పంపుతున్నారు. వారి దగ్గర లేకపోతే ఎవరి దగ్గరవుందో, వారికి ఫిర్యాదు పంపి, ఐదు రోజులలోపు ఆ సమాచారం ఫిర్యాదుదారునికి తెలపాలి. అంతేగాని ఇవ్వకుండా వుండకూడదు. దీనికంతటికి కారణం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన ఆర్‌టిఐ కమిషన్‌ వారు సరైన చర్యలు తీసుకోకపోవటం. దీంతో అధి కారులు తప్పుడు సమాచారం ఇచ్చి సహ కార్య కర్తలను నిరుత్సాహ పరుస్తూ, చట్టాన్ని నీరుగారు స్తున్నారు. కనుక ఇకనైనా చట్టాన్ని, అందులోని సెక్షన్లను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకొని జరిమానా విధించాలి. అప్పుడే సహ చట్టం బతుకుతుంది.

ఆదివాసీ సంస్కృతికి అద్దం

తెలుగు సాహితి చరిత్రలో కథాపక్రియ సదా వన్నె తరగని మకుటం లాంటిది,తెలుగు సమా జపు జీవిత చిత్రణ కథల్లో అగుపిస్తుంది. మానవ జీవితాల మనుగడకు అద్దంపట్టే కథా ప్రక్రియనే తన సామాజిక వర్గపు సంస్కృతి సాంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి అందిం చడానికి సాధనంగా చేసుకుంది పాల్వంచకు చెందిన ‘‘పద్దం అనసూయ’’ కోయ సామాజిక వర్గానికి చెందిన సాంప్రదాయాలనే తన కథా వస్తువులుగా తీసుకుని వ్రాసిన ఆమె కథలు, రాశి కన్నా వాసిలో ముందు నిలుస్తాయి. వాస్తవంగా తనకు రచనా రంగంలో అంతగా అనుభవంగానీ, ప్రవేశం కానీ లేవు, అయినా తనలోని భావాలను పదుగురితో పంచు కోవాలనే తపన తనను రచయిత్రిగా తయారు చేసింది. దానికి తోడు తన చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన జానపద కథల ప్రభావం కూడా బాగా పనిచేసింది.తన మాతృభాష అయిన కోయ భాషతోపాటు వృత్తి భాష అయినా తెలుగులో కూడా మనసుతో చదివిన అనసూయ జీవిత లక్ష్యం లిపిలేని తన మాతృభాష కోయ భాషను, తెలుగు లిపి సాయంతో దేశవ్యాప్తం చేయడమే. !! అందులో భాగంగానే తన సామాజిక వర్గపు భాషతో పాటు సాంస్కృతి సాంప్రదాయాలను అక్షరీకరించి భద్రపరిచి భావితరాలకు అందించడమే దీక్షగా పని చేస్తున్నారు. అందులో భాగంగానే 2019లో ఆమె ‘‘చప్పుడు’’ అనే పేరుతో కోయ కథా సంపుటి వెలువరించారు. అంతేగాక తొలి గిరిజన కథారచయత్రిగా కూడా తెలుగు కథ సాహిత్యంలో స్థానం సంపాదించారు. ఈ కథ సంపుటిలో కథలు 2009-2011సంవత్సరాలు మధ్య వ్రాయబడినవి, సాధారణంగా గిరిజన కథలు అనగానే పోరాటాలు,మోసాలు,దగాలు, రాజకీ యాలు,వగైరా వగైరాలు,కథా వస్తువులుగా ఉంటాయి,కానీ ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన కథలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు తమ గిరిజన సామాజిక వర్గ సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తే, మరో వైపు తనదైన గిరిజన స్త్రీ మానసిక వేదన లను మిళితం చేసినట్టు కనిపిస్తుంది. అనసూయ స్వతహాగా గిరిజన సామాజిక వర్గంకు చెందినవారు. నిత్యం తన సామాజిక వర్గపు స్త్రీలతో కలిసిమెలిసి జీవించిన వ్యక్తివారి భావాలను అను భవాలను బాధలను దగ్గరగా చూసిన స్వానుభవంగల మనిషి,సాధారణ సమాజపు స్త్రీవాదులచూపుకు, గిరిజన సామాజిక వర్గపు ఈ ఆడ బిడ్డ స్త్రీవా దపు దృష్టికి పూర్తి వైవిధ్యం కనిపి స్తుంది. తెలుగు సాహిత్యపు స్త్రీవాదాన్ని అనసూ య దిగుమతి చేసుకోలేదు కానీ‘‘గిరిజన మహిళల జీవితంలోని కష్టాలు’’అందరికీ తెలియాలి అని మాత్రం పూర్తిగా నమ్మింది. ప్రామాణిక కథా సిద్ధాంతాలు, పత్రికలవారి ‘‘నిర్దేశిత వలయ సూత్రాలు’’ తనకు తెలిసి ఉం డవు దరిమిలా ఆమె కథల్లో సంబంధిత కొలతలు కనిపించక పోవచ్చు,కానీ తనలోని ఆవేదనలను వ్యక్తీకరిం చు కోవడానికి రచయిత్రి పడ్డ శ్రమకు తోడు తనదైన భాష,తనకు మాత్రమే సొంతమైన కథన శైలి, వెరసి పాఠకు లకులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ కథల రచన కొనసాగింది. కథలశైలి ఎంత చిత్రమో! వాటి వస్తువు కూడా అంతే విచిత్రం గా ఉంది. ఈ సంపుటిలోని ప్రతి కథకు నేపథ్యం‘‘చావు’’, మనిషికి మరణం ఒక పోరా టం ప్రతి జీవన పోరాటం ఒక విప్లవంఅనే అర్థ సూత్రానికి కట్టుబడి ఈ కథలు రాశారు. కథలోని వస్తువు కన్నా వస్తువుకు నేపథ్యాలైన సంస్కృతి, సంప్ర దాయాల వెంటే ఆమెకథా ప్రయాణం సాగింది. ఈ కథలన్నీ గిరిజనస్త్రీని ముఖ్యపాత్రగా చేశాయి చావు సందర్భంగా బ్రతకు పోరాటం వివరిం చిన కథలు. మరణించిన గిరిజన మహిళల బతు కులను అక్షరీకరించిన ‘సమయ ప్రవా హికలు’ ఈ కథలు.‘కాకమ్మ’కథ మొదలు ‘మూగబోయిన శబ్దం’ వరకు సాగిన ఈ‘‘చప్పుడు’’ కథల పయనంలో పాఠకులకు సరికొత్త అను భూతి సంతృప్తి కలుగుతాయి అనడంలో నిండు నిజం దాగి ఉంది.‘కాకమ్మ’కథలో ప్రధాన పాత్ర ‘కాకమ్మ’ రచయిత్రి జ్ఞాపకాల సాయంతో గిరిజన సమాజం,సంస్కృతి,భాష, కలగలుపుకుని చక్కగా సాగుతుంది.కాకమ్మ వయసు పైబడిన వృద్ధ గిరిజనస్త్రీ,తన చిన్నతనం నుంచి తమ కుటుంబం బాగుకోసం ఎంతోకృషి చేసింది, తనకు తనదైనసంస్కృతి సాంప్రదాయాలంటే ప్రాణం.వాటిని పరిరక్షించుకోవడమే తన ధ్యేయం, కానీ తన వారసులు ఆధునికత పేరుతో సంస్కృతి సాంప్రదాయాలు పాటించ కుండా ఎవరిస్వార్థం కోసం వారు కట్టు తప్పి ముందుకు కదిలిపోయిన ప్రతి సంఘటనలు కాకమ్మ మనసును గాయపరుస్తాయి.కూతురు వేరే కులం వ్యక్తినిపెళ్లి చేసుకోవడం,కొడుకు తన పెళ్లి గిరిజన ఆచారం ప్రకారం చేయడం అనాగరికంగా భావించడం, మొదలైన సంఘ టనలతో కలత చెందిన కాకమ్మ చివరికి తన చావునైనా తనవాళ్లు తమపద్ధతిలో చేస్తారో చేయరో అని ఆవేదనపడి తానే తన కర్మకాం డలు గిరిజన సాంప్రదాయం ప్రకారం చేయ డానికి కావలసిన సరుకులు అన్నీ ముందు గానే సమకూర్చుకొని పాత భోషణం పెట్టెలో దాచి దాని తాళం చెవి తన వారికి అందించి, తన ప్రాణం తన ఇంట్లోనే పోవాలనే చివరి కోరికతో కన్నుమూస్తుంది కాకమ్మ. సంస్కృతి సంప్రదా యాల పరిరక్షణలో గిరిజన స్త్రీ పడే ఆవేదనకు ఈ కథ అద్దం పడుతుంది, రెండవ కథ సంపుటి శీర్షికఅయిన ‘చప్పుడు’ కథలో గిరిజన గూడెంకు చెందిన ‘పోతప్ప’ బ్రతుకు తెరువు కోసం భార్య ‘సుంకులు’తోకలిసి పాల్వంచ పట్ట ణం పోయి బ్రతుకు తుంటాడు. పట్టణం పోయిన తమ గిరిజన పద్ధతులు మానుకోలేదు ఆకోయ దంపతులు. దురదృష్టవ శాత్తు పోతప్ప భార్య సుంకులు చనిపోతుంది. ఆమె కర్మకాం డలు గిరిజన ఆచారం ప్రకారం చేయడానికి సిద్ధమే తగిన ఏర్పాట్లు చేసుకుం టాడు.14వ రోజు రాత్రిడోలి వాళ్ళడోలి వాయిద్యాల సాయంతో రాత్రి అంతా శబ్దాలు చేస్తూ ‘పూర్భం’ చెప్పి యాస పోసి చనిపోయిన వ్యక్తి ఆత్మను సాగనంపినప్పుడే గిరిజనుల ఆచార ప్రకారం కర్మ జరిగినట్టు. పోతప్ప తన భార్య కర్మకాండలు చేస్తున్న తీరు ఆడోలు వాయిద్యాల హోరుకు పట్టణంలోని ఆధునిక గిరిజనేతరులు అడ్డు తగలడం వారిని ఎదిరించి సింహంలా ఎదురు తిరిగి తనభార్య కర్మకాండ తమదైన పద్ధతిలో డోలు చప్పుళ్ళతో పోతప్ప పూర్తి చేయడం ఈ కథలో ఇతివృత్తం. ఎంతఎత్తుకు ఎదిగిన మన పూర్వ ఆచారాల పునాదిని వదల కూడదని సత్యాన్ని చాటింది ఈ ‘చప్పుడు’ కథ. స్వార్థం నీడలో ఆధునిక సమాజం ఎంతగా పాడైపోయినా గిరిజన సామాజిక వర్గంలో ఎప్పటికీ ప్రేమలు, ఆత్మీయతలు, ప్రవహిస్తూనే ఉంటాయి అని చాటి చెప్పిన కథ ‘ముసిలి’. తనకోసం మాత్రమే కాదు తన జాతి కోసం, గోత్రంకోసం,ఇంటి కోసం,కాకుండా తన ఊరి బాగు కోసం ఆలోచించి కష్టపడి కన్నుమూసిన ముసిలి చావును ఆఊరి వాళ్ళంతా ఓపండ గల చేయడం ఈ కథలో విశేషం.పరుల కోసం పాటుపడ్డ వారు చనిపోయి కూడా జీవిస్తారు అనే మంచి సందేశం ఇచ్చింది ఈ కథ.గతం వర్తమానాల మధ్య రెండు తరాల,రెండు మతాల,మధ్య ప్రస్తుతం అడవి బిడ్డల ఊగిసలాటను దృశ్యమానం చేసిన చివరి కథ ‘‘మూగబోయిన శబ్దం’’ ఇద్దరు కొడుకులు గల ‘‘పెద్దయ్య’’కు పెద్ద కొడుకు చనిపోవడంతో ఆ కర్మకాండల కోసం గూడెం గూడెం తిరిగి బంధువులకు కబుర్లు చెప్పుకొని అందరినీ పిలుచుకుంటాడు, కానీ మతం మారిన చిన్నకొడుకు తన అన్నకు కర్మకాండ తను మారిన కొత్త మతం ప్రకారం జరిపించడం చూసి ‘శిలువ బరువు’ భారం భరించలేక శోకసముద్రం గుండెల్లో దాచుకున్న పెద్దయ్య మానసిక స్థితి, గిరిజన సంప్రదాయాలను కమ్మేస్తున్న అన్యమత మేఘాలవల్ల పొంచి ఉన్న ప్రమాదపు హెచ్చరికలు రచయిత్రి ఈకథ ద్వారా అందించారు. కథల్లోని వాక్య నిర్మాణం, జాతీయాలు,సామెతలు,పలుకు బళ్ళు,అలం కారాలు,అన్ని అచ్చమైన అడవి బిడ్డల సాంప్ర దాయ వాతావరణంతో చూపించడం రచయి త్రికి అడవిబిడ్డలకు గల అనుబంధాన్ని తేట తెల్లచేస్తుంది. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

భాషా పితామహుడుగా రిషి రాజ్‌పాటిల్‌

కేంబ్రిడ్జ్‌లోని భారతీయ విద్యార్థి 2,500ఏళ్ల నాటి సంస్కృత పజిల్‌ను పరిష్కరించాడు.27 ఏళ్ల రిషి అతుల్‌ రాజ్‌పోపట్‌, సుమారు రెండున్నర వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృత భాషలో మాస్టర్‌ అయిన సంస్కృత భాషా మాస్టర్‌ పాణిని రాసిన వచనాన్ని డీకోడ్‌ చేసినట్లు నివేదించ బడిరది. కేంబ్రిడ్జ్‌ లోని సెయింట్‌ జాన్స్‌ కాలేజ్‌ లోని ఆసియన్‌, మిడిల్‌ ఈస్టర్న్‌ స్టడీస్‌ ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ విద్యార్థి రిషి రాజ్‌పోపట్‌. 2500 ఏళ్ల నాటి సంస్కృత సమస్యకు..భారతీయ విద్యార్థి పరిష్కారించడం అందరూ సంతోషించాల్సిన విషయం.- రెబ్బాప్రగడ రవి
మలివేద కాలంలో..ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే తొలిభాషా పితామహుడిగా పేరొందిన సంస్కృత పండితుడు పాణిని రాసిన‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథంలోని ధాతు నియమాల(మెటా రూల్స్‌)ను ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకు న్నారా?పాణిని వ్యాకరణంపై తొలిసారిగా భాష్యం రాసిన కాత్యాయనుడు కొన్నినిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడంవల్ల..అదే సంప్ర దాయం కొనసాగిందా?ఈప్రశ్నలకు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతంపై పీహెచ్‌డీ చేస్తున్న 27 ఏళ్ల భారత విద్యార్థి రిషిరాజ్‌ పోపట్‌ అవునని చెబుతున్నారు. క్రీ.పూ.4-5శతాబ్దాల మధ్యకాలంలో భారత వాయవ్యం(ప్రస్తుతం పాక్‌-అఫ్ఘానిస్థాన్‌ల మధ్య ప్రాంతం)లో పాణిని నివసించాడనడానికి ఆధారాలున్నాయి. సంస్కృతంపై ఆయన రాసిన ‘అష్టాధ్యాయి’ లోని వ్యాకరణ సూత్రాలు నేటికీ కొనసాగుతున్నాయి.‘‘అష్టాధ్యాయిని ఇంత కాలం మన పండితులు సరిగ్గాఅర్థం చేసుకోలేదు. ఆయన రాసిన ఎనిమిది అధ్యాయాల వ్యాకరణ పుస్తకంలో 4,000 నిబంధనలున్నాయి. పదాలను అర్థం చేసుకోవడం,కొత్తపదాల సృష్టి, విశేష ణాలు,విభక్తుల ప్రాధాన్యం.. ఇలా పలు అంశాలను ఈ నిబంధనలు స్పృశిస్తున్నాయి.గడిచిన 2,500 ఏళ్లుగా మన వాళ్లు ఈ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుని,వివరణలు ఇచ్చారు’’అని రిషి రాజ్‌పోపట్‌ వ్యాఖ్యానించారు. ‘పాణిని బోధించిన మెటారూల్‌ ప్రకారం..సమాన ప్రాముఖ్యం కలిగిన రెండు సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే..వ్యాకరణ క్రమంలో వచ్చే తర్వాతి సూత్రం వర్తిస్తుందని ఇప్పటి వరకూ పండితులు భావించారు. ఈనిబంధన వ్యాకరణకోణం నుంచి తప్పుడు ఫలితాలను ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. పదానికి ఇరువైపులా వర్తించే నియమాల గురించి చెప్పడమే పాణిని ఉద్దేశం.పాఠకుడు కుడివైపు నియమాన్ని ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం.అష్టాధ్యాయిలోని 1.4.2 నిబం ధన(విప్రతిశేధే పరం కార్యం)ను అర్థం చేసుకుంటే ఈ విషయం తెలుస్తుంది’’ అనిరాజ్‌పోపట్‌ వాదించారు.ప్రాథమిక శబ్దాల నుంచి నూతన పదాలు, వాక్యాలను రూపొం దించడానికి అవసరమైన నిబంధనలను పాణిని తన ‘అష్టాధ్యాయి’లో చక్కగా వివరించారని పేర్కొన్నారు. పాణిని అల్గారిథమ్‌ను సరిగ్గా అర్థం చేసుకుని,కంప్యూటర్‌ప్రోగ్రామ్‌ను రూపొందిస్తే..సంస్కృతం నుంచి ఇతరభాషల తర్జుమా కూడా సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరో రెండున్నరేళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాజ్‌పోపట్‌ పరిశోధనకు గైడ్‌(మార్గనిర్దేశకుడు)గా ఉన్న విన్సెంజో వెర్జియాని కూడా ఈకృషిపట్ల అభినందనలు తెలిపారు.శతాబ్దాలుగా ఎందరో పండితులు పరిష్కరించలేని సమస్యకు రాజ్‌పోపట్‌ మార్గ దర్శకుడయ్యారని, ఈపరిశోధనతో మరింత మంది సంస్కృత భాషపై ఆసక్తిచూపుతారని అభిప్రాయపడ్డారు.

అందరికీ న్యాయం అందేదెలా?

రాజ్యాంగం మనకు వివిధ చట్టాల ద్వారా చాలా హక్కుల్ని కల్పించింది. అయితే పొద్దున్న లేచించి మొదలు..రాత్రి పడుకునే వర కూ ఎక్కడో ఒకచోట ఏదోఒక సమస్య తలెత్తు తూనే ఉంది.మన చుట్టూ జరిగే అనేక మోసా లు,దోపిడీలు,నేరాలు-ఘోరాలు వంటివి నిత్యం మీడియాలో చూస్తూనే ఉన్నాం.. మరీ ముఖ్యం గా దళితులు,గిరిజనులు,మైనారిటీలు, మహి ళలపై అనేక రకాలుగా హింస పెరిగి పోతోంది. ఈవిషయాన్ని ఇటీవల ఎన్‌సి ఆర్‌బి విడుదల చేసిన గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిలో చాలామందికి న్యాయం అంద డంలేదు.అవగాహన లేక కొందరు మిన్న కుం డిపోతే.. అక్రమార్కులు, అరాచక శక్తుల ఆగడా లకు భయపడి మరికొందరు బాధితులు గానే మిగిలిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్లు,కోర్టుల్లోనూ అన్యాయం జరు గుతున్న దుస్థితి..ఈక్రమంలో రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులను ఎలా పొం దాలి..? తగిన న్యాయం..రక్షణకోసం ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి పరిమితమైన అంశా లపైనే అంశాలపై ప్రత్యేక కథనం.. (సురేష్‌ కుమార్‌ పొత్తూరి)

సుప్రీం తీర్పులు….: అనితకుశవహ వర్సెస్‌ పుషవ్‌ నుండాని14-21లోపొందుపరచబడినహక్కు,చట్టం ముందు అందరూ సమానమే.పౌరులందరికీ సామాజిక,రాజకీయ,ఆర్థిక న్యాయం జరగాలి. ఈ ప్రాథమిక సూత్రాలు రాజ్యాంగం యొక్క ఆదేశాలు. అనేక చోట్ల రాజ్యాంగంలో వీటిగురించి ప్రస్తావించ బడిరది. సమాజంలోపేద,బలహీనవర్గాలకు న్యాయ సహాయం అందించబడాలి.అదిఉచితంగా జరగా లని 39ఎ అధికరణ నిర్దేశిస్తుంది.
అందే సేవలు..: న్యాయవాది సేవలు అందుతాయి. అనగా కోర్టులో కక్షిదారుని తరపున వాదనలు విని పించబడతాయి.న్యాయ సలహాలు ఇవ్వబడ తాయి. సముచిత కేసులలో కోర్టులో చెల్లించవలసిన ప్రాసెస్‌ రుసుము,సాక్షికి అయ్యే ఖర్చులు,కోర్టు వ్యవహారంలో ఆకేసుకు అయ్యే ఇతర ఖర్చులు చెల్లించబడతాయి. కేసులో వాదనలు తయారుచేయడం. అప్పీలు దాఖలు చేయడం. కేసు కాగితాలు కోర్టులో దాఖలు చేసే విధంగా ఫైలు, పుస్తకాలు తయారు చేయడం. కాగితాలను అనువాదం చేయడం. వాదనలు లిఖితపూర్వకంగా తయారు చేయడం (డ్రాఫ్టింగ్‌) ధృవపరచబడిన తప్పులు,ఉత్తర్వులు,సాక్ష్యా లు చట్టపరమైన కాగితాలు అందించడం. మహిళా బాధితులకు నష్టపరిహారం..: అత్యా చారాలు,యాసిడ్‌ దాడులువంటి విషయాలలో మహిళలపైదాడులు జరిగినప్పుడు వారికిగాని, వారివారసులకుగాని నష్టపరిహారం చెల్లిం చేందు కు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘మహిళా బాధి తుల నష్టపరిహార నిధి’ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. న్యాయ సేవా సంస్థల సూచన మేరకు తగిన మొత్తాన్ని ప్రభుత్వం మహిళా బాధితులకు చెల్లిస్తుంది. ఈ విధానంతో చెల్లించే నష్టపరిహారం ఇతర నష్టపరిహారాలకు సంబంధంలేదు.ఈ నష్ట పరిహారం కోసం జిల్లాలో లేదా న్యాయసేవ సంస్థ లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసంస్థలలో దరఖా స్తుల నమూనాలు లభ్యమవుతాయి. లైంగిక దాడు లు జరిగినప్పుడు కూడా ఈ నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ సేవా పథకాలు..: ఈ న్యాయ సేవా సంస్థల ద్వారా సమాజంలో వివిధ రకాలైన నిస్సహాయ వ్యక్తులు అనగా విభిన్న ప్రతిభావంతులు, బాలలు, వృద్ధులు,గిరిజనులు,ప్రకృతి వైపరీత్యాల బాధితు లు, అసంఘటిత బాధితులు, నిరుపేదలు, మత్తు పదార్థాల బాధితులు మొదలైనవారి కోసం పథ కాలు ఏర్పాటు చేయబడ్డాయి.
న్యాయ సహాయం ఏ దశ నుండి లభిస్తుంది?..:
న్యాయ సహాయం కేసుల ప్రారంభం నుంచి అనగా సివిల్‌ కేసుల్లో దాఖలుఅయిన దగ్గర నుంచి సహా యం పొందవచ్చు.క్రిమినల్‌ కేసులలో ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలు అయిన దగ్గర నుంచి అనగా అరెస్టు కు ముందు నుంచి పొందవచ్చు. అలాగే కేసు యొక్క అన్ని దశలలోను అనగా అప్పీలు, రివిజన్‌ దశ లలో కూడా పొందవచ్చు.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?..: సమస్య ఉన్న ప్రాంతాన్ని బట్టి, సమస్యలో ఉన్న విషయాన్ని బట్టి ఆయా (తమకు దగ్గర) తాలూకా / మండల స్థాయి న్యాయ సేవా అధికార సంస్థల వద్ద ప్రథమంగా దాఖలు చేసుకోవాలి.ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య వలన ఆ సంస్థకు పరిధి లేకపోతే వారి సూచన మేరకు తగిన సంస్థలో దాఖలు చేయాలి. ప్రతి స్థాయిలోను అనగా తాలూకా,జిల్లా స్థాయి న్యాయ సేవా సంస్థలు తాలూకా, జిల్లా కోర్టులలోనే స్థాపించబడి ఉంటాయి. కాబట్టి తమకు దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న సంస్థను సంప్రదించడం ప్రథమ కర్తవ్యం.రాష్ట్ర స్థాయి సమస్యలు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల వద్ద పేర్కొనాలి. ఇవికాక రాష్ట్ర హైకోర్టులో న్యాయ సహాయం కావలసి వస్తే హైకోర్టు స్థాయిలో ప్రత్యేక సేవా సంస్థ ఉంటుంది. దానిని సంప్రదించవచ్చు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి సంస్థఉంటుంది. కనుక అక్కడా సంప్రదించవచ్చు.
లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు..: ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు గ్రామీణస్థాయిలో ఏవిధంగా వైద్య సహాయం అందిస్తాయో ఆవిధంగా గ్రామీణ ప్రజలకు, నిరక్ష రాస్య,నిరుపేద ప్రజలకు న్యాయ సహాయం అందా లనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన పథకం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌.ఈ విధానంలో సాధారణంగా ప్రతి ఆదివారం,బుధవారాలలో గ్రామాలలోని పంచాయి తీలు లేక స్థానిక సంస్థల కార్యాలయాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేయబడతాయి. ఈక్లినిక్‌లకు పారా లీగల్‌ వాలంటీర్లు,లీగల్‌ ఎయిడ్‌న్యాయవాదులు హాజర వుతారు.ఈక్లినిక్‌లలో గ్రామీణప్రాంతాలలో ఉన్న న్యాయ సమస్యలు కాక, వీధి దీపాలు,రహదారులు, ఇళ్ళ స్థలాలు వంటి సమస్యలు..వాటినిఎలా పరి ష్కరించుకోవాలో కూడా సలహాలు ఇస్తారు. అక్కడే ఏవైనానోటీసులు,జవాబులు,పిటీషన్లతయారీ, దర ఖాస్తులు మొదలైన విషయాలలో సలహాలు, సహా యం చేస్తారు.ఎక్కువ సహాయం అవసరమైతే న్యాయసేవా అధికార సంస్థకు ఆ కేసును పంపిస్తారు. ఈ విధంగా సహాయం చేయడం ద్వారా కేసులు కోర్టుల దాకా రాకుండానే పరిష్కరించేందుకు ప్రయ త్నం చేస్తారు.
కుటుంబ హింస ఎదుర్కోవాలంటే..: ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కుటుంబ హింస 20-50 శాతం వరకూ ఉంది.1946లో ఐరాస స్త్రీల స్థితిగ తుల అధ్యయనం కోసం ఏర్పరచిన కమిషన్‌ నివేదిక ఆధారంగా 1979 డిశంబరు 18న ఐరాస ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దీనిని ‘కన్వెన్షన్‌ ఆన్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఫామ్స్‌ ఆఫ్‌ డిస్‌ ఇంటిగ్రేషన్‌ ఎగైనెస్ట్‌ ఉమెన్‌’ అంటారు. ఈ ఒప్పందం అమలు కొరకు ఏర్పరిచిన కమిటి 1992లో కొన్ని సిఫార సులు చేస్తూ మహిళలపై హింస, వివక్ష ఉన్నాయనీ వాటిని అరికట్టాలనీ తనసిఫార్సు నెం.19లో పేర్కొంది. మహిళలకు వ్యతిరేకంగా జరిగే హింస అంతమొందించేందుకు ఐరాస ప్రకటన 1993లో మొదటిసారిగా కుటుంబ హింసను నిర్వచించింది. ఈనిర్వచనం మహిళలపై కుటుంబంలో జరిగే హింసను అన్ని కోణాల నుంచి నిషేధించింది. 1994లో మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసిన కమిటి,1995బీజింగ్‌ అంతర్జాతీయ మహిళా సమా వేశం రూపొందించిన ఉద్దేశ్యాలలో కూడా కుటుం బ హింస అరికట్టడం ప్రధానమైనది. అంతర్జాతీయ కుటుంబ హింసకు వ్యతిరేకంగా వచ్చిన ప్రకట నలు,ఒప్పందాలు, ప్రచారం ఫలితంగా44 దేశా లలో కుటుంబ హింసకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి.మనదేశంలో కూడా మహిళా సంఘాలు, ప్రజాతంత్ర వాదుల ఒత్తిడి ఫలితంగా కుటుంబ హింస నుంచిమహిళల రక్షణచట్టం-2005 వచ్చిం ది. ఒక మహిళను ఆమె భర్తగానీ, అతని బంధువు లుగానీ హింసిస్తే అది భారత శిక్షాస్మృతి 498ఎ కింద నేరం.ఈచట్టంలో భాగ స్వామి కావటానికి స్వచ్ఛంద సంస్థలకు,రిజిస్టరు సొసైటీలకు అవకాశం ఉంది.
రక్షణ.. ఆర్థిక సహాయం..: ఈచట్టం కేవలం చట ్టబద్ధమైన వివాహితే కాక,వివాహాన్నిపోలి ఉన్న సం బంధాన్ని కలిగియున్న మహిళలకూ రక్షణ కల్పిం చింది. బాధితురాలు ఏవిధమైన సంబంధం అనగా ఉమ్మడి కుటుంబం ద్వారా ఏర్పడిన,రక్త సంబం ధం ద్వారా ఏర్పడిన సోదరి,తల్లి,ఒంటరి మహి ళలు ఎవరైనా రక్షణ పొందవచ్చు. వీరున్యాయ సేవల అథారిటీల చట్టం 1987 ప్రకారం ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. కుటుంబ హింస వల్ల బాధితురాలికి అయిన ఖర్చులు, నష్టపరిహా రంగా ఆమెకు లేదా ఆమె పిల్లలకు తగినంత మొత్తాన్ని చెల్లించాలని హింసకు పాల్పడిన వ్యక్తిని మెజిస్ట్రేట్‌ ఆదేశించవచ్చు.
సహాయం ఎలా?..: బాధితురాలు ఈచట్టం ద్వారా సహాయం పొందుటకు మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి.ఈదరఖాస్తును బాధితురాలు స్వయం గాగానీ,రక్షణ అధికారుల ద్వారాగానీ లేదా ఆమె తరఫున మరి ఎవరైనాగానీ దాఖలు చేయొచ్చు. ఈదరఖాస్తులో తనకు కలిగిన బాధను వివరిస్తూ తనకు కావాల్సిన సహాయాన్ని అర్థించాలి.ఈ దర ఖాస్తు ద్వారా తనపై కుటుంబ వ్యక్తి నుంచి తగిన పరిహారం ఇప్పించమనీ కోరవచ్చు.
ఎన్నిరోజుల్లో పూర్తవుతుంది..: దరఖాస్తు అయిన తేదీ నుంచి సాధారణంగా మూడు రోజుల లోపల మేజిస్ట్రేట్‌ దరఖాస్తుల విచారణ ప్రారంభిస్తారు. విచారణ ప్రారంభమైన తేదీ నుంచి60రోజుల లోపల పూర్తిచేసేందుకు మేజిస్ట్రేట్‌ ప్రయత్నిస్తారు.
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం నేరం..: ఐపిసికి 2013లో వచ్చిన సవరణల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం సెక్షన్‌ 166 (ఎ) ప్రకా రం నేరంగా పరిగణించబడుతుంది.నిర్ధిష్టంగా 354,354ఎ,345బి,345సి(2),345డి,376 (ఎ),376బి,376సి,376డి,376ఇ సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించబడే సమాచారం అందినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే నేరంగా పరిగణిం చడుతుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచా రాల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఉద్దేశంతో ఈ సవరణ తీసుకురావడం జరిగింది.
సంక్షేమ పథకాలు పొందడంలో..:కేవలం న్యాయ పరమైన విషయాలు మాత్రమే కాక, ఏదైనా సంక్షేమ చట్టాలు ఉంటే వాటి ప్రకారం లబ్దిదారులకు రావా ల్సిన ప్రయోజనాలను పొందే విషయంలో సలహా లు,సహాయాలు అందిస్తారు.అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా సలహాలు, సహా యాన్ని అందజేస్తారు.ఆవిధంగా న్యాయాన్ని పొంద డంలో కావాల్సిన సహాయాన్ని అందిస్తారు.
ఫ్రంట్‌ ఆఫీస్‌ అంటే ఏంటి?..: న్యాయసేవలు అందుబాటులో ఉండేందుకు న్యాయసంస్థల్లో ఏర్పర చిన గదిని ‘ఫ్రంట్‌ ఆఫీసు’ అంటారు. అన్ని న్యాయ సేవా సంస్థలు ఈగదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ గదిలోనే న్యాయవాదులు, పారాలీగల్‌ వాలం టీర్లు అందుబాటులో ఉంటారు.ఈగది సమర్థ వం తంగా,నాణ్యతతో కూడి ఉండాలి. (వ్యాసకర్త: సుప్రీంకోర్టు న్యాయవాది)

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విఫత్తులు

‘‘ పర్యావరణ విధ్వంసం.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కీలక అంశం. మొన్నటి కరోనా.. నిన్నటి ఉత్తరాఖండ్‌ విలయం ఇవన్నీ మనుషుల ప్రాణాలను తీస్తున్నవే. అభివృద్ధి పాట పాడే ప్రభుత్వాలు, అవినీతి, అక్రమాలకు అలవాటుపడ్డ రాజకీయ నాయకులు, కార్పొరేట్లకు పర్యావరణం గురించి పట్టడం లేదు. దీంతో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. గత అనుభవాల నుంచి మనిషి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.!’
ప్రకృతి సహజంగా ఇచ్చిన అందా లను మనుషులు చేతులారా నాశనం చేస్తున్నా డు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నించ కుండా దాని చేదు ఫలితాలను, పర్యవసానా లను చవిచూస్తున్నాడు. ఇక అభివృద్ధి పేరు మీద చేస్తున్న విధ్వంసం గురించి చెప్పడానికే వీలు లేకుండా ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమో లి జిల్లాలో జరిగిన జల విలయం ఇదే విష యాన్ని వేలెత్తి చూపుతున్నది. రిషి గంగ వద్ద నిర్మాణంపూర్తి చేసుకున్న11మెగా వాట్ల హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ తనతోపాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులను తీసుకుని మునిగింది. ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీని కింద నిర్మాణంలో ఉన్న 530 మెగావాట్ల ఎన్టీపీసీకి చెందిన పవర్‌ ప్రాజెక్ట్‌ కూడా ధ్వం సం అయింది. ఈ ప్రమాదం రిషి గంగలో మంచు శిఖరం పగలడం వల్ల జరిగింది. ఐస్‌ లాగ గడ్డకట్టిన నదిలో వాతావరణంలో వేడి పెరిగి ఈ విలయం జరిగిందని ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. మొత్తం250మీటర్ల టన్నెల్‌ అంటే పొడవైన సొరంగాల్లో200మంది ఉద్యో గులు ఇరుక్కుపోయారు.16మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి.16వరకు శవాలను వెలికితీశాయి. మరో 175 మంది ఆచూకీ తెలియ లేదు. ఇంకా రెస్క్యూ పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు..గాయపడ్డ వారికి రూ.50వేల నష్ట పరిహారం ప్రకటించింది.
2013లోనూ ఇదే తరహాలో
2013లో ఇదే ఉత్తరాఖండ్‌లో జరిగిన కేదార్‌నాథ్‌ సంఘటన నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమి నేర్చుకుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అప్పుడు కూడా మెరుపు వరదలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.వేలకోట్ల రూపా యల ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగడం, అప్పటి కప్పుడు ఏవో చర్యలను ప్రభు త్వాలు ప్రకటించడం కామన్‌గా మారింది. ఆ తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనేది తాజా ఘటన చెబుతున్న సత్యం. ఎప్పటి కప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా తీసుకునే చర్యల గురించి ప్రభుత్వాలు, అధికారులు చర్చిస్తారు. అయితే వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం ఉండదు.
గుట్టలను, అడవిని నాశనం చేస్తున్నరు
ధౌలీనదిపైన నిర్మించిన హైడల్‌ ప్రాజెక్ట్‌ కింద ఎన్టీపీసీ తన ప్రాజెక్టు కడుతున్నది. దీన్ని తపోవన్‌గా పిలుస్తున్నారు. ఈడిజాస్టర్‌ వల్ల 15 గ్రామాల్లో ఆందోళన చెలరేగింది. గ్రామాలకు గ్రామాలు నదిలో మునిగిపోయా యి. ఏడు వరకు బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. వాస్తవానికి బఫర్‌ జోన్‌లో ఈప్రాజెక్టుల నిర్మా ణం చేపట్టారు. రేణిగావ్‌ గ్రామవాసులు హైడల్‌ ప్రాజెక్ట్‌ ను వ్యతిరేకిస్తూ ఎన్నోరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొన సాగించారు.పర్యావరణ పరిరక్షణ సంస్థలు.. పర్యా వరణ ప్రేమికులు కూడా దీనిని వ్యతిరే కించారు. అయినా ప్రాజెక్టు పని మాత్రం ఆగలేదు. 2013 లో ఈప్రాజెక్ట్‌ నిర్మాణదా రుడు సొరంగంలో ఇరు క్కుని మరణించాడు. కొద్దికాలంపాటు ఆగిన పనులు, మరో కొత్త వారికి కేటాయించడంతో తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈప్రాజెక్టు కోసం వేలాదిగా చెట్లను నరికి వేశారు. పదుల సంఖ్యలో అంద మైన గుట్టలను ధ్వంసం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడుతున్న గుట్టలను, అడవిని నాశనం చేసి ప్రాజెక్టులు కడుతున్నారు.
గతం నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు
కేదార్‌నాథ్‌ ట్రాజెడీ నుంచి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో గతంలో కలపతో ఇండ్ల నిర్మాణం చేపట్టేవారు. కానీ ఇటీవల కాలంలో కలప ఇండ్ల స్థానంలో కాంక్రీట్‌ ఇండ్ల నిర్మాణం పెరిగింది. మరోవైపు స్థానిక అవసరాలకోసం గుట్టల బ్లాస్టిం గ్‌లు విపరీతంగా పెరిగాయి. పర్యావరణ మార్పుల కారణంగా స్నో ఫాల్‌ సైతం తగ్గింది. హిమాచల్‌ ప్రదేశ్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఇలాగే ప్రాజెక్టులు కడుతు న్నారు. 2013లో కేదార్‌నాథ్‌ సంఘటన తర్వాత ఒక కమిటీ వేయగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్‌పర్ట్స్‌ 25 అంశాలపై సిఫారసులు అందజేశారు. ఇందులో గ్రేసియర్‌ బర్న్‌కు సంబంధించి మ్యాప్‌.. ట్రాకింగ్‌.. అంశాలు తెలుసుకునేలా సూచనలు చేశారు. స్నో ఫాల్‌ ఎంత..ఎన్ని లేయర్ల గ్రేసియర్‌ ఉంది.ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి లాంటి అంశా లు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ చేసిన కొన్ని సూచనలను అమలు చేసినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో మానిటరింగ్‌ చేయలేదు. అసలు వీటన్నింటినీ పక్కన పెట్టిన కారణం వల్లే కావచ్చు ప్రమాదాలు నిరంతరంగా జరగడం మాత్రం తగ్గడం లేదు.
అడవుల నరికివేత ఆపాలి
అభివృద్ధిపేరిట అడవిని నరికేసి గుట్ట లను ధ్వంసం చేసే విధానానికి ఇకనైనా స్వస్తి చెప్పాలి. అడవులను,గుట్టలను ధ్వంసం చేయడం మానేసివాటిని మరింత విస్తరించేప్రయత్నం చేయా లి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే దీని కోసం వేర్లలోతువరకు వెళ్లాల్సిందే. ఒక ఆపద వచ్చిన తర్వాత దానిపై యాగీచేసే బదులు ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషించి ఆపదలు రాకుండా చూసేలా నిర్ణయాలు తీసుకోవాలి.పర్యావరణ విధ్వం సంవల్ల కలిగేఆపద కూడా అంతే.. హిమా లయా ల్లోని మధ్య భూభాగంలో ఉత్తరా ఖండ్‌ ఉంది. ఇక్కడి నుంచే పర్యావరణ పరిరక్షణ మొద లు కావాలి. గుట్టలను చెట్లను కొల్లగొట్టడంపై నిషేధం ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అప్పుడే అడవు లకే కాదు మనుషుల ప్రాణాలకూ రక్షణ దొరుకు తుంది.
బఫర్‌ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నరు
తమ రాజకీయ అస్థిత్వం కోసం.. అధి కారాన్ని నిలబెట్టుకోవడం కోసం బఫర్‌ జోన్లలో ప్రాజెక్టులు కడుతున్నారు.మానవ వినాశనం జరుగు తున్నప్పటికీ ఇవి అవసరమా? అనే విషయాన్ని ఆలోచించకపోతే.. మానవుడి మీద ప్రకృతి పగ తీర్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉంటుంది. మన దేశంలోని పొలిటికల్‌ సిస్టమ్‌, అభివృద్ధి విలువ మనులు ఫ్రాణాలుగా మారింది. ఉత్తరాఖండ్‌ లో తాజా డిజాస్టర్‌ ఇదే విషయాన్ని చెప్పకనే చెబు తోంది.ఈవిలయంలో ఎంత మంది చనిపోయారనే దానికి సంబంధించి పక్కా సమాచారం కూడా అధికారుల వద్ద లేదు.రికార్డులు కూడా మునిగి పోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంటికిరాని, చేరని వారు, డ్యూటీకి వెళ్లి తిరిగి రాని వారి కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ విలయం వల్ల ప్రాజెక్టుల చుట్టూ నివసిస్తున్న వారి గోస వర్ణనాతీతంగా ఉంది.
పర్యావరణ విధ్వంసం ఇకనైనా ఆపాలి
పర్యావరణ కాలుష్యంతో ప్రకృతి జీవ నాడులు పట్టుదప్పుతున్నాయి. పల్లెలకు జీవకళ తప్పింది. ప్రకృతిని చూసే విధానంలో మార్పు రావొచ్చు కానీప్రకృతి మాత్రం మారదు. అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఆపసకపోతే పల్లెల స్వరూపమే మారుతుంది.ఈవిధ్వంసక ప్రయ త్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నా ఇటీవల కాలంలో మరింత ఊపందుకున్నాయి.ఈ నేపథ్యం లోనే పర్యావరణ సమస్య తీవ్రరూపం దాల్చింది. మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. దీనికి విరుద్ధం గా సాగించే ప్రయాణం మనిషి మనుగడకు, అస్తి త్వానికి పెనుసవాలుగా మారనుంది. అభివృద్ధి పేరిట ప్రకృతి గుండెల్లో చిచ్చు పెట్టే ధోరణిని అడ్డుకోవాలి.అభివృద్ధిపేరుతో పచ్చని చెట్లను, అడ వులను నిర్మూలిస్తున్నారు. తద్వారా పర్యావర ణం ముప్పుకు భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితిని పాలకులే కల్పిస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌తో పాటు ఇతర నిపుణుల సూచనలను కాదని యథే చ్ఛగా కొనసాగుతోన్న పర్యావరణ విచ్ఛిత్తిని అడ్డుకో వాల్సింది ప్రజలే. ఇబ్బడిముబ్బడిగా ఎరువుల వాడకం వల్ల చినుకు రాలంగానే పరవశించాల్సిన భూమి మనిషి వినాశకర విధానాలవల్ల ఉష్ణతా పంతో వేడెక్కిపోతోంది.అందుకే భూమి వేడెక్కింది. సారాన్ని కోల్పోయింది.సముద్రాల,నదుల, పర్వ తాల,అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించే విధా నాల్ని అనుసరించడం వల్ల మనం ముప్పును ఎదు ర్కోవడమే గాకుండా భవిష్యత్‌ తరాలకు వారస త్వంగా అందిస్తున్నాం. భూతాపం పెరగడానికి కారణమైన ఈ విధానాల పర్యవసానాలు రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. రసాయన ఎరువులు, విమానాలు విడుదల చేసే వాయువులు, అంతరిస్తున్న అడవులు- వెరసి ఓజోన్‌ పొరను బలహీనం చేస్తున్నాయి. ప్రకృతికీ, మానవాళికీ క్షేమకరంగా ఉండే ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించడం మన తక్షణావసరం. వర్త మాన తరాలకే కాదు భవిష్యత్‌ తరాలకు ఉపక రించే విధానాలు ప్రకృతి సమ్మతంగా ఉండాలి. ప్రకృతి సహజ వనరుల్ని దోచుకోడమే పురోగతి కాదు. ప్రకృతిఒడిలో మనుషులు హాయిగా ఉం డాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమే కాదు భావితరాలకు ఆరోగ్యకరమైన, సుందర సహజ ప్రకృతి గమనాన్ని అందించడం అవసరం. అందుకు అనుగుణంగా మన విధానాలను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చుకోవాలి. చెరువులను కాపాడు కోవడం,పశువుల సంతతిని పెంచడం,రసాయన ఎరువులను దూరం చేయడం అలవర్చుకోవాలి. పాతపద్దతుల్లోనే వ్యవసాయాన్ని సాధించాలి. సేంద్రియ ఎరువులను ప్రభుత్వమే పంపిణీ చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. చెరువులను కాపాడుకుంటూ బలోపేతం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొన్ని పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేయ బోతున్నాయి.గొర్లు, మేకల పెంపకం, పాడి అభి వృద్ది,చెరువులపునరుద్దరణ,చేపలపెంపకం వంటి వన్నీ పర్యా వరణ హితంతో కూడుకున్నవే. అలాగే గ్రావిరీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేవే. దేశం లోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువు లన్నింటి లోనూ ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసారు. ఇక గొర్రెలు, మేకల పెంపకం, హరిత హారం వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు కారణంగా పర్యావరణం పరిఢవిల్లడంతో పాటుగ్రావిరీణ ఆర్థికరంగం పుంజుకోవడం ఖా యంగా ఉంది. ఇవి దేశానికి దిశానిర్దేశం చేసేలా లబ్దిదారులు పాటుపడాలి.రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడితే పల్లె స్వరూపం మారి పచ్చ గా స్వాగతిస్తుంది.
పర్యావరణ విధ్వంసాలపై సీఎంకి లేఖ
పర్యావరణ పరిరక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై మాజీ ఐఏఎస్‌ అధికారి,కేంద్ర ఇంధన వనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఈ.ఎ.ఎస్‌.శర్మ నవంబరు 3న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు.ఆలేఖ పూర్తి సారాం శం ఇదీ..
ఎన్నో విషయాలలో ప్రభుత్వాధికారులు, వారి మీద అధికారం చెలాయించే రాజకీయ నాయ కులు,చట్టాలను,నిబంధనలను ఉల్లంఘిస్తూ,కార్పొ రేటు సంస్థలతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి, పర్యావ రణను ధ్వంసం చేసి,ప్రజలకు నష్టం కలిగించి, ఆవిషయాలలో ప్రజలు కోర్టులను ఆశ్రయించి నప్పుడు,చేసిన తప్పులు ఒప్పుకోకుండా కోట్ల రూపా యల ఖర్చు తో ఢల్లీి నుంచి పెద్ద న్యాయవాదులను రప్పించి,ఆ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రజలమీద రుద్దుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకు అయినఖర్చులను,బాధ్యులైననాయకులు, అధికారులు ఎందుకు భరించడం లేదు?
ఉదాహరణకు, ముందున్న ప్రభుత్వాలు శ్రీకాకుళంజిల్లాలో,సోంపేట ప్రాంతంలో, పర్యావ రణ పరిరక్షణ చట్టాన్ని, రాష్ట్రం ప్రవేశపెట్టిన వాల్టా చట్టాన్ని, ఇతర నిబంధనలను ఖాతరు చేయకుండా, ఉల్లంఘించి, 2008 సెప్టెంబరులో మంచి బీల భూములు ధ్వంసం చేస్తూ, వెయ్యికి పైగా ఎకరాల భూమిని ఒకకార్పొరేట్‌ సంస్థకు,థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పగించడం జరిగింది. బీలభూముల మీద ఆధారపడే మత్స్యకారుల, చిన్న కారు రైతుల ఉపాధులకు నష్టం కలుగుతుందనే విషయాన్ని,బొగ్గుమీద పనిచేసే పవర్‌ ప్లాంట్‌ కార ణంగా వచ్చే కాలుష్యంవలన,ప్రజల ఆరోగ్యం క్షీణి స్తుంది అనే విషయాన్ని, ప్రజలు ప్రభుత్వం దృష్టికి పదేపదే తెచ్చినా,అప్పటి నాయకులు, అధికారులు కార్పొరేట్‌ సంస్థ మీద ఉన్న వ్యామోహంతో గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవడం,ప్రజలు అడ్డుకుంటే, వారిని పోలీసు బలగాల సహాయంతో అణిచివేసి, కొంత మందికిప్రాణనష్టం కూడా కలిగించడం, దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వం స్పందించక పోవడంవలన, ప్రజాసంఘాలు కోర్టు లను ఆశ్రయించడం జరిగింది.పదేళ్లకి పైగా వ్యా జ్యాలు నడిచాయి. జాతీయ పర్యావరణ పరిరక్షణ ట్రిబ్యునల్‌ ప్రజల తరఫున తీర్పు ఇచ్చినా,అధికా రులు,నాయకులు, కార్పొరేట్‌ సంస్థ పక్షంలో పనిచే శారు.సలీంఅలీ సెంటర్‌ వంటి ప్రఖ్యాతమైన పర్యా వరణ పరిరక్షణ సంస్థ, కోర్టు ఆదేశాలకు అనుగు ణంగా సోంపేట బీలభూములు మీదఇచ్చిన రిపో ర్టు మీదకూడా,ప్రభుత్వంచర్యలు తీసుకోక పోవడం వలన, ప్రజాసంఘాలు చెన్నైలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవలసి వచ్చింది. ఆ కేసులో ఇచ్చినా,ఈరోజు వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోకపోవడం, నాయకులకు,అధి కారులకు కార్పొరేటు సంస్ధమీద ఉన్న ఆప్యాయతకు నిదర్శనం.ఈ కేసులలో, గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం వ్యర్థంగా చేసిన ఖర్చులు, ముఖ్యంగా న్యాయవాదులకు ఇచ్చిన ఫీజులే, కోట్లాది రూపా యలు ఉంటాయి.సోంపేట కేసులలో చట్ట ఉల్లం ఘనలకు బాధ్యులైన నాయకులనుంచి, అధికారు లనుంచి ఆ ఖర్చులకు అయిన మొత్తాన్ని సేకరించ డమే కాకుండా,బీల భూములకు కలిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకునివారి మీద పెనాల్టీలు వేసి, Iూజ క్రింద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అలాగే విశాఖపట్నంలో రుషికొండ మీద, ప్రభుత్వ పర్యా వరణాభివృద్ధి సంస్థ, మున్సిపాలిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా,విశాఖమాస్టర్‌ ప్లాన్‌ను ఉల్లం ఘిస్తూ,విస్తృతంగా పర్యావరణను ధ్వంసం చేసే కట్టడాలనుచేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేను ప్రభు త్వానికి ఎన్నోమార్లు రాయడం జరిగింది. అటు వంటి కట్టడాలు కాంట్రాక్టర్లకు లాభం కలిగించేవే కాని,ప్రజలకు కావలసింది కావు.
అయినా ఆ సంస్థ రాజకీయ నాయకుల మద్దతుతో,ప్రజాసంఘాల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా,గుడ్డిగా పనులు చేపట్టింది.ఇక ఎటు వంటి పత్యామ్నాయం కనిపిం చక పోవడం వలన, కొంతమంది,ప్రజల తరఫున హైకోర్టులో వ్యాజ్యా లను వేయవలసి వచ్చింది. ప్రజల ఉద్దేశాలను గౌరవించకుండా,ప్రభుత్వం ఢల్లీి నుంచి కోట్లాది రూపాయల ఖర్చుతో పెద్ద న్యాయ వాదులను రప్పించి కేసును నడిపిస్తున్నారని వార్తలు చదివాను. అటువంటి ఖర్చులను ప్రజలు ఎందుకు భరించాలి?అందుకు ఖర్చయిన మొత్తాన్ని బాధ్యులైన రాజకీయ నాయకుల నుంచి,అధికారుల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు?విశాఖపట్నం నగరం మధ్యలో ఉన్న దసపల్లా ప్రభుత్వ భూముల విషయంలోకూడా ప్రభుత్వంవైఖరి అలాగే ఉండ టం బాధాకరం. ఈవిషయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోర్టులను ఆశ్రయించినప్పుడు, కంచే చేను మేసినట్లు, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నాయకులు, వారికి దాసోహం అయిన అధికారులు,పూర్తివివరాలనుకోర్టు ముందు పెట్ట కుండా,ప్రభుత్వం తరఫు కేసును బలహీన పరచి, ఆ కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లాభం కలిగించే విధంగాఅమలు చేస్తున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో పనిచేసే దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేయడం దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది.
ఈ కేసులో కూడా, ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలను, ముఖ్యంగా న్యాయస్థానాలలో వ్యాజ్యాల మీద చేసిన ఖర్చుల వివరాలను,ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను. ఆఖర్చులను ప్రజలమీద రుద్దే హక్కు ప్రభుత్వానికి లేదు. దసపల్లా కేసులో వేలాది కోట్ల విలువ ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వడమే కాకుండా,ఎనిమిది దశాబ్దాల నుంచి ప్రభుత్వం ఉపయోగిస్తున్న సర్క్యూట్‌ హౌస్‌ భూమి కూడా చేయి జారే అవకాశం ఉంది. ప్రభుత్వాధి కారులు ప్రజల తరఫున పని చేయకుండా, ప్రైవేట్‌ వ్యక్తుల కోసం పని చేసి, కేసును బలహీనపరిచి, భూము లను అన్యాక్రాంతం చేసినందుకు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఈ కేసు మీద ప్రభుత్వం వ్యర్ధంగా న్యాయస్థానాల ముందు చేసిన ఖర్చును ప్రజలు ఎందుకు భరించాలి? ఈ మొత్తా న్ని వారి జీతాల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు? దసపల్లా భూముల ఆక్రమణ నేపథ్యంలో, ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు,ప్రైవేటు వ్యక్తు లతో,రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో,కుమ్మక్క యి, రెండు మూడు ప్రైవేటు కంపెనీలను ప్రారంభించి న వార్తలు వస్తున్నాయి.ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయిస్తే కాని అసలు విషయాలు బయటకు రావు.
ఈ విషయాలను మీ ముందు పెట్టడమే కాకుండా, ప్రజల దృష్టికి కూడా తీసుకువస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని, ఈ విషయాల మీద ప్రశ్నిస్తారు అని ఆశిస్తున్నాను. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు, అధికారులు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉందని గుర్తిం చాలని లేఖ రాశారు.- (ఎండీ మునీర్‌), ` వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌,న్యూఢలీి

1 2 3 5