అపూర్వ సాహితీ సింగిడి ఆదియోధులు

కప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుంటుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణ కలం నుంచి జాలువారిన ‘‘అపూర్వ సాహితీ సింగిడి ఆదియోధులు’’

సాధారణంగా గిరిజన సాహిత్యం అనగానే మౌఖిక మైనది అనే మాట పూర్వకాలం నుంచి మనకు అలవాటు. కానీ కాలంతోపాటు మానవ మనుగడలో వచ్చిన మార్పులు కారణంగా మన మూలవాసులైన ఆదివాసుల జీవన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. వాటికి కారణం గిరిజన విద్యా వికాసమే. గత నాలుగు దశాబ్దాలకు గిరిజనుల్లో అక్షరాస్యత రేటు గణనీయంగా పెరుగుతోంది. దరిమల గిరిజన యువత విద్యాధికులై ఉద్యోగాలు సాధించి ఉపాధి పొందడంతో పాటు తమ జాతి మూలాల్లోకి తొంగి చూసి వాటిని భావితరాల కోసం అందించాలనే ఆరోగ్య కరమైన ఆశయంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఆధునిక ఆదివాసి యువత విశ్వవిద్యాలయ స్థాయి చదువులతో ప్రామాణికమైన పరిశోధకులుగా,రచయితలుగా, సృజన కారులుగా ఎదుగుతున్నారు.ఈ ఒరవడి లో ఎదిగిన ఆదివాసీ వ్యాసుడే..‘‘ గుమ్మడి లక్ష్మీనారాయణ’’ విద్యార్థిగా సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ ఉంది. ఉపాధ్యాయ వృత్తిలో జీవనం గడుపుతూ ప్రవృత్తిగా వ్యాసరచన కొనసాగి స్తున్నారు. ఆయన వ్రాసిన వ్యాసాలను ఒక చోట చేర్చి ‘‘ఆదియోధులు -అజరాములు’’ అనే పేరుతో పుస్తకం ప్రచురించారు. మొత్తం 51 వ్యాసాలుగల ఈ ప్రామాణిక గ్రంథంలోని వ్యాసాలను రచయిత సౌలభ్యం కోసం మూడు వర్గాలుగా విభజించారు.ఆదివాసి వీర యోధులు,ఆదివాసి ఆత్మ బంధువులు,పురాణ ఆదివాసులు అని. అనుబంధంగా నాలుగు చిరు వ్యాసాల్లో గిరిజన ఉద్యమాలు కారణాలు, అంతరిస్తున్న గిరిజనజనాభా,చరిత్రలో ఆదివాసి ఘట్టాలను చేర్చారు. ఈ పుస్తకం రాయడంలో రచయిత పాటించిన నియమాలు విషయ వివరణలకు గమనిస్తే ఇది పక్కా పరిశోధక రచన అనుకోవడంలో సందేహం లేదు.తమ గిరిజన జాతి ఉద్ధరణ కోసం జీవితాలను త్యాగం చేసి వీరత్వం పొందిన ‘‘ఆదివాసి వీరయోధుల’’ త్యాగాల చరిత్రను నేటి తరంకు తెలిపే పరంపరలో భాగంగా ఆదివాసీ ధీరవనితలైన సమ్మక్క – సారక్కలు మొదలు నక్సల్‌ బరీ పోరాట వీరుడు ‘‘శాంతి ముండా’’ వరకు 17 మంది గిరిజన వీరుల విశేషాలు ఇందులో మనం చదువు కోవచ్చు. వీరులో ప్రాచుర్యం పొందిన బీర్సా ముండా, రాంజీగోండు, కొమరంభీమ్‌,దుర్గా వతి,వంటి వారి పోరాట విశేషాలుతో పాటు,మర్రి కొమర య్య,కుమరం సూరు, సోయం గంగులు, కుంజారాము వంటి నేటి తరానికి తెలియాల్సిన గిరిజన వీరుల వివ రాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక రెండవ వర్గంలో గిరిజనుల అభివృద్ధి కోసం తన జీవితాలను అర్పించిన గిరిజ నేతర వ్యక్తులతో పాటు మరికొందరు గిరిజనచరితార్ధులను వారి వారి కృషిని గురించి కూలంకషంగా సహేతుకంగా ఆధారలతో వివరించారు లక్ష్మీనారాయణ. అంబేడ్కర్‌,హైమన్‌ డార్ప్‌,మొదలుకొని మహస్వేతా దేవి,గిడుగు,బాలగోపాల్‌ వంటి పెద్దలు అడవి బిడ్డల ఉన్నతి కోసం ఏ విధంగా కృషి చేశారో ఇందులో వివరణాత్మకంగా వివరించారు.చివరి వర్గం అయిన ‘‘అజరామరులు-ఆదర్శ మహనీయులు’’లో అల్లూరి,మొదలు ఇటీవల పద్మశ్రీ పొందిన ‘‘సకినరామచంద్రయ్య’’ వరకు12 మంది స్ఫూర్తి ప్రదాతలకు కృషిని గురించిన వివరణ చేశారు. గిరిజన సామాజిక వర్గం నుండి తొలిసారిగా కలెక్టర్‌ ఉద్యోగం పొందిన మడవి తుకారాం, గిరిజనుల పాలిట ఆశాజ్యోతిగా వెలుగొందిన జంగుబాయి, గుస్సాడీ నృత్యానికి గురువుగా నిలిచిన కనకరాజు మొదలైన వారి జీవన విశేషాలు గణాంకాలతోపాటు వివరించి చెప్పారు. వ్యాసం అంటేనే విస్తృతమైన సమాచార ప్రవాహాన్ని స్వీకరించి, అవసరమైనంత మేర మాత్రమే సంక్షిప్తంగా, సూటిగా, సహేతుకంగా పాఠకులకు ఆసక్తికరంగా అందించడం, మరి ఇలాంటి ఉత్తమ లక్షణాలన్నీ మన ‘‘గుమ్మడి’’ వారి ప్రతి వ్యాసంలో కనిపిస్తాయి.వాక్య నిర్మాణం,భాష,గణాంకాలు,నిబద్ధత పాటిం చడంలో వ్యాసకర్త తీసుకున్న శ్రద్ధ ఆదర్శనీ యంగా ఉంది.విషయం సేకరించడంలో లక్ష్మీనారాయణ గారి కృషి నూతన వ్యాసకర్త లకు,పరిశోధక విద్యార్థులకు, అత్యవసరం అని చెప్పాలి. ఆదిలాబాద్‌ గిరిజన పోరాటం అన గానే వెంటనే కొమరం భీమ్‌ పోరాటం, అమరత్వం,గుర్తుకు వస్తాయి. కానీ వాటికం తటికి అసలు కారకుడు, పోరాట వ్యూహకర్త కొమరంసూరు,మాత్రం కొందరికే తెలుసు. గుమ్మడిగారి ఈ‘వ్యాస సంపుటి’ద్వారా ఇలాంటి చాలామంది ఆజ్ఞత వ్యక్తులు చేసిన కృషిని తెలుసుకోవచ్చు.అణగారిన వర్గాలైన ఆదివాసుల గురించి పరిశోధనలు,వార్తలు,విశ్లేషణలు మొదలైనవి తరచూ చూస్తూనే ఉంటాం. ఈ విషయంలో గిరిజనేత రులు చేస్తున్న నిస్వార్థ కృషిని సైతం గుర్తించిన సహృదయ రచయిత లక్ష్మీనారాయణ అనవచ్చు.అందులో భాగంగానే ఆదివాసి ఆత్మబంధువుగా మలిదశ తెలంగాణ పోరాటమార్గదర్శగ నిలిచిన ‘బియ్యాల జనార్ధన రావు’ అక్షర కృషిని కూడా ఇందులో వివరిం చారు.1985లో‘గిరిజన భూముల పరాయి కరణ’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్న జనార్ధన్‌ రావును ఆదివాసులపై పరిశోధన చేసిన ‘తొలి గిరిజనేతర పరిశోధకు డు’గా వ్యాసరచయిత సూత్రీకరించారు. గిరిజనులు అంటే పోరాటా లు,త్యాగాలేకాదుచక్కని సంస్కృతి సాంప్రదాయా లకు చిరు నామాదారులు.అందులో భాగంగానే పురాణాల్లో అడవి బిడ్డలస్థానం గురించి కూడా ఆసక్తికరంగా లక్ష్మీనారాయణ వివరించారు. భారతీయ చరిత్ర,సంస్కృతిలో ఆచార సంప్రదా యాలమేళవింపులో అంతర్భాగమైన ఆదివాసీ లకు చెందిన పదకొండు పాత్రులను ఎంచుకొని వివరించారు. వాల్మీకి నుండి నరకాసురుడు వరకుగల వ్యక్తులనువారి,వారి గుణగణాలు, చారిత్రక నేపథ్యాలు ఆధారంగా అభివర్ణిం చారు. భద్రాద్రి రామాలయం నిర్మాణానికి ప్రేరకురాలు అయిన రామ భక్తురాలు పోకల దమ్మక్క గిరిజన స్త్రీకాగ ఆమె పూర్వజన్మలో శబరి అని అక్కడి గిరిజనుల విశ్వాసంగా పేర్కొ న్నారు.అందుకు ప్రత్యేకంగానే ప్రతి ఏడాది ఆశ్వీజ మాసంలో భద్రాచలంలో ‘శబరి సంస్కృతి యాత్ర’ చేస్తున్నట్టుగానే ఆషాడ మాసంలో పోకలదమ్మక్క కి ఆధ్యాత్మిక పండుగ జరపాల్సిన బాధ్యత ఆప్రాంత వాసులది అని విలువైన సూచన చేశారు వ్యాసకర్త. అలాగే భారతంలోని భీముని భార్యగా చెప్పబడే ‘హిడిరబి’త్యాగశీలం,ఏకలవ్యుడి గురుభక్తి, ఎంతటి కోపా వేశాలనైనా తనశాంత గుణంతో మార్చే మహిమగల చెంచులక్ష్మి శాంత స్వభా వం వివరిస్తాడు.దుష్టుడైన హిరణ్యకశిపుని అంతంమొందించడానికి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తిన నారాయణమూర్తి ఉగ్రత్వాన్ని నివారించి అతడినే మనవాడిన చెంచులక్ష్మి శాంత స్వరూపం గురించి ఇందులో సహేతుకంగా వివరించారు.ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఆధారంగా సచిత్రంగా అందించబడ్డ ఈపుస్తకం పరిశోధక విద్యార్థు లకు ఎంతో ఉపయోగంగాఉంటుంది. అలాగే మానవజాతికి ఆధారమైన మూల వాసులు గా చెప్పబడే గిరిజనుల విశేషాలు తెలుసుకోవాలి అనుకునే వారికి కూడా ఈపుస్తకం ద్వారా అనేక విషయాలు,విశేషాలు లభ్యమవుతాయి. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)