ఇక ఆ గ్రామాల్లో నివాసాలు కష్టమేనా?

‘‘పోలవరం ముంపు మండలాల్లో నివాసయోగ్యత కనిపించడం లేదు. ఈ వరదలు అదే చెబుతున్నాయి. వరద నీరు ఎగువన తగ్గినా మారుమూల గిరిజన గ్రామాలే కాకుండా మండల కేంద్రాలు కూడా కోలుకోవడం లేదు. నీరు తగ్గడం లేదు. గతంలో ఎంత వేగంగా వరద వస్తే అంతే వేగంగా తగ్గేది. ఈసారి మాత్రం వరద తగ్గడం లేదంటే ఇక మా ఇళ్లల్లో మేము ఉండాలంటే కష్టమే. అందుకే ఖాళీ చేస్తామని చెబు తున్నాం. కానీ పునరావాసం ఇవ్వడం లేదు. మాకు ప్యాకేజీ ఇవ్వకుండా మా ఊళ్లను ముంచేశారు. మేము ఏమి చేయాలి? ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? కనీసం కూడా ఆలోచించరా.. వరదల్లో ఇచ్చే సహాయంతో మా కుటుంబాలు గడిచిపో తాయా? ప్రభుత్వం ఆలోచించాలి’’

వరదల సీజన్‌ ఆరంభంలోనే కనీవినీ ఎరుగ నిరీతిలో గోదావరి విరుచుకుపడిరది. జూలై లో ఇవేపెద్ద వరదలు కాగా,10 రోజులుగా వరద నీటిలోనే నానుతున్న వందల గ్రామాలున్నాయి. ఈసారి వరదల్లో ప్రాణనష్టం నియంత్రించినా, అసాధారణ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భద్రాచలం దిగువన పోలవరం ముంపు మండ లాల నుంచి కోనసీమ లంకల వరకూ తీవ్రంగా వరద తాకిడికి గురయిన తరుణంలో నష్టపరిహారం మాటేమిటి? గోదావరి ఎగువన శాంతించినా.. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల్లో నీటి ప్రవాహం తగ్గకపోవడానికి కారణాలు ఏమిటి, అక్కడి ప్రజల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలుఉత్పన్న మవుతున్నాయి. గోదావరి నదికి భద్రాచలం వద్ద నమోదయిన నీటి మట్టం రికార్డుల ప్రకారం.. మొన్నటి జూలై 15నాటి వరద ప్రవాహం గడిచిన 70ఏళ్లలో మూడో అతిపెద్దది. అత్యధికంగా 75.6 అడుగుల నీటిమట్టం 1986లో నమోద య్యింది. ఆ తర్వాత 1990లో 70.8 అడుగులకు చేరింది. 2016లో 66.8 అడుగులకు మాత్రమే వరద చేరింది. ఈసారి మాత్రం అది71.9 అడు గులుగా నమోదు కావడంతో అతి పెద్ద వరదల్లో ఒకటిగా నిలిచింది. ఈసారి వరదల మూలంగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇదివరకు వరదల సమయంలో కరకట్ట తెగిపడిన సమయాల్లో తీవ్రం గా ప్రాణనష్టం సంభవించింది. 1986, 1990, 2006లో అలా జరిగింది. కానీ ఈసారి ఏటిగట్లకు అలాంటి సమస్య ఉత్పన్నం కాకపో వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఎన్నడూ లేనిరీతి లో ఈసారి వరద ప్రవాహం సాగింది. ఎక్కువ రోజులపాటు వరద కొనసాగు తోంది. ఇప్పటికే పదిరోజులు దాటిపోయింది. ఆగస్టు సీజన్‌ ముందుండడంతో మరి కొన్నాళ్లపాటు వరద తీవ్రత కొనసాగేలా కనిపిస్తోంది. ధవళే శ్వర్యం బ్యారేజ్‌ నుంచి 15లక్షల క్యూ సెక్కులపైగా ప్రవాహం వారానికిపైగా ఉంది.దీనివల్ల అపార మైన ఆస్తినష్టం జరిగింది.సామాన్యులు,తమఇళ్లు, వస్తువులు,పంటలు,పశుసంపదకోల్పోయారు. రోడ్లు,విద్యుత్‌లైన్లు,ఇతరరూపాల్లోనూనష్టం వాటి ల్లింది. ఈసారి నష్టంచాలాఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు ముందూ..ఆ తర్వాత
ఈసారి వరదల్లో మరో ముఖ్యమైన మార్పు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణం. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ప్రవాహం దిశ మారడం. గతంలో గోదావరి స్వేచ్ఛగా దిగువకు ప్రవహిస్తే ఈసారి అందుకు భిన్నంగా కాఫర్‌ డ్యామ్‌ కార ణంగా గోదావరి ప్రవాహం స్పిల్‌ వే మీదుగా సాగింది. కాఫర్‌డ్యామ్‌ కారణంగా గోదావరి వరద ప్రవాహానికి పడిన అడ్డంకితో ఎగువన ఏపీకి చెందిన8 మండలాలకు ముంపు బెడద పెరిగిందనే వాదన రెండేళ్లుగా వినిపిస్తోంది. ఈసారి ఏపీ పరిధిలోని ముంపు ప్రాంతాలకు తోడుగా తెలం గాణలోని భద్రాచలం,చర్ల,బూర్గంపహాడ్‌ వంటి ప్రాంతాలకు కూడా వరద తాకిడి పెరిగిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ వంటివారు విమర్శించారు. వరద ప్రవా హానికి పడిన అడ్డుకట్ట మూలంగా భద్రచాలం దగ్గర గోదావరి ఉధృతి తగ్గినా ముంపు మండ లాల్లో వరద ప్రభావం పూర్తిగా తగ్గడం లేదు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి కన్నా దిగువకు చేరినప్పటికీ పోలవరం ముంపు మండలాల్లో మాత్రం వరద తాకిడి కొనసాగుతోంది. చింతూరు ప్రధాన వీధుల్లో వరద ప్రవాహం సాగుతున్నతీరు అందుకు తార్కా ణంగా చెప్పవచ్చు. కూనవరం,వీఆర్‌పురం వంటి మండల కేంద్రాల్లో నడుం లోతు నీటి ప్రవాహంలోనే జనం కొట్టుమిట్టాడుతుండడానికి కాఫర్‌డ్యామ్‌ కారణమని స్థానికుడు వీరన్నదొర అన్నారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కు ముందూ, ఆ తర్వాత అన్నట్టుగా వరద ప్రవా హం చూడాలి. గతంలో ఇంతకన్నా పెద్ద వరదలు వచ్చినప్పుడు మాకు రెండు, మూడు రోజుల మించి తాకిడి లేదు. ఈసారి అలా కాదు. పది రోజులవు తున్నా నీటి మట్టం తగ్గడం లేదు. ఇళ్లన్నీ నీళ్లల్లో నానుతున్నాయి. కాబట్టి ఇకపై భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక దాటగానే మా ఇళ్లన్నీ మునిగిపోవడం ఖాయంగా ఉంది. పైగాప్రభు త్వం లెక్కలేసిన పోలవరం ముంపుకు మించి ఎక్కువ ప్రాంతాలు బ్యాక్‌వాటర్‌ పాలుకావడం అనివా ర్యంగా ఈవరదలు చాటుతున్నాయి’’ అని చింతూరు మండల కేంద్రానికి చెందిన టీచర్‌ ముడియం వీరన్న దొర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మార్కింగ్‌ వేసిన ప్రాంతాలను మించి వరద ప్రవా హం సాగడాన్ని చూస్తే తమకు ఏటా మూడు నెలలు వరద నీటిలో నానాల్సిన దుస్థితి తప్పేలా లేదు అంటూ ఆయన వాపోయారు.
పునరావాసమే పెద్ద సమస్య
పోలవరం ప్రాజెక్టు వద్ద 41.5అడుగుల వద్ద మొదటి కాంటూరుగా ప్రభుత్వం ప్రకటించింది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఆస్థాయిలో నీటిమట్టం ఉంటే ఎంత వరకూ ముంపు బారిన పడుతుందనే అంచ నాలు వేసింది. దానికి తగ్గట్టుగా మార్కింగ్‌ వేసి పునరావాసం, పరిహారం తొలుత వారికి అందిస్తా మని ప్రకటించింది. మొదటి కాంటూరు పరిధిలో ఉన్న వారికి ప్యాకేజీ అందించడమే ప్రధానమని చెప్పింది. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. మొదటి కాంటూరు పరిధిలో ఉన్న వారికి కూడాకాలనీల నిర్మాణం,పరిహారం అందించడం వంటి విషయాల్లో తీవ్ర జాప్యం జరుగు తోంది. ఇప్పటికే అనేక గడువులు దాటిపోయినా అది అమలు చేసిన దాఖలాలు లేవు. 2022 ఉగాది నాటికి పెట్టిన గడువు దాటి నాలుగు నెలలు గడు స్తున్నా అందులో కదలిక లేదు. ‘‘పోలవరం ముంపు మండలాల్లో నివాసయోగ్యత కనిపించడం లేదు. ఈ వరదలు అదే చెబుతున్నాయి. వరద నీరు ఎగువన తగ్గినా మారుమూల గిరిజన గ్రామాలే కాకుండా మండల కేంద్రాలు కూడా కోలుకోవడం లేదు. నీరు తగ్గడం లేదు. గతంలో ఎంత వేగంగా వరద వస్తే అంతే వేగంగా తగ్గేది. ఈసారి మాత్రం వరద తగ్గడం లేదంటే ఇక మా ఇళ్లల్లో మేము ఉండాలంటే కష్టమే. అందుకే ఖాళీ చేస్తామని చెబు తున్నాం. కానీ పునరావాసం ఇవ్వడం లేదు. మాకు ప్యాకేజీ ఇవ్వకుండా మా ఊళ్లను ముంచేశారు. మేము ఏమి చేయాలి?ఎక్కడికి పోవాలి? ఎలా బతకాలి? కనీసం కూడా ఆలోచించరా.. వరదల్లో ఇచ్చే సహాయంతో మా కుటుంబాలు గడిచిపో తాయా? ప్రభుత్వం ఆలోచించాలి’’ బాధితులు వాపోతున్నారు. చింతూరు మండలం వీరాపురం గ్రామానికి చెందిన సోమమ్మ ఇల్లు మొదటి కాం టూరు పరిధిలో లేదు. ఆమెకు పరిహారం లేదు. ఆమె ఇల్లు పది రోజులు దాటినా వరద నీటిలోనే ఉంది. దూరంగా ఎత్తైన ప్రదేశంలో టెంటు వేసు కుని ఆమె గడుపుతున్నారు. దిగువన ఉన్న వారికే పరిహారం అందించడంలో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని, ప్రభుత్వం తమను ఆదుకుంటుందనే నమ్మకం కలగడం లేదని ఆమె అన్నారు.
కొండమొదలు ప్రాంతంలో కొండలపైనే..
పోలవరం బ్యాక్‌ వాటర్‌ తాకిడికి తొలుత ప్రభా వితమయ్యే మండలాల్లో దేవీపట్నం కూడా ఒకటి. కానీ అక్కడ కూడా నిర్వాసితులకు పరిహారం పంపిణీ పూర్తికాలేదు. దాంతో భారీ వరద ప్రవా హంతో గ్రామాలకు గ్రామాలు గోదావరి వరద నీటిలో నానుతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు కొండలపై తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాల్లో గడుపుతున్నారు. కొండ మొదలు ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో రెండు వందల మందికిపైగా గిరిజనులు కొండలపై తల దాచుకుంటున్నారని,వారిని ఆదుకోవడానికి ప్రభు త్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘం నాయకుడు లోతా రాంబాబు కోరారు. ‘‘ఇకపై నివాసాలకు ఈ గ్రామాల్లో వీలుండదని వరద తాకిడి చెబుతోంది.ప్యాకేజీ ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసితులు అంటున్నారు. కానీ ప్రభు త్వం వాళ్ల ఇళ్లల్లోకి నీళ్లు మళ్లిన తర్వాత కూడా పునరావాసం ఏర్పాటు చేసేందుకు జాప్యం చేయ డం అమానవీయం. కాఫర్‌ డ్యామ్‌ పూర్తయిన తర్వాత ఏటా వరదల్లో మూడు, నాలుగు నెలల పాటు నరకయాతన పడుతున్న తీరు గమనించాలి. బాధితుల గోడుపై జగన్‌ పునరాలోచన చేయాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వరదలు తగ్గిన తర్వాత పునరావాసంపై దృష్టి పెడతామని అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ గాంధీ తెలిపారు. యంత్రాంగ మంతా వరద సహాయంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టిం దన్నారు.
దిగువన కూడా అంతే…
పోలవరం ప్రాజెక్టు దిగువన కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కాకినాడ జిల్లాలో కూడా ఈ వరదలు అపార నష్టానికి కారణమ య్యాయి. వివిధ వ్యవసాయ, ఉద్యానపంటలు తీవ్రంగా దెబ్బతి న్నాయి. వందల ఇళ్లు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో పశువులు వరద నీటిలో కొట్టుకు పోయాయి. ఈ వరద నష్టాలను పూర్తిగా అంచనా వేసేందుకు ఇంకా పరిస్థితి అనుకూలంగా లేదని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత నష్టం అంచనా వేసి అంద రినీ ఆదుకుంటామని ఆయన తెలిపారు. గతం కన్నా త్వరగా సీజన్‌ ఆరంభంలోనే వరదలు రావ డంతో అనేకచోట్ల పంటలకు ఎక్కువ నష్టం జరిగిం దని రైతులు అంటున్నారు.– జిఎన్‌వి సతీష్‌