తీవ్ర వాతావరణ పరిస్థితులు..వైపరీత్యాలు..


భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్ర తలు.. ఆ కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మా ర్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరి స్తూనే ఉన్నారు.అందుకు తగ్గట్టే వాతావర ణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి. వేసవిలో గాలి దుమారాలు సహజం. కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి మహానగరాలను వణికిస్తున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. గాలి దుమారాలు, ధూళి తుఫాన్లు, వర్షాల తీవ్రత నానాటికీ పెరగడం ఒకెత్తయితే.. ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. గతేడాది వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని ఘటన లను పరిశీలిస్తే..
. 2024 మే 13: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై ప్రచండ వేగంతో కూడిన గాలులతో ధూళి తుఫాను విరుచుపడింది.ఈధాటికి ఘట్కోపర్ ప్రాం తంలో ఓభారీ ీVAర్డింగ్ నిట్టనిలువుగా పక్కనేఉన్న పెట్రోల్ బంక్‌పై కుప్పకూలింది.దాని కింద నలిగి 14మంది ప్రాణాలు కోల్పోగా,మరో 74మంది తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇదే రోజు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, గాంధీనగర్ సహా పలు ప్రాంతాల్లో ధూళి తుఫాను బీభత్సం సృష్టిం చింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది.రహదారులపై వాహ నాల రాకపోకలను స్తంభింపజేసింది.
. మే 10: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని ధూళి తుఫాను అతలాకుతలం చేసింది.ఈ గాలి దుమా రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది గాయాల పాలయ్యారు.
. ఏప్రిల్ 13: భారత వాతావరణ శాఖ హెచ్చ రించినట్టే రాజస్థాన్‌పై అనేక ధూళి తుఫాన్లు విరుచుకు పడ్డాయి. తీవ్రమైన వేగంతో కూడిన గాలుల ధాటికి కచ్చా గృహాలు సహా అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.
భూతాపమే కారణం..
అతి భారీ వర్షాలు,తీవ్రమైన వేడి గాలులుతో పాటు తరచుగా సంభవిస్తున్న అతి తీవ్ర ధూళితుఫాన్లు,గాలి దుమారాలకు భూతాపమే కారణమని పాఠశాల విద్యార్థిని అడిగినా చెబుతాడు.ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అధ్యయనం ప్రకారం1950 నుంచి నమోదైన ఘటనలను పరిశీ లిస్తే వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న వైపరీత్యాల సంఖ్య మÖడు రెట్లు పెరిగిందని తేలింది. ఈ సమాచారాన్ని ‘నేచర్ కమÖ్యనికేషన్స’ పేరుతో నిర్వహిస్తున్నసైన్స్ మ్యాగజీన్లో ప్రచురించింది. ఇలాం టి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు,విపత్తుల కార ణంగా అనూహ్య స్థాయి వరదలు సంభవిస్తూ ప్రజల ఆస్తి, ప్రాణనష్టాలు కలుగజేస్తున్నాయని పేర్కొంది. భారత్‌లో ఎక్కువగా ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి.గుజరాత్, మహా రాష్ట్ర,మధ్యప్రదేశ్,చత్తీస్‌గఢ్,తెలంగాణ, ఒడిశా, ఝా ర్ఖండ్, అస్సాం,మేఘాలతో పాటు పశ్చిమ కనుమలకు ఆనుకున్న గోవా,కర్ణాటక కోస్తా ప్రాంతం, ఉత్తర కర్ణాటకలో ఈతరహా విపత్తులకు ఎక్కువగా నమోద వుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎన్విరాన్ మెంట్, సస్టెయినబులిటీ అండ్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపక సీఈవో చంద్ర భూషణ్ ఇసుక తుఫాన్లు పెరగడానికి కారణం భూతాపమే అని చెబుతున్నారు.
భూతాపం ఎందుకు పెరుగుతోంది.?
భూతాపాన్ని పెరగడానికి కారణాల్లో ముఖ్యమైనది భూమ్మీద గ్రీన్ హౌజ్ వాయువుల స్థాయి పెరగడమే. కార్బన్ డై ఆక్సైజ్ సహా మరికొన్ని వాయువులను గ్రీన్ హౌజ్ వాయువులుగా పేర్కొంటారు. భూగోళంపై ఇవి ఒక మోతాదులో ఉండకపోతే ప్రాణికోటి బ్రతక డం కూడా కష్టమే. సూర్య కాంతి లేని సమయంలో (రాత్రి వేళల్లో) భూమి అత్యంత శీతల పరిస్థితిని ఎదుర్కోకుండా ఈగ్రీన్ హౌజ్ వాయువులు అడ్డుకుం టాయి. ఫలితంగా రాత్రివేళల్లో జీవరాశి మనుగడ సాగించగల్గుతోంది. అయితే వీటి మోతాదు వాతావర ణంలో పెరిగే కొద్ది అనర్థాలు, వైపరీత్యాలే. కర్బన ఉద్గారాలు పెరగడంలో శిలాజ ఇంధనాల (పెట్రోలి యం ఉత్పత్తులు)తో నడిచే వాహనాలు, నేల బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యం వంటివి ప్రధానమైనవి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక, లక్ష్యం నిర్దేశించుకుంది.
విపత్తులను ముందే గుర్తించగలమా?
ప్రకృతికి ఎదురొడ్డి నిలబడడం భూమ్మీద మనిషికే కాదు ఏజీవరాశికి కూడా సాధ్యం కాదు. కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే పసిగట్టగల్గితే..దాని బారిన పడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిశోధన సంస్థలు వాతావర ణంలో మార్పులను పసిగట్టి తగిన హెచ్చరికలు జారీ చేస్తుంటాయి.అయితే ప్రకృతిలో సంభవించే అన్ని రకాల వైపరీత్యాలను, వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందు కంటే వాతావరణం అన్నదే అత్యంత సంక్లిష్ట మైన అంశం.సుదీర్ఘ అనుభవం,లోతైన అవగాహన, అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భారత వాతావరణ శాఖ ఈ మధ్య కాలంలో చాలా అంశాల్లో ముందుగానే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హీట్ వేవ్ (వేడి గాలులు), తుఫాన్లు, వాటి తీవ్రత విషయంలో వాతావరణ శాఖ అంచనాలు దాదాపుగా నిజమవుతు న్నాయి.ఆ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వాలు చర్యలు తీసుకున్నప్పుడు ప్రాణనష్టాన్ని నివారిం చగల్గుతున్నాం.హీట్ వేవ్, తుఫాన్లను అంచనా వేయ గల్గినంతగా..ప్రకృతిలో సంభవించే అన్ని వైపరీత్యా లను పసిగట్టడం,లేదా వాటి తీవ్రతను అంచనా వేయ డం సాధ్యం కాదు. ఈ వైపరీత్యాలను అడ్డుకోవాలంటే తక్షణం భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టడమే ఏకైక మార్గమని ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశో ధకులు,నిపుణులు చెబుతున్నారు.
2025లో ఇదేతీవ్ర వాతావరణ పరిస్థితులు
ఇదే కారణం2024 సంవత్సరలో కళ్లువిప్పే అనుభవంగా నిలిచింది,ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావంపై అవగాహన లేని వారికీ కూడా. ప్రపంచంలోని ఏదో ఒక ప్రాంతంలో తీవ్ర వాతా వరణ సంఘటనలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తం గా ఈ విపత్తుల ప్రభావం పెద్ద ఎత్తున కనిపించిన ప్పటికీ,భారత్ వాతావరణ మార్పుల కారణంగా అత్య ధికంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని బహిరంగం చేసేందుకు, న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (్పుSజు) విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వి రాన్‌మెంట్ 2025’నివేదిక ప్రకారం,2024లో గణనీ యమైన 274రోజులలో 255 రోజులు (93శాతం) కనీసం ఒక్క ప్రాంతంలో అయినా తీవ్ర వాతావరణ మార్పులను చవిచూశాయి. ఇది 2023లో నమోదైన 235రోజుల కంటే,2022లో నమోదైన 241 రోజుల కంటే ఎక్కువ.
2025 కూడా భయంకరమే!
2024 ఇంత దారుణంగా ఉంటే, 2025లో పరిస్థితి మరింత దిగజారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేశాయి.భారత వాతావరణ విభా గం (Iవీణ)ప్రకారం,ఈ ఏడాది వేసవి మామÖ లు కంటే తొందరగా ప్రారంభమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే తెగిన వేడిమి, అధిక ఉష్ణోగ్రతలు, తరచూ కనిపించే ఎండగాలి (Hవat ఔaఙవs) పరిస్థితులు ఉండబోతున్నాయి.ఇప్పటికే 2025 ఫిబ్రవరి నెలను 1901నుండి ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి కలిగిన ఫిబ్రవరి నెలగా ప్రకటించారు.
విపత్తుల ముప్పు
కేరళలోని వయనాడ్‌లో 2024 జూలైలో జరిగిన భారీ భూసలనం కారణంగా 350మంది కిపైగా ప్రాణాలు కోల్పోయారు, ఇంకా చాలా మంది కనిపించకుండా పోయి మృతులుగా ప్రకటించారు. మరోవైపు,రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఒక్కరోజులో 55% సీజన్ వర్షపాతం పడింది. ఇదే సమయంలో, లేహ్ వంటి హిమప్రాంతాల్లో కూడా 2024 జూలైలో ఉష్ణతరంగాలు(Hవatwaఙవs) నమోదయ్యాయి.
భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం
2024లో తీవ్ర వాతావరణ సంఘటనల కారణంగా3,238 మంది మరణించారు, ఇది 2022 లో నమోదైన 2,755మరణాలతో పోలిస్తే 18% పెరుగుదల. ప్రపంచ వ్యాప్తంగా 2024 సంవత్సరం సగటు ఉష్ణోగ్రత1.5ళ్పుీపెరిగిన మొదటి సంవ త్సరం.యÖరోపియన్ యÖనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ 2024లో గ్లోబల్ సర్ఫేస్ ఎయిర్ టెంపరేచర్ 11 నెలలపాటు 1.5ళ్పుీ కంటే ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది.
భారతదేశానికి ఎందుకు ఎక్కువ ప్రమాదం?
పుణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ కి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డా. రాక్సీ మాథ్యూ కోల్ ప్రకారం, భారతదేశం సమీప హీలియో గ్రాఫికల్ దృష్ట్యా ఎక్కువ సూర్యరశ్మిని గ్రహిస్తుంది.అర్బన్ ప్రాంతాల్లో cశీఅcతీవtవ వల్ల రాత్రిపూట కూడా వేడిమితగ్గదు.ఈ మార్పుల కారణంగా ఉష్ణతరంగాల తీవ్రత3-6 రెట్లు పెరిగే అవకాశం ఉంది.గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరగడం ఎలా విపత్తులకు దారి తీస్తోంది.ఓషన్లు ఎక్కువ వేడిని గ్రహిస్తున్నాయి.దీనివల్ల అధిక ఆవిరి ఉత్పత్తి జరుగు తుంది.ఈ అధిక తేమ గాలికి అదనపు శక్తిని ఇస్తుంది, చెడిపోయే వాతావరణ పరిస్థితులను(స్టార్ములు, సైక్లో న్లు) ప్రేరేపిస్తుంది.ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు సంవత్సరానికి 3మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతు న్నాయి.భారతీయ మహాసముద్రం ఉష్ణోగ్రత 1.2ళ్పుీపెరిగింది, ఇది సముద్ర మట్టాలను ఇంకా వేగంగా పెంచే ప్రమాదం ఉంది.
ఆరోగ్యంపై ప్రభావం
వేడిగాలులు,అధిక ఉష్ణోగ్రతలు వేడి సంబం ధిత వ్యాధులను పెంచుతున్నాయి (ఉదాహరణకు, హీట్ స్ట్రోక్, డెంగ్యూ, మలేరియా, చికున్‌గునియా). మానవ సమÖహాలు ఎక్కువగా ఉండే నగరాల్లో మరింత భయంకరమైన ప్రభావాలు కనిపించనున్నా యి.2040నాటికి 2బిలియన్ మంది ప్రజలు 0.5ళ్పుీ అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనవలసి ఉంటుంది.
ప్రపంచ రాజకీయాలు చర్యలు
డైరెక్టర్ సునితా నరైన్ ప్రకారం,కొన్ని దేశాలు క్లైమేట్ చేంజ్ ను మేనేజ్ చేయడం మానేశాయి. అమెరికా వంటి దేశాలు మళ్లీ ఇంధన తవ్వకాలను (ణతీఱశ్రీశ్రీ,దీaby,ణతీఱశ్రీశ్రీ!) ప్రోత్సహిస్తున్నాయి, ఇది ఇతర దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ప్రపంచం ఇప్పటికే1.5ళ్పుీ గ్లోబల్ కార్బన్ బడ్జెట్ ను అధిగమిం చింది, కనుక మరింత ఆలస్యం మానవజాతికి చాలా తీవ్రమైన ఫలితాలు తీసుకువస్తుంది.
ముగింపు
ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఇంకా తీవ్రమైన వాతావరణ మార్పులు, విపత్తులు మనల్ని చుట్టుముడతాయి. సుదీర్ఘకాలిక పరిష్కారాలు ఎప్పుడు ప్రారంభిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. (ఇన్‌ఫుట్ : రెబ్బాప్రగడ రవి)