గిరిజన సంప్రదాయాల్లో పురాణగాథలు

ప్రకృతి ఆరాధకులు అచ్చమైన హిందూజాతి పద్ధతులు ఆచరించే మన అడవి బిడ్డల జీవన శైలితో పాటు పురాణ గాధలతో ముడిపడి ఉన్న వారి సాంప్రదాయాల గురించి చక్కని చారిత్రక స్థానిక, ఇతిహాస కథనాలను, కలగలిపి విలువైన వ్యాసాలు పొదిగి అందించిన మంచి పుస్తకం “తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు పురాగాధలు”- సమీక్షకుడు: డా: అమ్మిన శ్రీనివాసరాజు
అనేక దశాబ్దాలుగా గిరిజనుల జీవనశైలి పై పరిశోధనాత్మక అధ్యయనం చేయడంతో పాటు వారి సమస్యల గురించి పలు పోరాటాలు చేసి అనేక రచనలు చేసిన ఉద్యమ రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ గారి కలం నుంచి వెలువడిన ఈ పుస్తకంలో పలు పరిశోధక అంశాలు వెలువడ్డాయి.
ఈ ప్రామాణిక పరిశోధక పుస్తకమును పట్టికలు, కథలు, అని రెండు విభాగాలుగా విభజించి రచయిత తన భావవ్యక్తీకరణ గావించారు.మొదటి విభాగం పట్టికలో వ్యవస్థలు, వర్ణ వివక్ష, దృక్పథాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక, చారి త్రక, స్థలాలు నెలలు, పండు గలు, ప్రణాళికలు, పంచాయ తీలు తోపాటు ప్రత్యేకంగా చెంచుల మనో ప్రపంచం, గ్రామపటం, ఉత్పత్తి, సంబంధా లు న్యాయాలు తదితర అంశా లు చిత్రపటాల సాయంగా సవివరంగా తెలిపారు రచయిత శివరా మకృష్ణ.గిరిజన ప్రాంత పర్యాటక చారిత్రక పట్టికలో, శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం,తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, కర్నూలు, మహబూబ్ నగర్, జిల్లాలలోని మండలాల వారీగా విస్తరించి ఉన్న చారిత్రక పర్యా టక ప్రాంతాల వివరాలు వివరించారు, దీని ద్వారా పర్యాటకులకే గాక పరిశోధకు లకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంది. విశాఖ జిల్లా పడ్డది మండలంలో గల చారిత్రక ప్రాంతం మత్స్య రాజుల రాజ ధాని, గూడెం కొత్త వీధిలో గల శ్రీకృష్ణ పాండవ దేవాల యం, చింతపల్లి మండలంలోని లంబసింగి పాండవుల విగ్ర హాలు, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు దగ్గర భీముని కొలను, ఆళ్లగడ్డ వద్ద అీVAబిలం లోని చెంచులక్ష్మి నరసింహస్వామి ఆలయ వివరాలు, ఇలా గిరిజన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న చారిత్రక, పురాణ ప్రాంతాల, గురించి పట్టికలో పేర్కొనడం వల్ల ఎంతో దర్శనీయ సమాచారం అందుతుంది.
అలాగే సంబంధిత నెలల్లో గిరిజనులు జరుపుకునే ప్రధాన పండుగలు వివరాలు కూడా పొందు పరిచారు.పట్టికలతో పాటు పటాల ద్వారా కూడా సమాచారాన్ని “కొండ అద్దమందు” అన్న చందం గా చక్కగా అందించారు రచయిత, వీటిల్లో దండకారణ్యం, చెంచుల మనో ప్రపంచం, చెంచు గ్రామ పటం, విశాఖ గిరిజనుల మనో ప్రపంచం, తదితర పటాలు రేఖా చిత్రాల సాయంగా విస్తృత సమాచారం క్రోడీక రించి విలువైన గిరిజన చరిత్ర సంస్కృతి, వంశ నామావళి, భావితరాల కోసం అందించిన వైనం ఎంతో ప్రయోజన కరంగా ఉంది.
రెండవ భాగంగా పేర్కొన్న “కథలు” విభాగంలో అనేక ఆసక్తి దయకమైన విలువైన విషయాలు అందించారు, వీటిల్లో కొన్ని జానపద గాథలు గాక మరికొన్ని స్థానిక చరిత్రలుగా చెప్పబడ్డాయి.
గిరిజన పురాణ గాథల్లో “మత్స్యతీర్థ స్థల పురాణం” మొదలు “నాయకపోడుల పద్మనాయక వృత్తాంతం” వరకు ప్రధానమైన పది గాథలు ఇందులో పేర్కొన్నారు.
సవర గిరిజనుల ఆరాధ్య దైవం అయిన “పూరీ జగన్నాధుడుకు చెందిన పురాణంలో పూరీకి చెందిన రాజులు సవర్లతో వేటకు వెళ్లి వారిలోనే సహజ శక్తి సామర్థ్యాలకు అబ్బురపడి అందుకు కారణమైన వారి ఆరాధ్య దైవం జగన్నాథుడిని మోసపూరితంగా సొంతం చేసుకుని ఆశక్తి సామర్థ్యాలు పూరి రాజులు కైవసం చేసుకోవడం అందుకు ఆగ్రహించిన సవరణలు జగన్నాథుడు నిలదీసి అసలు విషయం తెలుసుకుని దైవ దైవాన్ని వదిలే ప్రసక్తి లేదని పట్టు పట్టడం అందుకుగాను తిరిగి జగన్నాథుడు అక్షర బ్రహ్మగా అదే సమరదేశంలో అవతరించడం అతని అనుగ్రహంతో నిరక్షరాశులయిన సవర గిరిజనులు అక్షరాస్యులుగా మారి శుద్ధ సవర్లుగా పిలవబడుతున్నారు. ఈతెగ గిరిజనలు ప్రస్తుతం మునిగడ రాయగడ శ్రీకాకుళం ప్రాంతాల్లో విస్తరించి సొంతంగా పాఠశాలలు ఏర్పాటు చేసుకొని అక్షర బ్రహ్మను నిత్యం ఆరాధించుకుంటున్నారు ఈ జన జాతికి చెందిన “మంగయ్య సవర” సవర భాషకు నిఘంటువును సైతం వ్రాసినట్టు ఇందులో పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రకృతిలో సాధు జంతువులకు కృరీర జంతువులకు గల సహజ వైరం, చేపలు మనుగడకు కావలసిన జల ప్రవాహం కోసం అవి చేసిన పోరాటం చిత్రించే విశాఖ మన్యంలో గల మత్స్య తీర్థ స్థల పురాణం గురించి కూడా ఇందులో పేర్కొనబడింది.
శతాబ్దాలుగా మధ్య భారతాన్ని పాలించిన గోండులు ఇతర తెగల మధ్య సామరస్యాన్ని బలపరిచే పురాగాథలు, పండుగలు, వివరించ డంలో భాగంగా గోండు గిరిజన జన జాతికి చెందిన అనేక విలువైన విషయాలు సహేతుకంగా చారిత్రక ఆధారాలతో వివరించి చెప్పారు రచయిత డాక్టర్ పిరాట్ల,
గోండు జాతిలో గల,కోలాము,గోండు,పరదార్, మన్నే,తోటి,నాయకపోళ్లు,గురించిన జన్మ వృత్తాంతాలు ఆసక్తి దాయకంగా వివరిస్తూ పాండవులకు వీరికి గల అవినాభావ సంబంధాలు వివరించారు, కోలాములు భీముని సాయంతో జన్మించినట్టు తెలియజేస్తూ…భీముడిని వీరు ఆరాధ్య దైవంగా పూజించడంలోనిఅంతరార్థం ఇందులో వివరించారు.
అలాగే లక్ష్మీదేవి విష్ణు మÖర్తుల సంతానంగా పేర్కొనే పద్మనాయక గిరిజనులైన నాయక పోడు గిరిజనుల జన్మ వృత్తాంతం,మరియు విశాఖ మన్యప్రాంత ఆరాధ్య దేవత మోదకొండమ్మ గేయ గాథ, కోయల మీద దాడి చేసిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపంతో తన కొడుకును డోలిగా దత్తత ఇచ్చిన సమ్మక్క సారక్క జాతర చరిత్రను తెలిపే “మేడారం డోలి గానం ఇందులో మనం చదవవచ్చు.ఇలా అనేక ఆసక్తికరమైన గిరిజన విజ్ఞాన సమాచార వేదిక ఆయన ఈ చిరు పుస్తకం విలువ మాత్రం చాలా పెద్దది అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు (పురాగాథలు)
రచయిత: డా: పిరాట్ల శివరామకృష్ణ, పేజీలు:76, వెల:100/- రూ, ప్రతులకు: సాహిత్య నికేతన్, 3-4-852, బర్కత్ పురా, హైదరాబాద్-27, ఫోను: 040-27563236.