పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల భ్రమ

పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రిక పరిస్థితుల్లో యూరప్‌ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగు పడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడి దారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. పెట్టుబడిదారీ విధానం మొదలైన తొలి కాలం లో అది నిరుద్యోగాన్ని పెంచుతుందని, దాని వలన పేదరికం పెరుగుతుందని…కాని, మొదట్లో కలిగిన ఈ నష్టాన్ని ఆ తర్వాత అది అభివృద్ధి చెందుతున్న కాలంలో పూడ్చివేస్తుందని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. మొదట్లో ఉపాధి పోగొట్టుకున్నవారంతా ఆ తర్వాత కాలంలో ఉద్యోగాలు పొంది కార్మికులుగా తిరిగి పనుల్లో చేరుతారని, నిరుద్యోగం తగ్గడంతో వేతనాలు పెరగడం ప్రారంభమౌతుందని, వేతనాలు పెరుగుతున్న కొద్దీ కార్మికుల ఉత్పాదకత కూడా పెరుగు తుందని వారు భావిస్తారు. గత చరిత్ర అనుభవాలు కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నట్టు పైకి చూస్తే అనిపిస్తుంది కూడా. మార్క్సిస్టు చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ అంచనా ప్రకారం పారిశ్రా మిక పెట్టుబడిదారీ విధానం మొదలైన తర్వాత బ్రిటన్‌ లో నిరుద్యోగం పెరిగింది. కాని 19వ శతాబ్దపు నడిమి కాలం నాటికల్లా పరిస్థితులు మెరుగుపడ్డాయి. కార్మిక వర్గానికి అనుకూలంగా మారాయి. ఈ విధమైన దృక్పథం ఉంటే పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందే సమయంలో ఎన్ని కష్టాలు కలిగినా, ఆ తర్వాత పెట్టుబడిదారీ విధానం వలన కార్మికులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి అన్న నిర్ధారణకి వస్తాం.ఈ విధమైన అవగాహన మొత్తంగానే తప్పు. పెట్టుబడిదారీ విధానం తాను తొలుత కార్మికవర్గానికి కలిగించిన నష్టాన్ని ఆ తర్వాత కాలంలో పూడ్చి వారికి మెరుగైన పరిస్థితులు కల్పిస్తుంది అని భావించడానికి ఎటువంటి సిద్ధాంత ప్రాతి పదికా లేదు. కార్మికుల స్థితిగతులలో తర్వాత కాలంలో కనిపించిన మెరుగుదలకు, పెట్టుబడి దారీ విధానపు సహజ సద్యోజనిత స్వభావానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇంగ్లీషు ఆర్థిక శాస్త్రవేత్త డేవిడ్‌ రికార్డో పరిశ్రమల్లో యంత్రా లను వినియోగించడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఈ విధమైన వాదన ముందుకు తెచ్చాడు. మొదట్లో యంత్రాల వలన కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి కష్టాలపాలౌతారని, కాని ఆ తర్వాత లాభాలరేటు పెరిగి పెట్టుబడి ఎక్కువగా పోగుబడుతుందని, దానితో మరిన్ని ఎక్కువ పరిశ్రమలు వస్తాయని, వాటిలో గతంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారందరికీ మళ్ళీ ఉపాధి లభించడమేగాక వారి స్థితిగతులు బాగా మెరుగు పడతాయని రికార్డో ప్రతిపాదించాడు. కార్మికుల జనాభా మరీ ఎక్కువగా పెరిగిపోకుండా ఉండేవిధంగా వాళ్ళు తమను తాము నియంత్రించుకుంటే వారి వేతనాలు పెంచుకోవచ్చునని కూడా ఆయన చెప్పాడు. రికార్డో వాదనలో రెండు లోపాలు ఉన్నాయి. పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది ఒకే ఒక్కమారు జరిగే ప్రక్రియగా ఆయన అభివర్ణించాడు. కాని వాస్తవంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొత్త కొత్త యంత్రాలను, నూతన ఉత్పత్తి ప్రక్రి యలను ప్రవేశపెట్టడం అనేది నిత్యం జరుగుతూనే వుంటుంది. యంత్రాలను మొదట ప్రవేశపెట్టినప్పుడు పెట్టుబడిదారుల లాభాల రేటు పెరగడం అనేది జరిగినా, వారి వద్ద పెట్టుబడి ఎక్కువగా పోగుబడినా, దాని ఫలితంగా అంతకు ముందు కోల్పోయిన ఉద్యోగాలన్నీ మళ్ళీ రావడం అనేది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఈ లోపునే మళ్ళీ కొత్త యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది జరిగిపోతూ వుంటుంది. అందుచేత ఈ విషయాన్ని నిరంతరం మారుతూ వుండే క్రమంలోనే చూడాలి. పరిశ్రమల్లో పెట్టే పెట్టుబడి వృద్ధి చెందే రేటు ‘జి’ అనుకుందాం. అప్పుడు ఉత్పత్తి వృద్ధిరేటు కూడా ‘జి’ యే ఉంటుంది (ఒకవేళ సాంకేతిక పరిజ్ఞానం పెంచడం కోసం అదనపు పెట్టుబడి పెట్టినా, దాని వలన శ్రామికులకు చెల్లించే వేతనాలు ఆ మేరకు తగ్గుతాయే కాని ఉత్పత్తి అయ్యే సంపదలో వృద్ధిరేటు మాత్రం పెట్టుబడిలో వృద్ధిరేటు ఎంత ఉంటుందో, అదే మోతాదులో ఉంటుంది). శ్రామిక ఉత్పాదకత వృద్ధిరేటు ‘పి’ అనుకుందాం. అప్పుడు అదనపు కార్మికుల అవసరం పెరిగే రేటు జి-పి ఉం టుంది. కార్మికుల జనాభా పెరిగే రేటు ‘ఎన్‌’ అనుకుంటే జి-పి కన్నా ఎన్‌ తక్కువ ఉన్నప్పుడే నిరుద్యోగం తగ్గుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలోజి-పి విలువ ఎన్‌ ను దాటి ఉండేట్టు చూసే ఏర్పాటు ఏదీ లేదు. కార్మికుల ఉత్పా దకత పెరుగుతూ మరోవైపు నిరుద్యోగం రేటు కూడా పెరుగుతూ వుంటే (అప్పుడు వేతనాల రేటు కనీస స్థాయిలోనే ఎప్పుడూ ఉండిపో తుంది) లాభాల రేటు పెరుగుతూ పోతుంది. దానివలన అదనపు పెట్టుబడి పోగుబడుతుంది. దానిని వినియోగించినప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు నిరుద్యోగం పడిపోతుంది.- రికార్డోను సమర్ధించేవారి వాదన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే రికార్డో వాదనలోని రెండో సమస్య ముందుకొస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి అయే సరుకులకు డిమాండు ఎప్పుడూ పెరుగుతూనే వుంటుంది అని రికార్డో భావించాడు. అందువలన ఉత్పత్తి పెరిగితే దాని ఫలితంగా లాభాలు పెరుగుతాయని, దానివలన అదనపు పెట్టుబడి పోగుబడు తుందని, ఈ ప్రక్రియకు ఎటువంటి ఆటంకమూ ఉండదని అతను భావించాడు. ‘’సరుకులు ఎంత ఎక్కువగా మార్కెట్‌ లోకి వస్తే అంత ఎక్కువ డిమాండ్‌ వాటికి ఉంటుంది’’ అన్న సూత్రాన్ని అతను విశ్వసించాడు. కాని లాభాలు రావాలంటే ఎక్కువ సరుకులు ఉత్పత్తి చేసినంత మాత్రాన సరిపోదు. అవన్నీ అమ్ముడు పోయినప్పుడే వాస్తవంగా పెట్టుబడిదారుడికి లాభం పోగుపడుతుంది. ఉత్పత్తి అయిన సరుకులన్నీ అమ్ముడుపోవాలంటే అది కొనుగోలు శక్తిని బట్టి ఉంటుంది. కొనుగోలుశక్తి వేతనాల రేటుని బట్టి ఉంటుంది. మరి వీలైనంత తక్కువ స్థాయిలో వేతనాలను ఉంచాలని పెట్టుబడి దారులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మార్కెట్‌ లో డిమాండ్‌ నిరంతరం పెరగడానికి గ్యారంటీ ఏమిటి? అందుచేత సాంకేతిక పరి జ్ఞానం పెరిగి దాని ఫలితంగా నిరుద్యోగం పెరిగితే, ఆ విధంగా ఉద్యోగాలను పోగొట్టు కున్నవారిని తిరిగి ఉద్యోగాలలో పెట్టుకోడానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎటువంటి ఏర్పాటూ లేదు. అందుచేత పెట్టుబడిదారీ విధానం ప్రారంభదినాల్లో కార్మికులకు నష్టం కలిగిం చినా, తర్వాత అది పుంజుకున్నాక కార్మికులకు మేలు జరుగుతుందన్న రికార్డో వాదనకు ఎటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికా లేదు.కాని వాస్తవ చరిత్ర చూస్తే సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగాక అక్కడి కార్మికుల స్థితి గతులు మెరుగుపడ్డాయి. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? యూరప్‌ ఖండం లోని కార్మి కులు చాలా భారీ సంఖ్యలో ‘’కొత్త ప్రపంచానికి’’ (అంటే అమెరికా ఖండానికి) వలసలు పోయారు. ఈ వలసలు మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేదాకా (1914) కొనసాగాయి. 19వ శతాబ్దంలో నెపోలియన్‌ యుద్ధం నాటినుండి మొదటి ప్రపంచయుద్ధం దాకా మధ్య కాలంలో దాదాపు 5కోట్ల మంది యూరోపియన్‌ కార్మికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు వలసలు పోయారని ఆర్థికవేత్త ఆర్థర్‌ లూయిస్‌ అంచనా వేశాడు. ఈ వలసలు ‘’అధిక వేతన’’వలసలు. అంటే ఆ కార్మికులు అంతవరకూ ఉండిన స్వస్థలాల్లోనూ, అదే విధంగా వాళ్ళు వలసలు పోయిన కొత్త ప్రదేశాల్లోనూ వేతనాలు అధికస్థాయిలో ఉన్నా యి. ఇదే కాలంలో ‘’అల్ప వేతన’’ వలసలు కూడా మరోవైపు కొనసాగాయి. ఈ రెండో తరహా కార్మిక వలసలు ఉష్ణ, సమశీతోష్ణ ప్రదేశాలైన ఇండియా, చైనా వంటి దేశాల నుండి ఫిజీ, మారిషస్‌, వెస్ట్‌ ఇండీస్‌, తూర్పు ఆఫ్రికా, నైరుతి అమెరికా వంటి ఉష్ణ, సమశీ తోష్ణ ప్రదేశాలకు జరిగాయి. ఇక్కడ ఆ కార్మి కుల స్వంత దేశాలలోనూ, వాళ్ళు వలసలు వచ్చిన దేశాల్లోనూ వేతనాల స్థాయి తక్కువగానే ఉంది. ఈ కార్మికులను శ్వేతజాతి కార్మికులు వలసలు వచ్చిన ప్రదేశాలకు రానివ్వలేదు (ఇప్పటికీ కోరుకున్న వారందరినీ అక్కడికి వలసలు రానివ్వడం లేదు). ఇలా ఒకవైపు అధిక వేతన వలసలు, మరోవైపు అల్పవేతన వలసలు ఎందుకు జరిగాయి? దీనికి లూయిస్‌ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆ కాలంలో బ్రిటన్‌ లో వ్యవసాయ విప్లవం జరిగి, తక్కిన యూరప్‌కంతటికీ విస్తరించింది అని, దాని వలన గ్రామీణ కార్మికులకు యూరప్‌ లో ఆదాయాలు బాగా పెరిగాయని అతను అన్నాడు. కాని ఆ విధమైన వ్యవసాయ విప్లవం ఏదీ బ్రిటన్‌ లో జరిగిన దాఖలాలు లేవు. మరి అసలు కారణం ఏమిటి? అధిక వేతన వలసల విషయంలో జరిగినదేమంటే యూరప్‌ నుండి వలసలు పోయినవారు అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రదేశాలలోని స్థానికులను వారి వారి భూముల నుండి తరిమివేసి ఆక్రమించుకుని వ్యవసాయదారులుగా స్థిరపడి అధిక ఆదాయాలు ఆర్జించసాగారు. మరోవైపు యూరప్‌ లో కార్మికవర్గం సంఖ్య వలసల కారణంగా తగ్గిపోయింది. అందుచేత ఇక్కడ కూడా కార్మికుల వేతనాలను పెంచక తప్పలేదు. ఒక శీతల దేశం నుండి మరొక శీతల దేశానికి జరిగిన వలసలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1820 నుండి 1915 మధ్య బ్రిటన్‌ లో ఎంత మేరకు జనాభా పెరిగిందో, అందులో సగం మేరకు అక్కడి నుండి వలసలు పోయారు. ఇటువంటి స్థాయిలోనే మన దేశంలో కూడా వలసలు జరిగివుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివకూ దాదాపు 50 కోట్ల మంది వలసలు పోయివుండాలి (యూరప్‌ లో జరిగిన వలసల ప్రభావం ఎంత బలంగా ఉండిరదో బోధపడడానికి ఈ పోలిక చూపడం జరిగింది.). ఆ విధంగా ఇతర దేశాలకు తరలిపోవడానికి యూరోపియన్‌ కార్మికులకు లభించిన అవకాశాలు వారి స్థితిగతులు బాగా మెరుగుపడడానికి దోహదం చేశాయే తప్ప పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి క్రమంలో స్వత:సిద్ధంగా కార్మికుల స్థితి గతులను మెరుగుపరిచే ఏర్పాటు అంటూ ఏదీ లేదు. ఇలా వేరే దేశాలకు పోయి అక్కడి స్థానికులను వెళ్ళగొట్టి వారి భూములను ఆక్రమించుకునే అవకాశం సామ్రాజ్యవాద దురాక్రమణ స్వభావం నుంచి వచ్చింది.సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా సంపన్న దేశాలలోని కార్మికుల స్థితిగతులు మెరుగుపడే అవకాశం వచ్చింది. ఇది కేవలం స్థానికుల నుండి భూములను లాక్కోవడం ద్వారా మాత్రమే కాదు. సంపన్న దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులకు డిమాండ్‌ కల్పించడానికి, తద్వారా సంపన్న దేశాలలో అదనపు ఉద్యోగాలు కల్పించడానికి సామ్రాజ్యవాదులు తాము ఆక్రమించుకున్న వలసలలో చేతివృత్తిదారులను, చిన్న తరహా ఉత్పత్తిదారులను భారీ స్థాయిలో దెబ్బ తీశారు. అంటే ఒకవిధంగా సామ్రాజ్యవాదం సంపన్న దేశాలలోని నిరుద్యోగాన్ని వలస దేశాలలోకి ఎగుమతిచేసిందన్నమాట. ఆ వలస దేశాలకు తమ తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోగలిగిన సత్తా లేదు. అవన్నీ సంపన్న దేశాల ఆధీనంలోనే ఉండేవి. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రిక పరిస్థితుల్లో యూరప్‌ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగుపడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. దీనిని బట్టి యూరప్‌ ఖండంలోని కార్మికులు సామ్రాజ్యవాద దోపిడీ పట్ల మెతకగా ఉంటారన్న అభిప్రాయానికి రాకూడదు. సామ్రాజ్యవాద దోపిడీ విధానం నడిచే తీరు ఇలానే ఉంటుంది. వ్యాసకర్త : సీనియర్‌ పాత్రీకేయులు(ప్రజాశక్తి సౌజన్యంతో..)

ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం గొంతు నులమొద్దు

ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47 మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేకపోవడం…ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చుకుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది. – (ఉదయ్‌భాష్కర్‌ రెడ్డి)
మోడీ ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌) గొంతు నులిమేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తూనే వుంది. ఆర్థిక వ్యవస్థ మరింత ‘సమర్ధవంతంగా’, ‘ఉత్పాదకంగా’ పని చేసేలా మార్గనిర్దేశనం చేయాలంటే ప్రైవేటు రంగాన్ని అనుమతించాలని, అందుకుగాను ప్రభుత్వ వ్యయంలో కోత పెట్టాలని నయా ఉదారవాద సిద్ధాంతం పేర్కొంటున్నది. దీనికి కట్టుబడిన మోడీ ప్రభుత్వం క్రమం తప్పకుండా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా వివిధ సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత పెడుతూ వస్తోంది. అంతేకాకుండా పథకాల గొంతు నులిమేందుకు ఇతర మోసపూరిత చర్యలను కూడా చేపడుతోంది.
ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ విషయానికి వస్తే, 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు కేటాయింపులు జరపాలని ప్రతిపాదించబడిరది. కానీ, వాస్తవానికి రూ.89,400 కోట్లు ఖర్చు చేసి వుంటారని అంచనా. అంతకు ముందు సంవత్సరం 2021-22లో ఖర్చు పెట్టిన రూ.98,467.85 కోట్లలో దాదాపు పది శాతం తక్కువ. అయితే 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపులో ఏకంగా 33 శాతం కోత పెట్టారు.
ప్రభుత్వం ఈ పథకానికి కేటాయింపులు తగ్గించడం ఒక్కటే కాదు. పలురకాల కొర్రీలు పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో, ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు తప్పనిసరిగా అటెండెన్స్‌ (హాజరు) నమోదు చేయాలంటూ నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సర్వీస్‌ (ఎన్‌.ఎం.ఎం.ఎస్‌) పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో కార్మికులు తమ హాజరును నమోదు చేయడం కోసమే గంటల తరబడి ప్రయాస పడాల్సి వస్తోంది. హాజరు పడకపోతే, ఆ రోజుకు వారి వేతనం నష్టపోతారు కాబట్టి ఇది వారికి జీవన్మరణ సమస్యగా మారింది. పథకంలో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనడానికంటూ ఈ తరహా హైటెక్‌ చర్యలను కార్మికులపై బలవంతంగా రుద్దడం ప్రభుత్వ కుట్ర మినహా మరొకటి కాదు. పిడిఎస్‌ పంపిణీలో కూడా గతంలో ఇదే పద్ధతిని రుద్దారు. ప్రభుత్వ పాఠశాల టీచర్ల హాజరు విషయంలోనూ ఇలాగే చేశారు. వీటన్నిటివల్లా ప్రజలకు గందరగోళ, విచారకర పర్యవసానాలే కలుగుతున్నాయి. కనెక్టివిటీ సమస్యలతో పాటుగా ఆధార్‌ సరిపోలడం లేదని,బ్యాంక్‌ ఖాతా నెంబరు కలవడం లేదని,చేతి వేళ్ళ గుర్తులు పడడం లేదని, ఇంకా ఇలాగే అనేక సమస్యల కారణంగా పిడిఎస్‌ రేషన్‌ వేలాది మందికి అందకుండా పోయింది. ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌ కార్మికులు సైతం ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నిబంధనల కారణంగా కార్మికులు పని కోసం ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ ను ఆశ్రయించడం తగ్గిపోతున్నది.
వేతనాల్లో నిరంతరం జరుగుతున్న జాప్యం కార్మికులకు ఎదురవుతున్న మరో సమస్య. ఒకోసారి అనుమతించిన 15 రోజుల వెసులుబాటును కూడా మించి జాప్యం జరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 15 అంతకుమించి రోజుల జాప్యం తర్వాత రూ.3630 కోట్ల వేతనాలు చెల్లించారు. ఇంకా రూ.1010 కోట్ల వేతనాలు పెండిరగ్‌లో వున్నాయని ప్రభుత్వ డేటా పేర్కొంటోంది. చాలా తక్కువ కూలికి పని చేసే కార్మికులకు ఈ స్థాయిలో ఇలా వేతనాలు పెండిరగ్‌లో పెట్టడమనేది ఏ మాత్రమూ సహించరాని విషయం. దీంతో వారు తరచుగా తక్షణమే డబ్బులు చేతికి అందివచ్చే పనులను ఎంచుకుంటున్నారు. ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాల కన్నా తక్కువే వచ్చినా వారు దానికే మొగ్గు చూపుతున్నారు. ఈలోగా ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను 2 నుండి 10 శాతం మధ్య పెంచుతున్నట్లు చాలా అట్టహాసంగా ప్రకటించింది. అంటే రోజుకు రూ.7 నుండి రూ. 26 వరకు పెరుగుతాయి. గత అనేక మాసాలుగా ద్రవ్యోల్బణం 6-8 శాతం మధ్యలో వుంది. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా 8-10 శాతం మధ్య వుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ అధిక ద్రవ్యోల్బణం తగ్గుతుందని విశ్వసించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదు. ఇక కార్మికుల వేతనాల పెంపు అమలు కూడా రాబోయే ఆర్థిక సంవత్సరం నుండే. వాస్త వానికి, వ్యవసాయ కార్మికులకు అలాగే వ్యవసాయేతర కార్మికులకు ప్రస్తుతమున్న వేతనాల రేట్ల కన్నా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ వేతనాలు చాలా తక్కువగా వున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎం.జి.ఎన్‌. ఆర్‌.ఇ.జి.ఎస్‌ పనులకు సంబంధించి సగటు దినసరి వేతనం కేవలం రూ.217.87. అదే సమయంలో పురుష వ్యవసాయ కార్మికులకు రూ.349.77 అని ఆర్‌బిఐ పేర్కొంది. అలాగే ఈ పథకంలో ఈ ఏడాది సగటు పనిదినాల సంఖ్య కేవలం 47మాత్రమే. కనీసం ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం పేర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పని కల్పించింది అందులో సగం కూడా లేదు. ప్రాణాంతకంగా మారిన ఈ ఆంక్షలకు తోడు, తక్కువ వేతనాలు. అది కూడా సమయానికి సరిగా అందని వేతనాలు, డిజిటల్‌ అడ్డంకులు, సరిపడా పని దినాలు లేక పోవడం…ఇవన్నీ కలిసి ఈ పథకం కింద పని దొరకబుచ్చు కుంటున్న కుటుంబాల సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది.
అధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పని దొరికిన వారు 8.6 కోట్ల మంది వుండగా, గతేడాది ఈ సంఖ్య 10.6 కోట్లుగా వుంది.అంటే గతేడాది కన్నా 2 కోట్లు (దాదాపు 20శాతం) తగ్గింది. పైగా ఈ పథకంలో పని కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 1.6 కోట్ల మంది కార్మికులు తర్వాత పని లోకి వెళ్లకుండా వెనుదిరిగారు. అలాంటి వారిని పరిగణన లోకి తీసుకోకుండా వేసిన లెక్క ఇది.
తక్కువ వేతనాలు, సరిపడా పని దినాలు లేకపోయినా ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ అనేది కోట్లాదిమంది కుటుంబాలకు జీవనాధారంగా వుంది. ఈ పథకంలో ఇచ్చేది అతి తక్కువ వేతనాలే అయినప్పటికీ అవే వారికి ఎంతో విలువైనవి. ఎందుకంటే దేశంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పైగా పెరుగుతున్న ధరలు కుటుంబాల బడ్జెట్‌ను ధ్వంసం చేస్తున్నాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభమనేది ఎడతెగకుండా వుంది. వేతనాలు, పని దినాలు పెంచుతూ, పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ, ఉపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఇప్పుడు నెలకొంది. దీనితో పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటంగా మారిన ఆటకు అంతం పలకాలి.
ఉపాధిపై కుంటిసాకులుయూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఉపాధి హామీ పథకానికి గడచిన ఎనిమిది సంవ త్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పైగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత తగ్గిందంటూ వితండవాదన చేస్తోంది. నిజానికి ఈ పథకం పనులకు గిరాకీ తగ్గి 34 నెలల కనిష్ఠానికి చేరింది. పనులకు గిరాకీ తగ్గడం వల్ల నిరుద్యోగం తగ్గినట్టేనని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనలో లాజిక్‌ ఉన్న మాట నిజమే కానీ, గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగార్థులకు చేతినిండా పని దొరకుతోందా? అలా దొరికితే గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు నగరాలు, పట్టణాలకు ఎందుకు తర లివస్తున్నారు. గతంలోకంటే పట్టణాలు, నగరాలకు గ్రామాల నుంచి వచ్చిన, ఇప్పటికీ వస్తున్న జనాభా పెరు గుతోంది. వీరంతా గ్రామాలలో పనులు దొరకకపోవ డంవల్లనే పట్టణాలు, నగరాలకు తరలివస్తున్నారు. గ్రామాల్లో హుందాగా, గౌరవంగా జీవించే యువత, ముఖ్యంగా ఉద్యోగార్థులు నగరాలు, పట్టణాలలో అమా నవీయ వృత్తులకు సైతం సిద్ధపడుతున్నారు. ఉపాథి హామీ పనులకు గిరాకీ తగ్గిందన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు. గత ఏప్రిల్‌లో 3 కోట్ల 23 లక్షల మంది ఈ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా, జూన్‌లో వారి సంఖ్య 4 కోట్ల 32 లక్షలకు చేరింది. అంతకుముందు రెండు సం వత్సరాలు కరోనా దెబ్బవల్ల ఉపాథి హామీకి గండిపడిన మాట వాస్తవమే. కరోనా తగ్గిన తర్వాత గ్రామాలలో వ్యవసాయ, చేనేత వస్తు కళా రంగాలలో పనులు పుంజు కుంటున్నాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో పనులు పెరుగుతూండడమే ఇందుకు ఉదాహరణ. గ్రామీణ ఉపాథికి డిమాండ్‌ తగ్గిందనుకుంటే అందుకు కారణం వెంటనే బిల్లులు చెల్లించకపోవడమే. నైపుణ్యం అవసరం లేని పనులలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పాటు పని కల్పించాలి. కానీ 2021-22 సంవత్సరంలో 60.70 రోజులు మాత్రమే పనులు కల్పించారు. నిధుల కేటా యింపును బట్టే పనుల కకేటాయింపు ఉంటుంది. అంటే నిధుల కేటాయింపు తగ్గడం వల్లనే ఇలా జరుగు తోంద న్నమాట. ఈ విషయాన్ని మరుగుపర్చి ఉపాధి కోరేవారి డిమాండ్‌ తగ్గిపోయిందంటే నమ్మడానికి ప్రజలు అంత అమాయకులా? పెద్ద పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన బ్యాంకు రుణాల బకాయిలను వందల కోట్లలో మాఫీ చేసిన, ఇప్పటికీ చేస్తున్న ప్రభుత్వం ఉపాధి పనుల నిధులలో కోత విధించడం ముమ్మాటికీ తప్పే. పైగా ఉపాథి పనులకు గిరాకీ తగ్గిందనడం ఓ కుంటిసాకు మాత్రమే. ఉపాథి హామీ పనులకు 15 రోజుల లోపు నిధు లు విడుదల చేయాలి. కానీ అలా జరగడం లేదు. నిధుల విడుదల అనేది నిరంతర ప్రక్రియ. దానికోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రోజుల తరబడి ఢల్లి%స%లో తిష్టవేసి లాబీయింగ్‌ చేయాల్సి వస్తోంది. అలా చేసినా పూర్తిస్థాయిలో నిధులు విడుదల కావడం లేదు.
కూలీలకు ‘ఉపాధి’ కష్టాలు
పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వాలు పనులు కల్పిస్తుంది. కాని కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల్లో ఎన్‌ఎంఎంఎస్‌ నూతన సాంకేతకత యాప్‌ ప్రవేశ పెట్టడంతో ఉపాధి కూలీలకు కష్టాలు తప్పడం లేదు. వాస్తవంగా పనులు చేసిన గ్రామం నుండి వేతనదారుల పనులకు సంబంధించి కూలీల హాజరు, ఫోటో తప్పనిసరిగా ఆయా సంఘాల మెట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు యాప్‌ ద్వారా పంపించాలి. సిగల్‌ సమస్య తలెత్తడంతో పాటుగా మేట్లు కొన్ని సందర్భాల్లో తప్పుడు నివేదిక ఇవ్వడంతో ఈ యాప్‌ ద్వారా ఎన్నో గ్రామాల్లో పనులు చేస్తున్న కూలీలు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేసినప్పటికీ బ్యాంకు ఖాతాలో కూలి జమ కాలేదని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 ముందు వేతనదారులకు తాగునీటి అలవెన్స్‌, టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అప్పటి ప్రభుత్వాలు అందించేవని, గత ఏడాది నుంచి ఎంఎంఎస్‌ యాప్‌ కొత్త విధానం రావడంతో ఉపాధి కూలీలకు పనులు వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవని కూలీలు వాపోతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పనులు చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలు మండల, డివిజన్‌, జిల్లా కేంద్రాలకు స్పందనలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ యాప్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.. దీంతో ఉపాధి కూలి అందక వేతన దారులు లబోదిబోమం టున్నారు.
సుదీర్ఘకాల డిమాండ్‌
గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ కల్పించే చట్టం చేయాలని సుదీర్ఘకాలం పాటు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. మధ్యలో పనికి ఆహార పథకం వంటి కార్యక్రమాలు కొంత మేరకు అమలు చేశారు. చివరకు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2005లో పార్లమెంటులో చట్టం రూపొందించి 2006 నుంచి అమలు ప్రారంభించారు. ఆ సంవత్సరం ఫిబ్రవరి నుంచి దేశంలో వెనకబడిన 200 జిల్లాల్లో మొదట అమలు చేశారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే కరువు సమస్యతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా బండ్లపల్లి వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. స్థానికుల రాగి సంకటి ఆరగించి సంతృప్తి వ్యక్తం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

పాలకుల విధానాలు ప్రకృతి శాపాలు

మార్చి నెలలో రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో భారీ గాలులు, వడగళ్ల వర్షాలు రైతులను నిట్టనిలువునా ముంచాయి. చేతికి వచ్చిన పంటలు కొద్ది నిమిషాల్లోనే నేలపాలయ్యాయి. కోట్ల రూపాయల రైతుల పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. దాంతో రైతు కుటుంబాల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా ఈ వడగళ్ల వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. ప్రకృతి వైపరీత్యాల పేరుతో తరాల నాడు రూపొందించుకున్న నిబంధనలే నేటికీ అమలవుతున్నాయి. అసాధారణ పరిస్థితుల వల్ల రైతు అసాధారణంగా నష్టపోతే ప్రభుత్వాలు చేసే సహాయం కూడా అసాధారణంగా వుండాలనే కనీస విజ్ఞతను పాలకులు పాటించడంలేదు.
రాష్ట్రంలో వడగళ్ల వానల వల్ల 3 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించారు. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల వానల వల్ల అరటి, మామిడి, బత్తాయి, పుచ్చకాయ, బొప్పాయి, టమోటా, మిరప, మొక్కజొన్న, వరి పంటలు భారీగా నష్టపోయాయి. ఇందులో ఉద్యానవన పంటలు 4,843 ఎకరాలు, ఇతర పంటలు 7,525 ఎకరాల్లో నష్టపోయినట్లు జిల్లా అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి ఇంతకు రెండిరతలు వుంటుంది. శ్రీసత్య సాయి, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. పొరుగున వున్న తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేసి, ఎకరాకు రూ. పది వేల నష్టపరిహారాన్ని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. మనకు మాత్రం పరిహారం ఎంత ఇస్తారో ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వడంలేదు.
పంట నష్టం అంచనా – ద్వంద్వ ప్రమాణాలు
అనంతపురర జిల్లాలో 16 మండలాల్లోని 46 గ్రామాల్లో 4,843 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోయాయి. ఇందులో ఒక్క అరటి పంట 2,769.4 ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఒక ఎకరా అరటి సాగుకు కనీస పెట్టుబడి ఖర్చు రూ.లక్ష 30 వేలు అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత పంట పెట్టుబడి నష్టం రూ.36 కోట్లు. ప్రస్తుత ధర ప్రకారం దిగుబడి ఆదాయం కలిపితే సుమారు రూ.వంద కోట్లకు పైగా వుంటుంది. అయితే రూ. 6,655 కోట్లు మాత్రమే నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పంటల పెట్టుబడి ఖర్చు ఆధారంగా ఇచ్చే బ్యాంకు రుణాలు, పంటల నష్టం ఆధారంగా ప్రభుత్వాలు లేదా ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెల్లించే పరిహారాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను ప్రభుత్వాలు రూపొందించుకున్నాయి. ఉదా: అరటి పంట ఎకరా సాగుకు బ్యాంకులు ఇచ్చే రుణ సదుపాయం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా ఎకరాకు రూ.లక్ష 25 వేలు, పంట నష్టం అంచనా మాత్రం హెక్టారు (రెండున్నర ఎకరాల)కు రూ.25 వేలు. వరి ఎకరా సాగుకు రూ. 35 వేలు ఖర్చు అవుతుంటే, పంట పూర్తిగా నష్టపోతే రూ. 8,433గా అంచనా వేశారు. కోస్తా జిల్లాలో మిర్చి పంట సాగుకు ఎకరాకు రూ.2.50 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాని ప్రభుత్వం రూపొందించుకున్న నిబంధనల ప్రకారం నామమాత్రపు పరిహారం అందేలా వుంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భీకర గాలులతో మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. నేల రాలిన మామిడి కాయల ఆధారంగా పంట నష్టం అంచనా వేయడానికి నిబంధనలు అంగీకరించవు. ఇలాగే మొక్కజొన్న తదితర పంటల నష్టానికి, పరిహారం అందించేందకు రూపొందించుకున్న నిబంధనలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనాల విలువ మొత్తాన్ని ప్రభుత్వం అరటి రైతులకు చెల్లించిన రైతు నష్టంలో కేవలం ఆరు శాతం మాత్రమే అవుతుంది. నష్టంలో ఆరు శాతం మాత్రమే చెల్లించి రైతులను ఆదుకుంటామనే ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలు ఎలా అవుతాయి? ఉద్యానవనశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేశారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు. ముందస్తు కౌలు చెల్లించి, పంట పెట్టుబడి పెట్టే వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులకు…ప్రభుత్వాలు చెల్లించే నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా అందదు.
పంటల బీమా రైతులకా? కంపెనీలకా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చి బిజెపి వారు అధికారంలోకి వచ్చారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా లాంటి వాటి ద్వారా పంటల నష్టానికి పరిహారం చెల్లించడం, రైతులకు బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు భారీగా ఇవ్వడం తమ విధానంగా ప్రకటించారు. బిజెపి నేతల మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం వుంటుందో అనేక విషయాల్లో రుజువవుతూనే వుంది. వ్యవసాయ రంగంలో మరింత స్పష్టంగా బట్టబయలవుతున్నది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే…పంటల బీమా కోసం 2017-18 సంవత్సరంలో ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పి.ఎం.ఎఫ్‌.బి.వై) ద్వారా పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ బీమా పథకం అమలు కోసం 13 ప్రయివేటు సంస్థలతో సహా 18 సాధారణ బీమా కంపెనీలను ప్రభుత్వం ఇందులో చేర్చుకున్నది. ఈ పథకం కింద ఖరీఫ్‌ పంటలకు ప్రీమియంలో 2 శాతం, రబీ పంటలకు 5 శాతం రైతులు చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. 2016-17 నుండి 2020-21 వరకు ప్రయివేటు బీమా కంపెనీలు ప్రీమియంగా రూ. 69,667 కోట్లు పొంది, రూ. 45,317 కోట్లు పరిహారంగా రైతులకు చెల్లించి, రూ. 24,350 కోట్ల రూపాయలు లాభపడ్డాయి. ఇందులో ఒక్క అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అత్యధికంగా రూ. 4,731 కోట్లు లాభపడిరది.
వ్యవసాయ రుణాల విధానాలను పరిశీలిద్దాం. 2019-20లో రూ.9 లక్షల కోట్లు, 2020-21లో రూ.11 లక్షల కోట్లు, 2021-22లో రూ. 16 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రకటించారు. ఆచరణలో గౌతమ్‌ అదానీ లాంటి ఐదు బడా కార్పొరేట్‌ కంపెనీలు నిర్మిస్తున్న కోల్డ్‌ స్టోరేజ్‌లు, మాల్స్‌, సోలార్‌, విండ్‌ మిల్లుల విద్యుత్‌ కంపెనీలకు ఇచ్చే రుణాలను కూడా వ్యవసాయ రుణాలుగా మార్చారు. ప్రతి బ్యాంకు తన వ్యాపార ధనంలో 40 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలని, అందులో 18 శాతం పంట రుణాలు వుండాలని 1965లో రూపొందించుకున్న రిజర్వుబ్యాంకు విధానాన్ని 1991 వరకు అమలు చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి ర్కెటతులకు అందాల్సిన వ్యవసాయ రుణాల్లోకి బడా కంపెనీలు జొరబడి దోచుకునేటట్లు విధానాలను మార్చారు.
కేంద్ర విధానాలపై నోరెత్తని రాష్ట్ర పాలకులు
రైతులకు తీవ్ర నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఏ మాత్రం ప్రశ్నించక పోగా, వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు లాంటి విధానాలను అమలు చేసి రైతులపై భారాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే మూడు నల్ల చట్టాలను పార్లమెంట్‌లో బలపరచి, వీధుల్లో రైతు ఉద్యమాలను బలపరిచే ద్వంద్వ విధానాలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అనుసరించాయి.
పంట నష్టపోవడం అంటే రైతు పెట్టుబడి నష్టంతో పాటు…అప్పుల భారం, ప్రజలకు ఆహార సరుకుల కొరత, ధరల పెరుగుదల వంటి అనేక రూపాల్లో దీని ప్రభావం వుంటుంది. అందుకే రైతుకు పరిహారం అందించడం సామాజిక బాధ్యత. పంటల నష్టానికి న్యాయమైన పరిహారం కోసం పోరాడాలి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న 14.57 కోట్ల మంది రైతులు, 20 కోట్ల మంది వ్యవసాయ కూలీలను ఐదారు కార్పొరేట్‌ కంపెనీలకు బలిపెట్టే ప్రభుత్వ విధానాలను ఐక్యంగా ప్రతిఘటించడం ద్వారానే వ్యవసాయాన్ని కాపాడుకోగలం.
తెలంగాణలో గత 8 ఏండ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక ప్రకృతి వైపరీత్యాలు సృష్టించిన విధ్వంసం ఉంది. విపత్తులతో నష్టాలు ఎక్కడైనా సహజమే. కొన్ని సార్లు ఈ నష్టాలను అరికట్టడం రైతులకు, ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. అందుకే ఆయా దేశాల్లో ప్రభుత్వాలు రైతులను, ప్రజలను ఆదుకోవడానికి నష్టపరిహారం చెల్లిస్తాయి. లేదా బీమా పథకాలు అమలు చేస్తాయి. అమెరికా, యూరప్‌, చైనా, జపాన్‌ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయి. రైతులు, ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన కనీస పాలనా బాధ్యత ఇది.
మన దేశంలో జాతీయ స్థాయిలో 2005 జాతీయ విపత్తు చట్టం అమలులో ఉంది. జాతీయ ప్రకృతి వైపరీత్యాల పరిహార నిధి (ఎన్‌?డీఆర్‌ఎఫ్‌) కూడా కేంద్ర బడ్జెట్‌ లో భాగంగా ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి ఏటా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కు నిధులు అందుతాయి. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర బడ్జెట్‌ లో నిధులు కేటాయించుకొని, ప్రజలకు నష్టాలు వాటిల్లిన సందర్భాల్లో తక్షణ పరిహారం
(ఇనపుట్‌ సబ్సిడీ) అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్‌ పుట్‌ సబ్సిడీగా నిర్ణయించింది తక్కువ మొత్తమే, అయినా కనీసం ఆ పద్ధతి అమలులో ఉంది. నష్ట పోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.10 వేలు పరిహారంగా అందించాలని 2013 లోనే ‘‘హుడా కమిషన్‌’’ సిఫారసు చేసినా , తెలంగాణలో 2015 లో వచ్చిన జీవో ప్రకారం ఎకరానికి కేవలం రూ.4 వేల పరిహారం మాత్రమే నిర్ణయించారు. ఇది కూడా పంట సగటు ఉత్పత్తిలో 33 శాతం మించి నష్టపోతే మాత్రమే అందుతుంది.
కోర్టు తీర్పు ఇచ్చిన అమలు చేయక..
పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ.. రైతు స్వరాజ్య వేదిక కోర్టు తలుపులు తట్టింది. 2020 ఖరీఫ్‌ లో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్‌ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వర్షాల వల్ల జరిగిన నష్టాలను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి 2020 అక్టోబర్‌ 15న కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా 2021 నాటికే నష్టం వివరాలతో ఫైనల్‌ రిపోర్ట్‌ కేంద్రానికి పంపింది. ఈ వ్యాజ్యంపై ఏడాది పాటు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు 2021 సెప్టెంబర్‌ 28 న రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.3 నెలల్లో రైతులను గుర్తించి 2022 జనవరి 28 నాటికి పరిహారం అందించాలని, పంటల బీమా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి, సన్న, చిన్న కారు రైతులకు బీమా పరిహారం కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా, పచ్చి అబద్ధాలతో సుప్రీం కోర్టు అప్పీల్‌ కు వెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.
ప్రభుత్వమే బీమా అమలు చేయాలె..
ప్రజాస్వామిక పరిపాలన అంటే, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపా లించడం. కనీసం కోర్టు ఆదేశాలను పాటించడం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సూత్రాలను పాటించడం లేదు. ఇప్పటికే రాష్ట్ర రైతులకు జరిగిన నష్టాలను అర్థం చేసుకుని 2023 ఖరీఫ్‌ నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అన్నిపంటలను, గ్రామం యూనిట్‌ గా బీమా పరిధిలోకి తీసుకు రావాలి. సన్న, చిన్నకారు రైతుల ప్రీమియం మొత్తాన్ని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్‌ లాగ మొత్తం రైతుల ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. 2020 సంవత్సరానికి పంట నష్ట పరిహారం చెల్లింపు విషయంలో, సుప్రీంకోర్టులో అప్పీల్‌ ను ఉపసంహరించుకుని రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం సంభవించినా, వెంటనే నష్టపోయిన వారి వివరాలు సేకరించి,పరిహారం అందించాలి. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌ లో కూడా నిధులను కేటాయించాలి.
పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
జాతీయ స్థాయిలో అమలవుతున్న పంటల బీమా పథకాలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం భారాన్ని భరించే విధానం ఉంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులు ఆటోమాటిక్‌ గా పంటల బీమా పరిధిలోకి వచ్చే వాళ్లు. 2019 వరకు రైతులు కొద్దిపాటి ప్రీమియం చెల్లిస్తే, మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. పంట నష్టం జరిగినప్పుడు బీమా పరిధిలోకి వచ్చిన రైతులకు ఎంతో కొంత బీమా పరిహారం అందేది. కానీ 2020లో కేంద్రం బీమా మార్గదర్శకాల్లో మార్పులు చేసి, తన వాటా ప్రీమియం చెల్లిం పును 30 శాతానికి పరిమితం చేసుకుంది. గత మూడేండ్లుగా రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం అత్యంత బాధ్యతా రహితంగా వ్యవ హరిస్తూ, కనీసం గ్రామాల వారీగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను కూడా సేకరిం చడం లేదు. నష్టపోయిన రైతుల వివరాలతో కేంద్రానికి నివేదికలు పంపి సాయం కూడా అడగడం లేదు.
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు.- (వి.రాంభూపాల్‌)

ఇతర కులాలను ఎస్టీలో చేర్పు వెనుక అంతర్భాగ కుట్రే

ఈ వ్యాసం తేది 30.12.2022 న పాడేరు జూనియర్‌ కళాశాల మైదా నంలో ఆదివాసి జెఎసి నిర్వహించిన ‘‘ఆదివాసి గర్జన’’ బహిరంగ సభను ఉద్దేశించి తయారు చేసిన ప్రసంగ పాటవానికి చిన్నపాటి మార్పులతో ఆదివాసు లంటేనే ఇష్టపడని ఇతర కుల సమాజన్ని నేడు ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేస్తున్న కుటీల యత్నాల వెనక చాలా భయం కరమైన అంతర్గత ఎజెండా దాగిఉంది. ఆ అంతర్గత ఎజెండా గురించి పాలకులు మనకు చెప్పరు. మనమే గ్రహించాలి. అర్థం చేసుకోవాలి. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి చేస్తున్న కుట్రల వెనక చాలా భయంకరమైన అంతర్గత ఎజెండా దాగిఉంది. బి.రామారావుదొర

ఈగర్జనసభకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా నలుమూలల నుంచి ఎన్నో ప్రయసలకు ఓర్చి విచ్చేసిన మీఅందరికీ ఉద్యమా భివందనాలు తెలుపుకుంతున్నాను.గత 12రోజులుగా (డిసెంబర్‌12 నుండి 22వరకు) నిర్వహించిన ఆదివాసి హక్కుల పరిరక్షణ యాత్రతో మీ గ్రామాలకు వఛ్చినయాత్ర బృందాలకు అన్నం పెట్టి ఆదరించిన ఆదివాసులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాలకులు దాచిపెడుతున్న ఆ అంతర్గత ఎజెండా ఏమిటంటే! రాజ్యాంగం ద్వారా ఆదివాసులు సాధించుకున్న రక్షణ చట్టాలు, హక్కుల ప్రకారం ఏజేన్సి ప్రాంతాలలో నిక్షిప్తమై ఉన్న అపరమైన ప్రకృతి సంపాదను కొల్లగొట్టడానికి ప్రభుత్వాలకు/పాలకులకు సాధ్యం కావాడం లేదు. కావున ఆదివాసులకంటే ఎక్కువ జనాభా కలిగి,వారికి విధేయులుగా ఉండే కులాలను, ఆదివాసులకంటే అభివృద్ధి చెందిన అగ్ర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను వారికి పంచిపెట్టి తద్వారా ఏజేన్సి ప్రాంతాలను చిన్నభిన్నం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వాలు/పాలకులు పూనుకున్నారు.చరిత్రలో చూడండి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో గాని రాష్ట్రంలో గాని ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద విదేశీ పెట్టుబడుదారి కంపెనీలకు కట్టబెట్టినప్పుడు ఆదివాసి చట్టాలు మాత్రమే కాపాడిరది. ఆరక్షణ చట్టాలు నాశనం చేయాలంటే! పాలకులకు అసలైన ఆదివాసులు చేత ఆ పని చేయించడం సాధ్యం కాకావడం లేదు. ఆయా సందర్బాలలో ఎంతో కొంత మంది చైతన్య వంతులై పాలకుల కుటీల ప్రయత్నాలను అడ్డుకున్న సందర్బాలున్నాయి. అదే ఇతర కులాలను మన ఆదివాసి జాబితాలో చేర్పించి మన రాజ్యాధికారాన్ని వారికి కట్టబెట్టి అసలైన భూమి పుత్రులను అచేతనవస్తలో పెట్టి ఆదివాసిల మనుగడను దెబ్బతీయడానికి పూనుకున్నదీ ప్రభుత్వం. ఒకసారి మనం గమనించినట్లైతే ఎస్టి జాబితాలో కలపడానికి ప్రతిపాదిత కులాలవారికి 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నది. అదే మనకు (ఆదివాసులకు) 6శాతం రిజర్వేషన్‌ మాత్రమే అమలులో ఉంది. ఎవరైనా తక్కువ రిజర్వేషన్‌ నుండి ఎక్కువ రిజర్వేషన్‌ లో చేరాలనుకుంటారు. చేర్చుతారు కూడా. కానీ మన విషయంలో ఎక్కువ రిజర్వేషన్‌ ఉన్నవాళ్ళను తక్కువ రిజర్వేషన్‌ లోకి చేర్చడానికి కారణం ఏమిటి? అంటే జగన్మోహన్‌ రెడ్డి గాని, ఇతర పాల కులకుగాని ‘బోయవాల్మికి, నకిలీ బెంతు ఒరియా (వడ్డీ) కులాలపై వల్లమాలిన ప్రేమ గాని, ఆదివాసు లపై ఒర్వలేనంత ద్వేషం గాని ఎందుకు? వారి మీద ప్రేమ లేదు. వీరి మీద ద్వేషమూ లేదు. స్వతహగా జగన్మోహన్‌ రెడ్డి గారు వ్యాపారవేత! కావుననే ఈ కపట నాటకాలాడుతున్నారు. ఆదివాసుల పాదాల కింద, అడవి తల్లి గర్బంలో బాధ్రంగా ఉన్న అపారమైన ఖనిజ సంపాదనను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి చేస్తున్న కుటిల ప్రయత్నమని ఆదివాసులు మరియు ఇతర కుల సమాజం (అగ్రకులాలు) కూడా గమనించాలి.6శాతం రిజర్వేషన్లు కలిగి ఉన్న ఆదివాసులు ఇప్పటివరకు కనీసం పాఠ శాలలలు, తాగు నిరు,రోడ్లు,కరెంట్‌ లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? దానిని పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. ఆదివాసులు ఎంత అభివృద్ధి చెంది ఉన్నరో..2017 డిసెంబర్‌ 2నచంద్రబాబు నాయుడు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. జగన్మోహన్‌రెడ్డి తనపాదయాత్రలో బోయలకు ఇచ్చిన మాట ప్రకారం 52జీవోద్వారా శ్యామ్యూల్‌ ఆనంద్‌ ఏక సభ్య కమీషన్ను నియమించి ఆ కమిటి రిపోర్టు ఆధారంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయడానికి సిద్ధపడ్డాడు. జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్‌ మత్స్యకారులను కూడా ఎస్టీలలో కలపడానికి మద్దతు ఇచ్చాడు. కాంగ్రెస్‌ పార్టీ 1976లో వివిధ రాష్ట్రాల్లో వివిధ హోదాలు కలిగి ఉన్న లంబాడాలను తన రాజకీయ అవసరాల కోసం ఎస్టీలలో కలిపి తెలుగు రాష్ట్రాల ఆదిమతెగలను కోలుకో లేని దెబ్బతీశారు. బిజెపి ఎలాగో రిజర్వే షన్లు అమలు ఇష్టం లేక ప్రభుత్వ రంగ సంస్థ లన్నీ ప్రైవేటుపరం చేస్తుంది.ప్రభుత్వ సంస్థలే లేకుండా చేస్తే, రిజర్వేషన్లన్న సంగతే ఉండదు. ఇది ఆదివాసులు, దళితులు వంటి అణగారిన వర్గాలకు పెద్ద బ్దెబ్బ.చివరికి కమ్యూనిస్టులు సైతం ఓటు బ్యాంకు రాజకీయాలనే అనుసరి అనుసరిస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కుటుంబం ఆదివాసులను వెంటాడుతూనే ఉంది.బాక్సైటు తవ్వకాలకు చంద్రబాబు నాయుడు చేసిన తీర్మానాలతోనే జర్రెల కొండలను తవ్వి తన బావమరిది పెన్నా ప్రతాపరెడ్డికి కట్టబెట్టాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రయత్నించాడు. అది సాధ్యం కాక 2009న పాడేరు పర్యటించి ఎజేన్సిలో నాన్‌ ట్రైబల్స్‌కు మూడుసెంట్లు భూమి ఇస్తున్నమని ప్రకటిం చాడు.నేడు జగన్మోహన్‌ రెడ్డి గారు ఆదివా సేతరులకు షెడ్యుల్డ్‌ ప్రాంతంలో ఒకటిన్నర సెంట్లు భూమి ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేశాడు.ఈ అన్ని సందర్భాలలో ఆదివాసుల సంక్షేమం ఎక్కడుంది? అదిమజాతుల వినా శము కోరే సంక్షోభం తప్ప. అదే మనలను బయపెడుతుంది. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయడం లేదు.చదువుకున్న యువ తులకు ఉద్యోగాలు లేవు. యువత పక్కదారి పట్టి గంజాయి స్మగ్లర్ల చేతిలో చిక్కి సాగుదా రులుగాను, రవాణాదారులుగాను ముద్ర పడి వేలాది మంది బంధిలై జైల్లో మగ్గుతున్నారు. మొన్నటి వరకు జీవో నె.3 షెడ్యూల్‌ ప్రాం తంలో స్థానిక ఆదివాసి యువతకు వందశాతం ఉపాధి అవకాశాలు కల్పించే జీవోగా పెద్ద బరోసాగా ఉండేది. ఈ జివో రద్దు చేసారు. చట్టపరంగా మనకు వచ్చిన ఎస్టి సబ్‌ ప్లాన్‌ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకా లకు మళ్ళించి మన కోసం ఖర్చుపెట్టవలసిన డబ్బును అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వసతి దీవెన వంటి ఇతర పథకాలకు మళ్ళించి రాష్ట్ర ప్రజలందరికి పంచిపెదితున్నారు. ఆదివాసులు పండిరచే పంటలకు గిట్టుబాటు ధర లేదు. మార్కెట్‌ సదుపాయం లేదు.పరిశ్రమలు లేదు. కష్టపడి పండిరచిన పంటలను అదివాసేతర దళారులు కొల్లగొడుతున్నారు. అంతర్జా తీయంగా గుర్తింపు పొందిన కాఫీని పందిం చమని ప్రోత్సహిస్తున్నరే! తప్ప మార్కెట్‌ సదుపా యాలు కల్పించడం లేదు.ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం లేదు. ఆపంట అంత ప్రభు త్వమే (ఐటిడిఎ కాఫీ బోర్డు ద్వారా) ప్రైవేటు దళారులకు గంపగుత్తగా అప్పజేప్పు తుంది.విద్యాలయాలు కాస్త దాణా కేంద్రాలు (టవవసఱఅస్త్ర షవఅ్‌తీవం)గాను,నిరుద్యోగ ఉత్పత్తి కేంద్రాలు (బఅవఎజూశ్రీశీవఎవఅ్‌ జూతీశీసబష్‌ఱశీఅ షవఅ్‌వతీం)గా మాత్రమే పనికొస్తున్నాయి. తప్పితే! ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉపాది మార్గాలు చూపించడం లేదు.300 నుండి 500 మంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే సరిపడ్డ సౌకార్యాలు ఉన్న వసతి గృహాలు/పాఠశాలలలో 700నుండి 1500 మంది వరకు బలవంతంగా కుక్కుతున్నారు. పిల్లలకు ఆలనా పాలన కూడా సరిగలేక మంచి చదు వులు సంగతి ఏమోగాని,పాఠశాలలలోనే మృత్యువాతపడుతున్నారు. ఈ మద్య కాలంలో పాడేరు ఐటిడిఎ పరిధిలో మూడు నెలల కాల వ్యవధిలో 8మంది విద్యార్థిని విద్యార్థులు మృత్యువాత పడ్డారు.స్వాతంత్రం రాకముందు బ్రిటిష్‌ వారు ఆదివాసుల రక్షణ కొరకు బలమైన చట్టాలు చేసి పగడ్బందీగా అమలు చేయడం వలన కొంత వరకు న్యాయం జరిగింది. అంతేకాకుండా నేటికి ఆ చట్టాలే రక్షణగా ఉంటున్నాయి.ఉదా: 1914-17మద్య కాలంలో కారం తమ్మన్న దొర నడిపిన లాగరాయి తిరుగుబాటు ఫలితంగా అతని మరణాంతరం ఆగస్టు 4,1917నుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ ూaఅస ుతీaఅంటవతీ Aష్‌ -1917’’ను రూపొందించారు. ఆ చట్టమే ‘‘1/70 భూ బదలాంపు నియంత్రణ చట్టం’’గా రూపొందించారు. దీనిని అమలు చేయవలసిందిపోయి నిర్వీర్యం చేసి ప్రకృతి సంపదనంత అంబానీ, అధానిలకు అప్ప జెప్పడానికి సిద్ధమయ్యారు.1935 - దీతీఱ్‌ఱంష్ట్ర Iఅసఱa Aష్‌ ద్వారా212ుతీఱపaశ్రీ స్త్రతీశీబజూం ను గుర్తించి వారిని కాపాడడానికి చేసిన చట్టాలను సామాజిక న్యాయం పేరిట నిర్వీర్యం చేస్తు న్నారు. ఇతర కుల ప్రభావాలకు లోనైన తెగలు తమ ఉనికిని కోల్పోతున్నాయి. అందులో భాగంగానే బీసీ కులాలైన బోయ,బోయ వాల్మీకి,ఒడ్డి(నకిలీ బెంతు ఒరియా) కులాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్రెజిల్‌ దేశంలో ఆదిమజాతీ సమూ హానికి చెందిన చిట్టచివరి మనిషి మరణించిన విషయం తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన పెసా చట్టం,అటవీకుల చట్టం ఎంత మేరకు అమలవుతుందో! ఎంత చిత్తశుద్ధితో పాలకులు అమలు చేస్తున్నారో! కళ్ళారా చూస్తున్నాము. ఆదివాసులు ఆధారపడ్డ అడవుల నుంచి వారిని గెంటివేయడానికి, ఆ అడవులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టదానికి, చట్టం చేసిన అనతి కాలంలోనే అంటే గత రెండున్నర దశబ్దాల కాలంలో కేంద్ర రాష్త్ర ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయి.చింతపల్లి మండలం ఎర్ర వరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌, జాతియా రహదారి నిర్మాణం, టూరిజం పేరిట ఆదివాసులను భూమి లేని పేదలుగా మార్చివేస్తుంది. ఉమ్మడి విశాఖ ఎజేన్సి ప్రాంతంలో గత నాలుగు దశబ్దాలుగా (Gూఖ) (గిరిజన విద్యార్ధి సంఘం) ూూGR (ూతీస్త్రaఅఱఓa్‌ఱశీఅ టశీతీ ూతీశ్‌ీవష్‌ఱశీఅ శీట Gఱతీఱjaఅa/ుతీఱపaశ్రీ Rఱస్త్రష్ట్ర్‌ం) చేసిన పోరాటాల ఫలితంగా షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో నివసిస్తున్న స్థానిక ఆదిమ తెగలకు ఉద్యోగాలు కల్పించే జీవోనె.3 వచ్చింది. అది ఇప్పుడు పాలకుల సహకారంతో రాద్దాయి పోయింది. ఆ జీవోను కాపాడడానికి పాలకుల ద్వారా కనీస ప్రయత్నం కూడా చేయబడి ఉండలేదు. Gూఖ, ూూGR సంస్థల పోరాట స్ఫూర్తితోనే ఆదివాసుల గొంతుగా మనం నేడు ‘‘ఆదివాసిని అనివార్యంగా ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. దీనిని కూడా లేకుండా చేయడానికి కుటీల ప్రయత్నలు జరుగుతుంది. జెఎసి అంటే ఏ రాజకీయ ప్రమేయం లేకుండా ఆదివాసులు తమకు తాముగా సవరించుకున్న గొంతు. ఈ సంస్థ కొన్ని తరాల వరకు ఆదివా సులు తమ మనుగడను కొనసాగించ డానికి బరోసగా..స్తూర్తిగా ఉండాలని ఆశిస్తు న్నాను.ఆ స్పూర్తిని కొనసాగించడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం లేదా పాలకుడైన తమ రక్షణ చట్టాలు, హక్కులకు బంగం కలిగిస్తే చట్టసభల్లో ప్రశ్నించి సరి చేసుకునే అవకాసం ఉంటుందన్న గొప్ప ఆశయంతో రాజ్యాంగంలో అణగారిన కులాలకు, తెగలకు ప్రత్యేక రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎంపిపిలు, చైర్మన్లులు, సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఆయా స్థానాలలో వారిని మాత్రమే ఎన్నుకునే అవకా శం కల్పించబడిరది. ఆయా సందర్బా లలో వారిని ప్రశ్నించే అవకాశం కల్పించాలనే ఇంగిత జ్ఞానం పాలకుడికి ఎలాగో ఉండదు. ఉన్న అవకాశం ఇవ్వరు. మన ప్రతినిదులులు కూడా కనీస బాద్యత తీసుకోవడం లేదు. అందువలనే పాలకులు ‘‘కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు’’ అల్పసంఖ్యాకులైన మన రిజర్వేషన్‌ హక్కులు మనం అనుభవించకుండా చేయడానికి ఇతర కులాలను ఎస్టిలలో కలపడానికి పూను కుంటున్నారు. ఈ అన్ని సందర్భాలలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆదివాసి ప్రజా ప్రతి నిధులు వారి యొక్క కనీస బాధ్యత నిర్వహించకపోవడం వలన ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.మీరేగాని ఈబాధ్యత తీసుకుంటే మీ అందరి జెండాలు కలిపి మోయడానికి నేను సిద్ధంగా ఉంటాను. విజ్ఞులైన మేధావులు జాగ్రత్తగా లేకపోతే నిజమైన ఆదివాసుల మనుగడకే ప్రమాదం మంచుకొస్తుందని ముగిస్తున్నాను. వ్యాసకర్త : జిల్లా కన్వినర్‌,ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి జాయింట్‌ ఏక్షన్‌ కమిటి,అల్లూరి సీతారామారాజు జిల్లా

సహజ వనరులు..ఖనిజనిక్షేపాలు వరమా?శాపమా?

ఎంత పెద్ద ఎత్తున సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు దొరికినా..పూర్తి స్థాయిలో వాటిపై ఆధారపడకపోవడమే మంచిది. ఆ నిక్షేపాల వద్ద ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే లాభపడేలా కాకుండా…సరైన ప్రణాళికలు రూపొందించి ప్రజలందరికీ లాభం జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి లాభాలను విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో ఖర్చు చేయాలి. అంతేకాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపర్చాలి. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు. అప్పుడే అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా దేశ ఆర్థిక వ్యవస్థను తయారు చేయవచ్చు. లేకుంటే ఆ సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలే దేశానికి శాపంగా మారుతాయి.
సహజ,ఖనిజ నిక్షేపాలే కొన్ని దేశాలకు శాపంగా మారినట్టు చరిత్ర చెబుతున్న వాస్తవం. ‘డచ్‌ డిసీజ్‌’పేరుతో నెదర్లాండ్స్‌ ఎదుర్కొన్న పరిస్థి తులు ప్రపంచానికి ఇప్పటికీ ఒకఉదాహరణగా ఉన్నాయి.1959లోనెదర్లాండ్స్‌లో భారీఎత్తున గ్యాస్‌ నిల్వలను కనుగొనగా అప్పటి నుంచి ఆదేశం వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారం భించింది. ఇన్‌స్టంట్‌గా అది దేశఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూర్చినా,దీర్ఘకాలిక వృద్ధిలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ దశాబ్దం తర్వాత అంటే 1970-77 మధ్యలో పరిశీలిస్తే ఆ దేశ నిరుద్యోగ రేటు 5.1 శాతానికి చేరుకున్నది. అంతకు ముందు అది ఒక శాతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఎందుకంటే పెట్టుబడులంతా ఒకే రంగంలో కేంద్రీకృతం కావడం, ఇతర రంగాలు, తయారీ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని ఆర్థిక విశ్లేషకులు నిర్ధారించారు. బ్యాటరీ తయారీలో కీలకమైన లిథియమ్‌ నిల్వలను జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల కనుగొన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. 59 లక్షల మెట్రిక్‌ టన్నుల లిథియం ఉన్నట్లు అంచనా వేసింది.ఈ అంచనా నిజమైతే ప్రపం చంలోనే అత్యధిక లిథియమ్‌ నిల్వలున్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంటుంది. అంతే కాకుండాజమ్మూ కాశ్మీర్‌, ఏపీ,ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, జార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు,తెలంగాణల్లో 51చోట్ల ఖనిజనిల్వ లను గుర్తించారు. వాటిలో 5బంగారు గనులు సైతం ఉన్నాయి.అంతేకాకుండా పొటాష్‌, మాలిబ్డినం వంటి లోహాలను గుర్తించారు. అయితే ఇలాంటి సహజ, ఖనిజ నిక్షేపాలు ఆయా ప్రాంతా లకు, దేశ ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తుకు వరమా? శాపమా? అనే చర్చ అవసరమవుతున్నది.
పర్యావరణంపై తీవ్ర ప్రభావం
లిథియమ్‌ అయినా ఇతర ఖనిజ నిక్షేపాలైనా వాటిని మైనింగ్‌ చేసి, వెలికి తీయాలంటే ప్రకృతి, పర్యావ రణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నేల, నీరు, గాలి కలుషితమవుతాయి. ఉదాహరణకు ఒక టన్ను లిథియమ్‌ను ఉత్పత్తి చేయడానికి 2.2 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతుంది. పర్యావరణంపై పడే ప్రభావాన్ని పట్టించుకోకుండా లిథియమ్‌ను వెలికి తీయడానికి ప్రయత్నిస్తే ‘జోషి మఠ్‌’ లాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదముంటుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వాడే బ్యాటరీల్లో లిథియమ్‌ను వినియోగిస్తున్నారు. దీంతో కర్బన ఉద్గారాలు ఎంతో మేర తగ్గించవచ్చని వాదించే వారూ ఉన్నారు. అయితే లిథియమ్‌ మైనింగ్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే కర్బన ఉద్గారాలను కూడా మనం తోసిపుచ్చలేం. లాభనష్టాలను బేరీజు వేసుకొని, అన్నింటిని సమతుల్యం చేసి ముందుకు సాగితేనే ఫలితముం టుంది. పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుం డడంతో లిథియమ్‌ వెలికితీతపై ఇప్పటికే అర్జెం టీనా,బొలీవియా వంటి దేశాల్లో పెద్ద ఎత్తున నిర సన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై..?
కేంద్ర గనుల శాఖ అంచనా వేసినట్టు జమ్మూ కాశ్మీర్‌లో 59లక్షల టన్నుల లిథియమ్‌ నిల్వలు ఉండి, పర్యావరణంపై కనీస ప్రభావంతో వాటిని వెలికితీసినా..అది దేశ ఆర్థిక వ్యవస్థకు, భౌగోళిక పరిస్థితులకు ఏ మేరకు లాభసాటిగా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.చమురు నిల్వలను కనుగొన్నప్పుడు గల్ఫ్‌ దేశాలు జాక్‌ పాట్‌ కొట్టినట్టే భారతదేశ పరిస్థితి ఉండబోతున్నదనే వాదనా ఉన్నది.
చరిత్రను పరిశీలిస్తే…
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున సహజ నిక్షేపాలను కనుగొన్నప్పుడు ఆ దేశా లపై పడ్డ ప్రభావాన్ని చూస్తే అనేక ఆసక్తికర విష యాలను మనం గమనించవచ్చు. కొన్ని దేశాలు సానుకూల పరిస్థితులను సృష్టించుకొని అభివృద్ధి దిశలో పయనించగా, సరైన ప్రణాళికలు లేకుండా మరికొన్ని దేశాలు దీర్ఘకాలికంగా అనేక రంగాల్లో వెనకబాటుకు గురయ్యాయి.గతంలో గల్ఫ్‌ దేశాలతోపాటు నార్వే, ఆస్ట్రేలియా, రువాండా లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొన్నారు.వీటివల్ల ఆదేశ ఆర్థికవ్యవస్థ రూపు రేఖలే మారిపోయాయి. అదే సమయంలో వీటికి భిన్నమైన ఉదాహరణలు సైతం మనకు కనిపి స్తాయి.
‘డచ్‌ డిసీజ్‌’ ఒక ఉదాహరణ
సహజ, ఖనిజ నిక్షేపాలే కొన్ని దేశాలకు శాపంగా మారినట్టు చరిత్ర చెబుతున్న వాస్తవం. ‘డచ్‌ డిసీజ్‌’ పేరుతో నెదర్లాండ్స్‌ ఎదుర్కొన్న పరిస్థితులు ప్రపం చానికి ఇప్పటికీ ఒక ఉదాహరణగా ఉన్నాయి. 1959లో నెదర్లాండ్స్‌లో భారీ ఎత్తున గ్యాస్‌ నిల్వ లను కనుగొనగా అప్పటి నుంచి ఆ దేశం వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇన్‌స్టంట్‌గా అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూర్చినా,దీర్ఘకాలిక వృద్ధిలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ఓ దశాబ్దం తర్వాత అంటే 1970-77మధ్యలో పరిశీలిస్తే ఆ దేశ నిరుద్యోగ రేటు 5.1శాతానికి చేరుకున్నది. అంతకు ముందు అది ఒకశాతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఎందు కంటే పెట్టుబడులంతా ఒకే రంగంలో కేంద్రీకృతం కావడం, ఇతర రంగాలు, తయారీ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్ప న్నమైందని ఆర్థికవిశ్లేషకులు నిర్ధారించారు. అంతే కాకుండా 1908లో ఇరాన్‌లో ఆయిల్‌ నిల్వలను కనుగొన్నారు. అక్కడ ఇతరరంగాలు అభివృద్ధి చెందకపోవడం, అక్షరాస్యత అంతంతమాత్రంగానే ఉండడంతో పెట్టుబడులు, మానవ వనరులన్నీ ‘ఆయిల్‌’ రంగం వైపు మళ్లాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒకే వనరుపై ఆధారపడి నడపాల్సి వచ్చింది. దీంతో మిగిలినరంగాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఎన్నో సహజ వన రులు, ఖనిజ నిక్షేపాలున్నా అవినీతి,సరైన ప్రణాళిక లేకపోవడంతో కాంగో,జింబాబ్వే లాంటి దేశాలు ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నాయి.
ఇతర దేశాలను పరిశీలిస్తే…
గల్ఫ్‌దేశాల కరెన్సీ పూర్తిస్థాయిలో పెట్రో ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నది. ఇతర ఎలాంటి వస్తువులను ఆ దేశాలు ఎగుమతి చేయవు. దీంతో ‘డచ్‌ డిసీజ్‌’ లాంటి పరిస్థితులను అవి ఎదుర్కోలేదు. అదే సమ యంలో ఆస్ట్రేలియా, నార్వే దేశాలను పరిశీలిస్తే ఖనిజ నిక్షేపాలతోపాటు ఇతర రంగాలపై కూడా దృష్టి సారించాయి. విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో పెద్ద ఎత్తున ఖర్చు చేసి ‘డచ్‌ డిసీజ్‌’ లాంటి పరిస్థితులు రాకుండా తప్పించు కోగలి గాయి. అంతేకాకుండా సౌది, దుబాయి, యుఎఇ వంటి దేశాలు తమ ప్రాంతాలను టూరిస్ట్‌ హబ్‌ లుగా మార్చి తమ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఎంత పెద్ద ఎత్తున సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు దొరికినా..పూర్తి స్థాయిలో వాటిపై ఆధారపడకపోవడమే మంచిది. ఆ నిక్షేపాల వద్ద ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే లాభపడేలా కా కుండా…సరైన ప్రణాళికలు రూపొందించి ప్రజలం దరికీ లాభం జరిగేలా చర్యలు చేపట్టాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి లాభాలను విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో ఖర్చు చేయాలి. అంతే కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపర్చాలి. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు. అప్పుడే అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా దేశఆర్థిక వ్యవస్థను తయారు చేయవచ్చు. లేకుంటే ఆ సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలే దేశానికి శాపంగా మారుతాయి. – (ఫిరోజ్‌ ఖాన్‌)

చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే

మహళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిభాయి ఫూలే.మహిళా లోకానికి చదువులు నేర్పించిన చదువుల తల్లి. గొప్ప సంస్కర్త సావిత్రిభాయి ఫూలే.అట్టడుగు వర్గాలు,మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులునిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సాంప్ర దాయాలను, ఆదిపత్యవర్గాలనుధిక్కరించి భారత దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయు రాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848లో దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు.సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందిం చారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యా యురాలు. దళితుల,మహిళల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్లు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశా లలు ప్రారంభించిన ఘనత సావిత్రిభాయి ఫూలేదే. ఆమో 126వ వర్ధింతి సందర్భంగా ప్రత్యేక కథనం.!
ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు..స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచ యిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుం దని, అందుకే అందరూ చదవాలి.అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాము ఖ్యత గొప్పది. 1831 జనవరి 3న మహా రాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గావ్‌లో సావిత్రి బాయి జన్మించింది. 1847నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు.ఈ పాఠశాల నడపటం కొంద రికి నచ్చలేదు.దీంతో సావిత్రీ బాయిపై వేధిం పులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠ శాలకు నడిచేదారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం,అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్‌, వాల్వేకర్‌, దియోరావ్‌ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 1852లోనే మహిళాసేవ మండల్‌ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు,బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు.1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్త పుత్రుడిగా స్వీకరించారు. ఆబిడ్డకు యశ్వంత్‌ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు.1873లోనే సత్యశోధక్‌ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివా హాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పో యిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచచరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిని నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు.అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్‌ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భ రమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం,మార్చి 10న ఒక పిల్ల వాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచియిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్‌ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె.1891లో ప్వాన్కాశీ సుభోధ్‌ రత్నాకర్‌ 11పేరిట కవితా సంపుటిని ప్రచు రించారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొం దుతూనే ఉంటుంది. భారతదేశంలో కేవలం పురుషులకు మినహా మరెవ్వరికీ చదువుకునే హక్కు, అవకాశాలు లేకుండా సనాతన ధర్మం పేరుతో ఆంక్షలు కొనసాగాయి. నాగరికత పెరిగేకొద్దీ అక్కడక్కడ కొంతమంది ఉన్నత భావాలుగల పురుషులు అనుమతితో, మద్దతుతో,స్త్రీల ఘాడమైన అభిలాషతో అభ్య సించినటికి అది నామమాత్రమే. ముస్లింల పాలనలో కూడా మహిళల దుస్థితిలో మార్పు ఏమాత్రం లేదు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన వందేళ్ళకు కూడా ఎటువంటి కృషి చేయలేదు. కేవలం ఆంగ్లేయ స్త్రీలు విధ్యావంతులుగా ఉండటం, వారు విధ్యాసంస్థల్లో విధ్యను అభ్యసించడం వంటివాటిని ప్రత్యక్షంగా గమనించిన భారతీయ స్త్రీలలో విధ్య జిజ్ఞాస పెరిగింది. మహిళలే కాకుండా విదేశీ వనితల విద్యనభ్యసించడాన్ని పరిశీలించిన భారతీయ పురుషుల్లో కూడా స్త్రీ విధ్య తప్పుకాదనే అభిప్రాయాన్ని కలుగజేసింది. ఇది కూడా చాలా పరిమితంగానే. చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే చిన్న వయస్సులో చిరుతిండి కొనుక్కుతినడానికి వెళ్లినప్పుడు ఓ క్రైస్తవ మత బోధకుడు ఆమెతో…. ‘‘ఇలా దుకాణాల్లో కొనుక్కు తినరాదు, అవి శుబ్రంగా ఉండవు, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి’’ అని చెప్పి. తీరిక వేళలో ఈ పుస్తకాన్ని చదువు అని బైబిల్‌ చేతిలో పెట్టాడు. ఇంటికి తీసుకెళ్లిన సావిత్రిబాయి బైబిల్‌ చదవాలని కోరిక ఉన్న ప్పటికి పాఠశాల విధ్య లేనందువల్ల చదవలేక పోయింది.కానీ చదవాలనే కోరిక మాత్రం పెరిగింది. సావిత్రిబాయి తండ్రి ఆ బైబిల్‌ బయట విసిరేశాడు కానీ సావిత్రిబాయి ఆశయాన్ని మాత్రం విసిరేయలేకపోయాడు. అందరు మహిళలు గమినించినట్లే సావిత్రిబాయి కూడా విదేశీ వనితలు విద్యాభ్యాసం చేయడం గమనించి చదువుపై ఆసక్తిని బలపరచు కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయాలు, ఆచారాల పేరిట మహిళలకు, శూద్రులకు, అతి శూద్రులకు విద్యను నిరాకరించిన బ్రాహ్మణ మతం ( ప్రస్తుత హిందూ మతం ) కనీసం చదువుకోవాలనే కోరిక కూడా కలుగనీ యకుండా చేసింది. విద్య బ్రాహ్మణ సొత్తు, ఇంకెవరికి ఆ అర్హత లేదనే ముద్ర ప్రతి మెదడులో పేరుకుపోయింది. ఒకవేళ ఎవరైనా చదువులను ప్రోత్శహించినా చదువుకోవాల్సిన వారు సైతం అది తప్పని వ్యతిరేకించే మూఢ నమ్మకాల్లో మునిగిపోయారు. ఆంగ్లేయుల రాకతో ఇలాంటి మూఢనమ్మకాలు ఒక్కొకటి తొలగిపోసాగాయి. మత వ్యాప్తి కొరకే అయినప్పటికి క్రైస్తవ మిషనరీలు బైబిళ్ళు ఉచితంగా పంచడం ఒకగొప్ప విప్లవంగా చెప్పక తప్పదు. ఎందుకంటే …బలహీన వర్గాల చేతిలో ఒక మత గ్రంధం అనేది బైబిల్‌ తోనే మొదలైంది. పురాణాలు వేదాలు స్త్రీలు, శూద్రులు, అతిసూద్రులు తెలుసుకోగూడదు అనే కఠిన ఆంక్షలున్నప్పుడు ఒక మత గ్రంధం చేతి లోకి వస్తే ఆసంతోషాన్ని ఎలా చెప్పగలం? వేధాలు వింటే (చాటుగా విన్నా సరే) చెవుల్లో సీసం పోసే సంస్కృతి అమల్లో ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి బైబిల్‌ వినిపిస్తుంటే తబ్బిబ్బి అవ్వక ఎలా ఉండగలరు ? విద్య ఉన్నత వర్గాలకే అని మిగిలినవారికి నిషేదించినప్పుడు, కాదు ఎవ్వరైనా చదువుకోవచ్చు కాదు కాదు అందరూ చదవాలి అని విద్యాలయాలు స్థాపించి విద్యాదానం చేసింది క్రైస్తవం. దీనిమీద రెండు ప్రధాన ఆరోపణలు లేకపో లేదు. ఆంగ్లేయులు క్రైస్తవ మత వ్యాప్తి కోసం మరియు దుబాసీల కోసం మనకు విద్యను నేర్పింది అనేది మొదటి ఆరోపణ అయితే, రెండ వది ఆంగ్లేయుల కార్యాలయాల నిర్వహణ కోసం మాత్రమే విద్యను అందించింది కానీ పరోపకారం ఏమీ లేదు అనేది. ఈ ఆరోపణలు నిజమే అనుకున్నా, అదే కార్యాలయాల నిర్వ హణ కోసం సనాతన హైందవం ఎందుకు ప్రోత్సహించలేదు ?అదే మత ప్రచారం కోసం హైందవం ఎందుకు అక్షరాస్యతకు కృషిచేయ లేదనేవి సమాదానం లేక దాటవేసే ప్రశ్నలు. అయినప్పటికి ఆంగ్లేయులు కూడా ఎకా ఎకీనా బలహీనవర్గాలకు మాత్రమే విద్యను అందించ లేదు, ఆ మాటకొస్తే ఆంగ్లేయులు స్థాపించిన సంస్థల్లోనూ ముందుగా ప్రవేశాలు ఆధిపత్య వర్గాలకేగాని బలహీనవర్గాలకు కాదు. ఈ సంధర్భంలో మనం మహాత్మా జ్యోతిభా ఫూలే, చదువులతల్లి సావిత్రిభాయి ఫూలే లాంటి విజ్ఞాన విప్లవకారుల గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ మత ప్రభావం కావొచ్చు,ఆంగ్లేయ మహిళలను పరిశీలించడం వలన కావొచ్చు స్త్రీ విధ్య పాపం కాదు అవస రం అని గుర్తించి కులాలలకు మతాలకు,లింగ బేధాలకు అతీతంగా పాఠ శాలలు స్థాపించి విధ్యావ్యాప్తికి ఆధ్యులుగా నిలుస్తారు.ముఖ్యంగా చదువుల తల్లి సావిత్రి భాయి అటు అత్త మామలచేత, ఇటు తల్లిదం డ్రులచేత మాత్రమే కాకుండా సమా జంచేత ఎన్నో ఛీత్కారాలు, దాడులు ఎదుర్కొని సమా జంలో సగభాగమైన మహిళా విద్యకొరకు చేసిన కృషిని ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆధర్శ పురుషుల్లో మహాత్మా ఫూలే, ఆధర్శ స్త్రీలలో సావిత్రిభాయి ఫూలే ముందువరుసలో ఉన్నారు.
ఆమె చరిత్ర పాఠాలుగా పెట్టాలి..
సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫూలేకు సంబంధించిన చరిత్రను పాఠ్యాంశాలలో అంతర్భాగం చేసి భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలి.ఫూలే జీవితాలు,రచనలు, కార్య చరణ తదితర అంశాలపై వివిధ విశ్వవిద్యాల యాల్లో పరిశోధనలు జరపడానికి అధ్యయన కేంద్రాలు ఏర్పరచవలసిన అవసరం ఉంది. సావిత్ర బాయి రచనలు, ఆమె జరిపిన కృషి సమకాలీన సమాజానికి ఇప్పటికీ చాలా అనుగణమైనవే.
సంస్కరణ వాది..
సావిత్రి బాయి ఏర్పరుచుకున్న బోధనా పద్ధతి సమ్మిళిత స్వభావంగా,విద్యార్థిని భాగస్వామిని చేసేలా వినూత్నంగా ఉండేది. విద్య ద్వారా విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడాన్ని ఆమె ప్రోత్సహించేది.11 ఏండ్ల ముక్తా బాయ్‌ అనే సావిత్రి బాయ్‌ దళిత శిష్యురాలు మాంగ్‌ లు, మహర్‌లు సమాజంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలు-బాధలపై1855లో ధ్యానోదయ అనే వార్తాపత్రికలో ఒక వ్యాసం రాసింది. వివిధ అంశాలపై దళిత మహిళలు రాసిన రచనల్లో బహుశా దీన్ని తొలిరచనల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. సావిత్రి బాయి సామాజిక మార్పును అట్టడుగు స్థాయి నుంచి తీసుకురా వడానికి ప్రయత్నించారు. దీనికి అనుగుణంగా ఆమె ఆ కాలంలో అమల్లో ఉన్న సాంఘిక కట్టుబాట్లను, సంప్రదాయాలను నిశితంగా విమర్శించేవారు. శూద్రులకు ఆమె స్వయంగా బావులను ఏర్పరిచింది. సంస్కరణవాది అయిన జ్యోతిరావ్‌ ఫూలేతో కలిసి కులవ్యవస్థపై సమూ లంగా పోరాటం చేసింది. కులాంతర వివాహా లను ప్రోత్సహించి,ఆ విధంగా పెళ్లి చేసుకున్న దంపతులకు ఆశ్రయం కల్పించేవారు.సావిత్రి బాయి సాహిత్య గ్రంథాల్లో కావ్య ఫూల్‌(కవిత్వ నవవికాసం),బావన్‌ కాషీ సుబోధ్‌ రత్నాకర్‌ (రత్నాల సంద్రం) తదితర రచనలు ఆమెలోని సృజనాత్మక ఆలోచనలు, సామాజిక చింతనలను మేళవింపుగా ప్రతిబింబిస్తాయి. అణగారిన వర్గాలకు, మహిళలకు విద్యను అందించడం, తద్వారా వారి విమోచనకు పాటుపడటం, ఆంగ్లవిద్య ప్రాముఖ్యాన్ని పేర్కొనడం, సంప్రదా య దురాచారాలు,అహేతుక విలువలను సవాలు చేయడం, వితంతువులకు పునర్వి వాహాలను,కులాంతర వివాహాలను ప్రోత్సహిం చడం,దళితులకు మంచినీటి బావులు అందు బాటులో ఉంచడం, మహిళలకు అను కూలం గా ప్రజాజీవనంలోని వ్యక్తిగత-బహిరంగ సంద ర్భాల్లో తనగొంతు వినిపించడం, ఇతర మతా లకు చెందిన అల్పసంఖ్యాక వర్గాలతో సౌహార్ద్ర సంబంధాలు కలిగి ఉండటం సావిత్రిబాయి దృ క్పథం. – (చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే మహాపరినిర్వాణ దినం మార్చి 10)
-మహళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిభాయి ఫూలే.మహిళా లోకానికి చదువులు నేర్పించిన చదువుల తల్లి. గొప్ప సంస్కర్త సావిత్రిభాయి ఫూలే.అట్టడుగు వర్గాలు,మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులునిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సాంప్ర దాయాలను, ఆదిపత్యవర్గాలనుధిక్కరించి భారత దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయు రాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848లో దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు.సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందిం చారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యా యురాలు. దళితుల,మహిళల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్లు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశా లలు ప్రారంభించిన ఘనత సావిత్రిభాయి ఫూలేదే. ఆమో 126వ వర్ధింతి సందర్భంగా ప్రత్యేక కథనం.!
ఉద్యమశీలి సావిత్రిబాయి ఫూలే
సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు..స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచ యిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుం దని, అందుకే అందరూ చదవాలి.అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాము ఖ్యత గొప్పది. 1831 జనవరి 3న మహా రాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గావ్‌లో సావిత్రి బాయి జన్మించింది. 1847నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు.ఈ పాఠశాల నడపటం కొంద రికి నచ్చలేదు.దీంతో సావిత్రీ బాయిపై వేధిం పులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠ శాలకు నడిచేదారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం,అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్‌, వాల్వేకర్‌, దియోరావ్‌ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 1852లోనే మహిళాసేవ మండల్‌ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాధ బాలలు,బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు.1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్త పుత్రుడిగా స్వీకరించారు. ఆబిడ్డకు యశ్వంత్‌ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు.1873లోనే సత్యశోధక్‌ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివా హాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పో యిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి భర్తతోపాటు తాను కూడా అన్ని కష్టాల్ని అవమానాల్ని సహించింది. సావిత్రీబాయి ప్రపంచచరిత్రలోనే భర్తతోపాటు ఉద్యమ జీవితంలో కలిని నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు.అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్‌ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలా కుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భ రమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం,మార్చి 10న ఒక పిల్ల వాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచియిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్యపూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్‌ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె.1891లో ప్వాన్కాశీ సుభోధ్‌ రత్నాకర్‌ 11పేరిట కవితా సంపుటిని ప్రచు రించారు. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొం దుతూనే ఉంటుంది. భారతదేశంలో కేవలం పురుషులకు మినహా మరెవ్వరికీ చదువుకునే హక్కు, అవకాశాలు లేకుండా సనాతన ధర్మం పేరుతో ఆంక్షలు కొనసాగాయి. నాగరికత పెరిగేకొద్దీ అక్కడక్కడ కొంతమంది ఉన్నత భావాలుగల పురుషులు అనుమతితో, మద్దతుతో,స్త్రీల ఘాడమైన అభిలాషతో అభ్య సించినటికి అది నామమాత్రమే. ముస్లింల పాలనలో కూడా మహిళల దుస్థితిలో మార్పు ఏమాత్రం లేదు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన వందేళ్ళకు కూడా ఎటువంటి కృషి చేయలేదు. కేవలం ఆంగ్లేయ స్త్రీలు విధ్యావంతులుగా ఉండటం, వారు విధ్యాసంస్థల్లో విధ్యను అభ్యసించడం వంటివాటిని ప్రత్యక్షంగా గమనించిన భారతీయ స్త్రీలలో విధ్య జిజ్ఞాస పెరిగింది. మహిళలే కాకుండా విదేశీ వనితల విద్యనభ్యసించడాన్ని పరిశీలించిన భారతీయ పురుషుల్లో కూడా స్త్రీ విధ్య తప్పుకాదనే అభిప్రాయాన్ని కలుగజేసింది. ఇది కూడా చాలా పరిమితంగానే. చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే చిన్న వయస్సులో చిరుతిండి కొనుక్కుతినడానికి వెళ్లినప్పుడు ఓ క్రైస్తవ మత బోధకుడు ఆమెతో…. ‘‘ఇలా దుకాణాల్లో కొనుక్కు తినరాదు, అవి శుబ్రంగా ఉండవు, అనారోగ్యాన్ని కలుగజేస్తాయి’’ అని చెప్పి. తీరిక వేళలో ఈ పుస్తకాన్ని చదువు అని బైబిల్‌ చేతిలో పెట్టాడు. ఇంటికి తీసుకెళ్లిన సావిత్రిబాయి బైబిల్‌ చదవాలని కోరిక ఉన్న ప్పటికి పాఠశాల విధ్య లేనందువల్ల చదవలేక పోయింది.కానీ చదవాలనే కోరిక మాత్రం పెరిగింది. సావిత్రిబాయి తండ్రి ఆ బైబిల్‌ బయట విసిరేశాడు కానీ సావిత్రిబాయి ఆశయాన్ని మాత్రం విసిరేయలేకపోయాడు. అందరు మహిళలు గమినించినట్లే సావిత్రిబాయి కూడా విదేశీ వనితలు విద్యాభ్యాసం చేయడం గమనించి చదువుపై ఆసక్తిని బలపరచు కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయాలు, ఆచారాల పేరిట మహిళలకు, శూద్రులకు, అతి శూద్రులకు విద్యను నిరాకరించిన బ్రాహ్మణ మతం ( ప్రస్తుత హిందూ మతం ) కనీసం చదువుకోవాలనే కోరిక కూడా కలుగనీ యకుండా చేసింది. విద్య బ్రాహ్మణ సొత్తు, ఇంకెవరికి ఆ అర్హత లేదనే ముద్ర ప్రతి మెదడులో పేరుకుపోయింది. ఒకవేళ ఎవరైనా చదువులను ప్రోత్శహించినా చదువుకోవాల్సిన వారు సైతం అది తప్పని వ్యతిరేకించే మూఢ నమ్మకాల్లో మునిగిపోయారు. ఆంగ్లేయుల రాకతో ఇలాంటి మూఢనమ్మకాలు ఒక్కొకటి తొలగిపోసాగాయి. మత వ్యాప్తి కొరకే అయినప్పటికి క్రైస్తవ మిషనరీలు బైబిళ్ళు ఉచితంగా పంచడం ఒకగొప్ప విప్లవంగా చెప్పక తప్పదు. ఎందుకంటే …బలహీన వర్గాల చేతిలో ఒక మత గ్రంధం అనేది బైబిల్‌ తోనే మొదలైంది. పురాణాలు వేదాలు స్త్రీలు, శూద్రులు, అతిసూద్రులు తెలుసుకోగూడదు అనే కఠిన ఆంక్షలున్నప్పుడు ఒక మత గ్రంధం చేతి లోకి వస్తే ఆసంతోషాన్ని ఎలా చెప్పగలం? వేధాలు వింటే (చాటుగా విన్నా సరే) చెవుల్లో సీసం పోసే సంస్కృతి అమల్లో ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి బైబిల్‌ వినిపిస్తుంటే తబ్బిబ్బి అవ్వక ఎలా ఉండగలరు ? విద్య ఉన్నత వర్గాలకే అని మిగిలినవారికి నిషేదించినప్పుడు, కాదు ఎవ్వరైనా చదువుకోవచ్చు కాదు కాదు అందరూ చదవాలి అని విద్యాలయాలు స్థాపించి విద్యాదానం చేసింది క్రైస్తవం. దీనిమీద రెండు ప్రధాన ఆరోపణలు లేకపో లేదు. ఆంగ్లేయులు క్రైస్తవ మత వ్యాప్తి కోసం మరియు దుబాసీల కోసం మనకు విద్యను నేర్పింది అనేది మొదటి ఆరోపణ అయితే, రెండ వది ఆంగ్లేయుల కార్యాలయాల నిర్వహణ కోసం మాత్రమే విద్యను అందించింది కానీ పరోపకారం ఏమీ లేదు అనేది. ఈ ఆరోపణలు నిజమే అనుకున్నా, అదే కార్యాలయాల నిర్వ హణ కోసం సనాతన హైందవం ఎందుకు ప్రోత్సహించలేదు ?అదే మత ప్రచారం కోసం హైందవం ఎందుకు అక్షరాస్యతకు కృషిచేయ లేదనేవి సమాదానం లేక దాటవేసే ప్రశ్నలు. అయినప్పటికి ఆంగ్లేయులు కూడా ఎకా ఎకీనా బలహీనవర్గాలకు మాత్రమే విద్యను అందించ లేదు, ఆ మాటకొస్తే ఆంగ్లేయులు స్థాపించిన సంస్థల్లోనూ ముందుగా ప్రవేశాలు ఆధిపత్య వర్గాలకేగాని బలహీనవర్గాలకు కాదు. ఈ సంధర్భంలో మనం మహాత్మా జ్యోతిభా ఫూలే, చదువులతల్లి సావిత్రిభాయి ఫూలే లాంటి విజ్ఞాన విప్లవకారుల గురించి తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ మత ప్రభావం కావొచ్చు,ఆంగ్లేయ మహిళలను పరిశీలించడం వలన కావొచ్చు స్త్రీ విధ్య పాపం కాదు అవస రం అని గుర్తించి కులాలలకు మతాలకు,లింగ బేధాలకు అతీతంగా పాఠ శాలలు స్థాపించి విధ్యావ్యాప్తికి ఆధ్యులుగా నిలుస్తారు.ముఖ్యంగా చదువుల తల్లి సావిత్రి భాయి అటు అత్త మామలచేత, ఇటు తల్లిదం డ్రులచేత మాత్రమే కాకుండా సమా జంచేత ఎన్నో ఛీత్కారాలు, దాడులు ఎదుర్కొని సమా జంలో సగభాగమైన మహిళా విద్యకొరకు చేసిన కృషిని ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆధర్శ పురుషుల్లో మహాత్మా ఫూలే, ఆధర్శ స్త్రీలలో సావిత్రిభాయి ఫూలే ముందువరుసలో ఉన్నారు.
ఆమె చరిత్ర పాఠాలుగా పెట్టాలి..
సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫూలేకు సంబంధించిన చరిత్రను పాఠ్యాంశాలలో అంతర్భాగం చేసి భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలి.ఫూలే జీవితాలు,రచనలు, కార్య చరణ తదితర అంశాలపై వివిధ విశ్వవిద్యాల యాల్లో పరిశోధనలు జరపడానికి అధ్యయన కేంద్రాలు ఏర్పరచవలసిన అవసరం ఉంది. సావిత్ర బాయి రచనలు, ఆమె జరిపిన కృషి సమకాలీన సమాజానికి ఇప్పటికీ చాలా అనుగణమైనవే. –(శామ్యూల్‌ రాజ్‌)

మతతత్వ శక్తులను ఓడిస్తేనే దేశానికి రక్ష

ఒక లౌకిక, ప్రజాస్వామిక భారతదేశం కోసం పాటుపడేవారికి, స్వాతంత్య్రపోరాట విలువలకు కట్టుబడి ఉండే వారికి ఆరెస్సెస్‌ అధినేత ఇంటర్వ్యూ ఒక బెదిరింపు అనే చెప్పాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసాలు రాజ్యాంగం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుకాకుండా ఈ మతతత్వశక్తులు అడ్డుకుంటున్నాయి..ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఈ శక్తులు మోడీ ప్రభుత్వ అండదండలతో రాజ్యాధికారం పై అదుపు సాధించాయి. దీనికి సమాధానం ప్రత్యామ్నాయ విధానాల్లో, ప్రజా సమీకరణల్లో ఉంది. హిందూత్వ శక్తుల తాజా ఎజెండాను ఓడిరచాలంటే ప్రతిఘటనా శక్తిని పెంచుకోవడంతో బాటు, పెట్టుబడిదారీ లూటీకి వ్యతిరేకంగా ప్రజలను పెద్దయెత్తున సమీకరించాల్సిన అవసరముంది.-` బృందాకరత్‌
ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ‘’ఆర్గనైజర్‌’’, ’’పాంచజన్య’’ పత్రికల సంపాదకులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హిందూ రాజ్య స్థాపనకు సంబంధించి ఆరెస్సెస్‌ స్థాపకులు హెడ్గే వార్‌,గోల్వాల్కర్ల మాటలను బలపర్చేవిగా ఉన్నాయి. ‘’హిందుస్థాన్‌ ఒక హిందూ రాజ్యం. అభివద్ధి చెందుతున్న శక్తివంతమైన హిందూ సమాజం,హిందూరాజ్యం,భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి, ప్రపంచానికి నాయకత్వాన్ని అందిస్తుంది’’అని భగవత్‌ అన్నాడు. భారతదేశం,బ్రిటీష్‌ వలస దేశంగా ఉన్నప్పుడే ఆరెస్సెస్‌ తన ప్రణాళికను చాలా స్పష్టంగా వివరించింది. నేడు స్వాతంత్య్ర భారతదేశం సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉంది.ఆరెస్సెస్‌ అధినేత అసాధారణమైన వ్యాఖ్యలు,ఆరెస్సెస్‌ ఎన్నటికీ భారత రాజ్యాంగాన్ని అంగీకరించదనే విషయాన్ని మరోసారి తేటతెల్లం చేశాయి. నేడు ఆరెస్సెస్‌ ‘’వనరులు’’,‘’సమద్ధి’’,‘’సాధనాల’’ను కలిగి ఉంది.ఆ వనరులు ఏమిటి, ఎలా సమద్ధి గా ఉంది, ఆ సాధనాలు ఎక్కడి నుండి వస్తున్నా యని అడగడం సముచితంగా ఉంటుంది.
గోల్వాల్కర్‌ విస్తరించిన ‘’అంతర్గత శత్రువు’’
ఆ ఇంటర్వ్యూ ‘’హిందూ సమాజానికి’’ సంబం ధించిన చర్చ కోసం ఉద్దేశించినది. కానీ ఆరెస్సెస్‌ చీఫ్‌ ప్రకటించిన ‘హిందూ సమాజం’ అనే భావనకు భారత రాజ్యాంగంలో చోటు లేదు.ఆయన చెప్పేదాని ప్రకారం ‘’హిందూ సమాజం వెయ్యి సంవత్సరాలకు పైగా యుద్ధంలో ఉంటుంది కాబట్టి, యుద్ధంలో ఉండే వారు దూకుడుతనంతో ఉండడం సహజం’’.అందువల్ల స్థానిక భూస్వామ్య ఆధిపత్యవర్గాల సహాయంతో,దురాక్రమణ దారులకు,విజేతలకు మధ్య జరిగిన యుద్ధాలను, హిందూ ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలుగా మార్చారు. చారిత్రక అన్యాయా లను సవరించే పేరుతో నేటి ‘’హిందువుల దూకుడుతనాన్ని’’ న్యాయమైందిగా చెపుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘’ఇది బయటి శత్రువు కాదు అంతర్గత శత్రువు. కాబట్టి హిందూ సమాజాన్ని,హిందూధర్మాన్ని,హిందూ సంస్కతిని రక్షించుకోడానికి యుద్ధం తప్పదు’’ అని అంటాడు.‘’భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు వారి విశ్వాసాలను అంటిపెట్టుకొని ఉండాలనుకుంటే, వారి పూర్వీకుల విశ్వా సాలను తిరిగి ఆచరించాలనుకుంటే, వారికె లాంటి ప్రమాదం ఉండదు, వారు భయ పడాల్సిన పని లేదు. కానీ అదే సమయంలో ముస్లింలు తమ ఆధిపత్య ప్రసంగ గర్జనలను వదిలిపెట్టాలి.ముస్లింలు భారతదేశాన్ని తిరిగి పాలించబోతున్న ‘’ఉన్నత జాతి’’అనే కథనాన్ని ముస్లింలు వదిలెయ్యాలి.వాస్తవానికి ఇక్కడ నివసించే వారంతా, వారు హిందువులైనా, కమ్యూనిస్టులైనా ఈ తర్కాన్ని వదిలి పెట్టాలని’’ఆయన అన్నాడు.ఆరెస్సెస్‌ తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టుల వలె రాజీపడని వారిపై దాడి చెయ్యడం, వారిని బెదిరించడం, భయపెట్టడమే ఆరెస్సెస్‌ తర్కం.’’ హిందూ జాతికి పూర్తిగా లోబడి ముస్లింలు భారతదేశంలో నివసించ వచ్చని’’గోల్వాల్కర్‌ అన్నాడు. భగవత్‌ ప్రకటనలు,చట్టం నుండి తప్పించుకోడానికి సవరించినప్పటికీ ఆరెస్సెస్‌ పరిశీలనలో ముస్లిం లను లొంగదీసుకోవడం, సంఫ్న్‌ పరివార్‌ నేరపూరిత దాడులను చూసీచూడనట్లుండడం, ఇవన్నీ అంతర్గత శత్రువుకు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగించే లక్ష్యాలేనన్న మాట. ఈ యుద్ధంలో గోల్వాల్కర్‌ ముస్లింలు, కమ్యూనిస్టులు, క్రైస్తవులు శత్రువులనే నిర్వచనంటిచ్చారు. అంతటితో ఆగకుండా ఆరెస్సెస్‌ కథనాలకు అనుగుణంగా లేని హిందువులను కూడా శత్రుజాబితాలో చేర్చడం జరిగింది.అంటే ఇక్కడ నివసించే భారతీయ పౌరులు ప్రశాంతంగా జీవించాలంటే భారత రాజ్యాంగానికి అనుగుణంగా కాక ఆరెస్సెస్‌ కు అనుగుణంగా ఉండాలి. ఆరెస్సెస్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇస్లామిక్‌ ఛాందసవాదులు చెలరేగ డానికి ఊతమిస్తాయి. ఇటువంటి చర్యల ద్వారా ఆరెస్సెస్‌ తన మత విభజన వ్యూహాలను మరింతగా బలపరచుకోవాలని చూస్తోందన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. ఒక మతతత్వం మరొక మతతత్వాన్ని బలోపేతం చేస్తుందని సిపిఐ(ఎం) పదేపదే చెప్పే విషయాన్ని భగవత్‌ ఇంటర్వ్యూ మరోసారి రుజువు చేసింది.
కుల హింసను పట్టించుకోని ఆరెస్సెస్‌
భగవత్‌ ‘’హిందూ సమాజపు’’ స్వయం నియామక ప్రతినిధిగా ‘’సమాజం’’ తరపున అనాగరికమైన వాదనలు చేస్తూ మాట్లాడతాడు. మతానికి ఎలాంటి సంబంధంలేని హిందూత్వ రాజకీయ భావనా కవచాన్ని ప్రకటించడం ఒకటైతే,ఈ దేశంలో అత్యధికంగా ఉన్న ప్రజలంతా హిందూమతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది రెండవది. కానీ మతపరంగా హిందువులైన ప్రజలు ఆరెస్సెస్‌ ఆలోచనలను సమ్మతించడం లేదు. ఆరెస్సెస్‌ నాయకునికి దళితులకు వ్యతిరేకంగా పెచ్చరిల్లుతున్న హింసాత్మక చర్యలు అసలు ఒక సమస్యగా కనిపించవు.‘’శ్రీరాముడే అన్ని జాతులను, వర్గా లను కలిపి ఉంచుతాడు’’ అనేదే కులా నికి సంబంధించిన ఏకైక ప్రస్తావన.హిందూత్వ గుర్తింపు నిర్మాణంలో జైశ్రీరామ్‌ నినాదం ఒక రాజకీయ సాధనంగా చేసుకుంటున్నది. దళితులు అగ్రవర్ణ హిందువుల చేతుల్లో వివక్షతను, హింసను, లైంగిక దాడులను ఎదుర్కొంటున్నదానిపై భగవత్‌ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు .
ఆరెస్సెస్‌ అధినేత మాటల్లో ‘’పేదరికం’’ ఊసే లేదు
భగవత్‌ ‘’శక్తివంతమైన, సంపన్న హిందూ సమాజం’’ గురించి మాట్లాడతాడు.తీవ్రమైన పోషకాహార లోపం, అత్యధిక జనం ఆకలితో అలమటిస్తున్న దేశాలలో ఒకటిగా భారతదేశం ప్రపంచ ఆకలి సూచీ లో అవమానకరమైన స్థానంలో ఉంటే ఆయన ‘’సంపన్నం’’ గురించి మాట్లాడ్డం చాలా హాస్యాస్పదంగా ఉంది. భారతదేశాన్ని ధ్వంసం చేస్తున్న సామాజిక, ఆర్థిక అసమానతలు,సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల గురించి సంఫ్న్‌ అధినేత ఒక్కమాట కూడా మాట్లాడలేదు.ఆరెస్సెస్‌కు కార్మికులు, రైతులు అనేవర్గాలు లేవు. వారి దష్టిలో అంతా హిందూ సమాజంగా పిలువ బడే దానిలోనే దాగి ఉంటారు.కాబట్టి,ఆదానీ రోజుకు సగటున 1216 కోట్ల రూపాయలు, గ్రామీణ మహిళ రోజుకు కేవలం 250 రూపా యలు సంపాదిస్తే, ఆరెస్సెస్‌ వారిరువుర్నీ హిందూ సమాజం పేరుతో ఒకే గాటన కడుతుంది. ఆరెస్సెస్‌ సష్టించాలనుకునే ముఖ్యమైన హిందూత్వ గుర్తింపులో భాగంగా ధనికులను,పేదలను గుర్తించడానికి నిరాకరిం చడం ద్వారా ఆరెస్సెస్‌ అధినేత భారీ అసమాన తలను సమర్థిస్తున్నాడు. జనాభాలో అధిక సంఖ్యాక ప్రజల తక్కువ కొనుగోలు శక్తిని ప్రతిబింబించే అధికారిక సంఖ్యలు ఉన్నప్పటికీ, అధిక సంఖ్యాక భారతీయులు అధిక ధరలతో బాధపడుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది ‘’వినియోగతత్వం’’ విధి అనీ, ప్రజలు అవసరానికి మించి అధికంగా కొనుగోలు చేస్తున్నందువల్లే ధరలు పెరిగిపోతున్నాయని సంఫ్న్‌ నాయకుడు అభిప్రాయపడుతున్నాడు. భారతదేశం ప్రస్తుతం మాంద్యం అంచున ఉంది.ఆఖరికి పెట్టుబడిదారీ అనుకూల ఆర్థిక వేత్తలు కూడా డిమాండ్‌ను పెంచే విధానాలతో ముందుకు పోతున్నారని, అయితే ధరల పెరుగు దలకు ప్రజలే కారణమని ఆరెస్సెస్‌ నేత నిందిస్తున్నాడు.
రాజ్యాంగేతర శక్తిగా ఆరెస్సెస్‌
ఇంటర్వ్యూలో భగవత్‌ ఆరెస్సెస్‌, దాని స్వయం సేవకులు,రాజకీయాలు, ప్రభుత్వం మధ్య ఉండే సంబంధం గురించి మాట్లాడినప్పుడు మరో అంశం బహిర్గతమైంది. ఆరెస్సెస్‌ ఒక ‘’సాంస్కతిక’’ సంస్థ అనీ, దానికి రోజువారీ రాజకీయాల్లో ఆసక్తి లేదనీ, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఇష్టం లేకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల్లో బలవంతంగా జోక్యం చేసుకుంటుందని అంగీకరిస్తూ ఆయన ఓ కట్టు కథను అల్లారు. ‘’ఇంతకు ముందున్న తేడా ఏమంటే,మా స్వయం సేవకులు అధికార స్థానాల్లో లేరనీ, రాజకీయాల్లో స్వయం సేవకులు ఏమి చేసినా వాటికి మేము బాధ్యత వహిస్తాం. స్వయం సేవకులకు శిక్షణ ఇచ్చిన సంఫ్న్‌ కే అంతిమంగా ‘’కొంత బాధ్యత’’ ఉం టుంది. అందువల్ల మా సంబంధం ఏమిటి,ఏ అంశాలను జాగ్రత్తగా కొనసాగించాలి అనే విషయాలను గురించి ఆలోచించాల్సి వస్తుం దని’’ అంటాడాయన. ఇప్పుడు ‘’తేడా’’ ఏమంటే, ప్రధానమంత్రి గతంలో ప్రచారక్‌గా పని చేశాడు.యూనియన్‌ మంత్రిమండలిలో 71% మంది మంత్రులకు ఆరెస్సెస్‌ తో సంబంధాలు ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా మంది మంత్రులకు ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు, సంఘాలతో సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వంలోని స్వయం సేవకుల పై తన పర్యవేక్షణ ఉంటుందని ఆరెస్సెస్‌ ప్రకటిం చింది.ఆ ‘’కొంత బాధ్యత’’ అంటే అర్థమేమిటి ? ‘’ఒకవేళ ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తూ, వారు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ,వాటిని మాకు తెలియజేస్తే, అప్పుడు సంబంధిత వ్యక్తుల దష్టికి తీసుకొని వెళ్ళొచ్చు, ఒకవేళ వారు స్వయం సేవకులైతే, అంతా మేమే చేసేస్తాం’’.‘’మేం చేసే’’ దానిలోని చిక్కుల్ని చూడండి. సంఫ్న్‌లో శిక్షణ పొందిన మూడిరట రెండొంతుల మంది మంత్రివర్గ సభ్యుల పర్యవేక్షణ (‘’కొంతబాధ్యత’’), విధానాలలో జోక్యం (శ్రద్ధతో కొన్ని విషయాలు), స్వయం సేవకులైన మంత్రులకు ఆరెస్సెస్‌ సిఫార్సులు (సంబంధిత వ్యక్తుల దష్టికి తీసుకొనిరావడం). రాజ్యాంగేతర శక్తి అంటే ఇదే. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరెస్సెస్‌ చెలాయిస్తున్న అధికారం రహస్యమేమీ కాదు. దీనిని ఇప్పుడు ఆరెస్సెస్‌ అధినేతే స్వయంగా చెప్పాడు.‘’మేము మీడియాను కలుసు కునే సందర్భాల సంఖ్యను పెంచాం, ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ప్రారంభించాం. ఆశించిన ఫలితాల సాధన కోసం మేం సరైన వ్యూహంతో, సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుందనీ, రానున్న రోజుల్లో ఆరెస్సెస్‌ పై పొగడ్తల జల్లు కురిపిస్తూ, దానిపై ఉన్న ద్వేషాన్ని తగ్గించే కథలను గూర్చి వింటామని’’ భగవత్‌ చెప్పాడు.
మహిళల పట్ల చిన్నచూపు
హక్కుల ఆధారిత ప్రజాస్వామిక చట్రాన్ని గుర్తించ నిరాకరించడం కూడా మహిళల గురించి చేసిన వ్యాఖ్యల్లో ప్రతిబింబిస్తుంది. ఆరెస్సెస్‌ వారి దష్టిలో మహిళ అంటే కుటుం బంలో ఒక భాగం. ‘’మహిళా విముక్తి, మహిళా సాధికారత గురించి చాలా కాలంగా మాట్లాడు తున్నారు. కానీ ఇప్పుడు పాశ్చాత్య మహిళలు, స్త్రీ పురుషులు పరస్పరం ఆధారితంగా ఉండే కుటుంబ జీవనానికి తిరిగి వస్తున్నారని’’ భగవత్‌ అంటున్నాడు. ఆరెస్సెస్‌ ఉద్దేశంలో, ఒక స్వతంత్ర మనస్తత్వం,సాధికారత,సమాన హక్కులు గల మహిళకు కుటుంబ జీవితంతో పొసగదట.ఎందుకంటే ఆరెస్సెస్‌ భావజాలం ప్రకారం, కుటుంబంలో మహిళలకు మనువాద విధానాల మార్గదర్శకత్వం ఉంటుంది కాబట్టి, హింస ఎదురైతే మహిళలు సర్దుకుపోవాల్సి ఉ ంటుంది. ఇది,ఆరెస్సెస్‌ మహిళా విభాగం ‘’రాష్ట్రీయ సేవికా సమితి’’ చేస్తున్న ప్రచారం. కానీ ఈ సమితి విఫలమైన ప్రణాళిక అని ఆరెస్సెస్‌ నేత స్దవయంగా అంగీకరించాడు. నేడు సమితికి అంత బలం లేదు.శాఖల ద్వారా నేర్చుకునే మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వారిని సేవికా సమితికి పంపకుండా నేరుగా సంఫ్న్‌ లోకి ఇముడ్చుకోవడం ఎలా అనే విషయాన్ని ఆరెస్సెస్‌ కసరత్తు చెయ్యాలని ఇప్పుడు ఆయన చెపుతున్నాడు. ద్వేషపూరిత ప్రసంగాలు,రెటచ్చగొట్టే ప్రకటనలు చేసే ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ లాంటి హిందూత్వ దళానికి చెందిన మహిళా సభ్యులు ఆరెస్సెస్‌ కు ఆదర్శంగా ఉన్నారు. పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలతో పాటు మహిళల పై పెరుగు తున్న హింస, వరకట్న మరణాలపై సంఫ్న్‌ నేత మౌనం వహిస్తున్నాడు. ఒక లౌకిక, ప్రజాస్వామిక భారతదేశం కోసం స్వాతంత్య్ర పోరాట విలువలకు కట్టుబడి ఉండే వారికి, ఆరెస్సెస్‌ అధినేత ఇంటర్వ్యూ ఒక బెదిరింపు అనే చెప్పాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విధ్వంసాలు రాజ్యాంగం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుకాకుండా ఈ మతతత్వ శక్తులు అడ్డుకుంటున్నాయి..ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఈ శక్తులు మోడీ ప్రభుత్వ అండదండలతో రాజ్యాధికారం పై అదుపు సాధించాయి. దీనికి సమాధానం ప్రత్యామ్నాయ విధానాల్లో, ప్రజా సమీకరణల్లో ఉంది. హిందూత్వ ఆధునీకరణ ఎజెండాను ఓడిరచాలంటే ప్రతిఘటనా శక్తిని పెంచు కోవడంతో బాటు,పెట్టుబడిదారీ లూటీకి వ్యతిరేకంగా ప్రజలను పెద్దయెత్తున సమీకరించాల్సిన అవసరముంది. (ప్రజాశక్తి సౌజన్యంతో..)

ప్లాస్టిక్‌ భూతం..అంతానికి పంతం

పర్యావరణానికి వ్యర్ధాలు పెద్ద సమస్యగా మారింది. మహాసముద్రాలు,నదుల నుండి..చిన్న చెరువుల సహా చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. దీంతో పర్యావరణానికి భారీ నష్టం కలుగుతుంది. వ్యర్థాల ఉత్పత్తి, వ్యాప్తికి అనేక కారణా లున్నాయి. ఈ వ్యర్ధాలను ఎదుర్కోవడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రభుత్వాలు అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తు న్నారు. కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు దక్కలేదు. విస్తృతంగా వ్యర్థాలు పర్యావరణంలో కలిసిపోతున్నాయి.వ్యర్థాలు చాలా రకా లుగా ఉన్నాయి.వీటిని గుర్తిం చడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఏ రకమైన వ్యర్థాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి ..ఏవి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. వ్యర్థాలను గుర్తించేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాడేస్తాం..పడేస్తాం…ఇలావాడేస్తూ పడేస్తూ, సగటున ప్రతివ్యక్తి ఒక పాలిథిన్‌ సంచిని చెత్త బుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్లపైమాటే? అవన్నీ ఎక్కడికెళ్తాయి? ఏమైపోతాయి.మట్టిలో, నీళ్ళలో,ఎడారిలో,అడవుల్లో,కొండల్లో,గుట్టల్లో, ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.ఆవ్యర్థం కొండలా పేరుకుపోయి,కొండచిలువలా మానవ జాతిని మింగేస్తోంది.సౌలభ్యంగా ఉందని, చవగ్గా వస్తోందని, మహా తేలికని,మడత పెట్టుకోవచ్చని మురిసిపోతున్న మనం రాబోయే కష్టాల సంగతే పట్టించుకోకుండా మితిమీరి ప్లాస్టిక్‌ని వాడుతున్న ఫలితంగా ‘జనాభా విస్పో టనం కన్నా పెను ఉత్పాతంలా గుండెల మీద కుంపటిలా ప్లాస్టిక్‌ వినియోగం తయారైంది. రోజూ అన్ని అవసరాల కోసం కుగ్రామం నుండి మహానగరం వరకు ప్రతిరోజు విపరీతంగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. ఒక ప్లాస్టిక్‌ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడ్డ నిజం. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్షతో కూడిన వినిమయ సంస్కృతి వల్లే భూవాతావరణం ధ్వం సమైంది. మన అవసరాలను తీర్చుకునే క్రమం లో ప్రకృతి నియమాలకు లోబడి వ్యవహరించ డమనే ఆలోచన మనకుండాలి.పర్యావరణానికి భంగం కలుగకుండా ఈ భూగోళాన్ని తర్వాతి తరాలకు అందించే దృష్టితో,సమ కాలీన అవసరాలను తీర్చుకునే విధమైన సుస్థిర అభివృద్ధి నమూనా రూపొందించు కోవాలి.జీవితంలో ప్లాస్టిక్‌ నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది.ఉద యం నిద్రలేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇంటా,బయటా ఎన్నో అవస రాల కోసం ప్లాస్టిక్‌పై ఆధారపడుతున్నాం. టూత్‌ బ్రష్‌లు,వాటర్‌ బాటిల్స్‌,టిఫిన్‌ బాక్స్‌లు,ప్లేట్లు,గ్లాసులు, షాంపులు, పాలు, వంట నూనె ప్యాకెట్లు, తలనూనె,ఔషధాల డబ్బాలు, పిల్లల పాలసీసాలు..ఇలా ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో తయారైనవే.ఆశ్చర్యమే మంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హాస్పిట ల్స్‌లో కూడా సెలైన్‌ బాటిల్స్‌,రక్తం భద్రపర చే సంచులు,ఇంజక్షన్‌సీసాలు,సిరంజిలు కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే.పర్యావరణం, ప్రజా రోగ్యం ముప్పుకలిగించే వాటిల్లో ప్లాస్టిక్‌ ముఖ్యమైనదని నిపుణులు హెచ్చరి స్తున్నా,ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన ఉన్నా కూడా నిర్లక్ష్యం,బద్దకంవల్ల విపరీతంగా అడ్డూఅదుపు లేకుండా ప్లాస్టిక్‌ వాడుతున్నాం.
ప్లాస్టిక్‌ ఎలా హానికరం?
ప్లాస్టిక్‌లో కృత్రిమ రంగులు, రసాయనాలు, పిడ్‌మెంట్లు, ప్లాస్టిసైజర్లు, ఇతర మూలకాలు వినియోగిస్తారు. ఇవి రకరకాల క్యాన్సర్‌ కారకాలు. ఈ ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహార పదార్థాలు ప్యాకింగ్‌ చేసినపుడు ఇందులో ఉండే కాల్షియం,సీసం వంటి ధాతువులు ఆహారంలో చేరి ప్రజల ఆనారోగ్యానికి కారణమవుతాయి. ఈ ప్లాస్టిక్‌తో తయారైన ఉత్పత్తులను బయట పారేయడంవల్ల చాలా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి.ఈ ప్లాస్టిక్‌ వస్తువులను పశువులు తింటే వాటికి ప్రాణహాని కలుగుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పశువుల జీర్ణాశయాల్లోకి చేరి వాటికి తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తాయి. భారత్‌లో ఏడాదికి 65 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతున్నది. గత 50 ఏళ్ళలో 20 రెట్లు ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది. కాని ఇందులో 5 శాతం మాత్రమే రీసైకిల్‌ జరుగుతున్నది. ప్యాకింగ్‌ రంగంలో మొత్తం ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో 40 శాతం వాడుతున్నారు. ఒక కవరు రీసైక్లింగ్‌ అయ్యే ఖర్చులో 50 కొత్త కవర్లు తయారుచేసుకోవచ్చు. ప్యాకింగ్‌ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో 90శాతం వ్యర్థాలుగా మారుతున్నాయి. ఏటా 80లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి.2030 నాటికి సముద్రాలలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు రెట్టింపు అయి 2050 నాటికి నాలుగింతలు అవుతుందని ‘వరల్డ్‌ఎకనామిక్‌ఫోరం’ సర్వే నివేదికలు చెబుతున్నాయి. 2025 నాటికి 1టన్ను సముద్ర చేపలకు 3 టన్నుల ప్లాస్టిక్‌ పేరుకుపోతుందని ఈ సర్వే చెబుతున్నది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపరంగా..
అధిక ప్లాస్టిక్‌ వినియోగం వల్ల మగవారిలో బిపి,షుగర్‌,శ్వాస,గుండెపోటు వ్యాధులు పెరుగు తున్నాయని, ఆడవారిలో మెనోపాజ్‌, థైరాయిడ్‌, షుగర్‌, గర్భకోశవ్యాధులు పెరుగు తున్నాయని వైద్యులంటున్నారు. జీవక్రియల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే హార్మోన్ల పనితీరుపై ప్లాస్టిక్‌లో ఉండే ‘ధాలైడ్‌ఈస్టర్‌’ అనే రసాయనం తీవ్రప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్‌ అనేది ‘’కాక్‌ టెయిల్‌ ఆఫ్‌ కెమికల్స్‌’అంటారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లో భారలోహాలు, క్రిమిసంహారిణిలు, పెస్టిసైడ్స్‌, పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బ న్‌లు (పిఎహెచ్‌లు) పాలీక్లోరినేటెడ్‌ బైఫినాల్స్‌ (పిహెచ్‌బిలు) మిధనల్‌, సైక్లోహెక్సేన్‌,హెప్టేన్‌ల లాంటి సాల్వెంట్‌లుబీ పోటాషియం పర్‌సల్ఫేట్‌, బెంజాయిల్‌ పెరాక్సైడ్‌ లతో పాటు ట్రైబ్యూ టాల్టిన్‌,జింకాక్సైడ్‌,కాపర్‌క్లోరైడ్‌ లాంటి ఉత్ప్రేర కాలుబీ బ్రోమినేటెడ్‌ ఫ్లేమ్‌ రిటార్డంట్స్‌ (పియం డిఇ) పాలేట్స్‌, సీసం సంయోగాలు, పాలిక్లోరి నేటెడ్‌ బిస్పినాల్స్‌(పిసిబిలు), బిస్పినాల్‌ లాంటి రసాయనాలు ప్లాస్టిక్‌లో ఉంటాయి. ఇవి అంత స్రావీ వ్యవస్థపై వినాళగ్రంథుల స్రవనాలపై దుష్పలితాలు చూపుతాయి. ఈ రసాయనాలన్నీ సముద్ర జీవరాశులపై, మానవుల శ్వాస కోశంపై, చర్మంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి.ఒకటన్ను పాలథిన్‌ సంచులు తయారు చేయాలంటే 11బ్యారెళ్ళ చమురు అవసరం అవుతుంది.ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి పాలథిన్‌ కూడా ఓ కార ణమే.పాలథిన్‌ సంచి సగటు జీవిత కాలం 5 నిమిషాలకంటే తక్కువ. ఒకసారి వాడి పడేసే వారే అధికం. గ్రామాలలోని వీధులనుండి మొదలు మహానగరాల వరకు ఇపుడు సిమెంట్‌ రోడ్లేస్తున్నారు. కాంక్రిట్‌ జంగిల్స్‌ను తలపించే నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూసారాల్లో చేరి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా అడ్డుకుం టాయి. నగరాలలో 2సెం.మీవర్షం పడితే చాలు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటున్నాయి. మురుగు నీటి వ్యవస్థలు స్థంబించిపోతున్నాయి. వీటికి ముఖ్య కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. పైపుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇతర చెత్త పేరుకుపోయి అవి మూసుకుపోతున్నాయి. దీంతో రోడ్లు జలమయ మవుతున్నాయి.ట్రాఫిక్‌ సమస్యలేర్పడుతున్నాయి. ఓ మోస్తరు నగరాలలో కిలోమీటర్ల కొద్దీ, మహా నగరాలలో వందల కిలోమీటర్ల మేర నాలా లుంటాయి.ఈనాలాల చుట్టు పక్కల నివాసం ఉండే ప్రజలంతా,ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలను ఈ నాలాల్లో పారపోస్తుంటారు. ప్లాస్టిక్‌ సంచులు భారీ స్థాయిలో పేరుకుపోయి నాలాలు మూసుకుపోతున్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీసే యంత్రాంగం సరిపోను లేకపోవడంవల్ల కుంటలు, చెరువుల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నాయి.ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ ఉంచి వాడే ఆహారంవల్ల వ్యాధులు వస్తున్నాయి. ఇండ్లల్లో, కార్యాల యాల్లో, బేకరీలలో,హోటళ్ళలో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ ఓవెన్లు వాడు తుంటారు. ప్లాస్టిక్‌ పాత్రల్లో ఆహారంపెట్టి ఈ ఓవెన్లలో పెడతారు. ఇలా చేయడంవల్ల పదార్థాలు వేడవడంతో పాటు ప్లాస్టిక్‌పాత్ర లోని ‘’బిస్‌పినాల్‌’ పదార్థంకరిగి ఆహారంతో కలసిపోతుంది. ఇలా క్యాన్సర్‌,ఉదరకోశ వ్యాధు లకు అంకురార్పణ జరుగుతుంది. అందుకే ఓవెన్‌లలో ప్లాస్టిక్‌ పాత్రల బదులు బోరోసి లికేట్‌,గ్లాస్‌,సిలికోవ్‌తో తయారై అధిక ఉష్ణో గ్రతను తట్టుకోగల పాత్రలు వాడడం మంచిది.
ప్లాస్టిక్‌ వాడకాన్ని ఎలా తగ్గించొచ్చు
పెండ్లి,ఇతర విందుల్లో ప్లాస్టిక్‌ పళ్ళాలు, గ్లాసు లు నీటి ప్యాకెట్లను వినియోగించే బదులు విస్తరాకులు,అరటిఆకులు,కాగితంతో చేసిన గ్లాసులు వాడటం మంచిది. ప్లాస్టిక్‌ సంచులు వాడని హోటళ్ళను,కర్రీ సెంటర్లను ప్రస్తుతం మనం ఎక్కడా చూడలేము.టిఫిన్‌ నుంచి పచ్చడి,సాంబారు,కర్రీ అన్నీటిని ప్లాస్టిక్‌ సంచుల్లో కట్టి అందిస్తారు. ఇది మానుకోవాలి. సాంబారు రసం,కూరల కోసం ఇంటి నుంచి లోహపు డబ్బాలు తీసుకెళ్ళడం మంచిది లేకుంటే లోహపు డబ్బాల ధరను డిపాజిట్‌గా పెట్టుకొని హోటల్‌ యాజమానులు తినుబండారాలను స్టీలు డబ్బాలలో సరఫరా చేయాలి. వాటిల్లో తీసుకెళ్ళి వినియోగదారుడు డబ్బా తిరిగి ఇచ్చిన వెంటనే డిపాజిట్‌ వెనక్కి ఇచ్చేయొచ్చు.వాడి పడేసే ప్లాస్టిక్‌ పెన్నుల వల్ల కూడా పర్యావర ణానికి ముప్పు పొంచిఉంది.ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెన్నుల వినియోగం భారీ స్థాయిలో ఉంది.ఇందుకు విరుగుడుగా ఇపుడు మార్కెట్లో పర్యావరణ హితమైన పెన్నులు అమ్ముతున్నారు.ఈపెన్నులు వినియోగించిన తర్వాత భూమిలో నాటితే మొక్క వచ్చే వీలుగా వీటిని తయారుచేశారు. ఇందుకు పెన్ను చివరన ఒక విత్తనం పెడుతున్నారు. ఇంకు అయి పోయాక దీనిని తిప్పి భూమిలో నాటితే కొన్ని రోజులకు మొక్కలు వస్తాయి. ఇది స్పూర్తివంతమైన, పెద్దలకు, పిల్లలకు ఆసక్తికరమైన పని.
ప్రత్యామ్నాయాలు ఆచరించాలి
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా ప్లాస్టిక్‌ వినియోగంపై ఎవరికి వారుగా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలి. పండ్లు, కూరగాయలు,కిరాణ షాపులో సామాన్లు కొనేపుడు ప్లాస్టిక్‌ సంచీలు అడుగ కుండా ఇంటి నుంచి బట్ట,జ్యూట్‌ సంచులు తీసుకెల్లడం ఉత్తమం.చికెన్‌,మటన్‌ అమ్మే వ్యాపారస్తులు చాలా మంది 40మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులు వాడుతున్నారు. వాటిల్లో తెచ్చుకునేకంటే ఇంటి నుండి ఒక స్టీలు డబ్బా తీసుకెళ్ళడం మంచిది. మంచినీటి కోసం కార్యాలయాల్లో ఒకపుడు గాజు,స్టీలు,గ్లాసులు వాడేవారు.ఇపుడు ప్లాస్టిక్‌ సీసాల్లో తెచ్చిపెడు తున్నారు.ఈ పద్ధతి సరికాదు.టీలు,కాఫీలు గాజు,స్టీలు,పింగాణీపాత్రల్లో మాత్రమే తాగాలి. పండ్లరసాలు తాగడానికి కాగితం గ్లాసులే వాడాలి. ఇండ్లల్లో ఆకు కూరగాయాలను ఫ్రిజ్‌లో ఉంచేందుకు కంటైనర్లు వాడాలి. పాలు,పెరుగులను ప్లాస్టిక్‌ కవర్లలో విక్రయి స్తుంటారు.ఏరోజుపాలు ఆ రోజు తెచ్చుకుని పాల ప్యాకెట్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా,పాత్రలో వేడిచేసి చల్లారిన తర్వాత నిల్వచేసుకోవాలి. వ్యాపారస్తులు 40 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ సంచులు వాడకుండా అధికారులు మొక్కుబడి తనిఖీలు కాకుండా కఠినంగా వ్యవహరించాలి.ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలు ఆరోగ్యసమస్యలు,పర్యావరణ హాని తదితర అంశాలపై గ్రామాలు,పట్టణాలు, నగరాల్లో, కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు యూత్‌క్లబ్‌ల సభ్యులను,కాలనీ కమిటీలను ప్రోత్సహించాలి.అధికారులు ప్రజల మధ్య సమన్వయం, సహకారం ఉంటేనే ప్లాస్టిక్‌ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకో గలం.పాలకులు, ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు జౌళి సంచులు తయారీ పరిశ్రమలపై దృష్టి సారించాలి. ఇందుకోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలి. సబ్సిడీలిచ్చి ఆకర్షించాలి. చెత్తకుండి ఉన్నదే చెత్తవేయడానికి మళ్ళీ అందులో పాలిథిన్‌ కవరు ఎందుకు?డబ్బాఖాళీ చేసాక ఓసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరిపోతుంది. గుడ్డసంచి వాడితే,వారానికి ఆరు,నెలకు 24, సంవత్సరానికి 280 ఓజీవితకాలంలో కనీసం 22వేల పాలిథిన్‌ కవర్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించిన వాళ్ళం అవుతాం.‘నోపాలిథిన్‌ హేజ్‌’ అని మనింటికి మనమే ధృవపత్రం ఇచ్చుకోవాలి.నిజానికి పాలిథిన్‌ దుష్ప్రవాల నుంచి తప్పించుకోవడానికి నిషేధాలు సరిపోవు. నిజాయితీ కావాలి.జనభాగస్వామ్యం అవసరం.– ` సైమన్‌ గునపర్తి

సామాజిక విప్లవకారిణి సావిత్రిభాయి ఫూలే

తలపై ముసుగు ధరించిన ఓ యువతి బడిలో పాఠాలు చెప్పడానికని వడివడిగా నడిచి వెళ్తోంది. ఆమెను చూసిన ఒక బ్రాహ్మణ స్త్రీ ఆగ్రహంతో అసలిదేంపని? అంటూ అవమానిస్తూ… పేడ ముద్దలు విసిరారు. కుల ప్రసక్తి లేని – ఒక బాలికల పాఠశాలను ప్రారంభించేందుకు వెళుతున్న సందర్భంగా 1851వ సంవత్స రంలో సావిత్రిబాయికి ఎదురైన అనుభవం ఇది. అయినా ఆమె భయపడలేదు. తన లక్ష్యసాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనడానికైనా సిద్ధపడిరది. సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి 186వ జన్మదినం సందర్భంగా జనవరి 3న ‘గూగుల్‌ ’ ఆమెకోసం ప్రత్యేకంగా నివాళి అర్పించటం ఆమెకే కాదు.. మన దేశానికే గర్వకారణం.
పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లా నయ్‌గావ్‌ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3వతేదీన సావిత్రీబాయి జన్మిం చారు.ఆనాటి సంప్ర దాయం ప్రకారం ఆమెకు తొమ్మిదోవ ఏటనే జ్యోతీరావుతో వివాహమైంది. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె పూర్తి విద్యావం తురాలైంది. సామాజిక పరివర్తనను సాధిం చింది. తన భార్య జ్ఞానం కుటుంబానికే పరిమితం కారాదనీ, ప్రజలందరికీ విద్యనం దించగల శక్తిగా ఆమె అవతరించాలనీ జ్యోతీరావుపూలే ఆశించారు.1848లో జ్యోతీరావుపూలే ‘పూనే’లో తొలి బాలికా పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలకు సావితత్రీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఈ పాఠశాలను నిర్వహి స్తున్నందుకు అన్ని సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీ బాయి దంపతులను గృహ బహిష్కారానికి గురి చేశారు.1852వ సంవత్సరంలో ‘మహిళా సేవామండల్‌’ అనే మహిళా సంఘాన్ని సావిత్రీబాయి స్థాపించారు. అనంతరం 1853లో అనాధలుగా మారుతున్న శిశువుల కోసం ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ స్థాపన శరణా లయాన్ని స్థాపించారు. దిక్కులేని స్త్రీలకు, పిల్ల లకు సావిత్రీబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది. బాల్యంలోనే వైధ వ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్ల లకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవ తులైన వారికి పురుళ్లు పోసివారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకు న్నారు.యశ్వంత్‌గా నామకరణం చేసి తమ ఆశ యాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి,క్షురకులను చైతన్యపర్చి,వితంతువులకు శిరోముండనం చేయ బోమంటూ క్షురకుల చేత1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి.తరువాత 1873 సెప్టెంబరు 24న‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక,ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావి త్రీబాయి నేతృత్వంలో నడిచేది.వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపిం చారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తిని మించిన ధనాన్ని ఖర్చుచేస్తూ కుటుంబా లను నెడుతాయో, కుటుంబాలను ఎంతగా నాశనం చేస్తాయో తెలియజేస్తూ ఆమె రాసిన వ్యాసాలు 21వ శతాబ్ధానికి కూడా నిత్య నూతనంగానే కనపడతాయి. కరువు బారిన పడిన కుటుంబాలలోని అనాథ బాలల కోసం 52 పాఠశాలలను వాళ్లు నిర్వహించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతి రేకంగా పోరాడారు. జ్యోతీరావుపూలే.1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు.తన భర్త పూలే చితికితానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.1897లో ప్లేగు వ్యాధి,పూణే నగరాన్ని వణికించింది. నగర మంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్‌ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.చివరికి ఆప్లేగు వ్యాధే ఆమెను మార్చి10,1897లో కబళిం చింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రి యలు జరిపించారు. ఆనాటి ప్రజల స్థితిగతు లు,అవిద్య,సాంఘిక దురాచారాలు,సతీ సహగ మనం,బాల్యవివాహలు సావిత్రీబాయిని కదిపే శాయి. వీటిని నిర్మూలించడానికి అవసరమైన చైతన్యం పెరగాలంటే విద్య అందరికి అందు బాటులోకి రావాలని విశ్వసించారామె. బాలి కల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం మొదలెట్టారు. తద్వారా సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కృషి చేశారు. తన దగ్గర చదువుకున్న పిల్లలు,పెద్దలు స్వేచ్ఛ కోసం స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో విద్యా వ్యాప్తికి చేపట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అక్షరాస్యతను సాధించలేక పోయినా,విద్య బలోపేతానికి ప్రభుత్వమే బాధ్యత పడిరది. కాని ప్రస్తుత సమాజంలో ఫూలే ఆశించిన లక్ష్యా లకు తూట్లు పొడుస్తున్నారు. రెండు దశాబ్దాలు గా చేపడుతున్న విద్యా సంస్కరణలు వ్యాపార వర్గాలకు లాభాలు చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుతో పాఠశాలల మూత,క్లస్టరైజేషన్‌, మతతత్వ ధోరణులు సిలబస్‌లో జొప్పించడం,విద్యా హక్కు చట్టాలను నిర్వీర్యం చేయడం,రాష్ట్రాలవిద్యాహక్కు చట్టాలపై పెత్తనం వంటి వాటికి పూను కుంటున్నది. నేటి విద్యారంగ సంస్కరణలు బడుగు, బలహీన సామాజిక వర్గాల వారికి మరలా విద్యను దూరం చేసేవిగా ఉన్నాయి. మాతృభాషలో శూద్ర కులాల వారికి పాఠ శాలలు పెట్టించిన ఫూలే ఆశయానికి భిన్నంగా నేడు పాఠశాలలు మూసివేస్తున్నారు. వెరసి బాలికలు పెద్ద సంఖ్యలో చదువుకు దూరం అవుతున్నారు. అవిద్య, బాల్య వివాహాలపై పోరాటం,సతీ సహగమనం వంటి వాటిపై చైతన్య పరిచి, నిషేధించడం వంటివి సమా జానికి మేలు చేసిన సంఘటనలు. సామాజిక దురాచారాలను తిప్పి కొట్టాలంటే చదువే కీలకమని నిరూపించింది సావిత్రీబాయి ఫూలే. నేడు నూతన రూపాల్లో మతం,కులం, సంప్ర దాయాల పేరుతో స్త్రీలపై, బాలికలపై జరుగు తున్న దాడులు చూస్తున్నాం. దుస్తులు, హిజాబ్‌, సంప్రదాయాలు, ఆహారం పరంగా ఆంక్షలను గమనించినట్లయితే ఇవన్నీ సమాజాన్ని మను వాదం లోకి తీసుకెళ్తున్నాయి. మరలా ఇటు వంటి ఘటనలు ప్రజాస్వామ్య భారత దేశంలో పునరావృతం అవుతున్నాయంటే స్త్రీలకు వ్యతి రేకంగా నిర్ణయాలు చేస్తున్నారనే అర్థం.ఫూలే స్ఫూర్తితో ఇటువంటి విధానాలపై పోరాటాలకు సిద్ధపడాలి.సమకాలీన సమాజంలో సామాజిక అంతరాలను పెంచే విధానాలపై కళారూపాల ద్వారా చైతన్యపరచాలని,సాంస్కృతిక,జానపద అంశాలలో మహిళా టీచర్లజోక్యం పెరగాలని, మూఢ విశ్వాసాలను పారదోలడానికి జానపదాలను ఎంచుకోవాలని, సాంఘిక దురాచారాలపై నిరంతరం పోరాడాలని ఆచరణలో చూపించారు సావిత్రీ బాయి ఫూలే. కాని ప్రస్తుత బిజెపి ప్రభుత్వ విధానాలు పాఠ్యపుస్తకాలలో మతతత్వాన్ని చొప్పిస్తున్నాయి. లౌకిక, రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నాయి. బాలికా విద్య కోసం, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు, కుల మత తత్వాలకు వ్యతిరేకంగా సావిత్రీ బాయి పోరాడారు.
సామాజిక వైతాళికురాలు ప్రపంచవ్యాప్తంగా జాతి విముక్తి పోరాటాలు జరుగుతున్న రోజులవి.మన దేశం కూడా బ్రిటీష్‌ పరాయిపాలనలో ఉన్నప్పుడు ఎక్కడి కక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఉద్యమాలు ఊపందు కున్నాయి.ఆ కాలంలోనే అనేకమంది సంస్కరణల కోసం ప్రాణాలుఅర్పించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయినిగా, సామాజిక వైతాళికురాలిగా…బాలికావిద్య కోసం,బడులు పెట్టడం కోసం సావిత్రీబాయి ఫూలే చేసినత్యాగాలు,కనబరచిన పట్టుదల మనందరికీ ఆదర్శనీయం.విద్యా వ్యవస్థపట్ల, విద్య సమాజానికి దారి చూపే తీరుపట్ల ఆమెకు ఎంతోస్పష్టత ఉంది. 1881లో లార్డ్‌ రిప్పన్‌, హంటర్‌ అధ్యక్షతన విద్యాకమిషన్‌ను నియ మించేటప్పుడు మాతృభాషలో విద్య అందిం చాలని, శూద్ర,అతిశూద్ర కులాల వారికి పాఠశాలలు పెట్టాలని,పేదరికం వలన దిగువ కులాల పిల్లలకు 12సంవత్సరాల వయసు వరకు ఉపకార వేతనం మంజూరు చేయాలని మహర్‌,మాంగ్‌ (గిరిజన తెగ) కులస్థులకు ప్రత్యేక పాఠశాలలు పెట్టాలని ప్రతిపాదనలు పెట్టారు ఫూలే. సమాన హక్కులు నినాదంతో అట్టడుగు వర్గాలవారికి బడులు పెట్టి విద్యనం దించేందుకు కృషి చేశారు. స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటిష్‌ పాలకుల ఎజెండాలో, స్వాతం త్య్రం వచ్చాక మన రాజ్యాంగంలో పైఅంశాల న్నింటికీ చట్టబద్దత కల్పించాలని,సమసమాజం స్థాపించాలని సావిత్రీ బాయి ఫూలే ఆశిం చారు.ఆకృషి ఫలితమే నాటి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బాలికల పాఠశాలలు. కాని నేటికీ విద్యాభివృద్ధికి కుల వ్యవస్థ ఆటంకంగానే ఉంది. కులతత్వాన్ని, మతత త్వాన్ని పెంచి పోషించే విధానాలను ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పటికీ బడుగు వర్గాల పిల్లలు చదువుకి దూరంగా ఉన్నారు. మొత్తం అక్షరాస్యతలో మహిళల అక్షరాస్యత 64 శాతం మాత్రమే. ఇటువంటి గణాంకాలు దేశ అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడవు. విద్యకు దూరంగా ఉండే ప్రాంతాలు, వర్గాల వారు నిరంతరం దోపిడికి గురవుతారని అనేక అంశాలు సూచిస్తున్నాయి. బాల్య వివాహాలు, అత్యా చారాలు, లైంగిక వేధింపులు, ఉపాధి, కార్మిక శక్తిలో 34 దేశాలతో పోల్చుకుంటే 24వ స్థానంలో ఉన్నాం. సరికొత్త సమస్యలు విద్యారం గంలో మొదలయ్యాయి. ఈ అవశేషా లను రూపుమాపాలంటే సావిత్రీబాయి సూచించిన సామాజిక ఉద్యమాలను నిర్మించాలి. అది మనందరి కర్తవ్యం.స్త్రీలు చదువు నేర్చుకోవడమే అరుదైన కాలంలో బాలికలకు పాఠశాలలో విద్య నేర్పడానికి తన భార్య సావిత్రిని విద్యా వంతురాలిని చేసి దేశానికి తొలి ఉపాధ్యా యురాలిని అందించారు జ్యోతిరావు ఫూలే. విద్యపై, ఉపాధ్యాయులపై, విద్యార్థులపై ఎంతో ప్రభావితం చేయగలిగిన ఆమె స్ఫూర్తిదాయక చరిత్ర మన దేశానికి ఎంతైనా అవసరం. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పెద్దలు ఆమె విగ్రహాలకు పూలమా లలు వేసి సరిపెట్టుకుంటే సరిపోదు. ఆమె ఆశ యాలకు కార్యరూపం ఇవ్వవలసిన బాధ్యత చేపట్టాలి. అలాగే ఆమె జయంతి రోజును జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి.-(కె.విజయగౌరి)

సబ్‌ప్లాన్‌ ఆశశ్యకత !

సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివృద్ధి అసమాన తలను, ఈ వర్గాల ప్రజల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ఉప ప్రణాళికను ఆమోదించింది. అణగారిన తరగతులైన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 1980వ దశకంలోనే చట్టపరంగా తీసు కొచ్చిన ఈ సబ్‌ప్లాన్‌ విధానం నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చాక క్రమంగా నీరుగారుతూ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం సాగిన ఫలితంగానే ప్రభుత్వం 2013లో చట్టం చేసింది.అయితే,దాని కాలపరిమితి పదేళ్లుగా నిర్ణయించడంతో రానున్న జనవరి 24వ తేదీతో గడువు ముగుస్తుంది.
సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని కొన సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలని దళితులు, గిరిజనులు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేయవలసిరావడం విచారకరం. అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా మని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి కీలకమైన అంశంపై మీనమేషాలు లెక్కించడం మాని కార్యాచరణకు ఉపక్రమించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రంలో సబ్‌ప్లానును క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకు రావడమే పరమ తిరోగమన చర్య. అసలు ప్లానే లేకపోతే ఇక సబ్‌ప్లాన్‌ ఇంకెక్కడ అనే స్థితి తెచ్చారు. కాని దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబకడంతో బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటా యింపులు చేస్తున్నారు. కాని, అదంతా ఖర్చు చేయకుండా కోతలు పెట్టడం, ఇంకొన్ని నిధులను దారి మళ్లించడం షరా మామూలే! కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీ లిస్తున్న మోడీ సర్కారు ఎస్‌సి,ఎస్‌టిల సంక్షే మానికి కనీస కేటాయింపులను కూడా ఖర్చు చేయకపోవడం సంఘపరివార్‌ నైజానికి నిదర్శనం.కాని,కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఆరాష్ట్రంలోని ఎస్‌సి,ఎస్‌టిల జనాభాశాతం కన్నా ఎక్కువ శాతం నిధుల్ని ప్రణాళికా వ్యయంలో కేటాయించడం శ్లాఘనీయం. దేశం లో అలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదీ లేదు.రాష్ట్రంలో సబ్‌ప్లాను చట్టం చేయడంతో నిధుల కేటాయింపు,ఖర్చునకు కొంత గ్యారంటీ వచ్చింది. కాని,2018 నుండి రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు క్రమంగా తగ్గిస్తున్నారు. నిధుల మళ్లింపు యథేచ్ఛగా సాగిపోతోంది. జనాభా ప్రాతిపదికగా సబ్‌ప్లాన్‌ నిధులు కేటా యించాలి.ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో 20వేలకోట్ల రూపాయలు కేటాయిం చాలి కానీ అది కేవలం రూ.17,403 కోట్లు మాత్రమే. ఇందులోనూ ఎస్‌సి ఎస్‌టిల అభి వృద్ధికి ఖర్చు చేసింది సుమారు ఐదు వేలకోట్లు మాత్రమేననీ మిగతా 12వేల కోట్లను ఇతర పథకాలకు మళ్లిం చారన్న ఆరోపణ సత్య దూరం కాకపోవచ్చు. సబ్‌ప్లాన్‌ నిధులను ఆ తరగతులవారు నివసించే ప్రాంతాలుఅంటే దళిత వాడలు,గిరిజనగూడేలు,తండాల అభివృద్ధికి, ప్రత్యేకించి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. చట్టం స్పష్టంగా చెబుతున్నా, గతంలోనూ, ఇప్పుడూ ప్రభుత్వాలు ఆ రీతిలో ఖర్చు చేయడంలేదు.రోడ్లు వేయ డానికి,సాగు నీటి ప్రాజెక్టులకూ సబ్‌ ప్లాన్‌ నిధులనే వాడేయడం దారుణం. ఎవరైనా ప్రశ్నిస్తే వారూ వాడుకుంటారు కదా అన్న ఏలినవారి సమాధానం పేదలను, సబ్‌ప్లాన్‌ చట్టాన్ని వెక్కిరించడమే! ఆయా తరగతుల అభివృద్ధికి ప్రత్యేకించి ఖర్చు చేయవలసిన నిధులను నవరత్నాల్లో భాగంగా సాధారణ పథకాలకు వెచ్చించడం ధర్మం కాదు. ప్రభుత్వ రంగాన్ని పాలకులు క్రమంగా కుదించి వేయ డంతో సామాజిక న్యాయం చతికిలపడు తోంది.ఎస్‌సి,ఎస్‌టి లకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్ల కోసం ఉద్యమించ వలసిన పరిస్థితి. అణగారిన వర్గాలపట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కనుక ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించేలా సబ్‌ప్లాన్‌ చట్టం కొనసాగాల్సిందే. కేటాయిం పులు అణగారిన తరగతులవారి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కేటాయించిన సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించే వీలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయమైన డిమాండ్లతో వివిధ సామాజిక సంఘాలు, సంస్థలు విశాల ఐక్య ఉద్యమం సాగించాలి. దానికి అభివృద్ధి కాముకుల,ప్రగతిశీల శక్తుల మద్దతు తప్పక లభిస్తుంది. ప్రభుత్వాలు ప్రజా ఒత్తిడికి తలొగ్గక తప్పదు.
ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలని..
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాలానుగు ణంగా గతంతో పోలిస్తే ఈ వర్గాల ప్రజానీకం అభివృద్ధి చెందినా, ప్రధాన జీవన స్రవంతి కంటే ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలితాలు అందాలని పన్నెండో పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. అందుకే వేగవంతమైన, సుస్థిరమైన, మరింత సమ్మిళితమైన అభివృద్ధిని సాధించడమే పన్నెండో ప్రణాళిక ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశిం చారు. రాజ్యాంగంలోని అనేక అధికరణలు అన్యాయం, అణచివేత నుంచి సమాజానికి రక్షణ కల్పిస్తున్నాయి. ఈ అధికర ణలు:46,14, 15(1),17,15(2),15 (4) (5), 16(4), 16(4ఎ), 16(4బి),335,243డి,340టి. అదేవిధంగా షెడ్యూల్డ్‌ తెగల రక్షణకు రాజ్యాం గంలో అనేక అధికరణలున్నాయి. వివిధ రాజ్యాంగ అధికరణలతోపాటు పార్లమెంట్‌ ఈ వర్గాల ప్రజల రక్షణకు అనేక చట్టాలను కూడా చేసింది.ఉదాహరణకు, 1955లో అంట రానితనంపై చట్టం రూపొందించారు. దీన్ని తర్వాతి కాలంలో (1976లో) పౌరహక్కుల రక్షణ చట్టంగా పునఃనామకరణం చేశారు. సామాజిక అణచివేతకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలపై జరుగుతున్న అత్యాచారాలను నివారిం చేందుకు 1989లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల (అత్యాచారాల నివారణ చట్టం) వచ్చింది.
ఎస్సీ జనాభా వివరాలు
రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల జనాభా పెరుగు తూ వస్తోంది. ఇప్పటికీ ఎస్సీ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 1.06కోట్లు. మొత్తం జనాభాలో ఇది15.9శాతంగా ఉండేది.2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా మొత్తం జనా భాలో16.2 శాతానికి పెరిగింది. 2001 జనా భా లెక్కల ప్రకారంరాష్ట్రం మొత్తం మీద చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ వర్గం జనసాంద్రత అత్య ధికం.ఈ జిల్లాలో మొత్తం జనాభాలో 22.5 శాతం ఉన్నారు. తర్వాతి స్థానంలో ప్రకాశం (21 శాతం), చిత్తూరు (18.7) జిల్లాలున్నాయి.
అక్షరాస్యత తీరుతెన్నులు
జనాభా లెక్కల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతోందని అర్థమవుతుంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో 1981లో అక్షరాస్యతా రేటు 29.9 శాతం. 2001లో ఇది 60.5 శాతానికి పెరిగింది. అదేవిధంగా ఎస్సీలలో కూడా అక్షరాస్యత పెరుగుతోంది. రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో అక్షరాస్యతా రేటు 1981లో 17.7 శాతం ఉండగా, ఇది 2001లో 53.6 శాతానికి పెరిగింది. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం చూసినా మొత్తం జనాభా అక్షరాస్యతా రేటుతో పోలిస్తే ఎస్సీ ప్రజానీకంలో అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది. మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధిలో కీలకాంశంగా ఉన్న అక్షరాస్యతా రేటు విషయంలో ఇతర వర్గాల ప్రజానీకానికి, ఎస్సీలకు మధ్యనున్న తేడాను అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ మహిళల్లో అక్షరాస్యతా రేటులో పెరుగుదల వేగం తక్కువగా ఉంది. ఉదాహరణకు 2001లో మొత్తం మీద చూస్తే మహిళా అక్షరాస్యతా రేటు 50.4శాతంగా ఉంటే ఎస్సీలలో మహిళా అక్షరాస్యతా రేటు 43.4 శాతంగా ఉంది. విద్యారంగంలో ప్రమాణాలకు మరో కీలక కొలమానం మధ్యలో బడి మానేసే వారి సంఖ్య. భారత విద్యావిధానంలో చూస్తే, బడిలో చేర్పించే విషయంలో దాదాపు పూర్తి స్థాయిలో విజయం సాధించాం. కానీ మధ్యలో బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. కొంత కాలంగా విద్యారంగ ధోరణులను పరిశీ లిస్తే ఎస్సీ బాలబాలికల్లో కూడా మధ్యలో బడి మానేసే వారి శాతం తగ్గుతోంది. కానీ, ఇప్పటికీ ఇదిచాలా అధికంగా ఉండటం ఆందోళనకరం. ఉదాహరణకు 2007-08లో ఎస్సీ బాలబాలికల విషయంలో మధ్యలో బడి మానేసే వారి శాతం ఇంకా 69 శాతంగా ఉంది. ఎస్సీ బాలురతో పోలిస్తే బాలికల్లో ఈ శాతం సహజంగానే మరింత ఎక్కువగా ఉంది. అందుకే అంబేద్కర్‌ పేర్కొన్నట్లు అణగారిన వర్గాలలోని మహిళలు రెండు రకాల వివక్షకు గురవుతారు. కులపరమైన వివక్షతో పాటు లింగ వివక్షకు కూడా బలవుతున్నారు.
జీవనోపాధి ధోరణులు
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వ్యవసాయేతర స్వయం ఉపాధిపై ఆధారపడు తున్న వారి శాతం పెరుగుతోంది. మరోవ్కెపు మొత్తం ఎస్సీ జనాభాలో వ్యవసాయం, స్వయం ఉపాధి, వ్యవసాయ కూలీలుగా ఆధారపడి జీవిస్తున్న వారి శాతం తగ్గుతోంది. అయితే ఇప్పటికీ ఎస్సీలలో 63శాతం ప్రజల జీవనో పాధి వ్యవసాయమే. ఎస్సీ ప్రజానీకం అత్యధికంగా గ్రామాల్లో జీవిస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా గడుపుతున్నారు.ఉప ప్రణాళిక అమలులో భాగంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళికా కేటాయింపులలో జనాభా దామాషా ప్రాతిపదికపై ఎస్సీలకు నిధులను కేటాయి స్తున్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ తమ ప్రణాళికా కేటాయింపులలో ఇలాగే నిధులు కేటాయిస్తే ఇక్కడో సమస్య ఉంది. అత్యధిక ఎస్సీ జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో ఆ మేరకు వ్యవసా యానికి అంత ప్రాధాన్యం ఉండదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు లభిస్తున్న ప్రాధాన్యానికి, ఎస్సీ ప్రజల జీవితాల్లో ఆయా రంగాల ప్రజల జీవనాధారానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇటీవల ఆమోదించిన చట్టం అమలులో భాగంగా పథకాలు,కార్యక్ర మాలను రచించేటప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కొంత కాలంగా రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో దాదాపు సగం మేరకు జలయజ్ఞానికి కేటాయిస్తున్నారు. అందులో భారీ నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఉంటోంది. కానీ, ఎస్సీల్లో అత్యధి కులు భూమిలేని వ్యవసాయ కూలీలు. వీరికి భూమే లేనప్పుడు భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. అందుకే నిధులను వెచ్చించేందుకు ప్రణాళికలను రూపొందించేటప్పుడు ఉప ప్రణాళిక అమలు మండలి, నోడల్‌ ఏజెన్సీలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
పేదరికం తేడాలు
పేదరికాన్ని అంచనా వేసేందుకు ఇటీవల లక్డావాలా కమిటీ, టెండుల్కర్‌ కమిటీ పద్ధతులు వచ్చాయి. లక్డావాలా కమిటీ అంచనాల ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గుతూ వస్తోంది. అలాగే పట్టణ ప్రాంతంలో ఇదే కాలంలో ఎస్సీలలో పేదరికం 50.6 శాతం నుంచి 37.4శాతానికి తగ్గింది. టెండుల్కర్‌ కమిటీ తాజా అధికారిక అంచనాల ప్రకారం 2009-10లో గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీలలో పేదరికం 23.5శాతం ఉండగా, పట్టణ ప్రాంతంలో 17.4 శాతంగా ఉంది. లక్డావాలా కమిటీ, టెండుల్కర్‌ కమిటీల ప్రకారం గ్రామీణ, పట్టణ పేదరికం అంచ నాల్లో చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఈ ఉప ప్రణాళిక అమలును సాంకేతిక దృక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దృక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులలో ఎస్సీ ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. గిరిజనుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీ యాదాయంలోనే కాదు, రాష్ట్ర ఆదాయంలో కూడా అధిక భాగం సేవలరంగం నుంచే వస్తోంది. కానీ,ఈ నూతన సంపదలో ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి సరైన భాగస్వామ్యం లేదు.అందుకే చట్టం చేయ డంతో సరిపోదు. ఆ చట్టం అమలులో నవీ నత్వం,సృజనాత్మకత కీలకమవుతాయి. ‘సబ్‌ప్లాన్‌’ కాలపరిమితి పెంచండి
దళిత, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడానికి పదేళ్ల కాలపరిమితితో 2013లో తీసుకువచ్చిన ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌చట్టం గడువు 2023 మార్చితో ముగుస్తున్నందున ఈ కాలపరిమితిని పొడిగించడానికి వీలుగా చట్ట సవరణ చేయా లని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యా ది కోరారు. ఈ మేరకు గుంటూరులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగా ర్జునను ఆయన క్యాంపు కార్యాల యంలో కలిసి వినతిపత్రం అంద జేశారు.ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల సబ్‌ ప్లాన్‌ చట్టాం2013 వచ్చిందన్నారు. అయితే సరైన నిబంధనలు లేకపోవటంవల్ల 2015 వరకూ ఈ చట్టం అమలులో పలు సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ చట్టానికి లోబడి జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తూ వచ్చాయని, మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం వల్ల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన ప్రాంతా లకు అపార నష్టం జరిగిందని అన్నారు. ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎస్‌సి,ఎస్‌టిలకు రక్షణ అవసరమని, అందుకోసం చట్టాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌చట్టం 2013చాప్టర్‌ 1క్లాజ్‌4ను సవరించి, కాలపరిమితిని పొడగించేందుకు రానున్న అసెంబ్లీ సమావే శాల్లోనే నిర్ణయం చేయాలని మంత్రిని కోరారు.
జిఎన్‌వి సతీష్‌

1 2 3 4 11