మాలి కొండపై ఆదివాసులు దండయాత్ర

ఒడిశాలోని కోరాపుట్‌ అడవుల్లో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి, స్థానిక గిరిజన జనాభా వారి మాలి పర్బత్‌ (కొండ)లో మైనింగ్‌ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నారు. గత వారం, నవంబర్‌ 22న, ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని కంకదాంబ గ్రామంలో బాక్సైట్‌ తవ్వకాలపై బహిరంగ విచారణను నిర్వహించింది, దీనికి స్థానిక ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. స్థానిక నివాసుల ప్రకారం, జరిగిన బహిరంగ విచారణలో సాయుధ భద్రతా దళాలు మరియు అధికారుల సంఖ్య స్థానిక గిరిజన ప్రజల కంటే చాలా ఎక్కువ. విచారణ రోజున, మైనింగ్‌ ప్రాజెక్ట్‌ను అధికారులు రద్దు చేయాలని, కొండ, అటవీ ప్రాంతాన్ని రక్షించాలని డిమాండ్‌ చేస్తూ మాలి పర్వత సురక్షా సమితి (మలి కొండ రక్షణ కమిటీ) సభ్యులు నిరసన చేపట్టారు. ‘‘ఒడిశా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ కంపెనీకి %ళి%హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ ఇస్తే, మేము మా ఆందోళనను తీవ్రతరం చేస్తాము’’ అని నిరసన సమూహాలలో ఒకటైన లోక్‌ శక్తి అభియాన్‌ అధ్యక్షుడు ప్రఫుల్ల సమంత్ర గావ్‌ కనెక్షన్‌తో అన్నారు. ‘‘మైనింగ్‌ వల్ల ఈ ప్రాంతంలో భూగర్భజలాలు, గాలి మరియు మట్టికి అంతరాయం కలుగుతుంది. ఇది జరగడానికి మేము అనుమతించము, ’’అని అతను గట్టిగా చెప్పాడు. కోరాపుట్‌ జిల్లాలోని గిరిజనుల ప్రాబల్యం గల సెమిలిగూడ బ్లాక్‌లోని కంకదాంబ గ్రామం వద్ద మాలికొండ చుట్టుపక్కల మైనింగ్‌కు వ్యతి రేకంగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. మాలి కొండ చుట్టుపక్కల ప్రాంతంలో 44 గ్రామాలలో నివసించే కొండ,పరాజ,గదబ గిరిజన సంఘాలు ఉన్నాయి. మైనింగ్‌ లీజు పరిధిలోకి వచ్చే ప్రాంతం 268.110 హెక్టార్లలో విస్తరించి ఉంది. మైనింగ్‌ లీజు మరియు పర్యావరణ క్లియరెన్స్‌ హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు 2003లో మంజూర య్యాయి. స్థానిక నివాసితులచే ప్రాజెక్ట్‌ గురించి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, స్థానిక ప్రతిఘటన ఆ ప్రాంతంలో మైనింగ్‌ కార్యకలాపాలను నిరోధిం చింది. లీజు మరియు పర్యావరణ అనుమతి 2013లో ముగిసింది.
ఇప్పుడు పరిశ్రమను తాజాగా 50ఏళ్లలీజుకు తీసుకోనున్నారు. అయితే ఇది స్థానిక ప్రజల నుండి ఆమోదం పొందాలి. దీని కోసం బహి రంగ విచారణ అవసరం.సెప్టెంబర్‌ 22న జరగాల్సిన బహిరంగ విచారణను జిల్లా యం త్రాంగం పెద్దఎత్తున హింసాత్మకంగా జరి గింది. దీంతో అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు.తిరిగి నవంబర్‌ 22న పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించారు. అది కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ పబ్లిక్‌ హీరింగ్‌ నిర్వహించారు. అది చెల్లదంటూ గిరిజనులు తమ అడవులను కాపాడాలని కోరుతున్నారు.
మాలికొండ ప్రాంతంలో నివసించే అడవులు ప్రజలు,వృక్షజాలం,జంతుజాలానికి ఏమి జరుగు తుందో అని స్థానిక ఆదివాసీ జనాభా గొంతుతో ఆందోళన వ్యక్తం చేశారు.ముప్పై ఆరు శాశ్వత ప్రవాహాలు మాలికొండ గుండా ప్రవహిస్తాయి మరియు చివరికి కోలాబ్‌ నదిని పోషిస్తాయి. గిరిజన సంఘాలు సాగునీటి కోసం నదీ జలా లను ఉపయోగించుకుంటున్నారు. కొండ లలో మైనింగ్‌ చేయడంవల్ల నది ఎండి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ మాలీపర్వా తాలు ఏనుగు కారిడార్‌తో పాటు అనేక విలువైన ఔషధ వృక్షాలతో దట్టమైన అడవిగా రూపంతరం చెంది ఉంది.బాక్సైట్‌ వెలికితీస్తే ‘‘అటవీ కొండలలో బాక్సైట్‌ తవ్వకం అనేక సహజ ప్రవాహాలు,జలపాతాలు, వాగు లు ఎండిపోవడానికి అవకాశం ఉందని, అంతేకాకుండా కాలుష్యకారకాలతోను,అనేక అనారోగ్యాలకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మేము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాము’’ అని ఆదివాసీప్రజలు ఆవేదన చెందుతున్నారు.రాష్ట్రంలో ఏనుగు కారిడార్‌లు ధ్వంసం కావడానికి అడవిలో విపరీతమైన మైనింగ్‌ కూడా ఒక ప్రధాన కారణం. జంబోల సంరక్షణ మరియు రక్షణ కోసం డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది ప్రారంభంలో, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (చీGు) ఒడిశా ప్రభుత్వాన్ని రెండు నెలల్లో 14 ఏనుగు కారిడార్‌లను నోటిఫై చేయాలని ఆదేశించిందని ఒడిశా వైల్డ్‌లైఫ్‌ సొసైటీ కార్యదర్శి బిస్వైత్‌ మొహంతి తెలిపారు. ఇంతలో, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ మారీa ప్రకారం, బహిరంగ విచారణ సందర్భంగా నవంబర్‌ 22న ఈ ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు పెద్ద సంఖ్యలో స్థానిక నివాసితులు తమ సమ్మతిని తెలిపారు.‘‘ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగం ముప్పై ప్లాటూన్ల భద్రతా బలగాలను మోహరించింది. ఒడిశా స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ త్వరలో పబ్లిక్‌ హియరింగ్‌ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది’’ అని అధికారి తెలిపారు.
మలిపర్బత్‌ మైనింగ్‌ను అడ్డుకోవాలని గిరిజనులు
చైత్ర పండుగ సందర్భంగా కొండపై బాక్సైట్‌ వెలికితీతను వ్యతిరేకిస్తామని బాక్సైట్‌ ప్రభావిత ఆదివాసీ ప్రజలు మాలిపర్వతాలపైకి ఎక్కి ప్రమాణం చేశారు. కంకదాంబ గ్రామ సమీపం లోని చైత్ర పండుగ సందర్భంగా ఏప్రిల్‌ 27న మాలిపర్బత్‌ కొండ వద్ద బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గిరిజనులలోని పర్వతాలపైకి సుదూర ప్రయాణం చేసి అక్కడ దేవతలకు పూజలు చేశారు. మలిపర్బత్‌ కొండ సమీపం లోని పాటలీ గుహలో మౌలిమా దేవత ముందు ప్రతిజ్ఞ చేశారు. మలిపర్బత్‌ సురాఖ్య సమితి(ఎంఎస్‌ఎస్‌)మరియు కోరాపుటియా జన సురాఖ్య మంచ్‌(కెజెఎస్‌ఎం)సభ్యులు,పలువురు సామాజిక సంస్థల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చైత్ర పండుగను జరుపుకోవ డానికి కోరాపుట్‌ మరియు రాయగడ జిల్లాల నుండి వేలాది మంది గిరిజనులు మలిపర్బత్‌ కొండ వద్దకు చేరుకున్నారు. మలిపర్బత్‌లో బాక్సైట్‌ తవ్వకాలపై ఉద్రిక్తత మధ్య వారు ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించాలని ప్రార్థిస్తూ సంప్రదాయ ఆచారాలను నిర్వహిం చారు. ఈ పండుగను కోంద్‌, పరాజ మరియు గద్బా తెగలు జరుపుకుంటారు.చాసి మూలీయ ఆదివాసీ సంఘం అధ్యక్షుడు నాచిక లింగం కూడా ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ‘‘మేము చెట్లు, నేల, నీటి బుగ్గలు, వృక్షజాలం మరియు జంతుజాలాన్ని ప్రేమిస్తాము మరియు మన ఆచారాలు మరియు సంప్రదాయాలకు అనుగుణంగా జీవించాలనుకుంటున్నాము. గిరిజనులు ప్రభుత్వం నుండి ఎలాంటి సంపదను కోరుకోవడం లేదు. ప్రకృతితో, వనరులతో సహజీవనం చేయాలనుకుంటున్నాం. కానీ ప్రభుత్వ ఏజెంట్లు ఈ ప్రాంతంలో అశాంతిని సృష్టిస్తున్నారు. మైనింగ్‌ వ్యతిరేక మరియు అనుకూల వ్యక్తుల మధ్య విభేదాల కారణంగా గత రెండు నెలలుగా ఈ ప్రాంతం లో ఉద్రిక్తత నెలకొని ఉందని వర్గాలు తెలి పాయి. గిరిజనులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు జీవనోపాధికి ప్రాధాన్యతనిచ్చే మలిపర్బత్‌ కొండ నుండి బాక్సైట్‌ తవ్వడానికి హిందాల్కో కంపెనీకి ప్రభుత్వం లీజు మంజూ రు చేసింది. ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మొదటి సమావేశం విఫలమైన తర్వాత విజయ వంతంగా పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించింది. అయితే, విషయం కోర్టుకు వెళ్లడంతో రెండో పబ్లిక్‌ హియరింగ్‌ అనిశ్చితిలో పడిరది. జిల్లా యంత్రాంగం నాలుగు ప్లటూన్ల పోలీసు బలగాలను మోహరించి పండుగ ప్రశాంతంగా సాగింది.
మా కొండలు బంగారు కుండలు
కోరాపుట్‌లోని మాలి కొండలన్నీ బంగారు కుండలు. వాటి జోలికి వస్తే సహించబోం అంటూ గిరిజనులు హెచ్చరిస్తున్నారు. మాలిపర్వాతాలు అనేక ప్రవాహాలకు మూలం. ఔషధ చెట్లకు నిలయం. ఇది ఏనుగు కారిడార్‌. సెప్టెంబర్‌ 22, 2021న ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ప్రతిపాదిత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన బహి రంగ సభ వేదికపై ఆదివాసీలు నినాదాలు చేస్తూ ధ్వంసం చేశారు. గిరిజనులు అధికంగా ఉండే కోరాపుట్‌లోని సిమిలిగూడ బ్లాక్‌లోని కంకదాంబ గ్రామంలోని వేదిక వద్ద పర్యా వరణ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు మరియు ఇతరులు కూడా ప్రాజెక్టును వ్యతిరేకిం చారు. హిండాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (హిం డాల్కో)చే ప్రాజెక్ట్‌ యొక్క ప్రదేశం అయిన మాలి కొండ,అడవికి ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మాలి పర్వత్‌ సురక్షా సమితి (సేవ్‌ మాలి హిల్‌ కమిటీ) సభ్యులు ఆ స్థలంలో మైనింగ్‌ను అధికారులు రద్దు చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. మాలి మరియు అటవీ ప్రాంతంలో 44గ్రామాలలో విస్తరించి ఉన్న కొండ,పరాజ మరియు గదబ గిరిజనులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు.సేవ్‌ మాలి హిల్‌ కమిటీ అధ్యక్షుడు బిజయ్‌ ఖిల్‌ మాట్లాడుతూ మాలి కొండ నుండి బాక్సైట్‌ తవ్వకాలకు ఏ కంపెనీని అనుమతించకుండా కొండను మరియు అడవిని రక్షించాలని ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు జిల్లా పరిపాలన అధికారులను మేము కోరాము. ఖిల్‌ తన బృందం కొండను రక్షించడానికి మరియు సంరక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాల వల్ల ఆ ప్రాంత పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన అన్నారు. అటవీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధం,అనైతికం. ప్రతిపాదిత మైనింగ్‌ ప్రాజెక్ట్‌ టూత్‌ అండ్‌ నెయిల్‌ను మేము వ్యతిరేకిస్తాము’’ అని లోక్‌ శక్తి అభియాన్‌ అధ్యక్షుడు ప్రఫుల్ల సమంతర అన్నారు.మాలి కొండ 36శాశ్వత ప్రవాహాలకు మూలమని,ఇది కోలాబ్‌ నది జలాలను పోషిం చేదని ఆయన తెలిపారు. కోలాబ్‌ నీటితో గిరిజనులు తమ భూమికి సాగునీరు అందించారు. మలి కొండను గనుల తవ్వ కాలకు ప్రభుత్వం అనుమతిస్తే నది ఎండి పోతుందని సమంత అన్నారు. కొండ అనేక విలువైన ఔషధ వృక్షాలకు నిలయం అని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక ముఖ్యమైన ఏనుగు కారిడార్‌ కూడా.మైనింగ్‌వల్ల పరిసరాల్లోని భూగర్భ జలాలు,గాలి,మట్టికి భంగం కలుగు తుంది. ఆందోళనకారులు ప్రభుత్వం మరియు కంపెనీ అధికారులకు హెచ్చరికలు చేశారు. తమ ప్రాణాలైనా ఇస్తాంగానీ,మాలి పర్వతాలపై బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టనీయమని నినదించారు. ప్రభుత్వం,కంపెనీలు తమ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని, ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితిలోను బాక్సైట్‌ తవ్వకాలు చేయరాదని, చేస్తే తమ ఆందోళనలను మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.-(కందుకూరి సతీస్‌ కుమార్‌)