పుడమి తల్లికి ఆత్మఘోష

సమస్త జీవకోటి భారాన్ని మోసేది ఈ పుడమి తల్లి. ఇది అందరికి తెలిసిన .. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆ తల్లి దేహానికి గాయాలు చేస్తుంటారు. ఓ వైపు కాలుష్యం పెరుగు తున్నా.. అవేం పట్టించుకోకుండా.. మరో వైపు వనరులను తగ్గించేస్తూన్నారు. మనిషి అవస రాల కోసం జంతువులను చంపడం.. అడవు లను నాశనం చేసి.. ఇప్పుడు మారణీVA మంలో పడి కోట్టుమిట్టాడుతున్నాము. ఇష్టం వచ్చినట్లుగా సహజ వనరులను తగ్గించి.. ఇప్పుడు ప్రాణ వాయువు కోసం అల్లాడు తున్నారు. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల ఇలా పంచభూతాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చదనంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మÖగ రోదనతో కన్నీరు కార్చుతోంది. మన భూమిని కాపాడుకుందాం అనే నినాదాలు కేవలం పుస్తకాల్లో రాతాలుగా మారి పోయాయి – గునపర్తి సైమన్
నిషి స్వార్థపరుడు..చెట్లను నరికేసి పక్షులకు గూళ్లు లేకుండా చేశాడు. అడవుల్ని మాయంచేసి జంతువులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. అనాగరికులకు..అడవుల్లో బ్రతికే వారు తమ చుట్టూ ఉన్న ప్రకృతితో జీవనం చేస్తుంటే..అన్నీ తెలిసిన నాగ రికుడు..అభివృద్ధి, ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపిం చి అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరుల్నిదో చేస్తున్నాడు. నేల,నదులు,సముద్రాలు ఒకటేమిటి ఆఖరికి ఆకాశాన్ని సైతం తన అదుపులోనే ఉంచుకో వాలన్న అత్యాశతో మొత్తంగా భూమండలాన్ని కలు షితం చేశాడు. అలా తాను సృష్టించుకున్న కాలుష్యా నికి ఇప్పుడు తానే బలవుతున్నాడు. ఏప్రిల్ 22, ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తోంది.. మిగతా దేశాలకంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే. మన భూగోళాన్ని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడదాం. వాహానాల వాడకం తగ్గిద్దాం. 2. అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గిద్దాం. 3. అడవులను నాశనం చేయకుండా.. చెట్లను పెంచడం అలవరచుకుందాం. 4. భూమికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దాం.
మనిషి మనుగడకు నష్టం చేసిన కరోనా మాత్రం పుడమి తల్లికి మంచి చేస్తుందనే చెప్పుకోవాలి. మనిషి సృష్టించిన కాలుష్యం నుంచి ధరణి బయటపడేలా చేస్తుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బందించి.. పక్షులూ జంతువులూ స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించింది. అలాగే వ్యర్థాలతో నిండిపోయిన నదులు మళ్లీ స్వచ్చంగా కనిపిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఏటా కోటి హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో అడవులు కనుమరు గవుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యర్థ జలాలను సైతం సముద్రాలు, నదుల్లోకి విడిచిపెడు తున్నాం. గతశతాబ్ది కాలంలో సగందాకా చిత్తడి నేలలు,పగడపు దిబ్బలు అంతర్థానమయ్యాయి. ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడంతో వాయుకాలుష్యం పెరిగి పోయింది. వాతావరణ మార్పుల ప్రభావంతో భూతా పం ఎక్కువై అధిక ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదలు, కరవు కాటకాలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇటీవలి కొన్ని దశాబ్దాల కాలంలో భూతాపంలో వృద్ధి-పరిస్థితి తీవ్రతకు అద్దం పడు తోంది. భూతాపం మరింతగా పెచ్చరిల్లితే ప్రకృతి వైపరీత్యాల దుష్ప్రభావాలు ప్రమాదకరంగా ఉంటా యని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మానవాళి స్వయంకృతాపరాధమే ఈదుస్థితికి కారణమని తెలిసి నా ప్రపంచ దేశాలు తాత్సార వైఖరిని అవలంబిస్తుం డటం ఆందోళనకరం.
తరిగిపోతున్న అడవులు
భూతాపాన్ని నిలువరించి, పర్యావరణ సమ తౌల్యాన్ని కాపాడే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలు పర్యావరణ చట్టాలకు పదును పెడుతూ సహజ వన రుల వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో విధానాలు రూపొందిస్తున్నాయి.వాటి కార్యాచరణ మాత్రం చురుకందుకోవడం లేదు. భూతాపాన్ని నియంత్రించేం దుకు 2015లో పారిస్ వేదికగా ప్రప దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలులో అనిశ్చితి ఇంకా కొన సాగుతోంది.కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం పర్యావరణహితకరమైన విధానాలు అమలు చేస్తామని దేశాలు ప్రతినపూనాయి.అందుకుగాను ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అవసరాల కోసం నిరుపేద, వర్ధమా న దేశాలకు నిధులు ఇస్తామని సంపన్న దేశాలు పేర్కొ న్నాయి.ఈ ఒప్పందం జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిధుల విడుదలలో జాప్యంచేస్తున్నాయి. నార్వే, జర్మనీ, స్వీడన్ వంటి దేశాలు స్వల్పంగా నిధులు విడుదల చేసినా అగ్రదేశాలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు.భూతాపాన్ని నియంత్రించడంలో అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. వనాలు జీవవైవిధ్య పరిరక్షణకు, జీవనోపాధుల కల్పన,ఆహార భద్రతకు విశేషంగా తోడ్పడతాయి. అయితే, అడవుల విస్తీర్ణం పెరగడం సంగతి అటుంచి, ప్రస్తుతమున్న దట్టమైన అడవుల విధ్వసం విచ్చలవిడిగా సాగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆహార సంస్థ నివేదికల ప్రకారం వ్యవసాయ భూములు, నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాలు,ఖనిజ తవ్వకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం అడవులపై పడు తోంది. మÖడు దశాబ్దాల కాలంలో సుమారు 42 కోట్ల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలోని అడవులు అంతరిం చాయన్న అంచనా దిగ్భ్రాంతపరుస్తోంది.
లక్ష్యాలకు తూట్లు
పర్యావరణ పరిరక్షణలో భారత్ అనుసరి స్తున్న అనేక లోపభూయిష్ట విధానాల మÖలంగా భూగోళ పరిరక్షణ లక్ష్యాలకు తూట్లు పడుతున్నాయి. భూతాపం నియంత్రణకుగాను భారత్ వివిధ విధాన పరమైన చర్చల్లో అమెరికా వంటి అగ్ర దేశాలతో తలపడుతోంది.అయితే, వివిధ పర్యావరణ విధా నాలు,చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడంలో ఇండియా విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి వ్యవస్థలకు నష్టం వాటిల్లకుండా, పర్యావరణ న్యాయం అమలు చేసేలక్ష్యంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ చట్టం-2010 తీసుకొచ్చారు.ఈచట్టం అమలు మొదలై 13 ఏళ్లు గడుస్తున్నా అన్ని రాష్ట్రాల్లో హరిత న్యాయస్థానాలు అందుబాటులోకి రాలేదు. తీర ప్రాంత పరిరక్షణకు ఉద్దేశించిన సి. ఆర్.జెడ్. నిబంధనలు-2019 అమలులో రాష్ట్రాలు ప్రదర్శి స్తున్న అలసత్వం,తీరప్రాంతాల్లోని మడ అడవులు వంటి సున్నిత వ్యవస్థల విధ్వంసం వంటి అంశాలపై ఇటీవల కాగ్ వివిధ రాష్ట్రాలను తీవ్రంగా ఆక్షేపిం చింది. మన దేశంలో గడచిన ముప్ఫై ఏళ్ల కాలంలో లక్షలఎకరాలకు పైగా అడవులను అటవీయేతర కార్య క్రమాలకు బదలాయించినట్లు అంచనా. వీటికి ప్రత్యా మ్నాయంగా అడవుల పెంపకంలో అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.నష్టపరిహారంగా వచ్చే నిధులతో వనాల పెంపు కోసం 2016లోనే ప్రత్యామ్నాయ అటవీకరణ నిధి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు.
ప్లాస్టిక్తో ముప్పు
ప్రజల జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పెనుమార్పుల మÖలంగా ప్లాస్టిక్ వాడకం అనూహ్యంగా పెరిగింది. మితిమీరిన ప్లాస్టిక్ విని యోగం ప్రకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. తీరప్రాంతాల్ని కలిగి ఉన్న దేశాల నుంచి ఏటా లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాల్లో పోగుపడు తున్నాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో చేరే వ్యర్థాల్లో దాదాపు 90శాతం ప్లాస్టిక్ ఉంటోంది. భారత్లోని ప్రధాన నదులు సైతం ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర పర్యావరణంలోకి తీసుకెళ్ళే మార్గాలుగా మారడం ఆందోళనకరం. ప్రస్తుత ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం,పునర్ వినియోగ విధానాల్లో మార్పు రాకపోతే 2040నాటికి కోట్లాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థా లు సముద్రాల్లో పేరుకుపోయే ముప్పుంది. దీనివల్ల సాగర జీవుల మనుగడ ఇక్కట్లలో పడుతుంది.తీర ప్రాంత ప్రజల ఆరోగ్యమÖ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
భూమి దినం చరిత్ర
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమం మొదలైన సమయం దృష్టిలో పెట్టుకుంటే, అది 1970 ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఆరోజున సెనేటర్ గేలార్డ్ నెల్సన్ మరియు కార్యకర్త డెనిస్ హేస్ వారు తొలి సమావేశాన్ని ప్రేరేపించారు.వారు దేశవ్యా ప్తంగా 20మిలియన్ మందిని గాలి కాలుష్యం, నూనె పారులు మరియు జాతి విభిన్నత నష్టాలపై ప్రతిరోధం చేయమని విజయవంతంగా ప్రేరేపించారు.ఈ చరిత్రాత్మక ఘటన స్థాపనకు,అలాగే క్లీన్ ఎయిర్ యాక్ట్ మరియు ఎండేంజరడ్ స్పీషీస్ యాక్ట్ వంటి కీలక చట్టాల ఏర్పాటు కొరకు మార్గం సృష్టించింది. ఏప్రిల్ 22 ఏసంవత్సరం నాటికి పడ్డా,ప్రజలు ఎప్పు డూ ఆరోజున భూమి దినాన్ని జ్ఞాపకం చేసుకుం టారు. ఈ మసలేని నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు వారి షెడ్యూల్‌లను సరిపోల్చుకోవడానికి సమయం ఇస్తుంది. భూమి దినం 2025 ఒక గ్లోబల్ రోజు,అందరూ కలిసి మన భూమిని నివసించ దగినదిగా ఉంచేందుకు మనం భాగస్వామ్యం అయిన బాధ్యతను గౌరవించేందుకు ఇది ఒక అవసరం.
ఏప్రిల్ 22 ప్రత్యేకత ఏమిటి?
సెనేటర్ నెల్సన్ మరియు ఆయన సిబ్బంది ఈరోజు ప్రత్యేకంగా ఎంచుకున్నప్పుడు, యువతను ఆకర్షించి, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల ఉత్సాహాన్ని ఉపయోగించుకోవాలని ఆశించారు. ఈ ఘటనను వసంత విరామం మరియు ఫైనల్ పరీక్షల మధ్య అంగీకరించడానికి వ్యూహాత్మకంగా షెడ్యూల్ చేశారు, తద్వారా మాక్సిమమ్ విద్యార్థి భాగస్వామ్యాన్ని ప్రేరేపించడానికి,పర్యావరణ ఉద్యమ యువత ఉత్సా హం శక్తిని తీసుకురావడాన్ని ప్రోత్సహించవచ్చని ఉద్దేశ్యించారు. ఈఏడాది 2025లో భూమి దినం వేడుకను 192 దేశాల నుండి ఒక బిలియన్ మందికి పైగా జరుపుకుంటారని అంచనా. ఇది ఈ ఘటన 55వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఇది భూమి దినం ఉద్యమం,వివిధత,సమాజం మేలు కోసం ప్రజలను ఐక్యంగా చేయడంలో నిబద్ధత.1970లో లాగా ఇప్పటికీ బలంగా ఉందని చూపిస్తుంది. భూమి దిన సారాంశం ఎప్పటికీ ప్రజల శక్తి, మరియు ఈ శక్తి విప్లవాత్మక మార్పును తీసుకురావడానికీ సామర్థ్యం కలిగి ఉంది. ప్రజలు ఒక సామాన్య లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐక్యంగా వచ్చేటప్పుడు, వారు పాత వ్యవస్థలను,పరిశ్రమలను అధిగమించ గలుగుతారు! పుడమి తల్లి పుట్టిన రోజునమనం అందరికీ మంచిగా ఉండే భవిష్యత్తును సృష్టించడానికి పునరుత్పత్తి శక్తి వనరులను ఉపయోగించేందుకు ఒకవాగ్దానాన్ని ఇవ్వు దాం.అది ఆరోగ్యకరమైన, స్థిరమైన, సమానమైన, మరియు ధనికమైనది.
ఈఏడాది నినాదం..“శక్తి..ప్రజలు..గ్రహం”
శక్తి:మన గ్రహం సమృద్ధిగా ఉన్న పునరుత్పత్తి శక్తి వనరులను 2030నాటికి వాటి ఉత్పత్తిని మÖడు రెట్లు పెంచడం ద్వారా ఎక్కువగా ఉపయోగించాలి. ఈ జాబితాలో సౌరశక్తి, గాలిశక్తి, జల విద్యుత్తు, భూపర్యవేక్షణ శక్తి,జలధార శక్తి ఉన్నాయి.
ప్రజలు:ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం,ఉద్యోగాలను సృష్టించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడం.. అంగీ కరించేస్థాయిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడం,శుభ్ర మైన,అంగీకరించిన పునరుత్పత్తిశక్తితో ప్రపంచ కమÖ్యనిటీలను శక్తివంతం చేయడం ద్వారా బిలియన్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచగలుగుతాం. గ్రహం:మేము పునరుత్పత్తి శక్తి వ్యవస్థలను త్వరగా అమలు చేయడంద్వారా వాతావరణ మార్పును ఆప వచ్చు,పర్యావరణ వ్యవస్థలు మరియు జాతి విభిన్న తను కాపాడవచ్చు, మరియు మనం గోచారం వంటివి మీద ఆధారపడటం తగ్గించగలుగుతాం.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి:..
శుభ్రపరచే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భూమితో మీ సంబంధాన్ని బలపరచవచ్చు. గ్యారేజీ బ్యాగ్‌తో తిరుగుతూ ఎదురయ్యే ప్రతి ప్లాస్టిక్‌ను సేకరించండి.సమీపంలో ఉన్న కసాయి కాలువ లేదా గుంటను మీరు తెలుసుకోవచ్చు! గృహపరికరాలు వంటగదిలోని పాత్రలను కప్పు మరియు సిరామిక్‌తో మార్చండి,ప్లాస్టిక్ కట్టర్లను వేయకుండా వాటిని పునః ప్రయోగించండి!
చెట్లు నాటుదాం..
మన చెట్లు అద్భుతంగా ఉంటాయి. కార్బన్ ను సేకరిస్తాయి.వేడి ప్రాంతాలను చల్లబరు స్తాయి, పురాణాన్ని ప్రోత్సహిస్తాయి, రోగాల యొక్క ప్రసారం ప్రమాదాన్ని తగ్గిస్తాయి,స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంపొందిస్తాయి.ఒకేఒక చెట్టు మొత్తం యార్డ్‌లోని మొక్కల కంటే ఎక్కువ వన్యప్రాణులను ఆకర్షిస్తుందని మీరు ఊహించలేము! మీరు మీస్థానిక అధికారులుతో సంభాషించి పబ్లిక్ ప్రదేశాలలో చెట్లు మరియు స్థానిక తోటల బడ్‌లను నాటడం గురించి చర్చించండి. మీస్వంత భూమిలో కూడా వాటిని నాటవచ్చు!

పొంచి ఉన్న విఫత్తుల ముప్పు

భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతోఆ కారణంగా చోటుచేసు కుంటున్న వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.అందుకు తగ్గట్టే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో గాలి దుమారాలు సహజం.కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి మహానగరాలను వణికిస్తున్నాయి. భూకంపాలు సంభవిస్తున్నాయి.మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.గాలి దుమారాలు,ధూళి తుఫాన్లు,వర్షాల తీవ్రత నానాటికీ పెరగడం ఒకెత్తయితే..ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది.అందుకు ఇటీవల మయన్మార్ భూకంపమే నిదర్శనం.అలాగే గతేడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ముంబాయి,రాజస్థాన్,గుజరాత్,ఢిల్లీ వంటి మహానగరాల్లో చోటుచేసుకున్న ఘటనలు తార్కాణం. ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అధ్యయనం ప్రకారం1950 నుంచి నమోదైన ఘటనలను పరిశీలిస్తే వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వైపరీత్యాల సంఖ్య మÖడు రెట్లు పెరిగిందని తేలింది.ఈ సమాచారాన్ని ‘నేచర్ కమÖ్యనికేషన్స’ పేరుతో నిర్వహిస్తున్నసైన్స్ మ్యాగజీన్లో ప్రచురించింది.ఇలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు,విపత్తుల కారణంగా అనూహ్య స్థాయి వరదలు సంభవిస్తూ ప్రజల ఆస్తి, ప్రాణనష్టాలు కలుగజేస్తున్నాయని పేర్కొంది.భారత్‌లో ఎక్కువగా ఉత్తర,మధ్య భారత రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి.గుజరాత్,మహా రాష్ట్ర,మధ్యప్రదేశ్,చత్తీస్‌గఢ్,తెలంగాణ, ఒడిశా,ఝార్ఖండ్, అస్సాం, మేఘాలతో పాటు పశ్చిమ కనుమలకు ఆనుకున్న గోవా,కర్ణాటక కోస్తా ప్రాంతం,ఉత్తర కర్ణాటకలో ఈతరహా విపత్తులకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈభూతాపాన్ని పెరగడానికి కారణాల్లో ముఖ్యమైనది భూమ్మీద గ్రీన్ హౌజ్ వాయువులస్థాయి పెరగడమే. అయితే వీటి మోతాదు వాతావరణంలో పెరిగేకొద్ది అనర్థాలు,వైపరీత్యాలే.కర్బన ఉద్గారాలు పెరగడంలో శిలాజ ఇంధనాల(పెట్రోలియం ఉత్పత్తులు)తో నడిచే వాహనాలు,నేల బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యం వంటివి ప్రధానమైనవి.శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక,లక్ష్యం నిర్దేశించుకుంది. ఆప్రకారం రానున్నరోజుల్లో దేశంలో అపారంగా లభ్యమయ్యే సూర్య కాంతి ఆధారంగా సోలార్ ఎనర్జీని పెంపొందించాలని,అలాగే ఏమాత్రం కాలుష్యాన్ని వెదజల్లని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది.అయితే ఇదంతా పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావడానికి చాలా సమయం పడుతుంది.ఈలోగా ప్రకృతికి జరగాల్సిననష్టం జరిగిపోతోంది.గ్రీన్ హౌజ్ వాయు వులు సముద్ర జలాల ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి.ఫలితంగా సముద్రమట్టం పెరుగుతోంది.సముద్రజల ప్రవాహాలు (కరెంట్స్)లోమార్పులు చోటుచేసుకుని భీకరతుఫాన్లు,హరికేన్లు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ప్రకృతికి ఎదురొడ్డి నిలబడడం భూమ్మీద మనిషికే కాదు ఏజీవరాశికి కూడా సాధ్యం కాదు. కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగట్టగల్గితే..దాని బారినపడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిశోధన సంస్థలు వాతావరణంలో మార్పులను పసిగట్టి తగిన హెచ్చరికలు జారీ చేస్తుంటాయి.అయితే ప్రకృతిలో సంభవించే అన్నిరకాల వైపరీత్యాలను,వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందు కంటే వాతావరణం అన్నదే అత్యంత సంక్లిష్ట మైన అంశం.సుదీర్ఘ అనుభవం,లోతైన అవగాహన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భారత వాతావరణశాఖ ఈ మధ్యకాలంలో చాలా అంశాల్లో ముందుగానే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హీట్ వేవ్ (వేడిగాలులు), తుఫాన్లు, వాటి తీవ్రత విషయంలో వాతావరణశాఖ అంచనాలు దాదాపుగా నిజమవుతున్నాయి.ఆ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడు ప్రాణనష్టాన్ని నివారించగల్గుతున్నాం.ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా సమర్థవంతమైన విధానాలను అమలు చేయాలని,తద్వారా గ్రీన్ హౌజ్ వాయువులస్థాయిని తగిన మోతాదులో ఉంచగల్గితే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తున్నారు.వేడిగాలులు,అధికఉష్ణోగ్రతలు వేడి సంబంధిత వ్యాధులను పెంచుతున్నాయి (ఉదాహరణకు,హీట్ స్ట్రోక్,డెంగ్యూ,మలేరియా,చికున్‌గునియా).మానవ సమÖహాలు ఎక్కువగా ఉండే నగరాల్లో మరింత భయంకరమైన ప్రభావాలు కనిపించే అకాశాలున్నాయి. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే,భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన వాతావరణ మార్పులు, విపత్తులు మనల్ని చుట్టుముడతాయి. సుదీర్ఘకాలిక పరిష్కారాలు ఎప్పుడు ప్రారంభిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. – రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2