లౌకిక సౌభ్రాతృత్వ విలువలు తిరిగి వికసించాలి

మహాత్మాగాంధీ,నెహ్రూ,భగత్‌సింగ్‌,ఆజాద్‌ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతం త్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75ఏండ్ల కింద ప్రారం భమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్స వం. ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ జరుపుకొనే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది. మూడు వందల ఏండ్లు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్రం, దైన్యా లతో ప్రజలు జీవిం చారు. ఆంగ్లే యులు మన దేశాన్ని జయించడానికి, సుదీర్ఘకాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. నైతిక పతనం ఎంత సులువో, దాన్ని తిరిగి నెలకొల్పడం చాలా కష్టం. మన దేశంలో మహమ్మా రిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యాలు,ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల,వర్ణ వ్యవస్థలు,సాంఘిక దురాచారాలు,నీచ స్వార్థాలతో సింథియా,హోల్కర్లు వంటి కొందరి రాజుల,ఆర్కాట్‌ వంటి నవాబులు అరా చక, భోగ లాలస,వ్యక్తిగత అహంకారాల వల్ల యావత్‌ ఉపఖండం దాస్యంలోకి వెళ్లిపోయింది.
దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.1757ప్ల్లాసీ,ఆంగ్లో-మైసూర్‌ యుద్ధా లు,1800 ఆరంభంలో హిందూ సాధువులు సంప్ర దాయ ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగు బాటు (ఈ ఉద్యమం ఇతివృత్తంగా బంకించంద్ర ఛటర్జీ‘ఆనందమఠం’అనే నవల రాశారు), 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం వీటిలో భాగమే.ఈ యుద్ధాల్లో మన ప్రజలనే సైన్యంగా మలచుకొని మన డబ్బుతొనే,మన పాలకులలో కొందరి ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు ఈ దేశభక్తియుత యుద్ధా లలో విజయం సాధించారు. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి. 1900 నుం చి స్వాతంత్య్ర సమరఆకాంక్ష మళ్లీ మొగ్గ తొడి గింది. దీనికి పునాదులు వేసిన వారు సామాజిక సంస్కర్తలు,కవులు,కళాకారులు.వీరి విశేష కృషితో భారతజాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఆంగ్లే యుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండటం సిగ్గు చేటనే భావన ప్రబలింది. 1880 నుంచి గెలుపోట ములతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా, ఉప్పెనగా కొనసాగిన1905,1917,1921,19 29,1942,1947వరకు ప్రజావెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
స్వాతంత్య్ర పాలన తొలినాళ్ళలో వైజ్ఞాని కవేత్త,సోషలిస్ట్‌ నెహ్రూ,సామాజిక విప్లవ నేత అంబే ద్కర్‌ల నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం,రవాణా, గనులు,శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉం చారు.చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చా రు.విద్య,పాలన,ఆర్థిక విషయాల్లో వేల ఏండ్లుగా భాగస్వామ్యానికి నోచుకొనివారికి చోటుదక్కింది, వ్యవసాయ వైజ్ఞానికరంగాల్లో స్వావలంబనతో పాటు అనేక విజయాలు సొంతం చేసుకున్నాం. వేల ఏండ్లుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచి నమత మౌఢ్యం,విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజల ఐక్యతను చీల్చే రాజకీయాలు పురుడు పోసు కొని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయో ద్యమంలో కానీ,సాంఘిక విప్లవాలతో కానీ సంబం ధం లేని శక్తుల పాలనలో ప్రస్తుత జీవన ప్రామా ణికత సూచికల్లో అన్నీఅధమస్థానాలే. సాధించుకున్న అనేక హక్కులను, రాజ్యాంగ వ్యవస్థలను, రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్యవ్యవస్థ స్ఫూర్తిని కాలరాస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతం త్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే బాధ్యతను విద్యా వంతులు,ప్రజాస్వామికవాదులు తీసుకోవాలి. లౌకిక,సౌభ్రాతృత్వ విలువలను తిరిగి వికసింప జేయాలి.
లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను కాపాడుకుందాం
భయంకరమైన మత విభజనల పెరుగు దలతోపాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనా గరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు.భిన్నాభిప్రా యంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మోడీ ప్రభుత్వం ‘’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’గా నామకరణం చేసింది. ఈ సందర్భం, దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే దృష్టిని సారించే పెద్ద ప్రచారంగా మారింది. దీని కోసం ఖాదీ, కాటన్‌,సిల్క్‌ కానటువంటి పాలిస్టర్‌ జెండాలను కూడా అనుమతించే విధంగా భారతదేశ జెండా కోడ్‌ను డిసెంబర్‌ 2021లో సవరించారు. దేశంలో అత్యంత పెద్ద పాలిస్టర్‌ ఉత్పత్తిదారులెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంపిక చేయబడిన సన్నిహితులు భారీ లాభాలనుపొందే అవకాశాలను ఇది సమ కూర్చుతుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేంతవరకు,ఆరెస్సెస్‌,బీజేపీలు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. కాషాయ జెండాపైనే వారికి విశ్వాసం. ఆరెస్సెస్‌కు భారత స్వాతంత్య్రో ద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇది చరిత్రకారులు నమోదు చేసిన, ఆనాటి బ్రిటిష్‌ ఇంటి లిజెన్స్‌ నివేదికలు ధృవీకరించిన నిజం.
మహోన్నతమైన పాత్ర
దీనికి భిన్నంగా, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌)కి చెందిన తొమ్మిది మంది వ్యవస్థా పక పొలిట్‌ బ్యూరో సభ్యులందరినీ బ్రిటిష్‌ ప్రభు త్వం అరెస్ట్‌ చేసింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో సుదీర్ఘ కాలంపాటు వారంతా జైల్లోనే గడిపారు. అండమాన్‌లోని సెల్యులార్‌ జైల్‌ (కాలాపాని) వద్ద పాలరాతిపై చెక్కబడిన చాలాపేర్లు కమ్యూనిస్ట్‌ విప్ల వోద్యమంతో ముడిపడి ఉన్నాయి. 1947 ఆగస్ట్‌, 15 నాటికి కన్ననూర్‌ జైల్లో ఖైదీగా ఉన్న కామ్రేడ్‌ ఎ.కె.గోపాలన్‌జాతీయ జెండాను ఆవిష్క రించాడు. 1932 హోషియార్‌పూర్‌ కలెక్టరేట్‌లో యూనియన్‌ జెండాను కిందకులాగి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన 16 ఏళ్ల హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ను బ్రిటిష్‌ వారు అరెస్ట్‌ చేశారు. కమ్యూనిస్టులకు, సీపీఐ(ఎం)కు దేశ భక్తి, త్యాగనిరతి అనేవి భారతదేశ సోషలిస్టు పరివ ర్తన యొక్క విప్లవ దార్శనికతకు అంతర్భాగంగా ఉంటాయి.1920లో దాని పుట్టుక నుండే కమ్యూ నిస్ట్‌ పార్టీ జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడం ఆరంభించింది. 1921లో అహ్మదాబాద్‌ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమా వేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మౌ లానా హస్రత్‌ మోహాని,స్వామీ కుమారానంద బ్రిటిష్‌ వారినుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాం డ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ దానిని గాంధీజీ అంగీకరించలేదు (‘సంపూర్ణ స్వరాజ్యం’ పిలుపు 1929లో మాత్రమే ఇచ్చారు). తరువాత 1922లో గయ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను పంచింది. ఆతర్వాత జరిగిన ఏఐసీసీ సమావేశా ల్లో కూడాఇది కొనసాగింది.జాతీయోద్యమ ఎజెం డాను ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పాత్రను పోషించారు.1940లలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూపోరాటాలు స్వాతంత్య్ర సాధనలో కీలకమైనవి.కేరళ లోని పున్నప్ర వాయలార్‌, బెంగా ల్‌ లోని తెభాగపోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీటిలో ముఖ్యమైనవి.భారతదేశంలోని భాషాపరమైన భిన్న త్వాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారిని స్వాతంత్య్ర పోరా టంతో ఐక్యంచేయడంతో,స్వతంత్ర భారత దేశంలో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది.లౌకికవాదంపట్ల కమ్యూనిస్టులకుండే అచం చలమైన నిబద్ధత, స్వాతంత్య్ర పోరాట కాలంలో చెలరేగిన మత ఘర్షణల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పి,నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్రను పోషించింది. కమ్యూనిస్టులు నేటికీ లౌకికవాదానికి అత్యంత నిబద్ధత కలిగిన సమర్థకులుగా ఉన్నారు.
చరిత్ర వక్రీకరణ
కానీ,నేడు తమను తాము స్వాతంత్య్రో ద్యమ పోరాటంలో భాగస్వాములమని తప్పుడు ప్రచారం చేసుకోవడం ద్వారా ఆరెస్సెస్‌, బీజేపీలు చరిత్రను వక్రీకరించి,చరిత్రను తిరగ రాసే ప్రయ త్నం చేస్తున్నాయి. హిందూత్వ, ఆరెస్సెస్‌ నాయకులు స్వాతంత్య్ర సమర యోధులని చిత్రీకరిస్తూ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. ఈప్రచారంలో ఉదహరిం చబడిన వారిలో వీడీ సావర్కర్‌ ముందున్నాడు. హిందూ మతాచారంతో సంబంధం లేని రాజకీయ లక్ష్యాలు గల ‘హిందూత్వ’ అనే పదాన్ని 1923లో కనుగొన్నది వి.డి.సావర్కర్‌. ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం మహ్మదాలీ జిన్నా పోరాటానికి నాయ కత్వం వహించడానికి రెండు సంవత్సరాల ముందే సావర్కర్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చా డు.దానిని బ్రిటిష్‌ వారు ప్రోత్సహించాడు.ఆ తర్వా త విషాదకరంగా దేశ విభజన జరిగింది. బ్రిటిష్‌ పాలకులతో సంధి కుదిరిన తరువాత సావర్కర్‌, తనరాజకీయ జీవితంలో ఎక్కు వ భాగం, కాంగ్రెస్‌, వామపక్షాల నేతృత్వం లోని ఉద్యమాలకు వ్యతిరేకం గానే ఉన్నాడు. హిందూ మహాసభ నాయకునిగా, 1942లో జరిగిన క్విట్‌ ఇండియా లాంటి ఉద్య మాలలో హిందూ మహా సభ, ఆరెస్సెస్‌ సభ్యుల భాగస్వామ్యం లేకుండా చూశాడు. వాస్తవాలన్నిటిని మరుగునపెట్టి వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కమ్యూ నిస్టుల విషయం పక్కన పెట్టండి, ప్రభుత్వ ప్రచారా లలో జవహర్‌ లాల్‌ నెహ్రూ గురించి కూడా ఎక్కడా ప్రస్తావిం చడం లేదు.భారత రాజ్యాంగం, స్వాతంత్య్ర భారత దేశం ఒకఆధునిక లౌకిక ప్రజా స్వామిక రిపబ్లిక్‌గా రూపొందేందుకు దారి తీసిన అనేక చర్చలు, తీర్మా నాలకు దారి చూపిన వ్యక్తి నెహ్రూ. ఈ విషయాన్ని మరుగుపరిచి బీజేపీ తన ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యం ఆలోచనను నిజం చేసే చర్యలను ముందుకు తీసు కొనిపోతోంది.
భారత రాజ్యాంగంపై దాడి
ఈఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే, మన రాజ్యాంగం కల్పించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణం పైన దాడి చేసి, బలహీనపరచి, నాశనం చేయాల్సి ఉంది. తదనుగుణంగానే 2019లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుండి…మన రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాలు తీవ్రమైన దాడికి గురవు తున్నాయి. చర్చలులేని తీరుతో పార్లమెంట్‌ సాంప్ర దాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఏ విధమైన చర్చలు లేకుండానే కేవలం మంద బలంతో చట్టా లను ఆమోదింపజేసు కుంటున్నారు. ప్రస్తుత పార్ల మెంట్‌ సమావేశాల్లో, ఆకాశాన్నంటే ధరలు, పెరిగి పోతున్న నిరుద్యోగం లాంటి ప్రజలెదుర్కొం టున్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేసిన నేరా నికి గతంలో ఏనాడూలేని విధంగా27మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. పని చేయని పార్ల మెంట్‌ చాలా ప్రమాదకరం.అంటే భారత రాజ్యాం గం యొక్క ప్రాముఖ్యత, ప్రజల సార్వభౌ మత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఎంపీల అధికారం, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం లేకుండాపోవడం.పార్లమెంట్‌ను బలహీనపర్చ డమంటే, ప్రజల సార్వభౌమత్వాన్ని రద్దు చేయడం, ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకొని, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వం వైపు వెళ్లడం.దాదాపు మూడేళ్లుగా ఆర్టికల్‌ 370,ఆర్టికల్‌ 35ఏ రద్దు సవాళ్లు, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం),రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికలబాండ్లు మనరాజ్యాంగాన్ని ఉల్లం ఘించే అంశాలుగా మారాయి. ఇవేవీ సుప్రీం కోర్టుకు వినిపించవు. న్యాయ వ్యవస్థ యొక్క నిష్పా క్షికత,స్వతంత్రత తీవ్రంగా రాజీ పడినప్పుడు, రాజ్యాంగ నిబంధనల అమలు,ప్రజాస్వామిక హక్కు ల హామీలు,పౌర హక్కులపై విచారణ ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది.అదేవిధంగా,ఒక ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ, స్వేచ్ఛాయుత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిష న్‌ స్వతంత్రత, నిష్పాక్షికత చాలా ముఖ్యమైనవి. ఇది రాజీ పడినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకే మాత్రం ప్రజల తీర్పును, ప్రజాస్వామిక అభిప్రాయా లను ప్రతిబింబించవు. సీబీఐ,ఇ.డిమోడీ ప్రభుత్వ రాజ కీయ ఎజెండాను అమలు చేయడానికి సాధనా లుగా మారిన తీరును దేశమంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచడం,ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన ప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడానికి గల హామీకై పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దానిని నాశనం చేస్తున్నారు.
తీవ్రమైన మత విభజనలు
ఇలా భారీగా రాజ్యాంగ క్రమాన్ని నాశ నం చేయడంతో పాటు భారతరిపబ్లిక్‌ లౌకిక ప్రజా స్వామిక లక్షణాన్ని నాశనం చేయడానికి విషపూరిత మైనద్వేషం,భయాల వ్యాప్తిపై ఆధారపడి క్రూరమైన రీతిలో మత విభజనల ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ‘బుల్డోజర్‌ రాజకీయాల’ వ్యూహ రచన, కొన్ని రాష్ట్రాల్లో హింసకు దారితీసే రీతిలో మైనా రిటీలను లక్ష్యంగా చేసుకోవడం, పార్లమెంట్‌ నూతన భవనంపైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సంద ర్భంలో హిందూ మతాచారాలను ఆచరించడం లాంటి చర్యలు భారతరాజ్యాన్ని,ప్రభుత్వాన్ని హిం దూత్వతో గుర్తిస్తున్నారు కానీ భారత రాజ్యాంగంతో కాదని స్పష్టం చేస్తున్నాయి.ఇలాంటి భయంకరమైన మత విభ జనల పెరుగుదలతో పాటు గతంలోలేని విధంగా ప్రజల పౌరహక్కులు,ప్రజాస్వామిక హక్కు లపై దాడులు జరుగుతున్నాయి.తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇత రులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభి ప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.ఈ హిందూత్వ కథనం విజయవంతం కావాలంటే,ఈ ఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ లోని సిద్ధాంతం కొనసాగడానికి భారతదేశ చరిత్రను తిరగ రాయా ల్సిన అవసరం ఉంటుంది. అందుకే విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు. వివేచనా రహిత ఆలోచనలను ప్రచారంచేస్తు న్నా రు.హేతుబద్ధత స్థానాన్ని మార్చేప్రయత్నం చేస్తు న్నారు.గుడ్డివిశ్వాసాలను ప్రచారం చేస్తూ, శాస్త్రీయ తను కాదని పురాణాలను ప్రచారం చేస్తు న్నారు. చరిత్రస్థానంలో హిందూ పురాణాలను, తత్వ శాస్త్రం స్థానంలో హిందూ ధర్మశాస్త్రాన్ని తీసు కొని రావడంద్వారా భారతదేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని నాశనం చేస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పౌష్టికాహార లోపం లాంటి రోజువారీ సమస్యలపై ప్రజా పోరా టాలను, ప్రతిఘటనలను పెంచడం ద్వారా భారత దేశం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాం గాన్ని రక్షించి, బలోపేతం చేసే బాధ్యతను తీసు కోవాలి. ప్రజా స్వామ్యం,ప్రజాస్వామిక హక్కులు,పౌర హక్కులు, లౌకికవాదాల రక్షణకై పోరాటా లను ఉధృతం చేయాలి. బలమైన ప్రజా పోరాటా లను ఉధృతం చేయడం ద్వారా సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. వామపక్ష శక్తుల ఐక్యతను సంఘటిత పరచడం, వామపక్ష ప్రజా తంత్ర శక్తుల్ని ఏకం చేయడం, హిందూత్వ మతో న్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన లౌకిక శక్తులను సిద్ధం చేయడం ద్వారానే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ రాజ్యాంగాన్ని రక్షించు కోగలం.ఈలక్ష్యాన్ని నిజం చేసే మన దేశభక్తి తోనే ఆగస్ట్‌ 15న అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీ య జెండాను ఆవిష్కరించి, మనరాజ్యాంగంలోని పీఠిక పై ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోవాలి.ఈఉన్మాద పూరిత,ఫాసిస్టు ప్రయ త్నాల నుండి స్వేచ్ఛకోసం, మనలౌకిక ప్రజాస్వామికరిపబ్లిక్‌నుకాపాడు కోవడం కోసం జరిగే పోరాటాన్ని బలపరుచు కుందాం!
భయంకరమైన మత విభజనల పెరుగు దలతో పాటు గతంలో లేనివిధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు..కొంతమంది జర్నలిస్టులు,ఇతరులు అనా గరిక చట్టాలకింద జైల్లోఉన్నారు. భిన్నాబి óప్రాయం తో కూడిన ప్రతీవ్యక్తీకరణను ‘దేశద్రోహం’గానే పరిగణిస్తున్నారు.
వ్యాసకర్త : సిపిఎం ప్రధాన కార్యదర్శి (ప్రజాశక్తి సౌజన్యంతో)- (అస్నాల శ్రీనివాస్‌ / సీతారాం ఏచూరి)

మ‌న్యం వీరుడు…స్వ‌రాజ్య భానుడు-అల్లూరి తొలి దాడుకు వందేళ్లు! 1922-2022

‘ ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాప నల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహిం చారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారా మరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి 1922`2022 ఆగష్టు 22తో నూరు వసంతాలు పూర్తియ్యింది ’’ -గునపర్తి సైమన్‌
సీతారామరాజు విప్లవం విజయవంతం కాక పోయినా.. ఆయన ధైర్యసాహసాలు, ప్రాణ త్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ,దేశభక్తినీ పురి గొల్పాయి.సన్యాసి జీవితం గడిపిన రాజు,తన స్వీయ ముక్తి కంటే,అణగారిన ప్రజలసాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయడమే తన విద్యుక్త ధర్మమని భావించాడు.భారతదేశ చరిత్రలో సన్యసించి,విప్లవకారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ఘోష్‌,అల్లూరి సీతారామ రాజు మాత్రమే మనకు కనిపిస్తారు…27ఏళ్ళ వయసులో విప్లవజ్వాలలు,అల్లూరి సీతారామ రాజు జీవితం ఎం దరికో ఆదర్శనీయం,మన్యం వీరుడి పోరాటానికి వందేళ్లు పూర్తియిన సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం! భారత స్వాతంత్య్ర చరిత్రలో(1897జూలై 4-1924 మే7) ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యా యం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాల ర్పించిన యోధుడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలా డిరచిన అల్లూరి సీతారామరాజు అమాయకులు, విద్యా విహీనులైన గిరిజన జాతి ప్రజలను ఒక్క తాటిపై నిలిపి,వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922-24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన,వేదనలే.స్థానిక సమస్యల మీద తలెత్తి నట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ,సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. శ్రీరామరాజు ఉద్యమకారు నిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం,గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు,ఉపసం హరణ ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామ రాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్ర లోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్‌ బెనర్జీని కలుసు కున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమ లలోని కృష్ణ్ణదేవిపేటకు 1917జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1920లో గాంధీజీ సహాయ నిరాకర ణోద్యమానికి పిలుపూ,‘ఒక్క ఏడాదిలోనే స్వాతం త్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్ల పల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్‌ కార్య కర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణో ద్యమ ప్రచారం చేశారు.1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్‌ భారత్‌’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడిరది. అప్పటికే రామ రాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్య క్రమమంతటిలోను మద్యపాన నిషేధం,కోర్టుల బహిష్కారం…ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగిం చాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈరోడ్ల నిర్మాణం ఓ అమా నుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్‌ అల్ఫ్‌ బాస్టియన్‌. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు),బట్టి పనుకుల మునసబు గాము గంతన్నదొర,అతని తమ్ముడు గాంము మల్లుదొర,గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవ రిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించు కున్నారు. బాస్టియన్‌ మీదపై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రక టించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసం హరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మో పారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు… ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్‌ స్టేషన్లను దోచు కోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్‌ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం… మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నిన దించింది. ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి జరిగింది. ఆగస్ట్‌ 24న రాజ వొమ్మంగి స్టేషన్‌ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్‌లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈదాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఏ గ్రాహవ్న్‌కు టెలిగ్రావ్న్‌లు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్‌ సాండర్స్‌, కలెక్టర్‌ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రం గా మన్యం ఖాకీవనమైంది.అలాంటి వాతా వరణంలోనే జైపూర్‌ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్‌ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్‌ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్‌ 24న గాలింపు జరుపుతున్న స్కాట్‌ కవర్ట్‌, నెవెల్లి హైటర్‌ అనే ఒరిస్సా పోలీ సు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్‌ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల,చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్‌ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్‌ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్‌ 23న మలబార్‌ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. 1922 డిసెంబర్‌ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరం గులతో మలబార్‌ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్‌ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్‌ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాం గాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్‌లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు రామరాజు మారు వేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్య మమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్య మాన్ని గమనిస్తూనే ఉన్నారు. 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచయుద్ధంలో అనుభవం ఉంది.అస్సాం రైఫిల్స్‌ అధిపతే మేజర్‌ గుడాల్‌. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్‌ జార్జ్‌ రూథర్‌ ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్‌ కమిష నర్‌గా నియమించారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓకుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్‌ దళానికి చెందిన కంచుమేనన్‌, ఇంటెలిజెన్స్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజు ను ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయనమయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్‌గుడాల్‌… రాజుతో మాట్లాడా లని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్‌ 7న గాము గంతన్నను కాల్చి చంపారు. దాదాపు రెండేళ్ల ఉద్యమం,పోలీస్‌ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసులకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్‌.12 మందిని అండమాన్‌ పంపారు. చివరిగా…దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! ఆయన ఆత్మత్యాగం చేసిన 28 ఏళ్లకు.. భారత ప్రజ లకు లభించింది. స్వంతంత్ర భారతావని జయ కతనంగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచిపోయారు.

జీవనదులు..విలవిల!

భూమి వేడేక్కుతోంది.పర్యావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి.ప్రకృతి విఫత్తులు పేట్రేగి పోతున్నాయి.హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతుంది. కర్ణాటక,పాకిస్తాన్‌లో వరద భీభత్సం, అడుగుంటితున్నజీవనదులు,చైనాలో కరువకాటకాలు. దీనికి కారణం వాతావరణంలో కనీవినీ ఎరుగని మార్పులు.ఇదికేవలం ఒక్క దేశానికే పరిమితం అయన అంశం కాదు.విశ్వవ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించగల సమతుల్యత లేని పర్యావరణమే ఇందుకు ప్రధమ కారణం.ఈపెనుమార్పులుపై ఐక్య రాజ్యసమితి హెచ్చరిస్తున్నా..దేశంలో అనేకప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుమతులు యధేచ్ఛగా మంజూరు చేసేస్తోంది.
మరోపక్క హిమాలయాల్లో మంచుపర్వాతాలు కరిగిపోయి సముద్రమట్టం పెరిగిపోతుంది.ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పోనది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.యూరఫ్‌ పరిధి పది దేశాల గుండాపారే అతిపొడవైన నది డాన్యూబ్‌ కూడా చిక్కిపోతుంది. జర్మనీ,నెదర్లాండ్‌,స్విట్జర్లాండ్‌ దేశాలకు ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌నది పరిస్థితి ఎంతో ధైన్యంగా ఉంది. అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా కోట్లాది మందినీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి. ఇక ప్రపంచ ప్రసిద్ద ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయోర్‌ నదిలో కూడా నీరు అతివేగంగా అడుగంటుతోంది.చైనా,అమెరికా,ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతోవాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడాగుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగాకోట్లాది మంది తాగు,సాగునీటికి అల్లాడుతున్నారు.నిత్యంఉధృతంగా ప్రవహించే చైనాలోనియాంగ్జీనది మరింత దుస్థితిలో ఉంది. ఇదిప్రపంచంలోనే అతిపెద్దనదిగా గుర్తింపు ఉంది. ఇదిలాంటే..స్పెయిన్‌,పోర్చుగల్‌ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలవల్ల అక్కడ దట్టమైన అడవులు కాలిపోతున్నాయి.అడవులు నశించి పచ్చదనం పరిఢవిల్లక పోవడంవల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని కర్భన్‌ఉద్గారాలు పేరుకు పోంతోంది. ఫలితంగా ప్రకృతి సహజసిద్దమైనగుణాన్నికోల్పోయి భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది.ఇదింతా పర్యా వరణంలో సంభవిస్తున్న పెనుమార్పులని తెలుస్తోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరాంధ్రాజిల్లాల్లో నిక్షేపమైన నదీజలాలు ఇదేపరిస్థితి దాపురిం చనున్నట్లు సాంకేతాలుచవిచూస్తున్నాయి. దీనికికారణం ఇబ్బుడిముబ్బుడిగా ఇక్క పరిశ్రమలకు అను మతులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి సీతారామారాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం ప్రవహించే జీవనదులపై హైడ్రల్‌ ప్రాజెక్టులనిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.దీని నిర్మాణమంటూ జరిగితే భవిష్యుత్తులో ఇటు గిరిజనలు,అటు మైదాన ప్రాంతానికి తాగు,సాగునీటికి తీవ్రమైన విఘాతం ఏర్పడనుంది. పర్యావరణ పరిరక్షణ..నీటివనరుల సంరక్షణఅనే అంశంపై2005లో సమత ఉత్త రాంధ్రజిల్లాలో(శ్రీకాకుళం, విశాఖ పట్నం,విజయనగరం,తూర్పుగోదావరి)ల్లో ‘కొండల ఆరోగ్యమే.. పల్లపుప్రాంతాల సౌభాగ్యం’’అనే నినాదంతో చైతన్యయాత్ర చేపట్టాం.చెట్లు నరికేయడం,వెసులబాటు లేకుండాఖనిజాలు వెలికితీ స్తూపోతుంటే, భవిష్యత్‌ తరాలకు మన సంపదలు మిగలవని,పచ్చదనంతో పరిఢవిల్లే అటవీ సంపదనుకోల్పోతే,వాటిని తిరిగి రాబట్టేందుకు కొన్ని సంవత్సరాలుతరబడి ఎదురుచూడాల్సి ఉంటుందనిఅనే ఈ యాత్ర ద్వారా ఆనాడే అవగాహన కల్పించాం. ఇది తెలిసినా స్వార్ధచింతనతో అటవీవృక్షాలను తెగనరికి ధ్వంసం రచనకు పూనుకుంటున్నారు.
ఇప్పటికైనా అడవులుఆరోగ్యంగా ఉంటేనేగిరిజన,మైదానప్రాంత రైతాంగానికి,ప్రజలకి సంపూర్ణ మైన ఆరోగ్యం లభిస్తోంది. ఈవాస్తవాలు గ్రహించి సహజవనరుల పరిరక్షణ,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌-

నా విజయం వ్యక్తిగతం కాదు..

‘‘ నేను రాష్ట్రపతిగా
ఎన్నిక కావటం
ఆదివాసీల విజయం…’’

‘ఒడిశాలోని ఓమారుమూల ఆదివాసీ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన నేను దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా..ఇది నావ్యక్తిగత విజయం మాత్రమే కాదు…దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామి నేషనే ఓరుజువు. నాకు ప్రాధమిక విద్య చదువుకోవడమే ఓకలగా ఉండేది. అలాంటిస్థాయి నుంచి ఇక్కడి దాకా రాగలిగాను…50ఏళ్ళ స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీ య జీవితం ప్రారంభమైంది.

Read more

అలుపెరగని పోరాటాలు…

కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం… – గునపర్తి సైమన్‌

Read more

ఆదివాసీల భాషా మాటేమిటి ?

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమ్కెంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడిరది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది. తెలుగు భాషాభిమానులు, పండి తులు తెలుగు భాష ఇంగ్లీష్‌ ప్రపంచంలో కొట్టుకుపోతుందని ఎక్కడలేని బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎవరి భాషను వారు అభిమానించటంలో, పరభాష నుంచి తమ భాషను రక్షించుకోవటంలో తప్పు ఏమీలేదు. నా బాధంతా తెలుగు ప్రపంచంలో ఆదివాసీ భాషలు ఏవిధంగా కొట్టుకుపోతున్నాయో ఈ పండితులు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సదస్సులో ఆదివాసులను తెలుగు ప్రజలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆదివాసీ భాషల ఉనికినే తుడిచిపట్టే ప్రమాదం ఉంది.

Read more

పథకాల మీద కన్నేసిన పాలకులు

వేళ్ళ మీదలెక్క పెట్టగలిగిన బడా కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు గత ఏడు సంవత్సరాల మోడీపాలనలో రూ.10లక్షల 72వేల కోట్లరూణాలు రద్దు చేశారు.13కంపెనీలు బ్యాం కుల్లో తీసుకున్న రూ.4లక్షల50వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61వేల కోట్ల తగ్గింపుతో ‘సెటిల్‌మెంట్‌’ చేశారు.ఈ మొత్తం డబ్బు గ్రామీణపేదల ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేసి వుంటే సుమారు 14 సంవత్సరాల వరకు పేదలకు పని కల్పించి కొద్ది మేరకు ఆకలి తీర్చివుండవచ్చు. అలా చేయలేదు కాబట్టే ప్రపంచ ఆకలి సూచి 116దేశాల జాబితా లో మన దేశం101వ స్థానంలో నిలిచింది. మన కంటే ఆకలితో అల్లాడుతున్న దేశాలు కేవలం 15 మాత్రమే. ఇది మన అన్నపూర్ణకు పట్టిన ఆధోగతి.

Read more

ఊరు ఉండమంటున్నది.. గోదారి పొమ్మంటున్నది…!

ఊరు ఉండమంటున్నది,గోదారి పొమ్మం టున్నది. ఊరు ఏరు రెండు ఉనికిని ఇచ్చేవే. కానీ రెండూ ఇపుడు వేలాది మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ఊరు మునిగి పోయింది, గోదావరి వరదై ముంచేసింది. ఇది మనసును ముల్లులా గుచ్చే సమస్య. చిత్రమయిన సమస్య. పోలవరం ప్రాజక్టు నిర్వాసితులు ఎదుర్కొం టున్న హృదయ విదారకమయిన సమస్య. కొన్ని వేల మంది ప్రజలు పోలవరం ప్రాజక్టు వల్ల నిర్వాసితుల య్యారు. వాళ్ల పునరావాసం మాత్రం జరగడం లేదు. వాళ్ల కోసం కొన్ని పునరావాస కాలనీలు కట్టారు. లెక్క ప్రకారం వాళ్లు ప్రాజక్టు ముంపునకు గురవుతున్న గ్రామాలు వదిలేసి, ఈ పునరావాలస కాలనీలలో స్థిరపడాలి.ఇది చెప్పుకునేందుకు చక్కటి మాట. అయితే,ఈ వేలాది మంది ప్రజలు.ఊ .ర్లొదలడానికి సిద్ధంగా లేరు. వరద ముంచుకొస్తున్నది. అధికారులు ఊర్లలోకి వచ్చి వెంటనే ఖాళీచేయండని హెచ్చరి స్తున్నారు.

Read more

ప్లాటీనం జూబిలీ స్వాత్రంత్య్ర సంబరాల సవివరంగా 

భారతదేశం సామ్రాజ్యవాదుల చేర నుండి బయటపడి స్వతంత్య్ర దేశంగా అవతరించి 75 సంవత్సరాలైంది. స్వాతంత్య్ర సాధన కోసం నేలకొరిగిన అసంఖ్యాకుల త్యాగనిరతికి పునరంకితమయ్యే ఉద్విగ్న సమయమిది. గాంధీ,నెహ్రూ,పటేల్‌ అకుంఠిత పోరాట పటిమకు ముందు రాణిలక్ష్మీబాయి,మంగల్‌ పాండే,భగత్‌ సింగ్‌,సుభాష్‌ చంద్రబోస్‌ అస్ఫకు ల్లా ఖాన్‌,రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ మరియు ఉద్ధం సింగ్‌ వంటి ఎందరో త్యాగధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈస్వాతం త్య్రం. దేశానికి స్వతంత్రాన్ని సిద్ధించి పెట్టిన అమరవీరులకు భారత జాతి సర్వదా రుణపడి ఉంటుంది. మన స్వాతంత్య్ర సంగ్రామం అజరామరమైనది.. శత్రుశేషం లేనిది. చాలా దేశాలు స్వాతంత్య్రాన్ని పొంది ఉండవచ్చు, అట్టి స్వాతంత్రం కోసం ఆదేశ సైనికులు వీరోచితంగా పోరాటం చేసి ఉండవచ్చు, కానీ మన స్వాతంత్య్ర సంగ్రామంలో అసంఖ్యాకమైన ప్రజానీకమే అన్ని రకాల సైన్యం. సత్యం, అహింసా,శాంతి ఆయుధాలుగా పోరాడి సాధించిన ప్రత్యేకత ఇది.

Read more

దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..!

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో 75 ఏళ్ల స్వాత్రంత్య్ర వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపడుతోంది. పౌరుల్లో దేశభక్తి పెంపొందేలా పలు అవగాహన కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కో ఆపరేటివ్‌ సొసైటీలు ఇలా అన్నీ ప్రభుత్వ, ప్రభుత్వేయతర సంస్థలన్నీ ఈ క్యాంపెయిన్‌లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనల్లో హర్‌ ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌కి విస్తృత ప్రచారం కల్పించారు.

Read more
1 15 16 17 18 19 48