భూకంపాలు ఎందుకు వస్తాయి?

మార్చి 28న మయన్మార్‌లో..
ఈ తరహాలోనే మార్చి 28న మయన్మార్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.7తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటి వరకూ కనీసం 1700 మంది ప్రాణాలు కోల్పోగా..దాదాపు 4 వేల మంది గాయపడ్డారు. అయితే, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో లెక్కేలేదు. భూకంపం సంభ వించి నాలుగు రోజుల గడిచిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలు కుళ్లిపోయి.. దుర్గంధం వెదజల్లుతోంది.దీంతో భారీ యంత్రాలు సాయం లేకుండానే స్థానికులు..ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మండేలాలో భూకంప విలయం తీవ్రంగా ఉంది. అక్కడ ప్రజలు వీధుల్లోనే నిద్రలేని రాత్రులు గడుపు తున్నారు.వరుస భూకంపాలు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆతర్వాత కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సహా యక చర్యలు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అయితే, మయన్మార్ భూకంప విధ్వంసాన్ని ఉపగ్రహ ఫోటోలు కళ్లకుకడుతున్నాయి.రోడ్లు, విమానాశ్రయాలు, వంతె నలు, భవనాలు సహా మౌలిక సదుపాయాలు ఏంతలా ధ్వంసమయ్యాయే చూపుతున్నాయి.
మరోవైపు,భూకంపంవల్ల థాయ్‌లాండ్ రాజ ధాని బ్యాకాంక్‌లో నిర్మాణ భవనం కుప్పకూలిన ఘటనలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ కొనసాగుతోంది.కానీ, వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి బయటకు తీసిన వారిలో ఎవరూ ప్రాణాలతో లేరని చెప్పారు. పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల పడు తుందని వెల్లడించారు.ఇక,థాయ్‌లాండ్‌లో ఇప్పటి వరకు17మంది చనిపోగా..మరో 32మంది గాయాల పాలయ్యారు.కానీ, నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ గల్లంతయ్యింది.
మారుతున్న భూకంప జోన్లు
ఇలా ఉండగా,భారత దేశంలోని భూకంప జోన్లు మారనున్నాయి. ప్రస్తుతం ఐదు జోన్లుండగా.. వాటి సంఖ్య ఆరుకు పెరగనుంది.1962లో తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఐదు జోన్లను ఏర్పాటు చేయగా..భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) 1970,1984లో కొన్ని మార్పులు చేసి, జోన్ల పరిధిలోని ప్రాంతాలను మార్చింది. 2002లో ‘ఐఎస్ 1893:2002’పేరుతో వాటిని అభివృద్ధి చేసింది.అప్పటి నుంచి భూమి లోపల ఫలకాల కదలిక లో వేగం(యాక్సలరేషన్) పెరుగుతూ.. ఎన్నో మార్పు లు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో..భూభౌతిక శాస్త్రవేత్తలు,జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు, భూకంపాల పరిశోధకులు, బీఐఎస్ అధికా రులతో కొత్త జోన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
అంకెలా? ఆంగ్ల వర్ణమాలా?
ప్రస్తుతం ఉన్న జోన్లు రోమన్ నంబర్లలో ఉన్నాయి. జోన్-5లో అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలుండగా..జోన్-2లో అత్యల్ప ప్రభావం ఉంటుంది.కొత్త జోన్లకు ఇదేవిధంగా రోమన్ నంబర్లను వాడాలా?పాత-కొత్త మధ్య అయోమ యాన్ని తొలగించేందుకు ఆంగ్లవర్ణమాలలోని ఏ, బీ,సీ,డీ,ఈ,ఎఫ్‌లను వాడాలా?అనేదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఈ కమిటీలోని ఓ అధి కారి చెప్పారు. ఈ అంశం మినహా.. ఏ జోన్ పరిధి లోకి ఏయే ప్రాంతాలు వస్తాయి? అనే దానిపై బీఐఎస్ రూపొందించిన‘ఐఎస్ 1893:2025’ని కమిటీ ఖరారు చేసిందని వివరించారు. ప్రమాదకర ఆరో జోన్‌లో ఎగువ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు ఉన్నాయని తాజా మ్యాప్ చెబుతోంది. వీటితోపాటు.. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు,కొంకణ్ ఈజోన్‌లో ఉన్నాయి. హిమాలయాల్లోని జమÖ్మకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నేపాల్‌తో సరిహద్దులను పంచుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ దీవులు ఇదే జోన్‌లో ఉన్నాయి. భూగర్భం లో ఫలకాల కదలికకు సంబంధించిన యాక్సలరేషన్ ఈప్రాంతాల్లో 5జీ(గ్రావిటీ)గా ఉంటుంది.ఈ ప్రాం తాల్లో భూగర్భంలో ఫాల్ట్స్ కారణంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని,అంతర్-ఫలకల ప్రాంతం కావడంతో నష్టం తీవ్రంగా ఉంటుందని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రదీపకుమార్ వివరించారు.
ఐదో జోన్ కొంత భాగమే
పాత జోన్-5లో భూగర్భ ఫలకాల యాక్సలరేషన్ 0.36జీగాఉండేది.కొత్త జోన్-5లో ఈవేగం 0. 333జీగా ఉన్నట్లు సమాచారం.దిగువ హిమాల య ప్రాంతాల్లోని గంగామైదానాలు కొంత వరకు ఐదో జోన్‌లోకి వస్తాయి. ఇక్కడ కూడా రివర్స్, స్ట్రైట్‌స్లిప్ ఫాల్ట్స్ ఉన్నా..వాటి యాక్సలరేషన్ తక్కువగా ఉంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్‌లో ఉంటాయి. 0.233 గ్రావిటీ ఉండే ప్రాంతాలనుజోన్-4లో చేర్చారు. ఇక్కడ భూకంపాలు వచ్చినా.. తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో న్యూఢిల్లీ, ఎన్‌సీఆర్-ఢిల్లీ, పట్నా, కోల్‌కతా నగరాలున్నాయి.
జోన్-3లో కీలక నగరాలు
జోన్-3(0.125జీ)లో లఖ్‌నవూ, పట్నా లోని కొన్ని ప్రాంతాలు,రాంచీ,భువనేశ్వర్,డామన్,ముంబై, ఏ| Óలోని అమరావతి,చెన్నై,పుదుచ్చేరి ఉన్నాయి. ఈ ప్రాం తాల్లో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతాలు,తెలంగాణలోని భద్రాచలం,తమిళ నాడు లోని థేని, కేరళలోని శబరిమల, పెరియార్ అడవులు కూడా ఈ జోన్‌లోనే ఉన్నాయి.
జోన్-2లో తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క భద్రాచలం మినహా.. మిగతా ప్రాంతాలన్నీ గత జోన్లలో మాదిరిగానే జోన్-2లో ఉన్నాయి. ఇక్కడ భూగర్భంలో ఫలకం కదలిక 0.075 గ్రావిటీతో ఉంటుంది. ఈకారణంగా పెద్దగా ఆస్తి,ప్రాణనష్టం ఉండవని శాస్త్రవేత్తలు వివరిస్తు న్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కర్ణాటకలోని 99%ప్రాంతాలు, కేరళలోని గురు వాయÖర్ ఈ జోన్‌లోనే ఉన్నాయి.
మహా విపత్తు
భూకంపంమనిషి జ్ఞానాన్ని పరిహసించే ప్రకృతి విపత్తు.‘మానవ అహంకారం ప్రపంచాన్ని త్యాగం చేస్తుందా? ఆడంబరమైన గృహాల పట్ల దాని కోరికను తీర్చుకోడానికి? బట్టతలలా వున్న ఆ గోళాన్ని సుదూర అంతరిక్షం చూస్తుందా? ఇప్పుడు ఆ భూమాత చెప్పేది నాకు వినబడుతోంది/నన్ను ఒకప్పుడు భూమి అని పిలిచేవారు/కానీ ఇప్పుడు,ఆనందం లేకుండా ఏడుస్తు న్నాను/ చెట్లు లేని గోళం ఇకపై భూమి కాదు’ అం టారు కవి గర్విట్.మయన్మార్,థారులాండ్‌ను రెండు భారీ భూకంపాలు వణికించాయి.మరోసారి భూప్ర కంపనలు రావడంతో ప్రజలు భీతిల్లారు. రిక్టార్ స్కేల్ మీద ఈ భూకంపాల తీవ్రత 7.7,6.8గా నమో దైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం వుందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది. పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంతోపాటు, వందల సంఖ్యలో భారీ భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు పేకమేడల్లా కుప్పకూలాయి.
‘భూకంపాలు ప్రజలను చంపవు భవనాలు చంపుతాయి’ అంటాడు జపాన్‌కు చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ షిగేరు బాన్. ప్రకృతిని మనం గౌరవించ నంత కాలం ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. భూ వైజ్ఞానిక పరిశోధనల ప్రకారం..టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్ పలకలపై వున్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువ. ఇక్కడి టెక్టానిక్ పలకలు ఏటా 0.7అంగుళాల చొప్పు న పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలి తంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుం టుంది. ఇక్కడ దశాబ్దానికొక్క భారీ భూకంపం నమోదవుతోంది.
‘భూమాతకు గర్భశోక భారం భూకంపం’ అంటారో కవి. ప్రకృతి వైపరీత్యాల నుంచి బయట పడటానికి సంసిద్ధత కీలకం. అటువంటి శోకభారాన్ని అనుభవిస్తోన్న మయన్మార్ ప్రజలకు ‘మనమందరం ఒక తాటిపై నిలబడి, ఈ విలయాన్నుంచి బయటపడి భవిష్యత్తును పునర్నిర్మించుకోవాల్సి వుందని’ ఆ దేశ ప్రధాని మన్ విన్ పిలుపునిచ్చారు. సాయపడే ప్రతి చేయి, ప్రతి చిన్న కార్యాచరణ కూడా ఈ సమయంలో ఎంతో విలువైనవి. ప్రపంచమంతా తమ ఔదార్యం చూపాల్సిన సమయమిది. మయన్మార్‌కు గతంలో భూకంపాలను చవిచూసిన చరిత్ర వున్నప్పటికీ, తగిన సంసిద్ధత లేకపోవడం,పేలవమైన నిర్మాణాలు,ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, తగినంత అవగాహన లేకపో వడం కూడా ఇంత భారీ నష్టానికి కారణమైంది. స్థానిక ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం సహకా రంతో మయన్మార్‌ను పునర్మిర్మించాలి. ప్రకృతి మళ్లీ దాడి చేసినప్పుడు ప్రజలను రక్షించగల సామర్థ్యం, సంసిద్ధతను మయన్మార్ ఏర్పరచుకోవాలి.– గునపర్తి సైమన్