వైద్య సేవలు ఉత్తిదే..

ప్రజలకు  వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపిందని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో మౌలిక వసతులను సైతం ప్రభుత్వం సమకూర్చడం లేదు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన 108 అంబు లెన్సులు ..ప్రజల అవసరాలకు తగిన సంఖ్యలో ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు 108లు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నాయని పీఎజీ అధ్యయనంలో తేలింది.
జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం లో ప్రభుత్వం 108అంబులెన్సులు నడపడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి50వేల మంది జనాభాకు ఒకఅంబులెన్సు ఉండాల్సి ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం 65 వేల249 జనాభాకు ఒకటి మాత్రమే నడుపుతున్నారు. మాతా, శిశు మర ణాల సంఖ్య తగ్గింపు చర్యల్లో భాగంగా 279తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్‌లను నడుపుతున్నారు.ఈపథకం కింద ఇంటి నుంచి ఆసుపత్రికి గర్బిణులను..ప్రసవం అనం తరం ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డను ఇంటికి చేర్చాలి. ప్రభుత్వా సుపత్రుల్లో 36 లక్షల 73 వేల ప్రసవాలు జరిగితే.. కేవలం 10లక్షల 17వేల మంది తల్లులను మాత్రమే ఈ వాహనాల ద్వారాఇళ్లకు చేర్చారు.26లక్షల 56వేల మంది తల్లులు ఈ సౌకర్యాన్ని పొందలేకపోయారని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ప్రధాన కార్యాలయం పేర్కొంది.రాష్ట్రంలో అత్యవసర సర్వీసుగా పిలిచే 108 సేవలు జనాభాకు సరిగ్గా అందడం లేదని పీఎజీ తాజా నివేదికల్లో తేలింది. పట్టణ ప్రాంతాల్లో 20నిమిషాలకు ప్రమాద ఘటన స్థలానికి అంబులెన్సు చేరుకోవాల్సి ఉన్నా..3.23 నిమిషాల ఆలస్యంగా చేరుకుంటుందని లెక్కలు చెబుతున్నాయి. దీనికి జరి మానాలు విధిస్తున్నాసమయానికి సంఘటన స్థలానికి అంబులెన్సులు చేరుకోకుంటే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని పీఎజీ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినప్పుడు నిర్దేశిం చిన సమయం కంటే ముందుగానే వివరాల సేకరణ జరుగుతుందని పేర్కొంది.
కొండలు, గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి 20వేల జనాభాకు ఒక పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం159ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పని చేస్తు న్నాయి. గిరిజన ప్రాంతాల్లో 84అంబులెన్సులు, 122 ఫీడర్ అంబులెన్సులు నడుస్తున్నాయి. కానీ ప్రతి పీహె చ్‌సీకి ఒకటి చొప్పున 108అంబులెన్సు ఉండాల్సిన అవసరం ఉందని పీఎజీ వెల్లడించింది.సీతంపేట ఏరియా ఆసుపత్రిలోని బేసిక్ లైవ్ సపోర్టు అంబు లెన్సును పరిశీలించినప్పుడు అందులో ఎయిర్ ఫ్లో మీటర్ లేదు. రోగికి సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ ఇచ్చే సమయంలో ఎయిర్ ఫ్లో మీటర్ ఉపయోగిస్తారని పీఎజీ తెలిపింది.
రోగితో వెళ్తున్న అంబులెన్స్ బ్రేక్ డౌన్
108కి అదనంగా బోధనాసుపత్రులకు అనుసం ధానంగా ఉన్న అంబులెన్సులు చాలా చోట్ల మరమ్మ తులకు గురై ఉన్నట్లు పీఏజీ తెలిపింది. అనంతపురం బోధనాసుపత్రిలో 8 అంబులెన్సుల ఉండగా వీటిలో ఆరు పనిచేయడం లేదు. శ్రీకాకుళం బోధనాసుపత్రిలో ఆరింటికి గాను మÖడు, నెల్లూరులో ఎనిమిదికి.. ఒకటి చొప్పున అంబులెన్సులు పనిచేయడం లేదు. అనంతపురం, నెల్లూరు బోధనాసుపత్రుల్లోని అంబు లెన్సుల్లో చీ.A.దీ.H. ప్రమాణాల ప్రకారం పరికరాలు లేవని పీఏజీ గుర్తించింది. కాల్ రీసివింగ్ రిజిస్టర్‌ను నిర్వహించడంలేదని తనిఖీల్లో తేలింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ ఏర్పాటు కోసం వచ్చిన సామ గ్రి వృథాగా పడి ఉందని అధికారులు గుర్తించారు. ఈలేబరేటరీ ఇక్కడ వద్దకున్నప్పటికీ ఖరీదైన సామగ్రిని మాత్రం అక్కడే ఉంచారు.సీతంపేట,నాయుడుపేట, సోంపేట ఆసుపత్రులకు అదనంగా పీడియాట్రిక్ ఐసీ యÖల కోసం వచ్చిన వెంటిలేటర్లు 2022 జనవరి, ఫిబ్రవరి నుంచి వృథాగా అక్కడే ఉన్నాయి. వీటిని ఉపయోగించే సామర్థ్యం కలిగిన సాంకేతిక నిపుణులు లేకపోవడం, స్థలాభావమే ఇందుకు కారణం. నెల్లూరు జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల అవసరాల కోసం వచ్చిన 623ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వినియోగించడంలేదు.వీటిని అవస రమైన ఇతర ఆసుపత్రులకు పంపడం లేదని పీఎజీ తనిఖీల్లో తేలింది. ఏపీవైద్య సేవలు, మౌలిక సదుపా యాల అభివృద్ధి సంస్థకు కాన్సన్‌ట్రేటర్లను అవసర మైన ఆసుపత్రులకు పంపించాలని లేఖ రాసినట్లు నెల్లూరు జిల్లా అధికారులు పీఏజీకి తెలియచేశారు. అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థతో సంప్రదించకుండానే నేరుగా 2020లో జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి 51 లక్షల 80వేలు వెచ్చించి 10ఎక్స్‌రే యÖనిట్లు, ఈసీజీ మిషన్లను కొనుగోలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రికి 2021సెప్టెంబరులో ఆక్సిజన్ జనరేటర్ చేరుకున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి సందర్శనలో ఇంకా వాడుకలోకి రాలేదు. కొనుగోలు ఆర్డర్ రానందున జనరేటర్‌ను ఇంకా అమర్చలేదని ఆసుపత్రి అధికారులు పీఎజీకి సమాధానం ఇచ్చారు. పీఏజీ పరిశీలించిన ఆసుపత్రుల్లో 10 ఆక్సిజన్ ప్లాంట్లలో ఆరు పనిచేయడం లేదు. నెల్లూరు, శ్రీకా కుళం బోధనాసుపత్రులు,నాయుడుపేట,కావలి, కదిరి, సీతంపేట ఏరియా ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి కనిపించిందని పీఏజీ వెల్లడించింది.
ఆపదలో అంబులెన్స్‌లు
108 అంబులెన్స్‌లు కొన్నింటికి కాలం పరిమితి ముగియటంతో క్షతగాత్రులను గమ్యస్థానాలకు సరైన సమయంలో చేర్చలేకపోతున్నాయి. దీంతో బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా 146నూతన వాహనాలు కొనేం దుకు ప్రభుత్వం టెండరు ఖరారు చేసింది.104 అంబులెన్సులకు సంబంధించి 35 కోట్ల రూపాయలు సదరు సంస్థ పెండింగ్ ఉండటంతో వాహనాల రాక ఆలస్యం అవుతోంది.108 అంబులెన్సు వాహనాల్లో కొన్నింటి కాల పరిమితి ముగిసింది. దీంతో చాలా సందర్భాల్లో క్షతగాత్రులను, ఇతర బాధితులను సకా లంలో ఆసుపత్రులకు చేర్చడంలో జాప్యం జరుగు తోంది. పాతవి పని చేయక పోవడంతో పాటు కొత్త అంబులెన్సుల కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా 146 అంబులెన్సులను ‘ఫోర్స’ నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం టెండరు ఖరారు చేసినా…వాహనాలు యుద్ధప్రాతిపదికన సరఫరా అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదు. మరో నెల రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ సంస్థ ఇప్పటికే 260 కొత్త 104 అంబులెన్సుల (ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్)ను నాలుగు నెలల కిందట ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.35 కోట్ల కోసం ఆ సంస్థ ప్రతినిధులు వైద్యారోగ్య శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల చెల్లింపు పూర్తయితే తప్ప..108 అంబులెన్సులు త్వరిత గతిన అందుబాటులోనికి వచ్చే అవకాశాలు కనిపిం చడం లేదు.
దేశంలో గిరిజన జనాభా గిరిజనేతర సమÖహాలతో పోలిస్తే గణనీయమైన ఆరోగ్య సమస్యలను ఎదు ర్కొంటుంది, అంటువ్యాధులు, పోషకాహార లోపం మాతా శిశు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. గిరిజన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కమÖ్యనిటీ హెల్త్ వర్కర్ల ద్వారా ప్రాథమిక సంరక్షణను బలోపేతం చేయడం,సాంప్రదాయ వైద్యులను నిమగ్నం చేయడం, మౌలిక సదుపాయాలను విస్తరించడం అవసరం.
గిరిజన ఆరోగ్యంపై మరింత సమాచారం:
సవాళ్లు:..
పోషకాహార లోపం: గిరిజన జనాభాలో పోషకాహార లోపం గణనీయంగా ఉంది, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలలో.
అంటువ్యాధులు: గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు అధికంగా ఉన్నాయి.
ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత: గిరిజన ప్రాం తాల్లో ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు తక్కువగా ఉండటం, రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజన ప్రజలువైద్య సేవలను పొందలేకపో తున్నారు.
సాంప్రదాయ వైద్యం: గిరిజన ప్రజలు సాంప్రదాయ వైద్య పద్ధతులను ఎక్కువగా అనుసరిస్తారు, కానీ ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం చాలా అవసరం.
సామాజిక-ఆర్థిక కారకాలు: పేదరికం, నిరక్షరాస్యత, ఉపాధి అవకాశాల కొరత, సామాజిక వివక్షత వంటి సామాజిక-ఆర్థికకారకాలు గిరిజన ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
పరిష్కారాలు:
ప్రధాన ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలి: కమÖ్యనిటీ హెల్త్ వర్కర్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయాలి, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి.పోషకాహార లోపాన్ని నివారించాలి: గిరిజన ప్రజలకు పోషకాహారం అందించడం, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు ప్రత్యేకంగా పోషకాహార కార్యక్రమాలు నిర్వహించాలి. – జీ ఎన్ వి సతీష్