గిరిజనుల కాలికింద కాజేసే ప్రయత్నం?

గిరిజనులు తమ హక్కుల కోసం నినా దించిన మహత్తరమైన రోజుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. గిరిజన స్వయం నిర్ణయక హక్కు వివక్ష నుండి స్వేచ్ఛ భూమి ఇతర వనరులపై హక్కులు, గిరిజనుల సాంప్రదాయ,భాషాసంస్కృతి, విశిష్టత, విద్యా, వైద్యం, సమాచార, శ్రమ హక్కులు, అభివృద్ధి ఇతర ఆర్థిక సాంఘిక హక్కులతో పాటు గిరిజనులకు ఎదురవ్ఞతున్న ముప్పుల నుండి రక్షిం చాలనే అంశాలపై అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి ఈ తీర్మానంలో పేర్కొన్నది. వీటిని గుర్తించాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్ఞన్న హక్కులను కాలరా యడానికి పూనుకుంటున్నాయి. ప్రభుత్వ విధానాల మూలంగా గిరిజనులు అడవ్ఞల నుండి బలవం తగా గెంటివేయబడుతున్నారు. లక్షలాది ఎకరాల గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవ్ఞతున్నాయి.
అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాల్లో నిర్మి స్తున్న భారీ ప్రాజె క్టులు,పోలవరం వలన వేలాది గిరిజన గ్రామాలు లక్షలాది మంది గిరిజ నులు భూమితో పాటు సర్వ స్వం కోల్పతున్నారు. గిరిజనులకు విద్యా,వైద్యం,విద్యుత్‌,రోడ్లు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్ఞ తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గిరిజనుల జీవిత విధానంలో సారుప్యత కనిపిస్తుంది. ఏ ప్రాంతం లోను కలవిడిలేని ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయం గిరిజనులది. భూమి అటవి వనరులపైనే గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయం తమ చుట్టూ ఉన్న అడవి వనరులతోనే పెనవేసుకోని ఉంటాయి ప్రపం చంలోని 90శాతం వరకు గిరిజను లు అటవీ ప్రాంతాలలో వ్యవసాయం,వేట,అటవీ ఉత్పత్తు లపైనే ఆధారపడి జీవిసున్నారు. ప్రపంచంలోని గిరిజనుల సాధక,బాధకాలు తెలుసుకొనుటకు ఐక్యరాజ్య సమితి 1982లో ఒకకమిషన్‌ ఏర్పాటు చేసారు. గిరిజనులస్వయం,పరిపాలన హక్కు సంస్కృ తి,సాంప్రదాయాలు,భాష కాపాడే హక్కు, ఇతర ప్రజలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీన పరుచుకునే హక్కు, సంఘనిర్మాణం చేసుకొనే హక్కు, భూమిని, ప్రకృతి వనరులను స్వయంగా సర్మించు కునే హక్కును, భూమిపై గిరిజన తెగల యాజ మాన్యం పోకుండా చూసే చట్టాలను చేయవలసి నదిగా ప్రభుత్వాలను కోరేహక్కు,చట్టాల రూపకల్ప నలో గిరిజన తెగలకు కూడా తగు ప్రాతినిధ్యం కల్పించే హక్కు, ప్రభుత్వాల నుండి రాయతీలు పొందే హక్కు, ఐక్య రాజ్యసమితిలో గిరిజన తెగ లకు సభ్యత్వం కలిగివ్ఞండే హక్కు వివిధ దేశాలలో గిరిజన తెగలపై సాగుతున్న హింసాకాండను నిలిపి వేయటం వంటి హక్కులను రాజ్యాంగం కల్పిం చింది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల మనుగడే ప్రశ్నారక్ధంగా మారుతుంది. షెడ్యూల్డు ప్రాంతా లలో స్వయం పాలన లేకుండా అభివృద్ధి పేరుతో గిరిజనుల ను అడవ్ఞలనుండి తరిమివేసే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరి స్తున్నాయి. అటవీ ప్రాంతా లలో ఖనిజ నిక్షేపాలే గిరిజనుల పాలిట శాపాలౌ తున్నాయి. గిరిజనులను బలి పశువులను చేసి అటవి సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌ శక్తులు చట్టా లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అటవి,ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టేందుకు గిరిజన చట్టాలను తుంగ లో తొక్కుతున్నారు. ప్రభుత్వాలకు గిరిజనుల పట్ల చిత్తశుద్ది ఉంటేవారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. గిరిజనుల సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయ కుండా స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి.గిరిజనుల ఆర్ధిక,సామాజిక పునాదు లపైవారి అభివృద్ధిసాగాలి.గిరిజనుల ప్రాం తానికి సంబంధించిన ఏనిర్ణయాలు తీసుకున్న వారి ప్రత్యేక గిరిజన సలహామండళ్ల అంగీకారం తప్పని సరిగా ఉండాలి. గిరిజనుల చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలహీ నులు, నిస్సహాయలగా ముద్రపడిన వర్గం గిరి జనులు, గిరిజన జాతి తరతరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవ్ఞతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు.
ఒకప్రక్క అభివృద్ధి పథంలో నడిపిస్తాం అం టూనే గిరిజనుల కాలికింది నేలను కూడా లాగేసుకునే దురాఘాతాలు (టి.ఆర్‌.ఎస్‌) ప్రభుత్వం లోనే తీవ్రమౌతున్నాయి. సంస్కరణల పేరుతో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయం,భాష,ఆచార వ్యవహారలు అంతరించిపోతున్నాయి. ప్రపంచం లోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలోని అత్యంత వెనుకబాటుకు గురౌతున్న గిరిజనుల సమగ్రాభివృద్ధికి నేటికీ ఒక సమగ్ర జాతీయ విధానం లేకపోవడం దారుణం. మనదేశంలోని 9 రాష్ట్రాలు గిరిజన ప్రాంతల పరిపాలనలో గవర్నర్లకు, గిరిజన శాసనసభ్యులతో కూడిన గిరిజన సలహా మండళ్లకు విచక్షిణాధి కారాలున్నాయి. రాజ్యంగంలోని 5,6 షెడ్యూళ్ల ద్వారా దఖ లు పడ్డ సదరు అధికారాలను ఏ గవర్నర్‌ వినియోగించుటలేదు. గిరిజన ప్రాం తాల పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలను రాష్ట్రాలలో గిరిజన సలహామండళ్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుం డాలి. గవర్నర్‌లు గిరిజన సలహా మం డళ్లు గిరిజన ప్రాంతాల పరిపాలన తీరుతెన్నులు, సిఫారుసులతో కూడిన నివేదికలను ప్రతి ఏటా రాష్ట్రపతి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖకు అందజే యాలి. గిరిజన సలహా మండలిని మన రాష్ట్రంలో టి.ఆర్‌.ఎస్‌.ప్రభుత్వం నేటివరకు ఏర్పాటు చేయ లేదు.
గిరిజనులు అంటే ఎవరు?
వాడుక భాషలో గిరిజనులు అని పిలిచే వారినిరాజ్యాంగ పరంగా షెడ్యూలు తెగలు అని పిలుస్తారు. మనదేశానికిస్వాతం త్య్రం రాకముందు గిరిజనుల్ని వివిధ పదాలతో పిలిచేవారు వన వాసి,గిరిజన్‌, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయో గించే వారు. పురాణాలలోను, ఇతిహాసాలలోను గిరిజనులు,ముఖ్యంగా దండకారణ్యం వివరాలు ఉన్నాయి.గిరిజనుల నాగరికత చాలా పురాతన మైనది. వారికి రాజ్యాలుఉండేవి. కోటలు ఉండేవి. వారికి భాష ఉంది. సంఖ్యా పరిజ్ఞానం,మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. సాహి త్యం,సంగీతం,వాయి ద్య సహకారం అత్యున్నత స్థాయికి చేరుకుంది. స్వపరిపాలన వారి సంస్కృతికి మూలాలు చాలాగిరిజన సంస్కృతిలో కనిపి స్తాయి. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ సాధనకై ప్రజాపోరాటాలు తప్పనిసరైన పరిస్థితులు నెలకొ న్నాయి. గిరిజనులు అందరి పౌరులు లాగానే రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులకు అర్హులు. అదే కాకుండా రాష్ట్రపతిచే ప్రత్యే కంగా ‘షెడ్యూలు తెగలుగా గుర్తింపు వల్ల కొన్ని హక్కులు, రక్షణలు పొందుతారు. షెడ్యూలు ప్రాంతాలలో నివసించే గిరిజనులకు మరిన్ని రక్షణలు, సౌకర్యాలు కల్పిం చేందుకు రాజ్యాంగంలో నిర్ధేశికాలు ఉన్నాయి. ఒకపక్క రక్షణ కల్పిస్తూ,మరో పక్కన మిగిలిన ప్రజల/ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందేం దుకు అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం సూచి స్తోంది. అయితే ఆచరణలో చిత్తశుద్ధి లేకపోవటం వల్ల అంతరాలు పెరిగి పోయి,పురోగతికి బదులు తిరోగతిని చూస్తున్నాం.-తేజావత్‌ నందకుమార్‌ నాయక్‌

మైనింగ్‌ వ్యతిరేక ఉద్యమంలో‘సూపర్‌ సైకిల్‌’ సిద్ధం చేయండి!

దశాబ్దాలుగా గనుల తవ్వకందారులు కార్పొరేట్‌ వ్యతిరేక కార్యకర్తలకు లక్ష్యంగా ఉన్నారు. ఖనిజాల వెలికితీత కలిగించే పర్యావరణ, సామాజిక ప్రభావాలపై ఉద్యమిస్తున్న వారి దృష్టిని ఆకట్టుకొంటుండగా, ఆతిథ్య దేశాలకు పెద్ద ప్రయోజనాలను చేకూర్చే పరిశ్రమ వాదనలలో వాస్తవం ఏమైనప్పటికీ, సందే హాలకు దారితీస్తున్నాయి.

ఇప్పుడు,వస్తువుల ధరలు పెరగడం ద్వారా ఈ రంగం పునరుజ్జీవింప బడుతున్నం దున, మరింత బలమైన దాడికి సామాజిక శక్తులు సిద్ధపడితే పర్యావరణ,సామాజిక,పాలన ఆధారాల పరంగా పరిశ్రమను మెరుగైన స్థితికి మార్చవచ్చు. మొదటిది వాతావరణ అనుకూల పదార్థాల గురిం చిన పరిశ్రమ కథనానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ఎదురుదెబ్బ.ఇంధన ప్రాధాన్యతలు మారుతు న్నందున రాగి,కోబాల్ట్‌,లిథియం వంటి పరిశుభ్రమైన ఖనిజాలు డిమాండ్‌ పెరుగుతుంది. దాని తో చాలామంది ఖనిజ త్రవ్వకందారులు తమ హరిత ఆధారాలను చెప్పుకోవలసి వస్తున్నది. కానీ ఇది పరిశ్రమ దీర్ఘకాల విమర్శకులను వెనక్కి నెట్ట డానికి ప్రేరేపిస్తున్నది. ఉదాహరణకు,గత మార్చి లో,అటువంటి ఖనిజాలను వెలికి తీయడం ‘‘విస్తృతమైన విధ్వంస, మానవహక్కుల ఉల్లంఘనకు అపరిమిత అవకాశాలు కల్పించడం’’గావార్‌ ఆన్‌ వాంట్‌’ఒకవిశ్లేషణనుప్రచురించింది. ఏప్రిల్‌లో,ఎర్త్‌వర్క్స్‌’ మద్దతుతో జరిగిన ఒక అధ్యయనం అటువంటి పదార్థాలను వెలికితీసే అవసరాన్ని తగ్గించ డానికి రీసైక్లింగ్‌ కోసం పిలుపునిచ్చింది. ఇంధన పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్న వాతావరణ కార్యకర్తలు, ఇప్పుడు ఎక్కువ ఇంధనం వినియో గించే పరిశ్రమల వైపు, ముఖ్యంగా మైనింగ్‌ వైపు దృష్టి సారిస్తున్నారు.ఒక అంచనా ప్రకారం, ప్రపంచ గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలలో అవి 4నుండి 7 శాతం వరకు బాధ్యత వహిస్తున్నాయి. రెండవది, కార్యకర్తలు వివిధ పరిశ్రమల ఖనిజాల వినియో గంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. డిజిటల్‌, ఇతర పరికరాల్లో ఉపయోగించే లోహాలను త్రవ్వడంవల్ల పర్యావరణ ప్రభావాలు సాంకేతిక సమూహాలను లక్ష్యంగా చేసుకుని చర్చనీ యాంశం గా మారాయి. మరింత విస్తృతంగా, ప్రపంచం పెట్టుబడిదారీ ‘‘అతిగా వినియోగం’’ ట్రెడ్‌మిల్‌లోకి లాక్‌ చేయబడిరదనే ఆందోళనల మధ్య, మైనర్లు, ఎప్పటికీ అంతం కాని వనరుల వెలికితీతపై తమ దృష్టితో, మృగానికి ఆహారం ఇస్తున్నట్లు కనిపిస్తారు. మైనింగ్‌ రంగం ఎదుర్కొంటున్న మూడవ సవాలు విస్తృత సాంఘిక ఆందోళనలు. ఇక్కడ మహమ్మా రికి ఆజ్యం పోసిన సమాజ స్థితి గురించి ఆందోళన లు చాలా అరుదుగా జరుగుతాయి. ఇది అసమా నత అయినా,పర్యావరణాన్ని దెబ్బతీసినా, మైనారిటీ లేదా కార్మిక హక్కులను ఉల్లంఘించినా, శక్తివంత మైన కంపెనీలు తప్పు చేసినట్లు కనిపించినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పెద్ద మైనింగ్‌ గ్రూపులకు అయితే మరేమీ కాదు. వారికార్యకలాపాలు తరచు గా విస్తారంగా ఉంటాయి. మారు మూల, కోల్పో యిన, పర్యావరణ సున్నితమైన ప్రాంతాలలో ఉంటాయి. తరచుగా మైనారిటీ సమూహాల జనాభా కలిగి ఉంటాయి. గని విస్తరణకు మార్గం చూపడా నికి పశ్చిమ ఆస్ట్రేలియాలో 46,000 సంవత్సరాల పురాతన పవిత్ర అబోరిజినల్‌ ఆశ్రయాన్ని కంపెనీ ధ్వంసం చేసిన తరువాత రియో టింటో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గత సంవత్సరం చివర్లో తనఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. దానితో ఇప్పుడు ప్రపం చవ్యాప్తంగా మైనింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఉల్లంఘన జరిగితే, అంతర్లీనంగా సామజిక పరిస్థితులు సున్ని తంగా ఉంటూ ఉండడంతో తాము భారీ మూల్యం చెలింపవలసి వస్తుందని భావిస్తు న్నారు. అయితే ఈమైనింగ్‌ వ్యతిరేక క్రియాశీలత వెనుక ఉన్న ఆందోళనలకు మద్దతు ఇవ్వడానికి ఇదిఏదీ అవస రం లేదు. కొన్ని ఉద్యమాలు స్పష్టమైన ఆధారాల ఆధారంగా ఉండగా,మరికొన్ని. యధాలా పంగా, సైద్ధాంతికంగా ఉంటున్నాయి. సాంఘిక క్రియాశీ లత మునుపటి పరిస్థితులకంటే, ఈ ధోరణి ఖనిజ వ్యాపార నమూనాలను తిరిగి రూపకల్పన చేసే అవకాశం ఉంది. అయితే అవకాశాలతో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది. గతంలో, క్రియాశీ లత ప్రభావం చాలా పరిమితం ఉద్యమాలు సంస్థలకు కొన్ని ప్రతికూల పరిస్థితులను సృష్టించ వచ్చు,స్థానిక వ్యతిరేకతను రేకకెత్తింప వచ్చు. కానీ చాలా పరిమితంగా ఉంటూ ఉండెడిది. ఇప్పుడు, ఇటీవలి రెండు మార్పుల కారణంగా ఖనిజాల త్రవ్వకంవాణిజ్య ఫలితాలను ప్రభావితం చేయ డానికి ఉద్యమ కారులకు ఎక్కువ అవకాశం కలిగి స్తున్నది. పెద్ద పెట్టుబడిదారుల విస్తరించే కట్టు బాట్లు,కార్యకర్తల ప్రచారాలకు తరచుగా సున్ని తంగా ఉంటాయి, మంచి ఇ ఎస్‌ జి పనితీరు ఉన్న సంస్థలకు మాత్రమే మద్దతు ఇస్తాయిబీ టెక్నాలజీ,కార్‌ కంపెనీల వంటి లోహాల పారిశ్రా మిక కొనుగోలుదారులలో పెరుగుతున్న సున్నిత త్వం,వారి సరఫరాదారుల పరపతికి కలిగే నష్టం. ఇప్పటికే, కొంతమంది గనుల తవ్వకందారులు తమ వ్యాపార నమూనాలను సర్దుబాటు చేయడం ప్రారంభించారు. కొందరు, ఉదాహరణకు, తక్కువ ప్రత్యక్ష గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలు లేదా నీటి వాడకంతో ఆస్తులను కొనాలని కోరుతూ, తమా దస్త్రాలను పున రూపకల్పన చేసే మార్గాలను చూస్తున్నారు.ఇతరులు తమ ఖనిజాలను ‘‘బాధ్యతా యుతంగా తవ్వినవి’’ అని ధృవీకరించడానికి లేదా తాము ఉపయోగించే లోహాలను రీసైకిల్‌ చేయ డంలో సహాయపడటానికి ఉమ్మడి పథకాలను రూపొందించడానికి తమ వినియోగదారులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.
విమర్శలను తగ్గించే మార్గం కాకుండా కస్టమర్లు, పెట్టుబడిదారులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే మార్గంగా సాధారణ థ్రెడ్‌ ఇ ఎస్‌ జి పరిశ్రమ గురించి ఆలోచించడంలో ఇది ఒక పరిణామం, ఇంకా చాలా దూరం వెళ్ళాలి – కాని ఆ కార్యకర్తలు దుర్వినియోగానికి పాల్పడుతున్నంత కాలం నిర్మాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది.
(డేనియల్‌ లిట్విన్‌, సంస్థలకు స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం గురించి సలహా ఇచ్చే క్రిటికల్‌ రిసోర్స్‌ స్థాపకుడు, మేనేజింగ్‌ భాగస్వామి. ‘ఎంపైర్స్‌ ఆఫ్‌ ప్రాఎస్ఫిట్‌: కామర్స్‌,కాంక్వెస్ట్‌, కార్పొరేట్‌ బాధ్యత’ రచయిత)-డేనియల్‌ లిట్విన్‌

ఆ విషయంలో నిర్లక్ష్యం వద్దూ

కిశోర బాలికలో మొదటిసారి సంభవించే రుతుక్రమం సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. కొన్నిసార్లు తొందరగా ఎనిమిది సంవత్సరాలకు లేదా చాలా ఆలస్యంగా పందొమ్మిది సంవత్సరాల వరకు అవుతుంది. దేశంలో 70శాతం తల్లులు బహిష్టును మలినముగా భావిస్తున్నారు. బహిష్టు అంటే సిగ్గుపడే అంశమని, దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనే సంస్కతి ప్రజల్లో వుంది. మనదేశంలో 6కోట్ల 30 లక్షలమంది కిశోర బాలికలు మరుగు దొడ్డి సౌకర్యంలేని ఇళ్లల్లో నివసిస్తున్నారు.


ఋతుస్రావం అనేది నూతన శిశువులకు జన్మనిచ్చే అత్యంత కీలకమైన మానవ ప్రత్యుత్పత్తికి చెందిన అంశం, ప్రపంచ వ్యాపితంగా మే 28వ తారీఖుని బహిష్టు ఆరోగ్య,పరిశుభ్రతా దినోత్సవంగా జరుపు తున్నారు. 2021 సంవత్సరాన్ని బహిష్టు ఆరోగ్యం, పరిశుభ్రతపై కార్యాచరణ, నిధుల వెచ్చింపు అనే అంశంగా ప్రకటించారు, 2014 సంవత్సరంలో జర్మనీకి చెందిన ‘వాష్‌ యునైటెడ్‌’ సంస్థ ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా జరిపింది. ఈ కొవిడ్‌ సంక్షోభ కాలంలో బాలికలు,మహిళలు శానిటరీ నాప్కిన్లపై పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతున్నాయి.
బాలికలలో బహిష్టుపై మూఢనమ్మకాలు,అపోహలు ప్రజల్లో బహిష్టుపై మూఢనమ్మకాలు ప్రచారంలో ఉండడంతో నిశ్శబ్ద వాతావరణం ఆవహించి ఉంది. అందువల్ల బాలికలు బహిష్టు పరిశుభ్రతపై తెలుసుకోవడం గాని చర్చగాని జరగకుండా మూఢనమ్మకాలు అవరోధంగా ఉన్నాయి.మనదేశంలో అవగాహన లేక డబ్బయిశాతం తల్లులు బహిష్టును మలినంగా భావిస్తున్నారు. పాలు, పెరుగు, మాంసాహారము, పచ్చళ్ళు,పండ్లను బహిష్టు సమయంలో తినకూడదని ఇంకా నమ్ముతున్నారు. భారతదేశంలో నలభైకోట్ల మంది మహిళల్లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే నాప్కిన్లని వాడుతున్నారు. అందు లోనూ పట్టణ ప్రజలే ఎక్కువగా శానిటరీ నాప్కిన్లను ఉపయోగిస్తున్నారు, గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ ఇది చర్చించదగని విషయంగానే భావిస్తున్నారు. ఇంకా డబ్బయి ఒక్క శాతం బాలికలకు రజస్వల అయ్యేంతవరకూ తమ శరీరంలో జరిగే మార్పుల గురించి కానీ, నెలసరి గురించి కానీ అవగాహన లేదు.
కౌమార ప్రాయం అయోమయపు సందేహాల దశ. బాలకల శారీరక, మానసిక పెరుగుదలలో కీలకమైన మార్పులు ఈ దశలోనే ఏర్పడతాయి.పిల్లలు శారీరకంగా, మానసికంగా,భావోద్వేగపరంగా, సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్ధ్యాలను పెంపొందించుకొనే దశ కౌమారదశ. ఈ దశలో ఉన్నవారిని కౌమార బాలికలు అంటారు. మొదట ఋతుస్రావం యవ్వన ప్రారంభానికి సూచిక. ఈ మార్పుల్లో చాలాభాగం లైంగిక, పునరుత్పత్తి, ఆరోగ్యం,పోషణ మొదలైనవి. ఈ దశలో పాఠశాలలు, కళాశాలల్లో వారికి సరైన కౌస్సిలర్ల అవసరం పడుతుంది. బాలికలకు పాఠశాల స్థాయిలో ఈ అంశాలపట్ల సక్రమంగా అవగాహన కలిపించకపోవడం వలన పెద్దలు చెప్పిన మాటలే ఆచరిస్తూ బహిష్టు అపరిశుభ్రత వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
బహిష్టు కు సంబంధించిన సాధారణ ఆరోగ్యం లోపించి శారీరక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రక్తహీనత, యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. తరచుగా రక్తస్రావం వల్ల పునరుత్పత్తి నాళ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అసాధారణ రుతుక్రమం వల్ల చాల వరకు రక్తస్రావం ఉండడంతో దీర్ఘకాలంలో గర్భాశయ ముఖద్వారా కాన్సర్‌ వచ్చే అవకాశమూ ఉంది. చిన్న వయసులో బాలికలకు వివాహం, క్రమంలో లేని బహిష్టుతో గర్భం దాల్చడం వలన దుర్భలమైన సమస్యలు తలెత్తుతాయి. బాలికలలో భయము,ఆందోళన,సిగ్గు,బిడియం, ఆత్మన్యూనతకు గురై మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.
కౌమార ప్రాయంలోని వారు తరచుగా వివిధ సమస్యలు, అలజడులు, తిరుగుబాటు ధోరణులతో ఉంటారు. వాని బెంగ అంతా ‘అన్ని తప్పులను ఒప్పుగా చేయడం’ ‘న్యాయం కోసం పోరాటం’ సరైనదే చేయడం పైనే సమాజానికి ఉపయోగ పడే,సమాజ ఉత్పాదకతకు దోహదం చేసి, భాగస్వామ్య పౌరులుగా గుర్తింపు పడాలనే కోరిక వారిలో ఉంటుంది.
నివ్వెరపరిచే వాస్తవాలు, సవాళ్లు. బాలికలు, మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య వంతమైన భవిష్యత్తరాన్ని ఈ సమాజానికి అందించవచ్చని వైద్య నిపుణుల అభిప్రాయం. బాలికల,మహిళారోగ్యంలో ప్రధానంగా చెప్పుకోవలసినది బహిష్టు పరిశుభ్రత. ఇది కేవలం బాలికల,స్త్రీల సమస్యేకాదు, దేశసుస్థిర ఆదాయం,దేశ సర్వతో ముఖాభివృద్ధితో ముడిపడిన సమస్య. కనుక ఈ సమస్యను ఎటువంటి లింగ వివక్ష లేకుండా బాలికలందరికీ విద్య, ఆరోగ్యము,పోషకాహారము, స్వచ్ఛమైన త్రాగు నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత,మౌలిక సదుపాయాల కల్పన,నిరంతర అవగాహన కార్యక్రమాలతో అధిగమించవచ్చు. దీనిలో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు మే 28 న అంతర్జాతీయ బహిష్టు పరిశుభ్రత దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుతున్నారు. అయితే మన ముందున్న వాస్తవాలు,సవాళ్లు ఇలా వున్నాయి.
ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కల్గిన మన దేశంలో సుమారు 355 మిలియన్ల మహిళల్లో నెలసరి రుతుక్రమం జరుగుతున్నది. కిశోర బాలికలలో సుమారు 23% బాలికలు తను మొదటిసారి ఋతుస్రావం కాగానే బడికి వెళ్ళడం మానివేస్తున్నారు.
కిశోర బాలికలో మొదటిసారి సంభవించే రుతుక్రమం సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు మధ్య జరుగుతుంది. కొన్నిసార్లు తొందరగా ఎనిమిది సంవత్సరాలకు లేదా చాలా ఆలస్యంగా పందొమ్మిది సంవత్సరాల వరకు అవుతుంది. దేశంలో 70శాతం తల్లులు బహిష్టును మలినముగా భావిస్తున్నారు. బహిష్టు అంటే సిగ్గుపడే అంశమని, దాని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదనే సంస్కతి ప్రజల్లో వుంది. మనదేశంలో 6కోట్ల 30 లక్షలమంది కిశోర బాలికలు మరుగు దొడ్డి సౌకర్యంలేని ఇళ్లల్లో నివసిస్తున్నారు.
ఒక సంవత్సరంలో పాఠశాలలు పనిచేసే రోలలో 20శాతం దినాలు బాలికలు మొదటి కారణమైన ఇంటిపని,రెండవ కారణమైన బహిష్టు వలన పాఠశాలకు గైర్హాజరవు తున్నారు.బహిష్టు సమయంలో పరిశుభ్రతను సరిగ్గా పాటించక పోవడం వలన మహిళల్లో మరియు బాలికల్లో పునరుత్పత్తి నాళ ఇన్ఫెక్షన్స్‌ 70శాతం పెరిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార కాన్సర్లలో 27శాతం మన దేశంలో ఉండటం ఇంకో విషాదం.
సంస్థల, ప్రభుత్వాల పరిష్కారాలు
యాక్షన్‌ఎయిడ్‌ అనే స్వచ్ఛంద సంస్థ మురికివాడలలోని కౌమారబాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ అందజేస్తోంది.ఇంకా ఇతర అంతర్జాతీయ సంస్థలు సయితం ఈ అంశంపై పనిచేయవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలల్లో నాడు ` నేడు కార్యక్రమం చేపట్టి మౌలిక సదుపాయాల కల్పనను చేపట్టింది ఇందువల్ల బాలికలు బడిమానివేసే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్‌ను అందజేస్తున్నారు అయితే ఇవి అన్ని గ్రామీణ, గిరిజన పాఠశాలలకూ అందజేయాలి. ‘గర్ల్స్‌ ఫ్రెండ్లీ టాయ్‌లెట్‌’లను నిర్మించాలి, బాలికల కోసం శానిటరీ ప్యాడ్స్‌, సబ్బు, నీటివసతితో ఒక గది ప్రత్యేకంగా కేటాయించాలి. పనిచేసే ప్రదేశాలలో కాలేజీలలో కూడా ఈ సదుపాయాలు కల్పించాలి. పర్యావరణానికి హాని కల్గించని విధంగా తయారచేసిన శానిటరీ నాప్కిన్‌లను మాత్రమే వాడాలి. కౌమార బాలికల కోసం పాఠశాల, కళాశాలల్లో మహిళా కౌస్సిలర్లను నియమించాలి. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు చేయాలి.
-హరి వెంకట రమణ

జీవించే హక్కుకు ప్రాధాన్యత ఇవ్వండి

స్వాతంత్య్ర భారతదేశంలో ఏ ఇతర సమస్యల కన్నా కూడా భయంకరమైన హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితులు, పెద్ద సంఖ్యలో కోల్పోయిన ఉద్యోగాలు, ఒక్కసారిగా క్షీణించిన ప్రజల ఆదాయాలు, బాగా పెరిగిన ఆకలి దప్పులు, ఘోరమైన పౌష్టికాహార విధానం లాంటి అనేక సంక్షోభాలతో మెజారిటీగా ఉన్న కష్టజీవులు నేడు భయంతో వణికి పోతున్నారు.
వైఫల్యాలు
మే 13వ తేదీన సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు (పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌) వలస కార్మికులకు గుర్తింపు కార్డుల గురించి ఒత్తిడి చేయకుండా ఉచిత రేషన్‌ సమకూర్చాలని, రోజుకు రెండు పూటలా ఉచిత ఆహారాన్ని అందించడానికి వంటశాలలు నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది. గత సంవత్సరం మార్చిలో విధించిన జాతీయ లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఈ తీర్పుకు ప్రాధాన్యత ఏర్పడిరది. దేశంలో ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు గుర్తించింది. కానీ ఆ తీర్పు మూడు కారణాల వల్ల ఒక మార్గాన్ని చూపడంలో విఫలమైంది : అది(తీర్పు) ఆ సౌకర్యాన్ని దేశంలో మొత్తంగా విస్తరించలేదు. ప్రభుత్వం అందించే ఉచిత ఆహారం, రేషన్‌తో పాటుగా నగదు బదిలీ కూడా చేసేందుకు ఆ సౌకర్యాన్ని విస్తరించలేదు. ఆ సౌకర్యాన్ని ఒక హక్కుగా పొందడం కన్నా, ఔదార్యంతో ఇస్తే పొందే సహాయంగా మార్చింది. ఆ తీర్పుకు సార్వత్రికంగా జీవించే హక్కును ప్రాతిపదికగా తీసుకొనివుండి వుంటే, ఆ మూడు లోపాలను అధిగమించి ఉండెడిది. కేంద్ర ప్రభుత్వం తన వ్యాక్సిన్‌ పాలసీ ద్వారా జీవించే హక్కును నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నది. ప్రతీ వ్యక్తి తన జీవించే హక్కును రక్షించుకోవడానికి కోవిడ్‌-19ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ వేయించుకోవడం అవసరం. ప్రతీ ఒక్కరి జీవించే హక్కును ప్రభుత్వం గౌరవించాలి కాబట్టి, వ్యాక్సిన్‌ వేయించుకునే వారి ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వమే అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలి. అది కూడా వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తేనే సాధ్యమవుతుంది. ప్రయివేటు వైద్య విధానం బాగా అమలవుతున్న అమెరికా లాంటి అనేక దేశాల్లో కూడా ప్రజలందరికీ వ్యాక్సిన్‌లు ఉచితంగానే వేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం 18-45ఏండ్ల మధ్య వయసుల వారు ప్రయివేటు ఆసుపత్రులలో డబ్బు చెల్లించి వ్యాక్సిన్‌ వేయించుకునే ఏర్పాట్లు చేస్తుంది. ఇది కరోనా మహమ్మారిని నిరోధించాడానికి ప్రభుత్వం తీసుకుంటున్న దారుణమైన, ప్రతికూలమైన వ్యూహం.
ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం యొక్క తీవ్రమైన తప్పిదాల ఫలితమే. ప్రభుత్వం (ఎక్కువ మంది ఉత్పత్తిదారులకు తప్పని సరి లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా) తగినన్ని వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి హామీ ఇవ్వలేదు. సరిపడా వ్యాక్సిన్‌ల సరఫరా కావాలని అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్‌లను సమకూర్చాల్సిన బాధ్యతా ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వ్యాక్సిన్‌ ధరలలో తారతమ్యం ఉండే విధానాన్ని ప్రవేశపెట్టి, రాష్ట్రాలు ఒకదానితో ఒకటి, రాష్ట్రాలు ప్రయివేట్‌ క్లీనిక్‌లతో పోటీ పడి వ్యాక్సిన్‌లను కొనే విధంగా ఒత్తిడి చేసి, భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఎక్కువ ధరలు చెల్లించాలని ఒత్తిడి చేసే విధంగా అనుమతించింది. కరోనా రెండవ వేవ్‌లో ప్రభుత్వం ప్రజల జీవితాలు, వారి బాధల గురించి ఆలోచించడంలేదు. ఫలితంగా ప్రజలు తాము జీవనాధారాలను కోల్పోయి భారీగా నష్టపోతున్నారు. కనీసం 90శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పని చేస్తుండగా, వారికి ఏ విధమైన సామాజిక, చట్టపరమైన రక్షణ లేకుండా, గడచిన సంవత్సర కాలంలో విధించిన లాక్‌డౌన్‌లకు వారికి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా నిరాకరించారు. వారిపై అనేక ఆంక్షలు విధించి, ఆర్థిక బాధలకు గురిచేశారు. కానీ అసంఘటితరంగ కార్యకలాపాలపైన ఆధారపడి పని చేస్తున్న ఒక బిలియన్‌ ప్రజల గురించి ఎటువంటి బహిరంగ నిరసనలు వ్యక్తం కాలేదు. విధాన నిర్ణేతలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న వారు వీరిని పూర్తిగా వదిలి వేశారు. ఈ అలక్ష్యం యొక్క పరిణామాలు చాలా తీవ్రంగానూ, దీర్ఘకాలం పాటు కేవలం చెప్పలేని బాధలు అనుభవిస్తున్న ప్రజల పైన మాత్రమే కాక, దేశంపైన, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ నడిచే మార్గంపైన కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఇటీవల కాలంలో ఒక సమిష్టి సామాజిక సమూహాల నిర్వహణలో ‘హంగర్‌ వాచ్‌’ అని పిలువబడే ఒక అధ్యయనం, గత సంవత్సరం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన రెండు నెలల తరువాత కూడా మూడిరట రెండొంతుల కుటుంబాలు లాక్‌డౌన్‌ కంటే ముందు తీసుకున్న ఆహారం కంటే తక్కువే తీసుకున్నారనీ, ఆరోగ్యాన్ని రక్షించే ఆహారంలో కూడా తగ్గుదల ఉందని తేల్చింది. సర్వే చేయబడిన కుటుంబాలలో పావు వంతు కుటుంబాల ఆదాయాలు సగానికి పడిపో యాయి. గ్రామీణ భారతంతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఆకలి ఎక్కువగా ఉందని ఆ సర్వేలో తేలింది. అనాలోచితంగా విధించిన లాక్‌డౌన్‌ల వలన కలిగే పరిణామాలు ఆర్థిక పునరుద్ధరణ కోసం జరిగే ప్రయత్నాలను అడ్డుకుంటాయి.
ఆర్థిక ప్యాకేజీ
ఒక అర్ధశతాబ్ద కాలంలో దేశం పెద్ద మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే, కరోనా మహమ్మారి వలన కలిగిన ఆరోగ్య, ఆర్థిక ప్రభావాలను ఎదుర్కొనేందుకు, చెప్పు కోదగిన ఆర్థిక ప్యాకేజీ పొందని అతి కొన్ని దేశాల్లో భారతదేశం ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు జీడీపీలో కేవలం 2.1శాతం వడ్డీలేని ఖర్చును మాత్రమే పెంచింది. ఇది, మొదటి కరోనా వేవ్‌లో నలిగిపోయిన ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఎందుకు ఇంత దయనీయంగా ఉందో తెలియజేస్తుంది. ఇతర అనేక దేశాల్లో ప్రజలకు ఆదాయాలను సమకూర్చే దిశగా పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థ స్వస్థతకు సాధనంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో వెనుకబడిన పనుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంటున్నారు. దానికి బదులుగా ఆమె మిలియన్ల సంఖ్యలో ఉన్న పేద కార్మికులకు నగదును బదిలీ చేసే విధానంపై ఆధారపడి ఉంటే, అది ప్రజలను ఆకలి, నిరుద్యోగంలోకి నెట్టివేయకుండా రక్షించి, వద్ధి రేటును ప్రోత్సహించి ఉండేది. నగదు బదిలీ వలన ప్రజలు దేశీయంగా ఉత్పత్తి చేయబడే సాధారణ వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అందువలన ఈ నగదు బదిలీ ద్వారా ప్రజలపై చేసే ఖర్చు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లపై చేసే ఖర్చు (ఒకవేళ ఖర్చు చేసిఉంటే)కన్నా రెట్టింపు ప్రభావాలను చూపించి ఉండెడిది.
ఎక్కువ మొత్తంలో అవసరమైన సరుకులను, ఇప్పటికే పోగుపడిన ఆహార ధాన్యాల నుండే పంపిస్తారు కాబట్టి, సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఉచిత రేషన్‌, ఉచిత భోజనాల వలన కొంత మేలు జరుగుతున్నప్పటికీ, అవి ఆర్థిక వ్యవస్థపై కొద్దిపాటి విస్తరణా ప్రభావాన్నే చూపుతాయి. అందువల్ల ఉచిత రేషన్‌, ఉచిత భోజనాలను అందించడంతో పాటుగా ప్రజలకు సహాయార్ధంగా నెలకు రూ.7000 నగదును బదిలీ చేసి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా జీవించే హక్కుకు ప్రాధాన్యతనిచ్చే చర్యలను చేపట్టాలి. ఆ చర్యలు మాత్రమే నేడు ఆర్థిక స్వస్థతను చేకూర్చే సరైన మార్గాలు. వాటిలో ప్రధానంగా, ఉత్పత్తిని విస్తరించడానికి అనుమతించడం, కేంద్ర ప్రభుత్వమే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ లను సేకరించి అందరికీ ఉచితంగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు రాష్ట్రాలకు వాటిని పంపిణీ చేయడం, అవసరం ఉన్న ప్రతీ ఒక్కరికీ నెలకు 5కిలోల ఆహార ధాన్యాలను ఆరు నెలల పాటు అందించడం, ప్రతీ కుటుంబానికి, ఏ ఉద్యోగం లేని వారికి నెలకు కనీసం రూ.7000 చొప్పున మూడు నెలల పాటు నగదు బదిలీ చేయడం, ‘ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్మెంట్‌ సర్వీసెస్‌’ తన కార్యక్రమాలను పునరుద్ధరించి, విసృతపరచడానికి తగిన వనరులను పెంచడం.
‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ డిమాండ్‌కు తగిన విధంగా పని రోజులలో, కుటుంబంలో లబ్దిదారుల సంఖ్యలో ఎటువంటి పరిమితులు విధించకుండా అమలుచేయడం,అదే పథకాన్ని దేశంలోని పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులైన నిరుద్యోగులకు కూడా వర్తింపజేయడం చేయాలి. వీటికి వనరులు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నిస్తారు. పెద్ద ఎత్తున నిరుద్యోగం, ఉపయోగించబడని సామర్థ్యం, ఉపయోగించని ఆహార ధాన్యాల నిల్వల (ప్రస్తుతం సుమారు 80 మిలియన్‌ టన్నులు)తో ఉన్న ఒక ఆర్థిక వ్యవస్థలో వనరుల సమీకరణ కోసం ఏ ఒక్కరి వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం లేదు. ద్రవ్యలోటును పెంచడం వలన, అనవసరమైన సంపద అసమానతలు పెంచడం, ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ ద్రవ్య పెట్టుబడిని భయపెట్టడం తప్ప, వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. ఈ రెండిరటినీ అడ్డుకోవాలంటే, సంపద పన్నును(పెద్ద మొత్తంలో లాభాల పన్ను కూడా తగినంత ఉన్నప్పటికీ కూడా) ప్రవేశ పెట్టే మార్గాలను అనుసరించాలి. ఒక్క శాతం కుటుంబాలపై విధించే 1.5శాతం సంపద పన్నుతో, వనరులకు అవసర మైన డబ్బు సరిపోతుంది.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, అమెరికా కోశాగార కార్యదర్శి జాన్నెట్‌ ఎలెన్‌లు మరింత నూతనత్వంతో కూడిన చర్యల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన రాజ్యాంగంలోని ‘జీవించే హక్కు’, ‘సమానత్వం’, ‘సౌభ్రాతత్వం’ అనే మాటలకు ప్రాముఖ్యతను, అర్థాన్నిచ్చే చర్యలను భారతదేశం చేపట్టకుండా తప్పించుకోకూడదు.
‘ద హిందూ’ సౌజన్యంతో..అనువాదం:
-బోడపట్ల రవీందర్‌

పసి దివ్వెలు వసివాడనొద్దు

బలపం పట్టాల్సిన చేతులు బండెడు చాకిరీ చేస్తున్నాయి.పేదరికంతో చదువులు చతికిల పడుతున్నాయి. కుటుంబ పోషణలో సమిధులవు తున్నారు. చదువులు, ఆటలతో గడపాల్సిన బాల్యం బజారున పడుతోంది. పేపర్బాయ్స్గా, హోటళ్లలో సర్వర్లుగా,సర్వెంట్లుగా, చెత్త ఏరుకునే వారిగా పసి హృదయాలు హృద్యమైపోతున్నాయి. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో బాలకార్మిక చట్టం అలంకారప్రాయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు,యువత, రాజకీయ నాయకులు అంతా సహకరిస్తే ఎంతో మంది బాలకార్మికులకు ఉజ్వల భవిష్యత్తు అందించవచ్చనడంలో సందే హంలేదు. జూన్‌ 12న ప్రంపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పేదరికమే ప్రధాన కారణం
బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ,అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే.. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. వారు చదువుకోవాల్సిన వయుసులో పనిచేస్తున్నారు. వ్యవసాయంలోనూ,ఇతరత్రా పనుల్లో తల్లిదండ్రు లకు సాయంగా వెళ్ళేవారు కొందరయితే, కర్మాగా రాల్లో, దుకాణాల్లో, ఇతరత్రా పనుల్లోకి వెళ్ళి తల్లి దండ్రులకుఆర్థికసాయాన్ని అందించేవారు మరికొందరు. తల్లిదండ్రుల అవగాహనా రాహి త్యంతో చట్టాలు అమలు కావడం లేదనే వాదన కూడా మరో వైపు వినిపిస్తోంది.ముఖ్యంగా విజయ నగరం,విశాఖపట్నం,శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు,మంగళగిరి తదితర పట్టణాల్లో మురికి వాడల్లోని తల్లిదండ్రులు పిల్లల తాత్కాలిక సంపా దన ఆశిస్తున్నారు. అలాంటి వారు తాత్కాలిక ప్రయోజనం ఆశించకూడదు. చదువు కోవాలని పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు ప్రోత్సహిం చిన నాడే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనవుతుంది.
తూతూ మంత్రం చర్యలు..
ఏటా ఏదో సందర్భోచితంగా బాలకా ర్మికులను పట్టుకొని బడిలో పడేసి చేతులు దులి పేసుకుంటున్న చర్యలు పెద్దగా ప్రయోజనం ఇవ్వ డం లేదు. ఏటా పాఠశాలలు తెరచే సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.కొన్నేళ్లుగా ఈతంతు నడుస్తున్నా ఫలితం పెద్దగా కానరా వడంలేదు. లెక్కలు చూపడంతో సరిపుచ్చడంవల్ల బాలకార్మికులు ఎక్కడకక్కడే దర్శనమిస్తున్నారు. బడిలో పేరున్నా బయటే పిల్లలు ఉంటున్నారు. ఈపరిస్థితిలో మార్పు తీసుకు వచ్చేందుకు యం త్రాంగం అంతా బాధ్యత వహించాలి. బాల కార్మి కుల లెక్కలు కూడా లోపభూయిష్టంగాఉంటు న్నాయి. ఏపట్టణంలో తీసుకున్నా వందలాది మంది కన్పిస్తున్నారు. పల్లెలో అయితే పది మంది వరకు దర్శణ మిస్తున్నారు. అధికారుల లెక్కలు మాత్రం వందలోపే కన్పిస్తున్నాయి.
బోలెడు అవకాశాలు..
పల్లెల కంటే పట్టణాల్లోని మురికి వాడ ల్లో బాలకార్మికులు ఎక్కువ కన్పిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాభ్యాసానికి అవకాశాలు కూడా ఎక్కువే. కేజీబీవీలు, వసతిగృహాలు, ఇతర సౌక ర్యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సద్విని యోగం చేసుకొనేలా యంత్రాంగం మురికివాడల్లోని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పైసా ఖర్చులేకుండా ఒకటి నుంచి డిగ్రీవరకు చదువు కోవచ్చన్న నమ్మకం కల్పించాలి. ఉపకార వేతనాలు, ఉచిత పుస్తకాలు, ఇతర సౌకర్యాలపై అవగాహన పర్చాలి.తల్లిదండ్రులకు ఉపాధి మార్గాలు వివరిం చాలి. రుణాలు మంజూరు చేయించి చిల్లర వ్యాపా రాలు చేసుకొనేలా చూడాలి.అంచనాగా ఒక్క విజయనగరం జిల్లాలో15ఏళ్ల మధ్య పిల్లలు: 6.20లక్షలు బాలకార్మికుల 7,400 మంది. కేజీబీవీలు 33.అన్ని విభాగాల వసతిగృహాలు: 155.
అవగాహన కార్యక్రమాలు
జిల్లాలోబాలకార్మిక వ్యతిరేక దినోత్స వం ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సన్నద్దమవుతున్నారు. కార్మికశాఖతో పాటు బాల కార్మిక నిర్మూలనా సంస్థ, స్వచ్ఛంద సంస్థలు బాల కార్మికులను బడికి పంపించాలని అవగాహన పరచ నున్నట్లు ఆశాఖ ప్రతినిధులు తెలిపారు.ప్రకృతి విప త్తులు,యుద్ధాలు ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తా యి. మరణాలు,అంగవ్కెకల్యాలతో పాటు. నిలువ నీడను,జీవనోపాధిని దెబ్బతీస్తాయి. బాధితుల బతు కులను ఛిన్నాభిన్నం చేస్తాయి. ఏటా20 కోట్ల మంది ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాయి. ఇందులో మూడో వంతు బాలలే ఉంటున్నారు. వీరికి తోడు పేదరికంలో మరెందరో మగ్గుతు న్నారు. వీరంతా పొట్ట కూటికోసం బాలకార్మికులుగా మారుతు న్నాయి. పద్నాలుగేళ్లలోపు పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని చట్టాలు చెబుతున్నా…అవి సక్రమంగా అమలు కాని పరిస్థితులు వెక్కిరి స్తున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాన్న ఆశయంతో ఏటా జూన్‌ 12న అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినంగా ఐక్యరాజ్య సమితి,అంతర్జాతీయ కార్మిక సంస్థలు పాటిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులు బాల లను దైన్యంలోకి నెడుతున్నాయన్నదే ఈ ఏడాది నినాదం.
బాలకార్మికులెంతమంది?
1998జాతీయ గణంకాల ప్రకారం 5నుంచి14సంవత్సరాలున్నవారు 253 మిలియ న్లుంటే,వారిలో12.6మిలియన్ల మంది చిన్నారులలు బాలకార్మికులే.2009-10 గణాంకాలు పరిశీలిస్తే కొంత మార్పు ఉంది.4.98 మిలియన్లకు ఈ సంఖ్య తగ్గింది. 5నుంచి 14 సంవత్సరాల లోపు మొత్తం పిల్లలజనాభా 259.64 మిలియన్లు. వీరి సంఖ్య తాజా గణాంకాల ప్రకారం చూస్తే మరింత తగ్గిందనే చెప్పాలి.
చట్టాలెన్నో..
భారతదేశంలోనే కాదు ప్రపంచ మొత్తం మీద బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో చట్టాలున్నాయి. అయినా ఆసియా దేశాలలో ఇప్పటికీ బాలకార్మికుల సంఖ్య ఎక్కువే. భారత రాజ్యాంగంలోని24వ ఆర్టికల్తో పాటు, ద ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1948,ద ఛైల్డ్‌ లేబర్‌ యాక్ట్‌ 1986, ద జువ్కెనల్‌ జస్టిస్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2000, ద రైట్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఆటు ఫ్రీ అండ్‌ కంపల్సరీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2009 వంటి చట్టాలెన్నో ఉన్నాయి.
నిర్బంధ విద్య చట్టం కూడా నీరుగారుతోంది.
పైన పేర్కొన్న చట్టాలన్నీ అమలు కాక పోవడం,విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలో బాలకార్మిక సంఖ్య అధికంగా ఉండటం మనం చూస్తున్నాం.2009లో వచ్చిన నిర్బంద విద్య చట్టం పరిశీలించినా కూడా ఇదేపరిస్థితి. ఈచట్టం ప్రకా రం ప్రాథమిక విద్యను తప్పనిసరి చేశారు. అంతేనా కార్పొరేట్‌ పాఠశాలల హవా కొనసాగుతున్న నేప థ్యంలో ప్రతీ ప్రైవేటు పాఠశాలలో25శాతం సీట్ల ను పేద విద్యార్థులకు అందివ్వాలని సూచిం చారు. అయినా ఈనిబంధనలను ఎక్కడా అమలు చేయడం లేదు.
ఇలా నిర్మూలించవచ్చు…
ె బాలకార్మిక వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
ె ఎదుటి వారికీ అవగాహన కల్పించాలి.
ె సమాజంలో మార్పు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ఎంతోకొంత కృషిచేయాలి.
ె సంస్థలు వారి కార్యకలాపాల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక భాగంగా చేయాలి.
ె సమస్య తీవ్రతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి.
ె ముందుగా మన ఇళ్లల్లో పిల్లలు పనిచేయకుండా చూడాలి.
ె ఉపాధి చూపించే వారికి పిల్లలకు పనులు ఇవ్వొద్దని తెలియజేయాలి.
ె మన చుట్టూ ఉండే చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా చూడాలి.
ె పిల్లలను పనికి పంపేవారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపాలి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
విజయనగరం జిల్లాలో బాలకార్మికుల సంఖ్య గతంతో పోల్చితే తగ్గిందని చెప్పాలి. వెనుక బడిన జిల్లా కావడంతో ఇక్కడకు ఇతర జిల్లాల నుంచికానీ, ఒడిశా నుంచి కానీ వలసలు వచ్చేవారు లేరు. ఈ సంఖ్య అటు శ్రీకాకుళంలోనూ,ఇటు విశాఖలోనూ కనిపిస్తుంది. ఇటుకబట్టీల్లో గతంలో కొంతమంది చిన్నారులు పనిచేస్తుండేవారు. ఇప్పుడా ఆ పరిస్థితి మారిందనే చెప్పాలి. అయినా ఉన్న కార్మికుల సంఖ్య మరింత తగ్గించే ప్రయత్నాలు జరగలేదు. గత ఏడాది మొత్తం కేవలం 9 కేసులు మాత్రమే నమోదు చేశారు. ఒక్కటంటే ఒక్క అవగాహన సదస్సును కూడా కార్మిక శాఖ నిర్వహించలేదు. ఈ బాధ్యత అడపాదడపా ఒకటి రెండు స్వచ్ఛందసేవా సంస్థలు చేపడుతున్నాయి.
1098కి ఫోన్చేస్తే..
ఎవరైనా బాలకార్మికులను చూసినా.. లేదా ఒక చోట పనిచేస్తున్నట్టు సమాచారం ఉన్నా 1098కి ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇది చ్కెల్డ్లైన్‌ టోల్ఫ్రీ నెంబరు. వెంటనే సంబంధిత చ్కెల్లైన్‌ సిబ్బం ది వచ్చి ఆపిల్లాడిని జిల్లాచ్కెల్డ్వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరుపరుస్తారు. వారు కౌన్సెలింగ్‌ ఇచ్చి జిల్లా లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చిల్డ్రన్‌ హోమ్‌ తరలిస్తారు.అక్కడ ఆచిన్నారి నుంచి తగిన వివరాలు సేకరిస్తారు. తల్లిదండ్రులు ఉంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లాడిని పాఠశాలకు పంపేలా తగిన చర్యలు తీసుకుంటారు. ఒక వేళ వారికి ఎవరూ లేరనుకుంటే వారిని సరిపడే వసతిగృహానికి పంపి విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకుంటారు.
ఎన్సీఎల్పీని నీరుగార్చారు..
నేషనల్‌ చ్కెల్డ్లైన్‌ ప్రాజెక్టు మూడేళ్ల కిందట వరకూ బాగానే నడిచింది. దీని కింద స్వచ్చంద సేవాసంస్థలు బాలకార్మిక పాఠశాలలు నడిపేవారు. ఇప్పుడు ప్రభుత్వం వాటిని నడపడం లేదు. దేశంమొత్తం మీద 800కుపైగా జిల్లా లుంటే 273జిల్లాల్లో ఇప్పటికీ ఎన్‌ఎసీఎల్పీఉన్నట్టు రికార్డులు చూపుతున్నారు. అందులో విజయ నగరం,విశాఖ,శ్రీకాకుళం ఉండటం విశేషం. అయితే ఇక్కడ ఎటువంటి పనులు జరగడం లేదు. పేరుకే ప్రాజెక్టు ఉంది. దీనికి కారణం నిర్భంద విద్య చట్టం. ఈచట్టం వచ్చిన తరువాత ఇంకా బాలకార్మిక పాఠశాలలతో పనేముందని వాటిని ప్రభుత్వం మూసేంది.ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అసలు నిర్భంధ విద్య క్షేత్రస్థాయిలో అమలువుతున్నదీ లేనిదీ మాత్రం చూడటం లేదు.
ఒక్క కార్యక్రమమూ లేదు..
363 రోజులు గుర్తురాకున్నా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని అధికారులు పూర్తిగా మర్చిపోయింది. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఏదో ఓ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించడం రివాజు. కానీఈసారి తదను గుణంగా ఎలాంటి కార్యక్రమూ చేపట్టడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్‌ కానీ ఎటువంటి ఆదేశాలు జారీచేయలేదు.
చాలా వరకూ నిర్మూలించాం…
గతంలో చేసిన కార్యక్రమాలతో చాలా వరకూ బాలకార్మిక వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. కొద్దిమంది ఎక్కడ్కెనా ఉన్నా వారికి పునరావాసం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. చ్కెల్డ్లైన్‌ ద్వారా వారికి తగిన పునరావాసం కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రణాళికలు కొత్తగా రూపొందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయమై మరింత వృద్ధి సాధించేందుకు ఇటీవలే జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనలు కోరారు. వీటిని కూడా అమలు చేసి త్వరలోనే బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం.

  • డీవీఎస్‌ ప్రసాద్‌, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు డ్కెరెక్టర్‌
    ప్రతి ఏడాది జూన్‌ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్స వంను ప్రారంభించింది.
    లక్ష్యాలు
    అన్ని వయస్సుల బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకార్మికులను గర్తించి, వారికి అన్ని వసతులను కల్పించి సంపూర్ణ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం. బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే. తల్లిదండ్రుల పేదరికం పిల్లలకు శాపంగా మారుతోంది. వారు చదువుకోవాల్సిన వయుసులో పనిచేస్తున్నారు.- సైమన్‌ గునపర్తి

ఆహరం అందితేనే ఆరోగ్యం

‘‘ తిండి కలిగితే కండ కలదోయ్‌ అని మహా కవి గురుజాడ అప్పారావు చాలా తేలికగా చెప్పేశారు గానీ.. ఈకాలంలో తిండి ఒక్కదానితోనే కండలు వచ్చేయవు. ఆ కండ లతో కలిసి ఆరోగ్యమూ సమకూ రాలంటే.. ఏం తింటున్నాం? ఎలాతింటున్నాం? ఎప్పుడు.. ఎక్కడ తింటున్నామన్నదీ ముఖ్యం. అవగాహన లోపం కొంత.. కాలుష్యం మరి కొంత కలిసి.. ఆహారం కార ణంగా కొన్ని అనారోగ్య సమస్యలను తెలి యకుండానే చవిచూస్తున్నాం. నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా కొన్ని సంగతులు..’’

ఆహారం..మనిషి మనుగడకు ప్రధా నం..ఆరోగ్యానికి ఎంతో అవసరం.. రుచులు.. రకాలను పక్కనబెడితే..శరీరానికి మంచి పోష కాలనిచ్చే పదార్థాలు ఎంతో ముఖ్యం..ఆహార లేమితో అనేక జబ్బులు తప్పవు. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) వ్యవస్థాపక దినమైన 1945 అక్టోబరు 16వ తేదీని ప్రతియేటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయిం చింది. ప్రపంచ ఆహార దినోత్సవం సంద ర్భంగా ప్రత్యేక కథనం..
బియ్యంతోనే సరిపెట్టుకోగలమా..
రాష్ట్ర ప్రభుత్వం 2015జనవరి జనవరి ఒకటో తేదీ నుంచి ఆహార భద్రత చట్టాన్ని మార్పు లు చేసి అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇప్పటి వరకు ఉన్న 4 కిలోల బియ్యానికి బదులు 6 కిలోలు ఇస్తోంది. అయితే కేవలం బియ్యంతో ఆహార భద్రతను ఊహించుకోవడం కష్టమే. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే అది సామాన్యులు భరించడం కష్టంగా మారు తోంది. రేషన్‌ దుకాణాల్లో గతంలో ఇచ్చిన తొమ్మి ది సరుకులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. జగిత్యాల జిల్లా జనాభా 9,88,913ఉంది. ఇందులో ఆహార భద్రత కార్డులు 44,187,అంత్యోదయ కార్డులు 2497మాతమ్రే ఉన్నాయి. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని1981లో మొదటిసారిగా జరుపుకు న్నారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక్కో సందేశాన్ని ఇది ముందుకు తెస్తుంది. తొలిఆహార దినోత్సవం నాడు ఆహారానికి తొలి ప్రాధాన్యత అన్నది ప్రధాన లక్ష్యంగా నిర్దేశిం చారు. మరోసారి ఆహార భద్రత అన్న దానిని ప్రధాన అంశంగా తీసుకున్నారు. మరోసారి ఆకలిపై సమిష్టి పోరు జరపాలని ఎఫ్‌ఏఓ పిలుపు నిచ్చింది. ఆకలిని భూమ్మీద నుంచి సాధ్యమైనంత త్వరగా తుడిచి పెట్టాలని సూచించారు. ప్రస్త్తుతం ప్రపం చాన్ని కలవరపెడుతున్న ప్రధాన సమస్య ఆహార భద్రత. ఆరోగ్యకరమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు లభించడం, వాటిని కొనుగోలు చేయగల ఆర్థికశక్తి ప్రజలకు ఉండడమే ఆహారభద్రత.‘ఆరోగ్యకరంగా జీవిం చేందుకు అవసరమైన ఆహారాన్ని అన్ని వేళలా, అన్ని వర్గాల ప్రజలకు లభింపచేయటమే ఆహార భద్రత కు అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ఇచ్చిన నిర్వచనం. ఇందుకు అవసరమైన భతి, కొనుగోలు శక్తిప్రతి కుటుంబానికి లభిం చాలి. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌’ 1945 అక్టో బర్‌ 16న కెనడాలో నెలకొల్పారు. దాని శాశ్వత ప్రధాన కార్యాలయం రోమ్‌లో ఉంది.
వ్యవసాయరంగంపై తగ్గుతున్నప్రభుత్వ పెట్టుబడులు
70 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పులు, వ్యవ సాయ రంగంపై చూపుతున్న ప్రతికూల ప్రభావాలు ఆహార భద్రతను మరింత సంక్షోభంలోకి నెడుతు న్నాయి. ఆకలి,పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతా ల్లో వ్యవసాయ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహిం చేందుకు ఈ రంగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరముంది.
మూడు పూటలు తినలేని వారెందరో..
ఆహారం లేనిదే జీవంలేదు.కానీ తగి నంత ఆహారం లేకుండా ఎంతోమంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసర మైన ఆహారాన్ని సంపాదించుకునే వీలుకూడా లేని ప్రదేశాలు ఇంకా ఉండడం మన అభివద్ధికి అవ మానం. ప్రకతితో సహజీవనం చేస్తున్నప్పుడు సమ స్యలు తరచూ అనూహ్యంగా వస్తుంటాయి. అటు వంటి సందర్భాల్లో కూడా ఆహారం లభించడం ముఖ్యం. ఆదిశలో ‘పాలకుల’ధ్యాస ఉండాలి. ప్రణాళికలు తయారవ్వాలి. ప్రయత్నాలు ము మ్మరం చేయాలి. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నట్టనిపిస్తున్నా ఎక్కడో ఏదోలోపం ఉందనిపి స్తుంది. కారణం కరువుకావచ్చు. వరదలు కావచ్చు. ఆర్థికంగా వెనుకబాటుతనమూ కావచ్చు.
రోజురోజుకు పెరుగుతున్న జనాభా
రాబోయే కాలంలో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరిగిపోయే ప్రమాదముంది. మారుతున్న వాతావరణ,సామాజిక, ఆర్థిక సమతుల్యతల వల్ల అనూహ్యరీతిలో ఆహార సమస్య ఎదురయ్యే ప్రమాద ముందని నిపుణులు అంటున్నారు. ఆదిశలో సంప్ర దాయేతర ఆహారాన్ని అలవాటు చేసుకోవలసిన అవసరం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. సముద్రాల్లోని ఆల్గే నుంచి పౌష్టికాహారం తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘స్పిర్సులీనా’ అనేది రూపొందింది. కానీ ప్రజలం దరూ తినగలిగినం త మోతాదులోనూ, ఇష్టపడే రుచిలోనూ ఇంకా రావలసిఉంది. మాంస కత్తుల నిధిగా ప్రచారం చేసిన సోయా చిక్కుళ్లు అనుకు న్నంత ప్రాచుర్యం పొందలేదు. ఉన్న వరి పొలాలు నీరు లేక కొంతా,నీరు ఎక్కువై కొంతా నష్టపోతు న్నాయి. లాభాలు కనిపించక రైతులు వ్యవసాయం మానుతున్నారు. ఇటు జనాభా ఏమాత్రమూ తగ్గే దిశలో లేదు. ఆహార సమస్య (డబ్బున్న వాళ్లకి లేకపోతే పోవుగాక) మాత్రం తీవ్రమయ్యే ప్రమా దం కనిపిస్తోంది. ఆహారంలో అంతగా ఉపయోగ పడని టమాటాలూ,ఉల్లిపాయలూ ధరలు పెరిగితే వాటిని మానేయలేనంతగా అలవాటుపడ్డ మనం నిజంగా ఆహార సమస్య వస్తే తట్టుకోగలమా?
పథకాల అమలు అంతంతే..
అందరికి పోషకాహారాన్ని అందించ డానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడు తున్నా..ఆతర్వాత వాటిఅమలుపై శ్రద్ధ పెట్టకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.ఆహార భద్రతచట్టం ప్రకారం కేవలం బియ్యం, ఇతర కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే ఇవ్వడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. పాఠ శాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నా.. నాణ్యత లోపిస్తూ సరైన పోషకాలు వారికి అందడం లేదు. అంగన్‌ వాడీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా సరఫరా చేయకపో వడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చిన్నారు లు,బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అంద డం లేదు.
ఆహారం అందకపోవడానికి అనేక కారణాలు
మూడు పూటలా తిండి.. పోషకాలున్న ఆహారం అందకపోవడానికి ముఖ్యమైన కారణం పేదరికం.. పేదరికానికి కూడా అనేక కారణాలు న్నాయి.. వ్యవసాయం అధ్వాన్నంగా ఉండడం, చిన్న కమతాలు అధికంగా ఉండడం, వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడటం,మార్కెట్‌ సౌక ర్యాలు సన్నగిల్లడం, ఆహార ధాన్యాలు అంతర్జా తీయంగా జీవ ఇంధన తయారీకి మరలటం, ప్రకతి వైపరీత్యాలు, ఉత్పత్తి తరుగుదల, ఆహార ధాన్యాల నిల్వలు తగ్గడం,డిమాండ్‌ పెరగటం,ముడి చమురు పెరిగి దాని ప్రభావంతో అన్ని వస్తువుల ధరలు పెరగటం,ప్రజాపంపిణీ వ్యవస్థలో లోపాలు, వ్యవ సాయంలో పెట్టుబడులు పెట్టకపోవటం, సెజ్‌లకు వ్యవసాయ భూములు మళ్లించడం,గహ నిర్మాణం, రహదారుల వెడల్పు, పరిశ్రమలకు పంట భూము లు మళ్లించడం వంటి అనేక కారణాలవల్ల ఉత్పాదకతతగ్గి ప్రజలకు ఆహార సమస్య ఉత్పన్నమ వుతున్నది.
దృష్టి పెడితేనే పరిష్కారం..
ఆహార భద్రతకు వ్యవసాయ పెట్టు బడులు భారీగా పెంచడం ఒక్కటే పరిష్కారమని పరిశీలకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దష్టిపెట్టి అధికంగా నిధులు కేటాయించని పక్షంలో ఆహారంకోసం అలమటించేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుందని నిపుణులు సూచి స్తున్నారు. వ్యవసాయ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయేతర కార్యకలాపాలకు ఉపయోగించ కూడదు. వ్యవసాయ రంగానికి అదనపు పెట్టుబడు లతోపాటు పరిశోధక, మౌలిక సదుపాయాల కల్పన నీటిపారుదల,నిర్వహణ,మార్కెటింగ్‌ సదుపా యాలు, ఆహార ధాన్యాల నిల్వలకు సరిపడ గిడ్డం గులు, కూరగాయలు, పండ్ల నిల్వలకు శీతల గిడ్డం గులను ఏర్పాటుచేయాలి. వ్యవసాయదారులకు, వినియోగదారులకు లబ్ధి కలిగించడానికి మధ్య వర్తుల ప్రమేయం తొలగించాలి. భూగర్భ నీటి నిల్వను పెంచడానికి వర్షపు నీటిని నిల్వచేయడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణను ప్రోత్స హించాలి. వ్యవసాయ గిట్టుబాటుధర లభించేలా చర్యలు తీసుకోవాలి. కత్రిమ కొరతలను నివారిం చాలి. వ్యవసాయ బడ్జెటు రూపకల్పన చేయాలి. మేలి విత్తనాలు,కొత్త పద్ధతులు, యాంత్రీకరణ ఉపయోగాలు,పంటల భీమాపథకం మొదలైన చర్యలతో వ్యవసాయాన్ని పునరుద్దీప్తం చేయాలి. జనాభా స్థిరీకరణ,భూ వనరుల పెంపు, నీటి భద్రత, సామాజిక అడవుల పెంపకం,జీవ వైవిధ్యం పెంపు తదితర చర్యలు చేపట్టాలి. తిండి గింజల లభ్యత తోనే సరిపోదు. ఆరోగ్యంగా జీవించడానికి, దేహాని కవసరమయ్యే అన్ని పోషకాలను అందివ్వగల సంపూర్ణాహారం లభ్యమైనప్పుడే ఆహార భద్రత చేకూరినట్టవుతుంది.
ఆహార భద్రత… అందరి వ్యవహారం
తినే తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి, పర్యాటకానికి సాయపడటం లక్ష్యం. మనం తినే ఆహారం సురక్షి తంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలు కొని,విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఫలితంగా కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల భారం తగ్గి సమాజం అభివృద్ధి చెందుతుందని అంచనా.
వీటితో ఆరోగ్యానికి చేటు
ఆహారం కలుషితమయ్యేందుకు, తద్వా రా అనారోగ్యం కలిగేందుకు బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్న జీవులు కారణం. అధిక మోతాదులో వాడే రసాయనిక ఎరువులు, నిల్వ చేసేందుకు, రుచి కల్పించేందుకు ఉపయోగించే రసాయనాలు కూడా చేటు చేసేవే. సాల్మనెల్లా,కాంపీలోబ్యాక్టర్‌, ఈ –కోలీ వంటి బ్యాక్టీరియా ఏటా కొన్ని కోట్ల మందిని అస్వస్థులుగా చేస్తోంది. ఈబ్యాక్టీరియా కారణంగా తలనొప్పి,వాంతులు, తల తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుడ్లు, కోళ్లు, జంతు సంబంధిత ఆహారం ద్వారా సాల్మనెల్లా బ్యాక్టీరి యా వ్యాపిస్తుంది. కాంపీలోబ్యాక్టర్‌, ఈ-కోలి పచ్చి పాలు, సక్రమంగా వండని కోళ్ల ఉత్పత్తులు, నీటి ద్వారా వ్యాపిస్తాయి. పూర్తిగా ఉడికించని సముద్రపు ఉత్పత్తుల ఆహారం ద్వారా హెపటైటిస్‌-ఏవైరస్‌ వేగంగా వ్యాపించడమే కాకుండా.. కాలేయ వ్యాది óకి కారణమవుతుంది. కొన్ని రకాల పరాన్నజీవులు చేపల ద్వారా,మరికొన్ని ఇతర ఆహార పదార్థాల ద్వారా వ్యాపిస్తాయి. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడంవల్ల లేదా తేమ ఎక్కువ ఉన్న చోటనిల్వ చేయడం వల్ల వచ్చే బూజు (ఆఫ్లా టాక్సిన్‌)తోపాటు అనేక ఇతర సహజసిద్ధమైన రసా యనాలు కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తా యి. ఈవిషపదార్థాలు దీర్ఘకాలం శరీరంలోకి పోతే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో పోగుపడే వాతావరణంలోని కాలుష్యాలు పాలీ క్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌,డయాక్సిన్స్‌లు జంతువుల ద్వారా మన శరీరాల్లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవి పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. సీసం,కాడ్మియం,పాదరసం వంటి విష తుల్యమైన రసాయనాలు కూడా ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలు దెబ్బతినేం దుకు కారణమవుతున్నాయి.
ఇలా చేస్తే ఆరోగ్యానికి మేలు
ఊ మీ ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉందా? మీ ఆహారం మీకు సమస్యలు సృష్టించకుండా ఉండేందుకు దీన్ని తగిన రీతిలో వాడుకోవడం చాలా అవసరమని చెబుతోంది జాతీయ పోషకాహార సంస్థ. ఇంకా ఏం సూచిస్తోందంటే..
ఊ వండిన, వండని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో వేర్వేరుగా ఉంచాలి.
ఊ ఆకుకూరలను నిల్వచేసే ముం దే.. వాటి వేళ్లను తొలగించి శుభ్రంగా కడిగి ఉంచడం మేలు.
ఊ కోడిగుడ్లను మూత ఉన్న కాగితపు అట్ట డబ్బాలో ఉంచి నిల్వ చేయాలి.
ఊ వండిన ఆహార పదార్థాలను నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉంచరాదు.
ఊ మూతతో కూడిన చిన్నచిన్న పాత్రల్లోనే వండిన ఆహారాన్ని ఉంచాలి.
ఊ వండిన ఆహార పదార్థాలను కూడా గది ఉ ష్ణోగ్రతలో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.
ఊ ఫ్రిడ్జ్‌లో నిల్వచేసిన పదార్థాలను తినే ముందు వేడి చేసుకోవడం అవసరం.
ఊ ఆహారం వండే క్రమంలో ఇతర కాలుష్యాలేవీ అందులోకి చేరకుండా చూడాలి.
ఊ అన్నింటికంటే ముఖ్యం.. ఆహా రం వండే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉన్న నీటితో కాకుండా.. నల్లా కింద చేతులు పెట్టి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఊ కాయగూరలు, పండ్లను తినేముందు కూడా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.
ఊ ఆహారం వండేటప్పుడు వీలైనంత మేరకు శు భ్రమైన నీటినే వాడాలి. ా సురక్షితమైన మంచినీటి వ్యవస్థ లేనప్పుడు ఆ నీటిని మరిగించి వాడొచ్చు.
ఊ వంటపాత్రలోకి నీరు పోసేందుకు విడిగా గ్లాసుల్లాంటివి వాడటం మేలు.
ఇల్లు, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి.
జి.ఎన్‌.వి.సతీష్‌

పోడు భూమి `ఆదివాసు ఆవేదన

ఆదివాసి అటవి హక్కు చట్టంను ఆగాధంలోకి కూర్చిన మొదు ఆడవినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసికి జీవనోపాధి కరువైన దశలో, పచ్చిపుండు మీద కారం చల్లినట్లుగా తెంగాణ ప్రభుత్వం చేసే హింస, ఆదివాసి పుట్టెడు కష్టాన్ని మాటల్లో చెప్పలేం. ప్రకృతిలో మమేకమై జీవనం సాగిస్తూ ఆడవిలో బించే ఇప్పపూవ్వు,తునికి పండ్లు,ముష్టిగింజు, జిగురు చ్లిగింజు,ఇప్పగింజు,ఏరుకొనే క్రమంలో క్రూరజంతువును సైతం ఎదిరించి ప్రాణాను ఫణంగా పెట్టి సెకరించిన అటవీ ఫలాను సంతలోను,జి.సి.సి సిబ్బందికి ఆమ్మిగావచ్చిన కొద్దిపాటి పది పరక డబ్బతో నిత్యావసర వస్తువును కోనుగోు చేయుటకు సరిపోతుంది. దీనికి తోడు,కొండమీద,గుట్ట మీద, లోద్ది లో,ఊటనీరు ఉన్న ప్రతిచోట,అక్కడక్కడ, కొండజోన్ను,గరికు,సాము,పచ్చజోన్ను, తైదు వంటి తిండిగింజు పొట్టకూటి కోసం పండిరచుకొని జీవనం సాగిస్తూ కాలాన్ని వ్లెది స్తూన్నారు. ప్రస్తుతం అటవి హక్కు చట్టం 2006 కొట్టివేత తదుపరి నుండి ఫారెస్టు ఆదికారు దాడు మొదయ్యాయి. ఈ గిరిజనుపై జరిగే ఈ దాడు రోజురోజుకు విపరితంగా పెరుగుతున్నాయి. అడవిలో ఎండిన కట్టెను నరికినా,చీపుర్లు కోసినా,తునికి పండ్లను ఏరుకున్న,పశువు, మేకును మేపు టకు అడవికి వెళ్ళినా,చివరకు భుజాన గోడ్డలి పెట్టుకొని కనిపించినచాు రూ॥ 10,000/ నుండి రూ॥ 20,000/` వరకు జరుమానా వసు చేస్తూ, కేసు పెట్టి,కోర్టు స్టేషన్‌ చుట్టు తిప్పుతున్నారు. అడవికి వెళ్ళడమే పెద్ద నేరం అవుతుంది. తరతరాుగా అడవినే నమ్ముకొని జీవనం సాగించే ఆదివాసు ఒక్కసారిగా అడవి నుండి గెంటివెస్తే ఏమి చేయ్యాలో దిక్కుతోచని పరిస్థితి.

ప్రభుత్వం అటవిని రక్షించుటకు ఆడవిలో ప్రతి మైళుదూరం పోడవున నాుగు,ఐదు సి.సి. కెమోరాను ఏర్పాటు చేసింది. అయ్యో…… కోట్లాది రూపాయు ఖర్చుపెట్టి సి.సి కేమేరా ను పెట్టారు కాని మేము సేకరించే అటవీ ఉత్పత్తుకు ఒక రూపాయి గిట్టుబాటు ధర కూడా పెంచరు. అని వాటిని చూసిన ప్రతి ఆది వాసి గోంతు మౌనంగా రోదిస్తుంది. తిండి కోసం అమటిస్తున్న ఆదివాసి, తన కుటుంబం అకలిబాధతో కాం చెల్లిస్తుందా అని దిగు పడుతూ పోడుభూమిలో తోకరి వానకు విత్తనాుపెడితే,ఫారెస్టు వాళ్ళు వచ్చి ట్రాక్టర్లతో దున్ని మొక్కు నాటుతున్నారు. మరికోన్ని చోట్ల పంట ‘‘ఈనే’’ దశ వరకు వేచి ఉండి అమాం తంగా వచ్చి డ్రోజర్లతో,ట్రాక్టర్లతో పంట చేనును పాడుచేసి, దూన్ని మొక్కు నాటి వెల్ళి పోతు న్నారు. ఇదేమీ దౌర్జన్యం అని అడిగితే పోలిసుతో లాఠి దెబ్బు..కోర్టు, స్టేషన్‌ు. ఇన్ని కఠిన చర్యు తీసుకున్నప్పటికి ఆదివాసు పోడువ్యవసాయం మానడం లేదని ప్రభుత్వం ఒక కొత్త పథకం అము చేసింది. పెద్దపును అడవుల్లోకి దింపచడం.. ఉన్నట్లుండి ఒక్కసారిగా రెండు,మూడు పెద్ద పుుు అడవి మొత్తం కయ తిరుగుతుంటే ఏజెన్సీ గూడెరు అన్ని ఉలికిపడుతున్నాయి. మేతకోసం వెళ్ళిన పశువును మేకను, అడవికి వెళ్ళిన మనుషుపైన దాడి చేసి చంపు తున్నాయి. ఏరాత్రిపూట గూడెంపై దాడి చేసి చంపుతాయోనన్న భయం ఒకవైపు, ఈ ఆడవిలో మన తాతా కాం లోనే పెద్దపులిులేవు.. ఇప్పుడు ఏలా వచ్చినవి అని సందేహం మరోవైపు. మొత్తానికి ఈ సమా చారం వార్త పత్రిక ద్వారా ప్రభుత్వంకు చేరిన వెంటనే సంబంధిత ఆధికారును రంగంలోకి దింపింది, వారు ‘‘ పెద్ద పు’’ పాదముద్రు గుర్తించడంలో నిమగ్నమై ఉన్నారు. దాదాపు నాుగు నెలు పూర్తి కావస్తున్నప్పటికి పాదముద్రు గుర్తించడంలోనే చాలా బిజీగా ఉన్నారు. ప్రభుత్వం, పర్యవర ణంపై, ఆటవిపై ప్రేమను ఒకబోస్తు, ఆది వాసుపై ఇంతటి అమానుషం ప్రదర్శించ డానికి కారణం రిజర్వు పారెస్టు పేరిట మైనింగ్‌ తవ్వకా కోసమే అనేది స్పష్టం అవుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, క్ష్మిదేవిపల్లి మండంలోని పునుగు చెక గ్రామంలో జరుగుతున్న ఆదివాసు రోధన వినేనాధుడు లేడు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్కడ ఆదివాసీను ఆదుకోవాని విజ్ఞప్తి చేస్తున్నారు.
-అశోక్

ఏజెన్సీలో 1/70 చట్టం అము అయ్యేనా?

5వ షెడ్యూల్డ్‌ భూభాగం అనగా ఈ ప్రాంత ఆదివాసు వారి జీవన విధానం సంస్కృతి వీటితో పాటు రాజ్యాంగం ద్వారా కల్పించ బడిన హక్కు వాటి అము రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాు గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో రంపచోడవరం, చింతూరు, పాడేరు ,పార్వతీపురం,సీతంపేట,కోటరామ చంద్రాపురం,శ్రీశైం ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో1/70చట్టం అములో ఉంది.1/70చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజను -గిరిజను మధ్య మాత్రమే భూ లావాదేమీ జరగాలి.గిరిజను -గిరిజ నేతరు మధ్య గానీ, గిరిజనేతయి-గిరిజ నేతరు మధ్యగానీ ఏటువంటి భూ లావా దేమీ జరపటానికి లేదు. గతంలో సుప్రీం కోర్టు సమతా జడ్జిమెంట్‌ ఇదే విషయన్ని తెలియ జేసింది.అంతే కాక ఇటీవ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన ‘‘జగన్నశాశ్వత భూ హక్కు మరియు భూరాక్షపథకం‘‘విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ వేసిన కేసులో1970 తర్వాత ఏజెన్సీలో గిరిజనేతయి జరిపిన భూ లావాదేవీకు ఎటువంటి హక్కు కల్పించ వద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వాు గిరిజను హక్కును ఉ్లంఘిస్తు న్నాయి. గ్రామసభ ఏర్పాటు కొన్ని రాష్ట్రాల్లోనే జరిగింది. అనేక రాష్ట్రాు గిరిజన సహామండలిని ఏర్పాటు చేయడంలేదు. షెడ్యూల్‌ ప్రాంతా పరిపానపై గవర్నర్‌ వ్యవస్థకు ఇచ్చిన విశేష అధికారాను ఈ దేశంలో ఎక్కడా వినియోగించిన సందర్భం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 1/70 చట్టం అమల్లో ఉంది. కాబట్టి షెడ్యూల్‌ ఏరియాలో 2013 భూ సేకరణ పునరావాస, ఉపాధి చట్టం (సెక్షన్‌ 41) ప్రకారం భూ సేకరణ చేయరాదు. కాని రాష్ట్ర ప్రభుత్వం బవంతపు భూసేకరణకు ప్పాడుతోంది. భూబ్యాంకు పేరుతో షెడ్యూల్‌ ఏరియాలో గిరిజన సంప్రదాయపు భూమును స్వాధీనం చేసుకుని పరిశ్రమకు, ప్రాజెక్టుకు కట్టబెడుతోంది. ఇదేవిధంగా బ్రిటీష్‌ కాం నాటి చట్టాు చోటానాగపూర్‌ కౌుదారి చట్టం, సన్‌తాల్‌ పరగణా భూమి హక్కు చట్టం లాంటి గిరిజన భూమి హక్కు చట్టాను బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర పీసా చట్టానికి అనేక సవరణను చేసింది. వీటిలో గ్రామసభ తీర్మానంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో షెడ్యూల్‌ ఏరియాల్లో గిరిజను భూమును కంపెనీకు, కార్పొరేట్లకు కట్టబెట్టే సవరణను తీసుకొచ్చింది. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకా కోసం గ్రామ సభు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రయివేట్‌ మైనింగ్‌ కంపెనీతో ఒప్పందాు కుదుర్చుకుంది. పోవరం ప్రాజెక్టు కింద 1/70, పీసా, అటవీ హక్కు చట్టం ఇతర షెడ్యూల్‌ చట్టాు ఉ్లంఘించి వేలాది ఎకరా గిరిజను భూమును ముంచబోతోంది.
5వ షెడ్యూల్డ్‌ భూభాగం అనగా ఈ ప్రాంత ఆదివాసు వారి జీవన విధానం సంస్కృతి వీటితో పాటు రాజ్యాంగం ద్వారా కల్పించ బడిన హక్కు వాటి అము రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాు గుర్తుకు వస్తాయి. రాష్ట్రంలో రంపచోడవరం,చింతూరు,పాడేరు ,పార్వతీపురం,సీతంపేట,కోటరామ చంద్రాపురం,శ్రీశైం ఐటిడిఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో1/70చట్టం అములో ఉంది.1/70చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజను -గిరిజను మధ్య మాత్రమే భూ లావాదేమీ జరగాలి.గిరిజను -గిరిజనేతరు మధ్య గానీ, గిరిజనేతయి-గిరిజనేతరు మధ్యగానీ ఏటువంటి భూ లావాదేమీ జరపటానికి లేదు. గతంలో సుప్రీం కోర్టు సమతా జడ్జిమెంట్‌ ఇదే విషయన్ని తెలియ జేసింది.అంతే కాక ఇటీవ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన ‘‘జగన్నశాశ్వత భూ హక్కు మరియు భూరాక్షపథకం‘‘విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ వేసిన పిల్‌ (ూIూ11/2021) కేసులో1970 తర్వాత ఏజెన్సీలో గిరిజనేతయి జరిపిన భూ లావాదేవీకు ఎటువంటి హక్కు కల్పించ వద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది.
కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించ నట్లు క్షేత్ర స్థాయిలో మాత్రం చట్టన్ని అము చేసే అధికాయి కరువైయ్యారు. ఏజెన్సీ లోని మండ, డివిజన్‌ కేంద్రాల్లో గిరిజనే తయి విచ్చ విడిగా అక్రమ కట్టడాు కడుతున్న ఎటువంటి చర్యు లేవు. వ్యాపార నిమిత్తం బహుళ అంతస్తు కడుతున్న అధికాయి చూసీ చూడనట్లు వ్యవహరి స్తున్నారు. పంచాయితీ రెవెన్యూ అధికాయి చేతివాటం చూపి గిరిజనేతరు అక్రమా కట్టడాకు అనుమతు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏడు ఐ. టి.డి.ఏ.ు వున్న గిరిజన చట్టలా అములో ఏటువంటి చిత్తసుద్ధి లేదు.అన్న మండ కేంద్రాలోని ప్రధాన రహదారికి ఇరువైపులా వున్న అర్‌అండ్‌బి స్థలాు,ప్రభుత్వ స్థలాు, ఆదివాసు భూమును ఆక్రమించుకొని గిరిజనేతయి వ్యాపార సముదాయాుగా మార్చుకున్నారు.వీటిపై ఆదివాసీ సంఘాు పిర్యాదు,పోరాటాు చేసిన అధికారులో చనం లేదు. ఐఎఎస్‌ అధికాయి కూడా ఆదివాసీ చట్టాను అము చేసే స్థితిలో లేరు. ఏజెన్సీలో భూమి లేని ఆదివాసీ రోడ్డు ప్రక్కన చిన్న గుడిసె వేసుకుంటే పంచాయతీ, రెవెన్యూ, పోలీస్‌ అధికాయి మూకుమూడిగా దాడి చేసి ఐదు నిమిషాలో ఆదివాసీ గుడిసెను కూల్చి వేస్తారు, కేసు నమోదు చేస్తారు..అదే గిరిజనేతరుడు బహుళ అంతస్తు కడుతున్నా పట్టించుకోరు. అంతేకాక వారికి రక్షగా అధికారులే వుంటారు. అక్రమ కట్టడాకు కరెంటు సప్లై ,నీటి వసతి,రోడ్డు సౌకర్యాు కల్పిస్తారు. కానీ అవే సౌకర్యాు ఆదివాసీ గుండెల్లో కనిపించవు. ఇదేనా పాకు ,అధికారు చిత్తశుద్ధి!? వస ఆదివాసీు అడవుల్లో గుడిసొ వేసుకుంటే ఆదివాసీ గుడెసెను తగబెట్టించే ప్రభుత్వాు , అధికాయి మరి 1/70 చట్టానికి విరుద్దంగా వస గిరిజనేతయి నిర్మించిన అక్రమ కట్టడాు , వ్యాపార దుకా ణాు ఎందుకు తగ బెట్టరు,క్చూరు? జీవించే హక్కు గిరిజనేతరుకేనా, ఆదివాసీకు లేదా? ఆదివాసీు ఈదేశ పౌయికారా? ఏజెన్సీ చట్టాు అము విషియంలో అధికారు చిత్తశుద్ధి కరువైంది. ఎందుకంటే అధికార వ్యవస్థనంత కూడా గిరిజనేతర వ్యవస్తనే కాబట్టి నేటికీ ఆదివాసీు హక్కు అందక, చట్టాు అము కాక వారి ఫలాు అనుభవించలేక పోతున్నారు.ఏజెన్సీలో 1/70చట్టాన్ని పటిష్టంగా అము చేయక పోవడంతో మైదన ప్రాంతా నుండి భూస్వాము, బడ వ్యాపార వ్యాత్తు గిరిజన భూమును బినామీ పేరుతో కనుగొు చేసి వ్యాపారం చేస్తున్నారు. ఖాళీగా ఉండే ప్రభుత్వ భూము ఆక్రమించుకుంటున్నారు. ఆదివాసీు సాగుచేసుకుంటున్న పట్టలేని భూమును అడ్డదారిలో గిరిజనేతరుపేరిట పట్టాు చేసుకుంటున్నారు. ఇలా ఒకరి తరువాత ఒకరు పదు,వంద,వే సంఖ్యలో గిరిజనేతరు వసు పెరిగిపోయాయి. గిరిజనేతరు వసు ఎదేచ్చగా ఏజెన్సీ లోకి పెరిగి పోవడం వన ఇక్కడ హక్కు భంగం కుగు తుంది. చట్టాుకు తూట్లు పడతున్నాయి. వసుపై, అక్రమ కట్టడాపై చర్యు తీసుకోవాని ఆదివాసీు , ఆదివాసీ సంఘాు ఆదారాతో సహా ఉన్నత అధికా రునుండి స్థానిక అధికారుకు పిర్యాదు చేసిన చర్యు తీసుకునే వారే లేరు. దీంతో ఏజెన్సీప్రాంతం లో తిష్ట వేసిన గిరిజనేతయి బడ రాజకీయ పార్టీ అండ దండతో స్థానిక పోలీసు ను,అధికారును గుప్పెట్లో పెట్టుకొని అమాయక ఆదివాసును బెదిరింపుకు గురి చేస్తూ ఆదివాసీ భూమును కబ్జా చేస్తున్నారు. ఎదురు తిరిగిన అదివాసుపై అక్రమ కేసు బనయిస్తున్నారు. అధికారు,రాజకీయ పార్టీ అండ దండతో గిరిజనేతరు ఆగడాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. 5వ షెడ్యూల్డ్‌లోని ఆర్టికల్‌ 19(5) ఏజెన్సీలో ఎటు వంటి హక్కులైన ఆదివాసీకే కల్పించాలి. భూము బదలాయింపు కూడా ఆదివాసీ మధ్యనే జరగాలి అని స్పష్టంగా చెబుతుంది. అమ్మకాు,కొనుగోు,కౌు,గిఫ్టు డిడిు, తాకట్టు వంటి బదలాయింపు గిరిజన -గిరిజనేతరు మధ్య ,గిరిజనేతరు -గిరిజ నేతరు మధ్య పూర్తిగా నిషేదం. వస గిరిజనేతరుకు ఆధార్‌,రేషన్‌,ఓటు హక్కును కల్పించడం వన కూడా ఆదివాసీ హక్కుపై ప్రభావం పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పభుత్వం ఉన్నత అధికాయి ఏజెన్సీ చట్టా అము కు ప్రత్యేక చర్యు తీసుకోకుంటే ఏజెన్సీ బిడ్డు మరింత అన్యాయానికి గురి అవుతారు. గిరిజనేతయి వసు పెరిగి ఆదివాసీ జనాభా తగ్గిపోయే ప్రమాదం వుంది. పలితంగా ఆదివాసీ సంస్కృతి తీవ్ర విధ్వంసానికి గురి అయ్యే ప్రమాదం వుంది.ఇప్పటికే పు ఆదివాసీ తెగు, వారి భాషు అంతరించిపోయే దశలో ఉన్నట్లు అనేక సర్వేల్లో వ్లెడైందని అని ఆదివాసీ సంఘాు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో చట్టాను అము చేసి ఆదివాసీ హక్కును కాపాడ కుంటే ఆదివాసు సంక్షేమ,రక్షణ,అభివృద్ధికోసం చేస్తున్న ఖర్చు వృధానే. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాగిరిజన సంక్షేమశాఖ అధ్వర్యంలో ఏజెన్సీ చట్టా పై ప్రత్యేక శ్రద్ధ వహించవసిన అవసరం వుంది. ఐటిడిఏు కేవం సంక్షేమ పథకాకు పరిమితం కాకుండా ఆదివాసుకు రాజ్యాంగం కల్పించిన హక్కు అముకు వాటి రక్షణ కోసం ఏర్పార్చిన చట్టాను ఏజెన్సీలో పటిష్ఠంగా అము అయ్యేలా రాష్ట్రగవర్నర్‌ గారు చర్యు తీసుకోవాల్సిన అవసరం వుంది అని ఆదివాసీు కోరుతున్నారు.
ఆరోగ్యం
నేటికీ మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మలేరి యా,విష జ్వరాు, అతిసార, ఆంత్రాక్స్‌, కాళ్ల వాపు, పోషకాహార లోపం లాంటి ఆరోగ్య సమస్యు తీవ్రంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాు, కమ్యూనిటీ ఆసుపత్రు తగినన్ని లేవు. ఉన్నవాటిలో డాక్టర్లు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది, టెక్నీషియన్లు ఉండాల్సినంత మంది లేరు. తాత్కాలిక, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై కొంతమందిని నియమించినా వారు తమ సేవను అందించలేకపోతున్నారు. ఏజెన్సీలో అత్యవసర, ప్రాణ రక్షక మందు ఎప్పుడూ కరువే. రోడ్డు, రవాణా సౌకర్యం లేనందున సకాంలో వైద్యం అందనందున మరణాు సంభవిస్తున్నాయి. ల్యాబు నుంచి వైద్యు నియామకం వరకు ఆరోగ్య సేవన్నింటినీ ఏజెన్సీలో ప్రభుత్వం ప్రయివేట్‌ సంస్థ ద్వారా నిర్వహిస్తోంది. ఫలితంగా స్థానిక ఆరోగ్య సమస్యను వాటి తీవ్రతను గుర్తించడం, తగిన చర్యు తీసుకోవడం లేదు. మెడ్‌ ఆల్‌ ల్యాబొరేటరీస్‌ వంటి కార్పొరేట్‌ సంస్థు ఏజెన్సీ ఆరోగ్య సమస్యను తమ లాభాకు వినియోగించుకుంటున్నారు. ఏజెన్సీలో ఆరోగ్య పథకాను ప్రభుత్వమే నిర్వహించాలి. శాశ్వత ప్రతిపాదికపై నియామకాు జరిపి, అన్ని ఆరోగ్య సేవను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తేనే మెరుగైన వైద్యం అందుతుంది.
ఉపాధి
ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చుదువుకున్న యువతీయువకు సంఖ్య పెరుగుతోంది. సాంకేతిక వృత్తి విద్యను అభ్యసించిన వారు కూడా నిరుద్యోగుగా ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం తగిన ఉపాధి కల్పించట్లేదు. ఇటీవ వైటిసి (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌)ు పెట్టి కొద్దిపాటి శిక్షణ ఇచ్చి బయట ఉన్న ప్రయివేట్‌ సంస్థకు పంపిస్తున్నారు. వీరికి అక్కడ కనీస వేతనం, పని భద్రత ఉండట్లేదు. దీంతో వారు వస కూలీుగా బతుకున్నారు. ఏజెన్సీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాు జరగక చాలా పోస్టు ఖాళీగా ఉన్నాయి. జిఒ 3 ప్రకారం వీటిని స్థానిక అధ్యాపకుతో భర్తీ చేయాలి. గతేడాది జరిగిన డిఎస్‌సిలో కూడా ఈ జిఒను సక్రమంగా అము చేయలేదు. కావున బ్యాక్‌లాగ్‌ పోస్టుతో పాటు కొత్త పోస్టుకు కూడా నియామకాు జరిపి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి హామీ చట్టం అము సక్రమంగా లేదు.కోట్ల రూపాయ వేతన బకాయిు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమకు అనేక వనయి ఉన్నాయి. తేలికపాటి అటవీ ఉత్పత్తును ప్రాసెసింగ్‌ చేయడానికి గృహ పరిశ్రము స్థాపించవచ్చు. స్థానిక ఉపాధిని పెంచడం ద్వారానే గిరిజన యువతను వక్ర మార్గాు పట్టకుండా కాపాడవచ్చు.
గిరిజనాభివృద్ధి – ప్రత్యామ్నాయం
గత ప్రభుత్వం ఒక గిరిజన విధానాన్ని ప్రకటించింది. 2010లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన సాధికారిత విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో గిరిజనాభివృద్ధికి సంబంధించిన దృక్పథం చెప్పబడిరది. గిరిజన ప్రాంతాు వనరును, ఉపాధి రహిత ఆశ్రిత పెట్టుబడిదారీ పద్ధతిలో అభివృద్ధి చేయాని కోరింది. దీనిలో స్థానిక ప్రజ అభివృద్ధి కన్నా కార్పొరేట్‌ దోపిడీ లాభం చోదక శక్తిగా ఉంటాయి. ఉదాహరణకు ఏజెన్సీలో మైనింగ్‌ కార్యకలాపాు విస్తృతంగా జరుగుతున్నాయి. దీనిలో స్థానిక గిరిజనుకు జరిగింది ఏమిటి? కీక పారిశ్రామిక ముడి సరకున్నీ షెడ్యూల్‌ ప్రాంతాల్లో కేంద్రీకరించబడి ఉన్నాయి. వీటిని క్లొగొట్టడం తప్ప ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందే లేదు. భారత తొలి ప్రధాని నెహ్రూ ప్రకటించిన ‘గిరిజన పంచశీ’ సారాంశానికి… నేటి ప్రభుత్వాు చేస్తున్న అభివృద్ధి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఆవిధాన ప్రకటనలో నెహ్రూ ఆధునిక పెట్టుబడిదారీ తరహా అభివృద్ధిలో గిరిజను తమకు ఉన్న సమిష్టి సంప్రదాయాను, వారి సర్వ హక్కును కోల్పోయారు. ఆధునిక పారిశ్రామిక సమాజం అందించిన సౌకర్యాను పొందలేకపోతున్నారు. వారి అభివృద్ధికి వారే బాధ్యత వహించాలి. వారి అభివృద్ధిని వారే చేయాలి. అందుకు మన ప్రభుత్వాు సహాయపడాలి. మన సహాయం వారి అభివృద్ధికి తోడ్పడేదిగా ఉందా, అడ్డగించేదిగా ఉందా అనేది మనం సమీక్షించుకోవాలి. ఖనిజాను వెలికి తీసి షెడ్యూల్‌ ప్రాంతాను కాుష్యంతో నింపుతున్నారు. ప్రకృతి సహజత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారు. భారీ ప్రాజెక్టును నిర్మించి, క్షలాది మంది గిరిజను వేలాది ఎకరా భూమిని ముంచుతున్నారు. పారిశ్రామిక ముడి సరుకు కోసం అడవిని, కొండను సర్వనాశం చేస్తు న్నారు. ఇవి గిరిజన అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి.
సంక్షేమానికి తిలోదకాు
ప్రభుత్వం విద్యారంగ బాధ్యత నుండి క్రమంగా తప్పుకుంటోంది. ఇది గిరిజన విద్యారంగ కేటాయింపు, అము, పర్యవేక్షణలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ విధానాను గిరిజన విద్యలో ప్రవేశపెట్టారు. బెస్ట్‌ ఏవైబుల్‌ స్కూల్‌ పథకం, నాణ్యమైన విద్య పేరుతో ఇంగ్లీష్‌ మీడియం పేరుతో నిధును ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు దోచిపెడుతున్నారు. ఏజెన్సీలో ఆరు ప్రధాన భాషు (కువి, సవర, కాయ, గొండా, చెంబు, ంబాడా) ఉన్నాయి. తెగ భాషా బోధన డ్రాప్‌అవుట్‌ రేటును బాగా తగ్గించిందని ప్రభుత్వ నివేదికు చెప్తున్నాయి. అయినప్పటికీ 1,400 మంది గిరిజన భాషా బోధకును ఇటీవ తొగించారు. పైగా గత సంవత్సరం భా ు హాస్టళ్లను కుదిస్తూ జిఒ 17ను జారీ చేసింది. ఉన్న హాస్టళ్ళలో ప్లి సంఖ్యకు తగిన వసతు లేవు. మెనూ ప్రకారం భోజనం పెట్టక నానా ఇబ్బందు పడుతున్న స్థితిలో ఖర్చు తగ్గించేందుకు హాస్టళ్ల సంఖ్యను కుదించడం ఘోరమైన నేరం. రేషనలైజేషన్‌, కన్వర్షన్‌ లాంటి ప్రయోగాను ఏజెన్సీ ప్రాంతంలో చేయకూడదు. విద్యార్థు సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి గిరిజన ఆవాస ప్రాంతంలో స్కూల్‌ పెట్టాలి.

  • వ్యాసకర్త : ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిసెల్‌: 7995036822
    -కుంజాశ్రీను

‘ఆహార భద్రతా వ్యవస్థ రక్షణ తక్షణావసరం’

మార్చి 1,2021 నాటికి భారతదేశంలో 9.2కోట్ల టన్ను ఆహార ధాన్యా న్విున్నాయి. ఇవి ఉండాల్సిన న్వి కంటే మూడు రెట్లెక్కువ. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2019-2020లో ఉండాల్సిన న్వి కంటే కొంచెం తగ్గినప్పుడు, ఆహార న్విను తీసుకొని రావడానికి 12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. ప్రపంచ ఆకలి సూచిక (Gశ్రీశీపaశ్రీ నబఅస్త్రవతీ Iఅసవఞ )లో,107 దేశాల్లో 92వ స్థానంలో ఉన్న దేశం, సరిపడా ఆహార ధాన్యా న్విు కలిగి ఉన్న పరిస్థితుల్లో, పోషకాహార లోపంతో ఉన్న ప్రజానీకానికందరికీ ఉపశమనం కలిగే విధంగా ప్రతి ఒక్కరికీ సరిపడా ఆహారధాన్యాను అందించడం ద్వారా ఒక నైతిక ఆహార భద్రతా విధానాన్ని కలిగి ఉండాలి. కానీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకమైన ప్రణాళికను రూపొందిస్తోంది.


గ్రామీణ జనాభాలో 75శాతం,పట్టణంలో జనాభాలో 50శాతం జనాభాకు తప్పకుండా ఆహార ధాన్యాను అందించాల్సి ఉండగా, గ్రామీణ జనాభాలో 60శాతం, పట్టణ జనాభాలో 40శాతానికి పరిమితం చేయడం ద్వారా ‘జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని’ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) బహీన పరిచేందుకు నిటిఆయోగ్‌ సిఫార్సు చేసిన ఫలితంగా 10కోట్ల మంది బ్ధిదారుకు కోత పడుతుంది. 2011-2021 మధ్య కాంలో పెరిగిన జనాభాకు కనీసం 9కోట్లకు పైగా బ్దిదారును చేర్చి ఉండాల్సిందన్న వాస్తవాన్ని నిటిఆయోగ్‌ కూడా అంగీకరించింది. కానీ ప్రభుత్వం మాత్రం 2011నాటి పాత సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటున్నది. ఇప్పుడు 2021 జనాభా వివరాు ఒక సంవత్సరంలో అందు బాటులోకి వస్తాయి కాబట్టి, ఇంకా పెరుగు దను నివారించలేము. ప్రభుత్వం చట్టాన్ని మార్చి, బ్దిదారు సంఖ్యను కుదించే ప్రయత్నం చేస్తుంది. 2014లో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం, కొన్ని నెల్లోనే బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి శాంతకుమార్‌ నేతత్వంలో భారత ఆహార సంస్థ పనితీరు (ఎఫ్‌సీఐ), దాని సమస్యకు సంబంధించి సిఫార్సు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఊహించిన విధంగానే ఆ కమిటీ ‘’జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పునస్సమీక్షించాని’’ సిఫార్సు చేసింది. అదేవిధంగా, బ్ధిదారు పరిధిని 67శాతం నుంచి 40శాతానికి తగ్గించాని, కేంద్ర పంపిణీ ధరను (జవఅ్‌తీaశ్రీ ఱంంబవ జూతీఱషవం) పెంచాని సిఫార్సు చేయడం ద్వారా చట్టాన్ని కనుమరుగు చేసింది. కేంద్ర పంపిణీ ధరను పెంచాని కోరుకున్న ‘ఎకనామిక్‌ సర్వే 2021’లో రెండవ సిఫార్సును ప్రతిధ్వ నించింది. ఒకవేళ బ్దిదారు సంఖ్య కుదిం చాన్న సిఫార్సు అము జరిగితే, ఆహార సబ్సిడీపై 49వే కోట్ల రూపాయ మేరకు కోత విధిస్తారని నిటిఆయోగ్‌ లెక్క లేసింది. ధరు పెంచాని ఎకనామిక్‌ సర్వే చేసిన సూచన సబ్సిడీని మరింత కుదిస్తుంది. కార్పొరేట్‌ కంపెనీకు సబ్సిడీను కొనసాగించడానికి, విస్తరించడానికి మోడీ ప్రభుత్వం ప్రజ సబ్సిడీను కత్తిరించేందుకు తీసుకున్న నిర్ణయం కన్నా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాు పొందుతున్న బ్ది దారు పరిధి, ధరల్లో ప్రతిబింబించే ప్రజ ఆహార భద్రత హక్కును బహీన పరిచే చర్యను భారతదేశం ఎదుర్కొంటుంది. భారత ఆహార భద్రతా చట్టంపై చేస్తున్న ఈ దాడి, అంతర్గతంగా ఆహార ధాన్యా ఉత్పత్తి, సేకరణ విధానానికి ముడిపడి ఉంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాకు తోడైన ఈ విధానం జాతీయ ఆహార భద్రతా చట్టంపై దాడిగా భావించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థలో సార్వత్రిక విధానానికి బదుగా ‘దారిద్య్ర రేఖకు ఎగువన’ (ఏపీఎల్‌),’ దారిద్య్ర రేఖకు దిగువన’ (బీపీఎల్‌) అనే వ్యవస్థను భిన్నమైన పేర్లతో కొనసాగించడంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం లోనే కొన్ని ఘోరమైన లోపాున్నాయనేది నిజం. జాతీయ ఆహార భద్రతా చట్టం కంటే ముందు బీపీఎల్‌ కార్డున్న ప్రతీ ఒక్కరికీ కనీసం 35కిలోు కేటాయించాన్న నిబంధనను గుర్తించకుండా, ప్రతీ ఒక్కరికీ 5కిలోు కేటాయించానే పరిమితిని ఈ చట్టం విధించింది. 2013లో బ్దిపొందిన వారి సంఖ్య 81.35 కోట్లుంటే, ఇప్పుడు 79.26 కోట్లకు తగ్గింది. గతంలో బ్ది పొందిన జనాభాలోని ఒక భాగాన్ని (ఏపీఎల్‌) ఇప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి రాకుండా మినహాయించారు. భవిష్యత్తులో జాతీయ ఆహార భద్రతా చట్టం అములో లోపాు లేకుండా చేసి, దానిని రక్షించడం ద్వారా బలోపేతం చేయాన్న డిమాండ్‌ ముందుకు వస్తుంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం ఉ్లంఘన
ఇప్పటికే ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ ముఖ్య నిబంధను ఉ్లంఘించబడుతున్నాయి. సెక్షన్‌ 4ప్రకారం,‘’(ఏ) ప్రతీ గర్భిణీ స్త్రీ, పాలిచ్చే ప్రతీ తల్లికి (గర్భిణీగా ఉన్న సమయంలో, బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెల వరకు) ఉచిత ఆహారాన్ని అందించాలి (బీ) వారికి ఆరు వే రూపాయ నగదు సబ్సిడీని ఇవ్వాలి’’. 2017 వరకు నగదు సబ్సిడీ నిబంధన అము కాలేదు, ఆ తర్వాత ఏ సవరణు చేయకుండానే చట్టాన్ని కుదించారు. ఆ కుదింపు, ఐదువే రూపాయకు నగదు సబ్సిడీని కత్తిరించడమే కాక చట్ట విరుద్ధంగా విధించిన నియమ నిబంధను, 57శాతం గర్భిణీ స్త్రీు, పాలిచ్చే త్లు చట్టబద్ధంగా పొందే నగదు సహాయాన్ని పొందకుండా మినహాయిస్తుంది. ఇదికూడా మొదటి బిడ్డ ఉన్న వారికే పరిమితం చేశారు. ఇలాంటివి మొత్తం జననాలో, కేవం 43శాతం జననాకు సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. ఈ చట్టం కింద అర్హులైన మెజారిటీ స్త్రీను, వారి హక్కును నిరాకరిస్తున్నారు. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లో చదువుతున్న ప్లికు వండిన పౌష్టికాహార మధ్యాహ్న భోజనాన్ని పొందే హక్కును కల్పిస్తుంది. కానీ ఆహార పదార్థా ధరు ఆకాశాన్నంటినప్పటికీ, మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ కేటాయింపు తగ్గించారు. 2021-22 బడ్జెట్‌లో మధ్యాహ్న భోజన పథకానికి సవరించిన అంచనా 12,900కోట్ల నుంచి 11,500కోట్లకు తగ్గిస్తూ కేటాయింపు చేశారు. దీని వ్ల 12కోట్ల మంది బడి ప్లికు అందిస్తున్న పౌష్టికాహార నాణ్యత, పరిమాణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం నియమ నిబంధనకు తిలోదకాు ఇవ్వడమే. అదేవిధంగా ఆరు నెల నుంచి ఆరేండ్ల వయస్సు గ ప్లికు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప్రకారం స్థానిక అంగన్వాడీ ద్వారా ఉచిత ఆహారాన్నం దించాలి, కానీ కేటాయింపు తగ్గడంతో ఆహార పథకం అము తీరుపై తీవ్ర ప్రభావం పడిరది. అందువ్ల జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా మాతత్వానికి సంబంధించిన నగదు ప్రయోజనాను మహిళకు అందించి, పాఠశా విద్యార్థుకు పౌష్టికాహార మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్‌ కేటాయింపు పెంచి ఆహార భద్రతా చట్టం నిబంధన అముకు తక్షణమే హామీ ఇవ్వాలి.
అంత్యోదయ అన్నా కార్డు
ఒక అంత్యోదయ అన్నా యోజన (ఏఏవై) కార్డు ఉన్న వ్యక్తికి, కేంద్ర పంపిణీ ధర ప్రకారం (కేజీ గోధుము రూ.2, కేజీ బియ్యం రూ.3 చొప్పున) 35కిలో ఆహార ధాన్యాు పొంద డానికి అర్హత ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం సెక్షన్‌ 3(1) ప్రకారం, ఏఏవై కార్డు కలిగి ఉండే కుటుంబా సంఖ్యను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏఏవై కార్డు పొందడానికి అర్హులైన వారిని గుర్తించడానికి ఏఏవై కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాను ఇచ్చింది. అర్హులైన వారిలో బహీన గిరిజన సమూహాు, భూమి లేని వ్యవసాయ కార్మికు, దినసరి వేతన కార్మికు, కుటుంబ భారం మోస్తున్న వితంతువు, ఒంటరి మహిళు, వికలాంగు ఉన్నారు. ఆఖరికి, ఆ ప్రయోజ నాను పొందడానికి అర్హులైన సామాజిక వర్గా సంఖ్య పెరిగే నాటికి, ఏఏవై కార్డున్న కుటుంబా సంఖ్య 2005 నుంచి 2.5 కోట్ల కుటుంబా వద్ద నిలిచిపోయింది. మార్చి 2015లో, మొత్తం జాతీయ ఆహార భద్రతా చట్టం ఉ్లంఘనలో భాగంగా మోడీ ప్రభుత్వం ‘’వసు, సామాజిక, ఆర్థిక స్థితిలో మెరుగు ద, మరణా కారణంగా ఏఏవై కార్డు ఉన్న కుటుంబాకు అర్హత లేకుంటే, అటువంటి కుటుంబాను ఆ మేరకు తగ్గించాని’’ ఒక సర్క్యుర్‌ను విడుద చేసింది. కానీ ఒకవేళ సామాజిక, ఆర్థిక స్థితి ఘోరంగా ఉండి, వారి స్థితిలో మెరుగుద లేకుంటే ఏంటి పరిస్థితి? అంటే ‘’రాష్ట్రాల్లో అంత్యోదయ కార్డున్న కుటుంబాను గుర్తించకూడదు’’ అనేది సర్క్యుర్‌ ఉద్దేశ్యం. దీంతో 2.5కోట్ల ఏఏవై కార్డున్న కుటుంబా సంఖ్య కరోనా వ్యాప్తి కాంలో 2.35కోట్లకు తగ్గింది. నిరాశా నిస్పృహు ఆవహించిన 2020లో 3.79 క్ష అంత్యోదయ కార్డును తొగించింది. అంతేకాక వరుసగా మూడు నెల పాటు రేషన్‌ తీసుకోపోలేక పోయిన 71,982 మందిని, ‘’నిశ్శబ్ద రేషన్‌ కార్డు హ్డౌర్‌ు’’ అని, బోగస్‌ కార్డున్న వారిగా గుర్తించి, కరోనా మహమ్మారి వ్యాప్తి కాంలో 90వే ఏఏవై బ్దిదారును తొగించారు.
వస కార్మికుకు ఉచితంగా ఆహార ధాన్యాను అందిస్తున్నామని గొప్పు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం, ఆచరణలో ఏఏవై పథకం కింద 35కిలో ఆహార ధాన్యాను పొందే అర్హత ఉన్న వారి సంఖ్యను గణనీయంగా తగ్గించింది.
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఉ్లంఘిస్తున్న మార్చి 2015 ఆర్డర్‌ను రద్దుచేసి, ఏఏవై మార్గదర్శకా పరిధిలోకి వచ్చే అన్ని వర్గా ప్రజను చేర్చాలి. ‘’ప్రాధాన్యత’’ కలిగిన కుటుంబాకు సంబంధించి, కరోనా వ్యాప్తి కాంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 8కోట్ల మంది వస కార్మికుకు రేషన్‌ కార్డు, ఉచిత ఆహార ధాన్యాను సమకూరుస్తామని ప్రకటించింది. కానీ ప్రాధాన్యతా జాబితాలో కేవం 1.49కోట్ల మంది బ్ధిదారునే చేర్చారు. అవాక్కయ్యే విషయమేమంటే బ్దిదారు జాబితాలో 51క్ష మందిని అదే కాంలో తొగించడంతో మొత్తంగా ప్రయోజనం పొందిన వారు కోటి మంది కన్నా తక్కువే ఉన్నారు.
రేషన్‌ కార్డు రద్దు నియమాు
మూడు కోట్ల రేషన్‌ కార్డు రద్దుకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనా వ్యాజ్యం వాదను విన్న సుప్రీంకోర్టు ‘’ఇది చాలా తీవ్రమైన విషయం’’గా పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం అందజేసిన రద్దైన రేషన్‌ కార్డు సంఖ్యలో వైరుధ్యం ఉంది. ఫిబ్రవరి 2017లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆధార్‌ను రేషన్‌ కార్డుతో అనుసంధానం చేయడం వ్ల 3.95కోట్ల రేషన్‌ కార్డు రద్దయ్యాయని ప్రధానమంత్రి లోక్‌సభలో చెప్పారు. కానీ అటువంటి సమాచారం ఏదీ రాష్ట్రా నుంచి అందుకో లేదని తెలిసినట్టు సమాచార హక్కు పత్రా దాఖు ద్వారా తొసుకున్న హిందుస్థాన్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది.
మొత్తం 2.75కోట్ల బోగస్‌, అర్హతలేని రేషన్‌ కార్డును 2013-2017లో తొగించినట్టు, అంటే రూ.17,500కోట్లు ‘పొదుపు’ చేసినట్టు, పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంగా తెలిపారు. డిసెంబర్‌ 2019లో ఆహార మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ రెండవ నివేదిక, 2016-2019 మధ్య కాంలో 1.49రేషన్‌ కార్డు రద్దయ్యాయని తెలిపింది. అంటే మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి కేంద్రంలో, అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నాుగు కోట్లకుపైగా రేషన్‌ కార్డును భౌతిక పరిశీన చేయకుండా రద్దు చేశారు.
ఈ రేషన్‌ కార్డు రద్దు, అసలైన బ్దిదారు ఆహార భద్రతా హక్కుపై దాడికి దారి తీసింది. ఒకవైపు ప్రభుత్వం కొత్త బ్దిదారును జాబితాలో చేర్చుకునేందుకు తిరస్కరించింది, మరొకవైపు కార్డును రద్దు చేసేందుకు ప్రభుత్వం అవంబించే విధానం పూర్తిగా ఏకపక్షంగా ఉంది. రేషన్‌కార్డు రద్దుకు కేంద్ర ప్రభుత్వం అవంబించే విధానాను తక్షణమే నిలిపివేయాలి, భౌతిక పరిశీన చేయకుండా ఏ ఒక్క కార్డూ రద్దు చేయకూడదు. భౌతిక పరిశీనలో స్థానిక పంచాయతీ సంస్థ భాగస్వామ్యం ఉండాలి.
వివిధ ప్రభుత్వ పథకా ప్రయోజనాను పొందడానికి బ్దిదాయి ఆధార్‌ కార్డును ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. ‘’ప్రభుత్వం, రేషన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును అనుసంధానం చేసేందుకు సెప్టెంబర్‌ 2020 వరకు గడువును పొడిగించింది కాబట్టి ఏఒక్కరికీ ఆహార ధాన్యా కోటాను నిరాకరించకూడదని’’, మే 2020 లో కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యుర్‌ను జారీ చేసింది. ఇంకో మాటలో చెప్పాంటే, రేషన్‌ పొందడానికి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అనే విషయాన్ని ఇది నిర్ధారిస్తుంది. మార్చి 2021 నాటికి 79.28కోట్ల మంది బ్ధిదారుకుగాను ఇంకా 8.8కోట్ల మంది ఆధార్‌ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంది. బయోమెట్రిక్‌ పద్ధతిలోని అసమత్యుత, లోపభూయిష్టమైన యంత్రా వన గణనీయమైన సంఖ్యలో బ్దిదాయి రేషన్‌ పొందే హక్కును కోల్పోతున్నారు.జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సామాజిక భద్రతకు హామీ ఇవ్వాంటే, కుటుంబానికి కనీసం 35కిలో (ప్రస్తుత కేంద్ర పంపిణీ ధర ప్రకారం గోధుము కేజీ రూ.2, బియ్యం కేజీ రూ.3 చొప్పున) ఆహార ధాన్యాను పొందే హక్కుపై ఆధారపడే ఆహార భద్రతా వ్యవస్థ భారతదేశానికి అవసరం. ఇతర నిత్యావసర ఆహార వస్తువును కూడా సబ్సిడీ ధరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలి. దాడికి గురవుతున్న రైతు హక్కుతో ముడిపడిన ఆహార ధాన్యా ఉత్పత్తి, సేకరణ విధానా నేపథ్యంలో ఆహార భద్రత కోసం పోరాటం జరుగుతోంది.

  • పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో అనువాదం : బోడపట్ల రవీందర్‌(నవ తెంగాణ)
    -బృందా కరత్

సోషల్‌ మీడియా కొత్త నిబంధనలు

గత కొంతకాంగా సోషల్‌ మీడియాతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫాంపై గుర్రుగా కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీక ప్రకటన చేసింది. సోషల్‌ మీడియా సహా ఓటీటీ ప్లాట్‌ఫాంకు భారీ షాక్‌ ఇస్తూ కొత్త నిబంధను తీసుకువచ్చింది. ఈ నిబంధనను గురువారం నాడు కేంద్రం సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు. ఈ నిబంధనతో ఓటిటి, సోషల్‌ మీడియాకు కళ్లెం వేసింది కేంద్రం. కాగా, వీటిని పక్కాగా అము చేసేందుకు మూడు అంచె నియంత్రణ విధానాన్ని అము చేయనున్నామని కేంద్ర మంత్రిప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు.

ట్విట్టర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ ప్రచారం ఎక్కువైపోయింది. అలాగే ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో హద్దు మీరిన శృంగారాన్ని చూపిస్తూ వెబ్‌ సిరీస్‌ు, సినిమాు విడుద అవుతున్నాయి. వీటిపై కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ రూల్స్‌- 2021 పేరుతో నిబంధను విడుద చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్టును తొగించాని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే ఆ ఆదేశాను పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. సదరు సంస్థకు లీగల్‌ నోటీసు జారీ చేయడం జరుగుతుంది. చట్టపరమైన ఉత్తర్వు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొగించాల్సి ఉంటుంది. దాదాపు 36 గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొగించాలి. ఇక అధికాయి ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంట్లోగా సమస్త సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైనా కీక షరతు విధించారు. సదరు సంస్థు భారత్‌లో ఆయా కార్యాయాు నిర్మించాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొత్తగా విడుద చేసిన నిబంధనలివే..!
సోషల్‌ మీడియా, ఓటీటీపై కేంద్రం కొరడా.. కొత్త నియావళిని అతిక్రమిస్తే ఖేల్‌ ఖతం
సాగు చట్టాకు వ్యతిరేకంగా ఉద్యమాు చేస్తున్న రైతుకు మద్దతుగా సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న పోస్టు, సంబంధిత ఖాతాను తొగించాన్న ఆదేశాతో కేంద్రం, ట్విటర్‌కు మధ్య ఇటీవ వివాదం చోటు చేసుకుంది.

సోషల్‌ మీడియా నిబంధనల‌`ప్రధానాంశాలు:
గత కొంతకాంగా తప్పుడు కథనాు, అసత్య ప్రచారాు, నేరపూరిత సమాచారాన్ని ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాంపై కేంద్రం కొరడా రaలిపించింది. వీటిని నియంత్రించేలా కఠిన నిబంధనావళిని కేంద్రం గురువారం విడుద చేసింది. తమ వేదికపై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్‌, ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి స్ట్రీమింగ్‌ సంస్థు అనుసరించాల్సిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీ రూల్స్‌- 2021 పేరుతో కేంద్ర మంత్రు రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేవకర్‌ వివరాను వ్లెడిరచారు.

కేంద్రం మెవరించిన మార్గదర్శకాలు ఓవిధంగా భారీ షాక్‌గానే పరిగణించాలి. తాజాగా నిబంధనతో ఓటీటీ, సోషల్‌ మీడియాకు దాదాపు కళ్లెం పడినట్టే. ఈ మార్గదర్శకాను పక్కాగా అమకు మూడు అంచె నియంత్రణ విధానాన్ని అనుసరించనునున్నట్టు స్పష్టం చేసింది. తాజా, నిబంధన ప్రకారం.. ఏదైనా పోస్టును తొగించాని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే వాటిని పాటించాలి. లేదంటే.. సదరు సంస్థకు లీగల్‌ నోటీసు జారీ చేస్తారు. చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొగించాల్సి ఉంటుంది. నోటీసు జారీచేసిన దాదాపు 36గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొగించాలి. ఇక అధికాయి ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంటల్లోగా పూర్తి సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంపైనా కీక షరతు విధించారు. సదరు సంస్థు భారత్‌లో ఆయా కార్యాయాు ఏర్పాటుచేయాని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓటీటీ నిబంధను


  • ా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఇష్టానుసార వీడియోు పోస్ట్‌ చేయడం, అసభ్య, అశ్లీ, హింసాత్మక కంటెంట్‌పై నిషేధించింది.
    ా వయస్సు ఆధారంగా ఐదు విభాగాుగా ఓటీటీ విభజించి, సామాజిక ఉద్రిక్తతు పెంచే కంటెంట్‌పై నిషేధం విధించారు.
    ా మహిళు, చిన్నాయి, దళితును అవమానించేలా, జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉన్న అంశాపై నిషేధం.
    ా అసత్య ప్రచారం ప్రారంభించే తొలి వ్యక్తి వివరాు కచ్చితంగా వ్లెడిరచాలి.
    ా ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం సంస్థు దేశంలోనే కార్యాయాు ఏర్పాటు చేయాలి.
    ా సోషల్‌ మీడియా వేదికల్లో సమాచారం, కంటెంట్‌పై వినియోగదారు ఫిర్యాదును నిర్ణీత కాంలో పరిష్కరించాలి.
    ా అభ్యంతరకరమైన అంశాను గుర్తించిన తరువాత వాటిని 24 గంటల్లో తొగించాలి. లేకపోతే చట్టపరంగా చర్యు తీసుకుంటారు.
    ా నోడల్‌ ఏజెన్సీ 24 గంటు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది.. ఫిర్యాదును అము చేయడానికి ఈ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది.
    ా ఈ నిబంధనల‌ను ప్రచురించిన తేదీ నుంచి 3నెల్లోపు చీఫ్‌ కంప్లైయన్స్‌ ఆఫీసర్‌ (సీసీఓ)ను నియమించాలి. చట్టానికి, నిబంధనకు సీసీఓ బాధ్యత వహించాలి.
    స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ డేటా చవకగా భిస్తున్న భారత్‌.. సోషల్‌ మీడియా సంస్థకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదాయి ఉన్నారు. సోషల్‌ మీడియా నిబంధనను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్‌ మీడియా నిబంధనను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది.
    ఈ నిబంధనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌లో స్పందించారు. అన్ని సామాజిక మాధ్యమాు, ఓటీటీ సంస్థకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎ్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్‌ సంస్థూ భారత చట్టాకు లోబడి ఉండాని ఆయన సూచించారు.

1 6 7 8 9 10 11