ప్రమాద స్థాయిలో భూగర్భ జలాలు

“ జనాల జీవితమంతా జలంతోనే ముడి పడి ఉంటుంది.నిత్యం దాని చుట్టూనే తిరుగుతుంది.నీరు లేనిదే ఏపనీ ముందుకు సాగదు.ఎండా కాలంలో నైతే బోలెడు కష్టాలెదుర్కొవాలి. చెరువులు, కుం టలు, నీటి వనరులు లేని ఊళ్లు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊరి చెంతనే నది పరుగులిడితే కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.రైతులకు పంటలు,పండిస్తుంది. చేపలు పట్టే వారికి ఉపానిస్తుంది.ఎన్నో పనులకు భరోసాగా ఉంటుంది.ఆ జీవనదిలో ఉన్న అనుబంధాల్ని మరిచపో వద్దని తమ బిడ్డలకు ఆతల్లి పేరునే పెట్టుకుంటారు. గోదావరికి ఒడ్డునే ఉన్న పలు గ్రామాలకు వెళ్తే అక్కడి వారికి నది ఎంత మేలు చేస్తుందో తెలుస్తుంది ”
టా వర్షాకాలంలో వానలకు భూగర్భ జలాలు ఉబికిరావడం..వేసవిలో పడిపోవడం సహజ ప్రక్రియ.దీనికితోడు బోర్లు, బావుల ద్వారా భూగర్భ జలాల వాడకం అధికమైతే, అక్కడ నీటిమట్టం ఇంకా పడిపోవడం కూడా సహజమే. అయితే, రాష్ట్రంలో 2,617గ్రామాల్లో నీటిని తెగ తోడేస్తున్నారు. వీటిలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా పిండుకుంటున్నారు.అక్కడ ఏటా రీఛార్జి అవుతున్న నీటి కంటే వాడుతున్న జలాల పరిమాణమే ఎక్కువ. భూగర్భాన్ని ఓ జలాశయ మలుచుకుని, వర్షాకాలంలో నీటిని ఒడిసిపట్టి, అవసరాలకు తగ్గట్టు వాడుకోవాల్సి ఉండగా, దారుణంగా తోడేస్తున్నారు. కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.కరవు కాలంలో, వేసవిలో తాగునీటికి తహతహలాడే పల్లెలు ఎన్నో. కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకునే చిత్రాలు చూస్తుంటాం.ఈ నేపథ్యంలోనే భూగర్భ జలాల రక్షణ, సమర్థ వినియోగంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తుంటారు. ప్రభుత్వ పరంగా నివారణ చర్యలు తీసుకు నేందుకు ఈ అధ్యయనం ఉపయుక్తమవుతుంది. గతంలో మÖణ్నాలుగేళ్లకోసారి ఈ పరిశీలన జరిగేది.కొంతకాలంగా ఏటా,అంటే ప్రతి నీటి సంవత్సరంలోనూ అధ్యయనం చేసి భూగర్భ జలాల లభ్యత, వినియోగం తీరుపై నివేదికలు తయారుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 21 శాఖల ద్వారా ఇచ్చే సమాచారాన్ని ఇందులో విశ్లేషిస్తున్నారు.ఉదాహరణకు ఒకనీటి సంవత్స రంలో ఒక గ్రామంలో సగటున 100యÖనిట్ల భూగర్భ జలాలు రీఛార్జి అయ్యాయనుకుందాం.ఆ ఊళ్లో ఆ ఏడాది 70 యÖనిట్ల కన్నా తక్కువగా భూగర్భ జలాలు వాడుకుంటే అక్కడ వినియోగం ‘సమర్థం’గా ఉన్నట్లు లెక్క. 70-90 యÖనిట్ల మధ్య జలాలను తోడేస్తుంటే ‘ప్రమాదకర (సెమీ క్రిటికల్)’ సంకేతం 90 నుంచి 100యÖనిట్ల మధ్య తోడేస్తుంటే ‘అంత్యంత ప్రమాదకర (క్రిటికల్)’ధోరణి. కొన్నిపల్లెల్లో 110 యÖనిట్లు కూడా తోడేస్తున్నారు. ఇది ‘అతి దారుణ’ స్థాయి. గత నీటి సంవత్సరంలో చేసిన అధ్యయనం మేరకు రాష్ట్రంలోని 300 గ్రామాల్లో అతి దారుణంగా భూగర్భ జలాలు తోడేస్తున్నట్లు తేలింది. ఇక్కడ రీఛార్జి అయిన పరిమాణానికి మించి, జలాలను తోడేశారు.450గ్రామాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉండగా,మరో 1,271 గ్రామాల్లో పరిధిని మించి నీళ్లు వాడుతున్నట్లు గుర్తించారు.
కఠినంగా వాల్టా అమలు
రీఛార్జికి మించి, నీటిని తోడేస్తున్న గ్రామాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 93,శ్రీకాకుళం-76, శ్రీసత్యసాయి-51, బాపట్ల-18, ఎన్టీఆర్-16, అనంతపురం-13, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈ ఊళ్లలో వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. అక్కడ కొత్తగా వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు బోర్లు తవ్వుకునేందుకు అనుమ తులివ్వరు. తాగునీటికి మాత్రమే బోర్లు వేసే అవకాశముంటుంది. ఆయా గ్రామాల్లో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఉండదు. ఆ దర ఖాస్తులను పరిశ్రమల శాఖకు పంపకుండానే తిరస్కరిస్తారు. విద్యుత్ సంస్థలు కూడా కొత్తగా కనెక్షన్లు ఇవ్వవు. ఈ గ్రామాల్లో పంచాయతీరాజ్, అటవీ, రక్షిత నీటి సరఫరా విభాగం భూగర్భ జలాల పెంపు, రక్షణకు అవసరమైన చర్యలు చేపడతాయి. ఉపరితల నీటి వనరుల అభివృద్ధిపై దృష్టి సారిస్తాయి.
మనం నివసించే భూగోళంలో 70శాతానికిపైగా నీరే.ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే.మొత్తం భూగోళంలోని నీటి లో దాదాపు 2.7శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ75.2శాతం ధృవప్రాంతాలలో మంచు రూపంలో ఘనీభవించివుంటే,మరో 22.6 శాతంనీరు భూగర్భంలో వుంది.మిగతా నీరు సరస్సులు,నదులు,వాతావరణం,గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ,చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు,సరస్సులు,నదులు,భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరా లకు చక్కగా ఉపయోగ పడగలిగిన నీరు చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే,పరిశుభ్రమైన నీటిలో,1శాతం కంటెకూడా తక్కువ పరిమాణంలో, (లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.00శాతం మాత్రమే) నీరు మానవ విని యోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ, మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం.కాని, ఇప్పటికీ, 88.4కోట్ల మంది( 884 మిలియన్ల మంది)ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.ప్రపంచవ్యాప్తంగా,ప్రతి ఏటా,1,500ఘనకిలోమీటర్ల పరిమాణంలో,వ్యర్ధ మైన నీరు వస్తుంటుంది.వ్యర్ధ పదార్ధాలను,వ్యర్ధ మైన నీటిని పునర్వినియోగ ప్రక్రియద్వారా, ఇంధనో త్పత్తికి,వ్యవసాయ అవసరాలకు వినియోగించ వచ్చు.కాని,సాధారణంగా, అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికార ణంగా,80శాతం వ్యర్ధాలను పున ర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తు న్నారు.పెరుగుతున్న జనాభా,పారిశ్రామిక ప్రగతి కూడా,కొత్తరకాల కాలుష్యానికి మÖలమవుతు న్నాయి.ఇదే దామాషాలో,పరిశుభ్రమైన నీటి అవస రం పెరుగుతున్నది.ఈకారణంగా,ఇటు వర్త మానంలోను,అటు భవిష్యత్తులోను మానవ ఆరో గ్యానికి,పర్యావరణ స్వచ్ఛతకు ముప్పుపొంచి వుంది.వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది.నీటి కొరత దడ పుట్టిస్తుంది.బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు.మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదుర య్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేల తల్లి నెర్రె లిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రా ల వాటా 97శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో0.008శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.క్రీశ 2025 నాటికి 48దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్ హాప్కిన్ యÖనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది.3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబం ధించిన వ్యాధులతో మరణిస్తున్నారు.నీటిమÖలంగా సంభవించిన 43శాతం మరణాలకు అతిసార వ్యాధే కారణం.పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14ఏళ్ల లోపువారే.98 శాతం మర ణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవి స్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే. భూమి మీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకు నేలా వున్నాయి.అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికి వాడల్లో నివసించే ఒకవ్యక్తి రోజు మొత్తం మీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్ స్నానానికి వాడే నీటితో సమానం.లీటరు నీటికి మురికివాడల్లో నివ సించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10రెట్లు అధికధర చెల్లిస్తున్నారు. ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు. ప్రతి 15సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధితోచనిపోతోంది. లక్షలాది మంది మహిళలు,పిల్లలు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు. రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు వాతావర ణంలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది.ఈ రెండు వాయు పదా ర్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయో గిస్తాం.నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గిం చే అవకాశం ఉంది. నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి.పచ్చనిచెట్లు,పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండ వు.ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమÖల్యమైన నీటి విలువను తెలుసు కోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తిం చాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురిం చి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువ్కెనదో అర్థం అవుతుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది.పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆనీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగి పోయిం ది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ,మేఘాలుగా మారు తూ,వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది.భూమ్మీద మÖడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97శాతం ఉప్పునీరే. కేవలం 3శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2శాతం మంచురూపంలోఉంది.మిగతా ఒక శాతం నీరులో 0.59శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదు లు,సరస్సుల్లో ప్రవహిస్తోంది.ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమై పోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చని పోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణిం చినవారే ఎక్కువ. ఏడాదికి 40లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. అమెరి కాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే,ఆఫ్రికాలోని గాంబి యా దేశంలో ఒకవ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు.గాంబియా లాంటి చాలాదేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.మనమేం చేయాలి?ఎక్కడ్కెనా కొళా యిల్లోంచి నీరువృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెం టనే కట్టేయండి.షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్ నీళ్లతో చేయండి.దీనివల్ల రోజులో150 లీటర్ల నీటిని కాపాడవచ్చు. పళ్లుతోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడంవల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది. టాయిలెట్ ఫ్లష్‌లో సుమారు 8లీటర్ల నీరు పడుతుంది.లీటర్ నీరుపట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్నచిన్నరాళ్లు నింపి, టాయ్‌లెట్ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండులీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. అక్వేరి యంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.కొళాయిలకి లీకేజీలుఉంటే దానిని అరిక ట్టండి.దీనివల్ల నెలలో 300గ్యాలన్ల నీరుఆదా అవు తాయి.ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300లీటర్ల నీరుఖర్చవు తుంది.గాలితరువాత జీవ రాశికి నీరుచాలా ముఖ్యం.అందువల్ల నీటి వనరు లను పొదుపుగా ఉపయోగించుకోవాలి.ఈ నీరు భూఉపరితలములో నదులు,కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సు లు మరియు భూగర్భజల రూపంలో ఉన్నది.
అడవుల నరికివేత వలన వర్షపాతం కూడా తగ్గిపోయింది. భారతదేశంలో సగటున ప్రతి మనిషి అన్ని అవసరాలకి కలిపి 680 క్యూబిక్ మీటర్ల నీటిని వాడుతున్నారు. 6గురు ఉండే ఇంటికి 250 లీ నీరు అవసరమవుతుంది మన దేశంలో నదుల్లో ప్రవహించే మÖడవ వంతు నీళ్ళు సము ద్రాల్లోకి నష్టపోతున్నాం.భూగర్భ, భూఉపరితల జలాలు రెండూ కలిపి దేశంలో వాడే మొత్తం నీటిలో 4శాతంవ్యవసాయానికి,12శాతం పరిశ్ర మలకి వాడుతున్నాం.ఇంతటి విలువైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉంది. ప్రస్తుతం ఉన్న వర్షా భావ పరిస్థితుల్లో ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టుకొని నిల్వ చేసుకో వాల్సిన అవసరం ఉంది.నానాటికి ఇంకిపోతున్న భూగర్భ జలాల సంరక్షణ పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువత నేటితరం కోసం భావితరాల కోసం కొన్ని బాధ్యతలను విధిగా నిర్వర్తించాల్సి వుంది.నీటి సం రక్షణలో మొదటగా చేయాల్సింది నీటి వృధా అరిక ట్టడం.దైనందిన జీవితంలో మనం చాలా నీటిని వృధా చేస్తూఉంటాం. ముందుగా ప్రతి వ్యక్తి నీటి వృధాను అరికట్టే ప్రయత్నం చేయాలి.ప్రతి నీటి చుక్కా అమÖ ల్యమైందే. మంచినీటిని పొదుపుగా వినియోగిం చాల్సిన అవసరం అందరిపై ఉంది. రోజువారీ అవసరాల్లో మనకు తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. నీటి వనరుల పర్యవేక్షణ లో యువత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.– జీ ఎన్ వి సతీష్