పథకాల మీద కన్నేసిన పాలకులు

వేళ్ళ మీదలెక్క పెట్టగలిగిన బడా కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు గత ఏడు సంవత్సరాల మోడీపాలనలో రూ.10లక్షల 72వేల కోట్లరూణాలు రద్దు చేశారు.13కంపెనీలు బ్యాం కుల్లో తీసుకున్న రూ.4లక్షల50వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61వేల కోట్ల తగ్గింపుతో ‘సెటిల్‌మెంట్‌’ చేశారు.ఈ మొత్తం డబ్బు గ్రామీణపేదల ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేసి వుంటే సుమారు 14 సంవత్సరాల వరకు పేదలకు పని కల్పించి కొద్ది మేరకు ఆకలి తీర్చివుండవచ్చు. అలా చేయలేదు కాబట్టే ప్రపంచ ఆకలి సూచి 116దేశాల జాబితా లో మన దేశం101వ స్థానంలో నిలిచింది. మన కంటే ఆకలితో అల్లాడుతున్న దేశాలు కేవలం 15 మాత్రమే. ఇది మన అన్నపూర్ణకు పట్టిన ఆధోగతి.

గత ఎనిమిది సంవత్సరాల బిజెపి పాలనలో దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. దేశఆర్థిక వ్యవస్ధను నాశనం అంచున నిలిపిన పెద్ద నోట్ల రద్దు, కోట్ల మంది జీవితాలను రోడ్లపా లు చేసి, ప్రాణాలను హరించిన కరోనా, రాజధాని నగరంలో సంవత్సరం పైగా అన్నదాతల ఆక్రం దనలు,ఉన్నత విద్యాలయాల్లో ఉన్మాదాలు, ఆకా శాన్నంటిన ధరలు…ఇలా అనేక క్లిష్ట సమస్యలపై ఏనాడూ అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం పిలవ లేదు. Äహఠాత్తుగా శ్రీలంక పరిణామాలపై అన్ని పార్టీలను కూర్చోబెట్టి విదేశాంగమంత్రిజయ శంకర్‌,ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజరు సేఠ్‌ కలిసి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సంద ట్లో సడేమియా అన్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ,పంజాబ్‌ మొదలగు రాష్ట్రాల్లో పెరుగుతున్న అప్పులు,అమలవుతున్న ఉచిత పథకాలపై… శ్రీలంక పరిణామాల గురించి హెచ్చరించారు. ఇది వైసిపికి ఊహించని పరిణామం. టిడిపికి ఆశించని అవకాశం. రాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చిన ఓటు సిరా ఆరక ముందే ఇలాంటి వ్యాఖ్యానాలు కేంద్ర ప్రభుత్వం నుండి రావడం ఒక పార్టీకి బాధను,మరొకపార్టీకి ఆనందాన్ని ఇచ్చింది. గత నెలలో ధర్మశాలలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాస కొనసాగింపే అఖిల పక్ష సమావేశంలో రాష్ట్రాల అప్పులు, ఉచిత పథకాల గురించిన పలుకులు. అననుకూల పరిస్థి తిని తమకు మరింత సానుకూలంగా మార్చుకొని ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అమలు చేయడంలో సిద్ధహస్తులు కేంద్ర పాలకులు. పేదలకు అందుతున్న అరకొర సంక్షేమ పథకాలకు ఇప్పటికే భారీగా కోతలు పడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఉచితానుచితాల గురించి చర్చ లేపి వాటి ని రద్దు చేయడానికి సిద్ధమయ్యారు. ఉచిత పథ కాలు అంటే ఏమిటి?ఎందుకు ఈ ఉచిత పథకా లు? ఎవరు ఎవరికి ఏది ఉచితంగా ఇస్తున్నారు? ఆస్తిపాస్తుల మీద కొద్దిమందికే హక్కు వున్న ఈ సమాజంలో రెండు వర్గాలు వుంటాయి. ఆస్తి వున్న వారు,ఆస్తిలేనివారు.కొద్దిమందిగా వున్న సంప న్నులు, అత్యధిక మందిగా వున్న కష్టజీవుల చేత పని చేయించుకొని…వారికి కొద్ది మొత్తం ముట్ట చెప్పి…అత్యధిక భాగంతమ ఖాతాలో జమ చేసు కుంటున్నారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తుంది. ఇది ఈ రెండు వర్గాలకు రెండు సమస్యలను సృష్టిస్తుంది.పెట్టుబడిదారులకు ఉత్పత్తి మందగించి, లాభాలు తగ్గిపోతేబీ కార్మికులకు పనిలేక ఆకలి, దారిద్య్రం పెరిగిపోతాయి.ఈపరిస్థితి నుండి తాత్కాలికంగానైనా గట్టెక్కడానికి కనిపెట్టినవే ఉచిత పథకాలు.‘రాజ్యం జోక్యం చేసుకొని పేదలకు కొన్ని ఉచిత పథకాలు అమలు చేయకపోతే మొ త్తానికే పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలి పోతుం దర్రో’ అంటూ తాతల కాలంనాటి ఆర్థికవేత్త జాన్‌ మైనార్డ్‌ కీన్స్‌ మొత్తుకొంటే వచ్చినవే ఈ ఉచిత పథకాలు. సంక్షేమ పథకాలతో పేదలు కొన్ని కనీస సదుపాయాలు పొందుతారు. వీటిని ఆశగా చూపి పాలక వర్గాలు అధికారాన్ని పొంది ఆపేదలను మరింత దోచుకునే సంపన్న అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయి. వాస్తవంగా ఈఉచిత పథకా లవల్ల పేదలు పొందే దానికన్నా, పెట్టుబడి దారు లే ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ఆకలితో వున్న వారికి అన్నం పెట్టడం ధర్మం, మానవత్వం. కానీ అజీర్తితో వున్న వారికి కుక్కి కుక్కి తినిపించ డాన్ని ఏమంటారు?2020-21 కేంద్ర బడ్జెట్‌ సవరించిన అంచనాలో 15కోట్ల25లక్షల వ్యవ సాయ కూలీల కోసం ఉద్దేశించిన ఉపాధి హామీ పథకానికి రూ.1,10,000కోట్లు కేటాయిస్తే, 2021 -22 బడ్జెట్‌లో రూ.73,000కోట్లు మాత్రమే కేటా యించారు. చేసిన పనికికూలీ డబ్బులు రాక పేదలు పస్తులతో, అర్థాకలితో జీవిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభం నానాటికి తీవ్రమై కోట్లాది మంది ఆ రంగాన్ని వదిలేస్తున్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు లేవు. అరకొర ఉపాధిలో భద్రత లేదు. ఈ పరిస్థితికి తోడు గత 75 సంవత్సరాల స్వాతం త్య్ర భారతదేశంలో ఎన్నడూలేని విధంగా బియ్యం, గోధుమలు,పప్పుధాన్యాలు,పాలు,పెరుగు,మాంసం, చేపలు,చివరకు శ్మశానకర్మకాండలపై కూడా జిఎస్‌ టి విధించి దేశాన్ని అమృత్సోవాల వైపు పాలకులు పరిగెత్తిస్తున్నారు.మరోవైపు వేళ్ళ మీద లెక్కపెట్ట గలిగిన బడా కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు గత ఏడు సంవత్సరాల మోడీపాలనలో రూ.10 లక్షల72 వేల కోట్ల రూణాలు రద్దు చేశారు.13 కంపెనీలు బ్యాంకుల్లో తీసుకున్న రూ.4లక్షల 50 వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61వేలకోట్ల తగ్గిం పుతో ‘సెటిల్‌మెంట్‌’ చేశారు. ఈ మొత్తం డబ్బు గ్రామీణ పేదల ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేసివుంటే సుమారు 14 సంవత్సరాల వరకు పేద లకు పని కలిపించి కొద్దిమేరకు ఆకలి తీర్చివుం డవచ్చు.
అలా చేయలేదు కాబట్టే ప్రపంచ ఆకలి సూచి 116 దేశాల జాబితాలో మన దేశం 101వ స్థానంలో నిలిచింది. మనకంటే ఆకలితో అల్లాడు తున్న దేశాలు కేవలం 15 మాత్రమే. ఇది మన అన్నపూర్ణకు పట్టిన ఆధోగతి. సిఎంఐఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) నివేదిక ప్రకారం 20 నుండి 24సంవత్సరాల వయసు గల నిరుద్యోగుల సంఖ్య రెండు కోట్లకు పైగా వుండి,గతంలో కనివినీ ఎరుగని రీతిలో 42 శాతా నికి పెరిగింది. వార్షిక టోకు ధరల సూచి ప్రకారం ఈమే నెలలో 15.8శాతం పెరిగాయి. ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరగడం గత 14 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. మరోవైపు ప్రపంచ కుబేరుల జాబితాలో నాల్గవ స్థానానికి కేంద్ర ప్రభుత్వ ఆత్మీయ పెట్టుబడి దారుడు గౌతం ఆదానీ ఎదిగారు. 2016-20 మధ్య కాలంలో ముఖేష్‌ అంబానీ నికర సంపద 350శాతం పెరగగా, ఆదానీ సంపద 750 శాతం పెరిగింది. ‘దేశభక్తి’యుతమైన ‘బృహత్తర’ పథకాల వల్ల సాధించిన పురోగతి ఇది. ప్రభుత్వ ఆస్థులను కారుచౌకగా కబ్జా చేస్తున్న కార్పొరేటు కంపెనీల ఆస్తులు భారీగా పెరుగుతున్నాయి. విజరు మాల్యా, నీరవ్‌ మోడీ,చందకొచ్చర్‌,రణకపూర్‌,రవి పార్థ సారథి,గౌతమ్‌ థాపర్‌…ఇలా అనేకమంది ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో దేశాన్ని దోచు కోవడం,విదేశాలకు పారిపోవడంరివాజుగా మా రింది.6 లక్షలకోట్ల విలువైన భూమిని, రైల్వే లైన్లను, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను,రవాణా,ఓడ రేవులు, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేసేందుకు ‘జాతీయ నగదీకరణ’ పథకాన్ని రూపొందించారు. దేశాన్ని మత రాజ్యంగా నిర్మించాలని ప్రయత్నించే మతోన్మాద శక్తులు, ఆస్తుల కోసం అర్రులు చాస్తూ అన్ని వనరులను కొల్లగొడుతున్న కార్పొరేటు శక్తుల బంధం బలీయంగా మారింది. దేశ సంపదను కొద్దిమందికి దోచిపెడుతూ, పేదలకు అందాల్సిన ఆ కొన్ని పథకాల గురించి ఉచితం అంటూ దుష్ప్ర చారం చేస్తున్నారు.రాష్ట్రాల అప్పుల గురించి మాట్లా డుతున్న కేంద్ర పాలకులకు ‘గురివింద గింజ’ చం దంగా తన నలుపు కనపడకపోవచ్చు. కాని ప్రజ లకు కనిపించకపోదు కదా?67సంవత్సరాల స్వతం త్ర పాలనా కాలంలో దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు కాగా, ఎనిమిది సంవత్సరాల మోడీ పాలనా కాలంలోనే సుమారు రూ. 100లక్షల కోట్ల అప్పు అదనంగా పెరిగింది. పార్లమెంటుకు తాజాగా తెలిపిన లెక్కల వివరాలే ఇవి. ఇప్పుడు చెప్పండి. దేశాన్ని శ్రీలంక పరిస్థితికి తెస్తున్నది రాష్ట్రాలా? కేంద్రమా? ఇంత అప్పు చేసి ఏంసాధించారు? డాలర్‌తో పొలిస్తే రూపాయి విలువ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పతనమైంది. విదేశీ మారక ద్రవ్యం హరించుకుపోయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు రెక్కలు వచ్చిన గుర్రాల కంటే వేగంగా దేశం విడిచి పారిపోతున్నాయి. దేశీయ చిన్న పరిశ్ర మలు వేల సంఖ్యలో మూలపడి లక్షలాది కార్మికు లు ఉపాధి కోల్పోయారు. దేశం లోని 24శాతం మంది భారతీయులు నెలకు రూ. 3,000 కంటే తక్కువ ఆదాయం పొందుతుంటే, ముఖేష్‌ అం బానీ,ఆదానీలుగంటకు రూ.90కోట్లు పోగేసు కుంటూ ప్రపంచ కుబేరులుగా మారారు. కరోనా సమయంలో గ్రామీణప్రాంతాల్లోని 32 కోట్ల మంది భావిభారత పౌరులు విద్యను నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయారు. దేశంలోని 46శాతం కుటుంబాలు రెండుపూటలా తిండి తినడానికి అప్పులపై ఆధార పడుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, చిల్లర వ్యాపారం ఇలాఅన్ని రంగాలను కార్పొరేటు కంపె నీలు ఆక్రమించకుంటున్నాయి.‘నయా ఉదార వాదం’అనే ఈ విధానాల్లోవున్న వాస్తవాలను ప్రజ లు గుర్తించిన ప్రతిదేశంలో,ప్రతిరంగంలో తిరుగు బాట్లు వస్తున్నాయి. అందులో భాగమే శ్రీలంక పరిణామాలు.
రాష్ట్ర ప్రజలపై భారాలు వేసే విషమ షరతులతో అదనపు అప్పులకు అనుమతులు ఇస్తామన్న కేంద్రాన్ని ప్రశ్నించని మన రాష్ట్ర ప్రభు త్వం బటన్‌ నొక్కడమే అభివృద్ధి అని భావిస్తుంది. దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి తమ అనుకూల పెట్టుబడిదారులకు దోచి పెడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఒక్క మాట మాట్లాడకుండా…శ్రీలంక పరిణామాలు ఆంధ్రలో వచ్చేస్తున్నట్లు టిడిపి చెబుతున్నది.శ్రీలంక పాపంలో ఐఎంఎఫ్‌తో పాటు మోడీగారి ప్రియ పెట్టుబడి దారుడు ఆదానీ పాత్ర కూడా వున్నట్లు ఆదేశ ఉన్న తాధికారి ప్రకటించిన విషయం తెలిసిందే. వైసిపి,టిడిపి,బిజెపినిబలపరస్తున్న జనసేన నాయ కులు శ్రీలంక పరిణామాల గురించి ఏదేదో మాట్లా డుతున్నారు. మతాలు, జాతులు అంటూ రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న లంక పాలకులు చివరకు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.ఎవరెన్ని చెప్పినా అంతిమంగా ప్రజల జీవిత విధానమే పోరాట మార్గాన్ని నిర్మిస్తుంది, దేశ భవిష్యత్తును నిర్ణయి స్తుంది.- (వి.రాంభూపాల్‌)