సముద్రం పొండిన వేళ..

మీరు ఎప్పుడైన సముద్రాన్ని చూసారా? చాలా బాగుటుంది కదా. పెద్దగా శబ్ధం చేస్తూ పెద్ద పెద్ద అలలు ఒడ్డుకు వస్తుంటాయి. ఒక అల వచ్చి వెళ్ళిన తరువాత ఇంకొక అల వస్తుంటుంది. కంటికి కనిపించేంత దూరం నీళ్ళుంటాయి. ఇన్ని నీళ్ళు సముద్రంలోకి ఎక్కడునించి వచ్చాయి అనే అనుమానం కలుగుతుంది. మనకు తెలుసు నదులన్ని సముద్రంలో కలుస్తాయని. మనదేశంలోని జీవనదులు గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి లాంటివి, ఇంకా అమేజాన్‌, నైలు లాంటి ఇతర దేశాలలోని నదులన్ని సముద్రాలలో కలుస్తుంటాయి. మరి ప్రతి రోజు ఇన్ని నదులలోంచి నీళ్ళు కొన్నివేళ సంవత్సరాలుగా సముద్రంలో కలుస్తుంటే అందులో నీరు ఎక్కువైపోయి సముద్రం పొంగాలి కదా, ఎప్పుడు సముద్రం పొంగినట్లు మనం వార్తల్లో వినలేదు (ఒక్క సునామి వచ్చినప్పుడు తప్ప). కారణం ఏంటో చెప్పుకొందామా!
మన భూమిని నీటి గ్రహం (షa్‌వతీ జూశ్రీaఅవ్‌) అంటారు. ఎందుకంటే భూమి 70% నీటితో నిండి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97.2% సముద్రాలలోనే ఉంటుంది. మిగితా 2.8% నీరు నదులతో, చెరువుల్లో, మంచుకొండల్లో (ద్రువాలు, హిమాలయాలలో) ఉంటుంది. పర్వతాల మీద మంచు కరిగి ఆ నీరు జీవనదులుగా ప్రవహిస్తుంటుంది. సముద్రం నీరు ఉప్పుగా ఉండడానికి కారణం ఈ జీవనదులు తమ నీటితో పాటు భూమి మీది లవణాలను నిరంతరం సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు ఉప్పుగా మారింది. భూమి మీద సముద్రం చంద్రుని వైశాల్యం కంటే 9 రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత విస్తీర్ణం ఉన్న సముద్రంలోనే నీరు ప్రతిరోజు ఎండ తాకిడికి ఆవిరిగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ ఆవిరి మేఘాలుగా మారి చల్లబడి వానలుగా కురుస్తాయి. ఇలా సముద్రంలోన నీరు ప్రతినిత్యం నీటి ఆవిరిగా మారి వాతావరణంలో కలవడం వల్ల నదులు నుండి వచ్చే నీరు సముద్రంలోకి ఎక్కువ అవదు. ఈ విధంగా భూమి మీద సముద్రాలు ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు సముద్రాలలో నీటి పరిమాణం మారకుండా ప్రకృతి నియంత్రిస్తుంది. దీనినే హైడ్రోలాజిక్‌ సైకిల్‌ (నవసతీశీశ్రీశీస్త్రఱష జవషశ్రీవ) అంటారు. భూమి మీద నీరు ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఉంటుంది. అది నీరు, నీటి ఆవిరి లేక మంచు రూపంలో ఉంటుంది. ఇలా నీరు నిరంతరం తన రూపం మార్చుకోవడం వల్ల మనిషి బ్రతకగలుగుతున్నాడు. దీని కారణం ప్రకృతి. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాం.! `ఆధారం: ఆనంద్‌,(వికాస్‌పీడియో)

  • ప్రపంచమంతటా ఇదే దుస్థితి ా ఉత్తరార్ధ గోళంలో తీవ్ర దుర్భిక్షం ా 230కోట్ల మందికి నీటి కొరత
  • జర్మనీ,ఇటలీ ఫ్రాన్స్‌,స్పెయిన్‌,చైనా,అమెరికా, ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవ నదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల చాలాదేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరతకాస్తా ఈకరువు దెబ్బకు రెట్టిం పౖంది.2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటికొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదిక చెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో47శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకు న్నాయని గ్లోబల్‌ డ్రాట్‌ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది.
  • బయట పడుతున్న చారిత్రక అవశేషాలు
  • మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొల రాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్‌ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సె లోనా సమీపంలోని రిజర్వాయర్లో నీరు ఆవిరవ డంతో9వశతాబ్దానికి చెందిన చర్చి బయట పడిర ది.మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌ లోనే కాసెరస్‌ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్‌ నది ఎండినచోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్‌, నాటి నగరం బయట పడ్డాయి.
  • నదులన్నింటా కన్నీళ్లే…
  • జర్మనీ, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది.
  • 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్ల సముద్రంలోకలిసే ఈనది ఎన్నోచోట్ల ఎండి పోయింది.
  • రెయిన్‌, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షలకోట్ల) విలువైన సరుకు రవాణా జరుగు తుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంత కాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు.
  • ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.
  • ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడిరది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు.
  • ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయెర్‌ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు.
  • యూరప్‌లో 10దేశాల గుండా పారే అతి పొడవైననది డాన్యూబ్‌కూడా చిక్కిపో తోంది.
  • అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి!
  • 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది.
  • నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సిచువాన్‌ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడచూసినా నీరు అడుగంటి నదీ గర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది.
  • అమెరికాతో సహా యూరప్‌, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతు న్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కికొట్టుమిట్టాడుతోంది. పారిశ్రా మిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది.
  • మాయమైపోతున్న మంచినీరు
  • ప్రపంచం మీదడైబ్బైశాతం నీరే వుండి అందులో ఒక్కశాతం మాత్రమే మంచినీరుగా ఉప యోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు,వాగులు, వంకలు,వర్రెలు,బావులు,చెరువులు,నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలి పోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగు తుంటే కాపాడుకోవడానికి నగరంలో నిజాం కాలం లో హైదరాబాద్‌ నగరంలో3000పైగా వున్న చిన్న పెద్ద కుంటలు ఒక్కటికూడా ఆచూకీ లేకుండా, అందులో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయి? పై నుంచి పడ్డ నీరు నిలిచ్చే చోటు దొరకక సము ద్రం పాలవుతుంటే,వున్న కొద్ది భూగర్భ జలాలూ అడుగంటుతున్న దుస్థితి. మనం చేసిన పాప ఫలి తమే కదా ఇదంతా లేకపోతే ఏమిటి? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా780మిలియన్ల ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం అల్లాడిపోతున్నారు. ఆఫ్రికాలో ఓతెగ ప్రజలు మంచినీళ్లు దొరకక, వేకువజామునే కిలో మీటర్లకొద్దీ నడిచి అడవుల్లో ఆకుల మీద కారుతున్న మంచు బిందువులను ఒక్కొక్కటిగాసేకరించి మంచి నీరుగా వాడుకుంటారట. ఒకనాడు నదులు పొంగిన జీవగడ్డ భారతావనికూడా ఇవాళ మంచినీటి చుక్క కోసం విలవిలలాడిపోతోంది. అటుచూస్తే ఏళ్ల తరబడి నీటిజాడ కనబడక అనంతపురం జిల్లా ఎడారిదారి పట్టింది. చిత్తూరు జిల్లాలో శిలాజాల లోపలకి వెయ్యి అడుగుల లోతునబోర్లు వేస్తే తప్ప నీటి చుక్క దొరికే అవకాశం లేదు. కృష్ణానది మైళ్లకు మైళ్లు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాగొంతు తడ వడం లేదు. ఫ్లోరిన్‌నీళ్లు నల్లగొండకు నిద్ర పట్టనీ యడం లేదు. పుష్కలంగా నీటి వనరులన్న ప్రాం తాలు రసాయన ఎరువులు,పురుగు విషాలతో విష తుల్యమైపోయాయి. అసలు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నాలుగు వందల అడుగులకు మించి నీళ్లు రకర కాల రసాయనాలతో విషపూరితమైనవి కాబట్టి వాటిని మంచినీటిగా ఉపయోగించకూడదని చెప్పింది. మరోప్రక్క కలుషితమైన నీటివల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజుకు ఆరువేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే,మనం రెండు గుక్కలనీళ్లు తాగిగ్లాసు కిందపెట్టే లోపు ఒక చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతోంది.
  • అడవుల్ని కొట్టేసి,కొండల్నిపిండేసి, నదుల్నిఎండేసి,గాలినికాలుష్యంతోనింపేసి,తిండిని రసాయ నాల్తో కలిపేసి, ఇంకా ఎన్ని దుర్మార్గాలు కళ్లముందే జరుగుతున్నా ఇప్పటి దాకా మౌనంగానే వున్నాం. ఆఖరికి తాగే నీళ్లలో కూడా ఇన్ని రసాయ నాలు వున్నాయంటే చుక్క కూడా గొంతు దిగడం లేదు. అలాగని తాగకుండా వుండనూలేము, చిన్న చిన్నపిల్లలు తాగే పాలే కాదు, నీళ్లు కూడా విషమని తెలిసాక ఇక మాట్లాడకుండా ఎలా వుండగలం.
  • ఇందుకు మనమేం చేద్దాం
  • నీరు లేనప్పుడు ఇబ్బందులు పడడం కంటే అందుబాటులో వున్న చుక్కనీటిని కూడా వృధా చేయకపోవడం అవసరం. నగరాల్లో, పల్లెల్లో ఎక్కడిక్కడఇంకుడు గుంతలు,కందకాలు, చెక్‌డ్యా మ్‌లు,వాటర్‌షెడ్‌లు నిర్మించుకోవాలి. వాన నీటిని ఒడిసి పట్టుకునే చాలా వరకు మంచినీటి కొరతను అధిగమించవచ్చు. సముద్రతీర ప్రాంతం కావడం తో ప్రకాశం జిల్లాలలోని ఉప్పు నీళ్ళు ఎక్కువగా వుంటాయి కాబట్టి అక్కడ చాలా ప్రాంతాల్లో సంప్ర దాయికంగా వాననీటిని ఒడిసిపట్టి సంవత్సరమంతా మంచినీటిగా ఉపయోగిస్తారు.ఎడారి రాష్ట్రం రాజా స్థాన్‌లోని గ్రామాల్లో తరతరాలుగా వాననీటిని మంచినీటిగా వాడుకునే సంప్రదాయం వుంది.అతి తక్కువ వర్షపాతం పడే అనంతపురం ప్రాంతంలో కూడా(400-500మి.మీ.వర్షపాతం)200 చద రపు అడుగుల వైశాల్యంలో వుండే ప్రభుత్వ కట్టి చ్చిన ఇందిరమ్మ ఇంటిమీద 10000 లీటర్లు నీరు నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటిని రోజుకు 20 లీటర్ల చొప్పున వాడినా ఒక కుటుంబానికి దాదాపు 500 రోజులకు సరిపోతుంది.మహారాష్ట్రరాలెగావ్‌ సిద్దిలో అన్నాహజారే,రాజస్థాన్‌లో రాజేంద్రసింగ్‌ చేసిన నీటి సంరక్షణ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ కోవలో ఎండిపోయిన బావుల్ని, వట్టిపోయిన చెరువుల్ని,జీవం వచ్చిన నదుల్ని తిరిగి బతికించు కునే ప్రయత్నం చేయాలి. వనసంరక్షణే జన సంర క్షణగాభావించాలి. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, అడవుల ఉపయోగాలపై అవగాహన కల్పించి చిన్నప్పటి నుంచి ప్రకృతిని వాళ్ల జీవితంలో భాగం చేయాలి.అడవులు,నదులు,వానలు, రుతుపవనాలు, కాలాలు ఇలా ప్రకృతిలో ఒకదానికొకదానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని అవగాహన చేసుకుని మనం వివేకంతో వ్యవహరించాలి. నీరు లేకపోతే మనకు వర్తమానమూ లేదు, భవిష్యత్‌ అంతకన్నా లేదన్న నిజాన్ని మనమంతా నిర్భయంగా అంగీకరించాలి. నీటిని వ్యాపార వస్తువుగా మార్చిన సమస్త పరిస్థి తులను వ్యతిరేకించాలి.ప్రతి నీటి చుక్కను గుండె లకు హత్తుకుని పదిలంగా కాపాడుకోవాలి.