ఊరి బడిని కాపాడుకుందాం..
ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా రంగంలో సంస్కరణలు ప్రవేశ పెట్టడం సర్వసాధారణం అయింది. ముందు క్లస్టర్ పాఠశాల వ్యవస్థను తెచ్చారు. మొత్తం ప్రాథమికోన్నత పాఠశాలలను మÖసివేసేందుకు ప్రయత్నం చేశారు. 2017లో విద్యారంగంలోకి వ్యాపార రంగంలో ఉన్న ఎఫ్.ఐ.సి.సి.ఐ అనే సంస్థను ప్రవేశ పెట్టడానికి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే 2020లో కరోనా వచ్చింది. ఈ కాలంలోనే కనీసం చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా జాతీయ విద్యావిధానం-2020 ప్రవేశపెట్టింది.
5,8తరగతిలో పరీక్షలు, వృత్తి విద్యా కోర్సు లు, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం, నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఇవన్నీ ముందుకు వచ్చాయి. దీన్ని అమలు చేయడానికి చాలా రాష్ట్రాలు తటపటా యిస్తుండగా వైసిపి ప్రభుత్వం ఈ సంస్కరణ అమలు చేస్తూనే, ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.1876 కోట్లు అప్పు తెచ్చుకుని ‘సాల్ట’ పథకాన్ని ముందుకు తెచ్చింది. సర్క్యులర్ 172ని విడుదల చేసింది.దానికి కొనసాగిం పుగా జీవో 117 విడుదల చేసింది. ఇక సంస్కరణలు వేగవంతంగా ముందుకు పోయాయి. అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయడం మా లక్ష్యమని ఒక మంచి స్లోగన్ ముందుకు తీసుకొచ్చారు. ఏఒక్క బడి మÖసేయం,ఒక్క ఉపాధ్యాయుడిని తగ్గించం అనే మరొక క్యాచీ స్లోగన్ విద్యారంగం మీదకి వదిలారు. జీవో 117వల్ల విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమవు తుందని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు, విద్యా ప్రముఖులు మొత్తుకున్నా ఇది మా పాలసీ అనే పేరుతో అత్యంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. దీన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి.2024ఎన్నికల్లో జీవో 117ని రద్దు చేస్తా నని చెప్పిన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది.ఇప్పటికీ జీవో నెంబర్ 117నిరద్దు చేస్తామని చెబుతూనే ఆ 117ఆధారంగా మళ్ళీ సంస్కరణలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నది.
ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు
2018-19విద్యా సంవత్సరంలో 39,29,019 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్నారు.2021-22లో 44,29,569 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ్లఉన్నారు (ఇది కరోనా కాలం).2025-26లో 33,62,093 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. గత 5 సంవత్సరాలలో10,49,596 మంది విద్యా ర్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ప్రైవేట్ పాఠశా లలకు వెళ్ళినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంవత్సరం 34,02,049 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.49శాతం మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే,51 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తు న్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణల వల్ల 3,4,5తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు బోధన చేస్తామని చెప్పి హైస్కూల్కు తరలించారు. కొద్దిమంది ప్రభుత్వ హైస్కూల్కి వెళితే, కొద్ది మంది ప్రైవేట్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా హైస్కూల్ కంటే మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యా యులుంటే నాణ్యమైన విద్య వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే హైస్కూళ్ళలో ఉన్న 3,4,5 తరగతి పిల్లలను తిరిగి మోడల్ ప్రాథమిక పాఠశాలలకు తరలిస్తామని చెబుతున్నారు.హైస్కూల్లో ఉన్న3,4,5తరగతి పిల్లలు ఎంతమంది తిరిగి మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో చేరతారో చెప్పలేం.ఈసంస్కరణలు ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచలేకపోయాయి.
పాఠశాలల భవితవ్యం!
ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు సంస్కరణలు, స్కీములు, జీవోల ఫలితంగా 34 వేలకు పైగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి.10లోపురోల్ ఉన్న పాఠశాలలు 5495.11-20లోపురోల్ ఉన్న పాఠశాలలు 14,5 70 అంటే 20లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 20,065. ఈ ప్రాథమిక పాఠశాలలు భవిష్యత్తులో బతుకుతాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 3206 పైగా ప్రాథమికోన్నత పాఠశాలల పరిస్థితి ఏమిటో స్పష్టత లేదు.దీనిలో చదివే విద్యార్థుల భవిష్య త్ అగమ్యగోచరంగా మారబోతున్నది.502 ఉన్నత పాఠశాలల్లో ప్లస్ టూ పాఠశాలలను ప్రవేశ పెట్టారు. వీటి భవిష్యత్పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
ఉపాధ్యాయుల పరిస్థితి
రాష్ట్రంలో 27,409ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు తెలుస్తున్నది.జీవో నెం 117రద్దు వల్ల ఉపాధ్యాయ పోస్టులు చాలా మిగులుగా అవుతాయి.16 వేల పోస్టులకు డిఎస్సి వేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరతతీవ్రంగా ఉంది. ప్రత్యేకించి మున్సిపల్ పాఠశాలల్లో సబ్జెక్టుకు తగిన ఉపాధ్యాయులు లేరు. ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి.చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కడైతే ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మమేకమై విద్య అందించడానికి కృషి చేస్తున్నారో అక్కడ రోల్ పెరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయుల్లో ఉన్న లోపాలను కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు బడిలో ఉంటేనే ఉపాధ్యాయులకు జీతాలు భద్రత ఉంటుంది. సంస్కరణలు ఉపాధ్యాయులను,పాఠశాలలను రక్షించుకునే వైపు కాకుండా వ్యక్తిగత డిమాండ్ చుట్టూ ఆలోచించే వైపు పరుగులు తీయిస్తున్నాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల బోధనా శక్తి సామర్ధ్యాలను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించు కుంటున్నది. రకార కాల ట్రైనింగ్లు, రిపోర్టులు, పర్యవేక్షణలు, ఆన్లైన్లో అప్డేట్ చేయడం ముందుకు వచ్చాయి. నాలుగక్ష రాలు చెప్పారా లేదా అని పర్యవేక్షణ చేసేవాళ్ళ కంటే ఆ 42రిపోర్టులు ఎందుకు పంపలేదు. ఎప్పుడు పంపి స్తారు? అని అడగడంగా విద్య మారిపోయింది.
పెరగని సామర్థ్యాలు
ఈ సంస్కరణలు విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంచాయా, తగ్గించాయా పరిశీలిస్తే అసర్ లాంటి సర్వేలు చెబు తున్న దాని ప్రకారం 3వ తరగతి విద్యార్థులు 2వ తరగతి స్థాయి పుస్తకాలు 83.3శాతం మంది చదవ లేక పోతున్నారు. ఐదవ తరగతి విద్యార్థులలో రెండో తరగతి స్థాయి పుస్తకాలు 62.5శాతం మంది చదవ లేక పోతున్నారు.ఎనిమిదవ తరగతి విద్యార్థుల్లో రెండవ తరగతి స్థాయి పుస్తకాలు 47శాతం మంది చదవలేకపోతున్నారు. 8వ తరగతి చదివే విద్యార్థుల్లో 54.8శాతం మంది భాగాహారం చేయలేక పోతు న్నారు.సంస్కరణలు విద్యార్ధుల సామర్ధ్యాలను పెంచ లేకపోయాయి.
విద్యారంగానికి బడ్జెట్
విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం జిడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పింది. మనరాష్ట్ర బడ్జెట్లను గమనిస్తే విద్యా రంగానికి ఎక్కడా 15శాతానికి మించి ఏ సందర్భం లోనూ కేటాయింపులు చేయలేదు.2015-16 బడ్జెట్లో 16శాతం నిధులు కేటాయించారు. 2017 -18లో 13.60 శాతం కేటాయించారు. 2018-19లో 8 శాతం కేటాయించారు. ఇక్కడ అమ్మఒడి, నాడు నేడు నిధులను కూడా దీనిలో కలిపారు.23-24 బడ్జెట్లో 9.8శాతం, 2025-26 బడ్జెట్లో 9.8 శాతం మాత్రమే ఇచ్చారు. ఈ బడ్జెట్తో అంతర్జాతీయ విద్యార్థి ఎలా తయారవుతారు?అంతర్జాతీయ విద్యా ర్థిని తయారు చేయటమే లక్ష్యం అంటున్నారంటే ఈ రాష్ట్ర మానవ వనరులను విదేశీ వనరులుగా మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే!
ప్రస్తుత పరిస్థితి
రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల ద్వారా”అంతర్జాతీయ విద్యార్థి,నాణ్యమైన విద్య, తరగతికి ఒక గది, తరగతికి ఒకఉపాధ్యాయుడు.బోధనేతర కార్యక్రమాలుఉపాధ్యా యులకు ఉండవు. ఒక యాప్ మాత్రమే ఉంటుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు బడి సమయం లో బోధన కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. శని వారం మాత్రమే బోధనేతర కార్యక్రమాలు. నో బ్యాగ్ డేలు.స్కూలు కాంప్లెక్స్లు,శిక్షణ తరగతులు. ఇక విద్యార్థి నుంచి అవుట్ కం తీసుకురావటమే మా లక్ష్యం. ఉపాధ్యాయులకు బదిలీల చట్టం, ప్రమోషన్లు సీనియార్టీల ప్రకారం జరుగుతాయి.60దాటిన ప్రాథ మిక పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తాము.ఉన్నత పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగ తుల విద్యార్థుల్ని ఈ మోడల్ స్కూల్కి మ్యాప్ చేస్తాము. అవసరమైతే ఆపంచాయతీలో ఉన్న కొన్ని ఎలి మెం టరీ పాఠశాలల్లోని 3,4,5తరగతుల విద్యార్థుల్ని ఆ పంచాయతీలో మోడల్ స్కూల్కి మ్యాప్ చేస్తాము. 60దాటిన ప్రాథమికోన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేసి ఉన్నత పాఠశాలగా మారుస్తాము.30లోపుఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులను దూరంగా ఉన్న హైస్కూల్కి తరలించి రవాణా భత్యం ఇస్తాము. 31నుంచి 59వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశా లలను అక్కడున్న పరిస్థితుల్ని పరిశీలించి తగు నిర్ణ యం చేస్తాము. ఒక పంచాయతీలో ఏ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చాలో, దేనిని మ్యాప్ చేయాలో అనే అంశాలు ఆపంచాయతీలోని స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఆమోదంతో మాత్రమే చేస్తాము. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అంగీకరించకపోతే పాఠశాలలను యథాతథంగా కొనసాగిస్తాము. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వర్క్ లోడ్ తగ్గిస్తాము. ప్లస్ టు పాఠశాలలపై ఆలోచిస్తున్నాం” అని ప్రభుత్వం చెబుతుంది.ఇవన్నీ నిజంగా జరిగితే ప్రభుత్వ పాఠ శాల విద్యకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆచరణలో దీనికి భిన్నంగా ఒకటి, రెండు తరగతులు మాత్రమే ఉన్న ఫౌండేషన్ పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం కన్పిస్తున్నది. రాష్ట్రంలో 13,325 గ్రామ పంచాయితీలు ఉంటే 7600 పంచాయతీల్లో మాత్ర మే మోడల్ స్కూళ్లు పెట్టే అవకాశం ఉంది. అదీ ఆ పంచాయతీలో ఉన్న కొన్ని ఎలిమెంటరీ పాఠశాలల్లోని 3,4,5తరగతుల విద్యార్థులను మ్యాప్ చేయడం ద్వారా కొన్ని పాఠశాలలు మోడల్ పాఠశాలల్లా మారు తున్నాయి.ప్రాథమికోన్నత పాఠశాలల భవిష్యత్ ప్రశ్నా ర్ధకంగా మారుతుంది. ఇంగ్లీష్ మీడియంను మాత్రమే కొనసాగించబోతున్నారు. ఎక్కడైనా బేసిక్ ప్రాథమిక పాఠశాల కొనసాగాలని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తీర్మానం చేస్తే, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు ఆ మేనేజ్మెంట్ కమిటీలకు నచ్చజెప్పి లేదా ఏదోరకంగా కన్విన్స్ చేసి ఫౌండేషన్ స్కూళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలోపేతం కావాలంటే
విద్యా రంగ సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్ధుల సంఖ్యను, సామర్ధ్యాలను, ఉపాధ్యాయుల సంఖ్య ను తగ్గించాయి.విద్యకు కేటాయించే బడ్జెట్ సైతం తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం తీసుకోవలసిన సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచే విధంగా ఉండడం గమనించాలి.దీర్ఘ కాలంలో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడానికి కామన్ స్కూల్ సిస్టమ్ని అమలు చేయా లి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒకే రకమైన సిలబ స్ని అనుసరించాలి. బడ్జెట్లో విద్యకు 30 శాతం నిధులను కేటాయించాలి.ప్రాథమిక స్థాయిలో మాతృ భాషలో బోధన,సెకండరీ స్థాయిలో తెలుగు, ఇంగ్లీషు మీడియంలో బోధన ఉండాలి. ఉపాధ్యాయులను బోధ నకు మాత్రమే పరిమితం చేయాలి.తక్షణం విద్యా వ్యవస్థను ప్రభుత్వం రంగంలో అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఒక మోడల్ ప్రైమరీ పాఠశాల ఐదుగురు ఉపాధ్యాయులు, ఐదు తరగతి గదులు ప్రత్యేక బడ్జెట్ అన్ని హంగులతో ఏర్పాటు చేయాలి.మిగిలిన ప్రాథమిక పాఠశాలలను యథా తథంగా కొనసాగించాలి.60మంది విద్యార్థులుఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలి. మిగిలిన ప్రాథమి కోన్నత పాఠశాల లను యథాతథంగా కొనసాగించాలి. ఉన్నత పాఠశా లలో సమాంతర మీడియంలను కొనసా గించాలి. ప్లస్ టు వ్యవస్థను కొనసాగించాలి. -వ్యాసకర్త : ఎన్.వెంకటేశ్వర్లు,యు.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
