తెరపైకి మ‌ళ్లీ ఉత్త‌రాంధ్ర అణువిద్యుత్ కుంప‌టి

ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుకు గుర య్యాయి. ప్రగతి అన్నది ఎరగనివి. వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఉత్తరాంధ్ర నెత్తిన అణు కుంపటి పెట్టి…ప్రజలకు కంటి నిండా కునుకు కూడా లేకుండా చేయనున్నాయి. కొవ్వాడపై ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 1208మెగావాట్ల సామర్ధ్యంతో 6 రియా క్టర్లతో కూడిన అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయం గా ఆమోదించిందని…పిఎంఓ కార్యాల యం సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.
అణు ప్రమాదాల నష్టాన్ని పూడ్చుకునే సామ ర్థ్యం అభివృద్ధి చెందిన దేశమైన జపాన్‌ కే లేకుండా పోయింది. అలాంటిది మన దేశం ఇటువంటి విపత్తులను తట్టుకోగలదా? అసలు ఒక దివాళా తీసిన కంపెనీతో ఒప్పందం చేసుకోవడమేమిటి? ప్రపంచమంతా నిషేధిస్తున్న అణు విద్యుత్‌ మనకు అవసరమా? ఇవన్నీ తెలిసి కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు ఉవ్విళ్లూరుతోంది? ఇతరరాష్ట్రాలు నిరా కరించిన అణు విద్యుత్‌ ప్లాంట్‌ పట్ల జగన్‌ ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి. కేంద్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్‌ లోని మితివిర్ధిలో అణు విద్యుత్‌ కేంద్రం పెట్టాలని 2007లో నిర్ణయించింది. 2013 నాటికి పర్యావరణ,అటవీ అనుమతులు పొందింది. అయినా ఆగమేఘాల మీద2016 జూన్‌4వ తేదీన మితివిర్ధిలో నిర్మించాలనుకున్న అణు విద్యుత్‌ కేం ద్రాన్ని కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంజిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం ? ప్రపంచంలోనే అణువిద్యుత్‌ పరిశ్రమలు ఎక్కడా పెట్టడంలేదు. అణువిద్యుత్‌ కేంద్రాల్లో భద్రత లేదని ప్రపంచంలోని అణు నిపుణులు వక్కాణిస్తున్నారు. పార్లమెంట్‌లో మనరాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అడిగినప్రశ్నకు వెస్టింగ్‌హౌస్‌ అనే అమెరికా కంపెనీతో ఒప్పందంఖరారు చివరి దశలోఉందని ప్రభుత్వం తనసమాధానంలో తెలిపింది. ఈ కంపెనీ అమెరికాలో దివాళాతీసి ఐ.పి పెట్టింది. అలాంటి కంపెనీతో నేడుమోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఎలాఅర్థం చేసు కోవాలి? ఈఒప్పందంలో మరో ప్రమాదక రమైన అంశమేమిటంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే,ఆకంపెనీకేమీ సంబంధం ఉండదట! బహుళజాతి సంస్థల బండారం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇటీవలి విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌ ఉదంతం మన ముందే ఉంది. 1984లో భోపాల్‌లో జరిగిన ఘోర గ్యాస్‌ లీకు ప్రమాదానికి సంబంధించి ఇదే అమెరికాకు చెందిన యూనియన్‌ కార్బైడ్‌ బహుళజాతి సంస్థ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా నేటికీ పూర్తిగా పరిహారం చెల్లించలేదు. వారు చెల్లించక,మన ప్రభుత్వాలూ పట్టించుకోక పోవ డంతో నేటికీ వేలాది మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ బాధపడుతూనే ఉన్నారు. అదే విధంగా అమెరికాలోని ఐస్లాండ్‌,రష్యాలోని చెర్నో బిల్‌, 2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో జరిగిన ప్రమాదంతో ఆరాష్ట్రమంతా తీవ్రంగా నష్ట పోయింది. పూర్తిగా వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆ రాష్ట్రంలో రేడియేషన్‌వల్ల గాలి,భూమి, నీరు విషతుల్యం అయ్యాయి. ఈవిస్ఫోటనం తర్వాత ఏ దేశంలోను అణు విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు. ఇప్పటికేవున్న అణు విద్యుత్‌ కేంద్రా లను అనేక దేశాలు మూసివేస్తున్నాయి. మనకు రియాక్టర్లను ఎగుమతి చేస్తున్న అమెరికా తమ దేశంలో 4విద్యుత్‌ కేంద్రాలు మూసివేసింది. జపా న్‌లో 2 అణు విద్యుత్‌ కేంద్రాలు తప్ప మిగిలినవన్నీ మూసివేయడం జరిగింది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగితే 170కిలోమీటర్లు విస్తరించి దక్షిణాన కాకినాడ,ఉత్తరాన ఒడిషా లోని చత్రపూర్‌ వరకు జీవకోటి నశిస్తుంది. ఈ ప్రాం తాన్ని సర్వనాశం చేస్తుంది. ఒకేచోట 6 రియాక్టర్లు పెట్టడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. వెస్టింగ్‌ హౌస్‌ ఉత్పత్తి చేసే ఎ.పి1000అనే రియాక్టర్లు ఇంత వరకు ప్రపం చంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలా లేదు. ఎక్కడా పరీక్షించని రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన అమెరికా రుద్దుతున్నది. అమెరికా కోసం భారత ప్రయోజనాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయి. పైగా1208 మెగావాట్ల సామ ర్ధ్యంతో 6 రియాక్టర్లతో కూడిన ఈఅణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుతో 8వేల మందికి ఉపాధి దొరుకు తుందని సాకుగా చూపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తూ ప్రత్యక్షంగా 30 వేల మందికి,పరోక్షంగా లక్షమందికిపైగా ఉపాధి కల్పిస్తున్న విశాఖస్టీల్‌ ప్లాంటును ఎలాగైనా అమ్మి తీరుతామని చెబుతూనే మరోవైపు అత్యంత ప్రమా దకరమైన అణువిద్యుత్‌ కేంద్రంతో 8వేల మందికి ఉపాధి కల్పిస్తామనడంపూర్తిగా అసంబద్ధం కాదా? అణువిద్యుత్‌ కేంద్రాలకు పెట్టుబడి బాగాఅధికం. ఒక మెగావాట్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తికి రూ.48 కోట్లు ఖర్చు అయితే ఒకమెగావాట్‌ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.5కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్‌ టెక్నాలజీ నేడు బాగా అభివృద్ధి అవుతున్నది. పర్యా వరణ సమస్య వుండదు. విండ్‌ టెక్నాలజీ కూడా నేడు అభివృద్ధి చెందుతున్నది. పర్యావరణ సమస్య లేని విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.
ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర ప్రభుత్వం అణు విద్యుత్‌ కేంద్రాన్ని అంగీకరించకూడదు. కేంద్ర ప్రభుత్వనిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తేవాలి. రాష్ట్రానికి తీవ్ర ప్రమాదకారి అయిన అణు విద్యుత్‌ కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు,మేధావులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించాలి.ప్రజలకు చౌకగా విద్యుత్‌ను అందించగలిగే పర్యావరణ హితమైన పవర్‌ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
‘‘రేపు అణు విద్యుత్‌ కేంద్రం వస్తే మీ ఊరే ఎగిరి పోతుంది…ఇంకా రోడ్లెందుకు, స్కూళ్లెందుకు?’’
మీగ్రామం భవిష్యత్తులో మాయమై పో తుంది. అలాంటి గ్రామానికిరోడ్లు,కాలువలు వేయ డం ఎందుకు దండగ.ఇదేమాట గత ఐదేళ్లుగా అధికారుల నోటవింటున్నాం.కానీ,మా గ్రామం మాయమైపోలేదు. ఊరు అభివృధ్ది జరగలేదు’’- ఇది కొవ్వాడ మత్స్యలేశం గ్రామస్థుల ఆవేదన కొవ్వాడ మత్స్యలేశం (కొవ్వాడ)ఒకమత్స్యకార గ్రామం. ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండ లంలో ఉంది. దేశంలోనే అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతోంది.‘‘మాఊరిలో కరెంట్‌ కంపెనీ వస్తుందని చెప్పారు. అందరు భూములు,ఇల్లు ప్రభుత్వానికి అప్పగించేస్తే… అం దుకు డబ్బులు ఇచ్చి, మరొక చోట ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. కొందరం ఒప్పుకున్నాం, మరికొం దరం ఒప్పుకోలేదు. అలా కాలం గడుస్తున్న కొద్దీ మెల్లగా అందర్ని ఒప్పించారు. మీ అందర్ని ఇక్కడ నుంచి తీసుకునివెళ్లి మరోచోట పెడతామని చెప్పా రు. చెప్పి ఆరేడేళ్లు అవుతోంది.కానీ ఇప్పటి దాక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోవడమే కానీ… అసలేం జరుగుతోందో మాకు తెలియడం లేదు. వాళ్లు అన్నట్లుగానే మాగ్రామం ఎప్పుడు మాయమ వుతుందా అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.మాపరిస్థితి ఏంటోఅర్థం కావడం లేదు’’ అని 52ఏళ్ల కొవ్వాడ వాసి రాము ఎదుట వాపోయారు.
ఆరు రియాక్టర్లతో అణు విద్యుత్‌ కేంద్రం
కొవ్వాడలో దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.ఈఒప్పందంలో భాగం గా అణు విద్యుత్‌ ప్రాజెక్టును కొవ్వాడ, దాని పరిసర గ్రామాల్లో నిర్మించేందుకు భూ సేకరణ చేయాలని నిర్ణయించారు. ఇక్కడే ఆరురియాక్టర్లతో అణు విద్యు త్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా తీర ప్రాంతంలో 2400ఎకరాల్లో విస్తరించి ఉన్న కొవ్వా డ,కోటపాలెం,రామచంద్రపురం,గూడెం,టెక్కలి, గ్రామాలను ఖాళీ చేయించేందుకు నిర్ణయించారు. ఇక్కడే అణు విద్యుత్‌ కేంద్రం రియాక్టర్లు, ఉద్యోగుల కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. ఇదంతా 2012 నుంచి జరిగి,2017 నాటికి ఈ గ్రామా లను ఖాళీచేయించి,పునరావాస కాలనీలకు తరలిం చాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆ తేదీ దాటి ఐదేళ్లయినా…
అణు విద్యుత్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూ సేకరణ జరిగి, నిర్వాసితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఇచ్చి…వారిని పునరావాస కాలనీలకు తరలించేందుకు కటాఫ్‌ తేదీ2017 ఏప్రిల్‌ 30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీ దాటిపోయి ఐదేళ్లు కావస్తోంది. అయినా ఎక్కడ గ్రామాలు అక్కడే ఉన్నాయి. ‘‘మమ్మల్ని పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు.అసలు ప్రాజెక్టు పనులే ప్రారంభం కాలేదు. పైగా మాకు ఇస్తామన్న ప్యాకేజీ లు సైతం ఇంకా అందరికి అందలేదు. మొత్తం రూ.18 లక్షలు ఇస్తామన్నారు. అలాగే కటాఫ్‌ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు సైతం ప్యాకేజీ వర్తింపజేస్తామన్నారు. ఆతేదీకి 18ఏళ్లు దాటిన వాళ్లకి ప్యాకేజీ ఇవ్వలేదు. పైగా అనుకున్న తేదీకి తరలించకపోవడంతో…గ్రామంలో చాలా మందికి 18ఏళ్లు వచ్చాయి. వీరికి ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వా లని డిమాండ్‌ చేస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించడమో,లేదా మాగ్రామాల్ని అభివృద్ధి చేయ డమో చేయాలి’’అని పెదకొవ్వాడ నివాసి మంగ రాజు చెప్పారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ సాకుతో అభివృద్ధి చేయడం లేదు’’
అణు విద్యుత్‌ ప్లాంట్‌ పరిధిలో సుమారు 8వేల మంది గ్రామస్థులు ఉన్నారు. వీరందరూ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇల్లు సరిపోక పోయినా,కట్టుకునేందుకు డబ్బులున్నా, మరొక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు.‘‘ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది.గోడలు బీటలు వారాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కన్నాలుపడి, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. గ్రామంలోనిరోడ్ల పరిస్థితి అయితే దారుణం. ఇక విద్యుత్‌, కాలువలు లాంటి మౌలిక సదుపాయాలు వైపు ఏఅధికారి చూడటం లేదు. కారణమడిగితే రేపో మాపోమాయమైపోయే గ్రామం,దీనికి సౌకర్యా లేందుకు,డబ్బులువృథా అని అంటున్నారు. అలాగని తరలించడమూ లేదు’’ అని మత్స్యకార నాయకుడు బి.రాంబాబు చెప్పారు.‘‘అభివృద్ధి పనులైతే లేవు. కటాఫ్‌ డేట్‌ నుంచి అధికారులకు మా గ్రామాలంటే చిన్నచూపు అయిపోయింది. ఆతేదీ నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. పునరా వాస ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన డబ్బులు ఖర్చవు తున్నాయి. కాలనీలు ఇంకా ఇవ్వలేదు. పోనీ ఇల్లు సరిపోవడంలేదు,మరోగదో,చిన్న ఇల్లో కట్టుకుందా మంటే…అది వృథాఅయిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ప్రభుత్వం పునరావాస కాలనీలు, ప్యాకేజీల అం శాన్ని క్లియర్‌ చేసి తరలించక పోతే… ఆందోళ న చేస్తాం’’ అని రాంబాబు అన్నారు.
భూసార పరీక్షలు అడ్డుకున్నందుకు అరెస్టులు
నిర్వాసితుల్లో కొందరికి ఇంకా ప్యాకేజీ డబ్బులు అందలేదు. వాటిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరు.పైగా ఊర్లో రెండేళ్లుగా పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తు న్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అరెస్ట్‌ చేశారని అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాసితుల్లో ఒకరైన అప్పన్న చెప్పారు.‘‘ప్లాంట్‌ కు సంబంధించిన పనుల్లో భాగంగా నిర్వాసితగ్రామాల్లో ఎక్కడోఒకచోట రోజూ భూసార పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని సార్లు వాటిని అడ్డుకుంటే మాపై కేసులు పెట్టారు. మాకు ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా మా మీదే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ…మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించ నైనా,తరలించాలి. లేదంటే మా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటాం’’ అని అప్పన్న తెలిపారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ వద్దే వద్దు’’
కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్లాంట్‌ వద్దం టూ వామపక్షాలు,ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్రను నాశనం చేసే కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.‘‘అమెరికా ఆర్థిక సహాయంతో కొవ్వాడలో కేంద్రం తలపెట్టిన అణువిద్యుత్‌ ప్లాంట్‌ ఉత్తరాంధ్రలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ అణువిద్యుత్‌ను వదలి…ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తుంటే, భారత దేశంలో మాత్రం అణు విద్యుత్‌ ప్లాంట్లను ఎందుకు ప్రొత్సహిస్తున్నారు? ప్రమాదకరమైన వీటిని వెంటనే రద్దు చేయాలి. లేనిపక్షంలో అన్ని పార్టీలు, సంఘాలతో ఉద్యమిస్తాం’’ అని సీపీఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు చెప్పారు. బొగ్గు, గ్యాస్‌, జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి వాడే ఐదోపెద్ద వనరు అణు విద్యుత్‌. ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం.దానిసామర్థ్యం రెండు వేల మెగావాట్లు.కొవ్వాడలో రూ.61వేల కోట్ల అంచనా వ్యయంతో ఆరుఅణువిద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ ప్రాజెక్టు ఇదే. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా,అమెరికా రియాక్టర్‌ల నిర్మాణ సంస్థ వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీల మధ్య కొవ్వాడలో ఆరు అణు విద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.బొగ్గు,గ్యాస్‌,జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ఉత్పత్తికి వాడే ఐదో పెద్ద వనరు అణు విద్యుత్‌.ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం. దాని సామర్థ్యం రెండు వేల మెగావాట్లు. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం సామర్థ్యం(ఒక్కొక్కటి1208 వీఔ చొప్పున్న 6రియాక్టర్లు)7,248 మెగావాట్లు. ఇది పూర్తయితే దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రమవుతుంది. ఇది దేశంలోని 22 ఆపరేషనల్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్లలో 6.780 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ. (ఈ సమాచారం పార్లమెంట్‌ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హరావు అడిగిన ప్రశ్నకు సహాయమంత్రి జితేం ద్రసింగ్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా 31.03. 22 తేదీన తెలిపినది)
శరవేగంగా పనులు జరగాలి: ప్రత్యేక అధికారి
కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణా నికి అవసరమైన భూసేకరణ చాలా వరకు పూర్తయి నట్లు శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అణు విద్యుత్‌ కేంద్రం ప్రత్యేక అధికారి ఎం.విజయ సునీత తెలిపారు. కోర్టుకేసులు,పునరావాస ప్యాకే జీల క్లియరెన్స్‌ ఆలస్యం కారణాంగా కొంత భూ సేకరణ మిగిలి ఉందని, న్యూక్లియర్‌ ప్లాంట్‌ కు అవసరమైన 2060 ఎకరాల భూమిలో 1480 ఎకరాలు ఇప్పటికే సేకరించామని తెలిపారు. ‘‘కొవ్వాడలో మౌలిక సదుసాయాలపై కూడా దృష్టి పెట్టాం. ప్లాంట్‌ పనుల ప్రారంభంలో ఆలస్యం జరగడంతో అది గ్రామంలోని మౌలిక సదుపాయల కల్పన పై ప్రభావం చూపింది. ప్లాంట్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అంతలోపు… తాత్కలిక మౌలిక సదుపాయలను కల్పిస్తాం. త్వరి తగతిన ఈ ప్రాజెక్టుపూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.నిర్వాసితులను ఎచ్చర్ల వద్ద ధర్మా వరంలో నిర్మించే నిర్వాసిత కాలనీలకు తరలిస్తాం’’ అని విజయ సునీత చెప్పారు.-(అల్లు రాజు)

వ‌ల‌స ప‌క్షులు…మ‌న అతిథులు

ఈ సృష్టిలో పక్షులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పురాణాల్లో దైవ స్వరూపంగా భావించే పక్షలు మానవుని స్వార్థానికి బలైపోతున్నాయి. పక్షులు సహజ సిద్ధంగా ఏర్పడే ఆహారం.. ఆవాసం.. సంతానోత్పత్తి కోసం ఒక చోట నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటాయి. కొన్ని వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించి సురక్షిత ప్రాంతంలో కొంత కాలం పాటు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. వలస పక్షులను పరిరక్షించుకోవడం కోసం ఐక్యరాజ్య సమితి వలస పక్షుల దినోత్సవం నిర్వహిస్తున్నది. ఏలూరు జిల్లా కొల్లేరు ఒకప్పుడు వలస పక్షుల నిలయం.. ఇప్పుడు కొల్లేరులో పక్షులు లేవు.. వేట, ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధిక గాడతతో కూడిన క్రిమి సంహార మందుల వాడకం వల్ల పక్షుల సంతతి అంతరించి పోతున్నది. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం.. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం…
వలస పక్షల సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం మేనెల రెండవ శనివారం, అక్టోబర్‌ నెల రెండవ శనివారాలను ప్రపంచ వలస పక్షుల దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. 2010 నుంచి వలస పక్షుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తు న్నారు. ‘ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి పక్షులను సంరక్షించుకుందాం’ అనేది 2019 ప్రపంచ వలస పక్షుల దినోత్సవ ముఖ్య నినాదం..
పక్షులు ఎందుకు వలస వెళతాయంటాయి?
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు తమ సంతానోత్పత్తి కోసం,శీతాకాలంలో తమ ప్రాణ రక్షణ కోసం వలసలకు సిద్ధపడుతుంటాయి. వేలాది కిలో మీటర్లు ఆకాశ మార్గంలో ప్రయాణించి తమ సంతానోత్పత్తికి అనువైన సురక్షిత ప్రాంతాలను అన్వేషించి అక్కడ కొన్ని నెలలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ధృవ ప్రాంతాల నుంచి శీతాకాలంలో పక్షులు తీవ్ర చలిగాలుల నుంచి రక్షణ కోసం అనువైన ప్రాంతాలకు వలసలు కడతాయి. పక్షులు ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక సమయంలో ప్రత్యేక ప్రాంతానికి వలసలు కడతాయని పరిశోధకులు చెబుతున్నారు. వలస పక్షులు ప్రత్యేక దారుల గుండా సూర్యగమనం, చంద్రగమనం ఆధారంగా తమ వలస ప్రాంతాలకు దారుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర ధృవం నుంచి ధక్షిణ ధృవానికి సైబీరియన్‌ ప్రాంతం నుంచి పక్షుల వలసలు సాగుతుంటాయి .పక్షులు ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి అంటార్కిటికా ప్రాంతానికి వలసలు సాగిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు తొమ్మిది ప్రాముఖ్యత గల వలస పక్షులదారులను గుర్తించారు. ఉత్తర దిక్కు నుంచి చలికాలంలో దక్షిణ దిక్కున గల ఉష్ణ మండల ప్రాంతానికి వచ్చి గుడ్లు పొదిగి పిల్లలతో తిరిగి తమ ప్రాంతానికి సురక్షితంగా వెళ్తాయి. హిమాలయాలు,ఆండిస్‌ పర్వత ప్రాం తాల్లో కూడా వలస పక్షలు నివాసాలు ఏర్పరుచుకుంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వలస పక్షుల కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌ వలస పక్షులకు నిలయం. పర్యా వరణహితంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర ప్రాంతంలో వలస పక్షుల కేంద్రాలు కోకోల్లలుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తేలినీలాపురంలో ఫెలికాన్‌,గుడాబాతు పక్షులు రష్యాలోని సైబీరియన్‌ ప్రాంతం నుంచి వలస వస్తుంటాయి. కృష్ణాగోదావరి జిల్లాల మధ్య ఉండే కొల్లేటి ప్రాంతంలో ఫెలికాన్‌,నైటికేల్‌,టిల్ట్‌ పక్షులు ఆస్ట్రేలియా,ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చి కొన్ని నెలల పాటు సేదతీరుతుం టాయి.పులికాట్‌ తీరంలో ఫ్లెమింగో పక్షుల కేం ద్రం ఎంతోఆహ్లాదకరంగా ఉంటుంది.నెల్లూరు జిల్లాలోని నేలపాడులో ఫ్లెమింగో,హేలాన్‌ పక్షు లు వలస వచ్చి సేదతీరుతుంటాయి
కొల్లేరు వలస పక్షుల స్వర్గ ధామం
కొల్లేరు ప్రాంతం వలస పక్షులకు స్వర్గ ధామం గా నిలుస్తుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్ప డిన కొల్లేరు 72కిలోమీటర్ల వైశాల్యంతో సహజ సరస్సుగా ఏర్పాడటంతో సుదూర ప్రాంతాల నుంచి పక్షులు కొల్లేటి తీరానికి అక్టోబర్‌ నెలలో వచ్చి ఐదు నెలల పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చి నెలలో పిల్లలను తీసుకుని తమ సొంత ప్రాంతానికి పోతుంటాయి. ఆసియా,ఆస్ట్రేలియా ప్రాంతాల నుంచి వచ్చే ఫెలికాన్‌,గుడాబాతు, నత్తకొట్టు,చింతఉప్పు,చిట్టిబెల్ల గువ్వాపక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఫెలికాన్‌తో పాటు టిల్ట్‌,వైట్‌ టైల్‌,భార్గని,రిటెల్‌ గ్రీబ్‌,ఫ్లోవర్‌ మొద లైన పక్షులు హిందూ మహాసముద్రం,బంగాళా ఖాతం మీదుగా ప్రయాణించి కొల్లేరు చేరు కుం టాయి. 2021పక్షుల లెక్కల ప్రకారం కొల్లేటి తీరంలో5నుంచి8ల క్షల వరకు 120రకాల పక్షుల ఆవాస ప్రాంతంగాఉందని లెక్కల్లో తేలింది.
ప్రమాదం అంచున పక్షులు
ప్రపంచ వ్యాప్తంగా పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. ప్రతీ సంవత్సరం ఒక మిలియన్‌ పక్షులు మానవుని స్వార్థానికి బలవుతున్నాయి. మానవుడు ప్రతీ సంవత్సరం 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసి ఉపయోగించుకుని భూమిపై, నీటి వనరుల్లో వదిలేస్తున్నాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు మంచినీటి వనరులను సముద్రాల్లో విపరీతంగా కలవడం వల్ల పక్షు లకు సహజసిద్ధ ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ను స్వీక రిస్తున్నాయి. ఆస్ట్రేలియా,అమెరికా తీరాల్లో వలస పక్షులు ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిని వంద లాదిగా మృత్యువాతకు గురవుతున్నాయి. పక్షి పరిశోధకులు మృత్యువాత పడిన పక్షులను కోసి చూస్తే వాటి పొట్ట నిండ ప్లాస్టిక్‌ వ్యర్థాలేఉండ టం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వ్యవ సాయ క్షేత్రాల్లో అధిక గాడతతో కూడిన క్రిమి సంహారక మందులు పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో కొంత మంది వేటగాళ్లు శీతాకాల ప్రాంతంలో విషపు ఎరలు పెట్టి వందలాది పక్షులను అంతం చేసున్నారు.
ఫ్లెమింగో పక్షులు మనుగడ ప్రశ్నార్ధకం
జీవ వైవిధ్యానికి ముఖ్యంగా మానవ మనుగ డలో ముఖ్యపాత్ర వహిస్తున్న అనేక లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్ర ప్రమాదాన్ని కలుగచేస్తున్నాయి. విద్యుత్‌లైన్లకూ ట్రాన్స్‌ఫా ర్మర్లకు, ఎత్తయిన విద్యుత్‌ స్తంభాలకు తగిలి విద్యుత్‌ఘాతంతో పక్షులు ప్రానాలు కోల్పో తున్నాయి. ఇదేగాక బొగ్గు,నీరు,జీవఇంధనం, సముద్రం,సౌరశక్తి, పవనశక్తి ఉపయోగించి నిర్మించే విద్యుత్‌ కేంద్రాల వలన పక్షులు తమ నివాసాలను, సంతానోత్పత్తి, ఆహార స్థలములను కోల్పోవడం గాని పాడయి పోవటముగాని జరుగుతున్నది. తరగని వనరులు ఉపయోగిం చుట వలన కర్బన ఉద్గారాలు ఉత్పత్తి కాకుండా కొంత మేలయినప్పటికీ విద్యుదుత్పత్తి ప్లాంటు నిర్మాణానికి,విద్యుత్‌ సరఫరాకు సరిjైు్నన ప్రణాళిక, డిజైను రూపకల్పన,నష్టాలను అంచనా వేయటం లేదు. దీనివలన జీవ వైవి ధ్యానికి ముప్పు వాటిల్లటమే కాకుండా లక్షలాది స్థానిక, వలస పక్షులకు తీవ్రప్రమాదం కలుగుతోంది.ఫ్లెమింగోలు,స్టార్కు జాతి కొంగలు పెలికాను పక్షులు, గ్రద్ధ జాతి పక్షులు, ఇతర అనేక జాతుల పక్షులు వాటి సుదూర ప్రయా ణంలో విద్యుత్‌ తీగల గ్రిడ్‌లకు తగిలి విద్యుద్ఘా తముతో చనిపోతున్నాయి. 2011 సంవత్సరం నాటికి ప్రపంచం మొత్తం మీద 70మిలియన్ల కిలోమీటర్ల పవర్‌ లైన్లు ఉన్నట్టుగా అంచనా వేయబడినది.వలస పక్షులకు ఇప్పటికే వాటి నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాలు సంతా నోత్పత్తి ప్రదేశములు నశించి పోవటం,పాడై పోవటం,గ్లోబల్‌ వార్మింగ్‌వల్ల ముప్పు వాటిల్ల డమే కాకుండా అదనంగా విద్యుత్‌ ఘాతము వలన వాటికి కలిగే ముప్పు తీవ్రతరమౌతున్నది. ఇదిపెద్ద పక్షి జాతులు నశించి పోయేందుకు కారణం. ప్రకృతి సిద్ధంగా వాటి సంతానోత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, పెద్ద పక్షులు చనిపో వుట వలన వాటి గుడ్లు పాడై పోవటం,గూటి లోని పిల్లలు చనిపోవటం జరుగుతూ కొన్ని జాతులకు ముప్పు ఏర్పడుతోంది. తూర్పు ఐరోపాలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని ‘జాన్‌ ఒసల్లివాన్‌’ రాయల్‌ సొసైటీ పక్షుల పరిరక్షణ సంస్థ మాజీ సభ్యులు తెలిపారు. దక్షిణ ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం 12శాతం ‘బ్లూ క్రేన్స్‌’ (ఆ దేశ జాతీయ పక్షి) విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నట్లుగా తెలిపారు. ఇండియాలోనూ, ఆఫ్రికాలోనూ అధిక మొత్తం లో ఎలక్ట్రిక్‌ పవర్‌ లైనులు వేస్తుండటం వలన ఈ సమస్య తలెత్తబోతుందని తెలిపారు. అయితే ఇండియాలో కూడా ఈసమస్య ఇప్పటికే ఉన్నది. గుజరాత్‌లో ప్రతి సంవత్సరం కొన్ని వందల ఫ్లెమింగో పక్షులు విద్యుత్‌ ఘాతము వలన చనిపోతున్నాయి. ఈవిద్యుత్‌ తీగలను ఫ్లెమింగో పక్షుల నివాస ప్రదేశాలు, ఆహార ప్రదేశాల గుండాను, పక్క నుంచి నిర్మించుట వలన వాటి తలల విద్యుత్‌ తీగలకు గుద్దుకొని చనిపోతు న్నాయి. ఈఫ్లెమింగో పక్షులు వందలు,వేల సంఖ్యలో ఉండి రాత్రి సమయాలలో కూడా ప్రయాణిస్తుండడం వలన కరెంటు తీగలకు చనిపోతున్నాయి. ఊర కుక్కలు వీటి ప్రదే శాలలో చేరి వీటిని చిందరవందర చేయుట వలన ఆ గాభరాలో విద్యుత్‌ తీగలకు గుద్దుకొని మరణిస్తున్నాయి. మన దేశంలో రాబందుల సంఖ్య తీవ్ర ప్రమాద స్థాయికి తగ్గిపోవుటకు కారణాలలో విద్యుత్‌ తీగలే ప్రధానం. అమెరికా, యూరప్‌లలో ఎండిపోయిన ప్రదే శాలలో విద్యుత్‌ ఘాతముచే మంటలతో కాలి పడిపోయిన పక్షుల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్టుగా ప్రిన్సన్‌’ అనే అధ్యయనవేత్త తెలిపారు. విండ్‌ పవర్‌వల్ల కూడా పక్షులు చని పోతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో అధ్యయనం జరిగినట్లుగా భారత దేశంలో అధ్యయనం జరగకపోవడం విచారకరం. పక్షులకు జరిగే తీవ్ర నష్టాన్ని తగ్గించడానికి వాటి సంతానో త్పత్తి, ఆహార ప్రదేశాలకు,నివాస ప్రదేశాలకు దూరంగా విద్యుత్‌ లైనులు నిర్మించాలి. ఇన్సులేటెడ్‌ వైర్లను ఉపయోగించాలి. బల్గేరి యాలో 2009-2013 మధ్యలో గుర్తింపబడిన ‘ఈస్ట్రన్‌ ఇంపీరియల్‌ ఈగల్స్‌’ 67శాతం వరకు విద్యుత్‌ ఘాతం వలన మరణించాయి. అదే విధంగా సూడాన్‌లో కూడా ‘ఈజిప్షియన్‌ వల్చర్సు’ కూడా విద్యుత్‌ తీగల వల్ల చనిపోతు న్నాయి. దాంతో సూడానీస్‌ ఎలక్టిక్ర్‌ కంపెనీ, బల్గేరియా పక్షుల సంరక్షణ సంఘం ఇన్సులేటెడ్‌ తీగలను అమర్చి పక్షులను తీవ్ర ప్రమాదం నుంచి రక్షించడం గొప్ప విషయం. కావున జీవ వైవిధ్యంలో, మానవుని మనుగడలో ముఖ్యపాత్ర వహిస్తున్న పక్షులను రక్షించుటకు, వాటి ఆహార, నివాస, సంతానోత్పత్తి ప్రదేశాలను రక్షించుటకు వీలుగా విద్యుత్‌ ప్లాంట్లు, విద్యుత్‌ లైనుల రూపకల్పన, నిర్మాణం జరగాలి.
వలస పక్షుల దినోత్సవం ప్రత్యేకత
యూనెస్కో 2006 నుంచి వలస పక్షుల దినోత్స వాన్ని నిర్వహిస్తోంది. పక్షుల అవసరాలు, అల వాట్లు, వలస వెళ్లే ప్రాంతాల్లో వాటికి ఎదురవు తున్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారా నికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వలస పక్షుల ప్రదేశాల రక్షణ గురించి ప్రచారం చేస్తూ స్తానికుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు వ్యర్థ పదా ర్ధాలు, కాలుష్యం వంటి కారణంగా నష్టం జరుగుతుంది. రోజురోజుకు పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. ప్లాస్టిక్‌, ఇతర వస్తువు లను ఇష్టానుసారం వేయకుండా వలస పక్షులను కాపాడాల్సిన బాధ్యత కూడా పర్యాట కులపై ఉందంటూ సూచించింది యూనె స్కో. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పక్షులకు విరామ స్థలాలుగా ఉంటున్నాయి. పలు వారసత్వ ప్రదేశాల్లో జల కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్లాస్టిక్‌, పారి శ్రామిక వ్యర్థాలు పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. –(కోకా మృత్యుంజయరావు/ ముప్పళ్ళ అప్పారావు)

నైజరు తేనె

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజుథింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన సుప్రిసిద్ద సాహితీవేత్త ‘బలివాడ కాంతరావు ’ కథా రచన ‘ నైజరు తేనె ’ కథా చదవండి..! – సంపాదకులు
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత బలివాడ కాం తారావు (03-7-1927,06-05-2000) శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జన్మిం చారు కథారచయితగా సుమారు 400కథలు రాశారు. వాటిలో ఒక గిరిజన కథ ‘‘నైజరు తేనే’’ దీని రచనా కాలం 1977.కథలో ప్రధాన పాత్రధారి కథకుడు కావడం ఒక విశేషం. దీని ద్వారా రచయితకు ఆదివాసి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవు తుంది. అనుభూతి ప్రధానమైన ఈకథలో గిరిజన జీవితాలు అవి కలుషితం చెందిన, చెండబోయే తీరు గురించి రచయిత కాంతారావు తన దైన బాధ్యతా యుతంగా ఆర్తితో అందంగా వెల్లడి చేస్తారు.
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత బలివాడ కాం తారావు (03-7-1927,06-05-2000) శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జన్మిం చారు కథారచయితగా సుమారు 400కథలు రాశారు. వారి కథల్లో కొన్ని గిరిజన జీవితాలకు అద్దం పట్టే కథలు ఉన్నాయి.వాటిలో ఒక రిజన కథ ‘‘నైజరు తేనే’’ దీని రచనా కాలం 1977వ సంవత్సరం.
కథలో ప్రధాన పాత్రధారి కథకుడు కావడం ఒక విశేషం.రచయిత తాను అనుభూతి చెందిన సంఘటనల సమాహారమే ఈకథ. దీని ద్వారా రచయితకు ఆదివాసి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవు తుంది.అనుభూతి ప్రధానమైన ఈకథలో గిరిజన జీవితాలు అవి కలుషితం చెందిన, చెండబోయే తీరు గురించి రచయిత కాంతారావు తన దైన బాధ్యతా యుతంగా ఆర్తితో అందంగా వెల్లడి చేస్తారు. భాష రీత్యా నాటి పలుచని గ్రాంథిక వాతావర ణం కనిపించిన, కథ ఆద్యంతంఉత్తమ పురుషలో కొనసాగడంతో పఠన సౌలభ్యం నిండుగా ఉందనిపి స్తోంది.అలాగే కథ పేరు కూడా ఆడబిడ్డలకు చెందిన ముఖ్యమైన అటవీఉత్పత్తిని ఎంపిక చేయడం, అందునా రచయితకు,అడవి బిడ్డల సంస్కృతిపట్ల ఆందోళనను కథ నామౌచిత్యంతో అన్వ యించి చెప్పడం మొదలైన లక్షణాలన్నీ రచయిత ప్రతిభ కు అద్దం పడతాయి.ఇక కథ విషయానికి వస్తే ఒకసంపన్న కుటుంబానికి చెంది న యువకుడు (రచయిత) తన తాతల నుండి తమ కుటుం బంలో జరిగిన సంఘట నలు గుర్తు చేసుకుం టూ తన ప్రయాణంలో పొందిన ఆనందపు పరవశంతో కథ ప్రారంభ మవుతుంది. నవం బరు నెల ఆఖరి వారంలో…. అంటే చక్కని సోయగాలతో ప్రకృతి అలరారే శీతాకాలపు వేళ,ఈ కథా నాయకుడు అడవి అందాలను ఆస్వాదిస్తూ చేసిన కారు ప్రయాణమే ఈ కథ ల్లోని ఇతివృత్తం.అందుకు ముందు పది సంవ త్సరాల క్రితం తాను మొదటిసారిగా ఈ అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా పొద్దుగూకే వేళ రోడ్డు పక్క తన కారు చెడిపోవడం, అటుగా వెళుతున్న గిరిజన యువతి తనను చూడటం పడుచు యవ్వనంలోని అడవి బిడ్డ ‘‘పర్బతి’’ అందానికి కథకుడు తనకు తెలియ కుండానే ఆకర్షితుడు కావడం,అంతలోనే ఆ యువతి చేరువలోని తన గిరిజన గూడెం వెళ్ళే దారిలో కలిసిపోవడం జరుగుతుంది. కొద్ది సేపట్లో దేవుడు నుంచి 10మంది దాకా గిరిజ నులు కారు ఆగిన చోటికి రావడం అతనికి వారు మాట్లాడే భాష అర్ధం కాకపోయినా సైగల ద్వారా రాత్రి ఇక్కడ క్షేమం కాదని తమ గుడేనికి రమ్మని పిలిచినట్టు గ్రహిస్తాడు. వారితో కలిసిగూడెం బయలు దేరుతారు, ముందే అనుకున్న ప్రకారం డోలు సన్నాయి నాదస్వరం వాయిద్యాలతో తనకు ఎదురు వచ్చి బంతి పూల దండ వేసి అతనికి స్వాగతం పలికి నృత్యాలతో గూడెం తీసుకువెళతారు, వారి ఆచారం ప్రకారం ఆడామగా కలిసి గదబ నృత్యం చేస్తూ తమ గూడెం వచ్చిన అతిథికి మర్యాదలు చేస్తారు. గూడెం మధ్య మర్రిమాను వద్ద జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కథకుడు ఆరాత్రి గూడెం పెద్ద ఇంటి ముందు ఆతిథ్యం తీసుకుని ఆరాత్రి ఆనందం నిండిన సంతృప్తితో నిద్రపోతాడు. రాత్రి ఆగిరి జన గూడెం ‘‘చిక్కర పార’’లో ఆరుబయట వెన్నెల్లో అతడు పొందిన సంతృప్తి,ఆనందం, తన జీవి తంలో మరి ఎక్కడ దొరకలేదు. సంతృప్తికర రాత్రి నిద్ర అయ్యాక తెల్లవారి పొద్దున పనులు పూర్తి చేసుకోవడానికి ఆగూడెం నీటి ఆధారం చెరువుకు వెళ్లడంతో…. ముందు రోజు సందెకాడ రోడ్డుపక్క తనకు ఎదురైన యువతి నీళ్ల కుండతో కనిపిస్తుంది.అతడిలోని ఆర్తి చూపులు ఆమెకు అందాయి, మూగభాషలో నే గూడానికి ఓమూలనున్న తన ఇంటివైపు రమ్మని సైగల స్వాగతం పలకడంతో అందు కోసమే అన్నట్టు ఎదురు చూస్తున్నా అతని మనసు ఊయల లూగు తుంది,భూమికి పసుపు చీర పరిచినట్టు ఉన్న పసుపు పూల నైజర్‌ నూనె గింజల పంట చేనుకు గుండా నడుస్తున్న అతగాడి చిలిపి మనసు దారిలోనే ఒకసారి దాహం నటిస్తోంది!! తన భుజం మీది నీటి కుండ సాక్షిగా ఆమె అతడి దాహం తీరుస్తుంది. అందమైన అడవి దారి గుండా అంతే అందమైన అడవి యువతి నివాసపు పాకకు చేరిన వారి ప్రయాణం ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన అనురాగపు అనుబంధాన్ని పంచి రచయితకు జన్మకు సరిపడా అనుభూతి అందుతుంది.ఆ పడతి సీసాతో ఇచ్చిన ‘‘నైజరు తేనె ‘‘రుచి కూడ అంతే మధురాతి మధురంగా అతడి మనసుకు అల్లుకుపోయింది. అలా ఆనాటి మధుర స్మృతులు మూటగట్టుకుని పదేళ్ల తర్వాత అరమరికలు లేని అడది బిడ్డలతో కొన్నాళ్లు కలిసి ఉండి మనశ్శాంతి పొందాలనే ఆశయంతో అక్కడికి వచ్చిన అతడికి ఎదురైన చేదు అనుభవాలతో ఈ కథ ముగుస్తుంది. రచయితకు ఆడబిడ్డలకు ఆవహించిన ఆధునిక అసమానతలు పట్ల గల ఆవేదన అర్థమవు తుంది.పదేళ్ల తర్వాత అక్కడి అడవి బిడ్డలులో ఆధునిక జీవన విధానం కొట్టొచ్చినట్టు కనిపి స్తుంది. కొత్తగా వచ్చిన కరెంట్‌ వెలుగులు,మట్టి కుండల స్థానంలో స్టీల్‌ బిందెలు,పూరి గుడి సెలున్న చోట పెంకుటిళ్లు, వంటి మార్పులు చూసిన రచయిత ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వారిలో అంతకు ముందు కాలం నాటి ఆత్మీయతలు అనుబంధాలు లేవు అంతా కృత్రిమత్వం, అభద్రత,రాత్రి గూడెంలో ట్యూబ్‌ లైట్‌ ల వెలుగులో సాగినవారి నృత్యంలో అంతా కృత్రి మత్వమే. అది ఏదో ఆశిస్తూ చేస్తున్న స్వార్ధతత్వం, అడుగడుగునా కనిపి స్తాయి. ఆరాత్రి గూడెంలో అతడు గదిలో నిద్రపోయినా నమ్మకం లేనట్టు ఎవరి ఇంటి తలుపులు వారు గడియలు పెట్టి బిగించు కున్నారు.అంతటా అభద్రతే ఆత్మీయతలు లేని ఆతిథ్యం,అతడిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. తెల్లవారి ఉన్న ఒక్క అనురాగపు ఆశకోసం చెరువు గట్టుకు వెళ్ళిన, అతనికి అందమైన మామిడి చెట్లు, నైజర్‌ పంటచేలు, కనిపించ లేదు.చెరువు నీళ్ళకు వచ్చిన వారి చేతుల్లో కుండలు లేవు ఇత్తడి బిందెలు, స్టీలు బిందెలు ఉన్నాయి, అక్కడి వారికి ఉపాధి ముసుగు వేసి కట్టబడ్డ విమానం కంపెనీ సాయంగా అక్కడి అడవి అందాలు అంతర్ధానం అయ్యి కాలుష్యపు మేఘాలు వారికి తెలియ కుండానే అడవికి,వారి జీవితాలకు ఆవహించాయి. ఇంత మారిన తన ఊహల సుందరి ‘‘ప్రేమ తునక’’ పర్బతిలో తాను తొలిసారి చూసిన స్వచ్ఛత ఉంటుందని ఆశ తో అటుగా అడుగులు వేసిన అతనికి పిల్లలకు పాలు పడుతున్న ఆమె కనిపించింది, ప్రేమ తాలూకు పరిమాణం తో సిగ్గుపడుతూ తన వైపు చూసిన, ఆమె పిల్లల్లో తెలియని భయం కోపపు చూపులు,ఆమె శరీరానికి కొత్తగా జాకెట్‌ వచ్చి చేరింది. ఆమె భర్త విమానం కంపెనీలో తోట మాలి మరి, నోరు తెరిచి తానే అడిగాడు ‘‘నైజరుతేనె’’ అని,ఇంట్లోకి వెళ్లి గాజుసీసాలో తేనె తెచ్చి అతని చేతికి అందించి ‘‘దాని విలువతే’’ అన్నట్లు చేయి చాపుతుంది. ఆ తేనె చుక్కలు నోట్లో వేసుకున్న అతడికి మధురం స్థానంలో చిరుచేదు అనిపిస్తుంది. పది రూపాయల నోటు ఆమె చేతికి అందించిన అతడికి భయంకరమైన పళ్ళతో ఆమె ముఖం కనిపిస్తుంది, మొదటిసారి అతని కళ్ళకి ఆమె జలపాతంల కనిపించింది. ఈ పదేళ్లకు ‘‘కుళ్లు కాలవలా’’ తయారయింది. గబగబ ఆ కృత్రిమ గూడెం నుంచి కదిలిపోయి రోడ్డు పక్కన గల తన కారు చెంతకు చేరేసరికి, ఓ పదిమంది గ్రామ పెద్దలు అతడిని వెంబడిరచారు… డబ్బులు ఇమ్మనే చేతులతో. అతడి మనసులో సుడులు తిరుగుతున్న కోపాన్ని దాచుకోలేక పర్సులోని డబ్బంతా కాగితపు ముక్కల్లా వాళ్ళ మీద చల్లి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కథ ముగుస్తుంది. విభిన్నమైన కల్పితకథనమైన, అక్షరాల వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడంలో రచయిత బలివాడ కాంతారావు కృతార్థులయ్యారు.అందమైన అడవిబిడ్డల సంస్కృతి సాంప్ర దాయాలకు ఆధునికతతో కూడిన రక్షణ అత్యవసరం. కానీ ఆఅభివృద్ధి తాలూకు మార్పు వారిలోని అసలైన మనుగడకు చేటు రాన్నివ్వ రాదని ఆనాడు ‘‘బలివాడ’’ వారు ఆశించినదే ఈనాడు అందరూ ఆశిస్తున్నాము. ఆవిధంగానే అడవి బిడ్డల మనుగడ,అభివృద్ధి సాయంతో అంత రించి పోకూడదు,అని అందరం కోరు కుం దాం..చక్కని కథా వస్తువు ఎంత చక్కని శైలి అలవర్చిన రచయిత కథా కథనం అందరికీ ఆరోగ్యదాయకమైన విషయ విశేషం.

అటవీ సంరక్షణే పర్యావరణ పరిష్కారం!

పర్యావరణ పరిరక్షణలో అడవులది కీలకపాత్ర అనేది కాదనలేని వాస్తవం.పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశవ్యాప్తంగాకోట్లాది రూపా యలు వెచ్చించి మొక్కలు నాటుతున్నారు. మరొక పక్క విచక్షణారహితంగాఅడవులను ధ్వంసం చేస్తు న్నారు.నాటుతున్న మొక్కల్లో ఎంత శాతంపెరిగి పెద్దవవుతున్నాయో చెప్పలేం కాని ఊహించని రీతి లో అడవుల్లోని భారీ వృక్షాలనుసైతం కూల్చివేసి తరలిస్తున్నారు. అటవీసంపద హరించుకుపోతున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తమవ్ఞతున్నది.దేశంలో సగ టున రోజుకుదాదాపు 300ఎకరాలకు పైగా అటవీ భూమి అదృశ్యమైపోతున్నదని గతంలో అటవీ మంత్రిత్వశాఖ వెల్లండిరచిన నివేదికల్లో స్పష్ట మైంది. బొగ్గుగనులు, ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, పరిశ్రమలు, నదిలోయ ప్రాజెక్టులకోసం అడవులను నరికివేస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, జార?ండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర తదితరరాష్ట్రాల్లో ఇతర ప్రయోజనాలకు కూడా భూములను ఉపయోగించు కుంటున్నారు.తెలుగురాష్ట్రాలకు సంబంధించి ఖమ్మం,వరంగల్‌,అదిలాబాద్‌,కరీంనగర్‌ తది తర జిల్లాల్లో వేలాదిఎకరాలు అటవీభూమి అన్యాక్రాంత మైనట్లు అటవీశాఖ అధికారుల రికార్డులు వెల్లడిస్తు న్నాయి.భారత అటవీ సర్వే(ఎఫ్‌ఎస్‌ఐ)సంస్థ గతంలో విడుదల చేసిన ద్వైవార్షిక నివేదిక ప్రకా రం దేశంలో దాదాపు ఏడు లక్షల చదరపు కిలోమీ టర్ల విస్తీర్ణంలో అడువులు ఉన్నాయి.పర్యావరణ జీవావరణ పరిరక్షణతోపాటు ఆర్థిక, సామాజిక జీవన వ్యవస్థలకు అడవులు ఆలంబనగా నిలుస్తు న్నాయి. భూసారాన్ని కాపాడడమేకాకుండా తుపా నులు,వరదలులాంటి దుష్ఫ్రభావాలను అడ్డుకో వడంలో వాటిపాత్ర విస్మరించలేనిది. కోస్తాప్రాం తాల్లో భూమి కోసుకపోకుండా కూడా అడవులు కాపాడుతున్నాయి. భూతాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌస్‌వాయువులువాతా వరణంలోకి పెద్ద ఎత్తున విడుదల కాకుండా నిరోధించే శక్తి అడవు లకు ఉంది. బొగ్గుపులుసువాయువు పీల్చుకొని స్వచ్ఛమైన ప్రాణవాయువు అందించడం ద్వారా ఎప్పటి కప్పుడు కొత్తఊపిరులు పోస్తున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా160కోట్ల మందికిపైగా ఆవాసం, రక్షణ, జీవనోపాధి కోసం అడవుల మీదనే ఆధారపడు తున్నారు. అభివృద్ధిచెందు తున్నదేశాల్లో ఇంధన వనరులు, పారిశ్రామిక అవసరాల కోసం అటవీ ఉత్పత్తులను వినియోగించుకుంటున్నారు.కొన్ని లక్షలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది. అటవీఉత్పత్తుల ఔషధ ఆరోగ్యపరమైన ప్రయోజ నాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాటి విలువ అంచనాలకు అందదు. అందుకే మానవ నాగరికత వికాసంలో అడవుల పాత్ర అత్యంత కీలకమైందని ఏనాటి నుంచో పెద్దలు చెప్తున్నారు. సింధునాగరికత అంతరించి పోవడా నికి ప్రధానకారణాల్లో అటవీ ప్రాధాన్యతను గుర్తించకపో వడమేనని చరిత్రకా రులు స్పష్టం చేస్తున్నారు. అడవులు రానురాను అదృశ్యమైపోతుండడం వల్లనే ప్రకృతి బీభత్సవాలు పెరిగిపోతున్నాయనేది వాతావరణ శాస్త్రజ్ఞుల అభిప్రాయం. తరుచగా వస్తున్న వరదలు, అందు వల్ల జరుగుతున్న బీభత్సం, మరొకపక్క కరువుకాట కాలు కూడా ఈ అడవుల విధ్వంసం వల్లనే జరుగు తున్నదనేది కాదనలేని వాస్తవం. ఇంత జరుగు తున్నా పాలకులు ప్రకటనలతో సరిపెడుతున్నారు తప్ప నిర్దిష్టమైనచర్యలు తీసుకొనలేకపోతున్నారు. అంతెందుకు ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందం చెట్లను నరికి విదే శాలకు స్మగ్లింగ్‌ చేయకుండా నిరోధించలేకపోతున్నారు. వందలాది మంది పోలీసులను పెట్టినా చివరకు కాల్పులు జరిపినా ఈస్మగ్లింగ్‌ ఆగడం లేదు. ఇక చెట్లను పెంచే కార్యక్రమం అంతంత మాత్రం గానే ఉన్నది. కాగి తాలపై ఉన్న చెట్లెన్ని క్షేత్రస్థాయి లో అందులో ఎన్ని ఉన్నాయో పరిశీలిస్తే ఆశ్చర్యకర మైన దృశ్యాలు వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వం కూడా చెట్ల పెంపకంలో ఒకనిర్దిష్ట విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. స్విట్జర్లాండ్‌ లాంటిదేశాల్లో ఇంట్లో పెరటి మొక్కలు పెంచుకునేందుకు ముందుకొస్తేతప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వ డంలేదు.భూటాన్‌,నేపాల్‌,గాంభియా,తదితర దేశా ల్లో అటవీరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఆదర్శంగానిలుస్తున్నాయి. బిడ్డ పుట్టినప్పుడల్లా ఒక మొక్క నాట డాన్ని ఫ్రాన్స్‌ ప్రోత్సహిస్తున్నది. భారత రాజ్యాంగంలోని 51ఎ(జి) అధికరణ ప్రకారం అడవ్ఞలు,వన్యప్రాణులు సహా ప్రకృతి సంపదను పరిర క్షించడం,అభివృద్ధిపరచడం ప్రతిపౌరుడి కర్తవ్యం. అడవులు అంతరిస్తున్నబట్టే వన్యప్రాణులు అరణ్యాలు వదిలి జనారణ్యంలోకి ప్రవేశించడం ఆందోళన కలిగించేఅంశం. అడవులు వన్యప్రా ణాన్ని కాపాడటానికి భారత ప్రభుత్వం కృషి చేయా లని 48(ఎ)అధికరణ స్పష్టం చేస్తున్నది. న్యాయ స్థానాలు కూడా అటవీభూమి సంపద విషయాల్లో ఎన్నోసార్లు ఆదేశాలుజారీచేశాయి. భారత ప్రభు త్వం కూడా అడవుల అభివృద్ధికి వేలాదికోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి అది అంతంత మాత్రంగానే ఉన్నది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. అడవుల పెంపకం, పరిరక్షణ, ప్రోత్సాహంతో పాటు హరిత, ఆర్థిక వ్యవస్థను పెంపొందించేలా పరి శ్రమలకు గట్టి నిబంధనలను విధించాలి. అటవీ విధ్వం సానికి దారితీస్తూ వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్న స్మగ్లర్ల విషయంలో ఉక్కు పాదం మోపాలి. అటవీ సంరక్షణలో రాజకీయా లకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఆలోచిం చాలి. స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వాము లను చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.– జి.ఎన్‌.వి.సతీష్‌

లౌకికవాద పటిష్టత – గణతంత్ర పరిరక్షణ

భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాంగాన్ని రూపొందించిన మేథావులకు భారతదేశంలోని బహుళ మతాల, బహుళ సంస్కృతుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచ డానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది.
కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ సమస్యను పరిష్కరించలేక పోయింది. పైగా హైకోర్టు ఇచ్చిన తీర్పు హిజాబ్‌ ధరించే ఉడిపి కళాశాల విద్యార్థినులను మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు తీర్పు చాలా టెక్నికల్‌గా ఉంది. అది ఒక దరఖాస్తు మాదిరిగా, ఇతరుల వాదనను తిరస్కరించే విధంగా, మోసం చేయాలనే ఆత్రుతతో ఉన్న ట్లుంది. వాదన సరిగా లేదని పేర్కొనడం ద్వారా… ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయనే అభ్యర్థనను కొట్టివేసే స్థితికి ఈ అసాధారణ ఆత్రుత వెళ్ళింది. ఈ హిజాబ్‌ సమస్య రాజకీయపరమైనది, రాజ్యాంగ పరమైనది కూడా. దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగపరమైన కోణంలో పరిశీలించి,ఈ సమస్య పరిష్కారానికి తగిన తీర్పు ఇస్తుందని ఆశించవచ్చు. కానీ హిజాబ్‌ సమస్యకు సంబంధించిన రాజకీయ దృష్టి కోణం…చాలా కాలంగా భారతీయ సమా జాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆకస్మి కంగా బయటకు వచ్చిన ఈ సమస్య, జారిటీ మతస్థులలో అంతర్గతంగా గూడుకట్టుకున్న అసహనాన్ని ప్రతిబింబి స్తుందన్న వాస్తవాన్ని వెల్లడిరచడానికి గొప్ప పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఉత్తర భారతదేశంలో హిందూ, సిక్కు మహిళలు పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు, మతపరమైన వేడుకలు వంటి ముఖ్యమైన సందర్భాలలో తల కనిపించకుండా ముసుగు ధరిస్తారు. వీధుల్లోకి వచ్చి, ఒకరినొకరు ఘర్షణ పడడానికి ఓచిన్న గుడ్డ ముక్క చాలు. అది భారతీయ సమాజంలో సంభవించిన మార్పుకు ఒక కొలమానంగా మారింది. ఇలాంటి అసహన వాతావరణంలో, సాంప్రదాయ బద్ధమైన సహనం, బహుళత్వం, ఉదారబుద్ధి లాంటి వాదనలు విడ్డూరంగా కనిపిస్తాయి.
నైతిక చట్రం
కానీ, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి,ఒక స్నేహపూర్వక వాతావరణంలో,శాంతియు తంగా కొన్ని లక్షలాది సంవత్సరాలపాటు జీవించడానికి అనుమతించిన ఘన చరిత్ర భారతదేశానికి వుందన్న మాట వాస్తవం. అన్య మతస్థులను తమ మతం లోకి మార్చే చర్యలు మద్దతుదారులను పెంచింది కానీ, వారు అధిక సంఖ్యాక మతస్థులకు ఎటువంటి సవాలుగా, సమస్యగా తయారవలేదు. బుద్ధుని కారణంగానే ఇతర మతాలకు చెందిన వారి విశ్వాసాల పట్ల సహనం, తోటి మానవుల పట్ల సానుభూతి భారతీయ సాంప్రదాయాల్లో అంతర్భాగంగా మారాయి. ఆయనే భారతదేశానికి ఓ నైతిక చట్రాన్ని అందించాడు. ఆ చట్రంలోనే తోటి మానవులతో మన సంబంధాలు, భావనలు రూపుదిద్దుకుంటాయి. నేడు సంభవిస్తున్న మార్పులు ఆ నైతిక చట్రానికి అవతలనే జరుగుతున్నాయి. మనకు బుద్ధుడు వారసత్వంగా అందించిన గొప్ప జ్ఞానాన్ని అసాధారణ ప్రతీకారంతో వృధా చేస్తున్నారు. భారత రాజ్యాంగం ఆ నైతిక చట్రం యొక్క విధానాన్ని భారతదేశ పరిపాలన కోసం ఆమోదించింది. ఆధునిక యూరప్‌ పునరుజ్జీవ నానికి ఉన్న విధంగానే, సమానత్వం, సమ న్యాయం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు బౌద్ధ సాంప్రదాయాల్లో ఒక భాగంగా ఉన్నాయి. వాస్తవంగా భారతదేశ భవిష్యత్తు, చారిత్రక అనివార్యత (నెహ్రూ, అంబేద్కర్‌ లాంటి గొప్ప నాయకులు రూపొందించిన ఆధునిక దేశ భావాలు) బౌద్ధ మతం యొక్క నైతిక సాంప్రదాయాల్లో, ఆధునిక ప్రపంచ సమానత్వపు ప్రేరణల మూలాల్లో ఉన్నాయి. ఆ విధంగా భారత రాజ్యాంగం ఒకవైపు మత స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ కోసం…మరోవైపు దేశ పాలన కోసం లౌకికతత్వాన్ని సమకూర్చింది. భారతదేశంలో లౌకికతత్వం అంటే అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని కలిగి ఉండడం అని అనేక మంది చాలా తీవ్రంగా వాదిస్తారు. ఈ తప్పుడు అవగాహనే పాలకులు (మతపరమైన ప్రత్యేక దుస్తులు ధరించి, బహిరంగంగా మతాచారాలను పాటిస్తూ) మతపరమైన ఉత్సవాలకు హాజరయ్యే పరిస్థితులకు దారితీసింది. ఇవి వాస్తవానికి, తమ మత విశ్వాసాలతో ఆచరించే సాంప్రదాయాల కంటే కూడా, ఆ పేరుతో ప్రజలను ఆకట్టుకొని…తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందే చర్యలని చెప్పవచ్చు.
విభజన
భారత రాజ్యాంగంలో కూడా యూరప్‌లో వలే రాజ్యం నుండి మతాన్ని వేరు చేసే ఒక విభజన రేఖ ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి, యూరప్‌ పునరుజ్జీవన చరిత్రలో ఈ విభజన ఒక ప్రధానమైన పరిణామం. రాజ్యానికి మతం లేదనేది భారత లౌకికతత్వం యొక్క ముఖ్య సారం. ఇది రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 27,28లలో స్పష్టంగా ఉంది. ఏదైనా ఒక మతాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పన్నులు విధించకూడదని ఆర్టికల్‌ 27చెపుతుంది. అంటే ఏ మతానికి అనుకూలంగా ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేయడానికి అనుమతి లేదు. ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలలో ఎటువంటి మతపరమైన నిబంధనలు పాటించాలని ఆదేశించకూడదని ఆర్టికల్‌ 28 చెపుతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ సహకారంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థ కూడా మతపరమైన తరగతులకు లేదా ఆరాధనా కార్యక్రమాలకు హాజరు కావాలని ఎవ్వరినీ ఒత్తిడి చేయకూడదని కూడా ఆర్టికల్‌ 28 చెపుతుంది. మతపరమైన ఆచారాలకు సంబంధించిన లౌకిక కార్యక్రమాలను క్రమబద్ధీకరించే అధికారాన్ని ఆర్టికల్‌ 25(2)(ఏ) ప్రభుత్వానికి ఇస్తుంది. మతం పేరుతో ఏవిధ మైన వివక్షతనైనా ఆర్టికల్‌ 15 నిషేధిస్తుంది. అన్నిటినీ మించి మత స్వేచ్ఛ ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి ఉండేట్లు చేస్తారు. ఆ విధం గా మన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ కూడా చట్టం ముందు సమానత్వం, వివక్షతకు గురికాకపోవడం, జీవించే హక్కు, స్వేచ్ఛగా ఉండే హక్కు లాంటి లౌకిక హక్కుల వలె అమలుకు నోచుకోవడం లేదు.పై అంశాలను దష్టిలో ఉంచుకొని, రాజ్యానికి మతం ఉండదనే నియమం ఆధారంగా భారత రాజ్యాంగంలో లౌకికతత్వాన్ని పొందుపరచారని స్పష్టం అవుతుంది. భారత రాజ్యం ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందిర-నెహ్రూ-గాంధీ వర్సెస్‌ శ్రీరాజ్‌ నారాయణ్‌ అండ్‌ ఏఎన్నార్‌ కేసు విషయంలో ‘’రాజ్యానికి తనకంటూ స్వంతంగా ఎటువంటి మతాన్ని కలిగి ఉండదని’’ భారత సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది.
ప్రజా జీవితంలో మత దురహంకారం
భారతదేశంలో, ప్రజా జీవితంలో తీవ్రమైన మత దురహంకారం కనపడుతుంది. కాబట్టి, మనం చాలా సౌకర్యంగా లౌకికతత్వం యొక్క అర్థాన్ని ‘సర్వ ధర్మ సమభావం’గా మార్చు కున్నాం. ఇది కేవలం అధిక సంఖ్యాకుల ఆధిపత్యానికి దారితీసి, చివరకు మత ప్రాతి పదిక గల రాజ్యం ఏర్పడుతుంది.‘సమ భావం’ అనే భావన వాస్తవానికి నేటి భారతీయ సమా జంలో లేదు. మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యం,దేశ పతనానికి హామీ ఇస్తుంది.సుమారు 20కోట్ల అల్ప సంఖ్యాక ప్రజలున్న భారత దేశంలో అనేక మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. భారత ప్రభుత్వం, దేశంలో ఆరు అల్ప సంఖ్యాక మతాలను గుర్తించింది. కాబట్టి మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యంలో అధిక సంఖ్యాకుల మతమే రాజ్య మతంగా ఉండడం అనేది ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదన.భారతదేశంలో మత ప్రాతిపదికన రాజ్యం ఏర్పాటు అసాధ్యమని చెప్పే మరొక కీలకమైన అంశం ఏమంటే, అధిక సంఖ్యాకుల మతం ఒక సంక్లిష్టమైన, అసమానతలతో కూడిన శ్రేణీగత వ్యవస్థ. అంతేగాక అణచి వేతతో కూడిన సామాజిక నిర్మాణాన్ని కలిగి ఉంది. మత రాజ్యం, మత సూత్రాల ఆధారం గా పని చేస్తుంది. అంటే భారతదేశంలో అయితే ధర్మ శాస్త్రాల ప్రకారం ఒక ప్రత్యేకమైన కులం మాత్రమే పాలించే హక్కును కలిగి ఉంటుంది. అధిక సంఖ్యాక ప్రజలకు అధికారం లో పాలుపంచుకునే హక్కు ఉండదు. వారికి మానవ హక్కులు ఉండవు. అణచివేతకు, అన్యాయానికి వారు శాశ్వత బాధితులుగా ఉంటారు. మత ప్రాతిపదికన ఏర్పడే రాజ్యం మత గ్రంథాలపై ఆధారపడుతుంది. అంటే, భారతదేశంలో రాజ్యం సమానత్వాన్ని, సమాన రక్షణను నిరాకరిస్తుంది. కుల ప్రాతిపదికన వివక్షతను ప్రదర్శిస్తుంది. ఇది శాశ్వత వైరుధ్యా లకు, సమాజ పతనానికి దారితీస్తుంది. కాబట్టి, ఒక దేశంగా భారతదేశం, మతం లేని రాజ్యం గా, ఏ మతాన్ని ప్రోత్సహించని లౌకిక రాజ్యం గానే ఉనికిలో కొనసాగుతుందనే ఒక అనివా ర్యమైన నిర్ధారణకు వస్తాం. విద్యా వంతులైన భారతీయులు లౌకిక వాద్వాన్ని ఎగతాళి చేసి మాట్లాడుతూ, అధిక సంఖ్యాకుల మతం ఆధారంగా ఏర్పడే మతరాజ్య భావనను బలపర్చడమనేది అనాలోచిత చర్య తప్ప మరొకటి కాదు. వారి మానసిక స్థితి నేటి మత రాజకీయ అల్లరిమూకల ఆర్భాటపు ప్రచా రాలతో రూపొందించబడుతుంది. భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాంగాన్ని రూపొందించిన మేథావులకు భారతదేశం లోని బహుళ మతాల, బహుళ సంస్కృతుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిది. భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాం గాన్ని రూపొందించిన మేథావులకు భారత దేశంలోని బహుళ మతాల, బహుళ సంస్కృ తుల లక్షణాలు మరియు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి గాను గణతంత్రం యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, గణతంత్రాన్ని కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది.- (పి.డి.టి.ఆచారి)

నూతన మంత్రివర్గం..సరికొత్త సవాళ్లు

విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రి వర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్తమాత్రులుగా మార్చబడిన స్థితి.
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఇప్పుడు ఎడతెగని చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. పదవుల చుట్టూ రాజకీయాలు, మీడియా కథనాలు పరిభ్రమించే ప్రస్తుత కాలంలో ఇది అనూహ్యమేమీ కాదు. తన మంత్రివర్గాన్ని సగం పదవీ కాలం తర్వాత మారుస్తానని జగన్‌ తమ మొదటి లెజిస్లేటివ్‌ సమావేశంలోనే ప్రకటించారు. కనుక మంత్రులుగా చేరిన వారంతా ఆ షరతుకు లోబడే చేరారన్నది స్పష్టం. నూటయాభై స్థానాలతో ప్రభంజనం సృష్టించిన ఆరంభ ఘట్టం అది. నాయకుడూ శాసనసభ్యులూ కూడా పాలనా పగ్గాలు చేపట్టాలనే ఉత్సుకతతో వున్న దశ. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పరి స్థితి ఎలాగూ వుండదు. ప్రస్తుతం విద్యుత్‌ కోతలు, ఛార్జీల మోతలు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఉద్యమాలు, కేంద్ర రాష్ట్ర విధానాల కారణంగా ధరల మంటలు, అప్పుల ఊబి, అమరావతి ప్రతిష్టంభన ఒకటేమిటి అనేకానేక సవాళ్లు ఆంధ్రప్రదేశ్‌ను వెంటాడుతున్న స్థితి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హుకుంలు వాటిని ప్రశ్నించకపోగా అత్యుత్సాహంగా సమర్థిస్తూ తనూ ఒక వేటు వేసే జగన్‌ ప్రభుత్వ విధానాలు ఇందుకు మూల కారణంగా వున్నాయి. అందుకే ముంచుకొచ్చిన కరోనా కారణంగా కొంత కాలం వాయిదా వేసినా అనివార్యంగా ఇప్పుడు ఆ పునర్యవస్థీకరణ ముందుకొచ్చి కూచుంది. ఇది నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రి స్వీయకల్పితం. ఒక ముఖ్యమంత్రి సగం కాలానికే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తర్వాత మారుస్తానని చెప్పడం ఎప్పుడూ జరగలేదు. కనుక దీనికి ఇంతకు ముందు నమూనా ఏదీ దేశంలో లేదు. దాని ప్రభావాన్ని చెప్పడానికీ ఉదాహరణ లేదు.
మూడు దొంతరలు, విధాన ప్రశ్నలు
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వుండగా బడ్జెట్‌ లీకైందంటూ మొత్తం మంత్రివర్గాన్ని సామూహికంగా బర్తరఫ్‌ చేసి అందరి రాజీనామాలు తీసుకున్న ఉదంతంతో కొన్ని పోలికలున్నా అది వేరే తరహా సందర్భం. దాని ఫలితంగా ఆ పార్టీలో చీలిక వచ్చింది, అప్పటికే ఆ ప్రభుత్వంపై వున్న అసంతృప్తి మరింత పెరిగి ఎన్టీఆర్‌ వ్యక్తిగత ఓటమితో సహా ఆ పార్టీ పరాజయం పాలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల తర్వాత రెండు మాసాల పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయనేలేదు. కేవలం తనూ ఉప ముఖ్యమంత్రి మొహమూద్‌ అలీ మాత్రమే ప్రభుత్వంగా నడిపించారు. కేంద్రంలో ప్రధానిమోడీ తన మంత్రివర్గ సహచరులలో దాదాపు 70శాతం మందిని దశలవారిగా తప్పించారు. అంతేగాక గతంలో కాంగ్రెస్‌ చేసినట్టే రాష్ట్రాలలో తమ ముఖ్యమంత్రులను వరుసగా మార్చేశారు. ఏతావాతా జాతీయ పాలకవర్గ పార్టీలలో ముఖ్యమంత్రులకూ ప్రాంతీయ పార్టీలలో మంత్రులకు పదవులు ఎప్పుడైనా ఊడిపో వచ్చనే భావం బలపడిరది. అయితే జగన్‌ నేరుగా అందరినీ మార్చేస్తానని ముందే ప్రకటించి మరీ పాలన ప్రారంభించడం కొత్త వ్యూహం. దాని అమలు ఎలా వుంటుంది, అనంతర ప్రభావాలు ఏమిటి అన్నదే ఇప్పుడు కీలక చర్చగా తయారైంది. ఏప్రిల్‌ 7న జరిగిన క్యాబినెట్‌లో పాత మంత్రులందరూ రాజీనామా చేయడం,వాటిని గవర్నర్‌ ఆమోదించడం జరిగిపోయింది. అయితే వారిలో కొనసాగే వారెవరు,ఎందరు అనే రసవత్తర కథనాలు మాత్రం నడుస్తూనే వున్నాయి. సామాజిక సమీకరణాల రీత్యా కొందరిని కొనసాగించడం తప్ప అత్యధికులను మార్చవలసి వుంటుందని ఆయన మొదట అన్నారు. అనుభవం కోసం కొందరు కొనసాగుతారన్నారు. చివరి సమావేశంలోనూ సంఖ్య చెప్పకపోయినా ఇలాంటి మాటలే మాట్లాడినట్టు మంత్రులు చెబుతున్నారు. అయిదారుగురు పాతవారు వుండొచ్చన్న లెక్క కాస్త పెరిగి పది పైన ఇప్పుడు చెబుతున్నారు. ఇందులో ఇద్దరు ఆలస్యంగా చేరిన వారు కాగా ఒకరిద్దరు ఆ వర్గాలకు ఏకైక ప్రతినిధులుగా వున్నవారు. ఇవి కూడా ఊహాగానాలు తప్ప ఆధారం లేదు. పదిమందికి పైగా కొనసాగిస్తే అప్పుడు తప్పించబడే వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం మరింత అధికమని అధినేతకూ సలహాదారులకు తెలుసు. తప్పించిన మంత్రు లను జిల్లాలకు లేదా ప్రాంతాలకు సమన్వ యకర్తలుగా పంపి వచ్చే ఎన్నికలలో గెలిపించే బాధ్యత అప్పగిస్తామన్నారు. మరి వారికి సంస్థాగత నాయకత్వం అప్పగిస్తే కొత్తమంత్రుల కాళ్లకు పగ్గాలు వేసినట్టు కాదా. ఈ రెండు తరహాలలో దేనికీ చెందకుండా ఏపదవీ బాధ్యతలు దక్కని మూడో తరహా నాయకుల పరిస్థితి ఏమిటి? ఈ విధంగా వైఎస్‌ఆర్‌సిపి లోనూ ప్రభుత్వంలోనూ మూడు దొంతరలు ఏర్పడే సూచనలున్నాయి. ఈ వైరుధ్యాలను సర్దుబాటు, సమన్వయం చేయడం తేలికేమీ కాదు. ఎన్నికల సన్నాహాలు, సమరం మొద లైనట్టే మాట్టాడుతున్న ముఖ్యమంత్రి తీరు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నది.తాము వచ్చేసినట్టే మాట్టాడుతున్నారు. కనుక కొత్త మంత్రులు లేదా మంత్రివర్గం ఆది నుంచి ఎన్నికల వేడిలోనే పని చేయవలసి వుంటుంది. ముందే చెప్పినట్టు ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించే ప్రచారం చేసుకుంటున్నా ప్రజలూ ప్రతిపక్షాలూ సమస్యల తీవ్రతపై ఉద్యమిస్తున్న నేపథ్యం. ఈ సమస్యలకు కారణమైన విధానాలు, పని విధానాలు మారకుండా కేవలం కొన్ని శాఖల మంత్రుల మొహాలు, విగ్రహాలు మార్చినంత మాత్రాన కలిగే ప్రయోజనం వుండదు. ప్రభావమూ వుండదు.
అసహనం, అవకాశవాదం
విధానాలపై, సమస్యలపై పోరాటాలకూ ఈ మంత్రివర్గ మార్పులకు ఏ సంబంధం వుండదని తెలిసినా వాటిపైనే శ్రుతిమించిన చర్చ చేయడంలో వైసిపి, టిడిపిలకు తమవైన ప్రయోజనాలున్నాయి. తమ పాలనపై అసంతృప్తి పక్కదోవ పట్టించడం ప్రభుత్వ వ్యూహం. మౌలికాంశాలపైనా కేంద్రం నిర్వాకాలపైనా పోరాడకుండా ఈ పైపై చర్చలతోనే మరో ఏడాది గడిపేయడం టిడిపి దృక్కోణం. రాజ్యాంగం164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ నాయకుడుగా వుంటారు. ఆయన సలహాలపై నియమించబడే లేదా తొలగించబడే మంత్రివర్గం మంత్రులకు సమిష్టి బాధ్యత వుంటుందన్నప్పటికీ సుదీర్ఘకాలంగా దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానులే ప్రభుత్వాలుగా తయారైన పరిస్థితి. ప్రాంతీయ పార్టీలలో అనధికార సూత్రం. మంత్రులు నిమిత్త మాత్రులుగా మార్చబడిన స్థితి. నూటయాభై స్థానాలు గెలిచిన జగన్‌ ప్రభుత్వం వంటి వాటిలో ఇది మరింత ఎక్కువ. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి గురించి విమర్శించినవారే ఇప్పుడు ఆయన బలహీనపడ్డారనీ, ఆ విధంగా చేయలేకపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కూడా తనపై విమర్శల గురించి కొన్ని ఆరోపణలు గురించి అసహనంతో విరుచుకు పడుతున్నారు.గత రెండు రోజులలో టిడిపి పైన దాన్ని బలపర్చే మీడియా పైన ఆయన వ్యాఖ్యలు ఇందుకు పరాకాష్టగా వున్నాయి. దీనికి ముందు ఢల్లీి వెళ్లి ప్రధానిని, హోంమంత్రిని కలసి వచ్చిన జగన్‌ బిజెపిని, కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడం లేదు. బిజెపి మిత్రుడైన పవన్‌ కళ్యాణ్‌ను కూడా టిడిపి దత్తపుత్రుడుగా విమర్శిస్తున్నారు! వామపక్షాలు మినహాయిస్తే ఈ ప్రాంతీయ పార్టీలేవీ మోడీ సర్కారు రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షను ప్రశ్నించలేకపోవడం నష్టదాయకం. పైగా ఆ బిజెపినే ఎదురుదాడి చేస్తుంటే ప్రభుత్వాధినేత మాట్లాడరు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయని భావించే జగన్‌… ఆయన, ఆయన పార్టీ టిఆర్‌ఎస్‌…కేంద్రంపై పోరాడుతున్న తీరును గమనించడం లేదా?
దిద్దుబాటుకు ఒక అవకాశం
మళ్లీ పునర్వవస్థీకరణకు వస్తే ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా ప్రజాభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, ఎప్పుడూ తమ మాటే చెల్లుతుందనుకోవడం పొరబాటని ఈ మంత్రివర్గ వ్యవహారమే స్పష్టం చేస్తున్నది. లేకపోతే ఇంత కసరత్తు, ఇన్ని మల్లగుల్లాలు అవసరమై వుండేవి కావు. సామాజిక లెక్కలతో పాటు మంత్రులలో కొందరు అనుభవజ్ఞులు, బలాఢ్య ధనాఢ్య వ్యక్తులు, విశ్వసనీయత గలవారు కొనసాగడం సహజం. కేవలం నోరు జోరు బట్టి కొందరు వుంటారని, కొందరు వస్తారని వేసే లెక్కలు నిలవకపోవచ్చు. ఆ విధంగానే ప్రచారం చేసుకుంటున్న పేర్లు కూడా వున్నాయి. ఈ దెబ్బతో వైసిపి లో ముసలం పుడుతుందని, ముక్కలైపోతుందని ఎదురు చూసే రాజకీయ ప్రత్యర్థులూ వున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అంత భారీ నాటకీయ మార్పులు వుండకపోవచ్చు. పాలకులు ఎప్పుడూ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తారు. వారిలో ఒకరు మూరు?లనీ మరొకరు దార్శనికులనీ చెప్పడం అనవసరం. వ్యక్తులను బట్టి తరతమ తేడాలున్నా రాజకీయాలలో వర్గ ప్రయోజనాలే శాసిస్తుంటాయి. నాలుగు వందల మంది ఎంపిలను తెచ్చుకున్న రాజీవ్‌గాంధీకి ఫిరాయింపుల నిరోధకచట్టం కావలసి వచ్చింది. నూట యాభై మంది ఎంఎల్‌ఎలు వున్న జగన్‌ మధ్యలో మార్పు ద్వారా ఎక్కువమందిని సంతృప్తిపర్చాలని తలపెట్టారు. వాస్తవంలో ఇది అసంతృప్తి పెరగడానికి కారణం కావచ్చు. తనే కీలకం, మిగిలిన వారు నిమిత్తమాత్రులనే సంకేతం కూడా ఇందులో వుండొచ్చు. తమ పార్టీలోనూ బయిటివారిలోనూ స్పందనలను తెలుసుకోవడం కోసం గత వారం రోజులూ రకరకాల లీకులతో ఊహాగానాలు నడిపిం చారు. దీన్ని కేవలం వ్యూహాత్మక చర్యగానూ ఎన్నికల ఎత్తుగానూ హడావుడి పెంచితే ఉప యోగం వుండదు. ఈ అవకా శాన్ని తమ తప్పు లు దిద్దుకోవడానికి ఉపయో గించుకుంటే ఈ కసరత్తుకు కాస్తయినా ప్రయోజనం వుంటుంది. ప్రజల స్పందనా దాన్ని బట్టే వుంటుంది. ఇక ఆశావహులు, నిరాశోపహతుల తదుపరి అడుగులు ఎలా వుండేది ఆచరణలో చూడ వలసిందే. ముందే ప్రకటించిన ఈతతంగం నుంచి అంత కన్నా ఆశించవలసిందీ అభిశం సించవలసిందీ మరేమీ వుండదు. ఎప్పుడైనా సరే రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు ప్రజాస్వా మిక పునాది కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం.వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు (ప్రజాశక్తి సౌజన్యంతో…)

జిల్లాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌- ప‌రిపాల‌న సౌల‌భ్యం

‘‘ రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కార మయ్యింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రమంతటా సంబరాలు మిన్నంటాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. కలెక్టర్లు సహా, జిల్లాల ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టడంతో కలెక్టరేట్లు సందడిగా మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటువల్ల ప్రజలకు కలగబోయే లాభాల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గ్రామం నుంచి రాజధానుల వరకు..పరిపాలనకు సంబంధించి డీ సెంట్ర లైజేషన్‌ (వికేంద్రీకరణ) ప్రజలకు మంచి చేస్తుంది. అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా …!’’ – ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
జగన్‌ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌లో నవశకానికినాంది పలికింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతర్వాత ఉన్న13 జిల్లాలకుతోడు కొత్తగామరో13జిల్లాలు ఏర్పాట య్యాయి. మొత్తం26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏప్రిల్‌ 4నుంచి కొత్త రూపు దిద్దుకుంది. వై.ఎస్‌.జగన్‌ 2019ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.పాలన సామాన్య ప్రజలకు,బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని నవశకానికినాంది పలికారు. ఇప్పుడు మొత్తం26జిల్లాలకుకాగా..72 రెవెన్యూ డివిజన్ల ఏర్పాట య్యాయి.కొత్త జిల్లాల ఏర్పాటుతో..వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు ఎటూ వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌,జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు..వారి క్యాంపు కార్యాలయాలు..అలాగే అన్ని ప్రభుత్వ శాఖల
కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిజిల్లాలో కనీసం ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జనాభా విష యానికి వస్తే..ఒక్కో జిల్లాకు 18నుంచి23లక్షల వరకు ఉన్నారు. అంతేకాదు కొత్త జిల్లాల్లో సౌకర్యాలు, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు నుంచి నాలుగు వరకు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కసరత్తు చేశారు. అంతేకాదు కొత్త డివిజన్లతోకలిపి మొత్తం72 రెవె న్యూ డివిజన్లు ఏర్పాట య్యాయి.ప్రభుత్వం శాస్త్రీ యంగా అధ్యయనం చేసిన తర్వాత కొత్త జిల్లాల ప్రక్రియను చేసింది. జనవరి26న రిపబ్లిక్‌ డే రోజున గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రజల నుంచి అభ్యం తరాలు,సలహాలు,సూచనలు స్వీకరించింది. దాదా పుగా17,500సలహాలు,సూచనలు వచ్చాయి.. వాటిని జాగ్రత్తగా పరిశీలించారు.. అనంతరం అధ్యయనంచేసి జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమైంది.
కొత్త కళ..గడప వద్దకే పాలన-సిఎం జగన్‌
సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకే పాలన తీసుకువెళ్లామని, ఇందు లో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరి పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రా భివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు.కొత్తజిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథ కాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 13జిల్లాలను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాల యం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు.26జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు.
గ్రామ స్థాయి నుంచి చూశాం..
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని మనమంతా గ్రామస్థాయి నుంచి చూశాం. జిల్లా స్థ్ధాయిలో కూడా వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు నేటి నుంచి మరింత మేలు జరుగు తుంది. ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగు లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
మహోన్నత వ్యక్తులు.. మనోభావాలు
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారా మరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌,పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి…ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవ సరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజ న అక్కచెల్లెమ్మలు,అన్నదమ్ముల సెంటిమెంట్‌, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని వీటి పేర్లను నిర్ణయించాం.
కొత్తవి ఏర్పాటు కాకపోవడంతో..
గతంలో ఉన్న జిల్లాలపేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం,రాజమహేంద్రవరం గత జిల్లా
లకు ముఖ్య పట్టణాలుగా మారాయి. గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరు తున్నాయి. 1970మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భ విస్తే చివరిగా 1979జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. తరువాత కొత్తజిల్లాలు ఏర్పాటు కాక పోవడంతో పరిపాలనసంస్కరణలు,వికేంద్రీ కరణ విషయంలోబాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలి పోయాం.జిల్లాలసంఖ్య,రెవెన్యూ డివిజన్లు పెరగ డంవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి.
అరుణాచల్‌లో 53 వేల మందికి జిల్లా
దేశంలో727జిల్లాలు ఉండగా యూపీ లో అత్యధికంగా75,అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమై న ఏపీలోమాత్రంనిన్నటివరకు13జిల్లాలే ఉన్నాయి. 1.38 కోట్ల జనాభా కలిగిన, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఏకంగా 25 జిల్లాలున్నాయి.2011 లెక్కలప్రకారం ఏపీలో 13 జిల్లాల్లో 4.90కోట్ల మంది జనాభా ఉండగా ప్రతి జిల్లాలో సగటున 38లక్షల మంది ఉన్నారు. దేశం లో ఏరాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభాలేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 6లక్షల మందికి ఒకజిల్లా ఏర్పాటు కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి. కర్ణాటకలో 20 లక్షల మందికి, యూపీలో 26.64 లక్షల మందికి జిల్లాలు ఏర్పాటు చేశారు.

భానుడు ప్ర‌తాపం..మండుతున్న ఎండ‌లు

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూరీడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా చాలామంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమిత మవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. – సైమన్‌ గునపర్తి
భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొన సాగుతూనే ఉన్నది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆతర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపి స్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు,నీరసం,డీహైడ్రేషన్‌లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా,వాతావరణ శాఖ మరో హాట్‌ న్యూస్‌ చెప్పింది. ఈఏడాది టెంపరేచర్‌లు రికార్డులు బ్రేక్‌ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈఏడాది వేసవి తాపం 50 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని,పలు ప్రాంతాల్లో 45డిగ్రీల సెల్సి యస్‌లు క్రాస్‌ చేసి టెంపరేచర్‌లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగా లులు కూడా భయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటీయరాలజీ డాక్టర్‌ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి,పశ్చిమ రాజస్తాన్‌లోఉష్ణోగ్ర తలు 50డిగ్రీల సెల్సి యస్‌లను తాకొచ్చని వివరించారు. ఓప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ,పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంప రేచర్‌లు రికార్డు అవుతాయని తెలిపారు.ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటేశాయి. కాగా,ఏప్రిల్‌ నెలలో యూపీలో అలహాబాద్‌ (46.8డిగ్రీలు), రaాన్సీ(46.2డిగ్రీలు), లక్నో (45.1డిగ్రీలు)లు ఆల్‌ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్‌ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్‌ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్‌ టైం హై టెంపరేచర్‌లు ఈ నెలలో రికార్డ్‌ చేశాయి. ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలాచోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.దేశాన్ని భారీ ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు122ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసి నట్టు భారత వాతావరణశాఖ వెల్లడిరచింది. మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం,మధ్య భారతంలో ఉష్ణోగ్ర తలు సగటున 35.90డిగ్రీలు,37.78డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని, ఫలి తంగా దేశంలో పవర్‌ కట్‌లు పెరిగాయని పేర్కొంది. దేశరాజధాని ఢల్లీిలోఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని,72ఏళ్ల రికార్డు..దేశంలో హీట్‌వేవ్‌ పరిస్థితులపై యూఎన్‌ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించింది.
మునుపెన్నడూ లేనంత వేడిగాలు
మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇప్పటికే దేశరాజధాని ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ అమల్లో ఉంది. ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల.. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే.. భారతదేశమే మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇక భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢల్లీి ఉష్ణోగ్ర తలను పరిశీలిస్తే..1981-2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయితే…ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతున్నదని, ఇలా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది. అందుకే ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం మేరకు..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2020 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్ర తల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసు కుంటు న్నాయని స్పష్టమవుతున్నది. ఇది భవిష్యత్‌ లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధ కులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. పనికి వెళ్తే గాని పూట గడవని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెలలో 50డిగ్రీలు…!
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏప్రిల్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు..మే నెలంటనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ‘‘వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిమాచల్‌, పంజాబ్‌, హైర్యానా,రాజస్థాన్గుజరాత్‌-మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.‘‘దేశంలో 2022 మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని మోహపాత్ర చెప్పారు.అయితే, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు.పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 50డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోద వడాన్ని కూడా మోహపాత్ర తోసిపుచ్చలేదు. ఎందుకింత తీవ్రంగా ఉన్నాయి?
ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణం కాదు.1901 నుంచి చూస్తే, 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడో సారి.ఈ ఏడాది మార్చిలో భారత్‌లో 26 రోజులపాటు వేడిగాలులు వీచాయి. తూర్పు, మధ్య,ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్‌’ జారీ చేసింది.
కారణం ఏంటి?
ఈ రెండు నెలల్లో వానలు,ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రత లకు ప్రధాన కారణం.గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4మిల్లీ మీటర్లుఉండగా, ఈఏడాది కేవలం 8.9మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ,మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుపానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ. సాధార ణంగా,వడగాలులు దశ ఏప్రిల్‌ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరు కుంటుంది. ఈఏడాది మార్చి 11 నుంచే హీట్‌ వేవ్‌ కనిపించింది. ఇది హోలీ పండు గకు ముందే కనిపించింది.మరోవైపు, వాతా వరణ శాస్త్రవేత్తలు మార్చి, ఏప్రిల్‌లో వీచే బలమైన వేడి గాలులు అసాధారణంగా ఉంటా యని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే, వాతావరణ మార్పుల కారణంగా ఈవేడి గాలులు వాతా వరణంలో సాధారణంగా మారిపోయే అవకాశ ముందని అంటున్నారు.వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్‌ ఉండ వచ్చని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఇనిస్టి ట్యూట్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడ రిక్‌ ఒట్టో చేసిన పరిశోధన చెబుతోంది. ‘‘ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవ్వడానికంటే ముందు, భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసిన లాంటి ఉష్ణోగ్రతలను 50ఏళ్ల క్రితమే అనుభవించాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది’’ అని మరియం జకారియా అన్నారు. ఏది ఏమైనప్పటికీ, వాతావరణం మరియు భూ వినియోగ మార్పు గతంలో భౌగోళికంగా-వివిక్త జాతుల వన్యప్రాణుల మధ్య వైరల్‌ షేరింగ్‌ కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది3,4. కొన్ని సందర్భాల్లో, ఇది జూనోటిక్‌ స్పిల్‌ఓవర్‌ను సులభతరం చేస్తుంది-ప్రపంచ పర్యావరణ మార్పు మరియు వ్యాధి ఆవిర్భావం మధ్య యాంత్రిక లింక్‌. ఇక్కడ, మేము భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ యొక్క సంభావ్య హాట్‌స్పాట్‌లను అనుకరిస్తాము, క్షీరద-వైరస్‌ నెట్‌వర్క్‌ యొక్క ఫైలోజియోగ్రాఫిక్‌ మోడల్‌ని ఉపయోగిస్తాము మరియు 2070 సంవత్సరానికి వాతావరణ మార్పు మరియు భూ వినియోగ దృశ్యాలలో 3,139 క్షీరద జాతుల కోసం భౌగోళిక శ్రేణిని మార్చాము. ఎత్తైన ప్రదేశాలలో, జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో మరియు ఆసియా మరియు ఆఫ్రికాలో మానవ జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొత్త కలయికలలో, వాటి వైరస్‌ల యొక్క నవల క్రాస్‌-స్పీసీస్‌ ట్రాన్స్‌మిషన్‌ను 4,000 సార్లు అంచనా వేస్తుంది. వాటి ప్రత్యేకమైన చెదరగొట్టే సామర్థ్యం కారణంగా,గబ్బిలాలు నవల వైరల్‌ షేరిం గ్‌లో ఎక్కువ భాగం,మానవులలో భవిష్య త్తులో ఆవిర్భావానికి దోహదపడే పరిణామ మా ర్గాల్లో వైరస్‌లను పంచుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా,ఈ పర్యావ రణ పరివర్తన ఇప్పటికే జరుగు తోందని మేము కనుగొన్నాము శతాబ్దంలో 2ళీజకంటే తక్కువ వేడెక్కడం భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ను తగ్గించదు. జాతుల శ్రేణి మార్పులను ట్రాక్‌ చేసే జీవవైవిధ్య సర్వేలతో వైరల్‌ నిఘా మరియు ఆవిష్కరణ ప్రయత్నాలను జత చేయాల్సిన తక్షణ అవస రాన్ని మాపరిశో ధనలు హైలైట్‌ చేస్తాయి, ప్రత్యే కించి అత్యధిక జూనోస్‌లను కలిగి ఉన్న ఉష్ణ మండల ప్రాంతాలలో వేగవంతమైన వేడెక్కడం జరుగుతోంది.
వేడి గాలుల ప్రభావం
ఈఅధిక ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా విద్యు త్‌ వినియోగం అకస్మాత్తుగా,వేగంగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల లో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.దీంతో బొగ్గు అవసరం విపరీ తంగా పెరిగింది. డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంవల్ల బొగ్గు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. బొగ్గు కొరత కార ణంగా,రాబోయే రోజుల్లో విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడ వచ్చని దిల్లీ ప్రభు త్వం ప్రకటించింది. ఇదే జరిగితే మెట్రో రైళ్లు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన సేవలపై కూడా ప్రభావం చూపు తుందనేది ఆందోళన కలిగించే అంశం.‘‘వేడి పెరిగినప్పుడల్లా బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం,ఆ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి పెరగకపోవడం,డిమాండ్‌-సరఫరా మధ్య అంతరం పెరగడం సహజం’’ అని ఎన్‌టీపీసీ మాజీ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ ముఖియా అన్నారు.సుదీర్ఘ వేడిగాలులు,విద్యుత్‌ సరఫరా అంతరాయాలు ప్రధానంగా పారిశ్రా మిక ఉత్పత్తి, పంటలపైనా ప్రభావం చూపి స్తాయి.వేడిగాలుల కారణంగా ఉత్పన్నమవు తున్న విద్యుత్‌ సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భారత్‌లో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి కూడా చేసుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు ధరలు కూడా పెరిగాయి. బొగ్గుకు డిమాండ్‌ కూడా పెరిగింది.వాతావరణపరంగా భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే కొన్ని వారాలు పెద్ద సవాలుగా మారవచ్చు.‘‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా బహిరంగ శీతలీ కరణ ప్రాంతాలు,తక్కువ విద్యుత్‌ కోతలు, స్వచ్ఛమైన తాగునీరు,కార్మికుల పని వేళల్లో మార్పు ఉండేలా చూసుకోవాలి. మండుతున్న వేడిలో పనిచేసే బడుగు బలహీన వర్గాల కోసం మనం ఈ చర్యలు తీసుకోవాలి’’ అని గుజరాత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అభియంత్‌ తివారీ చెప్పారు.
వేడిని ఎలా ఎదుర్కోవాలి
ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలి: చాలా మందికి దీని గురించి తెలుసు. శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే, హీట్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగు తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, తక్షణ వైద్య సహాయం అవసరం. వైద్య సహాయం వెంటనే అందని పరిస్థితుల్లో ఒక్కోసారి అపస్మారక స్థితికి దారి తీసి అవయ వాలకు కూడా హాని కలగొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రమాద సంకేతాలే. ఆహారం,నీరు : శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. సూర్యరశ్మికి దూరంగా: మీరు ఎంత ఎక్కువ ఇంటి లోపల ఉండగలిగితే అంత మంచిది. పగటిపూట వీలైతే, బయటకు వెళ్లవద్దు. వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దుస్తులు: మీరు బయటకు వెళ్లినప్పుడు మిమ్మల్ని మీరు కప్పి ఉంచుకోండి,కానీ మీరు కాటన్‌ దుస్తులు ధరించాలని గుర్తు పెట్టుకోండి. తలపై టోపీ పెట్టుకోవడం మంచిది.చల్లదనం: ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడటంతో పాటు చల్లని నీటితో స్నానం చేస్తూ ఉండాలి.

122 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎండలు..!

మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌వల్ల ప్రపంచవ్యాప్తంగాపక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణశాఖ వెల్లడిరచింది.
ఈఏడాది భానుడు ప్రజలపై నిప్పులు కురిపిస్తున్నాడు.దీనివల్ల అధిక ఉష్ణోగ్రతలు,ఉక్కుపోత. దీనికి తోడు కరెంటు కోతలు తోడుకావడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయికి ఎండలు పెరుగుతున్నాయి. మార్చిలో దేశ వ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రత 33.10 డిగ్రీలుగా నమోదైంది.భారత వాతావరణశాఖ అందించిన వివరాల ప్రకారం..ఈ సంవత్సరం మార్చినెలలో ఉష్ణోగ్రతలు 122ఏళ్లలో నమోదైన వాటికంటే అత్యంత ఎక్కువైనవిగా పేర్కొంది. దీన్నిబట్టి వాతావరణంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవాలి.
ఢల్లీి మార్చినెలలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా రెండు హీట్‌వేవ్స్‌ను చూసింది. సగటు గరిష్ట,కనిష్ట ఉష్ణోగ్రతలు వరసగా 32.9సెల్సియస్‌(సాధారణ సగటుకంటే 3.3సీ),17.6సీ(సాధారణ సగటు కంటే 2సీ)వద్ద సాధారణం కంటే ఎక్కువగా నమోద య్యాయి. భారత దేశంలో ప్రతి పది సంవత్సరాలకి హీట్‌వేవ్‌ రోజుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత గణాంకాలను చూసినట్లయితే 198190లో 413 రోజుల నుంచి 200110లో 575 రోజులకు,201120 మధ్యలో ఇది 600రోజులకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌ అని నిపుణులు అంటున్నారు. వాతావరణమార్పులు,పెరుగుతున్న నగరీకరణ,అడవుల నరికివేత వంటి కూడా మారుతున్న వాతావరణ తీవ్రతలకు దోహదపడ్డాయని వారు చెబుతున్నారు. వీటికి తోడు దేశ వ్యాప్తంగా నమోదవుతున్న తక్కువ వర్షపాతం మరోకారణంగా తెలుస్తోంది. వర్షపాతం లోపం భారత్‌లో 72శాతం ఉండగా..దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో అది అత్యధికంగా 89శాతానికి పెరిగింది. ఆకాశంలో మేఘాలు లేనందున సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడుతున్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఊహించిన స్థాయికంటే ఎక్కువగా ఉంటున్నాయి. పొడి, వేడిగాలులు, వాయువ్య,మధ్య భారతదేశంలోకి వీస్తున్నాయి. 19602009మధ్యకాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.5సెల్సియస్‌ పెరగడం కారణంగా వడగాల్పుల వల్ల సంభవించిన మరణాలు 146శాతం వరకు పెరిగాయి. దేశంలోని 13శాతం జిల్లాలు,15శాతం ప్రజలు ఈహీట్‌వేవ్‌లకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.దీనివల్ల పేదలు,అట్టడుగు వర్గాలు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దేశంలోని శ్రామికవయస్సు జనాభాలో అధికశాతం మంది వ్యవసాయం,నిర్మాణం,రిక్షాలాగడం వంటి బహిరంగ ఉద్యోగాల్లో ఉండటంవల్ల వారిపై వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతినటంతోపాటు,జీవనోపాధికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దక్షణధృవం,ఉత్తర ధృవంలో వాతావరణం మార్పులవల్ల ఐసుగెడ్డలు కరిగిపోతుంది. దీని కారణంగా వాతావరణంలో వేడి పెరిగి సముద్ర నీటిమట్టం పెరుగుతుంది. దీనివల్ల ప్రపంచంలోని దీవులతోపాటు,భూమి మునిగిపోతుంది. ఈ పర్యావరణ మార్పులు వల్ల(క్లైమేట్‌ ఛెంజ్‌)లో పక్షలు వేడి ప్రదేశం నుంచి చల్లని ప్రదేశానికి వలసలు వస్తున్నాయి. దీనివల్ల కోవిడ్‌19 వంటి ఇంకా భయంకరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ! ఈనేపథ్యంలో పర్యావరణంలో సంభవిస్తున్న మార్పుల పట్ల ప్రపంచ దేశాలన్నీ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములై గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణకు తోడ్పడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్

దేశాన్ని కాపాడుకుందాం..!

ధరల పోటు,నిరుద్యోగం,ఎక్కడ చూసినా అభద్రత…ఒక్కటి కాదు అనేక సమస్యలు దేశ ప్రజల్ని చుట్టుముట్టాయి. ఎనిమిదేళ్లుగా మోడీ సర్కార్‌ తీవ్రతరం చేసిన అత్యంత ధనవంతులు, బడా కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు కొనసాగడం వల్లే సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిరది. ఇదంతా ఆగాలంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని కార్మిక, కర్షక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే ప్రజా ఆందోళన మరింత ఉధృతం అవుతుందనే హెచ్చరిక చేసేందుకు మార్చి 28,29 రెండు రోజులు 48 గంటలపాటు దేశవ్యాప్త సమ్మెకు కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, యువత, కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలు… ఇలా అనేక వర్గాలు పాల్గంటున్నాయి. ‘దేశాన్ని.. ప్రజల్ని కాపాడుకుందాం’.. అనే నినాదంతో ముందుకు కదులాయి.
చారిత్రాత్మకమైన ఈ సమ్మెలో దాదాపు 25కోట్లమంది కార్మికులు పాల్గొరని ఒక అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగమంతా సామూహిక నిరసన కార్యక్రమాలు చేపడు తున్నారు. తయారీరంగం,బ్యాంకింగ్‌,ఆర్థిక సేవా సంస్థలు,విద్యాసంస్థలు,ప్రభుత్వ కార్యాల యాలు, రవాణా,నిర్మాణం,ఓడరేవులు…మొదలైన రంగాలన్నీ సమ్మెలో పాలుపంచు కుంటుండటంతో రెండు రోజుల పాటు కార్యక లాపాలు స్తంభించిచాయి. దేశానికి స్వాతంత్య్రం లభించి 75ఏళ్లయిన సందర్భంగా మోడీ సర్కార్‌,బిజెపి నాయకులు ‘అమృత కాలం’ మొదలైందని ప్రచారం చేసుకుంటున్నారు. కుటుంబ ఆదాయం కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడుతుంటే,నిరుద్యోగంరికార్డ్‌స్థాయికి చేరుకొంటే,అధిక ధరలతో సామాన్యుడు వణికి పోతుంటే.. ‘అమృత కాలం’ఎలా అవుతుంది? అనికార్మిక, కర్షక సంఘాల నాయకులు ప్రశ్నిస్తు న్నారు. అనేక రంగాల్ని అభద్రత ఆవహిం చింది. సమ్మె జయప్రదానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే ముమ్మర ప్రచారం చేశారు. మోడీ సర్కార్‌ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తుం దోనని. ప్రభుత్వరంగ ఉద్యోగులు,బ్యాంకింగ్‌ ఉద్యోగులు హడలిపోతున్నారు. కార్మిక సంఘాల డిమాండ్లు…
– 12 అంశాల డిమాండ్‌తో కార్మికులు, కర్షకులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. కోవిడ్‌ సంక్షోభం కారణంగా కష్టపడుతును కుటుంబాలకుతక్షణ ఆర్థిక సహాయం అందించడం వంటి కొత్త సమస్యలను డిమాండ్‌ చార్టర్‌ చేర్చింది.
– నాలుగు లేబర్‌ కోడ్‌లు, ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ (ఇడిఎస్‌ఎ)నిరద్దు చేయాలి.
– వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తామనిప్రధానిమోడీ ప్రకటించిన తర్వాత, పెండిరగ్‌లో ఉను ఇతర డిమాండ్ల కోసం పోరాటం కొనసాగిస్తామనిరైతు సంఘాలు ప్రకటించాయి.
– వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ‘జాతీయ నగదీకరణ విధానాన్ని’ రద్దు చేయాలి.
-ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాలందరికీ నెలకు రూ.7,500 ఆదాయ మద్దతును అందించాలి
– ఉపాధి హామీకి కేటాయింపులను పెంచాలి. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ విస్తరించాలి
– అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రతను అందించాలి.
– అంగన్‌వాడీ,ఆశా,మధ్యాహు భోజనం, ఇతర స్కీమ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి.
– లక్షలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పారా మెడికల్‌, సహాయక సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి.
– వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఇతర కీలకమైన ప్రజా సేవల్లో ప్రభుత్వ పెట్టుబడిని పెంచాలి.
జు పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని గణనీయంగా తగ్గించి, ధరల పెరుగుదలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలి.
– కాంట్రాక్ట్‌ కార్మికులు, స్కీమ్‌ వర్కర్లందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
పెట్రో,గ్యాస్‌ మంటలు
సామాన్యుడు చెల్లించే పెట్రో ధరల్లో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఇంత పన్నుల భారం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. మూలధరతో పన్నుల శాతం ముడిపడి ఉండటంతో ధరలు పెరిగే కొద్ది పన్నుల రూపంలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. అందులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు వీలుగా పన్ను బదులు సర్‌ చార్జీలను పెంచుతూ పోతోంది కేంద్ర ప్రభు త్వం. ఇలా ప్రజల్ని కొల్లగొట్టి దానిని రాయితీల రూపంలో కార్పొరేట్లకు దోచిపెడు తోంది. ప్రజా క్షేమం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెట్రో ధరలను నియంత్రిం చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీనికోసం రాష్ట్రాలు నష్టపోకుండా పన్నుల విధానంలో అవసరమైన మార్పులు చేయాలి. ప్రజలను ధరాఘాతం నుండి ఆదుకోవాలి. లేకపోతే, దాని ప్రభావం నిత్యావసర సరుకులపై పడి సామాన్యులకు గుదిబండ అవుతుంది.
వ్యవస్థలో ఆంక్షలు
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు దౌడు తీస్తున్నాయి. 2014 తరువాత ముడి చమురు అత్యధిక ధర (బ్యారెల్‌ దాదాపుగా 100 డాలర్లు)కి చేరింది. ఐతే, ఏరోజుకా రోజు ధరలు పెరిగే మన దేశంలో 110రోజుల నుండి ఒక్క పైసా ధర కూడా పెరగలేదు. బ్యారెల్‌ ధర 82 డాలర్లు ఉన్నప్పుడు మన దేశంలో చివరిసారిగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆతరువాత నాలుగు నెలలుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగకపోవడానికి కారణం ఎన్నికల రాజకీయాలేనన్నది సర్వ విదితం. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ముడి చమురు ధర ఒక డాలరు పెరిగితే దేశంలో ఒక లీటరు పెట్రోలు, డీజల్‌పై 45 నుండి 50 పైసలు పెరుగుతుందని, ఎన్నికల కారణంగా ధరలు నియంత్రించిన గత 110 రోజుల్లో ఆయిల్‌ కంపెనీలు కోల్పోయిన మొత్తాన్ని కూడా కలుపుకుంటే ఈ పెరుగుదల 10 రూపాయల వరకు ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఈ విశ్లేషణలను నరేంద్రమోడీ ప్రభుత్వం ఖండిరచడం లేదు. దీనిని బట్టే రానున్న రోజుల్లో ధరాభారం ఖాయమనే స్పష్టమౌతోంది. ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అత్యంత హేతుబద్ధమైనదిగా చిత్రీకరించి…అన్ని దేశాలనూ ఒప్పించడం ద్వారా దానిని ఉనికి లోకి తెచ్చారు. కాని ఈ వ్యవస్థ సామ్రాజ్యవాద పెత్తనాన్ని మరింత పెంచేందుకోసమే రూపొందింది. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తమను ఆర్థికేతర కారణా లతో వ్యతిరేకించే దేశాలపై కక్ష సాధింపుకు సామ్రాజ్యవాదం ఉపయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో సభ్యదేశంగా ఉండాలా వద్దా అన్నది అంతర్జాతీయ వాణిజ్యం పరిధిలోకి రాని అంశం. కాని ఆవివాదం కారణంగానే ఇప్పుడు రష్యా మీద ఆంక్షలను విధించారు. పోకము నుపు భారతదేశానికి సోవియట్‌ యూనియన్‌ తోను, తూర్పు యూరపు సోషలిస్టు దేశాలతోను వ్యాపార లావాదేవీలలో రూపాయిలతోనే చెల్లింపులు జరిగేవి. అంతర్జా తీయంగా అమెరికన్‌ డాలర్‌ను రిజర్వు కరెన్సీగా అందరూ అంగీకరించినప్పటికీ, సరుకుల మారకానికి ఆ డాలర్‌ను కొలమానంగా ఈ లావాదేవీలలో మనం ఆ కాలంలో ఉపయో గించలేదు. రష్యన్‌ రూబుల్‌తో మన రూపాయి ఏ రేటుకు మారకం చేయాలో ఆ రేటును ముందే నిర్ణయించి, దానిని స్థిరంగా ఉంచుతూ వ్యాపారం సాగించేవారు. ఇరు దేశాల నడుమ వ్యాపార చెల్లింపులలో ఒక దేశానికి లోటు ఏర్పడితే దానిని వెంటనే సెటిల్‌ చేసేయాలనే షరతు ఏదీ ఉండేదికాదు. కాలక్రమేణా ఆ లోటు సర్దుబాటు అయ్యేది. అంతే తప్ప ఏనాడూ డాలరు కొలమానం ఉపయోగిం చలేదు. డాలర్లు తగినంత మొత్తంలో లేనందువలన ఇరు దేశాల నడుమా వ్యాపారా లు ఆగిపోయే పరిస్థితి. అందువల్లనే ఉత్పన్నం కాలేదు. పైగా డాలరు ప్రసక్తి లేకపోయేసరికి ఇరు దేశాలకూ మరింత తేలికగా, మరింత ఎక్కువగా వ్యాపారం చేసుకోగలిగిన పరిస్థితి ఉండేది. ఈ పద్ధతి చాలా సహేతుకమైది. ఇరు దేశాలలోనూ ఒకరికి అవసరమైన సరుకులు రెండో దేశం దగ్గర ఉన్నప్పుడు డాలర్లు తగిన మొత్తంలో లేకపోయినా, ఆ సరుకును కొనుగోలు చేయడానికి ఏ ఆటంకమూ ఉండదు. ఇది ఆ రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండిన విధానం. డాలర్ల కోసం విధిగా ఏదో సరుకును మూడో దేశానికి అమ్ముకుని, తద్వారా వచ్చిన డాలర్లతో మాత్రమే తనకు అవసరమైన సరుకును రెండో దేశం నుండి కొనుగోలు చేయవలసిన అగత్యం ఏర్పడదు. వ్యాపారం యావత్తూ డాలర్ల రూపంలోనే సాగాలంటే సంపన్న పెట్టుబడిదారీ దేశాల దగ్గరే ఆడాలర్లు ఎక్కువగా ఉంటాయి గనుక ఆ దేశాలకు కావ లసిన సరుకులను, అవి చెప్పిన రేటుకు తెగన మ్ముకోవలసిన దుస్థితి వస్తుంది. అదే డాలరు ప్రస్తావనే లేకుండా రెండు దేశాలూ వ్యాపారం చేసుకోగలిగితే అటువంటి దుస్థితి ఏర్పడదు. కాని నయా ఉదారవాద ఆర్థికవేత్తలు ఈ విధం గా డాలరుతో నిమిత్తం లేని ద్వైపాక్షిక వ్యాపారా లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటు వంటి ద్వైపాక్షిక వ్యాపారాలు అంతర్జాతీయ వ్యాపారాన్ని తేలికగా నిర్వహించుకోడానికి దోహదం చేస్తాయని మనం భావిస్తుంటే,వాళ్ళు మాత్రం ఈ తరహా వ్యాపారాలు అంతర్జాతీయ వ్యాపారాన్ని కుదించివేస్తాయని,పక్కదోవ పట్టిస్తాయని విమర్శించారు. తమ వద్ద ఉన్న డాలర్లకు సరిపడా సరుకులు దొరకడం లేదని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆయా దేశాలు ద్వైపాక్షికంగా వ్యాపారాలు నిర్వహించుకుంటూ తమ వైపు రావలసిన వ్యాపారాన్ని పక్కకు మళ్ళిస్తున్నాయని వారు అభ్యంతరాలు లేవనె త్తారు. ఒకసారి సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తర్వాత ఈ చర్చ నిలిచి పోయింది. డాలరు ఆధిపత్యం స్థిరపడిరది. నయా ఉదారవాదం ఎటువంటి ద్వైపాక్షిక వ్యాపారాలనూ అనుమతించదు. ప్రపంచ వ్యాప్తంగా ఒకే మారకపు రేటు ఉండాలని అది శాసిస్తుంది. విదేశీ మారకద్రవ్య వ్యాపారానికి కూడా ఈ సూత్రమే వర్తించాలని ఆదేశిస్తుంది. ఈమధ్య కాలంలో తమ ఆదేశాలను ధిక్కరిస్తున్న దేశాలపై సంపన్న పెట్టుబడిదారీ దేశాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇలా ఆంక్షలకు గురైన దేశాలు తమలో తాము ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను చేసుకోవడం మొదలైంది. తద్వారా తమపై విధించిన ఆంక్షల ప్రభావా న్నుంచి తప్పించుకోవాలని అవి ప్రయత్నిస్తు న్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసిన నేపథ్యంలో రష్యా మీద సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తీవ్రంగా వ్యాపార ఆంక్షలు విధించాయి. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా స్పందిం చారు. అమెరికా, తక్కిన సంపన్న పశ్చిమ దేశాలు మాత్రమే మొత్తం ప్రపంచం కాదని, ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉందని, తమను ఓ మూలకు నెట్టాలని చూస్తే అనేక దేశాలతో తాము ద్వైపాక్షికంగా ఒప్పందాలను కుదుర్చు కోగలమని పుతిన్‌ హెచ్చరించాడు. ఈ పరిస్థితి చూస్తే మళ్ళీ ప్రపంచంలో ద్వైపాక్షిక ఒప్పందాల జోరు పెరిగేలా ఉంది.రష్యాకు చెందిన బ్యాం కులు, ఇతర ఆర్థిక సంస్థలు పశ్చిమ దేశాల ఆర్థిక నెట్‌వర్క్‌తో ఏ విధంగానూ లావా దేవీలు జరిపేందుకు వీలు లేకుండా నిషేధిం చడం ఇప్పటివరకూ విధించిన ఆంక్షలలోకెల్లా తీవ్రమైనటువంటిది. స్విఫ్ట్‌ (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌) నెట్‌వర్క్‌ను రష్యన్‌ బ్యాంకు లకు అందుబాటులోకి లేకుండా చేయడం దీనిని సూచిస్తుంది. దీని వలన రష్యా తన దేశం నుండి విదేశాలకు చేసిన ఎగుమ తులకు ప్రతిగా డాలర్ల రూపంలో రావలసిన ఆదాయం నిలిచిపోతుంది. డాలర్లు లేకపోతే రష్యా తనకు అవసరమైన దిగుమ తులకు కొనుగోలు చేయలేదు. అటు వంట ప్పుడు రష్యా తన దిగుమతుల అవసరాల కోసం తప్పనిసరిగా డాలర్లతో ప్రమేయం లేని ద్వైపా క్షిక ఒప్పందాలను కుదుర్చుకోవలసి వస్తుంది. అందులో భాగంగా భారతదేశంతో కూడా గతంలో మాదిరిగా ద్వైపాక్షిక ఒప్పం దాలకు రష్యా సిద్ధపడవచ్చు. ఆ ఒప్పందాలు గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉన్న కాలంలో చేసుకున్న ఒప్పందాలను తలపించే అవకాశం ఉంది. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తట్టుకుని నిలదొక్కుకోడానికి రష్యాకు ఆ విధమైన ఒప్పందాలు ఎంతమేరకు దోహదం చేయగలవో ఆచరణలో చూడాల్సిందే. ఈవిధమైన ఆంక్షల ఫలితంగా వేలాదిమంది ప్రజలు సకాలంలో ఔషధాలు అందక వెనిజు లాలో, ఇరాన్‌లో మరణించారు. ఒకానొక ప్రభుత్వం తీసుకున్న వైఖరి అంగీకారయోగ్యంగా లేనందున ఆంక్షల పేరుతో అక్కడి పౌరులను సైతం బలి చేయాలా అన్నది చర్చ. ఐతే, రష్యా వంటి పెద్ద, బలమైన దేశం విషయంలో ఈ విధమైన చర్చ పెద్దగా వర్తించదు. పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు కాదన్నంత మాత్రాన రష్యాను పట్టించుకోకుండా దూరంగా ఉంచగ లిగిన స్థితి చాలా దేశాలకు లేదు. రష్యా బలమైన దేశమే గాక, ప్రపంచంలో దానికి చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. సామ్రా జ్యవాదం విధించే ఈ ఆంక్షలు అనేక వైరు ధ్యాలతో కూడివున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో సామ్రాజ్యవాదం విధించే ఆంక్షలు ప్రధానంగా అమెరికన్‌ డాలర్లు లేదా ఇతర ప్రధాన కరెన్సీలు ఆదేశాలకు అందుబాటులోకి లేకుండా చేస్తాయి. ఆవిధంగా ఆంక్షలు విధిం చిన ప్రతీ సందర్భంలోనూ ఆంక్షలకు గురైన దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిం చడం మొదలుపెడతాయి. ఆ క్రమంలో సామ్రా జ్యవాదం యొక్క పట్టు బలహీనపడడం ప్రారం భం ఔతుంది. ఆంక్షలకు గురైన దేశాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ద్వైపాక్షిక ఒప్పందాలు పెరుగు తాయి. సామ్రాజ్యవాదపు పట్టు బలహీన పడడం పెరుగుతుంది. ఆవిధంగా సామ్రాజ్య వాద ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వాణిజ్య వ్యవస్థ తలెత్తడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అత్యంత హేతుబద్ధమైనదిగా చిత్రీకరించి…అన్ని దేశాలనూ ఒప్పించడం ద్వారా దానిని ఉనికి లోకి తెచ్చారు.కాని ఈ వ్యవస్థ సామ్రాజ్యవాద పెత్తనాన్ని మరింత పెంచేందుకోసమే రూపొందింది. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని తమను ఆర్థికేతర కారణాలతో వ్యతిరేకించే దేశాలపై కక్ష సాధింపుకు సామ్రా జ్యవాదం ఉపయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ నాటో కూటమిలో సభ్యదేశంగా ఉండాలా వద్దా అన్నది అంతర్జాతీయ వాణిజ్యం పరిధిలోకి రాని అంశం. కాని ఆవివాదం కారణంగానే ఇప్పుడు రష్యా మీద ఆంక్షలను విధించారు. అంతర్జాతీ య వాణిజ్యం రాజకీయ వివాదాలకు అతీ తంగా,హేతుబద్ధంగా జరగాలంటూ తొలుత ప్రతిపాదించిన సామ్రాజ్యవాదులే ఇప్పుడు ఆ సూత్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తు న్నారు. వారి అసలురంగు ఏమిటో దీనిని బట్టే బైట పడుతోంది. నాటో కూటమి విస్తరణతో ముడి పడిన వివాదాల కారణంగా ఆయా దేశాలు పరస్పర వాణిజ్య సంబంధాలను ప్రతికూ లంగా దిగజార్చుకోవలసిరావడం పలు దేశా లకు ఆమోదయోగ్యం కాదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇమిడివున్న వైరుధ్యాల పర్యవ సానాలను నేడు మనం చూస్తున్నాం. నయా ఉదారవాదం ముందుకు పోయే దారి కనిపిం చని, దిక్కుతోచని స్థితికి ఏవిధంగా చేరుకుం టున్నదీ మనం చూస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణ రూపంలో మనకు కనిపించేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకా లంగా కొనసా గుతున్న సంక్షోభపు చిహ్నాలు, అమెరికా ఆధిప త్యానికి పెరుగుతున్న సవాళ్ళు మాత్రమే.- (ప్రభాత్‌ పట్నాయక్‌ )

1 17 18 19 20 21 48