దివ్యాంగుల జీవితాల్లో వెలుగులే లక్ష్యం

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవిరళ కృషి చేస్తున్నాయని కేంద్ర మత్స్య,పశుసంవర్దక,డెయిరీశాఖ మంత్రి పర్షోత్తం రూపాల పేర్కొన్నారు. ఎ.డి.ఐ.పి.(అసిస్టెన్స్‌ టు డిజెబుల్డు పర్శన్స్‌ ఫర్‌ పర్చేజ్‌ /ఫిట్టిం గ్‌ ఆఫ్‌ ఎయిడ్స్‌/ అప్లియెన్స్‌) పథకం కింద ఫిబ్రవరి 22న విశాఖపట్టణంలోని కైలాసపురం డీఎల్బీ గ్రౌండ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక అధికారిత శిబిర్‌ పేరుతో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్శింహారావు,విభిన్న ప్రతిభా వంతులు,హిజ్రాలు,వయోవృద్ధుల సంక్షేమశాఖ ఎండీ కుమార్‌ రాజా,జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లాలోని దివ్యాంగులకు అందజేశారు. రూ.2.25కోట్లతో2,925 పరికరాలను అలింకో సంస్థ ఆధ్వ ర్యంలో తయారు చేయగా1,589 మంది దివ్యాంగులు అధికా రుల చేతులమీదుగా జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. 1,589దివ్యాంగులకు ఒకేచోట ఇంతమొత్తంలో ఉపకరణాలు పంపిణీ చేయటం ఒక శుభ పరిణామమని,దీనికి సహకరిం చిన కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు,ప్రజాప్రతినిధులకు,అధికారు లకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా..అని కేంద్ర మంత్రి పుర్షోత్తం రూపాల పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌, సున్నిత మనస్తత్వం కారణంగానే దివ్యాంగులకు ఇంత స్థాయిలో మంచి జరుగుతుందని అన్నారు. అడిగితేనే గానీ కొంతమంది నేతలు స్పందిం చరు..కానీ నరేంద్ర మోదీ అడగకుం డానే పేదలకు అన్నీ ఇస్తున్నా (దేశ ప్రధానిగా) ఉండటం మనందరి అదృ ష్టం అని పేర్కొన్నారు.పేదల కోసం చేసే మంచి పని ఏదైనా విస్తృత ప్రచా రం కల్పించాలని ప్రసార మాధ్యమా లనుద్దేశించి అన్నారు. దివ్యాంగులపట్ల గౌరవ మర్యాదలతో మెలగాలి ః ` జీవీఎల్‌ అంగవైకల్యం అనేది కోరు కుంటే వచ్చింది కాదని..దురదృష్టంవల్ల వచ్చిందని..దివ్యాంగుల పట్ల మన మంతా గౌరవ మర్యాదలతో నడుచు కోవాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్శింహారావు సూచించారు.దివ్యాం గులకు సంబంధించిన కార్యక్రమం విశాఖలో నిర్వహిస్తున్నామని చెప్పగానే కేంద్ర ప్రభుత్వం,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందిం చారని,సహకారం అందించారని గుర్తు చేశారు.వారి ఆమోదంతో రాష్ట్ర,జిల్లా యంత్రాంగం సహాయంతో దివ్యాంగుల సమస్యలు,అవసరాలు తెలుసుకు న్నామని చెప్పారు.ఆ మేరకు1,589 మందికి రూ.2.25 కోట్లతో 2,925 ఉపకరణాలను తయారు చేయించామని జీవీఎల్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో వికలాంగులు అనే పదం పూర్తిగా తొలగిపోయిందని, దాని స్థానంలో దివ్యాంగులు అనే పదం వచ్చిందని పేర్కొన్నారు. రెండు దఫాల భాజపా పాలనలో సుమారు 45లక్షల మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించామని,వచ్చే ఐదేళ్లలో మరొక 50లక్షల మందికి పరికరాలు అంద జేస్తామని జీవీఎల్‌ నర్శింహారావు చెప్పా రు. రైల్వే స్టేషన్లు,ఎయిర్‌ పోర్టలలో చేపట్టే ప్రతి పనినీ దివ్యాంగులను దృష్టిలో ఉంచుకునే చేపడుతున్నా మన్నారు.ఉపకరణాల తయారీలో అలింకో (ఆర్టిఫిసియల్‌ లింబ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోరూ.25కోట్లతో 4వేలమందికి చేయూత ః ఎండీ కుమార్‌ రాజా
దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక మంచి నిర్ణయాలు తీసుకుందని దానిలో భాగంగానే రూ.25కోట్లతో నాలుగు వేల మందికి వివిధ ఉపకర ణాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని విభిన్నప్రతిభావం తులు,హిజ్రాలు,వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఎండీ కుమార్‌ రాజా వెల్లడిర చారు.దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌ ట్యాప్లు,మోటరైజ్డ్‌ త్రిచక్ర వాహ నాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,750మంది దివ్యాంగ విద్యార్థు లకు త్రిచక్ర వాహ నాలు అందించా మని గుర్తు చేశారు. గుంటూరులో ఉన్న బ్రెయిలీ ప్రింటింగ్‌ కేంద్రం సాయంతో అంధ విద్యార్థుల సహాయార్థం బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని వివ రించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సం యుక్త ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తూ దివ్యాంగు లకు పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తు న్నామని ఎండీ పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన2,925 పరికరాలను రూ.2.25 కోట్లు వెచ్చించి అలింకో (ఆర్టిఫిసియల్‌ లింబ్స్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సంస్థ సహకారంతో తయారు చేయిం చామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ పేర్కొన్నారు.ఈ సంస్థ సహకా రంతో ఇప్పటికే విశాఖపట్టణం, విజయ నగరం జిల్లాల్లో 13చోట్ల ప్రత్యేక శిబిరా లు నిర్వహించామని, వారి అవసరా లను గుర్తించి చర్యలు తీసుకు న్నామని చెప్పా రు.ఈ వేదిక ద్వారా1,589 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అంద జేస్తున్నామని జేసీ తెలిపారు.2,925 పరికరా ల్లో 282 మోటరైజ్డ్‌ సైకిళ్లు,173ట్రైసైకిళ్లు, 219 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని పేర్కొ న్నారు.క్రచ్చెస్‌ 657, వినికిడి పరికరాలు 868, వాకింగ్‌ స్టిక్స్‌ 146,బ్రెయిలీకిట్స్‌45, స్మార్ట్‌ ఫోన్లు 15,సాధారణ సెల్ఫోన్లు 10,సీపీ ఛైర్స్‌ 40,లింబ్స్‌ ఇతర పరికరాలు 470 వరకు ఉన్నాయని వివరించారు. కార్యక్రమం లో అలింకో సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ సింఫ్‌ు, విభిన్న ప్రతిభావంతులశాఖ విశాఖ పట్టణం జిల్లా ఏడీ మాధవి,విజయ నగరం జిల్లా ఏడీ జగదీష్‌, ఇతర అధికా రులు, పలువురు ప్రజాప్రతినిధులు,అధిక సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. -జి.ఎన్‌.వి.సతీష్‌

అడవి బిడ్డల బ్రతుకు చిత్రం అనంత యానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ గుమ్మడి లక్ష్మీనారాయణ’’ కలం నుంచి జాలువారిన ‘‘ అనంత యానం ’’ అనే పుస్తకంపై సమీక్షడా. అమ్మిన శ్రీనివాసరాజు
అడవి బిడ్డల బ్రతుకుచిత్రం అనంతయానం నేటి ఆధునిక తెలుగు సాహిత్యంలో అంత ర్భాగం అవు తున్న గిరిజన సాహిత్యం ప్రారం భంలో మౌఖికంగా తర్వాత కాలంలో ఆంత్రోపాలజిలో ఒక భాగంగా ఉండేది అనంతర కాలంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలకు ఎంతో ప్రధాన వస్తువుగా ఉన్న ఈ గిరిజన సాహిత్యం నేడు ఎంతో పరిణితి చెంది ప్రామాణిక దశకు చేరుకుంది. ప్రభుత్వాల లక్ష్య శుద్ధి తో గిరిజన యువతలో అక్షరాస్యత శాతం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉద్యోగులుగా రచయితలుగా ఎదుగు తున్న శుభ తరుణం ఇది. అందులో భాగం గానే ఆదివాసి తొలి వ్యాసకర్తగా చరిత్రలో నిలిచిన ఆధ్యాపక రచయిత గుమ్మడి లక్ష్మీ నారాయణ కలం నుంచి వెలువడిన వ్యాస సంపుటి ఈ ‘‘అనంతయానం’’
సుమారు పాతికేళ్లపాటు ఆయన చేసిన అక్షర ప్రస్థానంలో అనేక ప్రామాణిక వ్యాసాలు వెలు వడ్డాయి,ఇవి అడవిబిడ్డలచరిత్ర,సంస్కృతి, సమకాలీన సమస్యలు,విద్య ఉద్యోగ ఆరోగ్య అంశాలు,సామాజిక జీవన పోరాటాలు,ఆధ్యా త్మిక సంబరాలు,తదితర అంశాలుగా విభజిం చబడి కూలం కశంగా సవివరమైన ప్రామా ణిక గణాంకాలతో పొందు పరచబడ్డాయి. ఇటు సమాచారానికి అటు పరిశోధనలకు ఎంతో ఉపయోగంగా ఉండే ఈగిరిజన వ్యాస రత్నాలన్నిటిని ఒకచోట రాసి పోసి అందించి నట్టు పుస్తక రూపంలో వెలువరించిన వ్యాస రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణగారి అక్షర కృషి అభినందనీయం ఆచరణీయం.నిరంతర పరిశీలన అధ్యయనంద్వారా తన జాతి జనుల అభివృద్ధి కోసం రచనల పరంగా గుమ్మడి గారి కృషిలో ఆవేదన అడుగడుగునా అర్పి స్తుంది,తన జాతికి చెందిన మరుగునపడ్డ వీరుల వివరాలు గురించి గతంలో వివరిం చిన ఈరచయిత ఇప్పుడు అదే బాణిలో తన జాతి సంస్కృతిలోని చరిత్ర పుటలు తిరగేస్తూ అనేక ఆసక్తికర విషయాలు ఆవిష్కరించారు.
ఇప్ప చెట్టుకు,పచ్చబొట్టుకు,అడవి బిడ్డలతో గల అనుబంధం గురించి ఇందులో ఎంతో శాస్త్రీయంగా చారిత్రకంగా తెలిపారు.వారి పెళ్లిళ్లలోని నిరాడంబరత సంస్కృతిని ప్రతిబిం బించే నృత్యం సొగసులు గురించి చెబుతూ ఆదిమ గిరిజనులు అంటే ఆదివాసీలే అని సూత్రీకరించారు,అంతటితో ఆగకుండా అడవి బిడ్డలను ఆత్మ గౌరవ ప్రతీకలు అని నిరూ పించారు.
ఇంతటి ప్రాధాన్యత గల ఈ ఆదివాసీలు నాటి నిజాం కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య ప్రభు త్వాల దాకా ఎదుర్కొన్న బాధల గురించి వివరించారు. అంతేగాక ఆదరణ కోల్పోతున్న ఆదివాసి వైవిధ్యం గురించి కూడా చర్చించారు.ఆదివాసుల భూసంరక్షణ కోసం ప్రతిష్టా త్మకంగా ఏర్పాటు చేసిన 1/70 చట్టంకు సంబంధించిన పూర్వ చరిత్ర దాని నిర్మాణం అనంతర కాలంలో దాని అమలులో అధికా రులు,గిరిజనేతరులు చేస్తున్న కుతం త్రాల కారణంగా చట్టం వల్ల ఆదివా సులకు జరుగు తున్న నష్టం అరణ్య రోదనగా అభివర్ణి స్తూ అధికారులను ఆలోచింపజేశారు.అలాగే అటవీ హక్కుల చట్టం,పెసా,గిర్‌గ్లాని,నివేదిక లు తదితర అంశాల గురించి వివరించిన విషయాలవల్ల వ్యాస రచయిత పరిశీలన, ఆవేదన,కూలంకషంగా అర్థమవుతాయి. బహుళ ప్రజాదరణ పొందిన గిరిజన చట్టాల వివరణతో పాటు అంతగా ప్రాచుర్యం పొందని ‘1960చట్టం’వివరణతో అమాయక గిరిజనులు వడ్డీవ్యాపారుల బారినపడ కుండా ఎలా రక్షణ కలిగిస్తుందో దీనిలో వివరిస్తూ ఏజెన్సీలో రెడ్డి వ్యాపారుల అక్రమాలు గురిం చిన వివరణ తెలిపారు వ్యాసకర్త. అలాగే పోలవరం నిర్వాసితుల గోడు గురించి చెబుతూనే గిరిజనుల అభివృద్ధి కోసం విడు దల చేస్తున్న నిధులకు అవినీతి చెదలు ఎలా పడుతున్నాయో వివరిస్తూ స్వయం పాలన, రాజకీయ చైతన్యం,గిరిజనుల రాజ్యాంగ రక్షణలు,ఐదవ షెడ్యూల్‌,గురించిన వివరణతో పాటు ఆదివాసీల స్వయం పాలనకు‘‘పెసా చట్టం’’ఎలా ఉపకరిస్తుందో తగు వివరణ అందించారు. ఇంద్రవెల్లి సంఘటనను గోండులకు మాయని గాయంగా గుర్తుచేస్తూనే అడవి బిడ్డల హక్కుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రవృక్షంగా,విప్ప చెట్టును ప్రక టించాలనే డిమాండ్‌ గట్టిగానే వినిపించారు. ఇక అడవి బిడ్డల ఆధ్యాత్మిక విషయాలకు వస్తే,నాగోబా,వంటి కుల దేవతల గురించే గాక సమ్మక్క సారక్క గుండం రామక్క, జంగుబాయి,ముసలమ్మ,వంటి వీరవనితల ప్రస్తావన తీసుకువచ్చారు,కోయిల మాఘ పున్నమి గోవులు దండారి పాండవుల ఏడు బావుల జలపాతం గురించి వివరణ చేస్తూనే అసలు ఆదివాసీలది ఏమతం? అనే ప్రశ్నను వివరించిన వైనం ఉపయుక్తంగా ఉంది.
నేటి ఆధునిక గిరిజన సమాజంకు అందుతున్న విద్యా ఉద్యోగ ఆరోగ్యం గురించిన వ్యాసపరం పరలో రచయిత ఆవేదన అర్థమవుతుంది, ఏజెన్సీలో నిర్వహించబడుతున్న విద్యా విధా నం అంతరించిపోతున్న ఆదిమ భాషలో వాటిని కాపాడాల్సిన బాధ్యతలు గిరిజనులకు మాతృభాషలో విద్యాభ్యాసం అందించాల్సిన అవసరం ఆన్లైన్‌ విద్యద్వారా సమాచార వ్యవస్థకు అల్లంత దూరాన ఉండే ఆదివాసీ సమాజానికి జరుగుతున్న నష్టాలను సహేతు కంగా వ్యాస రచయిత అందించారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు పెరుగుతున్నప్పటికీ అది అసలైన ఆదివాసీల దరి చేరడం లేదనే విషయాన్ని కూడా సవివరమైన గణాంకాలతో వివరంగా అందించారు, ప్రభుత్వాలు,రాజకీయ పక్షాలు, ఆదివాసీల హక్కులకు రిజర్వేషన్లకు ఆటంకం కలిగించే శక్తులను గురించి రక్షణ కల్పిం చాల్సిన తక్షణ కర్తవ్యాన్ని గుమ్మడి తన వ్యాసాక్షరాల గుండా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనే గిరిజన జాతులపై జరిగిన జరుగుతున్న దాడులు సామూహిక హత్యల గురించి సభ్య సమాజానికి కూడా తెలియడం లేదని ఇలాంటి దాడులకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరాన్ని పాలకులకు హెచ్చరిక వంటి సందేశాన్ని ఇందులో ఉటంకించారు, వాస్తవానికి అతి ప్రాచీన కాలానికి చెందిన ఆదిమ జాతులైన ఆదివాసీలను ప్రామాణి కంగా చారిత్రకంగా గుర్తించలేదని కేవలం వారిలోని నిరక్షరాస్యత కారణంగా వారి ఉత్కృష్టమైన చరిత్ర సంస్కృతులు మరుగున పడిపోతున్నాయి, కానీ వారిదైనా చిత్రలిపి పడిగెలు మౌఖిక సాహిత్యాల ద్వారా వారి అమూల్యమైన చరిత్రను నిక్షిప్తం చేసుకున్నారనే పరిశోధనాత్మక అంశాలను ఇందులో పొందుపరిచారు రచయిత లక్ష్మీనారాయణ. ప్రధాన వ్యాసావళికి అనుబంధంగా అందిం చిన అనుబంధంలో కూడా చాలా విలువైన విషయాలు పొందుపరిచారు పుస్తక రచయిత ఆదివాసీల పోరాట విజయాలకు ప్రతీక అయి నా మేడారం సమ్మక్క సారక్క జాతర గురిం చిన చారిత్రిక విజయాలు జాతర పరాయి కరణ అవుతున్న తీరు. ఆదిలాబాద్‌ ప్రాంతా నికి చెందిన గోండులు ఆరాధ్య దైవంగా భావించే ‘‘జంగుబాయి’’ని వారు ఆరాధించే వైనం,వింత ఆచారాలు గురించిన సమాచారం మనం ఇందులో చదవవచ్చు. నేటి ఆధునిక ఆదివాసీ సమాజంలో ఆదివాసి యువత సాధించిన విజయాల స్ఫూర్తిగాథలు సైతం ఇందులో అందించడం ద్వారా నేటి గిరిజన యువత సాధించిన ప్రగతి ప్రపంచానికి తెలుస్తుంది ఇలా ప్రతి విషయం ప్రామా ణికంగా అక్షయకరించిన ఈ గిరిజన వ్యాసాలు భావితరం పరిశోధకులకే కాక గిరిజన సాహిత్య వికాసానికి ఎంతగానో ఉపకరిస్తాయి.ఎంతో విలువైన గిరిజన జాతి సమాచారం సేకరించి పుస్తక రూపంగా అక్షరబద్ధం చేసిన రచయిత అక్షర కృషి వెలకట్టలేనిది.
అనంత యానం (వ్యాస సంపుటి) రచయిత : గుమ్మడి లక్ష్మీనారాయణ పేజీలు : 226 వెల : రూ 300/- ప్రతులకు : రచయిత `9491318409 సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు సెల్‌ : 7729883223.

ఉరుముతున్న నిరుద్యోగం

పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌
ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేక పోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్త వుతాయి. స్వతంత్ర భారతం అనేక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించినా భారత్‌లో తయారీ వంటి ఆకర్షణీయ నినాదాలిస్తున్నా తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా తయారీ రంగంలో మేటిగా నిలవలేక ఇంకా అనేక వస్తువులను చైనా తదితర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవు తున్నాయి.
స్వతంత్ర భారతం అనేక రంగాలలో గణనీయ మైన అభివృద్ధి సాధించినా భారత్‌లో తయారీ వంటి ఆకర్షణీయ నినాదాలిస్తున్నా తదను గుణంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ముఖ్యంగా తయారీ రంగంలో మేటిగా నిలవలేక ఇంకా అనేక వ స్తువులను చైనా తదితర దేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ఫలితంగా కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పనలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను వచ్చే 24ఏళ్లలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం లో 3వస్థానానికి చేర్చడమే లక్ష్యంగా సంకల్పం చెప్పుకుని ఆదిశగా కొన్ని చర్యలు చేపట్టారు.అయితే ఇవి లక్ష్యసాధనకు ఏమేరకు ఉపకరిస్తాయనేదే ప్రశ్న.నిరుద్యోగ సమస్య తీవ్రత దృష్ట్యా పాలస్తీనా వివాదంలో ఇస్లామిక్‌ దేశాలతో పోరాడుతున్న ఇజ్రేల్‌ దేశములో వివిధ రంగాలలో ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనిచేయడానికి భారత యువత ఎగబడటం చూస్తే నిరుద్యోగ పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.ఇజ్రియల్‌ నిర్మాణ రంగంలో పనిచేయడానికి 10వేలమందికి పైగా ప్లంబర్లు,ఎలక్ట్రీషియన్‌ లు,కార్పెంటర్‌ లు,పెయింటర్ల వంటి వివిధ వృత్తుల వారు అవసరం కాగా ఆపనుల్లో చేరడానికి తొలుత 25కోట్ల జనాభాగల అతిపెద్ద రాష్ట్రం యుపి, హర్యానా యువకులు ఎగబడ్డారు.కాగా ఇజ్రేల్‌ తో స్నేహసు హృద్భావ సంబంధాలు నెరపు తున్న శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చొరవ తీసుకుని బిజెపి ఏలుబడిలోని యుపి, హర్యానాలో కార్మికుల రిక్రూట్‌మెంట్‌లో ఇజ్రెల్‌ కు తమ సహకారాన్ని అందించింది. పాలస్తీనా సంఘర్షణలో ఇస్లామిక్‌ దేశాలు,ఇ జ్రేల్‌ పరస్పరం బాంబు,క్షిపణి దాడులకు దిగడంతో అక్కడ ప్రాణాంతకమైన భీతా వహ పరిస్థితుల్లో సైతం పనిచేయడానికి మన నిరుద్యోగ యువత పోటీపడుతున్నది. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.1.40లక్షల జీతం,రూ 4వేల వరకు బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో ఎంపిక జరుగుతున్న చోట్ల తొక్కిసలాట జరుగుతున్నది.ఆకలితో మరణించడం కంటే పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి యువత సిద్ధపడటం నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం. వివిధ దేశాలలో నైపుణ్యం,పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండ టంతో బతుకు కోసం ఆదేశాలకు తరలి వెళ్ళడానికి యువత పోటీ పడుతున్నారు.ప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు గల్ఫ్‌ తదితర దేశాలలో పని చేస్తూ తమ కుటుంబాలకు వేలకోట్ల రూపాయలు పంపి ఆదు కుంటున్నారు. దేశంలో తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకే యువత విదేశాలబాట పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పి స్తామని 2014లో అధికారం లోకి రావడానికి ముందు బిజెపి తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అయితే వాస్తవంగా జరిగింది వేరు.దేశంలో తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కన్సల్టెన్సీలకు వేలకొద్దీ డబ్బు చెల్లించి మన యువత విదేశాలకు తరలి వెళుతున్నారు. ధనదాహంతో కొన్ని కన్సల్టెన్సీలు అవకాశాలు లేని దేశాలకు కూడా యువతను పంపడం, అక్కడికి చేరాక వారు అష్టకష్టాలు పడటం తెలిసిందే.కెనడా, అమెరికా వంటి దేశాలకు వెళ్లిన వారికి సైతం తగిన ఉద్యోగాలు లభించక అర్ధాకలితో అలమటిస్తూ,అప్పుల పాలై మళ్లీ స్వస్థలాలకు తిరిగి వస్తున్నవారు గణనీయంగా ఉన్నారు.2022అక్టోబర్‌ -2023 సెప్టెంబర్‌ మధ్యమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 96,917మందిని గుర్తించి పట్టుకున్నట్లు అమెరికన్‌ కస్టమ్స్‌,సరిహద్దు భద్రతా దళం గణాంకాలు ఘోషిస్తున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందు తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా ఇది ఉద్యోగ, ఉపాధి కల్పించలేని అభివృద్ధిగా మిగిలి పోతున్నది.2024-25లో మనదేశం 7.3 శాతం అభివృద్ధి సాధించగలదని ఇటీవల తాత్కాలిక బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు.కోట్లాది యువతకు,శ్రామికులకు ఉద్యోగ జీవనో అవకాశాలు కల్పించలేనిదిగా నిలవనుంది. నిరుపేదలు ఏపని దొరికితే అపనికి వెలుతూ జీవితాలు వెళ్ళ దీస్తున్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత మాత్రం తమ అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలకే ప్రాధా న్యత ఇస్తున్నారు. పనిచేసే వయసుగల యువ తకు తగిన ఉపాధి అవకాశాలు లభిం చక పోతే అది వారిలో నైరాశ్యానికి, అశాంతికి దారితీసే ప్రమాదముంది. భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితం సై న్యంలో చేరదలచిన యువ తకు అగ్నిపత్‌ పథకాన్ని ప్రకటించగా వేలాదిమంది యువత ముందుకొచ్చారు. మామూలు సైన్యంలో ఇచ్చే జీత భత్యాలు, పింఛను వీరికి రావు.బిజేపి ప్రభుత్వం ఎక్కువగా వాణిజ్య,పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నందున, అగ్నిపథ్‌లో శిక్షణ పొందిన వారు ఐదేళ్ళ తర్వాత పరిశ్రమల వారికి రక్షకులుగా పని చేయాల్సి ఉంటుంది.13కోట్ల జనాభాగల పెద్ద రాష్ట్రం బీహార్లో పరిమితమైన రైల్వే ఉద్యోగాలకోసం యువత ఎగబడడంతో అది హింసాకాండకు దారితీసింది.ఆరేళ్ల క్రితం 35వేల ఉద్యోగాల కోసం ప్రకటన రాగా కోటి మంది దరఖాస్తు చేశారు.నియామకాల్లో అవినీతి జరిగి ఆందోళనలకు దారితీసింది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం 368బంట్రోతు ఉద్యోగాలకు ప్రకటన చేయగా పీహెచ్‌ డీలు, పోస్టు గ్రాడ్యుయేట్లు సహా 23లక్షలమంది దర ఖాస్తు చేసుకున్నారు.ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి.దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు6.6శాతం.నగరాలు,పట్టణాలలో 15-19ఏళ్ల ఉద్యోగార్థులు రేటు అంతకు 3రెట్లు ఎక్కువగా ఉన్నట్లు 2023జులై సెప్టెంబర్‌ గణాంకాలు ఘోషిస్తున్నాయి. నిరుద్యోగ సైన్యం నానాటికీ పెరిగిపోతుండటం అనేక సమస్య లకు దారి తీస్తున్నది.2014లో యువత కోటి ఆశలతో కమలం పార్టీకి ఓటేయడంతోనరేంద్ర మోడీ ప్రధానిగా కేంద్రంలో కమలనాథులు అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మోడీ ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యం కావాలి.అయితే అరకొర చర్యలు తప్పితే మోడీ ప్రభుత్వం ఈరంగంలో పెద్దగా పురో గతి సాధించలేదు.ఉద్యోగాలు కల్పించినా కొన్ని పట్టణాలు,నగరాలలో అసంఘటిత రంగంలో రోజువారీ కూలీపనులే,మహిళలే అధికం.2019-20లో 22శాతంగా ఉన్న ఈ పనులు 2022-23లో 24శాతానికి పెరిగి నట్లు పరిశీలనలో తేలింది.ఇవి,హెల్పర్లు ,గృహ పరిశ్రమలకు చెందినవే.పట్టణ యువత నైరాశ్యంతో ఉద్యోగాల కోసం వెదకడం మానేసినట్లు తేలింది.2023 జూలై -సె సెప్టెంబర్‌ లో ఉద్యోగుల చేరిక తగ్గింది. మూడు నెలల్లో లోకసభ,అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపుగా కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల డిఎస్‌ సి ద్వారా టీచర్ల నియామకాలను ప్రకటించింది.2023 జూలై నాటికి నిరు ద్యోగి త రేటు 7.95శాతంగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ వెల్లడిర చింది.తెలంగాణా ప్రభుత్వం 2015నుండి ఇప్పటి వరకు36,643 ఖాళీల భర్తీకి నోటిఫ కేషన్లు జారీ చేసినట్లు ఆర్‌టిఐ ద్వారా సమా చారం లభించింది.మధ్యలో ప్రశ్నా పత్రాలు లీకై కొన్ని పరీక్షల రద్దుకు,ఉద్యోగాలు రావనే నిరాశతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయం.అయినా పదవులు వెలగ బెట్టిన వారిలో కొంతయినా ఆత్మ పరిశీలన లేక పోవడం విచారకరం.కాగా రేవంత్‌ రెడ్డి సిఎం గా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దాదాపు 2లక్షల పోస్టులకు దశల వారీగా నియామక ప్రక్రియ చేపట్టడం యువతకు ఆశా కిరణంగా కనిపిస్తోంది. తెలంగాణా ప్రభుత్వ 31వి భాగాలలో మం జూరైన పోస్టులు4,91,304.ప్రస్తుతం 3లక్ష ల ఉద్యోగులు మాత్రమే పనిచేస్తు న్నారు. స్కూ లు విద్య,ఆరోగ్యకుటుంబ సంక్షేమ, పోలీసు, పంచాయతీరాజ్‌,రెవెన్యూ శాఖలలో దాదాపు 77శాతం మంది పనిచేస్తున్నారు.స్కూలు విద్యాశాఖలో మంజూరైన పోస్టులు 1,37, 651కాగా ప్రస్తుతం 1,13,853మంది మాత్రమే పని చేస్తున్నారు.పోలీసు శాఖలో మంజూ రైన పోస్టులు98,384కాగా ప్రస్తుతం 61,212మంది మాత్రమే పని చేస్తున్నారు. ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖలో మంజూ రైన పోస్టులు52,906కాగా ప్రస్తుతం22,336 మంది పని చేస్తున్నారు.కాగా నరేంద్ర మోడీ పదేళ్లపాలనలో 9లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లు,అదే మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితెంద్రసింగ్‌ అభివ ర్ణించారు.కానీ యూపీయే పదేళ్ల పాలనలో ఇచ్చినది 6లక్షల ఉద్యోగాలేనని కేంద్రమంత్రి అంటున్నారు.యుపి ఎస్‌ సి ద్వారా మోడీ ప్రభుత్వం 50,906 ఉద్యోగ నియామకాలు చేయగా యుపిఏ హయాంలో ఇచ్చింది45, 431ఉద్యోగాలేనని,ప్రస్తుత సిబ్బందికి భారీగా ప్రమోషన్‌లు కల్పించామని మంత్రి చెప్పారు. భారత ప్రభుత్వంలో మంజూరైన పోస్టులు 40లక్షలు కాగా,ప్రస్తుతం 30లక్షల ఉద్యోగులే పని చేస్తున్నారు.సివిల్‌ సర్వీసులలో1,365, ఐఏఎస్‌,703,ఐ పీఎస్‌,1042,ఇండియన్‌ ఫారెస్ట్‌ పోస్టులు1042ఖాళీలు,ఐ ఆర్‌ ఎస్‌ పోస్టులు 301ఖాళీగా ఉన్నాయి. హోమ్‌ శాఖలో 1,14,245,సీఆర్పీఎఫ్‌,బి ఎస్‌ ఎఫ్‌, ఢల్లీి పోలీసు శాఖలలో గ్రూప్‌ ఏ స్టులు3, 075,గ్రూప్‌ బి పోస్టులు15861 పోస్టులు, గ్రూప్‌ సి లో95,309పోస్టులు,ఖాళీగా ఉన్నా యి. రైల్వేలలో 2.63లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా ఇటీవల పలుదఫాలుగా1.39లక్షల పోస్టులు భర్తీ చేశారు.ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 8లక్షల ఉద్యోగులు ఉన్నారు.వారిలో 5.6లక్ష ల రెగ్యులర్‌,1.3లక్షలమంది గ్రామ,వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నారు. 2లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌ లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్నారు.యుపిలో 27లక్షల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు, మహారాష్ట్రలో 17లక్షలు,తమిళనాడులో 16లక్షల ఉద్యోగులు,పెన్షనర్లు ఉన్నారు. బీహార్‌,రాజస్తాన్‌,జార్ఖండ్‌,ఢల్లీి రాష్ట్రాలలో నిరుద్యోగులు అధికం. కేంద్రప్రభుత్వం, తెలం గాణా,ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఖాళీలు భర్తీ చేస్తే నిరుద్యోగులకు కొంతయినా ఊరట కలుగుతుంది. నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తే మరి కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈదిశగా సత్వర చర్యలు చేపట్టాలి.

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్దం

విరాళాల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం చెల్లదు..ఇది భావ ప్రకటన స్వేచ్ఛ,సమాచార హక్కు చట్ట ఉల్లంఘన..తక్షణమే పథకాన్ని రద్దు చేయాలి..నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వాపస్‌ చేయాలి..మార్చి 6లోగా బాండ్ల వివరాలు సమర్పించాలి.. మార్చి13లోగా పూర్తి వివరాలను ఇసి వెబ్‌సైట్‌లో పెట్టాలి`ఎస్‌బిఐ… ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మసనం చరిత్రాత్మక తీర్పు.!
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు ముడుతున్న విరాళాలను అత్యంత గోప్యంగా ఉంచడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నాకచాంగ ధర్మాసనం బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు,బాండ్ల విలువ, వాటి స్వీకర్తల(రాజకీయ పార్టీల) పేర్లను బహిర్గతం చేయాలని ఆదేశించింది.20 18లో తీసుకువచ్చిన ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగపరంగా లభించే భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కు చట్టాల ఉల్లంఘనగా ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోనిరాజ్యాంగ ధర్మాసనం అభివర్నించింది. రాజకీయ పార్టీలకు చెందిన విరాళాల సేకరణలో పారదర్శకతను తీసుకురావడానికి, నల్ల ధనాన్ని నిర్మూలించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రహస్య బ్యాలెట్‌ తరహాలోనే రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే దాతల పేర్లను రహస్యంగా ఉంచుతామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ ఇది లోపభూయిష్టమని పేర్కొంది.ఈ పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదే శించింది. అంతేగాక 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా భారత ఎన్నికల కమిషన్‌(ఇసిఐ) సమర్పిం చాలని ఎన్నికల బాండ్లను విక్రయిచే అధికారాన్ని పొందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ)ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.మార్చి 13వ తేదీ లోగా ఇసిఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రచురిం చాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ప్రతి ఎన్నికల బాండు విక్రయ తేదీని, కొనుగోలు దారుడి పేరును,ఎన్నికల బాండు విలువను ఇసిఐకి సమర్పించాలని ఎస్‌బిఐని ధర్మాసనం ఆదేశించింది.2019 ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి తీర్పు వెలువడిన నేటి వరకు ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాల వివరాలను ఎస్‌బిఐ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. సిజెఐ డివై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూ ర్తుల ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌,జస్టిస్‌ జెబిపార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ఉన్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల మధ్యలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ సంచ లన తీర్పును వెలువరించింది. 2019 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. తాము స్వీకరించిన విరాళాలు, స్వీకరించబోయే విరాళాలకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు సీల్డ్‌ కవర్‌లో ఇసిఐకి సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా,తాజాగా ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దుచేసిన సుప్రీంకోర్టు 15రోజుల చెల్లుబాటు గడువు మాత్రమే ఉండే ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఇంకా తమ ఖాతాలలో జమచేయని పక్షంలో సంబంధిత బ్యాంకుకు వాటిని వాపసు చేయాలని, ఆ సొమ్ము మొత్తాన్ని సంబంధిత కొనుగోలు దారుడి ఖాతాలో బ్యాంకులు జమచేయాలని ధర్మాసనం ఆదేశించింది.ఎడిఆర్‌, సిపిఎం, మరి కొందరు వ్యక్తులు ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2017-18 నుంచి 2022-23 వరకు రాజకీ య పార్టీల వార్షిక ఆడిట్‌ నివేదికలను సిజెఐ తన 152పేజీల ఏకగ్రీవ తీర్పులో ప్రస్తావి స్తూ పార్టీల వారీగా ఎన్నికల బాండ్ల ద్వారా అందుకున్న విరాళాల వివరాలను పేర్కొ న్నారు.బిజెపి రూ.6,566.11కోట్లు అందు కోగా, కాంగ్రెస్‌ పార్టీ రూ. 1123.3 కోట్లను స్వీకరించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ రూ.1092.98 కోట్లు అందుకుంది. రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాల చెల్లింపునకు అనుమతిస్తూ కంపెనీల చట్ట నిబంధనలను సవరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణను ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల వివరాలను తెలుసుకునే హక్కు ఓటరుకు ఉందని, అటువంటి అవకాశాన్ని కూడా ఈ పథకం కల్పించలేదని ధర్మాసనం తెలిపింది. నల్ల ధనాన్ని నిర్మూలించడానికి ఎన్నికల బాండ్ల పథకం ఒక్కటే మార్గం కాదని, ఆందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. విరాళాలు అందచేయడం ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు తమ మద్దతు తెలియచేయడం, లేదా క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన విరాళాలు అందచేయడం వంటి ప్రధానంగా రెండు కారణాలతోనే విరాళాలు అందచేయడం జరుగుతుందని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. కార్పొరేట్‌ కంపెనీలు అందచేసే భారీ విరాళాల వివరాలను గోప్యంగా ఉంచ డాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. క్విడ్‌ ప్రో కో లావాదేవీల కింద రాజకీయ పారీలకు అందే విరాళాలు ఆయా రాజకీయ పార్టీలకు మద్దతు గా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. కాగా..జస్టిస్‌ ఖన్నా విడిగా మరో 74పేజీల తీర్పును వెలువరిస్తూ సిజెఐ చంద్రచూడ్‌ రాసిన తీర్పును బలపరుస్తూ వేర్వేరు కారణా లను వివరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు చేయాలన్న తీర్పుతో ఆయన కూడా ఏకీభవించారు.
ఎన్నికల బాండ్లు అంటే ఏంటి.. పార్టీలకు విరాళాలు ఎలా వస్తాయి..ఎవరు జారీ చేస్తారు?
ఈ ఎలక్టోరల్‌ బాండ్లు అంటే ఏంటి అని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తతున్నాయి. ఎలక్షన్‌ బాండ్‌ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్‌ పేపర్‌ మాత్రమే. మన దేశానికి చెందిన వ్యక్తులు గానీ..సంస్థలు గానీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరా ళాలు ఇవ్వడానికి ఈ ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు.ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017-2018 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎల క్టోరల్‌ బాండ్స్‌ పథకాన్ని తీసుకుచ్చారు. ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి10వ తేదీ వరకు జరిగాయి. ఈ ఎలక్టోరల్‌ బాండ్లపై బ్యాం కులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన సూచనల మేరకు ఎలక్టోరల్‌ బాండ్లను జనవరి,ఏప్రిల్‌, జూలై,అక్టోబర్‌ మొదటి 10 రోజుల్లో బ్యాంకులు జారీ చేయ గా.. పార్టీలకు విరాళాలు ఇచ్చే వారు కొను గోలు చేసే అవకాశం ఉంటుంది.ఈ ఎల క్టోరల్‌ బాండ్లు రూ.1000,రూ.10 వేలు, రూ.1 లక్ష,రూ.1 కోటి రూపంలో ఉంటాయి. ఈ ఎలక్టోరల్‌ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఎలక్టోరల్‌ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ ఎన్నికల బాం డ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజు లలోపు ఖాతాదారులు..వాటిని తమకు నచ్చిన పార్టీకి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల బాండ్లపై.. ఎవరు కొనుగోలు చేశార నేది మాత్రం ఉండదు. ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద సీక్రెట్‌గా ఉంటాయి.ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద చేసే విరాళాలు జమ చేసే వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.విరాళాలు ఇచ్చే వారి వివరాల్ని బ్యాంకులు,రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి.ఒక వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లు అయినా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29ఎ కింద రిజిస్టర్‌ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్‌ బాండ్లను స్వీకరిం చేందుకు అర్హత ఉంటుంది.గత 6 ఏళ్లలో ఈ ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం రూ.16437 కోట్లు సమకూరాయి. ఇందులో అత్యధికంగా బీజేపీకే రూ.10117కోట్లు రావ డం సంచలనంగా మారింది. అయితే అధికా రంలో ఉన్న పార్టీకి అత్యధికంగా విరాళాలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ క్రమంలోనే ఈ ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఎం,కాంగ్రెస్‌ సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని..అవినీతిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
‘నీకిది నాకిది’తరహాలో..
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని,వాటి జారీని తక్షణం నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు మోడీ ప్రభుత్వానికి, బిజెపికి చెంపపెట్టు. కార్పొరేట్లకు దోచిపెట్టి అందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీగా నిధులు సమకూర్చుకొని రాజకీయాలను శాసించాలనుకున్న బిజెపికి సుప్రీం తీర్పుతో కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం,నిష్కళంక,పారదర్శక రాజకీ యాలు కోరుకునే ప్రతి ఒక్కరూ స్వాగతిం చాల్సిన తీర్పిది. పాలక పార్టీ, కార్పొరేట్ల నడుమ ‘నీకిది నాకిది’తరహాలో క్విడ్‌ప్రోకోకు ఎలక్టోరల్‌ బాండ్ల స్కీం దారి తీస్తుందన్నవారి ఆందోళనలను, వాదనలను సుప్రీం సమర్ధిం చింది. రాజకీయ పార్టీలకు నిధులు సమ కూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.ఎటువంటి వివరాలూ తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడమంటే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనంది. నల్లధనాన్ని అరికట్టేం దుకు, పారదర్శకత కోసం ఈ స్కీం తెచ్చా మన్న బిజెపి ప్రభుత్వ కుతర్కాన్ని తోసిపారే సింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా అపరి మిత విరాళాలకు అనుమతిస్తూ కంపెనీల చట్టంలో చేసిన సవరణ ఏకపక్షమనీ తప్పు బట్టింది.బాండ్ల ద్వారా సేకరించే విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీం నొక్కి వక్కాణించింది. ఇప్పటి వరకు జారీ చేసిన బాండ్ల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మార్చి 6లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని, ఆ వివరాలను 13లోగా వెబ్‌సైట్‌లో ఇ.సి ప్రచురించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆర్‌టిఐ,ఐ.టి చట్టాలకు విరుద్ధంగా, కంపె నీల చట్టంలో ఏకపక్ష సవరణలతో ఎన్నికల బాండ్ల పథకాన్ని మోడీ సర్కారు ఎందుకు తీసుకొచ్చిందో ఈ కాలంలో బిజెపి జేబులోకి చేరిన అజ్ఞాత కార్పొరేట్ల విరాళాల వరదే చెబుతుంది.2018 జనవరి నుంచి స్కీంను అమల్లోకి తెచ్చారు. ఎన్నికల బాండ్‌ అంటే ఒక విధంగా ప్రాంసరీ నోటు వంటిది. నిర్దిష్ట సమయాల్లో వాటిని బ్యాంకులు జారీ చేస్తా యి. బాండ్లను వ్యక్తులు, కంపెనీలు కొనుగోలు చేసి తమకు నచ్చిన రాజకీయపార్టీలకు విరాళంగా అందిస్తాయి. వాటిని పార్టీలు నగదుగా మార్చుకొని ఎన్నికలకు, పార్టీ కార్యకలాపాలకు ఉపయోగపెట్టుకుంటాయి. అయితే ఎవరు విరాళాలిచ్చారో బహిర్గత పర్చనవసరం లేదు.2017-18 నుంచి 2022-23 వరకు దాదాపు 30తడవల్లో 28 వేలబాండ్లను ఎస్‌బిఐ జారీ చేసింది. వాటి విలువ రూ.16,500కోట్లకు పైమాటే. వాటిలో రూ.6,500 కోట్లు బిజెపి గల్లాపెట్టె లో పడ్డాయి.2018-19, 2019-20లలో 70-80శాతం విరాళాలు బిజెపి ఖాతాకు చేరాయంటే, కార్పొరేట్లకు ఆ పార్టీకి మధ్య పెనవేసుకున్న మైత్రి బంధం తీవ్రత అవగతమవుతుంది.ఎలక్టోరల్‌ బాండ్లు రాజకీ య అవినీతిని చట్టబద్ధం చేసేందుకేనని పర్య వసానాలబట్టి తెలుస్తోంది. ఎన్నికల నిధి సేకరణలో పెద్ద ఎత్తున గోప్యతతో కూడిన, పారదర్శకత లేని పద్ధతులకు బిజెపి ప్రభు త్వం తెరతీసిందని స్కీం వచ్చినప్పుడే సిపిఎం, పలు ప్రతిపక్ష పార్టీలు,ఎ.డి.ఆర్‌ వంటి సంస్థలు నిరసించాయి. సుప్రీం కోర్టులో సవాల్‌ చేశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట బాండ్ల జారీ ప్రారంభానికి లోపే విచారణ పూర్తి చేయాలని విన్నవించిన మీదట కోర్టు గతేడాది అక్టోబర్‌లో విచారణ ముగించి తీర్పు రిజర్వ్‌ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది. కార్పొరేట్లు అందిం చిన రాజకీయ నిధులకు బదులుగా రాయి తీలు కట్టబెట్టడం మోడీ ప్రభుత్వం అను సరిస్తున్న విధానం. ఇది ఆశ్రిత పెట్టుబడిదారీ లక్షణం. తొమ్మిదిన్నరేళ్లలో కార్పొరేట్లు బ్యాంకుల్లో తీసుకున్న రూ.14 లక్షల కోట్ల రుణాలను మోడీ సర్కారు రద్దు చేసింది. కార్పొరేట్‌ పన్నులో రూ.లక్షల కోట్ల సబ్సిడీలిచ్చింది. సహజ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అప్పగించింది. స్వేచ్ఛాయుతమైన న్యాయబద్ధమైన ఎన్నికలకు హామీ కల్పించే విధంగా అభ్యర్ధులందరూ సమాన స్థాయిలో పోటీ పడాలనే సూత్రాన్ని ఈ విధంగా లభించిన ధనబలంతో బిజెపి వమ్ము చేస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎన్నికల సంస్క రణలు అవశ్యమన్న డిమాండ్‌ బలంగా ముందుకొస్తోంది. ఎన్నికల సంస్కరణలే ప్రజాస్వామ్యానికి రక్ష. -( కృష్ణంరాజు యాదవ్‌)

రైతులు మళ్లీ ఎందుకు ఉద్యమిస్తున్నారు?

‘‘కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలను దొడ్డిదారిన అమలు చేయడమే కాక, విద్యుత్‌ బిల్లు ఆధారంగా వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అమలు చేయిస్తున్నది. కనీస మద్దతు ధర అమలు కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే నాడు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయమని దేశవ్యాప్తంగా రైతు సంఘాల సమాఖ్య వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల రైతులు ఢల్లీి చుట్టూ చేరి ఉద్యమిస్తున్నారు. అకస్మాత్తుగా కొందరు రైతులు చేస్తున్న పోరాటం కాదు ఇది. అనేక దశబ్దాలుగా వ్యవసాయం పట్ల, గ్రామీణ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం’’
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందో ళన కొనసాగుతోంది.ఈ చట్టాలను అడ్డు పెట్టు కుని కార్పొరేట్‌ సంస్థలు వ్యవసాయంపై గుత్తాధి పత్యం సాధిస్తాయని,అప్పుడు తాము దోపిడికి గురవుతామన్నది రైతుల భయం.అయితే కార్పొరేట్‌ రంగం వ్యవసాయం రంగంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందనే జాగ్రత్తగా గమనిం చాల్సిన అవస రం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సి ఉన్నా ప్రస్తుతానికి వరి,గోధుములను మాత్రమే ఎక్కువగా కొంటోంది కేంద్ర ప్రభుత్వం.గోధుమలను కొనడంలో ప్రభు త్వం తర్వాత రెండోస్థానంలో ఎవరిది? రూ.75 వేల కోట్ల విలువైన ప్రపంచస్థాయి కార్పొ రేట్‌ సంస్థ ఐటీసీ గ్రూప్‌ది.ఈ సంస్థ ఈ ఏడాది రైతుల నుంచి 2.2మిలియన్‌ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది.మహీంద్రా గ్రూప్‌ కూడా వ్యవ సాయ రంగంలో పెద్దఎత్తున వ్యాపారాలు ప్రారం భించింది.నెస్లే,గోద్రెజ్‌లాంటి బడాప్రైవేట్‌ కంపె నీలు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నాయి.
ఈ-చౌపాల్‌
ఐటీసీ కంపెనీకి, రైతులకు మధ్య అనుసంధానకర్త పాత్ర పోషించడంలోఈ-చౌపాల్‌ పథకం కీలకపాత్ర పోషించింది. ఈ-చౌపాల్‌ సహకారం తో 20 సంవత్సరాలుగా ఐటీసీ గ్రూప్‌ రైతులతో కలిసి వ్యాపారం చేస్తోంది.2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ-చౌపాల్‌ మోడల్‌ గ్రామాల్లో ఇంటర్నెట్‌ కియోస్క్‌లు ఏర్పాటు ఒక నెట్‌వర్క్‌గా పని చేస్తుంది.చిన్న,సన్నకారు రైతులకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ చేసుకోవడంలో ఇది మెల కువలు అందిస్తుంది. వివిధ మార్కెట్లలో ధరలు, వాతావరణ సూచనల్లాంటివి అందిస్తూ రైతులకు బాసటగా ఉంటుంది.
ఈ-చౌపాల్‌ మోడల్‌ ఎలా పనిచేస్తుంది?
అది 2005 సంవత్సరం. మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ ప్రాంతంలో సోయాబీన్‌ పంటకు రైతుల నుంచి పెరుగుతున్న ఆదరణ గురించి ఒక కథనం కోసం నేను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ-చౌపాల్‌ పథకం గురించి విన్నాను.
ఈ-చౌపాల్‌ పరిధిలో ఉండే మార్కెట్లకు వెళ్లి చూశాను.ఒకరిద్దరు యువకులు గ్రామాల్లో కంప్యూ టర్లు పెట్టుకుని వాతావరణ సమాచారాన్ని రైతు లకు అందించడం, అంతర్జాయతీయ మార్కెట్‌లో సోయాబీన్‌ ధరల గురించి వివరించడం గమ నించాను.ఇక్కడి ధరలు తెలుసుకున్నాక రైతులు మార్కెట్‌కు వెళ్లి సోయాబీన్‌ ధరను ముందుగా నిర్ణయించిన ధరకు ఐటీసీకి అమ్మేవారు. అప్పటికి ఆ పథకం కొత్తది. ఒక కార్పొరేట్‌ కంపెనీ, రైతులు కలిసి పని చేయడం కూడా కొత్త విషయమే. రైతులతో తమకున్న అనుబంధంపై ఐటీసీ సంస్థ ఒక వీడియో ఫిల్మ్‌ తయారు చేసిగ్రామాల్లో రైతు లకు ప్రదర్శించి చూపేది. తమ పథకాల గురించి వివరించేది. అప్పట్లో రైతులు,సంస్థా ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు.కానీ ఒక సంస్థ రైతులను మోసం చేయాలను కున్నా, దోచుకోవాలనుకున్నా అది పెద్దకష్టం కాదు. ఎందుకంటే రైతుల రక్షణకు చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు.
ఈ-చౌపాల్‌లో ఇప్పుడు 40లక్షల మందిరైతుల నెట్‌వర్క్‌గా మారింది.10 రాష్ట్రాల్లో 6100 కంప్యూటర్‌ కియోస్క్‌ల ద్వారా 35,000 గ్రామాల్లో విస్తరించి ఉంది. కోటిమంది రైతులను సభ్యులుగా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.రైతులు, కంపెనీల మధ్య కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి ఈ-చౌపాల్‌ ఒక మోడ ల్‌. అయితే కొత్త వ్యవసాయ చట్టం కార్పొరేట్‌ గ్రూప్‌లైన అంబానీలు,అదానీలు వ్యవసాయ రంగంలో ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అందుకే రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
వ్యవసాయోత్పత్తిలో భారత్‌ వెనకబాటు
అమెరికా తరువాత భారతదేశంలో అత్యధికంగా సాగు చేయగల భూమి ఉంది. కాని దిగుబడిలో మాత్రం భారతదేశం అమెరికా కంటే చాలా వెనకబడి ఉంది.సాంకేతిక పరిజ్ఞా నం వాడకం తక్కువగా ఉండటం,వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించే పరిజ్జానం రైతులకు అందుబాటులో లేకపోవడం ఒక కారణ మైతే, ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయాలు క్రమంగా తగ్గుతుండటం మరో కారణం. అయితే వ్యవసాయంలో ప్రభుత్వం ఎక్కువ భూమికను పోషించడం సరికాదని నిపుణులు అంటుండగా, ఉత్తర భారతదేశ రైతులు మాత్రం సర్కారుకు దూరమయ్యేందుకు సిద్ధంగా లేరు.
ఆహార భద్రతలో అదనపు భారం
ప్రజలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి. పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టం(పీడీఎస్‌) ద్వారా కరువుల, అంటువ్యాధుల సమయంలో ఉచితంగా ధాన్యం అందిస్తారు. కానీ ఈ పథకం పేరుతో సేకరిస్తున్న ధాన్యం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంది.ఆహార భద్రత పేరుతో ఎక్కువ గా ధాన్యాన్ని కొనడం రాజకీయ అనివార్యతగా మారింది.‘‘ప్రభుత్వం బియ్యం,గోధుమల కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది.దానికి బదులు వల్ల ఆరోగ్యం,మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం మంచిది’’అని ముంబయికి చెందిన ఆర్థిక నిపుణుడు వివేక్‌ కౌల్‌ అన్నారు.
రైతులు ఏం డిమాండ్‌ చేస్తున్నారు?
కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) చట్టంలో చేర్చాలని,ప్రభుత్వం మండీల (మార్కె ట్లు) నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని ప్రస్తుత చర్చల్లో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాలు ప్రస్తుత అవసరమని, దానివల్ల రైతులే ప్రయోజనం పొందుతారని మోదీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుత ఆందోళ నల కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగు తోంది.అయితే దీనిని వాస్తవిక దృష్టితో చూడాల్సి న అవసరముంది.
వ్యవసాయంలో పెను మార్పులు
గత రెండు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. అయితే ఈమార్పులు ప్రభుత్వంకన్నా ప్రైవేటుశక్తుల వల్లనే ఎక్కువగా సాధ్యమయ్యాయి.టెక్నాలజీ,కొత్త విత్తనా లు,నాణ్యమైన ఎరువుల్లాంటి అంశాలు వ్యవసా యాభివృద్ధికి కారణం.ఇవే మార్పులు వ్యవసాయ రంగంలోని ప్రైవేట్‌ సంస్థలకు చోటు కల్పించా యి.కానీఏ వేగంతో మార్పులు జరుగుతున్నాయో, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలలో కూడా మార్పులు చేయాలన్న డిమాండ్‌ వినిపి స్తోంది.కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ కాలంలో ఈకొత్త చట్టంపై చర్చ జరిగింది. కానీ అది అమలు కాలేదు.2019 ఎన్నికల మ్యాని ఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.ప్రైవేటు కంపెనీలు వ్యవసాయ రంగంలోకి రాకుండా నిరోధించలేనప్పుడు కొన్ని చట్టాలు, నిబంధనలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇవి ప్రైవేట్‌ కంపెనీలు తమను దోచుకోకుండా తమ ఆదాయా న్ని పెంచే విధంగా ఉండాలని రైతులు కోరుతు న్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఈ మూడు చట్టాలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే తెచ్చామని చెబుతున్నా, తమను పరిగణనలోకి తీసుకోకుండా,హడావుడిగా ఆమోదించారని రైతులు ఆరోపిస్తున్నారు.వ్యవసాయ రంగంలో ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే ఉన్నాయని, అయితే అవి రైతులను దోచుకునేందుకు అవకాశాలు పెరిగాయని, రైతుకు రక్షణ లేదని కేరళ మాజీ శాసన సభ్యుడు, రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కృష్ణ ప్రసాద్‌ అంటున్నారు.
ప్రభుత్వం-రైతులు ఎందుకు పట్టుదలగా ఉన్నారు?
‘‘రైతులకు మరిన్ని ఆప్షన్లు ఇస్తుంటే మమ్మల్ని రైతు అనుకూలురు అంటారా లేక వ్యతి రేకులు అంటారా?కొత్తవ్యవసాయ చట్టంతో రైతు లు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ము కునే అవకాశం కల్పించాం’’అని బీజేపీ తన ట్వీట్‌ లో పేర్కొంది.కానీ ఈచట్టంపై ప్రత్యేక పార్ల మెంటు సమావేశాలు నిర్వహించి మరీ దీన్ని ఉపసంహరించుకోవాలని దర్శన్‌పాల్‌ లాంటి రైతు ఉద్యమ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఇందులో ఎవరు గెలుస్తారు? ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17 శాతం. ప్రపంచ భూమిలో కేవలం2.4శాతం మాత్రమే వున్న దేశం మనది. దేశ జనాభాలో 48.6శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదఆధారపడి గ్రామాల్లో జీవిస్తు న్నారు.ఈ లెక్కలు మన భూమికి, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతలను చెబుతున్నాయి.దేశ జనాభా కు అవసరమైన ఆహారం,వారి కొనుగోలు శక్తి పెరిగి తద్వారా పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాలు వ్యవ సాయానికి అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలి.అనేక విషాదాల అనుభవాల నుండి వ్యవసాయఉత్పత్తులను పెంచుకున్నాము. 1950 -1990 మధ్య దేశ జనాభా పెరుగుదల 2.5 శాతం ఉంటే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల 3.4శాతానికి చేరింది.1980-90 మధ్య వ్యవ సాయ ఉత్పత్తులు సగటు నాలుగు శాతం పెరుగుదల సాధించాయి.1991నుండి ప్రారం భమైన ప్రపం చీకరణ విధానాలు వ్యవసా యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.1990 చివరినాటికి వ్యవ సాయం తిరోగమనంలోకి దిగజారిదాని ఉత్పత్తు లు మైనస్‌ 2శాతానికి పడిపోయాయి. దీని వల్ల ఆహారధాన్యాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసిన పూర్వ పరిస్థితి వచ్చింది. గత పదేళ్ళ నరేంద్ర మోడీ పాలన వ్యవసాయాన్ని పూర్తిస్థాయి సంక్షోభంలోకి నెట్టి కార్పొరేట్‌ కంపె నీలకు అప్పగించడానికి సిద్ధమయ్యింది. అందుకే రైతులు పోరాడుతున్నారు. దేశంలో 14.58 కోట్ల రైతు కుటుం బాల కింద 38.82 కోట్ల ఎకరాల సాగు భూమివుంది.ఇందులో ఐదుఎకరాల లోపు ఉన్న రైతు కుటుంబాలు12.57కోట్లు కాగా, వీరివద్ద వున్న భూమి మాత్రం18.38 కోట్ల ఎక రాలు మాత్రమే. వీరిలో అధికులు వెనుకబడిన కులాలకు చెందిన పేదలు.సెంటు సాగు భూమి లేని గ్రామీ ణ కుటుంబాలు ఏడు కోట్లకు పైగా ఉన్నాయి. వీరిలో అత్యధికులు దళితులు, మైనారి టీలు,గిరిజనులు.వ్యవసాయ రంగం మీద ఆధార పడిన కోట్లకుటుంబాలు నిత్యం అప్పుల్లో ఉండ డానికి, పేదరికంలో మగ్గుతుండడానికి ప్రధాన కారణం తగినంత సాగు భూమి నిజమైన సాగు దార్ల వద్ద లేకపోవడం.శాస్త్ర, సాంకేతికత పెరిగే కొద్ది గ్రామీణ వృత్తులు అంతరించి వాటిపై ఆధా రపడిన వారు వ్యవసాయానికి అదనపు భారమ య్యారు. ప్రభుత్వాల నుండి రైతులకు అందాల్సిన రుణ పరపతి,ఎరువులు,విత్తనాల సబ్సిడీ తగ్గిపో వడం,పంటలకు గిట్టుబాటు ధరలు అమలు కాక పోవడంతో వ్యవసాయం తీవ్రసంక్షోభంలోకి వెళ్ళి గ్రామీణ జీవితం ఛిద్రమయ్యింది.
వ్యవసాయాన్ని ముంచే మోడీ విధానాలు
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపె నీలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం 2020 జూన్‌ 5న ఆర్డినెన్స్‌ ద్వారా మూడు నల్ల వ్యవ సాయ చట్టాలు తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను చట్టాలు గా మార్చుకునేందుకు అదే సంవత్సరం సెప్టెంబర్‌ 17-19తేదీల మధ్య లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందారు.వ్యవసాయ ఉత్పత్తుల వ్యా పార,వాణిజ్య చట్టం,రైతు ధరల హామీ,వ్యవ సాయ సేవల ఒప్పందచట్టం,నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం వల్ల వ్యవసాయంపై తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటల ఉత్పత్తుల ధరలను ప్రభుత్వాలు కాకుండా పెద్ద కంపెనీలు నిర్ణయిస్తాయి. దేశ ప్రజల అవసరాల కోసం పంటల సాగు కాకుండా, ఈ కంపెనీలకు ఏది లాభమో దానినే ఉత్పత్తి చేయించగలరు. ఇప్పటి వరకు పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న కొద్దిపాటి ఆహారధాన్యాలు కూడా దూరమవుతాయి. ప్రభుత్వాలు ఎరువులు, విత్తనాల మీద ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా తొలగిస్తాయి.వ్యవసాయ రంగంలో నూతన పరి శోధనల నుండి ప్రభుత్వం తప్పుకుంటుంది. జాతీయ బ్యాంకుల నుండి రైతులకు అందుతున్న అరకొర రుణ సదుపాయం కూడా అందక పం టల పెట్టుబడికి, రైతు కుటుంబ అవసరాలకు ప్రైవేట్‌వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తుంది. వీటన్నింటివల్ల పేద,దిగువ మధ్య తర గతి రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని కోల్పో యి భూమి లేని నిరుపేదల్లో చేరిపోతారు. ముఖ్యం గా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ సిఫారస్సు చేసిన మొత్తం ఉత్పత్తి ఖర్చులకు 50శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న కీలక అంశం అమలుకు నోచుకునే అవకాశమే లేదు.
కనీస మద్దతు ధర ఎందుకు ?
అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే 23పంటలకు మాత్రమే ఈ మద్దతు ధర ప్రకటించబడుతుంది. అందులో 20 పంటలు ఆహారానికి సంబంధిం చినవి. ఇందులో వరి,గోధుమ,జొన్నలాంటి ఏడు ముతక ధాన్యాలు,ఆరు పప్పుధాన్యాలు,ఏడు నూనె గింజల పంటలు ఉన్నాయి. వాస్తవంగా వరి, గోధుమ పంటలకు మాత్రమే కొద్దిమేర ఈ కనీస మద్దతు ధర అమలవుతుంది.ఈ రెండు పంటల సేకరణలో65శాతం పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుండే జరుగుతుంది.ఈ రాష్ట్రాల్లో వ్యవసాయం వృద్ధి చెందడానికి వరి,గోధుమ పంటలకు మద్ద తు ధర లభించడం ఒకకారణం. పంజాబ్‌లో వరి పంట అమ్మకాలు 78శాతం,హర్యానాలో 90శాతంచిన్న,సన్నకారు రైతుల నుండి జరుగు తున్నాయి.అందుకే మోడీ నల్ల చట్టాల ప్రభావం దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడే ఎక్కువగా ఉంటుంది.అందుకే ఈ రెండు రాష్ట్రాల రైతులు కేంద్రం పెట్టే అన్ని నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమిస్తున్నారు.2000 నుండి 2014వరకు దేశవ్యాప్తంగా 45 శాతం మంది మధ్య తరగతి రైతులు వ్యవసాయాన్ని వదిలి పెట్టినట్లు వ్యవ సాయ శాస్త్రవేత్తల అధ్యయనాలు తెలుపుతు న్నాయి.ఈచట్టాలు అమలైతే దేశంలో, మన లాంటి రాష్ట్రాల్లో రైతు వ్యవసాయం కనుమ రుగవుతుంది. దీనివల్ల పట్టణాల్లో పనులకు పోటీ పెరిగి వేతనాలు తగ్గడం, ఆకలి చావులు, ఆహార ధాన్యాల కొరత తీవ్రమవుతాయి. అందుకే ఢల్లీిలో జరుగుతున్న రైతుల ఉద్యమం దేశ ప్రజల బతుకు కోసం సాగుతున్న ఉద్యమం.
నీరో చక్రవర్తిలా మోడీ
చరిత్రలో రోమ్‌ను పాలించిన నీరో చక్రవర్తి అనగానే ‘రోమ్‌నగరం తగలబడి పోతుంటే ఫిడేల్‌ వాయించిన వ్యక్తిగా’ గుర్తుకు వస్తాడు. అది చరిత్ర. వర్తమానంలో ఢల్లీి చుట్టూ వేలాది రైతులు రెండు వారాలుగా ఆందోళన చేస్తుంటే ద్వారకలో డైవింగ్‌ చేసిన, తిరువ నంత పురంలో గగన్‌యాన్‌ అంతరిక్ష మిషన్‌ ముందు మోకరిల్లిన మన ప్రధానిని చూసి తరించే భాగ్యం దేశ ప్రజలకు పట్టుకుంది. గత 45 సంవత్సరా ల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపో యిందని ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా-2023’ నివేదిక ప్రకటించిన,గత 11సంవత్సరాల్లో కుటుం బ ఖర్చులు ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగి పోయాయని,అందుకు అనుగుణంగా ప్రజల ఆదా యం పెరగలేదని హెచ్‌సిఇఎస్‌ తాజా నివేదిక బట్టబయలు చేసినప్పటికీ ఏ మాత్రం చలించక, వేషాలు మార్చి మార్చి దేశ ప్రజలకు దర్శన భాగ్యం కల్గించగల నేర్పరి మన ప్రధాని. కొద్ది మంది దేశీయ, విదేశీ సంపన్నుల కోసం కోట్ల మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడు తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించకుండా వ్యవ సాయాన్ని, దేశాన్ని కాపాడుకోలేం.-వి.రాంభూపాల్‌

మరో ప్రపంచం సాధ్యమే

నేపాల్‌ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 15-19 వరకు ఖాట్మండులో వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ (ఔూఖీ) కోసం హాజరవుతారు, ఇది ఇప్పటివరకు ఇక్కడ నిర్వహించ బడిన అతిపెద్ద సమావేశం.
దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కు ప్రత్యా మ్నాయంగా 2001లో బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలో వార్షిక %ఔూఖీ% యొక్క మొదటి సమావేశం జరిగింది మరియు దాని నినాదం ‘మరో ప్రపంచం సాధ్యమే’ – ప్రపంచ వాతావరణ విచ్ఛిన్నం కారణంగా ఔచిత్యాన్ని జోడిరచిన థీమ్‌, సంఘర్షణలు మరియు నిరంకుశత్వం యొక్క వ్యాప్తి.స్థానిక ఆర్గనైజింగ్‌ కమిటీలో న్యాయం మరియు పేదరికంపై పనిచేస్తున్న నేపాలీ సమూహాలు ఉన్నాయి మరియు ఖాట్మండును వేదికగా ఎంచుకోవడం నేపాల్‌ యొక్క బహిరంగతను మరియు ప్రపంచానికి సమావేశ స్థలంగా దాని ప్రాముఖ్యతను రుజువు చేస్తుందని చెప్పారు.
ఔూఖీ యొక్క ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ ఒక ప్రకటనలో ఇలా చెప్పింది: ‘ప్రపంచం రాజకీయ, ఆర్థిక మరియు పర్యావరణ సంక్షోభాల యొక్క సవాలు కాలం వైపు కదులుతోంది … ప్రపంచవాదం, సామూహిక పెట్టుబడిదారీ విధానం మరియు నయా ఉదారవాదం యొక్క శక్తులు పెరుగుతున్న అసమానతలను సృష్టిం చాయి. వాతావరణ మార్పు, ప్రపంచ ఆహార అభద్రత, మెజారిటీ హింస, కోవిడ్‌-19 మరియు భౌగోళిక రాజకీయ తిరుగుబాటుతో పాటు, మాన వాళిలో ఎక్కువ మంది బాధల్లో కూరుకు పోయారు.దాని ప్లీనరీతో పాటు, ఈ సంవత్సరం హైబ్రిడ్‌ ఔూఖీ శాంతి మరియు వాతావరణం, ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులు, ఫెమినిజం మరియు వైవిధ్యం మరియు పాలస్తీనాతో సంఫీుభావంతో వ్యవహరించే ఐదు ప్యానెల్‌లకు వేదికగా నిలిచాయి.
నేపాల్‌ సగర్వంగా సామ్యవాదానికి రాజ్యాంగ నిబద్ధత తో ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తుంది … హామీ ఇవ్వ బడిన ప్రజాస్వామ్య ప్రదేశాలు మరియు మానవ హక్కులు, బలమైన ప్రజా ఉద్యమం ఉనికి ద్వారా సాధిం చిన మైలురాళ్లు.
73 దేశాల నుండి దాదాపు 900 సంస్థలు ఖాట్మం డులో పాల్గోన్నారు. ఈ ప్యానెల్‌లలో భారత్‌ దేశం నుంచి సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి రెబ్బాగ్రడ,పలు సామాజిక ఉద్యమ సంస్థలు, ట్రేడ్‌ యూనియన్‌లు, రైతులు, మహిళలు మరియు స్వదేశీ సంస్థల నుండి శాంతి,న్యాయ ఉద్యమానేతలు హజరయ్యారు.
వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఎస్‌ఎఫ్‌` 2024) 16వ సదస్సు ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నేపాల్‌ దేశం ఖాట్మండులో ప్రారంభమైంది.‘‘మరో ప్రపంచం సాధ్యమే’’ బ్యానర్‌ క్రింద ఐదు రోజుల డబ్ల్యూఎస్‌ఎఫ్‌ -2024 పౌర సమాజ సంస్థలు,సామాజిక ఉద్య మాలు,సమత వంటి స్వచ్చంధ సంస్థల ప్రతి నిధులు, ట్రేడ్‌ యూనియన్లు,నయాఉదార వాద ప్రపంచీకరణను వ్యతిరేకించే వ్యక్తుల మధ్య సమాంతర మార్పిడిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది.తర్వాత సంఫీుభావ యాత్ర నిర్వహించారు.భృకుటిమండపంలోని ప్రధాన వేదిక నుంచి ప్రారంభమైన సంఫీు భావ యాత్ర భద్రకాళి,కొత్తరోడ్డు గేటు,రత్నా పార్కు మీదుగా తిరిగి భృకుటిమండపం వరకు సాగడంతో కార్యక్రమం ప్రారంభ మైంది.న్యాయం,శాంతి,సమానత్వం,వివక్షకు ముగింపు పలకాలంటూ నినాదాలు చేస్తూ బ్యానర్లు,ప్లకార్డులు పట్టుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రారంభ వేడుక తర్వాత వివిధ థీమ్‌లు,విషయాలపై అంతర్జాతీయ వక్తలు పాల్గొనే చర్చా కార్యక్రమాలు జరిగాయి.
డబ్ల్యూఎస్‌ఎప్‌ సెక్రటరీ జనరల్‌ అయిన ఆంటోనియో గుటెర్రెస్‌ ఔూఖీ 2024కి తన సంఫీుభావ సందేశంలో తన మద్దతును తెలియజేశారు. డబ్ల్యూఎస్‌ఎప్‌ 16వ ఎడిషన్‌ థీమ్‌ ‘మరో ప్రపంచం సాధ్యమే’. ప్రతి సంవ త్సరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లోజరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కు ప్రత్యామ్నాయంగా డబ్ల్యూఎస్‌ఎప్‌ 2001లో ప్రారంభమైంది.
ప్రపంచ సామాజిక వేదిక
వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ 2024 ‘‘ఇప్పుడు మరో ప్రపంచం.’’ అనే నినాదంతో ఖాట్మండు సరి హద్దుల్లో శాంతి, న్యాయం కోసం పిలుపు నిచ్చింది.సదస్సులో 72 దేశాల నుండి సామా జిక న్యాయవాదులు సమావేశమయ్యారు. యుద్ధం లేని ప్రపంచాన్ని స్థాపించాలని ఒక అభ్యర్ధనను జారీ చేశారు.పాలస్తీనా విముక్తి, బానిసత్వం,కులతత్వం,ఛాందసవాదం నిర్మూలనకోసం ఒత్తిడి చేస్తూ నేపాల్‌ రాజధాని వీధుల్లో ఊరేగించిన 20,000 మంది పాల్గొనే స్ఫూర్తితో కూడిన ర్యాలీతో ఫిబ్రవరి 15న ‘మరో ప్రపంచం సాధ్యమే’ అనే నినాదంతో ఈ కార్యక్రమం ప్రారం భమైంది. మానవ అక్రమ రవాణా,మహిళ లు, దళితులు మరియు అన్ని అట్టడుగు వర్గాల సాధికారత. మొత్తం 252 సెమినార్లు, వర్క్‌షాప్‌లు,సంబంధిత సెషన్‌లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న మానవ హక్కులు మరియు సామాజిక న్యాయవాద సంస్థలచే నిర్వహించబడ్డాయి,వాతావరణ న్యాయం, వివక్ష, సురక్షిత వలసలు మరియు అక్రమ రవాణా విరమణ వంటి అంశాల శ్రేణిని పరిష్కరించడం జరిగింది.సుమారు 9,000 మంది వ్యక్తులు చిన్న సమూహ చర్చలలో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సమకాలీన సామాజిక-రాజకీయ దృశ్యాలను విడదీయడం,ప్రతిబింబించడం, ఐక్యత,సంఫీుభావం మరియు ప్రజాస్వామ్య విలువల పునరుజ్జీవనం కోసం వాదించే ప్రకటనలను వ్యక్తీకరించారు.అలాగే సెమినార్‌లు,వర్క్‌షాప్‌లను నిర్వహించే కాథలిక్‌లు,వరల్డ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చర్చ్‌ల సభ్యు లతో సహా క్రిస్టియన్‌ డినామినేషన్‌ల నుండి గణనీయమైన హాజరుతో అనేక సామాజిక క్రైస్తవ సంస్థల నుండి భారతీయ ప్రతినిధులు గణనీయమైన ఉనికిని చాటుకున్నారు. వీటిలో, భారతదేశానికి చెందిన ఫోరమ్‌ ఆఫ్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌కు చెందిన 60మంది సభ్యులు, వారి 70మంది సహచరులతో కలిసి, పర్యా వరణ పరిరక్షణ,సమ్మిళిత సమాజాన్ని ప్రోత్సహించడానికి మైనారిటీ హక్కుల పరిరక్షణ,సురక్షితమైన,గౌరవప్రదమైన వలసలను నిర్ధారించడం వంటి అంశాలపై దృష్టి సారించే సెషన్‌లకు నాయకత్వం వహిం చారు.పర్యావరణ సారథ్యంపై చర్చల సమయంలో, హాజరైనవారు సహజ ఆవా సాలు,పర్యావరణ వ్యవస్థల క్షీణత,నీటి కాలుష్యం,సహజ వనరుల నిలకడలేని దోపి డీపై చర్చించారు,జీవజాలాన్ని నిలబెట్టడానికి శిలాజ ఇంధనాల నుండి స్వచ్ఛమైన శక్తి వైపుకు మారాలని వాదించారు.దక్షిణాసియా ప్రభుత్వాలు,ముఖ్యంగా భారతదేశం మరియు నేపాల్‌,శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించడం మరియు పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. అద నంగా,అభివృద్ధి చెందిన దేశాలు ఈ పరివర్తన సమయంలో సంభవించే ఆర్థిక నష్టాలకు దక్షిణాసియా దేశాలను భర్తీ చేయాలని కోరా రు.అందరికీ ముఖ్యంగా ఈ ప్రాంతంలోని సమాజంలోని అత్యంత పేద వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించాలని కోరింది. ఫోరమ్‌ సభ్యులు మరియు వారి సహకారులు భారతదేశం మరియు పాకిస్తాన్‌లలో మైనా రిటీలు, ముఖ్యంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న వేధింపుల ఖాతాలను శ్రద్ధగా విన్నారు. ప్రఖ్యాత పాకిస్థానీ మానవ హక్కుల కార్యకర్త సయిదా డీప్‌ పాకిస్థాన్‌లోని క్రైస్తవులు, హిందువులు, అహ్మదీయాలు,షియాలపై జరిగిన వివిధ అకృత్యాలను వివరించగా, భారతదేశానికి చెందిన జెస్యూట్‌ ఫాదర్‌ బోస్కో జేవియర్‌ ప్రపంచవ్యాప్తంగా పూర్వీకు లు,వృత్తి ఆధారంగా వ్యవ స్థాగత వివక్షపై వెలుగునిచ్చారు.మైనారిటీ వర్గాలను మరియు సమాజంలోని అంచులలో ఉన్నవారిని లక్ష్యం గా చేసుకొని,మత,సాంస్కృ తిక,జాతి,భాషా వైవిధ్యానికి ప్రతిజ్ఞ చేస్తూ విద్వేషపూరిత వాతావరణం,బహిష్కరణ,హింసాత్మక వాతా వరణాన్ని అసెంబ్లీ ఖండిరచింది.దక్షిణాసియా ప్రభుత్వాలు,ముఖ్యంగా భారతదేశం,పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మరియు శ్రీలంక, మైనారిటీలు, బలహీన వర్గాలపై వివక్ష,హింసను ఆపాలని, బదులుగా,వారి విలక్షణమైన సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని జరుపుకోవాలని ఒక ఉమ్మడి ప్రకటనలో ఫోరమ్‌ డిమాండ్‌ చేసింది.సురక్షితమైన గౌరవప్రదమైన వలసలు అనే అంశంపై, ఫోరమ్‌ సభ్యులు ఆర్థిక ఆకాం క్షలు,సంఘర్షణల కారణంగా దక్షిణాసియాలో విస్తృతమైన అంతర్గత,అంతర్జాతీయ వలసల వాస్తవికతను ధృవీకరించారు, వలస కార్మికు లకు బలమైన చట్టపరమైన రక్షణలు,వివక్ష మరియు అగౌరవం నుండి వారిని రక్షించే చర్యల అవసరాన్ని నొక్కి చెప్పారు. మాంట్‌ ఫోర్ట్‌ బ్రదర్‌ వర్గీస్‌ తేకనాథ్‌, ఫోరమ్‌ పార్టిసి పెంట్‌,తొలగింపులపై మూడు రోజుల ఇంటర్నేషనల్‌ ట్రిబ్యునల్‌ను ఆర్కెస్ట్రేట్‌ చేసారు, ఇందులో బలవంతపు స్థానభ్రంశం గురించి సాక్ష్యాలు సమర్పించబడ్డాయి. వివిధ ఖండా లకు చెందిన గౌరవనీయులైన మానవ హక్కు ల కార్యకర్తల బృందం అన్ని నిర్వాసితులైన వర్గాల పునరావాసానికి అనుకూలంగా తీర్పుని చ్చింది.ఫోరమ్‌ నేషనల్‌ కన్వీనర్‌ ప్రెజెంటేషన్‌ సిస్టర్‌ డోరతీ ఫెర్నాండెజ్‌, కాంగ్రెగేషన్‌ ఆఫ్‌ జీసస్‌ సిస్టర్‌ ఆన్సి,ఫాదర్‌ జేవియర్‌ మరియు ఇండియన్‌ మిషనరీస్‌ ఆఫ్‌ సొసైటీ నుండి ఫాదర్‌ ఆనంద్‌లతో కలిసి ఐదు రోజుల ఈవెంట్‌లో వివిధ కార్యక్ర మాలను నిర్వహిం చారు.కార్యక్రమంలో విభిన్న మైన సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉన్నా యి, భృకుటి మండ పం,ఈవెంట్‌ వేదిక, నేపాలీ శ్రావ్యమైన, నృత్యాలతో,అలాగే అనేక ఇతర ఆసియా, ఆఫ్రికన్‌,దక్షిణ అమెరికా,యూరోపియన్‌ భాషలలో సంగీత ప్రదర్శనలు.ప్రతి రోజు సాయంత్రం,వారణాసి లోని విశ్వజ్యోతి కమ్యూనికేషన్స్‌,థియేట్రికల్‌ విభాగం ప్రేరణ కళా మంచ్‌, రైతులు మరియు మైనారిటీలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ వృత్తిపరమైన నాటకాలను ప్రదర్శించింది, పర్యావరణ ఆందోళనలు,వివక్ష ,మత కలహా లను వివరించే వీధి నాటకాలతో ప్రేక్షకులను ఆకర్షించింది.-(థింసా డెస్క్‌)

మహిళా లోకానికి స్పూర్తినిద్దాం

(గునపర్తి సైమన్‌)

ఇంట్లో అదనపు వరకట్నం కోసం హింసించే భర్త.. పాఠశాల, కళాశాలలో ప్రేమ పేరిట విసిగించే పోకిరీలు అదును చూసి కాటేసే కామాంధులు..పనిచేసే చోట మానసికంగా వేధింపులు ఇలా అడుగుకో మగాడు. మహిళ రక్త మాంసాలు నుంజుకుతినే మృగాడు. మరి ఈ అకృత్యాలకు అంతం లేదా? మగువకు రక్షణ లేదా? అంటే రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు, ఐపీసీలో మరెన్నో సెక్షన్లు ఉన్నాయి. వాటి గురించి అవగాహన లేకపోవడమే మహిళల పాలిటశాపంగా మారింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ దినోత్సవం.లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడానికి చర్యకు పిలుపుని కూడా సూచిస్తుంది. మహిళల విజయాలను జరుపుకోవడానికి లేదా మహిళల సమానత్వం కోసం ర్యాలీ చేయడానికి సమూహాలు కలిసి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన కార్యాచరణ కనిపిస్తుంది.ఏటా మార్చి 8న గుర్తు పెట్టబడుతుంది, ప్రపంచ మహిళా దినోత్సవం అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి.ఈ ఏడాదిప్రచార థీమ్‌ ఏమిటి?ప్రపంచ మహిళా దినోత్సవం2024 ప్రచార థీమ్‌ ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌.(స్పూర్తి చేర్పించడం).మహిళల చేరికను అర్థం చేసుకోవడానికి,విలువైనదిగా ఉండటానికి మేము ఇతరులను ప్రేరేపించి నప్పుడు, మేము మెరుగైన ప్రపంచాన్ని రూపొందిస్తాము. మహిళలు తమను తాము చేర్చుకునేలా ప్రేరేపించబడినప్పుడు, వారికి సంబంధించిన భావన, ఔచిత్యం మరియు సాధికారత ఉంటుంది. ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌ క్యాంపెయిన్‌ మహిళల కోసం మరింత సమగ్ర ప్రపంచాన్ని రూపొందిం చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐడబ్ల్యూడి` 2024 ప్రచార థీమ్‌ గురించి ఇక్కడ మరింత తెలుసుకుందాం!. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 ప్రచార థీమ్‌ ‘స్పూర్తి చేర్చడం’ చేరికను ప్రేరేపించడానికి కట్టుబడి ఉంది. మహిళా ఆర్థిక సాధికారతను కల్పిం చడం,మహిళా ప్రతిభను నియమిం చడం, నిలుపుకోవడం మరియు అభివృద్ధి చేయడం. మహిళలు,బాలికలను నాయకత్వం, నిర్ణయం తీసుకోవడం,వ్యాపారంలోకి మద్దతు ఇవ్వడం, మహిళలు,బాలికల అవసరాలకు అనుగు ణంగా మౌలిక సదుపాయాల రూప కల్పన, నిర్మాణం మహిళలు,బాలికలు వారి ఆరోగ్యం గురించి సమాచారం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయప డటం. స్థిరమైన వ్యవసాయం ఆహార భద్రతలో మహిళలు,బాలికలను చేర్చడం. మహిళలు మరియు బాలికలకు నాణ్యమైన విద్య,శిక్షణను అందించడం.క్రీడలో మహిళలు మరియు బాలికల భాగస్వా మ్యాన్ని మరియు విజయాన్ని పెంచడం. మహిళలు,బాలికల సృజనాత్మక,కళాత్మక ప్రతిభను ప్రోత్సహిం చడం.మహిళలు, బాలికల అభ్యు న్నతికి తోడ్పడే మరిన్ని రంగాలలో ప్రసంగిస్తారు.
సమానత్వం ఎక్కడుంది!..
ఆకాశంలో,అవకాశంలో సగం అన్నది నినాదంగా మిగిలాల్సిందేనా?ఇది చేవికి ఇంపు కలిగించడమే తప్ప..నేత్రానందం ప్రసాదించే అవకాశమే లేదా?జనాబా లెక్కల ప్రకారం,పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువన్నది ప్రపంచ స్థితి.స్త్రీలు ప్రవేశించని రంగం లేదని, నిపుణత కనబరచని పని.లేదని పదేపదే చెప్పడం సరే.వారు నిలబడగలిగేలా చేస్తున్నమా,ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చూస్తున్నామా?అన్నదే మన దేశంలో నాటికీ నేటికీ ప్రశ్న.స్త్రీలంటే అప్పటికే ఇప్పటికీ చిన్నచూపే.విధి నిర్వహణ ప్రదేశాల్లో రక్షణ అంతంత మాత్రమే.శ్రమకు సరిపడా ప్రతిఫలం లభిస్తోందా అన్నది ఈనాటికీ సందేహాస్పదమే.కాకుంటే..గతంలో కంటే వర్తమానంలో ప్రశ్నించే తత్వం పెరిగింది. నిలదీసి,నిగ్గదీసి నిలువునా కడిగి పారేసే ధీరత అలవాటుగా మారింది. ఆడవారిని కించపరిచే దుష్టశక్తుల పనిపట్టే తెగువా విస్తృతమవుతుంది. వీటన్నింటితో పాటు స్త్రీలపట్ల ఆలోచనా ధోరణిని ఇంకా మార్పుకావాల్సిన అగత్యమైతే ఇతర సమా జానికి చాలా ఉంది. ఆచరిస్తే సరి..!
సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. మహిళలూ మీకు జోహార్లు అంటూ ఏటేటా కవితలల్లే వారికీ కొదవ లేదు.ఆకాశం, అవకాశం వివాదాల జోరు సరేసరి.టన్నుల కొద్దీ పదజ్ఞానం కన్నా,ఎంతో కొంతైనా ఆచరించి చూపడం మిన్న.అది సాకార మైనప్పుడే ఆడపిల్ల పెదవి మీద దరహాసం మెరుస్తుంది.అంతేకానీ,ఇంటా బయటా.. మాటలు చేతలూ ఆమె కన్నీటికి కారణ మైతే,జాతికి నిష్కృతి ఉండదు.ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం దాకా ఇంతే!.
వరకట్న నిషేధ చట్టం-1961
భర్త, అతని తల్లిదండ్రులు, అడపడుచులు, అత్తింటి తరపున ఇతర బంధువులు ఎవరైనా వరకట్నం కోసం వేధిస్తే ఐదేండ్లకు పైగా జైలు,రూ.15 వేలకు తక్కువ కాకుండా జరి మానా విధిస్తారు.ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం,తీసుకోవడం రెండు నేరమే. వరకట్న వేధింపులకు సంబంధించి మహిళలు నేరుగా సంబంధింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులపై మొదటి శ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తుంది.
ర్యాంగింగ్‌ నిరోధక చట్టం-1997
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగ్‌ నిరోధక చట్టం నంబర్‌ 28ను తెచ్చింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 1800 18022 18055 నంబర్లకు విద్యార్థినులు ఫోన్‌చేసి సమస్యలను చెప్పవచ్చు. ర్యాగింగ్‌ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ర్యాగిం గ్‌కు పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటారు.
మహిళకు స్వేచ్ఛ కొంతే!
అందరూ ఒప్పుకోదగిన పరిణామం నాటికి, నేటికి స్త్రిల పరిస్థితులు మారాయి. నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.ముఖ్యంగా అభినందించవలసిన విషయం- విద్యారంగం లో పాఠశాల మొదలు కళాశాల వరకు బాలికలదే అగ్రస్థానం. చదువులకోసం తాత్కాలిక ఉద్యోగాలు (మెహంది, అల్లికలు, శుభకార్యాలలో పిండివంటలు తయారీ దార్లుగాను, హస్తకళలు, వాహనాలు నడిపే డ్రైవర్లుగాను) ఇలా ఎన్నో మరెన్నో పనులు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడుతూ ఉన్నత వ్యక్తిత్వంతో ప్రయో జకులైన మహిళలు నేటి భారతీయ సమాజంలో నిత్య ప్రకాశ దీపాలుగా చెమటను ఆజ్యంలా పోస్తూ దశదిశలా అఖండమైన కాంతులతో వెలిగిపోతున్నారు. ఆనందించవలసిన విషయం ఏమిటి అంటే వృత్తి విద్యాకోర్సులు, ఉద్యోగాలలో రాజకీయాలలో స్త్రిలకూ ప్రాముఖ్యం లభించడం. స్త్రిలు సమంగా నేర్పుగా అంకితభావంతో గొప్పగా పనిచేయటం, వారు రాణించినంత గొప్పగా పురుషులు రాణించలేకపోవడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి?
ఇలా పలు విధాలుగా వైద్య,విద్యా,విజ్ఞాన, రాజకీయ,క్రీడా,రక్షణ రంగాలలో ఎక్కడ చూసినా,ఏ నోటవిన్నా పదును పెట్టిన ఆయు ధంలా మహిళా శక్తి, యావత్‌ ప్రపంచం స్తంభించిపోయేలా ఉప్పెనలా పొంగి పొరలి నింగిని తాకుతున్న కెరటాలవలే ఎగసిన మహిళా స్ఫూర్తికి, ఎవరూ సాటిలేరు, పోటీ పడరు అనే విధం రాకెట్టులా ఆకాశంలో దూసుకుపోతున్న మహిళా చైతన్యం అందరూ హర్షించదగిన విషయం.
ఈ ప్రపంచంలో మహిళలు రచయిత్రులుగా, కవయిత్రులుగా ఉపన్యాసకులుగా,ఉద్యమ కారిణులుగా ఉపాధ్యాయినిలుగా,గృహిణు లుగా ఉన్నత ఉద్యోగస్తులుగా,మంత్రులుగా, శాసనసభ్యులుగా,న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా,ప్రాణాలను రక్షించే వైద్యులుగా,స్వచ్ఛంద సంస్థల అత్యున్నత అధికార సభలకు అధ్యక్షులుగా,ఆయా రంగాలలో వారు చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో మహిళలు ఆకాశంలో వెలిగే స్వయం ప్రకాశక నక్షత్రాలుగా వెలుగొందుతున్నారు.
ఇకపోతే కొన్ని గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే- ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇంత గొప్పగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న ‘మహిళ పాత్ర’ సమాజంలో మమేకమవుతున్న ‘స్త్రి అభ్యుదయం’ ఇంకా మొదట్లోనే వుంది. మొక్కగానే వుంది. ఎక్కడో ఒకచోట దాని కూకటి వేరు కత్తిరించబడుతూనే వుంది. బాలికగా విద్యార్థినిగా, గృహిణిగా.. ఉద్యోగి నిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపొంతరాలు చెంది సమాజంలో భాగంగా మారినా స్త్రి యొక్క స్వయం నిర్ణయం ఇంకా పురుషుల చేతులలోనే వున్నది. స్త్రి పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలిసి నడవా ల్సిందే. కాని నియంతృత్వ ధోరణితో కట్టిపడే యటమే మహిళా స్వేచ్ఛకు ఇబ్బందిగా అభ్యం తరకరంగా ఉంది కాని అదే జరుగుతుంది కదా. కొన్ని చోట్ల అడుగడుగునా ఆటంకాలు. అలుపెరుగని మహిళా పోరాటాలు, మహిళల ఆత్మాభిమాన అణచివేతలు..ఆత్మవిశ్వాసానికి అవరోధం..ఇవన్నీ..కలిసి మహిళలను ఉప్పెన లా చుట్టుకుంటున్నాయి. తర తరాలనుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బాట్లు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థ కాలక్రమేణా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు జరగాలి. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా ఉద్యోగినిగా ఆర్థిక సేవలందిస్తూ, మాతృత్వంతో సంసారాన్ని పెంచే త్రిపాత్రధారిణిగా ఉప యోగపడే యంత్రంలా ఉందనుకుంటారు. కొందరి పురుషుల ఆలోచనలు కాని అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా స్త్రిలు శ్రమిస్తూనే వున్నారు. ఎలా అంటే నిరంతర నిత్య ప్రవాహంలా మహానదులై సముద్రాలై చరిత్రపుటంలో మహిళలు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. గృహ హింస, విడాకుల చట్టం- ఇలా ఇంకా ఎన్నో చట్టాలు స్త్రిలకి రక్షణ కవచాలుగా ఉన్నప్పటికి సగటు స్త్రి జీవితంలో రక్షణ కరువైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరూ అంగీకరించవలసిందే.
వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రిలపైన జరిగే అత్యాచారాలను అరికట్టే వౌలికమైన మార్పు పురుషులలో రావాలి.ఈ మార్పు ముఖ్యంగా ప్రతి ఇంటినుండి మొదలవ్వాలి. చట్టసబలో మహిళలంతా ఏకతాటిపైకొచ్చినప్పటికీ మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికే ఎన్నెన్ని అవస్థలు పడ్డారో, ఎన్నెన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో యావత్‌ భారతావనికి తెలిసిన విషయమే. స్త్రిల యెడల ఇలాంటి పక్షపాత ధోరణి విడనాడాలి. మహిళా సాధికారత కార్యరూపం దాల్చాలి. మాటల రూపంలోనే మిగిలిపోకూడదు.
ఏది ఏమైనా సగటు స్త్రి జీవితంలో సంపూ ర్ణమైన, సమూలమైన మార్పు రావాలి. అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగా శిక్షించాలి. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో బ్రతుకగలగాలి. నిర్భయంగా నిర్ణయాధి కారాలు చేపట్టగలగాలి. అటువంటి సమ సమాజంలో అద్భుత ప్రపంచాన్ని ఆవిష్క రించాలి.

కనుమరుగువుతున్న సోషలిజం..!

ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు నరమేథాన్ని తలపిస్తున్నాయి.విశాలమైన ప్రజాస్వామ్యదేశంలో సామాన్యల బ్రతులకు స్వేచ్ఛ కరువైంది.75 ఏళ్ల స్వాతంత్య్ర భారతవనిలో రాజులు,జమిందారులు పాలనపోయి..బహుళజాతి బడా కంపెనీలు రాజ్యమేలుతున్నాయి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషలిజం కన్పించడం లేదు.సమాజంలోని భూమి,కర్మాగారాలు ,వ్యాపారాలు వంటి వనరులు సమాజానికి చెందినవి, ప్రైవేట్‌ వ్యక్తులకు కాదు. కానీ ప్రస్తుతం మాత్రం అదానీ,అంబానీ,టాటా,బిర్లా..ఇలా దేశంలో ఒక రెండు,మూడు శాతం మంది వ్యక్తుల వద్దే దేశ సంపదలో సింహభాగం పోగుబడిరది.వీళ్లే నూతన భారతావనికి మహారాజులు.
మనప్రధానమంత్రి మోదీ రామరాజ్యం జపంలో దేశఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా మారింది.పెద్దనోట్లు రద్దుచేసి ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. అగ్నివీర్‌ యోజన పేరిట సైన్యంలో శాశ్వత నియామకాలకు చిల్లుచీటి పొడుచారు.దేశంలో 50శాతం జనాభాలో వెనుకబడిన వర్గాలు. 15శాతం దళితులు,8శాతం గిరిజనులు,15శాతం మైనారిటీలు కలిపి దాదాపు 90శాతం ఉన్నారు. వారికి అన్నీ రంగాల్లోనూ అన్యాయమే జరుగుతోంది.వారెవరికీ వివక్షే తప్పడం లేదు. ఇటీవల జరిగిన రాముని ప్రాణ ప్రతిష్టకార్యక్రమంలో ఎంతమంది దళితులు,గిరిజనులు,వెనుకబడిన వర్గాల వారు వున్నారు? గిరిజనురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు.దళితుడైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ కోవింద్‌ను లోపలకు అనుమతించలేదు.ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లుతో గెలిచిన ప్రజాప్రతి నిధులు పరిపాలన ఎలా ఉండాలనేది,ప్రజాసంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ద పెట్టాలనే విషయాలపై రాజ్యాంగం చెబుతుంటే..మోదీ రామరాజ్యమే రాజ్యాంగంగా పరితపిస్తున్నారు.
చట్టాలనుపక్కన పెట్టి సనాతన ధర్మం కావాలంటున్నారు.ఇది ఇప్పుడు హిందువుల మతంగా సంస్థాగతీకరించబడిరది.మత ప్రమేయం లేకుండా ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలని రాజ్యాంగం చెబుతుంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ జరిగిన అభివృద్ధి,అవినీతి రహిత పాలన,ప్రపంచంలో మన దేశకీర్తి ప్రతిష్టలు పెరిగాయి.అభివృద్ధి చెందిన దేశాలెన్నో భారత దేశం ఇంకా ఐదోస్థానంలోనే ఉండటం గమనార్హం.పూర్వం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలువారు చేసిన అభివృద్ధి, ప్రణాళికలు అసెంబ్లీ, పార్లమెంటు సభలో తీసుకున్న వివిధరకాల సంస్కరణలు,కీలక విధి,విధానాలు ప్రజలకు తెలిపేలా ప్రెస్‌మీట్లుపెట్టి తెలియజేసేవారు.కానీ నేడుఆపరిస్థితులు ఎక్కడా కన్పించలేదు. నాలుగు గోడల మధ్యనే అన్నీ జరిగిపోతున్నాయి.చీకట్లోనే జీవోలు వచ్చేస్తూన్నాయి.వాటిని వ్యతిరేకించే ప్రజలపై నరమేథం సృష్టించి ప్రజా ఉద్యమాలను అణగ దొక్కేస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. బలవంతులను ఎదుర్కొని బాధితులకు న్యాయం చేయగలిగితే సమాజంలోమార్పు వస్తుంది.సమాజాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కావాలి.సమాజాన్ని అన్ని కోణాల్లో ఉత్ధానపరిచే ప్రజాస్వామ్యం రావాలి.వంచన,మోసంతో కేవలం తన అనుకున్నవారికే సాయం చేసి,మిగిలినవారికి అన్యాయం చేసే పార్టీకి ఓటేయొద్దు.
రాబోతున్న సాధారణ ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ తమ ఎత్తుగడలు వేస్తూ అధికారాన్ని మళ్లీ చేజిక్కుంచుకోవడానికిప్రజల్ని వివిధరకాల ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లుకోసం ప్రజల్ని ఆశావాహులుగా,సోమరులగా మార్చే ఎత్తుగడలు చేస్తున్నారు. ప్రజారాజ్యాన్ని బలహీనపరుస్తున్నారు.ప్రజలకు కావాల్సింది..రామరాజ్యం కాదు. ప్రజాసంక్షేమం కావాలి. సమాజంలో ప్రతిపౌరునికి సమానన్యాయం జరగాలి.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రజాస్వామ్య వాదులను,సామాజిక సమానత్వం,న్యాయంకల్పించే వారికి,ఓటు వేసి నెగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉంది! -రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

సుప్రీం కోర్టు ప్రకారమే అటవీ నిర్వచనం

‘‘ అడవులు భూగోళపు ఊపిరితిత్తులు.అడవి చల్లగా ఉంటేనే మానవాళి భవిత భద్రంగా ఉంటుంది. కీకారణ్యమైనా,చిట్టడవిjైునా,నాలుగు చెట్లు ఒకచోట ఉంటే భూగోళానికి చేసే మేలు ఇంత అంత కాదు! కానీ,అంతులేని లాభాపేక్షతో కార్పొరేట్లు అడవులను కబళించడానికి ఎప్పటికప్పుడు విరుచుకు పడుతుంటారు.తమ చెప్పుచేతల్లోని ప్రభుత్వాలతో అనుకూల చట్టాలను తయారు చేయించుకుంటారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈదిశలో భారత అటవీ (సంరక్షణ)చట్టం 1980ని సవరించడానికి చేసిన ప్రయత్నానికి అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యంగా గత ఏడాది అడవుల నిర్వచనాన్ని మారుస్తూ తీసుకు వచ్చిన చట్ట సవరణను తాత్కాలికంగా నిలిపి వేసింది.1996లో వెలువరించిన టిఎన్‌ గోదా వర్మన్‌ తిరుములపాడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో నిర్దేశించిన అటవీ నిర్వచ నానికి అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌డి.వై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆహ్వానించదగిన పరిణా మం. నిఘంటవుల్లోని అర్థాన్ని అడవికి ప్రామాణి కంగా తీసుకోవాలని ఈతీర్పులో ధర్మాసనం పేర్కొంది.వర్గీకరణలు,యాజమాన్యాలతో సంబం ధం లేకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అడవులుగా భావించే ప్రాంతాలను (డీమ్డ్‌ ఫారెస్ట్స్‌) గుర్తించడానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇన్ని కీలకమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టే ఆ తీర్పును ఒక మైలురాయిగా భావిస్తారు ’’
భూమిని గుర్తించే ప్రక్రియలో 1996లో టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమల్‌పాడ్‌ తీర్పులో పేర్కొన్న ‘అటవీ’ నిర్వచనం ప్రకారం..రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా వ్యవ హరించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ సంరక్షణ చట్టానికి 2023లో చేసిన సవరణలను సవాలుచేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌,న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.పిటిషనరు తరపున సీనియర్‌ న్యాయవాదులు ప్రశాంతభూషన్‌,చంద్రసేన్‌ వాదనలువినిపిస్తూ 2023 సవరణలోని సెక్షన్‌ 1ఎగోదావర్మన్‌ తీర్పులో ఇచ్చిన ‘అడవి’నిర్వచనం కుదించబడిరదని, దీని ప్రకారం భూమిని అటవీగా నోటిఫై చేయాలని, ప్రభుత్వంలో ప్రత్యేకంగా అటవీగా నమోదు చేయాలని పేర్కొన్నారు.ఈనిర్వచనాన్ని కుదించడం వల్ల దాదాపు1.99 లక్షల చదరపు కిలోమీటర్ల అటవీ భూమి‘అటవీ’ పరిధినుండి బయటపడుతుందని అన్నారు.అడవులను అటవీయేతర వినియోగానికి మళ్లించబడుతున్న భూముల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని సిజెఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
‘రూల్‌ 16ప్రకారం రాష్ట్ర ప్రభు త్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు పరిపాలన కస రత్తు పూర్తి చేయడానికి పెండిరగ్‌లో ఉంది. గోదావర్మన్‌లోని ఈకోర్టు తీర్పులో స్పష్టంగా వివ రించబడిన సూత్రాలను తప్పనిసరిగా పాటిం చాలి.16వ నిబంధనలో నిపుణుల కమిటీ గుర్తిం చాల్సిన అటవీ,వంటి ప్రాంతాలు,వర్గీకరించని అటవీ భూములు,కమ్యూనిటీ ఫారెస్ట్‌ భూము లు ఉంటాయి.అందువల్ల గోదావర్మన్‌ తీర్పులో వివ రించిన విధంగా ‘అటవీ’ అనే వ్యక్తీకరణ పరిధికి అనుగుణంగా ఉండేలాచూసుకోవాలి’అని పేర్కొం ది.ఈ ఆర్డర్‌కు సంబంధించి అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలితప్రాంతాలకు సర్క్యులర్‌ను జారీచేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశిం చింది.ఈఉత్తర్వు తేదీనుండి రెండువారాల వ్యవధిలో రాష్ట్రాలు ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీలతో అడవులుగా గుర్తించబడిన భూమికి సంబంధించిన సమగ్ర రికార్డును అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లు,కేంద్ర ప్రభుత్వం తమకు అందించాలని ధర్మా సనం ఆదేశించింది. నిపుణుల కమిటీల నివేదిక లను మార్చి 31లోగాఫార్వార్డ్‌ చేయడంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని,ఈ రికార్డులు ఏప్రిల్‌ 15 నాటికి అధికారిక వెబ్‌సైట్‌లో డిజిటలైజ్‌ చేయాలని,అందుబాటులో ఉంచాలని సూచిం చింది.2023రూల్స్‌లోని రూల్‌16ప్రకారం ఏర్పా టైన నిపుణుల కమిటీలుగోదా వర్మన్‌ తీర్పు ప్రకా రం ఏర్పాటైన మును పటి నిపుణుల కమిటీలు చేసిన పనిని దృష్టిలో ఉంచుకోవాలి. అయితే, 2023 నిబంధనల ప్రకారం ఏర్పడిన నిపుణుల కమిటీలకు రక్షణకు అర్హమైన అటవీభూముల పరిధిని విస్తరించేందుకు స్వేచ్ఛ ఉంటుందని ధర్మా సనం స్పష్టం చేసింది.ముందస్తు అనుమతి లేకుం డా అటవీ భూములను జంతుప్రదర్శన శాలలు, సఫారీలకు తెలియజేయ కూడదని పేర్కొంది. తదుపరి విచారణ జులైకు వాయిదా వేసింది.
40 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణ
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1951నుండి75వరకు దేశ వ్యాప్తంగా 40లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆ నేపథ్యంలోనే భారత అటవీ (సంరక్షణ) చట్టాన్ని రూపొందించి 1980లో ఆమోదించారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇతర అవస రాలకు అటవీ భూమిని మళ్లించడం గణనీయంగా అదుపులోకి వచ్చింది.గతంతో పోలిస్తే 1981 నుండి 2022 వరకు అటవీ భూముల నిర్మూలన పదిశాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ,చట్టంలోని లొసుగులను అవకా శంగా తీసుకుని అడవుల నరికవేత కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని గూడలూరులో చోటుచేసుకున్న కలప అక్రమ నరికివేతకు సంబం ధించి దాఖలైన టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమలన పాడ్‌ కేసులో అటవీప్రాంతాల రక్షణను ప్రధా నంగా చేసుకుని సుప్రీం ఇచ్చిన తీర్పులో ‘అడవి’ని విస్తృతంగా నిర్వచించింది. ఇది కార్పొరేట్లకు ఆటంకంగా మారింది.ఈనిబంధనలను మార్చా లన్న ఒత్తిడి పెరిగింది.ఈ నేపథ్యంలో వారి కను సన్నల్లో నడిచే మోడీప్రభుత్వం గతఏడాది ప్రభు త్వ రికార్డుల్లో నమోదైన భూమిని మాత్రమే అడవి గా గుర్తిస్తూ అటవీ చట్టానికి సవరణ తీసుకు వచ్చింది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అడవుల పరిధిలోకి వస్తాయన్న భయంతో ప్రైవేటు వ్యక్తులు ప్లాంటేషన్లు,తోటలు పెంచడం లేదని తన చర్యను ప్రభుత్వం సమర్ధించుకుంది. వాతా వరణ లక్ష్యాలను అందుకోవాలంటే ప్రైవేటు ప్లాంటేషన్ల భాగస్వామ్యం అవసరమని అడ్డగోలు వాదనకు దిగింది.ప్రభుత్వం చేసిన సవరణతో దేశ వ్యాప్తంగా1.99 లక్షలచదరపుకి.మీల భూమి అడవులపరిధి నుండి బయటకు వస్తుందని అం చనా.మన రాష్ట్రంలోనూ వేలఎకరాల అటవీ భూమికి రెక్కలు వస్తాయని అంటున్నారు. ఇప్పటికే యురేనియం తవ్వకాల పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అడవుల విధ్వంసం ప్రారంభమైంది. పర్యాటక ప్రాంతాల్లో భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వాలపై ఒత్తిడిఎలానూఉంది. వీటన్నింటితో పాటు కేంద్ర సవరణ అమలు లోకి వస్తే అటవీహక్కుల చట్టానికి పెద్ద ఎత్తున గండి పడే ప్రమాదం ఉంది. అత్యున్నత న్యాయ స్థానంలో ఈ వాదనలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. ఆశాజనకమైన ఫలితం వచ్చినప్పటికీ అది మధ్యం తర తీర్పే! ప్రభుత్వం చేసిన సవరణను న్యాయ స్థానం పూర్తిగా కొట్టివేయలేదు. అడవులను గుర్తి స్తూ రికార్డులు తయారు చేయడానికి ప్రభుత్వానికి గడువిస్తూ అంతవరకు పాత నిర్వచనం అమలు లో ఉంటుందని పేర్కొంది. దీనర్ధం కార్పొరేట్‌ కత్తి వేలాడతూ ఉందనే!ఈ ప్రమాదాన్ని తిప్పికొట్టి, ఆకుపచ్చటి అడవులను పరిరక్షించు కోవడానికి ప్రజలను చైతన్యం చేయడం ఒక్కటే మార్గం.
అటవీ నిర్వచనం
అటవీ శాస్త్రం వ్యవసాయం మరియు పర్యావరణ పరిరక్షణను అడ్డుకునే ఒక శాస్త్రం. అడవులలో పంటలను నిర్వహించడం మరియు అటవీ దోపిడీని మెరుగుపరచడం దీని బాధ్యత. లో అటవీ నిర్వచనం పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడం,సహజ వస్తువుల ఉత్పత్తి ద్వారా పర్యావరణం,ప్రకృతి పరిరక్షణ ప్రధాన లక్ష్యం. అటవీప్రాంతం నిర్వచనంలో,అడవుల పెంపకం మరియు నిర్వహణకు బాధ్యత వహి స్తున్నది మనం చూస్తాము. అడవులను నాటడం, పర్యా వరణ నాణ్యతను మెరుగుపరచడం,పశువుల పొలాల ఉత్పత్తి,నిర్వహణ ద్వారా సహజ పర్యా వరణాన్ని రక్షించడం దీని ప్రధాన లక్ష్యం. మన దేశంలో,అటవీప్రాంతం సహజపర్యావరణ వ్యవ స్థను నాశనం చేయకుండా కలప మరియు కార్క్‌ చాలా ముఖ్యమైన అభివృద్ధిని ఉత్పత్తి చేసింది. అటవీ సంరక్షణలో చేర్చబడిన కార్యకలాపాలలో, అడవులు,పర్వతాల నుండి విస్తరించే అటవీ చెట్ల పంటల నాటడం,నిర్వహణ అభివృద్ధిని మేము కనుగొన్నాము.ఆచరణాత్మక ప్రయోజనాల కోసం, ఇది వ్యవసాయంతో పాటు కుటుంబ శాస్త్రంగా పరిగణించబడుతుంది, అయినప్పటికీ దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. మొదటి మరియు అతిపెద్ద వ్యత్యాసం ఉత్పత్తి పద్ధతి. వ్యవసాయానికి కొన్ని నెలల్లో పండ్లు మరియు పంటలను పొందడం భారీగా ఉత్పత్తి చేయడం అవసరం, అయితే అటవీప్రాంతం ఫలితాలను చూడటానికి దశాబ్దా లు అవసరం. నాటిన జాతులను బట్టి ఈ సమ యాలు మారవచ్చు.సహజంగానే, మేము జాతు లను పెంచడానికి ఎంచుకున్న వాతావరణం పర్యావరణ వ్యవస్థను బట్టి,ఈ సహజ వనరును పొందటానికి ఎక్కువ లేదాతక్కువ సమయం పడు తుంది.సేంద్రీయ మట్టినిఉత్పత్తి చేసే జాతులు అటవీ అటవీనిర్మూలనకు కూడా ఉపయోగి స్తారు. అటవీ కార్యకలాపాలలో వివిధ చికిత్సలు పద్ధతులతో అడవుల పెంపకం వంటి కార్యకలా పాలు ఉంటాయి. పదార్థాలు,సహజ వనరుల నిర్వహణ మరియు ఉపయోగం పర్యావరణానికి అనుకూలమైన రీతిలో మరియు సాధ్యమైనంత తక్కువ నష్టంతో నిర్వహించడానికి రూపొందించ బడిరది. ఈ విధంగా, అటవీ నిర్వచనం ఏర్పడు తుంది వివిధ అటవీ పర్యావరణ వ్యవస్థలలో శ్రేయస్సు ఉత్పాదకత మధ్య మంచి సంబంధం. మేము పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి సహజ వనరులను రక్షించడానికి మాత్రమే ప్రయ త్నించము, కానీ దాని నుండి ఆర్ధిక ప్రయోజనా లను కూడా పొందవచ్చు.
రకాలు ` లక్షణాలు
ప్రతి ప్రాంతానికి అవసరమైన భూభా గాన్నిబట్టి అనేకరకాల అటవీప్రాంతాలు ఉన్నా యి:ఇంటెన్సివ్‌ ఫారెస్ట్రీ:సాగు చేస్తున్న ప్రాంతం ఎక్కువ ఉత్పాదకతను నిర్ధారించడానికి ఇది వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది. అంటే, పర్యావర ణాన్ని పరిరక్షించేటప్పుడు అత్యధిక వనరులను ఉత్పత్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాము. విస్తృతమైన అటవీ: ఇతర ఆర్థిక మరియు సామా జిక కార్యకలాపాలు చేర్చబడిన ప్రదేశాలలో కొన్ని కార్యకలాపాలను నిర్వహించే బాధ్యత ఇది. ఈ కార్యకలాపాలను అభ్యసించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే, అది పెరిగిన ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ గురించి జనాభాకు అవగా హన కల్పించడం. అదనంగా, ఇది పర్యాటకం పర్యావరణ విద్య వంటి జనాభాకు కొన్ని సేవలను కూడా అందిస్తుంది. దీనికి ధన్యవాదాలు, అడ వుల ఉత్పతి నిర్వహణ స్థిరమైన మార్గంలో కాలక్రమేణా హామీ ఇవ్వబడుతుంది.
ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొదటి స్థానంలో చెట్లు లేని ప్రాంతా లలో అటవీ నిర్మూలన లేదా అటవీ నిర్మూలన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి అని మేము కనుగొ న్నాము.ఆఎడారి ప్రాంతాలను పునరుద్ధరించ డానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది అనేక జాతుల మొక్కలు మరియు జంతువు లకు జీవన వనరులో భాగం.ఈవిధంగా మీరు అద్భు తమైనఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తారు.ఇది మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా గాలిని బాగా శుద్ధి చేయగలదు, ఇది అనేక పర్యావరణ ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నదులకు ఆహారం ఇస్తుంది మరియు వివిధ ప్రాంతాలకు తాగునీటిని అందిస్తుంది. అయితే, ఇది కొన్ని నష్టాలను కలిగి ఉంటుంది. అటవీ నిర్వహణ లోపం ఉన్నప్పుడు ఈ లోపాలు ప్రధానంగా కనిపిస్తాయి.సరిగ్గా నిర్వహించక పోతే,పర్యావరణానికి హాని కలిగించడం మరియు మొక్క జంతు జాతులకు అపాయం కలిగించడం సులభం.నిర్వహణ సరిగా లేకపోవడంవల్ల మాన వులు సహజ పర్యావరణ వ్యవస్థలలో గొప్ప అసమతుల్యతను కలిగిస్తారు. ఉదాహరణకి, అధిక లాగింగ్‌, అననుకూల మరియు / లేదా ఆక్రమణ జాతులను నాటడం ద్వారా పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.ఈ కార్యాచరణ నుండి ఉత్పన్నమ య్యే అన్ని ప్రతికూలతలు, నిర్వహణ సరైన మార్గం లో చేయనప్పుడు జరుగుతుంది. ఇది సమతుల్య పద్ధతిలో చేసినంత కాలం, అది ప్రయోజనాలను మాత్రమే తెస్తుంది.ఇది సామాజిక,ఆర్థిక పర్యా వరణ వినియోగాన్ని ఇవ్వడానికి అత్యంత అధోకర ణం చెందిన ప్రాంతాలలో ఉపయోగించవచ్చు. ఈ సమాచారంతో మీరు అటవీ నిర్వచనం దాని ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోవచ్చని నేను ఆశిస్తున్నాను.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

విజన్‌ విశాఖ సదస్సు

విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హోటల్లో విజన్‌ విశాఖ సదస్సు మార్చి 5నపారిశ్రామికవేత్త లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి హజరై విశాఖపట్నాన్ని ఎలా తీర్చి దిద్దాలి? రాష్ట్రానికి విశాఖపట్నం ఎందుకు అవసరం అన్న అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉందని వివరిం చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వ్యవసా యాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశంమొత్తం చూసుకుంటే జీఎస్డీపీలో వ్యవ సాయం వాటా17-18శాతంగా ఉంది.మన రాష్ట్రంలో అయితే ఇది35శాతంగాఉంది. ద్వితీయ, తృతీయ రంగాలు వృద్ధి చెందకపోతే రాష్ట్రం కూడా ఆర్ధికంగా నిలబడలేదు.ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగంతో పోలిస్తే ద్వితీయ రంగం, తృతీయ రంగాలు శరవేంగా వృద్ధిచెందాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ముందున్న సవాళ్లను అధిగమించ గలం. అప్పుడే మనం ఆశించిన ఆర్థికాభి వృద్ధిని సాధించగలం.రాష్ట్ర విభజనవల్ల పెనుసవాళ్లు మనకు ఎదురవుతున్నాయి.హైద రాబాద్‌ నగరాన్ని కోల్పోయాం.దీనివల్ల రాష్ట్రం మీద పెను ప్రభావం పడిరది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఒక చోదకశక్తి అవసరం.ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ఆర్థిక చోదకశక్తి అయిన హైదరాబాద్ను మనం కోల్పోయాం.ఆర్థిక ప్రగతి లక్ష్యాలను చేరుకోవ డానికి ఒక వాహనం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను భావించి…ఆరోజుల్లో కేంద్ర ప్రభుత్వం వాటిని విరివిగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఐడీపీఎల్‌, ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎఫ్సీ, ఐఐసీటీ లాంటి సంస్థలు హైదరా బాద్లో స్థాపించబడ్డాయి.పెద్ద ఎత్తున పెట్టు బడులు హైదరాబాద్కు వచ్చాయి.దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని ఏఇతర ప్రాంతంతో పోల్చు కున్నా హైదరాబాద్‌ బాగా అభివృద్ధి చెం దింది. ఇలాంటి సంస్థలు వస్తే గనుక వెంటనే అభివృద్ధి పరంగా మంచి మార్పు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి జీతాలు లభిస్తున్న ఉద్యో గులు ఉంటారు. ఇది వలయంలా మారి మంచి సంస్థలు రావడం,తద్వారా మంచి ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.తద్వారా నగరం బాగా విస్తరిస్తుంది.ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వరంగ సంస్థల్లో 90 శాతం సంస్థలు కేవలం హైదరాబాద్లోనే స్థాపించబడ్డాయి. దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందింది. దురదృష్టవ శాత్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా ప్రాంతా ల్లో అలా జరగలేదు.ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపే సేవారంగం జాతీయ స్థాయిలో చూస్తే జీఎస్డీపీలో 55శాతంకాగా, కానీ తెలంగాణలో సేవా రంగం దాదాపు 62.87శాతంగా ఉంది. కాని మన రాష్ట్రంలో సేవారంగం వాటా కేవలం 40శాతం మాత్రమే. తెలంగాణలో సేవారంగానికి సంబంధించి అత్యధిక వాటా హైదరా బాద్నుంచే వస్తోంది.అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ పెరుగుతుంది. తయారీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే జీఎస్డీపీలో సమాన స్థాయిలో ఉన్నప్పటికీ సేవా రంగం విషయంలో గణనీయ ప్రగతి చోటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసా యరంగంతో పోలిస్తే సేవారంగంలో మంచి వృద్ధిరేటు సాధ్యం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీసు రంగం బాగా పెరగాల్సిన అవసరం ఏ రాష్ట్రా నికైనా ఉంది. 2022-3 ఆర్థిక సంవత్స రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం కేవలం రూ.2,19,518కాగా, తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,12,398లు. తెలం గాణ తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్‌ నుంచే వస్తోంది.సహజ సిద్ధంగా మనకున్న బలాలను వినియోగించుకుంటూ ఆర్థిక పురోగతిలో ముందుకుసాగాల్సిన అవ సరం ఉంది. దేశంలోనే రెండో అతిపెత్త సముద్రతీర ప్రాంతం మనకు ఉంది.974 కి.మీ పొడవైన తీర ప్రాంతం కారణంగా పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మనకు అపార అవకాశాలున్నాయి. దీనివల్ల తయారీ రంగాన్ని కూడా గట్టి ఊతం లభిస్తుంది. పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా తయారీ రంగానికి తగిన సహకారాన్ని అందిస్తూ ,974 కి.మీ. తీరంవెంబడి వివిధ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసుకుంటూ, మరోవైపు విశాఖ పట్నాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ రెండూ కలిసి రాష్ట్రానికి మంచి ఆర్థిక ప్రగతిని అందిస్తాయి. 2019కు ముందు కేవలం 4చోట్ల నుంచే ఎగుమతులు జరిగేవి.కాని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మరో నాలుగు పోర్టు లు కడుతున్నాం. వీటి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు రూ.16వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే దాదాపుగా రూ.4వేల కోట్లు ఖర్చు చేశాం. రామాయపట్నం పోర్టులో వచ్చే నెలలోనే షిప్పులు వచ్చే పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు. మచిలీపట్నం, కాకినాడలోని ప్రయివేటు పోర్టు, మూలపేట పోర్టులవద్ద కూడా పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. నాలుగులో మూడు పోర్టులు ప్రభుత్వ రంగంలో వస్తుం డగా,మరో పోర్టు ప్రయివేటు రంగంలో వస్తోంది.బ్లూ ఎకనామీకి ఊతమిచ్చేలా 10 పిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నాం.తీరం వెంబడి ప్రయాణిస్తే ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఒక ఫిషింగా హార్బర్‌ ఉంటుంది. అలాగే 6 ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటితోపాటు పారిశ్రామిక నోడ్స్ను అభివృద్ధి చేస్తూ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్ను నెలకొల్పాం. అచ్యు తాపురం,ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో పారి శ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నాం.అలాగే రాష్ట్రమంతటా కూడా సమతుల్య అభివృద్ది ఉండేలా చూస్తున్నాం. ప్రభుత్వం తీసుకుం టున్న సానుకూల చర్యలవల్ల, వ్యాపార అను కూల వాతావరణం వల్ల గడచిన మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక వేత్తలకు, పారిశ్రామిక రంగాన్ని రాష్ట్రం ఎంత స్నేహపూర్వకమైనదో చెప్పడానికి ఇదే ఉదాహ రణ. గత ఏడాది ఇదే విశాఖట్నంలో నిర్వ హించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సంద ర్భంగా రూ.13లక్షల కోట్లకుపైగా విలువైన 352 ఒప్పందాలు కుదిరాయి.దాదాపు 6 లక్ష ల మందికి ఉద్యోగావకాశాలు లభించను న్నాయి. ఇందులో 39శాతం ఒప్పందాలు ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఇప్పటికే కార్య రూపంలోకి వచ్చాయి. మిగిలిన ఒప్పందాలు కూడా శరవేగంగా అమల్లోకి వస్తున్నాయి. కేవలం అతి పెద్ద తయారీ పరిశ్రమలు రావడంద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి, లబ్ధిదారు లను సుస్థిర స్వయం ఉపాధి మార్గాలవైపు నడిపించింది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గణనీయమైన మార్పును తీసుకు వచ్చాయి.లంచాలకు తావులేకుండా, దళారీలు లేకుండా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా పథకాలు డీబీటీ పద్ధతిలో అమలు చేసింది. ప్రతి సంక్షేమ పథకం కూడా లబ్ధిదారులను చేయిపట్టుకుని నడిపించాయి. ఉదాహరణకు చేయూత పథకాన్ని తీసుకుంటే క్రమం తప్పకుండా ఒకే మహిళకు రూ.18,750లు చొప్పున నాలుగేళ్లపాటు స్థిరంగా ఇచ్చాం.ఆ లబ్ధిదా రులైన మహిళలను బ్యాంకులతో అనుసం ధానం చేశాం. అమూల్‌, ఐటీసీ, రియలన్స్‌, పీ అండ్‌ జీ లాంటి పెద్ద కంపెనీల భాగస్వా మ్యంతో వారికి స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశాం.వాల్లకాళ్లమీ వాళ్లు నిల బడేలా చేశాం.రాష్ట్రం ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇలాగే అమలు చేసింది. ఇదివరకు జీవనోపాథి పొందుతున్న మార్గాన్ని బలోపే తం చేయడమో లేక కొత్త ఉపాథి మార్గాన్ని సృష్టించడమో జరిగింది.
ఉద్యోగ రంగాన్ని మొత్తం చూస్తే.. ప్రభుత్వంలో ఉన్నవి కొన్ని మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మేం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యగుల సంఖ్య 4లక్షలు అయితే, మేం వచ్చిన తర్వాత సుమారో మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను జోడిరచ గలిగాం. దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య 4లక్షలు అయితే,50శాతం అధికంగా కొత్త ఉద్యోగాలను మేం అధికారం లోకి వచ్చాక సృష్టించగలిగాం.అలాగే భారీ పరిశ్రమల విషయంలో కూడా కోట్లాది రూపాయల పెట్టుబడులను పెడితే,ఆ పెట్టు బడులు ఉద్యోగావకాశాల రూపంలో మారేది కూడా స్వల్పంగానే ఉంటుంది.కాని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో పెద్ద వాటా వ్యవసాయం సహా ఇతర మూడు రంగాల్లో ఉన్నాయి. వ్యవసాయరంగంపై 62శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు.52 శాతం మంది రైతులకున్న భూమి అర హెక్టారు లోపలే.70 శాతం మంది రైతులకున్న భూమి హెక్టారు లోపలే.అభివృద్ధిగురించి మనం మాట్లాడుకు నేటప్పుడు ఈ వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మనకు పెద్ద మొత్తంలో సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వీరు ఆదాయాలు పొందలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూప్పకూలి పోతుంది. అందుకే రైతులకు చేయూనిచ్చి నడిపించడానికి,ఆర్బీకేలద్వారా,అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లను పెట్టడంద్వారా,రైతు భరోసా ద్వారా వారికి తోడుగా నిలుస్తున్నాం.ఉపాథి రంగంలో వ్యవసాయానిది ప్రముఖ పాత్ర. ఇక మరో కీలక రంగం ఎంఎస్‌ఎంఈలు. అతి భారీ,భారీ పరిశ్రమలవల్ల కేవలం3-4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే ఎంఎస్‌ ఎంఈల్లో 30లక్షల మంది ఉద్యోగాలు చేస్తు న్నారు.ఎంఎస్‌ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది.వీటన్నింటికంటే ఎక్కడు మంది స్వయం ఉపాధి మార్గాల ద్వారా జీవిస్తున్నారు.1.5 కోట్ల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేం వెనుక వీరి పాత్రే కీలకం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్ర మాల ద్వారా వీరికి చేదోడుగా నిలుస్తోంది. వారి స్వయం ఉపాధికి సహకారాన్ని అంది స్తోంది.ఉదాహరణకు చూసుకుంటే రాష్ట్రంలో కోటిమందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలు,ఎన్పీఏలు 80 శాతం వరకూ ఉండేవి.ఇప్పుడు కేవలం 0.3శాతం మాత్రమే ఉన్నాయి. కోటిమంది మహిళలు దీనిపై ఆధారపడి ఉన్నారు. అలాగే కార్లు, వాహనాలు నడుపుతూ బతుకుతున్న వారిని వాహనమిత్ర ద్వారా చేదోడుగా నిలు స్తున్నాం. అలాగే కులవృత్తులు చేసుకుంటున్న నాయీబ్రాహ్మణులు,రజకులు, టైలర్లు వంటి వారికి కూడా ప్రభుత్వం చేదోడుగా నిలి చింది. ఆర్థికాభివృధ్ధిలో వీరందరిదీ కీలక పాత్ర. రాష్ట్రంలో ఇలా ప్రతి వర్గానికి కూడా చేయూత నందించేలా ప్రభుత్వం అనేక కార్య క్రమాలు చేపట్టింది. కోవిడ్‌ లాంటి సంక్షోభ సమయంలో కూడా ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో ప్రోత్సాహకాలను విడుదలచేసి ప్రభుత్వం వారిని ఆదుకుంది. ఇది ఎంఎస్‌ ఎంఈల రంగాన్ని రక్షించింది. అందుకే ఈ రంగంలో వృద్ధి గతంతో పోలిస్తే గణనీయం గా ఉంది. 2018-19లో ఆర్థిక వృద్ధిరేటులో రాష్ట్రం చివరల్లో ఉంటే గత ఏడాది మొదటి ఐదు రాష్ట్రాల్లో నిలవడం దీనికి నిదర్శనం. భారత్లో తయారీ రంగం జీవీఏలో రాష్ట్ర తయారీ రంగం జీవీఏ 2019-24 మధ్య 4శాతంగా ఉంటే,2014-19 మధ్య కేవలం 2.9శాతం మాత్రంగా ఉండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మరి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి? వైజాగ్‌ విషయంలో మనం ఏం చేయాలి? వైజాగ్‌ అభివృద్ధి చరిత్రను మనం ఏరకంగా మార్చా లి? వచ్చే పదేళ్లలోగా మనం హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలతో ఎలా పోటీపడాలి? అన్నదానిపై మనం దృష్టిపెట్టాలి. ఇదే విజన్‌ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి. ఈ ప్రాంతం పట్ల ఈ నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్త శుద్ధి లేకపోతే ఈ విజన్‌అన్నది సాకారం కాదు, వాస్తవంలోకి రాదు. అన్నికంటే ముందు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇక్క డకు వచ్చి నివాసం ఉండాలి. ఆది నేను అనగానే,మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలు ఉన్న నెగెటివ్‌ మీడియా ఒక్కసారిగా బోరున విలపిస్తాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వైజాగ్కు మారుస్తా న్నామంటే చాలు, ఇక్కడ భూముల కబ్జాచే యడానికి వస్తున్నారనీ, అది చేస్తున్నారనీ, ఇది చేస్తున్నారనే రక రకాల కథనాలు ప్రచురి స్తున్నారు, ప్రసారంచేస్తున్నారు.
సిగ్గులేకుండా ఇలాంటి రాతలు రాస్తున్నారు. సిగ్గులేకుండా చూపిస్తున్నారు.కోర్టులకువెళ్తున్నా రు. కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వాళ్లు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి విశాఖపట్నం రాకూడదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇక్కడకు వస్తే,ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్గా పురోగతి సాధిస్తుంది. అందుకే సీఎం ఇక్కడకు రాకూ దని అనుకుంటున్నాకు. దీనివెనుక మరోచోట వారికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. బినామీల పేర్లతో భూములు కొన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూ టివ్‌ క్యాపిటల్‌ అనగానే ఈ భూముల కొన్న వారంతా అక్కడ వారి భూముల రేట్లు తదు పరి పడిపోతాయని ఒక్కసారిగా భీతిల్లి పోయారు. వారి స్వప్రయోజనాల కారణంగా వైజాగ్‌ సందిగ్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది.నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. మార్పులు అనేవి అనివార్యం. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరులతో పోటీపడాలంటే వైజాగ్‌ అనేది ఎకనామిక్‌ ఇంజిన్‌-ఆర్థిక చోద కశక్తి కావాల్సిందే. నాకేమైనా స్వప్రయోజనం ఉంటే నేను కడప గురించి మాట్లాడేవాడిని. రాష్ట్రం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదీ అనేది నా అభిప్రాయం.భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది,మన పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది,ఏం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి, దేని వల్ల ఆర్థికంగా పురోగమిస్తాం, అనేరకంగా మనం ఆలోచన చేయకపోతే,ఈ కోణంలో మనం వైజాగ్ను మనం ఆలోచించలేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అన్నది మనం అంతా ప్రశ్నిం చుకోవాలి.
నాయకుడి దార్శినికత తప్పు అయితే…
నాయకుడి దార్శినికత నెగెటివ్‌ అయితే… వైజాగ్‌ వృద్ధిచెందదు,విస్తరించదు.దురదృష్టవ శాత్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పట్నం కోసం ఎవరైనా నిలబడ్డారంటే..అది నేను మాత్రమే. ఇది వాస్తవం. విశాఖపట్నం కోసం ప్రతిపక్షాలతోనూ, స్వప్రయోజనాలున్న మీడియాతోనూ పోరాడుతున్నాం. వారిలో ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధాని కాకూడదని కోరుకుం టున్నారనేది వాస్తవం.వైజాగ్‌ తప్పనిసరిగా అభివృద్ధి చెందాలి. ఒకవైపు కోర్టు కేసులు నడుస్తున్నాయి, మరోవైపు విశాఖపట్నాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటాను.నా ప్రమాణస్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుంది.వైజాగ్‌ పట్ల నాకు న్న కృతనిశ్చయం ఇది.
విశాఖ అభివృద్ధికోసం పదేళ్ల విజన్‌ఇది.
మనం ఈ నగరాన్ని ఓన్‌ చేసుకోవాలి. కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దాలి. దీనికోసం సాకారమయ్యేలా, వాస్తవ రూపంలో ప్రతింబింబించేలా వైజాగ్‌ కోసం మార్గదర్శక ప్రణాళిక రూందించాం.పెద్దగా కలలు కని, ఆచరణలో మాత్రం ఏమీ సాధ్యంకానట్టుగా కాకుండా వాస్తవిక దృక్పథంతో,అనుకున్నవన్నీ సాకారమయ్యేలా ఈ విజన్ను రూపొందిం చాం.పదేళ్లకాలంలో ఇవన్నీకూడా వాస్తవ రూపం దాలుస్తాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వ మే కాకుండా కేంద్ర ప్రభుత్వం,పీపీపీ పద్ధతు ల్లో, ప్రయివేటు రంగం వీరందరూ కూడా ఈ విజన్‌ సాకారంలో భాగస్వాములు అవుతారు. పదేళ్లకాలంలో హైదరాబాద్‌,బెంగుళూరు, చెన్నై నగరాలకు పోటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేలా ఈ విజన్‌ ఉంటుంది.రాజధానిగా అమరావతి ఆలోచనను నేను ఎందుకు వ్యతిరేకించాలి? అలాంటి వ్యతిరేకత కూడా నాకేమీ లేదు. పైగా శాసన రాజధానిగా అమరావతిని ప్రటించిందీ, నిర్ణయించిందీ నేనే. కర్నూలును కూడా న్యాయరాజధానిగా ప్రకటించిందీ నేనే. నాకేం ఎలాంటి వ్యతిరే కతా లేదు. కాని వాస్తవం ఏంటంటే.., అమ రావతి అనేది 50వేలఎకరాల వర్జిన్‌ ల్యాండు, ఖాళీ భూమి. రోడ్లు,నీళ్లు,విద్యుత్‌ లాంటి కనీస సదుపాయాలు కల్పించడానికి మాత్రమే వాళ్లు ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారమే ఎకరాకురూ.2కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతి ప్రాంతంలో భవనాలు రావాలంటే దానికి ముందు కనీ సంగా రూ.1లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది.ఇవాళ మనం ఒకలక్ష కోట్లు అనుకుంటే..20 ఏళ్లలో ఏటా రూ.5వేల కోట్లు చొప్పున వేసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లో, అది చివరకు ఖర్చులు పెరిగీ, పెరిగీ ఏరూ.15లక్షల కోట్లో అయినా అవు తుంది. అందుకనే అమరావతి ఆలోచనకు నేను వ్యతిరేకం కాదు, కాకపోతే అక్కడ అది చేయలేం అంటున్నాం.
కాని వైజాగ్‌ విషయానికొస్తే.. కనీస మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. మంచి రోడ్లు, కరెంటు,తాగునీటి సదుపాయం.. ఇలా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కొన్ని మెరుగులు దిద్దితే సరిపోతుంది. వీటితో సిటీ రూపురేఖలు గణనీయంగా మారుతాయి. కార్యనిర్వాహక రాజధానిగా ఇక్కడకు మారే సమయంలో ఉద్యోగులు పనిచేసుకునేందుకు ఐకానిక్‌ సెక్రటేరియట్‌ ఒకటి ఉండాలి. ఇది దేశం దృష్టిని ఆకర్షించాలి.అలాగే దేశం అంతా ఇటు చూసేలా ఐకానిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌,అలాగే అహ్మదాబాద్‌ తరహాలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఉండాలి. మ్యాచ్లు జరిగేటప్పుడు దేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తంకూడా మాట్లాడుకోవాలి. ఇవన్నీవస్తే ప్రపంచంలో వైజాగ్‌ స్ధాయి పెరుగుతుంది.దేశం మొత్తమే కాదు, ప్రపం చం మొత్తం సంభ్రమాశ్చర్యంతో చూస్తుంది. ప్రపంచ ఆధునిక సాంకేతిక రంగంలో అంశా లను బోధించేలా ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూని వర్శిటీ ఒకటి రావాల్సి ఉంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలో మన విద్యార్థులకు ఇది చక్కటి వేదిక కావాలి. అలాగే భోగాపురం ఎయి ర్పోర్టు నిర్మాణం శరవేంగా సాగుతోంది.15-18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా వేగంగా పనిచేస్తున్నారు.భోగాపురం ఎయిర్‌ పోర్టును అనుసంధానించేలా ఆరు లేన్లతో అందమైన బీచ్‌ కారిడార్‌ రోడ్డు ప్రాజెక్టు కూడా రావాల్సి ఉంది.అలాగే మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌,ఏడాది కాలంలోగా ప్రారంభమయ్యే మూలపేట పోర్టు.దీంతో మొత్తం హారిజాంటల్‌ గ్రోత్‌ కారిడార్‌ ఏర్పడుతుంది. అలాగే డేటా సెంటర్‌, సబ్మెరైన్‌ కేబుల్‌ రూపంలో పెద్ద పెట్టుబడులు అదానీ పెడుతుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ చేశాం. వచ్చే 5-6 ఏళ్లలో విడతల వారీగా ఈప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆతిథ్య రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఓబరాయ్‌, మై ఫెయి ర్‌ కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. బెస్ట్‌ ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలు రాబోతున్నాయి. అలాగే ఎన్టీపీసీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ రూపంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు రాబోతు న్నాయి. ప్రధానమంత్రి నిన్ననే దీనికి శంకు స్థాపన చేశారు. ఇవన్నీ కూడా సాధ్యం కానివి కాదు. ఇవన్నీకూడా వాస్తవరూపంలోకి వచ్చేవే. వచ్చే పదేళ్లలో ఇవన్నీ రాబో తున్నాయి. ఇవేమీ ఊహించలేనివి కూడా కాదు. ఇవన్నీకూడా సాకారమయ్యేవే. అలాగే హైస్పీడ్‌ రైలు కారిడార్లపై కూడా ప్రధాన మంత్రితో మాట్లాడుతున్నాం. హైదరాబాద్‌-వైజాగ్‌,విజయవాడ-బెంగళూరుల మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకోసం సంప్రదిస్తున్నాం. ఇవన్నీరావమే కాకుండా, సీఎంకూడా ఇక్కడకు వస్తే పదేళ్లకాలంలో వైజాగ్‌ ప్రపంచంలోని, దేశంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతుంది. ఇన్ని అడ్డంకులు ఉన్నా, అవరో ధాలు ఉన్నా విశాఖ నగర వాసులకు నేను ఒక్కటే చెప్తున్నాను.మనం తప్పక విజయం సాధిస్తాం.విశాఖపట్టణంలోని వి-కన్వెన్షన్‌ హాలులో జరిగిన భవిత కార్యక్రమంలో భాగంగా ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా శిక్షణ పొంది ప్రయివేటు రంగాల్లో ఉపాధి పొందిన యువత తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. విద్యా దీవెన,వసతి దీవెనల సాయంతోనే చదువుకున్నాం ః దీపిక,గ్రాడ్యు యేట్‌ ఇంజినీర్‌ ట్క్రెనీ, రాయల్‌ ఎన్ఫీల్డ్‌ మోటర్‌ కంపెనీ,చెన్నై. మాది విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను.మా నాన్న ఫోర్క్‌ లిఫ్ట్‌ ఆపరేటర్‌. అమ్మగృహిణి.నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకు న్నాం.నేను నా గ్రాడ్యు యేషన్‌ పూర్తయిన తర్వాత ఆటోమేషన్‌ రంగంలో స్ధిరపడాలని భావించాను.సీడాప్‌ ద్వారా స్కిల్‌ కాలేజ్లో జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్‌ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎంపికయ్యాను. రాయల్‌ ఎన్ఫీల్డ్‌ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యు యేట్‌ ఇంజినీర్‌ ట్క్రెనీగా సెలక్ట్‌ అయ్యాను. మా బ్యాచ్లో అనేక మంది వివిధ కంపెనీలకు సెలక్ట్‌ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి,ఏపీ ప్రభుత్వా నికి, స్కిల్‌ డెవల ప్మెంట్కు, సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు.నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేశాను. అప్పుడు ఏపీ ఎస్‌ఎస్డీసీ స్కిల్‌ ట్క్రెనింగ్‌ ప్రోగ్రామ్‌ లో 45రో జులు శిక్షణ తీసుకు న్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకు న్నాను.మెషిన్‌ ఆపరేటింగ్‌, సాప్ట్స్కిల్స్‌, కమ్యూ నికేషన్‌ స్కిల్స్‌ నేర్పారు. -జిఎన్‌వి సతీష్‌

1 16 17 18 19 20 75