కరువు నిబంధనలు జటిలం చేసిన కేంద్రం

దీర్ఘకాలంపాటు వర్షం లేకపోవడం,పంటలు పండక పోవడం,ప్రజలకు,పశువులకు ఆహారకొరత,మంచినీటి కొరత ఏర్పడటాన్ని కరువుగా పేర్కొంటారు.స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజులలో పెద్దలుడొక్కల కరువు గురించి చెప్పు తునేవారు. బ్రిటీష్ పాలకులు ప్రజలను పట్టించుకోకపోవడంతో ప్రజలుమట్టి జాపకానుకొని తాగినట్లు చెప్పుకునేవారు. స్వాతంత్య్రానంతరం 52లో రాయలసీమ కరువు ఏర్పడింది.ఆనాటి భారత ప్రభుత్వం రాయలసీమ కరువును గుర్తించ టానికి, సహాయ చర్యలు చేపట్టడానికి నిరాక రించింది.దానికై ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి కరువు ప్రకటింప చేసుకున్నారు.

కరువు నిబంధనలు – నష్టపరిహారాలు
1966లో దేశ వ్యాపితంగా కరువు ఏర్పడింది. భారత ప్రభుత్వం కరువు నిబంధనలు రూపొందించింది. సాధారణ వర్షపాతం కన్నా 25 శాతం తక్కువ వర్షం కురవటం, పంటల సాగు విస్తీర్ణం 50శాతం తగ్గటం, పంటల దిగు బడులు 33శాతం తగ్గటం కరువు నిబంధ నలుగా పేర్కొన్నారు. కరువు ప్రకటించాలంటే వర్షపాతంతో పాటు మరొక నిబంధన వర్తిం చాలని షరతు ప్రకటించారు. వర్షాన్ని లెక్కించ టానికి విధానం రూపొందించారు. 24 గంట లలో రంగున్నర మిల్లీమీటర్ల వర్షపాతం పడితే ఒక వర్షపు రోజు కింద లెక్క, అటువంటి వర్షం 21రోజులు పడకపోతే తేలికపాటి కరువు గాను,29రోజులు కురవకపోతే తక్కువ కరుపు గాను,12 రోజులు దాటితే తీవ్ర కరువుగాను పరిగణించేవారు. కరువు ప్రకటించగానే ప్రభు త్వం తీసుకోవాల్సిన సహాయడం చర్యల క్రింద పలలు ఉసారు కల్పించడం, ప్రజలకు,పశువులకు తాగునీరు సరఫరా చేయటం,పశుగ్రాసం సరఫరా చేయటం, ఉచిత రేషన్ ఇవ్వ టం,అంజలి కేంద్రాలు నిర్వహించడం, రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయటం,పేదలకు వినియోగ రుణాలు ఇవ్వడం తదితర కార్య క్రమాలు చేపట్టాలి.
బిజెపి ప్రభుత్వం తెచ్చిన చట్టాలు
2016లో దేశంలో తిరిగి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరువు విధా నాలను పునః పరిశీలించింది.“వేదాస” పేరుతో కొత్త నిబంధనలు ప్రకటించింది. విజువలై జేషన్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా అండ్ ఆర్కైనల్ సిస్టమ్ అనే విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో గతంలో ఉన్న మూడు నిబంధ నలకు తోడు నీటి నిల్వలను కూడా పరిశీలిం చాలని చేర్చింది. వీటిలో కనీసం మూడు అంశాలు ఉంటేనే కరువుగా గుర్తించాలని పేర్కొన్నది. భూమిపైన, భూమి లోపల ఉన్న నీటి నిల్వలను భూమిలో ఉన్న తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నది. వ్యవసా యం రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి లోనిది. కావున రాష్ట్ర ప్రభుత్వాలు కరువు ప్రాంతాలను నిర్ణయించి పంపితే,కేంద్రం పరిశీలించి ఆమో దం తెలుపుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభు త్వాలు నివేదికలు పంపిన అనంతరం కేంద్ర బృందాలు పర్యటించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నిర్ధారించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నిధి నుండి కొంత సహాయం చేస్తుంది. కేంద్రదళాలు పర్య టనకు రెండు నుండి నాలుగు మాసాల సమ యం పట్టేది. అప్పటికీ ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమయ్యేది.ఇది ఒక తంతు గా మారింది.
ప్రైవేటు బీమా కంపెనీల లాభాల కోసం
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథరం ప్రవేశ పెట్టింది. దిగుబడి ఆధారిత పంటల బీమా, పర్యావరణ ఆధారిత పంటల బీమా పథకాలను కలిపి ఒకే చట్టం వేసింది. బీమా పథకం అమలుకు వది ప్రైవేటు ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. 2019లో ప్రైవేటు బీమా కంపెనీలు వ్యవసా య శాఖ ఉద్యోగులు రూపొందించిన కరువు అంచనాలను అంగీకరించేది లేదని, శాటిలైట్ సమాచారం ద్వారా సేకరించే విధానం ప్రవేశ పెట్టాలని పేచీ పెట్టాయి.కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.ఈ కాలంలో ప్రైవేటు బీమా కంపెనీలు, రూ.24 వేల కోట్ల లాభాలు పోగేసుకున్నాయి.రైతులకు చెల్లిం చింది స్వల్పం.
ప్రస్తుతం ఇండియన్ స్పేస్ రీఛార్జ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వారు రూపొందించిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా సమాచారం సేకరించే విధా నం చేపట్టింది. స్వల్ప వర్షపాతం కలిగిన రాయలసీమలో విత్తనాలు మొలకెత్తని భూమి ఎంత శాతం, మొలకెత్తివా గిడసవారి వేలకు అంటుకుపోయిన విస్తీర్ణం ఎంత శాతం? మొల కొత్తి ఎండిపోయిన పంట ఎంత శాతం? అనేది ఎలా నిర్ధారిస్తారో అంతు పట్టదు, రాయ లసీమలో భూగర్భ జలాలు అడుగంటుతున్న వార్తలు వస్తున్నాయి. శాటిలైట్ సమాచారంలో పృక్ష సమాచారం ప్రకారం పంటలు వేయక పోయినా అటవీ వృక్షాలు, హార్టికల్చర్ వంటలు పచ్చని వాతావరణం చూపిస్తాయి. ఇప్పుడు వర్షాభావానికి గురైన పండ్ల తోటలు అబ్బుపడి ఏడాది పొడవునా పూత పూయటం,పూత నిలపటం,పిందె కట్టడం, కాపు నిలపటం అన్ని దశలలోనూ బలహీనంగా ఉంటాయి. ఇవన్నీ శాటిలైట్ ద్వారా తెలియవు. ప్రత్యక్షంగా తీసుకోవాల్సిన వివరాలు.
నష్టపరిహారాలకు తిలోదకాలు
కేంద్ర ప్రభుత్వం 2025లో ప్రకృతి వైపరీత్యాల చట్టానికి సవరణలు చేసింది. గీత చట్టంలోని 12,13,61 క్లాజులను తొలగించింది. సెక్షన్ 12లో బాధితులను అదుకోవటానికి ఉన్న నిబంధనలు తొలగించారు.13లో పంటలు కోల్పోయిన రైతాంగానికి రుణాలు రీషెడ్యూల్ చేసే చాప్టర్‌ను తొలగించారు.61వరాజు ప్రకారం మహిళలకు, షెడ్యూల్ కులాలకు వివక్ష చూపకుండా పరిహారం ఇవ్వాలనే నిబం ధన తొలగించారు.ఈచట్టం అమలులోకి వస్తే వంట నష్టపరిహారాలు, రుణాల రీ షెడ్యూలు హుళక్కే, పంటల బీమా మాత్రమే దిక్కు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. రైతాంగం నారుమళ్ళు పోయటం, భూమిని కేంద్ర ప్రభుత్వం కరువు విధానాలను పునః పరిశీలించింది. “వేదాస” పేరుతో కొత్త నిబంధనలు ప్రకటించింది. “విజువలైజేషన్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ డేటా అండ్ ఆర్కెవల్ సిస్టమ”అనే విధానాన్ని ప్రకటిం చింది. ఈ విధానంలో గతంలో ఉన్న మూడు నిబంధనలకు తోడు నీటి నిల్వలను కూడా పరిశీలించాలని చేర్చింది. వీటిలో కనీసం మూడు అంశాలు ఉంటేనే కరువుగా గుర్తించా లని పేర్కొన్నది. భూమిపైన, భూమి లోపల ఉన్న నీటి నిల్వలను భూమిలో ఉన్న తేమ శాతా న్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషి లోనిది. కావున రాష్ట్ర ప్రభుత్వాలు కరువు ప్రాం తాలను నిర్ణయించి పంపితే, కేంద్రం పరిశీ లించి ఆమోదం తెలుపుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు పంపిన అనం తరం కేంద్ర బృందాలు పర్యటించి, క్షేత్ర స్థాయి లో పరిశీలన చేసి నిర్ధారించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నిధి నుండి కొంత సహాయం చేస్తుంది. కేంద్ర దగాలు పర్యటనకు రెండు నుండి నాలుగు మాసాల సమయం పట్టేది. అప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమయ్యేది.
ఇది ఒక తంతుగా మారింది.
రైతాంగానికి బీమా ప్రీమియం చెల్లించమని పదేపదే చెప్పొంది.గత ప్రభుత్వం ఉచిత పం టల బీమా పథకం ప్రవేశపెట్టి రెండు సంవ త్సరాలు అమలు చేసింది.ఈ ప్రభుత్వం ఉచి త బీమా పడతాన్ని రద్దు చేసింది. గత రెండు సంవత్సరాల నుండి బీమా చెల్లంచిన వారికి బీమా ఇచ్చిన దాఖలాలు లేవు. ఫలితంగా రైతులు ఆసక్తి చూపటంలేదు. చెల్లించాలని ప్రభుత్వ పెద్దలు పడే పదే చెప్తున్నారు.
ముందుచూపు లేని ఫలితం
ఈ ఏడాది కేరళంకు రుతుపవనాలు ఆల స్యంగా వచ్చాయి. అప్పటికీ ముందు నుండీ ‘ఎల్సెనో ప్రభావం గురించి శాస్త్రవేత్తలు చెబు తూనే ఉన్నారు. అయినా మన మన రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణా, గోదావరి డెల్టాలకు ముందుగా నీరు వదులుకామని,ఒక నెల ముం దుగానే నాట్లు వేస్తే నవంబర్,డిసెంబర్ మాసా లలో వచ్చే తుఫానులకు ముందే వరి కోతలు పూర్తి చేసుకోవచ్చని, ముందుగా నారుమళ్ళు పోసుకోమని రైతులకు పిలుపు సిద్ధం చేయ టం,గట్లు వేయటం,నగైనా పనులు పూర్తి చేశారు. బోర్లు ఉన్న రైతులు నాట్లు వేశారు. కొందరు రైతులు భూమిని దున్ని ఎద పెట్టారు. కొందరు గింజలు చల్లి పొడి కప్పం కప్పారు. జూలై చివరి నాటికి కృష్ణా డెల్టాలో వరి నాట్లు వేయవద్దని, ప్రత్యామ్నాయపంటలు వేసుకో మని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టారు. అంతర్జాతీయ నీటి యాజమాన్యం ఇన్ స్టిట్యూట్ వారు చెప్పిన వివరాల ప్రకారం భారత ప్రభుత్వం నెలకొల్పిన“సుఖ రక్షణ్ ‘అడ్వెర్ సిస్టమ్ ఈఏడాది వర్షపాతం అతి తక్కువగా ఉంటుందని మే 22వ తేదీనే సమా చారం ఇచ్చిందని పేర్కొంది.“సుఖ రక్షక్ దేశం లోని 22 భారతీయ భాషలలో ఈ విషయం ప్రకటించినట్లు అంతర్జాతీయ నీటి యాజ మాన్య ఇన్ స్టిట్యూట్ వారు పేర్కొన్నారు. అయి నా మనరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు సిద్ధం చేయకపోవటం దుర దృష్టం, ఇందుకు రాష్ట్ర ప్రజానీకం మూల్యం చెల్లిం చాల్సి వస్తున్నది.
నిర్వహణ భారంగా రైతువేదికలు
రైతు వేదికలు అలంకారప్రాయంగా మారా యి.రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వ్యవసాయ దారులకు సస్యరక్షణ చర్యలు కోసం కావాల్సిన సలహాలు,సూచనలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2021లో వీటిని ఏర్పాటు చేసింది.కానీ వీటి నిర్వహణకు సక్రమంగా నిధులు విడుదల కాక అధికారులు ఇబ్బంది పడుతున్నారు.నిధుల కొరతతో విద్యుత్ బిల్లు లు,పారిశుధ్య ఖర్చులూఅధికారులపైనే.. నెలకు రూ.9 వేల హామీ అమలు కాని వైనం అన్నదాతలకు అందు బాటులో ఉండి వ్యవ సాయ సలహాలు,సూచనలు అందించాలనే లక్ష్యంతోనిర్మించిన రైతువేదికలు ప్రస్తుతం నిర్వ హణ భారంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం నెలనెలా నిర్వహణ ఖర్చుల కోసం రూ.9వేలు ఇస్తామని ప్రకటించినా, నాలు గేళ్లు గా నిధులు విడుదల చేయకపో వడంతో వ్యవ సాయ విస్తరణ అధికారులే సొంత ఖర్చులతో నిర్వహణ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యుత్ బిల్లులు, మంచినీరు, పారిశుధ్యం, స్టేషనరీ, శిక్షణ కార్యక్రమాలు, కాపలాదారుల ఖర్చులు అధికా రులకు తలకు మించిన భారంగా మారాయి. దీంతో రైతువేదికల ఏర్పాటు లక్ష్యం నీరుగారు తోంది. 2021లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మిం చారు. ఒక్కో వేదికకు సుమారు రూ.22లక్షలు వెచ్చిం చారు. ఒక్కో రైతువేదికకు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి,ఉదయం, సాయం త్రం రైతులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. మిగతా సమయాల్లో వారు క్షేత్రస్థా యిలో పర్యటిస్తూ రైతులకు సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికత, పంటలపై సలహాలు,సూచనలు అందించాల్సి ఉంటుంది. అధికా రులు రైతులకు అందుబాటులో ఉం డేందుకు వేదికల్లో వసతి,ఫర్నిచర్, శిక్షణ కార్య క్రమాల కోసం కుర్చీలు,మైకులు తదితర సౌక ర్యాలు కల్పించారు.అయితే నిర్వహణకు ప్రభు త్వం ఇచ్చినహామీలు మాత్రం అమలుకు నోచు కోలేదు. పారిశుధ్యం,ఇతర పనుల కోసం సహా యకుడిని నియమిస్తామని చెప్పినా ఆహామీ అమలు కాలేదు. ఊరికి దూరంగా ఉన్న రైతు వేదికల్లో విలువైన సామగ్రిచోరీకి గురికా కుం డా వ్యవసాయ విస్తరణ అధికారులే తమ సొం త ఖర్చుతో వాచ్‌మెన్లను నియమించుకున్న సందర్భాలున్నాయి.
నాలుగేళ్లుగా నిధుల్లేవు
రైతువేదికల్లో మంచినీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.9 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది.2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలలకు ఒక్కో రైతువేదికకు రూ.45 వేలు మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 70రైతువేదికలు ఉం డగా,ఒక్కో కేంద్రానికి సుమారు రూ.2.70 లక్షల చొప్పున నిర్వహణ బకాయిలు పేరుకు పోయాయి.
సొంత డబ్బులతో భారం
నిధులు రాకపోవడంతో గత్యంతరం లేక వ్యవసాయ విస్తరణ అధికారులే నెలవారీ ఖర్చులు భరిస్తున్నారు.ఒక్కో రైతువేదికకు విద్యు త్ చార్జీల కోసం సుమారు రూ.1,000,స్టేష నరీ, జిరాక్స్‌లకు రూ.1,000,శిక్షణ కార్యక్ర మాలకు రూ.2,500, తాగునీటికి రూ.500, పరిశుభ్రత,కాపలాదారుల కోసం సుమారు రూ.3,000వరకు ఖర్చవుతోందని వారు చెబు తున్నారు.విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లిం చకపోతే సరఫరా నిలిపివేస్తుండటంతో తప్ప నిసరి పరిస్థితుల్లో తామే బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగు దొడ్ల నిర్వహణకు కూడా నిధులు లేకపోవ డంతో ఆ ఖర్చునూ తామే భరించాల్సి వస్తోం దని చెబుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని,తామే భరించుకోవాలని సూచి స్తున్నారని వాపోతున్నారు.రైతులకు నిరంతరం సేవలందించాల్సిన రైతువేదికల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయకుండా,పెండింగ్ నిధులను విడుదల చేయడంతో పాటు నెలవారీ నిర్వహణ ఖర్చులను సకాలంలో మంజూరు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులు కోరుతున్నారు.అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వ హణ వ్యవసాయ విస్తరణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది కానీ నిర్వహణకు నెలనెలా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో కనీ సం విద్యుత్ చార్జీలు చెల్లించే పరిస్థితి లేదు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, పంటల సాగులో వారికి అవసరమయ్యే సల హాలు,సూచనలు ఇవ్వడానికి 2021లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్లస్టర్ల వారిగా రైతు వేదిక లకు నిర్మించారు.ఒక్కో రైతువేదికకు రూ.22లక్షలతో నిర్మించారు.ఒక్కో వేదికకు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమిం చారు.వారు రోజు ఉదయం,సాయంత్రం వేదిక ల్లో అన్నదాతలకు అందుబాటులో ఉంటూ మిగితా సమయాల్లో క్షేత్ర సందర్శన చేసి కర్షకు లకు సలహాలు,సూచనలు అందించాల్సి ఉం టుంది. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వేదికలో వసతి కల్పించారు.ప్రత్యేకంగా ఫర్నిచర్‌ను సమకూర్చారు.శిక్షణ కార్యక్రమాలకు అవస రమైన కుర్చీలు,మైకు వంటివి ఏర్పాటు చేశా రు.వీటిని వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలు కూడా వినియోగించుకున్నాయి. ఊరికి దూరంగా నిర్మించిన వీటిలో పారిశుధ్య తదితర పనులకు సహాయకుడిని నియమిస్తా మని చెప్పిన ప్రభుత్వం ఆమాట మరిచి పోయింది. రైతువేదికల్లోని విలువైన సామగ్రి దొంగల పాలవుతుండడంతో వ్యవసాయ విస్త రణ అధికారులే తమ స్వంత ఖర్చుతో వాచ్‌మెన్ల ను నియమించుకున్నారు.ఆతర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి రావడంతో ప్రస్తుతం వాటి నిర్వహణ గాలికొదిలేసింది.రైతువేదికల్లో మంచినీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతీ నెల రూ.9వేలు ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. కానీ నాలుగేళ్లుగా నిధులు విడుదల చేయకపోవ డంతో పలు ప్రాంతాల్లో సంబధిత అధికారులు కొందరు వారి వేతనం నుంచి నెల ఖర్చులు చెల్లించారు. 2022ఏప్రిల్ నుంచి 2022ఆగస్టు వరకు ఐదు నెలలకు గాను ఒక్కో రైతువేదికలకు గాను రూ.45వేలు అందించింది. మొత్తం మోయలేని భారంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.-(వై.కేశవరావు)