భారత దేశంలో అమలు కానీ ఐక్య రాజ్య సమితి నియమాలు

ప్రపంచ వ్యాప్తంగా179 దేశాలలోని ఆదివాసీ ప్రజలు దట్టమైన అడవులు కొండ ప్రాంతాల్లో నది పరివాహక ప్రాంతాలలో అభివృద్ధికి దూరంగా విలక్షణమైన జీవనాన్ని అవలంబిస్తూ పకృతి పై ఆధారపడి, ప్రత్యేక సంస్కృతి సాంప్ర దాయాలు, భాష, వేషధారణ కలిగి38కోట్ల జనాభాతో7000 భాషలు మాట్లాడుతూ, 50 00 రకాల బిన్న సంస్కృతులు పాటిస్తున్నారు. భారతదేశం లో అధికారికంగా చూసినపుడు 2011జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభాలో ఆదివాసీల జనాభా 8.6శాతం కాగ అందులో10,42,81,034 జనాభాగల ఆది వాసీలు, 6,92,027 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల దట్టమైన అడవిప్రాంతంలో 26 రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో,188 ఆదివాసి జిల్లాలలో ఉన్నారు. దేశ విస్తీర్ణంలో 60శాతం అడవి ఆదివాసి ప్రాంతంలోనే ఉం డగా పకృతిలో మమేకమైన తెగలను భారత రాజ్యాంగంలో 705షెడ్యూల్‌ తెగలుగా గుర్తించింది, ఇందులో అత్యంత ఆట విక లక్షణాలు కలిగిన ప్రిమినిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పిటిజి)లు75 తెగలు కలిగి 27,68,322 జనాభా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో9రకాల ఆదిమతెగలు కోయ, గోండు, కొలం,పర్ధాన్‌,తోటి, నాయకపొడు, మన్నేవార్‌, కొలవార్‌, కొండ రెడ్డి, అంద్‌,చెంచు,గోతి కోయ, లాంటి ఆదిమ తెగలు గోదావరి పరివాహక ప్రాంతం ప్రాణహిత, కిన్నెరసాని,కృష్ణ నది లాంటి పరివాహక ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో నివాసం ఏర్పరుచు కొని,17352 చరపు కిలోమీటర్ల షెడ్యూల్‌ ఏరియా భూభాగంలో నివాసం ఉం టున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా,దేశ వ్యాప్తంగా,రాష్ట్ర వ్యాప్తంగా, ఆదిమ తెగల మనుగడ పై కొన్ని అంశాలను మి ముందు విశ్లేషణ చేయాలనేది ఈ వ్యాసం సారాంశం.
1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి(ఖచీూ) ఆధ్వర్యంలో ‘జెనీవా’లో ప్రపంచ వ్యాప్త ఆదిమ తెగల సమస్యలపై,26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమా వేశాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సమా వేశంలో 140దేశాల ప్రతినిదులు పాల్గొన్నారు. ఆదివాసీల గుర్తింపు కోసం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి కమిటీ కోరగా,ఆదివాసుల సంరక్షణ, హక్కులు, చట్టాల రక్షణకు ఐక్య రాజ్య సమితి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ కమిటీ 1982నుండి1992 వరకు,పది సంవ్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్షేత్రపర్యటన చేసి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్య యనంచేసి,విశ్లేషించి,23 డిసెంబర్‌ 1994 నుండి 2004 వరకు ఆమధ్య కాలన్ని ఆదివాసీ అభివృద్ధి కాలంగా పరిగణించి,ఆగస్టు9వ తేది నీ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకిం చింది. ఆదివాసి తెగలలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువ జరుగుతున్నాయని మానవ హక్కుల రక్షణ కోసం హై కమిషన్‌ సెప్టెంబర్‌ 13,2007న జనరల్‌ అసెంబ్లీ ద్వారా ఐక్య రాజ్య సమితి ఒకడిక్లరేషన్‌ (ఖచీణRI) ప్రకటించింది.అందులో‘ఆర్టికల్‌ 45’లో ఆదిమ తెగల సంస్కృతి రక్షణ,సంస్కృతి రక్షణలో ఆది ఆదివాసీల అభిప్రాయాలను గౌరవించటం,తెగలభాష రక్షణ,విద్య వ్యవస్థలో ఆదివాసి భాష కూర్పు,విద్య అభివృధి లాంటివి చేర్చినారు.‘ఆర్టికల్‌ 46’లో ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాల్లో అభివృధి విషయంలోచేసే అన్ని నిర్ణయాలలో ఆదివాసీలను బాగా స్వామి చేయటం,అదే విధంగా బారిప్రాజెక్ట్‌ల మూ లంగా,ఖనిజ త్రవ్వకాల మూలంగా నిర్వాసి తులుగామారి,జీవన ఆధారం కోల్పోయిన ఆదివాసీలకు న్యాయమైన హక్కుగా నష్ట పరి హారం,రిహబిటేషన్‌ కల్పించి రక్షించటంతో పాటు, ములవాసిల పట్ల వివక్షతను చూపటం నీ నిషేధించింది,వారి యొక్క నిర్ణయం లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టడం నిషేధం, అభివృధిలో బాగంగావారి ఆర్థిక,సామాజిక, పరిస్థితులను వారి విభిన్నమైన జీవనశైలికి అను గుణంగా వ్యవహరించాలని ఈ డిక్లరేషన్‌ తెలి పింది. దీనితో పాటు2017లో ఆదివాసి పదం తోపాటు,‘ఇంటర్నేషనల్‌ ఇండిజినియస్‌ పీపిల్స్‌ డే’గా ప్రకటించింది. ఆదివాసి తెగల భాష రక్షణకు కూడా2022 నుండి 2032 కాలాన్ని ఆదిమ భాషల రక్షణకు అన్ని దేశాలకు నివేదిం చింది.2022 సంవత్సరాన్ని ఆదిమభాషల పరి రక్షణ దినోత్సవం గా ప్రకటించింది.పై తీర్మా నలపై148 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సంతకాలు చేసినవి,అందులో అమలు చేసిన దేశాలు కేవలం 60మాత్రమే. ఈ అమలు చేసిన 60దేశాల జాబితాలో భారతదేశం లేదు అంటే,ఈ దేశంకి ఆదివాసిల అభివృధిపట్ల ఎంతశ్రద్ధ ఉంది అర్థం చేసుకోవచ్చు.ఏసమా జానికి అయినబాష అనేది అత్యంతకీలకం. ప్రపంచవ్యాప్తంగాఉన్న 7000ఆదివాసీ తెగల సజీవభాషలలో,దాదాపు 3000భాషలు అంత రించిపోతున్న భాషలుగా పరిగణించబడ్డాయి. ఇప్పటి వరకు ఖచీజుూజూ ప్రపంచంలోని అంతరించిపోతున్న భాషల జాబితాలో అసుర్‌, బిర్వోర్‌,కొర్వాలను ఉంచింది,బిర్వోర్‌ను క్లిష్టంగా అంతరించిపోతున్న భాషగా వర్గీకరించారు. కేవలం 2000మంది మాత్రమే ఈభాష మాట్లా డుతారు.భారతదేశంలో ఐదు ఆదిమభాషలు అంతరించిపోతున్నాయి అని తెలిపింది. అందులో సిక్కింలోని మారిaభాష అత్యంత ప్రమాదకర భాష అనీ భాష నిపుణులు చెబు తున్నారు,‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండి యా’ నిర్వహించిన పరిశోధన ప్రకారం ప్రస్తుతం ‘‘మారిa’’ మాట్లాడే వ్యక్తులు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు, వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారుగా పేర్కొంది. అదేవిధంగా తూర్పు భారత దేశంలో ‘‘మహాలీ’’బాష,అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ‘‘కోరో’’,గుజరాత్‌లోని ‘‘ సిడి’’,అస్సాం లోని ‘‘దిమాస’’ భాషలు అంతరించిపోతున్నాయి అని తెలిపింది.ఖచీూ చెప్పినట్లుగా అత్యంత దారుణ పరిస్థితిలో ఈదేశంలో ఆదిమభాషల పరిస్థితిఉన్న కూడా భాషకు రక్షణ చర్యలు మాత్రం ప్రభుత్వాలు చేసే పరిస్థితులు కనిపిం చవు.ఐక్యరాజ్య సమితి నివేదించిన ఏఒక్క నియమాలను గౌరవించటం లేదు భారత దేశం,ఛత్తీస్గఢ్‌ రాష్ట్రంలో ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరిట,లక్షలాది ఆర్మీ క్యాంపులు ఏర్పాటు చేసి, పకృతి ఒడిలో జీవించే ఆదివాసీలను అడవిలోకి పశువుల్ని మేపటానికి వెళ్లిన,పకృతితో మమే కమైన పండుగలు జరిపే క్రమంలో,ఒకగూడెం నుండి ఇంకొక గూడెంకి సత్సంబంధాలు నెల కొల్పే క్రమంలో,ఎందరో సామాన్య ఆదివాసీల ను కాల్చి చంపిన ఘటనలు అనేకం.ఖనిజ త్రవ్వకాల పేరిట,టాటా,బిర్లా, ఆధానిలకు ఈ దేశ సంపదను అమ్మి వేస్తూ అడవితల్లిని, విధ్వంసంను అపమన్నదుకు అడవితల్లి నెల కోసం పోరాడినదుకు,అస్తిత్వంకోసం తిరగ బడి నందుకు,వేలాదిమంది ఆదివాసులపై అక్రమ కేసులు,ఊపాచట్టాలు,మహిళలపై అత్యాచా రాలు. సల్వా జుడుం లాంటి సంస్థలను నెల కొల్పి ఈ దేశ ములావాసులపై ఎటువంటి మారణ హోమం,లైంగిక హింస అడవిబిడ్డపై కొనసాగింది కళ్ళారా చూసాము. జంగల్‌ మహల్‌ పచింబెగాల్‌లో కానీ, కాంద మహల్‌ ఒరిస్సాలోగాని,నియంగిరి కొండలలోని బాక్సైట్‌ త్రవకంకానీ,జార్కండ్‌లో టాటా బిర్లా ఉక్కు కర్మాగారంగాని,ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పేరిట ముచిన 300గ్రామాల ఆదివాసి ప్రజల జలసమాధి కానీ,గుజరాత్‌ మధ్య ప్రదేశ్‌లో నర్మదనదిపై ఏర్పాటు చేసిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ క్రింద మునిగిన 1000గ్రామాల ఆది వాసీల ఆర్తనాదాలు కానీ, ఈదేశంలో ఆదిమ తెగలకు స్థానం లేదు వారికి బ్రతుకుకు విలువ లేదు. అసలు మనుషులుగానే చూడబడటం లేదు అనటానికి నిదర్శనం.వర్జీనియస్‌ కాక కమీ షన్‌ 2014’నివేదించిన ప్రకారం ఈదేశంలో 47శాతం ఆదివాసీలు నిర్వాసితులు అయ్యారని తెలిపింది,బారిప్రాజెక్ట్‌లు డ్యాంలు కట్టడం వలన, మైనింగ్‌ త్రవ్వకాలవలన,వైల్డ్‌ లైఫ్‌ శాంచరీ,పులుల అభయ అరణ్యాల వలన, పరి శ్రమల ఏర్పాటు వలన,స్వాతంత్య్రం వచ్చిన నుండి నేటి వరకు 21మిలియన్‌ ఆదివాసి ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పించలేదు. పైగా అసలు ఏమయ్యరో ఈప్రజలు అనేది కూడా స్పష్టత లేదు నేటి వరకు.పైగా ‘‘కేంద్ర పునరావాస చట్టం 2013’’లాంటివి ఉన్నా ఉపయోగం లేదు. ఇంకా దారిద్య్రపు రేఖకి దిగువన ఈదేశంలో 36శాతం ఆదివాసి ప్రజలు ఉన్నారు అందులో జార్ఖండ్‌ రాష్ట్రం 54.2శాతంకాగా, ఒరిస్సా 75.6శాతం అధిక స్థానంలో అత్యంత పేదరికంలో ఉంది కానీ ఈ దేశంలో అత్యధి కంగా మైనింగ్‌ కలిగిన రాష్ట్రాలు కూడా ఇవే కానీ ఆది ఆదివాసీలకు మాత్రం కడు పేదరికం వెంటాడుతుంది అనేది గ్రహించాలి. ప్రభుత్వం మైనింగ్‌ త్రవ్వకాలపై ఉన్న శ్రద్ధ ఆదివాసి కడుపు నింపటంలో లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు అనేది ఒక సహజ అంశంగా మారింది. భారత రాజ్యాం గం ఆదివాసీల రక్షణకు ఉన్న 5,6షెడ్యూల్‌ లను అందులోని సారాన్ని కూడా తొక్కి వేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆదివాసి ప్రాంతా ల్లోని నాన్‌ ట్రైబల్‌ వలసలను పూర్తిగా నిషేదం అని ఉన్న నేడు వలసలు అధికం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సొన్‌ భద్రలో జూలై 17,2018 న10 మంది ఆదివాసీలను ఇతర కులస్థులు నాన్‌ ట్రైబల్‌ క్రూరంగా ఊచకోత కోసిన,అందులో 3గురు మహిళలు ఉన్న ఇంత దురగతానీ ఏఒక్క రాజకీయపార్టీ,లేదా ప్రభు త్వం పట్టించు కోని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేకం. పార్లమెంట్‌ సమావేశం జరిగే సమయంలో ఈఘటన జరిగిన 47మంది ఆదివాసీలు ఎంపీలు ఈదేశంలో ఉన్న మాట్లాడని దుస్థితి వెలు ముద్దర రాజకీ యాలును ఈ దేశరాజకీయ పార్టీలు ప్రోత్సహి స్తున్న తీరు అర్థం అవుతుంది. కానీ ఇలాంటి ఘటనలు నిరోధించాల్సిన ప్రభుత్వాలు ‘‘నేషనల్‌ సిటిజన్‌ షిప్‌ బిల్‌ 2018,పౌర సత్వం చట్టం 2019పేరిట ఈ ప్రాంతాలను చాలా క్రింద నీరులా ధ్వంసం చేశాయి.ఈ దేశంకి నాగరికత నేర్పిన ఆదివాసి,నేడు అనాగరికునిగా ముద్ర వేయబడి వేలివేయ బడ్తున్నాడు,బ్రతుకు ధ్వంసం చేయబడి గెంటివేయ బడుతున్నాడు. ‘1996 సమత వర్సెస్‌ ఆంధ్ర ప్రదేశ్‌’కేసులో 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రభుత్వం కూడా నాన్‌ ట్రైబల్‌ గానే చూడాలని తీర్పు ఇచిన,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ‘‘గిర్‌గ్లాని కమిషన్‌ 2004,కోనేరు రంగారావు కమిటీ 2006’’లు చాలా స్పష్టంగా ఆంధ్ర వలసలు తెలంగాణ ఆదివాసి ప్రాంతంలో అత్యధికంగా పెరిగి, 7,50,000 ఎకరాల ఆది ఆదివాసీల భూము లు,దాదాపు 48శాతం ఆదివాసీల భుములు నాన్‌ ట్రైబల్‌ చేతిలో అన్యాక్రాంతం అయ్యాయి అని నివేదించిన, 1/70/ (ఎల్టిఆర్‌) లాంటి చట్టాలు పకడ్బందీగా ఉన్న ఆదివాసీలకు న్యా యం జరిగే పరిస్థితులు లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వలస ఆంధ్రలదే షెడ్యూల్‌ ఏరియాలో పెత్తనం నడుస్తుంది ఇంకా ఆది వాసీలకు దిక్కేది.ఈ దేశంలో ప్రస్తుతం అడవిపై హక్కు అనే సమస్య ఆదివాసీలకు ప్రధాన సమస్యగా మారింది. తరతరాలుగా ఆదివాసీలు జల్‌ జంగిల్‌ జమీన్‌ కోసం అడవిపై హక్కు కోసం వేలాది మంది చారిత్రక పోరాటాలు చేసి అమరులు అయ్యారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో ఎస్‌ఆర్‌ శంకరన్‌ కమిటీనీ నియమించి. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అటవీ భూములపై హక్కులు కల్పిస్తు పార్లమెంట్‌ లో ‘2006 డిసెంబర్‌13న’’ అటవీ హక్కుల చట్టంచేయబడిరది. ఈచట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 10ఎకరాల లోపు వరకు హక్కు పత్రం ఇవ్వ వచ్చు. పైగా‘‘అడవుల పై హక్కు లు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సిగ్‌ కూడా ప్రకటిం చారు’’ దానిలో భాగంగా కొంత మేరకుయుపిఎ ప్రభుత్వం ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు అందించింది. ఆదివాసీలు అడవిపై ఉమ్మడి హక్కు నీ కూడా కల్పించింది కానీ కేంద్రంలో బీజేపీ కూటమి వచ్చాక అటవీ హక్కుల చట్టం`2006కి ఎటువంటి రక్షణ ఇవ్వక పోవడం మూలంగా, సుప్రీం కోర్టు ఈచట్టానీ కొట్టి వేసింది. తదుపరి దేశ వ్యాప్త ఆందోళనతో ప్రతుతం ఈ తీర్పుపై ‘‘స్టే’’ విధించింది కానీ ఇంకా పూర్తి స్థాయి నిర్ణ యాలు ఆదివాసీల పక్షాన చేయక ముందే, నూతన అటవీ విధానం తీసుకు వచ్చి అసలు ఆదివాసీల సంబంధం లేకుండానే,అడవుల నుండి ఆదివాసీలను కాలి చేసి కార్పొరేట్‌ శక్తులకు అడవులను అమ్ముకునే కుట్రలుకు జీవం పోసింది.ఈ పోడు భూమి సమస్యనీ తెలంగాణ రాష్ట్రంలో చూసినపుడు నిజాం నిరంకుశ పాలన మళ్లీ మొదలు అయిందా అనే ప్రశ్న లు తలెత్తుతాయి, అటవీశాఖ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను టార్గెట్‌ చేసి వారి భూముల్లో హరితహరం పేరిట మొక్కలు పెట్టడం,దానికి అడ్డుగా వచ్చిన వారిపై ‘‘పిడి యాక్ట్‌’’లు పెట్టడం,మహిళలపై హింస, గర్భి ణీలకు చెట్లకు కట్టేసి కొట్టడం,10రోజుల బాలిం తలు అని చూడకుండా జైళ్లకు పంపడం, మొన్న టికి మొన్న ఆదిలాబాద్‌ జిల్లా ‘‘కోయ పోష గూడ’’లోని గోండు మహిళపైదాడి చేసి మహి ళను అర్ధనగ్నంగా గుంజుకోని పోవడం,ఇవన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు లాగే పరిగణించ బడుతాయి.ఒకపక్క ఆది వాసీ లకు పట్టలిస్తాము అని ప్రభుత్వం దరఖాస్తులు తీసుకొని,ఇంకో పక్క అటవీశాఖ వచ్చి దాడు లు చేయటం అనేది ఎంత వరకు సమంజసం? అసలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా అటవీశాఖ పాటించే పరిస్థితి లేదు ఏమైనా అంటే మావి కేంద్ర చట్టాలు అంటుంది అటవీ శాఖ, ఆదివాసీల న్యాయమైన పోడుభూములకు పట్టాలు అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలపై ఉన్న పట్టించుకునే పరిస్థితి లేక అదొక హింసల మారింది పోడు సమస్య..తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు నుండి నానాటికీ ఆదిమ తెగల మనుగడ జీవనం ప్రశ్నార్థకమే అవ్తుంది గిరిజన కేంద్రీయ విశ్వ విద్యాలయం ‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014’’తో నే వచ్చిన,దానిని గోదావరి పరివాహక ప్రాంతం లో ఆదిమతెగల జీవనం దగ్గర కాకుండా మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, ఆదివాసీలకు విద్య నీ దూరం చేయాలని చూస్తున్నారు. షెడ్యూల్స్‌ ప్రాంతంలోని ఐటీడీఏల పరిధిలో 29శాఖలలో ‘ఆర్టికల్‌ 342’ ప్రకారం షెడ్యూల్‌ ఏరియా సర్టిఫికేట్‌ల ద్వారా రావాల్సిన ఉద్యో గాలను మొత్తం కూడా నేడు నిలిపివేశారు. జీఓ నెంబర్‌ ‘3’ పేరిట సుప్రీం కోర్టు 100శాతం రిజర్వేషన్లు చెల్లవు అని తీర్పు ఇవ్వడంతో, న్యాయపరమైన అంశంగా తయారు చేసి, ఆది వాసి నిరోధ్యుగులకు చేయా ల్సిన అన్యాయం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం చెసే పరిస్థితి లేదు, 5వ షెడ్యూల్‌నీ నిర్దేశం చేసే హక్కు, దానిలో నీ నియమాలను నిరోధించే హక్కు, సుప్రీం కోర్టు లేదు. అయిన కానీ రాజకీయ కుట్రలో ఆదివాసి ప్రాంతం, భూభాగం,బందిగా మారే పరిస్థి తులు నెల కొన్నాయి. వీటికి పరిష్కారం చూపించాల్సిన కోర్టులు, ప్రభుత్వాలు,ఆదివాసిలకు వ్యతిరేకంగా ఉన్న పుడు ఇంకా ఆదివాసీ లుకు దిక్కు ఏది?.ఏది ఏమైనా ఈ దేశంలోగాని వివిధ రాష్ట్రాలలో గాని ఆదివాసిల మనుగడ నానాటికీ అంతరి స్తుంది. ఆదివాసి భూబాగాలపై ఒత్తిడి పెరి గింది.ప్రభుత్వాలు కూడా వ్యతిరేక చర్యలే చేపడుతున్నాయి అనేది వాస్తవం. అందుకే ‘‘ఆగస్ట్‌ 9’’ ని‘1982లో ఐక్యరాజ్య సమితి’’ గుర్తించిన, నేటికీ 40సంవత్సారాలు అవుతున్న కానీ భారత దేశం మాత్రం నేటికీ గుర్తించలేదు, పైగా ఐక్య రాజ్య సమితి ఆదివాసిల అభివృద్ధికి చేసే ఏనియమంని లెక్క చేయటం లేదు. తెగలు అంతరిస్తున్న ఆదివాసీల మూలాలు ధ్వంసం అవ్తున్న, అస్తిత్వం కనుమరుగు అవుతున్న, ఇంకా అనాగరిక చర్యలే చేస్తుంది ప్రభుత్వం.ఇకనైనా ఆదివాసీల దినోత్సవం గుర్తించి భారత ప్రభు త్వం అధికారికంగా నిర్వహణ చేయాలి.రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేయాలి.ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా నిర్వహించాలి. ఆదివాసీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. భూమి పుత్రుల హక్కు లను చట్టాలను రక్షించాలి. ఆదివాసిస్వయం పాలన హక్కులను రక్షించి ఆదివాసిల అస్తిత్వం నీ సుస్థిరం చేయాలి. నాణ్యమైన విద్య అందిం చాలి. మాలిక సదుపాయాలు కల్పించాలి. మానవ హక్కుల ఉల్లంఘనలు చర్యలు నిలిపివేయాలి.ఈ దేశ పౌరులు అయిన ఆదివాసిలపై హింసనీ నిలిపివేయాలి.మధ్య భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో ఆదివాసిలపై వారి స్వయంప్రతిపతి హక్కులపై అధికారాలు కల్పించి సమస్య పరిష్కారం చూపాలి. భారీప్రాజెక్ట్‌లు అక్రమ ఖనిజ తవ్వకాలు నిలిపివేయాలి,ప్రధానంగా రాష్ట్ర పతి తెగ కి చెందిన సంతాల్‌ ,ఒరాన్‌,ముండా తెగల ఆదివాసి ప్రజలను బ్రిటిష్‌ పాలనలో అస్సాం కాపీ తేయాకు తోటల లలో పని చేయటానికి 60 లక్షల మందిని బలవంతంగా తీసుకెళ్లినారు స్వాతంత్య్ర అనంతరం వారు అక్కడే ఉండి పోవడం జరిగింది కానీ వాటిని అస్సాం ప్రభుత్వం షెడ్యూల్‌ ట్రైబల్‌ గా గుర్తించలేదు వారికి ఎస్టీ హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేదంటే ఈ దేశం ప్రధమ పౌరురాలు రాష్ట్రపతిగా ఆదివాసి చేయ గలిగింది కానీ దానికి ప్రయోజనం మాత్రం చేకుర్చలేదు అనేది భవిష్యత్‌లో తేలిపోతుంది అనేది గ్రహించ వలసిన విషయం.
వ్యాసకర్త : అనువర్తిత భాషశాస్త్రం,తెలుగు యూనివర్సిటీ హైద్రాబాద్‌,సెల్‌:9392283453– కాక నవ్య