సమిష్ట కృషితోనే అగ్రస్థానంలో విశాఖ అభివృద్ధి

స్వర్ణాంధ్ర సాకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని, అధికారులు సమష్టి కృషి చేసి విశాఖపట్టణం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. ప్రజలకు సంతృప్తికర రీతిలో సేవలందిస్తూ, అభివృద్ధి – సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, సమ్మిళిత ఆర్థిక విధానాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరూ వారి కర్తవ్యాలను నిర్వర్తించాలని సూచించారు.ఈ నెల 25,26వ తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మÖడో విడత కలెక్టర్ల సదస్సు అంశాలను శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన సమావేశంలో జిల్లా అధికా రులకు వివరించిన ఆయన పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అన్ని రంగాల్లో విశాఖ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపటమే లక్ష్యంగా బాధ్యతగా పని చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర ఏ2047 విజన్ ప్లాన్, విశాఖపట్టణం 2025-29 ప్లాన్ ప్రాతిపదికగా ముందుకు సాగాలని అధికారులను పేర్కొన్నారు. విశాఖపట్టం రూపురేఖలు మార్చేలా ప్రతి ఒక్కరూ ప్రణాళికా బద్ధంగా పని చేయాలని, అంకిత భావం ప్రదర్శించాలని సూచించారు.మహానగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపట్టాలని, ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా కృషి చేయాలన్నారు. రంగాలవారీగా వివిధ అంశాలపై పీపీటీ ఇచ్చారు.
15 శాతం వృద్ధి లక్ష్యాలను చేరుకోవాలి…
పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని, కొత్త ీVAటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రుషికొండ, గంభీరంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ కాంప్లెక్సులు నిర్మించాలని సూచించారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ పరిధిలో చేపట్టే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, అనుమతుల జారీ విషయంలో పారదర్శకత పాటించాలని, వేగం పెంచాలని సూచించారు. 15 శాతం వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, తలసరి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి నెలా ఒకటో తారీఖున ఠంచనుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఫింఛన్లు అందజేయాలన్నారు. రేషన్ సరకులను కూడా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలన్నారు. ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా అమలు కావాలని, మద్యం పాలసీకి అనుగుణంగా జిల్లాలో చర్యలు చేపట్టాలని, అవకవతకలు జరగకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. విద్యా, వైద్య రంగంలో ప్రమాణాలు మరింత మెరుగపడాలని, ప్రయివేటుకు ధీటుగా సేవలను విస్తృతం చేయాలని సూచించారు.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి….
అధిక శాతం పట్టణీకరణ కలిగిన జిల్లా అయిన్పటికీ ఉన్న గ్రామీణ మండలాల్లో వ్యవసాయంపై ప్రధాన దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఉద్యాన, ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో గుంతలు లేకుండా రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, పరిశుద్ధమైన తాగునీటిని సరఫర చేయాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండాలని పేర్కొన్నారు. దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో నూతన విధానాలను అవలంభిస్తూ ప్రజలకు చేదోడుగా నిలవాలన్నారు. వచ్చే ఏడాదికి 200 హెక్టార్ల బీడు భూములను సాగులోకి తీసుకురావాలని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, నగరంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు బాధ్యతగా పని చేయాలని, ఉత్తమ ఫలితాలను రాబట్టాలన్నారు. వివిధ వేదికల ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలు, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రతి నెలా 100 పారిశ్రామిక యÖనిట్లు నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఆరు నెలల్లో మెట్రో భూసేకరణకు చర్యలు…
విశాఖలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవసరాల నిమిత్తం ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఆరు నెలల్లో మొదటి దశ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉం టుందని అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలని, అంతర్గత రోడ్ల విషయంలో వేగం పెంచాలని సూచించారు. మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసే మార్గంలో కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని, కొత్త భవనాలు, లేఅవుట్లు వేసేందుకు ప్రణాళికలు తయారు చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ నుంచి అనుసంధానమయ్యే రోడ్ల అభివృద్ధికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు కర్మయోగి సర్టిఫికేట్ కోర్సులు చేయాలని, పీ-4 సర్వేకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ సేవలను మరింత విస్తృతం చేయాలని, సంబంధిత నంబర్ ను పబ్లిక్ ప్రాంతాల్లో ప్రదర్శించాలని సూచించారు.
పరిశ్రమలు నెలకొల్పేందుకు పక్కా ప్రణాళికలతో రండి…
చిన్నచిన్న యÖనిట్ల రూపంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక ఔత్సాహికులు పక్కా ప్రణాళికలతో రావాలని, వారికి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు సాంకేతిక సహాయం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరకు ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారికి అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు. 2025-26 వార్షిక ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఔత్సాహికులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, వీలైనన్ని పారిశ్రామిక యÖనిట్లు నెలకొల్పాలని పేర్కొన్నారు.
జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు అనువైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో అధికారులు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గాజువాక, ఆటోనగర్ వద్ద గల రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్.వో.బి.), పెద గంట్యాడ, అగనంపూడి, ఆటోనగర్లలో ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణాలకు, పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి వనరులను సమకూర్చాలని, సౌసైటీ భవనాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.భూ సేకరణ,సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎంఎసఎంసీ సెక్టార్ల ఏర్పాటులో చురుగ్గా వ్యవహరించాలన్నారు. కోర్టు కేసులు, విజిలెన్స్ కేసుల విషయంలో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో భాగంగా ఐలా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ఆటోనగర్, ఐటీ హిల్స్ వద్ద కావల్సిన సదుపాయాలపై, అన్ని రకాల సమావేశాలకు, సభలకు ఉపయోగపడే విధంగా పెద్ద హాలు నిర్మాణంపై కలెక్టరుకు నివేదించారు.
రూ.23,870 కోట్లతో “పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన” విడుదల
విశాఖపట్నం జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచు కొని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (చీAదీA=ణ) 2025-26 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన “పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన” (PLP)ను కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా డీఐపీఈసీ సమావేశం అనంతరం విడుదల చేశారు. రూ.23,870.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ రూపొందించినట్లు నాబార్డ్ డెవలప్మెంట్ మేనేజర్ బసంత్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రణాళిక ముఖ్యంగా ఎం.ఎస్.ఎం.ఈ.లు, పునరుత్పాదక ఇంధనం, ఎగుమతి క్రెడిట్, సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఎంఎసఎంఈ రంగానికి రూ.16,207.50 కోట్లు, ఎగుమతి ఆధారిత వ్యాపారాల కోసం రూ.612 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.300.74 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.3,368.99 కోట్లు, ఇతర విభిన్న అవసరాల కోసం రూ.3,384.38 కోట్లు కేటాయించినట్లు వివరించారు.ఈ ప్రణాళిక అన్ని రంగాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో దోహదప డుతుందని బసంత్ కుమార్ పేర్కొన్నారు. – జి ఏ సునీల్ కుమార్