భారత రాజ్యాంగం లౌకిక స్వభావం

భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసంలౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వా సాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణా మాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే.లౌకిక రాజ్యమంటే ప్రజలు,ప్రభుత్వానికి మధ్య సంబంధాలు,పరిపా లన..మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతికప్రపంచం గురించి ఆలోచిం చడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం,పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించిఊహించి చెప్పేప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతా బ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్‌ హోలియోక్‌ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్‌ భాషలోని ూవషబశ్రీబఎ (సెక్యులమ్‌) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్‌)అని దీనిఅర్థం. ఆ తర్వాత వాడు కలో ప్రభుత్వాన్ని,పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం..పాలనచట్టం, రాజ్యాం గం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి.
లౌకిక భావన, వివిధ పార్శ్వాలు
లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించి నప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ.పూర్వ కాలం లో ప్రజల అన్ని విషయాలను మతం,మతాచార్యు లే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు.సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు.
భారతీయ భావన భిన్నం
పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణా మాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు,విశ్వాసాలు,జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యా లుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం,రెండోది భిన్నమతాల మధ్య సామర స్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు.విశ్వ వ్యాప్త మైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’.
లక్షణాలు
ా ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు.
ా అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు.
ా మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం.
ా న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం.
ా మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
ా రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం
ా లౌకికతత్వం (సెక్యులర్‌) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది.
లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు
రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కు లలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమా లలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరు డు కలిగి ఉండాలని కోరడం,లౌకికతత్వానికి మచ్చు తునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు.
ప్రవేశిక – లౌకిక భావన
భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన,విశ్వాసం,నమ్మకం అనే అం శాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు.రాజ్యాంగం మూడో భాగం లో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి.(వ్యాసకర్త:డెరైక్టర్‌, క్లాస్‌-వన్‌ స్టడీ సర్కిల్‌)
లౌకిక రాజ్యాంగానికి విఘాతం కల్గించవద్దూ..
ప్రస్తుత బి.జె.పి ప్రభుత్వం ఆర్‌.ఎస్‌. ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తన రాజకీయ ప్రాబ ల్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగు తుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు,కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యా యులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి. భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో అడుగు పెడు తున్నది. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ అరవైకి పైగా రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారతీయ భిన్నత్వానికి, బహుళత్వానికి అనుగుణం గా రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగలక్ష్యాలను,ఆశయాలను పొందుపరచారు.గిరిజన ప్రాంతాలకు5,6షెడ్యూళ్ల ద్వారా ప్రత్యేక హక్కులుకల్పించారు. జమ్ము-కాశ్మీర్‌ ఆనాడు ప్రత్యేక పరిస్థితులలో ఇండియన్‌ యూని యన్‌లో చేరటంతో370వ నిబంధన ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. తరతరాలుగా అణచి వేతకు గురైన షెడ్యూల్‌ కులాలు,షెడ్యూల్‌ తెగలు, వెనుక బడిన తరగతుల ప్రజల కోసం రాజ్యాంగం 16వ భాగంలో రిజర్వేషన్లతోపాటు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు.
భారతీయ ఉమ్మడి సంస్కృతి
భారతీయ సంస్కృతి ఉమ్మడి సంస్కృతి అని రాజ్యాంగంలోని51(ఎ)నిబంధనలో పేర్కొ న్నారు.భారతదేశం భిన్నమతాలకు, సాంప్రదా యాలకు, సంస్కృతులకు, ఆచారాలకు నెలవుగా ఉన్నది. దేశంలోహిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, జైనం,బౌద్ధం,పార్సీ,సిక్కు మతాలతో కూడిన సం స్కృతీ సాంప్రదాయలు ఉమ్మడి సంస్కృతిగా రూపు దిద్దుకున్నాయి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు ‘’విభ జించు-పాలించు’’సూత్రంలో భాగంగా హిందు వులు-ముస్లింల మధ్య మతతత్వ భావనలు రెచ్చ గొట్టారు. ఫలితంగానే జాతీయోద్యమ కాలంలో ముస్లిం లీగ్‌,హిందూ మహాసభ,రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్న్‌ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. మత తత్వ ధోరణులకు కొనసాగింపుగానే1947లో దేశ విభజన జరిగింది. సమకాలీన భారతదేశంలో మతతత్వ ధోరణులను, మతోన్మాదాన్ని రెచ్చగొట్ట టానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలను మతపరంగా చీల్చటానికి సంఘ పరివార్‌, బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నింటిని ఎదు ర్కొని భారతీయ ఉమ్మడి సంస్కృతిని రాజ్యాంగంలో చెప్పిన విధంగా పరిరక్షించుకోవాలి.
రాజ్యాంగంలో లౌకిక విధానాలు
భారత రాజ్యాంగం దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. ఈమేరకు పీఠికలో చేర్చారు. ప్రాథమిక హక్కులలో 25నుండి 28 వరకు గల నిబంధనలు ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించాయి. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని ‘’స్వీకరించటానికి,ఆచరించటానికి,ప్రచారం చేసు కోవటానికి’’ హక్కు కలిగి ఉన్నాడు. మతపరమైన సంస్థలను నిర్వహించుకోవటానికి, సేవా కార్యక్ర మాలు నిర్వహించటానికి రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. వ్యక్తిగతమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చని చెప్పింది. ప్రాథమిక హక్కులలో విద్యా,సాంస్కృతికహక్కులను29,30 నిబంధనలలో పేర్కొని వాటి ద్వారా మైనారిటీలు తమ భాషను, సంస్కృతిని,విద్యను అభివృద్ధి చేసుకోవటానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం పేర్కొన్నది. రాజ్యాంగనిర్మాతల ప్రధానలక్ష్యం భారతదేశంలోని భిన్నమతాల ప్రజలు లౌకిక విధా నాలతో జీవిస్తూ సహజీవనం చేయాలని భావిం చారు. లౌకిక విధానాల ద్వారానే దేశ సమైక్యత, సమగ్రత కొనసాగుతుందని భావించారు.
బిజెపి మతతత్వ విధానాలు
దేశంలో హిందూత్వ విధానాలను అమ లు చేయటంతో పాటు హిందూ రాజ్యం ఏర్ప డాలని, హిందూ ఆధిక్యత కొనసాగాలని ఆర్‌.ఎస్‌. ఎస్‌ సిద్ధాంత భావజాలంలో స్పష్టంగా పేర్కొన్నది. ఈ భావజాలాన్ని అమలు చేయటానికి సంఘ పరివార్‌తో పాటు రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఆలంబనగా చేసుకున్నది.2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత8ఏళ్లగా మతోన్మాదాన్ని, మత తత్వాన్ని రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావ జాలంతోహిందూత్వ శక్తులు విజృంభిస్తు న్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతూ మైనా రిటీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారు. భారత దేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరిస్తూ అఖండ భారత్‌ స్థాపన కోసం ప్రజలు ముందుకు రావాలని రెచ్చగొడుతున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేప థ్యంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రసం గాలు చేస్తు న్నారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌ సమావేశాలలో హిందూత్వ శక్తులు మైనారిటీలను ఊచకోత కోయాలని ప్రసంగాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో నరేంద్ర మోడీ-యోగిల ద్వయం చేపడు తున్న చర్యలు మైనారిటీలలో భయానక వాతావర ణాన్ని సృష్టించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశాలలో భారతీయ జనతా పార్టీ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చ గొట్టటానికి, మతపరమైన చీలికలు తేవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది. జనవరి 26న జరగబోయే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బిజెపి అనుకూల రాష్ట్రాల శకటాలను అనుమతించి,బెంగాల్‌, తమి ళనాడు,కేరళ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మొద లగు రాష్ట్రాల శకటాలను అను మతించక పోవటం వివక్షతలో భాగమే. 2019లో నరేంద్ర మోడీ రెండవసారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి గత మూడే ళ్లుగా చేస్తున్న నిర్ణయాల ద్వారా ప్రజల మధ్య మత పరమైన అగాధాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నారు. జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ నిబంధనను రద్దు చేయటమేకాక, కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా రద్దు చేయటం దీనిలో భాగమే (ఇప్పుడు కార్పొరేట్లు కాశ్మీర్‌లో భూముల కోసం ఎగబడుతున్నారు).అంతేకాకుండా పౌరసత్వ అంశాన్ని ముందుకు తెచ్చి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చేయడం, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మొదలగు వాటిని ప్రతిపాదించటం మతపరమైన భావాలను రెచ్చగొట్టడంలో భాగమే. పైఅంశాలన్నీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
ఎ.పిలో మతతత్వ శక్తుల కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి మతతత్వ శక్తులు ప్రయత్నిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో భజన సంఘాలు,పండగలు,ఉత్సవాల పేరుతో తమ భావజాలవ్యాప్తికి ఉపయోగించుకుం టున్నా రు. ఇటీవల గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చాలని, కూల్చివేయాలని ప్రచారం ప్రారంభిం చారు. హిందూ ఐక్యవేదిక పేరుతో ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంలో కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ పేరు మార్చాలని పిలుపు ఇచ్చారు. ఆత్మకూరులో మసీదు అంశాన్ని బిజెపి నాయకులు వివాదంగా మార్చి ఘర్షణకు దిగారు. కడప జిల్లా లో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ప్రతిష్టాపనకు వ్యతిరే కంగా క్యాంపెయిన్‌ చేశారు. శ్రీశైలంలో దుకా ణాలు పెట్టుకున్న ముస్లింలపై దాడులు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిజెపి ప్రభుత్వం అన్యా యం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్ట హామీలు అమలు జరపలేదు. విశాఖ పట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణకు పూను కున్నది. ప్రజలలో వీటిపై చర్చ లేకుండా మతో న్మాద భావల వైపు మళ్లించాలన్నది బి.జె.పి ఆలోచనా విధానం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీగాని, ప్రతిపక్ష పార్టీ లైన తెలుగుదేశం, జనసేన గాని బి.జె.పిమతోన్మాద విధానాలను ఖండిరచటం లేదు.
ప్రస్తుత బి.జె.పిప్రభుత్వం ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తనరాజకీయ ప్రాబల్యాన్ని కొన సాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు,లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యాయులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి.
వ్యాసకర్త :శాసనమండలి సభ్యులు,లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌- (బి.కృష్ణారెడ్డి/కె.యస్‌. లక్ష్మణరావు)

అరకులోయలో ఆదివాసీల అంతరంగం

“చూసే కళ్ళకు మనసుంటే-ఆ మనసుకు కూడా కళ్ళుంటే’పనిమట్లు, విత్తనాలు, ధింసా ఆటలు, గిరిజనుల జీవితం చిత్రించే బొమ్మల కొలువులు.. ఇవి అరకులోయ మ్యూజియంలో. చుట్టూ కాఫీ తోటలు, జలపాతాలు, బొర్రా గుహలు,బొంగుచికెన్‌ వంట కాలు కనిపిస్తాయి. కాని తెలుసు కుంటే కాని తెలియనివి,పల్లెలలో ఏడాది పొడుగునా గిరిజనులు చేసుకునే పనిపాట్లు,కట్టుబాట్లు,రాజులు/ప్రభు త్వాలు, ప్రజల మధ్యసంబంధాలు, పండుగలు, మొక్కులు, వంటలు, కష్టసుఖాలు.వాటిలో రాగం,తానం, లయలవలె అల్లుకుపోయిన ఆటపాటలు,కధలు,సామెతలు సాహిత్యం,లెక్కలు,ఆశయాలు ఆదర్శాలు….! అరకు,ఒడియా గిరిజన మాండలికం మాట్లాడే బగతలు, కొటియాలు,కొండదొరలుబీ తమ,తమ భాషలుగల కోదు(సామంత),పోర్జా/జోడియా వగైరా తెగలు నివసించే అరకులోయ బహుభాషల ప్రాంతం.”
అరకులోయలో జీవితకాలం గిరిజనాభివృద్ధికి పనిచేసిన కెనడా దేశీయుడు గుస్తాఫ్‌, ఆదివాసీ ఒడియా,తెలుగు అనువాదంతో తయారుచేసిన ‘ఆదివాసీ పండుగలు’ను 1976 లో పాడేరు గిరిజనాభివృద్ధి సంస్థ ప్రచురించింది. 76-82 మధ్య శక్తి శివరామకృష్ణ సేకరించిన తెలుగు గిరిజన గీతాలు’ మీద, 1991లో సమత రవి ఏర్పాటుచేసిన ప్రసంగాన్ని విన్న, నాటి ప్రాజెక్ట్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌, 200 కాపీలు కొని ఉపాధ్యాయులకు పంచిపెట్టారు. దాన్ని పరివర్ధిత ముద్రణగా తెచ్చే ప్రయత్నంలో 2002లో పాడేరు చుట్టూ తిరుగుతున్నప్పుడు, అప్పుడు Aష్‌ఱశీఅ ఎయిడ్‌లో, ఇప్పుడు అజిత్‌ ప్రేమ్‌జీ (Ajaఎ ూతీవఎjఱ) ఫౌండేషన్‌లో పని చేస్తున్న మిత్రుడు రఘు దగ్గర ఈగుస్తాఫ్‌ పుస్తకం దొరికింది.
ఇదేకాక తెలుగేతర తెగఅయిన కొంధులమీద ప్రముఖ భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి 1960 లో అధ్యయనం చేసారు. 65లో ఈ తెగలన్నిటిమీద జనగణన,ఎథ్నోగ్రాఫిక్‌ నోట్స్‌ తో పాటు,కొండిబా,లంప్తాపుట్టు, జెర్రిల, అన్నవరం గ్రామాలమీద మోనోగ్రాఫ్‌లు ప్రచు రించింది. కొండదొరలమీద రాఘవరావు 75 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్‌ పొందారు.1863,1907లో వచ్చిన విశాఖ డిస్త్రిక్‌ గజెటిర్‌లోగల అన్నిరంగాల చరిత్ర వీటన్నిటికి పునాది.నేటి అనంతగిరి,అరకు, డుంబ్రిగూడ,పెదబయలు,ముంచెంగిపుట్‌ మండలాలు,హుకుం పేట మండలంలో పెదగరువుదాకా,కొండదొరలు పాలించిన ఒక నాటి ఒడిశా జేపోర్‌ సంస్థానంలో పాడువా తాలూకాలోనివి. స్వతంత్రం తరువాత ఈ తాలూకాలో ఈమండలాలు ఆంధ్రప్రదేశ్‌ లో కలిసిపోయాయి. ఆ సంస్థానం ఆఖరి పాల కుడు విక్రమదేవవర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రోచాన్సెలర్‌. వారి బంధువులు కురుపాం, మేరంగి,సాలూరు,ఆంద్ర,పాచిపెంట పాలకులు, తమ రాజ్యాలను ప్రగతి పధంలో నడిపిస్తూ, దిగువనున్న విజయనగరం,బొబ్బిలి సంస్థా నాలకు పోటీగా,విశాఖనగరం అభివృద్ధి చేసారు. ఇక్కడి ఒకనాటి కాశీపట్నం జమిందారీలోది,ఘాటీ ఎక్కుతుంటే వచ్చే, అనంతగిరి మండలంలో పుణ్యగిరి తీర్ధం/ధారల గంగమ్మ. అక్కడ గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌లో ‘విరాట పర్వతం’అని ఎవరో నోట్‌ చేసారు. నిజమే. ఈ ప్రాంతం 14శతాబ్దివరకు వడ్డాది రాజధానిగా పాలించిన మత్స్యరాజుల విరాట రాజ్యం. వారూ ,జేపోర్‌ వారు బంధువులు. విరాటరాజ్యంలో అజ్ఞాత వాసం గడుపుతున్న పాండవులుగా గిరిజనులు తమను పోల్చుకుంటూ ‘పంచ పాండవుల పంట-దుర్యోధనుడి వంట’ అంటూ భారతకదను తమకు అనువుగా మార్చుకుని పిప్పలి, పసుపు,చిక్కుళ్ళు,అల్లం,అనాస వగైరా తము ప్రత్యేకంగా పండిరచే పంటల దోపిడిని ‘నందిపదం’లో పాడుకుంటారు.ఆసియా అంతా, పాండవులు, వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉన్నారు.అలాగే ధారల గంగమ్మ, అటువంటి క్షేత్రమే పాడేరు మండలంలో మత్స్యగుండం. ఈ నీటి వనరులు ప్రపంచ మంతా జలకన్యలవి, (ఙఱతీస్త్రఱఅం, అవఎజూష్ట్రం, ఎవతీఎaఱసం), క్రూరజంతువులతో నిండిన అడవులు కొండ రాజులు/దేవతలవిగా భావించి మొక్కే, మన ఆచారాల మూలాలు,గిరిజన సంస్కృతిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ‘తెలుగు గిరిజన గీతాలు’(91),పరివర్ధిత ముద్రణ ‘కొండకోనల్లో తెలుగు గిరిజ నులు’ (2007) తెలుగు తెగల ఈ వారసత్వాన్ని, నందిపదం వంటి వారిసాహిత్యంలో వ్యవసాయ విజ్ఞానం, సంస్కృతిని సమగ్రంగా తెలియచేస్తూ అరకులోయ సంస్కృతినికూడా అర్ధం చేసుకోటానికి సహకరిస్తుంది. తెలుగు గిరిజనుల నుడికారం తెలిస్తేనే,ఇతర తెగల భాషలు మనకు బాగా తెలుస్తాయి అంటారు భద్రిరాజు కృష్ణమూర్తి.. ఇక గుస్తాఫ్‌ పుస్తకం గిరిజన జీవితాన్ని నెలలవారీగా వర్ణిస్తూ, మనకు తెలియని గిరిజనుల ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. సహజ వ్యవసాయ విధానం అమలు చేస్తున్న మితృలకోసం ఇక్కడి వ్యవసాయ సంస్కృతిని పరిచయం చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్న గిరిజనులకోసం,ఈ పుస్తకాన్ని ముందు సంక్షిప్తంగా పరిచయం చేసి, క్రమంగా మిగిలిన పరిశోధనలను జోడిరచటం కొన సాగుతుంది..
చైత్రం/ఏప్రిల్‌-మే
‘విరాటరాజు దేశం ఇటికె పండుగలు, కాశివారి దేశం గంగ పండుగలు’ అని నందిపదం’లో పాడుకునే, ఈ నెలలో చేసే ఇటుకల/వేటల పండుగ గిరిజనులకు పెద్ద పండుగ .ఈ నెలలో ఆడవాళ్లదే రాజ్యం.ప్రతి ఇంటి మగ వాడు, తెల్లవారగానే ఆడవాళ్లు ఊగటానికి ఉయ్యాల కడతాడు.మగవారిని వేటకోసం కొండకు తరిమాక,ఆడవారు పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఈ పండుగకుముందు, కొండమామిడికాయలు తినరు.ఫాల్గుణం/పొగు నులో హోలీ కాల్చిన రోజునుండి పాడే సంగడి ఆటపాటలు ఈ నెలతో ముగుస్తాయి.ఆటకు రానివారిదగ్గర ఆడవారు పన్ను(పెజోర్‌) వసూలు చేస్తారు.మఖ,కృత్తిక,చిత్త.స్వాతిు-ఇలా ఎవరికి ఏ నక్షత్రం అనుకూలమో చూసి విత్తనాలు వేసుకుంటారు.
వైశాఖం మే-జూన్‌
ఈ నెల వేసగిలో వర్షాలు వడగండ్లతో పడతాయట.పెళ్ళిళ్ళ కాలం.ప్రకృతి అంతా పెండ్లిలో అయిరేని/బోయ్‌ కుండలలాగా రంగురంగులతో నిండి ఉంటుంది.వేటలు ముగుస్తాయి. గొట్న పండుగ చేసి,తోపహల్వా వండి, గౌడు పశువులకాపు మొదలు పెడ తాడు.గొట్న అంటే భోజనంకుండ. ఈ పండుగ తరువాతే పొలంపనిచేసే వారికి భోజనం తీసుకెళ్లటం మొదలు పెడతారు. పుష్య మాసం లో నియమించుకున్న పని వాళ్ళందరికీ ఆయా పొలాలు కేటాయిస్తారు.ఇటుకల పండుగలో వసూలు చేసిన పన్ను డబ్బులతో ఆడవారు పిట్టు వండుకుంటారు.
లండిజేట్‌/జ్యేష్టం
లండి/సామ పొట్టిజడలు వేస్తుంది.ఈనెలలో పొర్ణమి అయ్యాక సామలుచల్లరు.మెట్టుధాన్యం, చోడిలాంటి కొద్దిరోజుల పంటలు చల్లుతారు. ఆషాఢంబీమేఘాలు కమ్మి వర్షాలు కురుస్తాయి. గింజలు నూర్చేటప్పుడు పంట దిగుబడి ఎక్కువ గా ఉండాలని జన్ని పండుగ చేస్తారు. అడవి జంతువుల బారిన పడకుండా వచ్చిన పశువులకు నైవేద్యం పడతాడు.సామ పంటతో పూజారి నైవేద్యం పెడతాడు.
భాద్రపదం/బందపని
జాకరిమెట్టలో కొర్రపంటకు కొత్తల పండుగ చేసారు. కొత్తకుండ,కొత్తజిబ్బి,కొత్త తెడ్డులతో, తరగాయ్‌ దుంపలు,గుమ్మడికూర,కొత్త చింత కాయజాకరికి పెడతారు.’లోల్లోసే అన్నవారికి లోపలొక పిల్ల,సైలోరే అన్నవారికి చంకనొక పి ల్ల’లోల్లోసి/సైలోరి పాటలు మొదలుపెడతారు.
ఓస/ఆశ్వయుజం
పెద్ద పెద్ద వర్షాలు కురుస్తాయి.కొత్తధాన్యం అందుతుంది. పాలకులలో ఇసుకపోసి విత్తనాలు వేసి,పసుపునీళ్ళతో పెంచి మొలకె త్తాక ఆ పువ్వులను బల్లి/లక్ష్మి పువ్వులు అంటారు.ఆ పూలతో నేస్తం కట్టుకుంటారు. బల్లిపాటలు పాడతారు.ఈ నెలనుండి చలి మొదలవుతుంది. పంటలు నేలకొరిగి పరుచు కుని పోతాయి.ఓస అంటే ఒడియాలో పరుచు కొనుట అని అర్ధం .
దసరా
దసరాలో దుర్గ/మెరియా పడుతుందని నమ్మకం.జంతువులు కూడేనెల.నెలపొడిచి పదిరోజులయ్యాక (దశమి)దసరా పండుగ చేస్తారు.
దీపావళి
పంటలన్నీ పచ్చగా పండుతుంటాయి. జల కన్యల ప్రతినిధి కప్పదేవతకు పండుగ చేస్తారు. దీపావళి నాలుగురోజులు అన్నంపప్పు మాత్రమే తింటారు.
మార్గశిర
మంచు ముద్దలు ముద్దలుగా పడుతుంది.ఇళ్ళు, వాకిళ్ళు అలకటం తలంటి పోసుకోటం,లక్ష్మి దిగుతుంది. మూడురోజులు బల్లి పండుగ చేస్తారు.బల్లి నాటకాలు అడతారు.’బంగరాల బల్లి,బాలగొంతెమ్మ’ అంటూ పాండవుల తల్లి కుంతిని పిలుచుకుంటారు తెలుగు గిరిజనులు
పుష్యం/సంక్రాంతి
దీపావళికి తలస్నానం చేసినప్పటినుంచి మొదలైన దిమ్సా ఆటలు,పాల్గుణ పుష్య మాసాలలో ముగుస్తాయి.డప్పు,ఢంకా,కిరిడి, సన్నాయి,పిల్లనగ్రోవి,జోడుకొమ్ములు వాయిద్యాల కనుగుణంగా14 గతులలో గిరిజన జీవితాన్ని అభినయించేదే ధింసా ఆట..ఆడ వాళ్ళవి సైలోరిపాటలు,మగవాళ్ళది కోలాటం.
మాఘం
‘మాఘంలో మేఘం ఫాల్గుణంలో వర్షం’. పుట్టమట్టితో ఒకనంది/ఎద్దును, దుంపలతో ఒక నందిని తయారుచేసి వాటికీ పెళ్లి చేస్తారు. బస్కి పూలతో నేస్తాలు కట్టుకుంటారు.
ఫాల్గుణం /పొగును.
దీపావళిలో మొదలైన చలి పొగును మంటలో కాలిపోతుంది.నందిపండుగలో ఇచ్చిన విత్త నాలను హోలీ బూడిదలో వేస్తారు.హోలీ పాటలు పాడతారు.దుక్కులు మొదలు పెడతారు.
వ్యవసాయ వారసత్వం సమత టీంలో, దేవుళ్ళు సంజీవని సంస్థ,1990 నుండి రాష్ట్రమంతటినుండి విత్తనాల జాబితా పోగుచేయిస్తున్న డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ స్పూర్తితో డుంబ్రిగూడ మండలంలో ప్రారం భించిన విత్తనాలసేకరణ, పండుగలు చేయ టం,కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందింది.ఈ సొసైటీ కృషిలో సహకరించిన కామేశ్వర శర్మ, రవి విశ్వవిద్యాలయాలలో పర్యావరణ,వృక్ష శాస్త్రవేత్తలు. ఇతర శాస్త్రవేత్తలు,సంస్థలు తమ పక్కనే ఉంటూ చేసినకృషిని,అందరు శాస్త్రవేత్త లలాగే వీరుకూడా పట్టించుకోలేదు భద్రిరాజు కృష్ణమూర్తి నాయకత్వంలో 1960లోనే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రైతులనుండి సేకరించిన పదసంపదతో కూర్చిన వ్యవసాయ మాండలిక వృత్తి పదకోశంలో,427 వడ్లరకాలు,100 రకాల జొన్న,18 రాగి,ఆరికలు 5,కొర్ర 37, ఉలవలు 13,బొబ్బర 8,సెనగలు 8,నువ్వు 19,ఆముదాలు 7,చెరకు 2,పత్తి 12,పొగాకు 15,మిరప 10,కొబ్బరి 51,అరటి 15,నిమ్మ 8 రకాలు పేర్కొన్నారు. అయితే ఈ పదకోశంలో గిరిజనప్రాంతాల వివరాలు లేవు. దేవుళ్ళు వగైరాలు తయారు చేసిన విత్తనాల జాబితా ఈలోటును పూరిస్తుంది.భద్రిరాజు కృష్ణమూర్తి గారి ఇల్లు,నేడు వ్యవసాయరంగంలో పనిచేస్తున్న ‘వాసన్‌’ వగైరాల మాతృసంస్థ Aష్‌ఱశీఅ టశీతీ షశీతీశ్రీస ంశీశ్రీఱసaతీఱ్‌వ పక్కనే ఉండేది.కానీ ఆయన వ్యవసాయపదకోశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ పదకోశాల నిర్మాణంలో పాల్గొన్న చేకూరి రామారావు,బూదరాజు రాధాకృష్ణ పత్రికా రంగంమీద విశేష కృషి చేసారు.కాని వారు ఈ రైతుల పదసంపదను పత్రికలకు గుర్తుచేయ లేదు.Rబతీaశ్రీ సవఙశీశ్రీశీజూఎవఅ్‌,ూబ్‌్‌ఱఅస్త్ర శ్రీaర్‌ ్‌ష్ట్రఱఅస్త్రం టఱతీర్‌(83)బీఖీaతీఎవతీం ఖీఱతీర్‌(89) పుస్తకాలు రాసి, రైతును గూర్చి ముందు తెలుసుకోవాలని ఉద్బోధిస్తూ ూRAవిధానాలను ప్రచారం చేసిన రాబర్ట్‌ చాంబర్స్‌తో పనిచేసిన శాస్త్ర వేత్త సంఘి ( మేనేజ్‌) ఈ సంస్థలతో సన్నిహితంగా పనిచేసేవారు.అప్పట్లో పెర్మా కల్చర్‌ బిల్‌ మోలిసన్‌తో వీరందరూ ఒక కార్య శాల నిర్వహించారు.తూర్పు కనుమలలో చెద పురుగుల సమస్యగూర్చి అడిగినపుడు,చెదలున్న భూముల్లో చింత,పనసలు బాగా వస్తాయి. అవికూడా పంటలే.ప్రకృతికి ఎదురీదవద్దు అని, బిల్‌, హెచ్చరించారు. క్రమంగా ఈ ప్రాధా న్యతలు, పద్ధతులు మారిపోయాయి. అత్యధిక వర్షపాతం పొందే ఈప్రాంతంలో కొండ వాగులు,జోరెలగర్భంలో మళ్ళు కట్టి వరి పండిస్తారు.ఈ జోరెలలోనే నీటిమొక్కలు టవతీఅ, షవషaసలు అనాదిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు, కొండప్రాంతాలలో తీవ్రసమస్య భూమికోతను అరికడుతున్నాయి. వ్యవసాయం పెరిగినకొద్దీ నరికి వేయటంతో ఇవి అంత రించాయి. .హైదరాబాద్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగరత్నం నాయుడు, ఇటువంటి షవషaసలను, అడవులలో దొరికే aతీషష్ట్రఱస పూలను పెంచి అంతర్జాతీయ మార్కెట్‌ లో అమ్ముతున్నారు. జీలుగుకొమ్మలను పోలిన ఈ టవతీఅను గిరిజనులు ‘కన్నెజీలుగు’ (జలకన్యల),నీటిమీద పరుగెత్తే జూశీఅస ంసa్‌వతీ ను ‘గన్నికల పురుగు’ అంటారు. వారి మనో ప్రపంచంలో కప్ప,చేప,ఎండ్రిక మొదలైన జల చరాలు జలకన్యల ప్రతినిధులు.విశాఖ మన్యం లో అత్యున్నత శిఖరంపేరు ‘ఎండ్రిక’ పర్వతం. విశాఖ గజేటిర్‌, జేపోర్‌ రాజులు వారణాసి నుండి మాలీలను రప్పించిపూలు,పొందరల చేత కూరగాయలు ,వ్యవసాయానికి అవసరమైన ఇతర వృత్తులు ప్రోత్సహించారు అని తెలియ చేస్తుంది.. జేపోర్‌, అత్యధిక వరివంగడాలుగల ప్రాంతంగా శాస్త్రవేత్త రిచారియా 1970 లలోనే ప్రపంచానికి చాటారు. హరితవిప్లవం వ్యాప్తిలో పడి నిర్లక్ష్యం చేసిన,ఈ జన్యు సంప దను, ఆ విప్లవ పితామహుడు స్వామినాథన్‌ ఫౌండేషన్‌, ఇక్కడి 340 వరిరకాలు,వాటిలో 24 సువాసన కలవి,27 వరద,2 నిలవ నీళ్ళను,1 కరువును తట్టుకునేవి.8 రకాలు చిరు ధాన్యాలు,9 రకాల పప్పులు,5 నూనె గింజలు,3 పిచు చెట్లు,7 రకాల కూరగాయలు జాబితా ఇంతవరకు తయారు చేసింది.. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఖీAూ), భారతదేశంలోగల మూడుప్రదేశాలలో ఒకటిగా,జేపోర్‌ వ్యవ సాయ వారసత్వాన్నిగుర్తించింది.దశాబ్దాలుగా ఈ అరకులోయలో నేచర్‌,వికాస మొదలైన స్వచ్చంద సంస్థలు నాబార్డ్‌ మొదలైన సంస్థల విధానాలబట్టి వ్యవసాయాభివృద్ధి చేస్తూ , రైతు సంఘాలు నడిపిస్తున్నారు.మారుమూల ఉన్న సొవ్వ పంచాయితీలో పండే కూరగాయలను విశాఖలో అమ్మించటంలో దేవుళ్ళు విశేషమైన కృషి చేస్తున్నారు కాని,రవాణా ఖర్చులు పోగా మిగిలేది తక్కువ అని గిరిజనులు వాపోతు న్నారు. కేరళలో ఈ మాత్రంకూడా భూములు లేని గిరిజనులు ఇంటిచుట్టూ మిరియం పండిర చుకుని గడిస్తున్నారు. ఇక్కడ భూమికంటే అడవి ఎక్కువ.కాబట్టి అటవీ హక్కులగుర్తింపు ద్వారా అడవి కాపాడుతూ లాభం పొందే ప్రయత్నం చేయాలి, ఇందుకోసం గతంలో ధింసా గిరిజన సమాఖ్య 27 పంచాయతిలలోగల 217 అవాసాల సంప్ర దాయ వనరులపటాలు తయారుచేసింది. పోడు భూముల కొలతలు తక్కువగా చూపి నందుకు ఆందోళన జరి గింది.. ఆ కృషిని కొనసాగించాలి.ఆ ప్రయత్నం గ్రామసభలకు ప్రాణం పోస్తుంది. సరిjైున భూమి హక్కుల నమోదు,ఆ పధకాలకు ఇచ్చే రాయితీలను పొందటంలో న్యాయం చేస్తుంది. ‘వాసన్‌’ సొవ్వ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి నిధులకోసం ప్రయత్నిస్తున్నది. గ్రామసభలతో సంబధం లేకుండా తామే లభ్దిదారులను ఎంచుకొని,వారి ఖాతాలో ఇంటర్‌ నెట్‌ ద్వారా పధకాల తాలూకు సొమ్ము జమచేయటం,అవి దక్కించుకోటంలో అవకతవకలు, పడేపాట్లు,లోపాలను ‘నగదు బదిలీ సఫలమా,విఫలమా’ వ్యాసంలో (ఆంధ్రజ్యోతి) లో లిటేక్‌ చక్రధర్‌ ఎత్తిచూపారు. సహజ వ్యవసాయం ప్రకారం పేడపానకం వగైరా తయారుచేయటం గిరిజనులు నేర్చు కుంటుంటే , ఇదే సమయంలో కంపనీలు తయారు చేసిన ఈ పోషకాలనుకూడా అధి కారులు పంచుతున్నారు.సహజ వ్యవసాయం వల్ల పెట్టుబడులు తగ్గాయి కాబట్టి దిగుబడి తక్కువైనా పరవాలేదు అని గిరిజనులు అనుకుంటున్నారు.. గిరిజన సంక్షేమశాఖలో పనిచేసిన అధికారులు ప్రభుత్వకార్యక్రమాలలో తమ అనుభవాలతో అనేక రచనలు చేసారు. కాని వారి రచనలలో గిరిజన సంస్కృతిగూర్చి పొడి మాటలు మించి ఏమీ ఉండదు. అటు వంటి అధికారుల అధ్వర్యంలో నడిచే IుణA పాఠశాలలో చదివి ఉపాధ్యాయుడైన, సవర రచయిత మల్లిపురం జగదీశ్‌ ‘స్వతంత్రం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాలలో,నాలుగు దశాబ్దాల గిరిజనాభివృద్ధి సంస్థల పాలనలో గిరిజనుడి పరాయీకరణ ముమ్మరమైంది. చట్టాల అమలు ప్రశ్నార్ధకమైంది.అతడు లబ్దిదారుగా మారి, దరఖాస్తు దారుగా క్యూలో నుంచున్నాడు. గిరిజనసాహిత్యం అంటే ఉద్యమసాహిత్యం అనే పేరు పడిపోయింది. గిరిజన విద్యాలయాలనుండి, తన సంస్కృతి గురించి చెప్పుకోగల గిరిజన రచయిత ఎందుకు రాలేదు? (‘బహుళ’.పెర్స్పెక్టివ్స్‌ ప్రచు రణ 2019) అని నిలదీస్తున్నాడు.ఇలా.. ప్రజల జ్ఞానాన్ని, సంస్కృతిని పట్టించుకోకుండా, శాస్త్ర వేత్తలు,అధికారులు,సంస్థలు, ఎవరిదారిది వారుగా‘అభివృద్ధి’చేస్తూ జనాన్ని ముష్టివాళ్ళుగా మార్చారు. వీరంతా, ఇటువంటి ప్రశ్నలే వేసుకుని, ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సహజవ్యవసాయం ప్రచారం చేసే ప్రవక్తలు, సంస్కృతి అధ్యాత్మికతలంటూ పెద్ద పెద్ద ఉపదేశాలిస్తారు. వారిలో ఒకరు, వికారా బాదులో ఈ వ్యవసాయంచేసే విజయ రాంగారు, గత సంచికలో తెలియచేసినట్లు, అక్కడ చిరకాలంగా పనిచేసేణణూవలెనే,అక్కడి ప్రజలు పాడుకునే పాటలు,పండుగలు తెలుసు కునే ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రసంగా లలో అక్కడి గ్రామీణులు తలుచుకునే పాండ వులు,పర్వతాల,అనుముల బ్రహ్మారెడ్డివంటి కధలు,కార్తెలు,దుక్కులు,సామెతలేవీ నిపించవు. కొత్త పరిభాషను,పదజాలాన్ని,పండుగలు, యాత్రలను అలవాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారి వీరభద్రుడు తన ‘నేను నడిచిన దారులు’లో, అరకులో అభివృద్ధిని అధ్యయనం చేయటానికి వచ్చిన విద్యార్ధి బృందానికి,పైన చెప్పినట్లు, చుట్టూ కనిపించే విషయాలు వివరిస్తారు. గుస్తాఫ్‌ చేసే అభివృద్ధిని స్కేల్‌ అప్‌ చేయాల్సిన అవసరం బోధిస్తారు. కాని గుస్తాఫ్‌ గ్రంధస్తం చేసిన సంస్కృతి ప్రసక్తి తేలేదు..దేవుళ్ళు క్లాస్‌ మేట్‌,నేడు కాకినాడలో పశుసంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణగారు,తన కుమార్తె అభివృద్ధి (ణవఙశీశ్రీశీజూఎవఅ్‌ ూ్‌బసఱవం) విద్యార్ధి వైష్ణవితో, అరకులోయలోని సొవ్వలో, అనకాపల్లి వ్యవసాయశాఖవారు,పోషక సామగ్రి,పనిముట్ల పంపిణికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు వారిద్దరితో సంస్కృతిలో ఈ కనిపించని విషయాలు,చరిత్ర గుర్తు చేసే వీలు దొరికింది.విశాఖలో డుంబ్రి గూడ మండలం సర్పంచ్‌లతో వాసన్‌ నిర్వ హించిన సమావేశాలు,చొరవ తీసుకుని అరకు లోయలో చేసిన పర్యటనలో చూసిన పరిశీల నలు,60ఏళ్ల అభివృద్ధి చరిత్ర నేప ధ్యాన్ని కాగి తం మీద పెట్టటానికి తొందర పెట్టాయి.- (రచయిత : శక్తి స్వచ్ఛంద సంస్థ
వ్యవస్థాపకులు,శివ రామకృష్ణ

బడుల్లో కరోనా భయం..తగ్గిన హాజరుశాతం..!

” పిల్లల్ని బడికి పంపాలంటే భయం, ఆపేస్తే చదువు ఏమైపోతుందోనని దిగులు’ .ఏపీలో తల్లితండ్రులు ‘‘మా పిల్లల్ని స్కూల్‌కు పంపినా పంపకపోయినా మేం తప్పు చేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా, పంపించక చదువులో వెనుకబడినా తల్లిదండ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయామని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు. కరోనా సమయంలో పిల్లలను స్కూలుకు పంపించడం గురించి విశాఖ మురళీనగర్‌కు చెందిన సరళ ఈ మాట అన్నారు. ‘‘కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటాయించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’ అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాల టీచర్‌ రవి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలుస్తోంది. అయితే, పిల్లల చదువులు పాడవకుండా, వారు కరోనా బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు విషయాలు వెల్లడిరచారు” .
ఏపీ రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ కుదిపే స్తుంది. దీనిప్రభావం అధికంగా పిల్లలపై చూపడం తో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు భయాం దోళనకు గురవుతున్నారు. దీంతో పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడు తున్నా రు. బడికి వచ్చిన పిల్లలు కరోనా బారిన పడుతుం డటంతో..ఏపీవైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాద నలు చేసింది. ఏదైనాస్కూల్లో ఒకేరోజు ఐదు పాజి టివ్‌ కేసులు నమోదైతే..ఆస్కూలును మూసి వేయాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు, టీచర్లకు క్వారంటైన్‌ పూర్తయ్యేవరకు క్లాసులు నిర్వ హించవద్దని…లేదంటే వైరస్‌వ్యాప్తి తీవ్రమవు తుం దని హెచ్చరించింది. పాజిటివ్‌ కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే శానిటైజ్‌ చేసి ప్రతిఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని సర్కార్‌ సూచించింది. అలాగే హాస్టళ్లు,రెసిడెన్షియల్‌ పాఠ శాల్లలోని విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే సమీ పంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే బాధ్యతను వార్డెన్లు,ప్రిన్సిపాల్స్‌ తీసుకోవాలని సూచిం చింది. ప్రతిస్కూల్లో టీచర్లు, ఇతర సిబ్బందికి రెండు వారాలకు ఒకసారితప్పని సరిగా కరోనా టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. చిన్నారుల్లో ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసేలా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. టెస్టు లకు సంబంధించిన సదుపాయలను తామే కల్పిస్తా మని ఏపీఆరోగ్య శాఖ తెలిపింది.‘పిల్లల్ని బడికి పంపాలంటే భయం,ఆపేస్తే చదువు ఏమైపోతుం దోనని ఏపీలో తల్లితండ్రులుదిగులు పడుతున్నారు. ‘మాపిల్లల్ని స్కూల్‌కు పంపినా పంప కపోయినా మేం తప్పుచేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా,పంపించక చదువులో వెనుకబడినా తల్లిదం డ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేక పోయా మని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’.కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటా యించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాలటీచర్‌ రవి అన్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలు స్తోంది.
చదువులో వెనుకబడుతున్నారు
చాలా కాలంగా బడులకు దూరమైన పిల్లల చదువులో ఇప్పటికే వెనకబడిపోయారు. చాలా మంది ఇంతకు ముందు నేర్చుకున్నవి చెప్ప లేకపోతున్నారు. కొందరు అలవాటు తప్పడంతో ఏం చెప్పాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. కొందరు పిల్లలు తెలిసినవి గుర్తు తెచ్చుకోవడంలో ఆలస్యం అవుతోంది. పిల్లల్లో సమస్య అయితే ఉంది. మరోవైపు కార్పొరేట్‌ స్కూళ్ల లో చదివే పిల్లలతల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు ఇంటి దగ్గరైనా మంచి శిక్షణ ఇవ్వగలుతున్నారు. కానీ,ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు అన్‌లైన్‌ క్లాసులు, తల్లిదండ్రుల శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించి తరగతులు నిర్వహించాలి అని ఏపీ మున్సి పాల్‌ టీచర్స్‌ఫేడరేషన్‌ (ఎఫ్‌ఏపీటీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్ధ్‌ చెప్పారు. ఏ ప్రభుత్వ పాఠ శాలకైనా అక్కడున్న విద్యార్థులు, పాఠశాల విస్తీర్ణం లెక్కల ప్రకారం ప్రభుత్వం గ్రాంట్‌ రిలీజ్‌ చేస్తుంది. దానిని స్కూల్లోని మరుగుదొడ్లు పరిశుభ్రత, కరెంట్‌ బిల్లులు చెల్లింపులు,ఇతర అవసరాలకు వాడుతుం టారు. ఈనిధులనే కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కులుకొనడానికి వాడమంటున్నారని…కానీ నాడు-నేడు పథకంప్రారంభమైన తర్వాత ఆ నిధులు విడుదల కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి.‘‘థర్డ్‌ వేవ్‌ నేపథ్యంతో ప్రతి పాఠశాలకు సబ్బులు,శానిటైజర్లు,మాస్కులు,థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్‌ లను పాఠశాల అభివృద్ధి నిధులతో కొనుక్కోమని అంటున్నారు. నాడు-నేడు పథకం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధినిధులు ఇవ్వడం లేదు. ఒకటి రెండు నెలలంటే,టీచర్లు తలాకొంత వేసుకుని భరించగలం.కానీ నెలనెలా అంటే కష్టమవుతుంది. అలాగే రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకున్న టీచర్లతోనే టీచింగ్‌ చేయించాలి. టీచర్లందరికీ వందశాతం వ్యాక్సినేషన్‌ వెంటనే పూర్తి చేయాలి.మిడ్‌ డే మిల్స్‌ కూడా కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశ ముంది.అందుకే పిల్లలకు డ్రై రేషన్‌ ఇవ్వడం మంచిదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళంలో 57,విజయనగరం31,విశాఖలో 68, తూర్పుగోదావిరిలో 49,పశ్చిమగోదావరిలో48, కృష్ణాలో36,గుంటూరులో55,ప్రకాశం13, నెల్లూరు 30,చిత్తూరు55,కర్నూలు44,కడప 42, అనంత పురం28…ఇలామొత్తం556మంది ఉపాధ్యా యులు కరోనాతో చనిపోయారు. ఇటీవల మరణిం చిన వారిని కూడా కలుపుకుంటే మరో 20శాతం పెరుగుతారు.విద్యార్థుల్లో కూడా కొందరు చనిపో యారు. అయితే ప్రస్తుతం పిల్లలు,ఉపాధ్యాయు లలో ఒకరినుంచి ఒకరికి కరోనాసోకకుండా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ పాఠాలు చెప్తున్నాం. అయినా భయం వెంటాడుతూనే ఉంది అని ఎఫ్‌ఏపీటీవో ప్రతినిధి రవిసిద్ధార్ధ్‌ చెప్పారు.
కొన్ని స్కూళ్లలో భయాలున్నా…హాజరు పెరిగింది
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలాఎక్కువ ప్రాణాలు బలి తీసుకుంది. అందుకే, సెకండ్‌ వేవ్‌ తర్వాత బడులు ప్రారంభిచగానే తమపిల్లలను పంపించడానికి తల్లి దండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే క్రమంగా హాజరు శాతం పెరిగింది. అదే సమయం లోనే కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ వార్తలు వస్తుండటం వారిలో ఆందోళన కలిగిస్తోంది. బడులు ప్రారం భించినప్పుడు 20శాతం మాత్రమే హాజరయ్యారు. అలా పిల్లల హాజరు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 85శాతానికి చేరుకుంది. మళ్లీఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయం మొదలైంది.కోవిడ్‌ భయంతో స్కూళ్లు మూసేస్తే, ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతారు.అయితే,ప్రభుత్వం కోవిడ్‌ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంది. తల్లిదం డ్రులు ఎలాంటి సంకోచం లేకుండా తమ పిల్లలను బడికి పంపవచ్చు అని విశాఖ జిల్లా విద్యాశాఖా ధికారిణి ఎల్‌.చంద్రకళ చెప్పారు. కరోనా నిబం ధనల అమలుకు పాఠశాలల రీ ఓపెన్‌ మార్గదర్శ కాలు జారీ చేశాం. వీటి అమలుపై కూడా పర్య వేక్షణ ఉంది. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం బడుల్లో తరగతులు నిర్వహించాలి. అలాగే, ఏదైనా పాఠశాలలో ఐదు కంటే ఎక్కువ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వస్తే క్వారంటైన్‌ పీరియడ్‌ కింద 14రోజు లు మూసివేస్తున్నామఅని విశాఖ డీఈవో వెల్లడిర చారు. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో పిల్ల లను స్కూళ్లకు పంపడం ఎంతవరకు సేఫ్‌ అనే ప్రశ్న తల్లిదండ్రులను వేధిస్తోంది. స్కూళ్లకి పంపక పోతే పిల్లలు విద్యాసంవత్సరం నష్టపోతారనే భయం,పంపితే కరోనా వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని మా పిల్లలను బడికి పంపుతున్నాం. అయితే స్కూల్‌ గేటు దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌,మాస్కులు వంటివిచూస్తున్నా…బడి లోపల,తరగతి గదుల్లో ఎలాఉంటుందో…? అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారోననే అందోళన ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించకపోవడం కూడా చూస్తున్నాం అని విశాఖ మురళీనగర్‌ కు చెందిన సరళ చెప్పారు. సరళ కూతురు చాందిని మాధవదార జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది.ఆన్‌లైన్‌ తరగ తులే మంచిదని సరళ భావిస్తున్నారు. మా పిల్లలు చదివే స్కూల్లో టీచరుకు కరోనా వచ్చింది. ఆ సమయంలో చాలా టెన్షన్‌ పడ్డాం. మా పిల్లలకు కూడా వచ్చిందేమోనని అనుకున్నా. మా అమ్మనాన్న కూడా పిల్లలను బడికి పంపివాళ్ల ప్రాణాలతో ఆడుకుంటారా అని తిట్టారు. దాంతో మేం చేస్తున్నది సరైనదో,కాదో అర్థం కావడంలేదు. అన్‌లైన్‌ తరగ తులే బెటరని మాకు అనిపిస్తుంది అన్నారు. ఏదైనా స్కూల్లో విద్యార్థులు,ఉపాధ్యాయుల్లో కరోనా పాజి టివ్‌ వస్తే, అది ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో తెలుసుకోవడంకష్టం.పైగా బడిలోకరోనా సోకిం దా? కరోనాతో స్కూలుకు వస్తే, అది మిగతావారికి వచ్చిందా?అనేది చెప్పడం కూడా కష్టమని వైద్యులు అంటున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో పెద్దలు,సెకండ్‌ వేవ్‌లో యువత,మధ్యవయస్కులు కోవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పుడు వీరిలో చాలా మందికి వ్యాక్సినేషన్‌ అవ డంతో,థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపే అవకా శం ఉంది. బడులకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు, మిగతా సభ్యులందరూ వ్యాక్సీన్‌ వేయించుకున్నారా అనేది తెలుసుకోవాలి.ఆడేటా ప్రతిస్కూల్లో ఉం డాలి. రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకోని తల్లిదం డ్రుల పిల్లలను బడికి పంపించకూడదు. లేదంటే వారి నుంచి పిల్లలకు…వారి నుంచి మిగతా పిల్ల లకు కరోనా సోకే అవకాశం ఉంది అని విశాఖ లోని చిన్నపిల్లల వైద్యులు సతీష్‌ చెప్పారు. పిల్లలకు కరోనా గురించి అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని డాక్టర్‌ సతీష్‌ భావిస్తున్నారు. ప్రతి స్కూల్లో వారానికి ఒకసారి కరోనా టెస్టులు చేయాలి. అదే సమయంలో సోషల్‌ డిస్టైన్సింగ్‌, శానిటైజేషన్‌, మాస్కులు ధరించడం లాంటి అంశాలపై తరగతి గదుల్లో పిల్లలతో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలి. కోవిడ్‌ ప్రొటోకాల్‌పై అవగాహన లేని పిల్లలకు శిక్షణ ఇవ్వాలి అన్నారు. అయితే కోవిడ్‌ నిబంధ నలు పాటించకపోతే ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌లో పిల్లలపై ప్రభావం అధికమయ్యే అవకాశాలున్నాయని డాక్టర్‌ సతీష్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కోవిడ్‌ ప్రొటో కాల్‌ పాటిస్తున్న వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నా రు. ఏదిఏమైనా కనీసం మరోఏడాది పాటైనా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించడం మంచిదని ఆయన సూచిం చారు.జిఎన్‌వి సతీష్‌

క‌రోనా మహామ్మారి మార్చినాటికి తగొచ్చు..

దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కోత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడోముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మార్చినాటికి దీని తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదు. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్రప్రభావం చూపించొచ్చు.కేసులు ఆకస్మాత్తుగా..భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. పరీక్షలు చేయడం,రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం,ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యశాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడిరచారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండువారాల్లో గరిష్ట స్థాయికి చేరొచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్‌ ఎపిడెమిలాజిస్ట్‌ గిరిధర్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరి తొలివారం మధ్యలో కరోనా ఉధృతి గరిష్టస్థాయిలో ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా దశతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్దంగా ఉందని అన్నారు. ఆరోగ్య మౌళిక సదుపాయాలను మెరుగుపడటంతోపాటు వ్యాక్సిన్లు కూడా వైరస్‌ ఉధృతిని తగ్గించేందుకు దోహదపడతాయని చెప్పారు.
దేశ వ్యాప్తంగా కరోనా కలకలం కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు ఒమిక్రాన్‌ కేసులు దేశంలో ఒమిక్రాన్‌ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. అయితే కరోనా తీవ్రత మార్చినెలలో తగొచ్చుని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుపోతున్నాయి. అత్యధికంగా మహా రాష్ట్ర,ఢల్లీిలో ఒమిక్రాన్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటికే ఢల్లీిలో వారాంతపు కర్ఫ్యూ విధించగా..ముంబాయిలోనూ కఠిన ఆంక్షలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పాక్షికంగా కర్ఫ్యూ అమలువుతంది. ఇదిలా ఉండగా…నిబంధనలతోనే కరోనా మూడో దశ ఉధృతిని అదుపులోకి తేవొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ ఆంక్షలతోపాటు వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టీకా పంపిణీని ముమ్మరం చేస్తే కేసుల పెరుగుదలను ఆరికట్ట వచ్చని అంటున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతోపాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదువుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కోవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది అని కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా వెల్లడిరచారు.
ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌
కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహమద్‌ పేర్కొన్నారు.ఈ వేరియంట్‌ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి,మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే కొన్చిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమిక శక్తి కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటికే 29రాష్ట్రాల్లో గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోకరోనా వైరస్‌ విజృంభణ
థర్డ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ప్రజలు నిబంధనలు సరిగా పాటించకపోవడం, మాస్క్‌, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్త ఏడాది రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 13శాతానికి చేరిపోయింది. కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రముఖులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూని కూడా వాయిదా వేయడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13శాతానికి చేరింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదముంది. ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నా.. ప్రజలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజరోజికీ రెట్టింపువు తున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో నేరుగా వెళ్లి పాల్గడంతోనే కరోనా బారిన పట్టడ్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రజలు బహిరం ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మరోసారి వెలుగులోకి బ్లాక్‌ ఫంగస్‌ ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓవ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌తో ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్‌ ఫంగస్‌ అతని కన్ను,ముక్కుకు వ్యాపించినట్లు వైద్య అధికారులు వెల్లడిరచారు.కరోనా థర్డ్‌ వేవ్‌లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. గతంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయట పడ్డాయి. ఈ ఫంగస్‌ కారణంగా అనేక మంది కంటి చూపు సైతం కోల్పోయారు. అయితే, ఇప్పుడు తిరిగి అదే ఫంగస్‌ గుర్తించటంతో ఆందోళన మొదలైంది.– గునపర్తి సైమన్‌

ఆకలి కేకలు తప్పడం లేదా..!!

అభివృద్ధింటే అద్దంలా మెరిసే రోడ్డు..ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలుకాదు. ఆకలి ఎరుగని సమాజం. పస్తులుండని ప్రజలు. కానీ ఈభూమ్మీద ప్రతీ ఏడుగురిలో ఒకరు నిత్యం ఖాళీ కడుపుతోనే నిద్రపోతుండటం కలవరపెట్టే అంశం. కోవిడ్‌ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత జఠిలం చేయగా..పేదరికం,ఆకలి విషయాల్లో భారత్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. పోషకాహార లోపం..చిక్కిపోయిన పిల్లలు(ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు పిల్లలు),ఎదుగుదలలేని పిల్లలు(వయస్సుకు తగ్గ ఎత్తులేని ఐదేళ్లలోపు పిల్లలు),పిల్లల మరణాలు(ఐదేళ్లలోపు పిల్ల మర ణాల రేటు)వంటి నాలుగు పారామీటర్స్‌ను ఉప యోగించి గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ అనే సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. దీని ప్రకారం భారత్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో అర్ధం చేసుకో వచ్చు.తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొం టున్న ఐదేళ్లలోపు పిల్లలసంఖ్యలో మొత్తం 116దేశాల్లో భారత దేశం టాప్‌ ర్యాంక్‌లో ఉంది’’

పెరిగిన ఆదాయాన్ని,సంపదను నేరుగా ప్రజలకు మళ్ళించడం ద్వారా వారి జీవన ప్రమా ణాల్ని పెంచేందుకు ప్రభుత్వాలు తాపత్రయ పడు తున్నాయి. తద్వారా భారత్‌లో తీవ్ర ఆర్థిక వ్యత్యా సాలపై ఉన్న అపప్రదను పోగొట్టేందుకు ప్రయత్ని స్తున్నాయి. బ్రిటీష్‌ పాలనా కాలం నుంచి భారత్‌కు పేద దేశమన్న పేరు అంతర్జాతీయంగా నెలకొంది. సొంత పాలన ఏర్పడ్డాక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక నీలి విప్లవాలొచ్చాయి. అనూహ్యంగా సంపద పెరిగింది. ఐటీ రంగం అందుబాటులో కొచ్చాక భారత్‌ దానిపై ఆధిపత్యం సాధించింది. ప్రపంచానికే భారత్‌ ఐటీ కేంద్రంగా రూపుదిద్దు కుంది. మౌలిక సదుపాయాల కల్పనా రంగం లోనూ భారతీయ నిపుణులు ప్రపంచ స్థాయి ప్రమా ణాల్ని సాధించారు. వీరంతా దేశ సంపద పెరిగేం దుకు తోడ్పడ్డారు. అయినప్పటికీ ప్రపంచంలో భారత్‌కున్న పేద దేశమన్న పేరు పోవడంలేదు. సంపద పెరగడమే కాదు..దాన్ని సక్రమంగా పంపి ణీ చేయగలిగినప్పుడే ఈ దేశం పేదరికం నుంచి బయటపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమాన గౌరవం పొందగలుగుతుంది. అందు కోసమే ఇప్పుడు ప్రభుత్వాలు తాపత్రయ పడుతు న్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.. Read more

పీసా చట్టం`గిరిజనులకు వరం

రెండున్నర దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. ముఖ్యంగా ప్రముఖ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో 1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు,అటవీ సంపదపై యాజ మాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించు కుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు,వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, నష్టపరిహారం పంపిణీ,గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక,ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన,ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. అంతేకాదు ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లబ్దిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ,నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించబడ్డాయి.

ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి తీసుకొచ్చిన పీసా చట్టం వచ్చి 25 ఏళ్లు పూర్తియింది. అయినా సరే నేటికీ చట్టం లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు పర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను గ్రామాల సమగ్ర అభివృద్ధి, గ్రామీణుల సాధికారత కోసం గ్రామ పంచాయతీలకు మార్గనిర్దేశం చేయ డంలో ప్రభుత్వ వ్యవస్థలు దీర్ఘకాలంగా విఫలమవుతూనే ఉన్నాయి. కొండ, కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్‌- షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం-1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల, అటవీ హక్కుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి తదితర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టం స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయనే చెప్పాలి. గ్రామసభల స్ఫూర్తికి తూట్లుపంచాయతీ రాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతో పాటు, వారి మద్దతు సంఘాలు పెద్దయెత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవరణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని (పంచాయతీ రాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల విస్తరణ చట్టం) ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్ర బిందువుగా మార్చారు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌,రaార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌,మహారాష్ట్ర,కర్ణాటక, కేరళ, బిహార్‌లలోని షెడ్యూలు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామసభలకు ఆ ప్రాంతంలోని సహజ వనరులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి.జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. విద్యా, వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహార పంపిణీ, గనుల తవ్వకాలకు అవసరమైన లీజుల మంజూరుకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. ఆవాసాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనబీ గిరిజనాభివృద్ధి ఉప ప్రణాళిక నిధులను ఖర్చు చేసేందుకు తప్పనిసరిగా గ్రామసభల పాత్ర ఉండాలి. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ తదితర విషయాల్లో గ్రామసభలకు పూర్తి అధికారాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసు కోవాలి.అమలులో అశ్రద్ధమహోన్నత లక్ష్యాలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని అశ్రద్ధ కనబరుస్తున్నాయి. చట్ట నియమాల రూప కల్పనలో ఏళ్ల తరబడి కాలయాపనవల్ల అసలు లక్ష్యం పూర్తిగా నీరుగారింది. తెలుగు రాష్ట్రా లకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1996లో చట్టం అమలులోకి వచ్చిన 15ఏళ్ల అనంతరం అంటే 2011లో సంబంధిత నియమ నిబంధనలు రూపొం దించింది. ఆ నియమాలు వచ్చిన రెండేళ్ల తరవాత 2013లో గిరిజన సంక్షేమ శాఖ- జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను ‘నోటిఫై’ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ‘పీసా’ అమలు ద్వారా గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలకు హక్కులు వర్తింపజేసే ప్రయత్నమే జరగలేదు.పాతికేళ్లయినా..చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లు అవుతున్నా ఛత్తీస్‌గఢ్‌, రaార?ండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటివరకు చట్ట నిబంధనలను రూపొందించుకోలేదు. గుజరాత్‌లో అక్కడి అయిదో షెడ్యూలు ప్రాంతాల్లోనూ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని అమలుచేస్తున్నారు. ‘పీసా’ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించుకోవడంతో దాని అమలు తీరే మారిపోయే దుస్థితి దాపురించింది. షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకోసం భూసేకరణకు ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టువల్ల ప్రభావితమయ్యేవారికి నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఆ నిబంధనను అనేక రాష్ట్రాలు తమ ఇష్టానుసారం అన్వయించుకుని గ్రామ సభల హక్కులను నిర్వీర్యం చేశాయి. గనుల లీజులు, నీటిపారుదల నిర్వహణ,అటవీ ఉత్పత్తుల యాజమాన్యం… ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు శాసనాల్లో మార్పులు తీసుకువచ్చి గ్రామసభల ఉనికినే అపహాస్యం చేస్తున్నాయి.హక్కులతోనే వికాసందేశంలో అత్యంత వెనకబడిన జిల్లాలన్నీ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లోనే వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉంది. అందుబాటులోని వనరులపై హక్కులు కల్పించి, వారికి గ్రామసభల స్థాయిలో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వ్యయం, సంక్షేమ ఫలాల పంపిణీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పరిపాలన, కట్టుబాట్లు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు క్లిష్టంగాను, భిన్నంగాను ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి దశాబ్దాలుగా గందరగోళంగా తయారైంది. గ్రామసభలను విస్మరించడం ఆదివాసుల్లో అసంతృప్తికి, అశాంతికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉన్నతస్థాయి కమిటీలు కేంద్రానికి నివేదించాయి. గిరిజన ప్రాంతాల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌’ అధ్యయనంబీ రెండో పాలన సంస్కరణల కమిషన్‌, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీబీ భూ పరాయీకరణ, నిర్వాసితుల సమస్య, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవ చంద్ర కమిటీలు- ‘పీసా’ను పటిష్ఠంగా అమలు చేస్తేనే, ఆదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి.నిర్వీర్యమవుతున్న రాజ్యాంగ రక్షణ కవచాలుపీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమలుకు రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగమే సిద్ధం కాలేదు. దీంతో రాజ్యాంగ రక్షణ కవచాలు కాస్తా చేవ తగ్గి నిర్వీర్యం అవుతున్నాయి. పీసాతో సహా ఇతర గిరిజన రక్షణ చట్టాలు, సంబంధిత నిబంధనలపై శిక్షణ, అవగాహన పెంచే బాధ్యత, అమలు తీరును పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన, శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది, తగిన నిధులు లేక సతమతమవుతున్నాయి. పీసా చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంలోనైనా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. కొత్తగా కొలువుతీరిన తెలుగు రాష్ట్రాల పంచాయతీ పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామీణ సభల కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలి. మరోవంక రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చి పీసా అమలుకు వాటిని సిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది!

గ్రామసభ, విధులు…

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మొదటి గ్రామసభ నిర్వహించడానికి డిప్యూటీ తహశీల్దార్‌ హోదాగల అధికారిని నియమించాలి. గ్రామసభ సమావేశానికి సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్‌ లేనప్పుడు గ్రామపెద్ద అధ్యక్షత వహించవచ్చు. మెజార్టీ గ్రామసభ్యుల్లో 1/3వంతు తక్కువ కాకుండా కనీసం 50శాతం మంది ఎస్టీ సభ్యులు హాజరైతేనే కోరంగా పరిగణిస్తారు. మెజార్టీ గ్రామసభ్యులు చేతులెత్తి ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. వీరికి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. ఏడాదికి రెండు సార్లు గ్రామసభ నిర్వహించాలి.గ్రామసభ అనంతరం నిర్ణయాలను నిర్వహణాధికారి చదివి, వినిపించి సభ్యుల ఆమోదం పొందాలి. సభ్యుల సంతకాలు విధిగా తీసుకోవాలి. ఈ తీర్మాణాలను నాలుగు వారాల్లోపు గ్రామసభ కార్యదర్శి సంబంధిత ప్రభుత్వ శాఖలకు, సంస్థలకు పంపాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పాధక ప్రణాళికలు, ఉమ్మడి భూముల జాబితా, ఇంటి స్థిరాస్తుల యాజమా న్యాల బదలాయింపులు, పంచాయతీ లెక్కల ఆడిట్‌ నివేధికలు, చౌకధర దుకాణం, అంగన వాడీ, సబ్‌సెంటర్‌, పాఠశాలల పనితీరు, సంక్షేమ హాస్టళ్ళ పనితీరు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసభ జోక్యం చేసుకోవచ్చు.

భూసేకరణ, గిరిజన భూమి అన్యాక్రాంతం

ఏదైనా చట్టం కింద ప్రభుత్వం,సంబంధిత అధికారి భూసేకరణ ప్రతిపా దించినట్లైతే గ్రామసభ ద్వారానే జరగాలి. ప్రతిపాదిత భూసేకరణ, కొత్తగా స్థిరపడిన ప్రజలు, సమాజంపై చూపే ప్రభావం, ఉద్యోగవకా శాల పై గ్రామసభ పరిశీలన చేసి వాస్తవాలను పరిశీలించి భూసేకరణకు సిఫారసు చేయాలి. దీని ద్వారా నిర్వాసిత వ్యక్తుల పునరావాస ప్రణాళిక విషయంలో మండల ప్రజాపరిషత్‌ సిఫారసు చేయాలి. అట్టి మండల పరిషత్‌ సిఫారసులను భూసేకరణ అధికారి పరిగణలోకి తీసుకోవాలి. అంగీకరించని పక్షంలో మరోసారి పరిశీలన కోసం భూసేకరణ అధికారికి పంపాలి. రెండో సారి సంప్రదింపుల అనం తరం మండల ప్రజాపరిషత్‌ సిఫారసులకు వ్యతిరేకంగా ఉత్తర్వులను భూసేకరణ అధికారి జారీ చేసినట్లైతే అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలి.

ఖనిజాల వెలికితీత అనుమతులు, మద్యపాన నిషేద అమలు, క్రమబద్దీకరణ, అమ్మకాలపై ఆంక్షలు విధించ డం, మండల పరిషత్‌ అధికారాలు, నిధులు, ఎక్సైజ్‌శాఖ కింద మద్యం దుకాణాలు తెరవడానికి లైసెన్స్‌ పొందడం వంటి వాటన్నింటికీ ఈ పీసా చట్టం వర్తిస్తుంది. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన భూమి అన్యాక్రాంతం కాబడితే చట్టబ ద్దంగా తిరిగి స్వాదీనం చేసుకోవడం, గిరిజనులతో చేసే వడ్డీ వ్యాపారంపై నియంత్రణ అధికారం పూర్తిగా ఈ పీసా చట్టం పరిధిలోకే వస్తాయి. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, విక్రయాలు ఉదా:- వెదురు, బీడీ ఆకుల మినహా చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, జిసిసికి ఉన్న హక్కులు గ్రామసభకు లోబడే ఉంటాయి.

వారపు సంతల నిర్వహణ..

షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసంత లు నిర్వహించడానికి గ్రామ పంచాయతీ యే మార్కెట్‌ కమిటీగా ఉంటుంది. వారం వారం జరిగే సంతల్లో ఆ మార్కెట్‌ కమిటీ గా ఆయా గ్రామపంచాయతీలు విధులు నిర్వహిస్తాయి. స్థానిక గిరిజనులకే లైసెన్సు లు మంజూరు చేయాలి. మార్కెడ్‌యార్డుల నిర్వహణ, పోషణ, లావాదేవీలు, తాత్కాలి క నిలుపుదల, మూసివే యడం, ప్రారంభిం చడం, క్రమబద్దీకరించడం కమిటీలకు అధికారం ఉంటుంది. గ్రామపంచా యతీల ద్వారా అన్ని విద్యా సంస్థల పరిపాలన నివేధికలను కోరే అధికారం మండల పరిషత్‌కు ఉంటుంది. మండల పరిషత్‌ పరిధిలోగల అన్ని విద్యా సంస్థల బడ్జెట్‌ను మే 31 నాటికే ఆమోదించాలి. సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో విద్యార్థు లకు ఆహార సరఫరా, ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణ ను చట్టం కింద పర్యవేక్షించాలి. పంచాయ తీరాజ్‌ సంస్థలు తమ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలు, సంస్థలకు మద్ధతును, అంగన్‌వాడీ బడ్జెట్‌ను, జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ పథకం అమలు, పరిరక్షణ బాధ్యత చట్టం పరిధిలోనే ఉంటాయి..

పీసా పరిధిలోకి వచ్చే చట్టాలివే…

పీసా చట్టం పరిధిలోకి ఈ క్రింది చట్టాలు వస్తాయి. గనులు, ఖనిజాల (క్రమబద్దీకరణ, అభివృద్ధి) చట్టం 1957. ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత భూబదలాయింపు క్రమబద్దీకరణ నిబంధనలు 1959, షెడ్యూల్డ్‌ ప్రాంత వడ్డీవ్యాపార నిబంధనలు 1960, వ్యవసాయ ఉత్పత్తుల పశుగణన చట్టం 1966, అటవీచట్టం 1967, ఎక్సైజ్‌ చట్టం 1968, గిరిజన రుణవిమోచన రెగ్యులేషన్‌ చట్టం 1970, వాణిజ్య క్రమబద్దీకరణ నిబంధనలు 1979, అటవీ సంరక్షణ చట్టం 1980, విద్యాచట్టం 1982, సాగునీటి వ్యవస్థల నిర్వహణ చట్టం 1997, పంచాయతీరాజ్‌ సవరణ చట్టం 1998, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 చట్టాలు అమల్లో పీసా చట్టం ద్వారా గ్రామసభలు నిర్వహించి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.- గునపర్తి సైమన్‌

రైతు గెలిచాడు

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. దేశంలో తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉం దన్న ప్రధాని…. వ్యవసాయ బడ్జెట్‌ ను ఐదు రెట్లు పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని వెల్లడిరచారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం.. పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం.. క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న,సన్నకారు రైతులకు మేలు చేసేం దుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు మోదీ సంచలన ప్రకటన. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ గతేడాది నవంబరు 26 నుంచి రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నవంబర్‌ 19న(శుక్రవారం) జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటిం చారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ పేర్కొ న్నారు. అయితే,కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా.. అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పూర్తిచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నవంబర్‌ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్‌ సమా వేశాల్లోనే ప్రకటన చేస్తామని తెలిపారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వెల్లడిరచారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టా మని,ఫసల్‌ బీమా యోజనను మరింత బలో పేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం..పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం..క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. అయితే రైతుల్లో ఒక వర్గం మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిం చింది. చట్టాలలో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమయ్యాం. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది’ అని పేర్కొన్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26నుంచి ఢల్లీి శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. ఏడాదిగా రోడ్లపైనే తిష్ట వేసి..అక్కడే తిండి,అక్కడే నిద్ర. కొంత మంది తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.
రైతు విజయం
కేంద్ర మూడు నూతన సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతు పోరాట ఘన విజయం. స్వాతంత్య్ర భారతాన సల్పిన ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ ఘట్టం. నల్ల చట్టాల రద్దు కోరుతూ సంవత్సర కాలంగా ఢల్లీి సరిహద్దుల్లో లక్షలాది రైతులు బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నా మొండిగా వ్యవహరించింది మోడీ సర్కారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పాశవిక నిర్బంధాలకు, కిరాతక దాడులకు ఒడిగట్టింది. రోజు రోజుకూ ఆసేతు హిమాచలం రైతు ఉద్యమం సంఘటితమవుతున్నదని గ్రహించిన మీదట ఇక తలవంచక తప్పదని భావించి స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. బిజెపి ఏమి చేసినా దాని వెనుక కచ్చితంగా రాజకీయ ప్రయోజనం ఉండి తీరుతుంది. ఏడాదిగా అప్రతిహతంగా సాగిస్తున్న రైతు ఆందోళనను చిన్న చూపు చూసిన బిజెపి, రైతాంగంలో, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను ఇటీవలి ఉప ఎన్నికల్లో చవి చూసింది. లఖింపూర్‌ ఖేరి మారణకాండ, కోర్టు మందలింపులు బిజెపిని ఇంటా బయటా రోడ్డుకీడ్చాయి. ఇప్పటికీ వెనక్కి రాకపోతే త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో పార్టీ పుట్టి మునగడం ఖాయమని తలచి చట్టాల రద్దుకు ఉపక్రమించిందనేది బహిరంగ రహస్యం. చట్టాల రద్దుపై జాతి నుద్దేశించి చేసిన ప్రకటనలోనూ ప్రధాని తన మాటల గారడీని వదిలిపెట్టలేదు. రైతుల సంక్షేమం కోసమే చట్టాలను తెచ్చినప్పటికీ, కొన్ని వర్గాల రైతులకు సర్ది చెప్పలేకపోయామని పేర్కొని, అసలు చట్టాల్లో తప్పేమీ లేదంటూ నల్ల చట్టాలను తెల్లగా మార్చే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛా మార్కెట్‌ కోసం ఎఎంసి రద్దు, కాంట్రాక్టు సేద్యం, నిత్యావసరాల నిల్వలపై పరిమితుల ఎత్తివేతకు ఉద్దేశించిన చట్టాలు కార్పొరేట్ల విచ్చలవిడి దోపిడీకి ఊతం ఇచ్చేవి. ఇప్పటి వరకు కొన్ని పంటలకు ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను హరించేవి. ఈ నేపథ్యంలో చట్టాలు చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసమన్న ప్రధాని వాక్కు నయ వంచన. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థలో వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోని అంశం. రాష్ట్రాలను పట్టించుకోకుండా, రైతులతో సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాలు చేశారు. ఈ వాస్తవాలను మోడీ తన ప్రకటనలో ప్రస్తావించకుండా దాచారు. వినాశకర చట్టాలు తెచ్చినందుకు ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పలేదు. తెచ్చిన చట్టాలను అమలు చేయనందుకు కార్పొరేట్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతానికి చట్టాలను రద్దు చేసినా, ఇంకా వాటి ముప్పు తొలగి పోలేదని ప్రధాని మాటల్లో స్ఫురిస్తోంది.రైతులు కేవలం మూడు సాగు చట్టాల రద్దు కోసమే ఉద్యమం చేయడం లేదు. అన్ని పంటలకూ ఎంఎస్‌పి ని చట్టబద్ధ హక్కు చేయాలంటున్నారు. ప్రధాని ప్రకటనలో ఎక్కడా ఎంఎస్‌పి ప్రస్తావన లేదు. విద్యుత్‌ సవరణల చట్టం రైతులకు హానికరం. ఆ సవరణలను సైతం రద్దు చేయాలని రైతులు అడుగుతున్నారు. మూడు చట్టాల రద్దు ప్రధాని ప్రకటనతోనే జరగదు. పార్లమెంట్‌ ఆమోదిం చిన చట్టాలను రద్దు చేయాలంటే తిరిగి పార్లమెంట్‌లోనే చేయాలి. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు ప్రధాని. అప్పటి వరకు వేచి చూస్తామన్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నిర్ణయం సముచితమైనది. ఉద్యమ ప్రధాన డిమాండ్‌ ఎంఎస్‌పికి చట్టబద్ధత మీదా తేల్చుకోవాలన్న ఎస్‌కెఎం యోచన సరైనది. నలభై రైతు సంఘాలు కలగలిసిన ఎస్‌కెఎం నాయకత్వంలోని ఉద్యమం, ఆ పోరాటానికి అందుతున్న విశాల మద్దతు బృహత్తరమైనది. అంతటి ఒత్తిడి ఫలితంగానే విధి లేక కేంద్రం చట్టాల రద్దుకు దిగొచ్చింది. తమ ఉద్యమం తమ కోసమే కాదని, ప్రజలందరి కోసమని రైతులు నినదిస్తున్నారు. కార్మిక కర్షక ఐక్యత కూడా ఈ సందర్భంలో వెల్లివిరిసింది. కార్పొ రేట్లకు, వాటి అనుకూల ప్రభుత్వాలకు రైతు ఉద్యమం సింహస్వప్నంగా నిలిచింది. సుదీర్ఘ పోరాటంలో 750 మంది అమరులు కావడం మామూలు విషయం కాదు. మహత్తర రైతు ఉద్యమం అభినందనీయమైనది. ఇక్కడితో ఆగకుండా వ్యవసాయ, రైతు రక్షణకు మరింత ఉధృతంగా సంఘటిత ఉద్యమం కొనసాగితేనే అసలైన లక్ష్యం సిద్ధిస్తుంది.
తొలుత కేబినెట్‌ ముందుకు.. దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త చట్టాలను ఉపసంహరించుకునే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. నవంబర్‌ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో మూడు నూతన సాగు చట్టాల రద్దు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.
కొత్త చట్టాల రద్దు ఇలా..
గత ఏడాది ఇదే సమయంలో నూతన సాగు చట్టాలను ఆమెదించింది కేంద్రం. రైతులకు మేలు చేసేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే కొంత మంది రైతులు మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారు. దిల్లీ సరిహద్దుల్లో పలు మార్లు ఈ నిరసనల్లో హింస కూడా చెలరేగింది. ఈ పరిణామా లన్నింటి నేపథ్యంలో ఇటీవల గురునానక్‌ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రైతులు ఉద్యమం వీడి ఇళ్లకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.అయితే సాగు చట్టాలు సన్నకారు రైతులను ఆదుకునేందుకే తెచ్చామని..కానీ అందరికీ దీనిని అర్థమయ్యేలా వివరించలేకపోయామని మోదీ పేర్కొన్నారు. మోదీ సర్కార్‌ సాగు చట్టాలపై వెనక్కి తగ్గడాన్ని విపక్షాలు.. ప్రముఖులు అందరూ స్వాగతిం చారు.
సాగు చట్టాల రద్దు ప్రక్రియ ఇలా..
సాగు చట్టాలను రద్దు చేసే ప్రక్రియ.. కూడా చట్టాలు ఆమలులోకి వచ్చిన విధంగానే ఉంటుంది. అంటే.. ఏదైనా చట్టం కావాలంటే పార్లమెంట్‌?లో అందుకు సంబంధఇంచి బిల్లు ప్రవేశ పెట్టాలి. దానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. ఏదైనా చట్టాన్ని రద్దు చేయాలన్నా ఇదే ప్రక్రియ ఉంటుంది.
క్షమాపణ చెప్పిన ప్రధాని
2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని.. వారి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చానని చెప్పారు.వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని.. ఏటా రూ.1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మోదీ చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పారు. ‘ప్రభుత్వం ఈరోజే వ్యవసాయానికి సంబధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే జీరో బడ్జెట్‌ వ్యవసాయం, అంటే సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, క్రాప్‌ పాటర్న్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో మార్చడానికి, ఎంఎస్‌పీని మరింత ప్రభావంగా, పారద ర్శకంగా మార్చడానికి, ఇలాంటి అన్ని విషయా లపై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిదులు, రైతులు ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు ఉంటారు’.
సుదీర్ఘ రైతు ఉద్యమంలో కీలక నేతలు ..
358 రోజుల అలుపెరగని రైతుల పోరాటం .. మోడీ ప్రభుత్వం దిగి వచ్చేలా చేసింది. రైతులకు క్షమాపణ చెబుతూ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించేలా చేసింది. వణుకు పుట్టించే చలి, వేసవిగాలులు, తుఫానులు వేటికీ వారు వెనుకంజ వేయలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలతో వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించేది లేదంటూ ప్రతినబూనారు. మాజీ సైనికుడు, వైద్యుడు, ఎన్నికల సర్వే అధికారి, జాత్‌ నేత, మహిళా హక్కుల కార్యకర్త ఇలా కొందరు రైతుల నిరసనను ఏడాది పాటు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. కొందరి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. ఈ ఉద్యమంలో పాల్గన్న ప్రతి రైతు ఒక నాయకుడే. ఇది భారత్‌లో ప్రజా ఉద్యమాలను పునర్నిర్వచించింది. భవిష్యత్‌ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వారి నాయకత్వంతో రైతుల మధ్య రాజకీయ విభజనను తగ్గించడంలో సహాయపడిరది. పంజాబ్‌,హర్యానా,ఉత్తర ప్రదేశ్‌ నుండి రైతులు ఉమ్మడి వేదికపై సమావేశమై సుదీర్ఘ కాలం పోరాడేందుకు మార్గం సుగమం చేసింది.
మహిళల పాత్ర
ఈ నిరసనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కీలకంగా మారింది. ఉద్యమంలో మహిళల గొంతును వినిపించేలా చేయడంలో హరీందర్‌ బిందు, జస్బీర్‌ కౌర్‌ నట్‌లు ముందంజలో ఉన్నారు. ప్రత్యేక మరుగుదొడ్లు వంటి వసతులు లేనప్పటికీ ట్రాక్టర్లు నడిపారు. విప్లవ గీతాలు పాడారు. జాతీయ రహదా రులను తమ నివాసాలుగా మార్చు కున్నారు. పితృస్వామ్య సమాజం, పురుష ఆధిక్య సమాజంలో పలువురు సామాజిక శాస్త్రవేత్తలు మహిళా మేల్కోల్పును చూశారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) ఏక్తా ఉగ్రహాన్‌ మహిళా విభాగం ఇన్‌చార్జ్‌ హరీందర్‌ బిందు పంజాబ్‌లోని మారుమూల గ్రామాల నుండి మహిళలను ఉద్యమంలో నిమగం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె స్వయంగా నిరసన ప్రాంతంలోనే నెలల తరబడి ఉన్నారు. నిరసనలో చేరేలా పలువురు మహిళలను ప్రోత్సహించారు. పంజాబ్‌ వ్యవసాయ సంస్థలలో మహిళల భాగస్వామ్యాన్ని చూసి, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలోని తమ సహచరులు కూడా మహిళలను నిరసనలోకి తీసుకువచ్చేలా ప్రేరణ పొందారని, ఇది గొప్ప విజయమని ఆమె హరీందర్‌ అన్నారు. పంజాబ్‌లోని ప్రముఖ మహిళా రైతు నేతల్లో ఒకరైన జస్బీర్‌ కౌర్‌ తిక్రీ సరిహద్దుల్లోని నిరసనలో మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించారు. పంజాబ్‌ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులుగా జస్బీర్‌ వ్యవహరిస్తున్నారు. కాలేజీ రోజుల్లో దళిత హక్కుల కార్యకర్తగా పనిచేసిన ఆమె వ్యవసాయ రంగంలో మహిళల దుస్థితిని చూసి పోరాటం దిశగా వారిని నడిపించేందుకు నడుం బిగించారు.ఆమె కుమార్తె నవకిరణ్‌ నట్‌ కూడా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రైతు ఉద్యమాన్ని గురించి వివరించిన వార్తాపత్రిక ట్రాలీటైమ్స్‌ వ్యవస్థాపక సభ్యులలో నవకిరణ్‌ కూడాఉన్నారు. గతేడాది నుండి వీరిద్దరూ నిరసన ప్రాంతంలోనే ఎక్కువ సమయం గడిపారు.
డా. దర్శన్‌ పాల్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా కింద వివిధ రైతు సంఘాలను ఏకం చేసి సైద్ధాంతిక రూపాన్ని అందించిన దర్శన్‌ పాల్‌ వైద్యుడని చాలా మందికి తెలియదు. పంజాబ్‌ సివిల్‌ మెడికల్‌ సర్వీస్‌లో అనస్థీషియా విభాగంలో పనిచేసే ఆయన 2000 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2016లో క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌లో చేరడానికి ముందు రైతు సంఘాల కార్యకలాపాలలో పాల్గొన్నారు. అనంతరం ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఉద్యమంలో పాల్గనడమే కాకుండా నిరసన ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందేందుకు కృషి చేశారు. రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వాలని మొదటి నుండి ఆయన పోరాటం చేశారు. 2020 జూన్‌లో కేంద్రం వ్యవసాయ ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించిన రైతు సంఘాల్లో ఆయనది కూడా ఒకటి. ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెఎస్‌సిసి)లో సభ్యులు కూడా. పంజాబ్‌ నుండి ఉద్యమాన్ని ఢల్లీి వరకు తీసుకెళ్లడంలో పాల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన ప్రేరణతోనే ఎఐకెఎస్‌సిసి సభ్యులు యుపి,రాజస్తాన్‌,కర్ణాటక, మహారాష్ట్ర నుండి రైతులను ఢల్లీి సరిహద్దులకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
రాకేష్‌ తికాయత్‌
పశ్చిమ యుపికి చెందిన జాత్‌ నేత రాకేష్‌ తికాయత్‌ వ్యవసాయ ఉద్యమాన్ని పునరు ద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు. పంజాబ్‌,హర్యానా నుండి రైతు నిరసనను ఢల్లీికి మారినప్పటికీ కొన్ని నెలల పాటు తికాయత్‌ పేరు వినిపించలేదని రాజకీయవిశ్లేషకుడు అశుతోష్‌ కుమార్‌ తెలిపారు. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీ అనంతరం రైతుల నిరసన విఫలమవుతుందనుకున్న సమయంలో తికాయత్‌ ముందుకు వచ్చారు. ఆయన ఉద్వేగ భరితమైన ప్రసంగాలు రైతులను ఉత్తేజ పరిచాయి. అనంతరం నిరసన మరింత బలంగా మారింది. తికాయత్‌ తండ్రి మొహీందర్‌ తికాయత్‌ కూడా వ్యవసాయ నేత అని, 1980లో కేంద్ర ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారని అశుతోష్‌ తెలిపారు. నిరసనలో కుల, మత విభజనలను తలెత్తకుండా ఉండేందుకు పలు మహా పంచాయత్‌లను నిర్వహించారు.
బల్బీర్‌ సింగ్‌ రేజ్వాల్‌
పంజాబ్‌ నుండి ఢల్లీికి ఉద్యమాన్ని తీసుకెళ్ల డంలో కీలకంగా వ్యవహరించిన మరో నేత బల్బీర్‌సింగ్‌ రేజ్వాల్‌. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)లో ప్రముఖంగా వ్యవ హరించారు. అనంతరం భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు)ని ఏర్పాటు చేసి రైతు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. వివిధ సమస్యలపై పంజాబ్‌లోని రైతులను ఐక్యం చేసిన అనుభవం ఉద్యమంలో రైతులను సమీకరించడంలో ప్రముఖంగా నిలిచింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టి నప్పటినుండి బల్బీర్‌ సింగ్‌ ట్రాక్టర్‌ ర్యాలీలు చేపడుతూ నిరసన తెలిపారు. అనంతరం ఢల్లీి సరిహద్దులోనూ ఉద్యమాన్ని నడిపించారు.
జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌
మాజీ సైనికుడైన జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ పదవీ విరమణ అనంతరం వ్యవసాయం ప్రారంభించారు. 2002లో బికెయు (ఏక్తా ఉగ్రహాన్‌) స్వంత శాఖను ఏర్పాటు చేసుకు న్నారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాం తంలో రైతుల ఉద్యమం సుమారు ఏడాది పాటు కొన సాగేలా చర్యలు చేపట్టారు. చిన్న, సన్నకారు రైతులతో ఉన్నప్పటికీ.. రైతు సంఘాల్లో అతి పెద్ద సభ్యత్వాన్ని కలిగి ఉందని మాజీ ప్రొఫెసర్‌ మంజిత్‌ సింగ్‌ తెలిపారు.
యోగేంద్ర యాదవ్‌
ఉద్యమ ప్రతినిధి యోగేంద్రయాదవ్‌ అనడంలో అసత్యం లేదనేలా ఉద్యమంలో యోగేందర్‌ పాలుపంచుకున్నారు. ఎన్నికల సర్వే అధికారి, కార్యకర్త అయిన యోగేంద్ర ఉద్యమాన్ని గురించి ఆంగ్లంలో అందరికీ చేరువయ్యేలా చేశారు. యోగేంద్ర యాదవ్‌ ఇంటర్వ్యూలు నిరసనలను ప్రపంచప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లాయి. నిరసనలపై అసత్యాలు ప్రచారం చేసినప్పుడల్లా మీడియా సమావేశాల ద్వారా ఎస్‌కెఎం వైఖరిని స్పష్టం చేశారు. (‘ది వైర్‌’ సౌజన్యంతో)
-గునపర్తి సైమన్‌

అడుగంటిన బొగ్గు నిక్షేపాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యుత్‌ కేంద్రా లలో బొగ్గునిల్వలు అంతరించి పోవడంతో రాబో యే రోజుల్లో రాష్ట్రం అంధకారమయం కానున్నది. బొగ్గు నిల్వలు తగినంతగా ఉన్నాయా లేవా అని ముందుచూపు లేనట్లు ప్రభుత్వాలు వ్యవహ రిస్తు న్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రజలకు విద్యుత్‌ పొదుపు గురించి ఉచిత సల హాలు మాత్రం ఇస్తున్నారు విద్యుత్‌ శాఖ అధికారులు. సాయంత్రం పూట ఆరు గంటల నుండి పది గంటల వరకు ఏసీలు వాడొద్దని సెలవిస్తు న్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గునిల్వల కొరత ఏర్పడటం, కేంద్రం నుంచి సహకారం లభించక పోవడం వంటి కారణాలతో రాష్ట్రంలోని ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు బొగ్గు సంక్షోభం బారిన పడ్డాయి. ఇప్ప టికే చాలా వరకూ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అంత రించిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా సగం కెపాసిటీ మేరకే విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్‌ కోతలు విధిస్తోంది. సింగరేణి గను లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని పవర్‌ ప్లాంట్లకు రావాల్సిన బొగ్గు నిల్వలు దాదాపుగా నిలిచిపోవడంతో పవర్‌ ప్లాంట్లు అల్లాడు తున్నాయి. మన రాష్ట్రంలో 9ధర్మల్‌ విద్యుత్‌ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో విశాఖ జిల్లా పరవాడలోని ఎన్టీపీసీ సింహాద్రి సూపర్‌ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 2000 మెగావాట్లు, గాజువాక లోని వీటీపీఎస్‌లో 1040 మెగావాట్లు, విజయవాడలోని ఎన్టీ పీఎస్‌లో 1760 మెగావాట్లు,కడప జిల్లా ముద్దనూరు లోని ఆర్టీపీఎస్‌ లో 1650 మెగా వాట్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని డీఎస్టీపీఎస్‌ లో 1600 మెగావాట్లు,సింహపురి ధర్మల్‌ పవర్‌ స్టేషన్లో 600 మెగావాట్లు,మీనాక్షి ధర్మల్‌ పవర్‌ స్టేషన్లో 1000 మెగావాట్లు, సెంబ్‌ కార్ప్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌లో 1320 మెగావాట్లు, ఎస్జీపీఎల్‌ పవర్‌ స్టేషన్లో 1320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ మొత్తం ప్లాంట్లు కలిపి 12 వేల 290 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కాని బొగ్గు కొరత కారణంగా సగం ఉత్పత్తే సాధ్యమవుతోంది. కొన్ని రోజులుగా ఇదే పరిస్ధితి. ప్లాంట్లు పూర్తిగా పని చేయక పోవడంతో ఆమేరకు విద్యుత్‌ ఉత్పత్తి కూడా భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. రేపు,ఎల్లుండి కల్లా మిగిలిన నిల్వలు కూడా తరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.అప్పుడు ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. బొగ్గు కొరత కార ణంగా ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రతిరోజూ దాదాపు 2000 మెగావాట్లకు పైగా కొరత ఏర్పడుతోంది. ఇది ఇవాళ రేపట్లో మరింత ఎక్కువ కానుంది. సంక్షోభం తీవ్రతరం అయితే, డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్‌ నుండి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడ డడంతో….బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనాల్సిన దుస్థితి ఏర్పడిరది. అలా చేయాలన్నా ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు ఉండాలి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం…ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. పైగా ఇప్పటికే ఆస్తి పన్ను, ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ చార్జీల పెంపుదలపై ప్రజాగ్రహనికి గురైంది. ఇప్పుడు విద్యుత్‌ కొనుగోలుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి డిస్కంలపై ఆర్థిక భారం తగ్గించాలంటే విద్యుత్‌ చార్జీలు పెంచక తప్పదు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యంచేసి, ప్రతి రోజు డీజిల్‌,పెట్రోలు,గ్యాసు నిత్యావసర సరుకులు ధరలను పెంచుకుంటూ పోతోంది కేంద్ర ప్రభు త్వం. చెంపదెబ్బ గోడ దెబ్బ మాదిరిగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.
విద్యుత్‌ సంక్షోభంపై కేంద్రం అప్రమత్తం..
దేశంలోని అనేక విద్యుత్‌ కంపెనీలలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిరది. మున్ముందు కాలంలో దేశంలోని పలు ప్రాంతా ల్లో కారు చీకట్లు అలుముకోనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ముందుగా దక్షిణ భారత దేశంలోని బెంగళూరు పట్టణంలో అంధకారం నెలకొంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్‌ సంక్షోభం,బోగ్గు నిల్వల కొరతపై దృష్టిసారించింది. బొగ్గు నిల్వల కొరత, విద్యుత్‌ అంతరాయాల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర అప్రమత్తమై.. అధి కారులు,బొగ్గు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు హోంమంత్రి అమిత్‌ షా..ఇప్పటికే కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌ కె సింగ్‌,బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలో బొగ్గు నిల్వల కొరత,విద్యుత్‌ అంతరాయాల నేపథ్యంలో ఈ సమీక్షపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు ప్లాంట్లల్లో విద్యుత్‌ ఉత్పత్తిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రాల్లో దిగజారుతున్న పరిస్థితుస్థిలపై ఢల్లీి, పంజాబ్‌,కేరళ,మహారాష్ట్ర,కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. దీంతో పాటు విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అక్టోబర్‌ 7న కేంద్ర విద్యుత్‌ అథారిటీ నివేదిక ప్రకారం, దేశంలోని 135 ప్లాంట్లలో 110కర్మాగారాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అలాగే 16 ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా కూడా బొగ్గు నిల్వ లేదని సమచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే బొగ్గు సరఫరాను పెంచినట్లు కోల్‌ ఇండియా ప్రకటనను విడుదల చేసింది. దసరా అనంతరం బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతా మని ప్రకటించింది.
అసలు బొగ్గు కొరతకు కారణాలేంటి.?
నల్లబంగారానికి డిమాండ్‌ పెరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. సరఫరా చేయడానికి సరిపడా బొగ్గు ‘కోల్‌ ఇండియా’ దగ్గరఉందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ కావాల్సినంత బొగ్గు ఉందం టోంది. కానీ..థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మాత్రం కొన్ని రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. అసలు ఈ కొరతకు కారణాలేంటి? కరెంట్‌ అవసరం ఒక్కసారిగా ఎందుకు పెరి గింది? కొన్ని రోజుల నుంచి బొగ్గు కొరతకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపి స్తున్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్‌ కొరత తప్పదనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. మనది ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా మునుపెన్నడూ లేని విధంగా కరెంట్‌ సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 70శాతం ఎలక్ట్రిసిటీ థర్మల్‌ ప్లాంట్ల నుంచే వస్తుంది. అయితే.. కొన్నాళ్ళ క్రితం కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉండడం వల్ల కంపెనీలు మూత పడ్డాయి. దాంతో కరెంట్‌ వినియోగం తగ్గింది. ఆ తర్వాత కంపెనీలు తెరిచినా థర్డ్‌ వేవ్‌ భయంతో పూర్తి ఆక్యు పెన్సీతో పనిచేయలేదు. తక్కువ స్టాఫ్‌తో తక్కువ ప్రొడ్యూస్‌ చేశాయి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు పూర్తి కెపాసిటీతో పనిచేస్తు న్నాయి. దానివల్ల కరెంట్‌ వాడకం బాగా పెరిగింది. ప్రొడక్షన్‌ పెంచాల్సి వచ్చింది. కానీ.. ప్రొడక్షన్‌కి తగ్గట్టు బొగ్గు సరఫరా జరగడం లేదు. దానివల్ల నిల్వలు తగ్గుతు న్నాయి. ఈ కొరత ఇలాగే కొనసాగితే ఈ ఎఫెక్ట్‌ దాదాపు అన్ని రంగాల మీద పడే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. దేశంలో బొగ్గు కొరత ఉందని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి చెప్పినా.. కేంద్రం మాత్రం పరిస్థి తులు బాగానే ఉన్నాయని అవసరమైనంత బొగ్గు సరఫరా చేయడానికి రెడీగా ఉన్నామని చెబు తోంది. కాకపోతే ప్లాంట్లలో నిల్వలు తక్కువగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. పైగా ‘‘ఎవరికి కావాలో చెప్పండి. సప్లై చేస్తాం’’ అంటూ కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ చెప్పారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. కానీ..అది కేవలం స్టోరేజీ మాత్రమే ప్రతి రోజూ సప్లై జరుగుతూనే ఉందన్నారు. దీంతో అసలు బొగ్గు కొరత ఉందా? లేదా? అని అందరూ చర్చించుకుం టున్నారు. అయితే.. పరిస్థితులను బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నదనే తెలు స్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు బాగా పెరిగాయి. పొరుగు దేశం చైనా లో బొగ్గు కొరత వల్లే కరెంట్‌ ప్రొడక్షన్‌ బాగా తగ్గింది. పరిశ్రమలతోపాటు ఇళ్లకు కూడా కరెంటు కోతలు పెడుతున్నారు. అదే పరిస్థితి మనకూ వచ్చే ప్రమాదముందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఇక బొగ్గు సరఫరా లేకపోవడం వల్లే బీహార్‌,రాజస్థాన్‌,జార్ఖండ్‌,పంజాబ్‌,ఏపీ వంటి రాష్ట్రాల్లో కరెంట్‌కోతలు ఎక్కువగా ఉంటున్నాయని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు.
మనకూ సమస్యేనా?
సింగరేణి బొగ్గు గనులు మన రాష్ట్రంలోనే ఉన్నా..రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మామూలుగా 15రోజులకు సరిపడా బొగ్గు స్టోర్‌ చేస్తారు. కానీ..ఇప్పుడు నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు,ఈస్టేషన్లకు తక్కువగా సప్లై చేస్తూ, కొరతతో ప్రొడక్షన్‌ ఆగిపోయే స్థితిలో ఉన్న స్టేషన్లకు సింగరేణి సంస్థ బొగ్గు సప్లై చేస్తోందని తెలుస్తోంది. కానీ..వర్షాలవల్ల కొన్నా ళ్ల సింగరేణిలో ప్రొడక్షన్‌ తగ్గినా ఇప్పుడు మళ్లీ మెరుగుపడిరది. ఇప్పుడు రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తోంది. అందులో తెలంగాణలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్లకు 30,000టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. మిగతాది కర్నాటక,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు సరఫరా అవుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి తెలంగాణలో ఎటువంటి సమస్య రాదని తేల్చిచెప్పారు. ‘‘తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’’ (ుూGజుచీజూ) ప్రకారం.. తెలంగాణలో థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో 3,772.5 మెగావాట్ల కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చు. ప్రస్తుతం 3.8 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి చెప్పారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం దగ్గర ఉన్న 2,600 మెగావాట్ల నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ పవర్‌ స్టేషన్‌ కూడా తెలంగాణలో కరెంట్‌ సరఫరాకు సాయం చేస్తుంది.
‘పిట్‌హెడ్‌’ కాబట్టి ఇబ్బంది లేదు
బొగ్గు గనులకు 50కిలోమీటర్లలోపు ఉండే థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను ‘పిట్‌హెడ్‌’ అంటారు. వీటికి బొగ్గును అందించడం పెద్ద కష్టమేమీ కాదు. అందువల్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ టైం, ఖర్చు కూడా చాలా తక్కువ. మన దగ్గర ఎక్కువగా ‘పిట్‌హెడ్‌’ ప్లాంట్లే ఉన్నాయి. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
కొరత ఎందుకొచ్చింది?
పొరుగుదేశం చైనాలో కూడా కరెంట్‌ కొరత ఏర్పడిరది. కొన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఆ పరిస్థితి మనకు రాకూడదనే బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఇంటర్‌-మినిస్టీరియల్‌ సబ్‌-గ్రూప్‌ వారానికి రెండుసార్లు బొగ్గు స్టాక్‌ పరిస్థితి గురించి తెలుసుకుంటోంది. సమస్యలను పరిష్కరిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌,వర్షాలు, ఫ్యాక్టరీలు ఎక్కువ కరెంట్‌ వాడడం ఇలా.. బొగ్గు కొరత ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్‌
లాక్‌డౌన్‌ వల్ల స్టాఫ్‌ని తగ్గించుకున్న ఫ్యాక్టరీలు మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయేమోననే భయంతో పూర్తి ఆక్యూపెన్సీతో ప్రొడక్షన్‌ మొదలుపెట్టలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ తేరుకున్నాయి. స్టాఫ్‌ని పెంచుకుని పూర్తి కెపాసిటీతో ప్రొడక్షన్‌ మొదలుపెట్టాయి. మళ్లీ మామూలు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా కరెంట్‌కు డిమాండ్‌ పెరిగింది. కరెంట్‌ వాడకం పెరగ డం వల్ల దాని ప్రొడక్షన్‌కు ఉపయోగించే బొగ్గుకు కూడా డిమాండ్‌ బాగా పెరిగింది. అందుకే కొరత ఏర్పడిరది. ఈమధ్యే దేశంలో కరెంట్‌ వాడకం రోజుకు 4బిలియన్‌ యూనిట్లు దాటింది. ఇందులో 65నుండి 70శాతం బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోంది. 2019 ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నెలకు దాదాపు 106.6 బిలియన్‌ యూనిట్లు, అదే 2021లో నెలకు 124.2 బిలియన్‌ యూనిట్లు కన్జ్యూమ్‌ అయింది.
వర్షాలు:
ఈ ఏడాది సెప్టెంబర్‌లో బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయి. దాంతో ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీళ్లు నిండడం వల్ల కోల్‌ ప్రొడక్షన్‌ తగ్గింది. ఈ సమస్య దాదాపు ప్రతి ఏటా ఉంటుంది. కానీ..ఈ సారి డిమాండ్‌ పెరిగి, ప్రొడక్షన్‌ తగ్గడంతో కొరత ఏర్పడిరది. రుతుపవనాల మొదలవడానికి ముందే ఎక్కువ బొగ్గును స్టోర్‌ చేసుకోగలిగితే ఈ సమస్య వచ్చేది కాదు.
ఇంటర్నేషనల్‌ మార్కెట్‌
అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు బాగా పెరిగాయి. మనం ఎక్కువగా ఇండోనేసియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. ఇండోనేసియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధర మార్చి-2021లో టన్నుకు 60డాలర్లుగా ఉంది. అదే (సెప్టెంబర్‌, అక్టోబర్‌లో 160 డాలర్లకు పెరిగింది. దానివల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న ప్లాంట్లలో ప్రొడక్షన్‌ తగ్గింది. 2019తో పోల్చితే ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసు కుంటున్న బొగ్గుతో ప్రొడ్యూస్‌ చేసే కరెంట్‌ 2021లో 43.6శాతం తగ్గింది. దీంతో బొగ్గు కొరతను తగ్గించేందుకు కోల్‌ ఇండియా బొగ్గు ప్రొడక్షన్‌ను పెంచింది. అక్టోబర్‌ 7న, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (జIూ)1.501 మిలియన్‌ టన్నుల బొగ్గును సప్లై చేసింది. దానివల్ల వాడకానికి, సప్లైకి మధ్య ఉన్న తేడాని తగ్గిం చింది. సప్లై క్రమంగా పెంచాలని బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది.
అందరికీ ఇదే పరిస్థితి
మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ధరల పెరుగుదల, పెట్రోల్‌ సంక్షోభం వంటివి ఇబ్బందికరంగా మారాయి. యూరప్‌ లో నేచురల్‌ గ్యాస్‌ ధర ఈఏడాది దాదాపు నాలుగింతలు పెరిగింది. ఇక కరెంట్‌ చార్జీలు మూడిరతలు పెరిగాయి. మన దేశంలో కూడా పెట్రోల్‌,వంట గ్యాస్‌ ధరలు బాగా పెరిగాయి. కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో ఏకంగా ఫుడ్‌ ఎమ ర్జెన్సీ ప్రకటించారు.ఎండ ఎక్కువగా ఉంటేనే కరెంట్‌ ఎక్కువ ప్రొడ్యూస్‌ అవుతుంది. గాలితో కూడా కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చు. విండ్‌ పవర్‌ను కరెంట్‌గా మార్చడానికి విండ్‌ టర్బైన్‌లను వాడతారు. దీనికి మెకానికల్‌ పవర్‌ కోసం గాలి మరలను వాడతారు. కాకపోతే ఇది గాలి ఎక్కువగా వీచినప్పుడే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఖర్చయ్యే కరెంట్‌లో విండ్‌ పవర్‌తో దాదాపు రెండు శాతం ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. నేచురల్‌ గ్యాస్‌ టర్బైన్లు, ఆవిరి టర్బైన్లను వాడి కరెంట్‌ను ఉత్పత్తి చేయొచ్చు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల కంటే నేచురల్‌ గ్యాస్‌ మండిర చడంవల్ల తక్కువ కాలుష్యం అవుతుంది. ఇది చాలా తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను రిలీజ్‌ చేస్తుంది.కాబట్టి థర్మల్‌ పవర్‌ కంటే నేచురల్‌ గ్యాస్‌తో కరెంట్‌ను ప్రొడ్యూస్‌ చేయడమే బెటర్‌. నేచురల్‌ గ్యాస్‌ వల్ల పెట్రోలి యంను కాల్చడం కంటే 30%తక్కువ, బొగ్గును కాల్చడం కంటే 45%తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ రిలీజ్‌ అవుతుంది.న్యూక్లియర్‌ ఫూజన్‌ ద్వారా ఇది పవర్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. కాబట్టి ఇదిథర్మల్‌ పవర్‌ కంటే బెటర్‌. ఎందుకంటే ఇందులో కార్బన్‌ ప్రొడ్యూస్‌ అవ్వదు. థర్మల్‌ నుంచి న్యూక్లియర్‌ పవర్‌కి మారడం వల్ల డీకార్బోనైజింగ్‌ అవు తుంది. కానీ.. న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్ల సేఫ్టీపై ఎన్నో భయాలు ఉన్నాయి. అందుకే మన దేశంలో అణు విద్యుత్‌ చాలా తక్కువగానే ఉత్పత్తి అవుతుంది.
కొరత రాకుండా ఏం చేయాలి?
బొగ్గు కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసు కోవాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వర్షాలు, వరదల వల్ల సెప్టెంబర్‌లో బొగ్గు ప్రొడక్షన్‌ తగ్గుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. వర్షాకాలం రాకముందే ఎక్కువగా తవ్వి స్టోర్‌ చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే.. ఎలాగూ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైడల్‌ పవర్‌ జనరేషన్‌ కెపాసిటీని పెంచుకోవాలి. సెప్టెంబరు 30 వరకు గడిచిన ఆరు నెలల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నుండి 14%,మాత్రమే కరెంట్‌ ప్రొడ్యూస్‌ అయింది. డ్యామ్‌ల దగ్గర మరిన్ని హైడ్రో పవర్‌ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని అల్యూమినియం, సిమెంట్‌ కంపెనీలు ఎక్కువగా బొగ్గును కొంటుంటాయి. ఆ కొనుగోళ్ల మీద కూడా ఎప్పటికప్పుడు కంట్రో ల్‌ ఉండాలి. దేశంలో బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతుండడం వల్ల రిఫైనరీల నుంచి అల్యూ మినియం, మాం సం ప్రాసెసింగ్‌ చేసే సంస్థల వరకు చాలా కంపెనీలపై ఎఫెక్ట్‌ పడుతోంది. ఎక్కువ ఎఫెక్ట్‌ పడే కంపెనీలు ఇవి..
పెట్రోలియం
పవర్‌ రేషన్‌ పరిస్థితి మరింత దిగజారితే… పెట్రోలియం రంగం మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్‌ పడే ప్రమాదం ఉంది. అయితే.. పెట్రోలియం రిఫైనరీలకు ఎక్కువగా కరెంట్‌ అవసరం ఉంటుంది. ఒకవేళ వాటికి సరిపడా కరెంట్‌ అందించకపోతే వాళ్లకున్న క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి పవర్‌ జనరేట్‌ చేసు కుంటారు. అయితే.. వాటిలో చాలా యూనిట్లు గ్యాస్‌ ద్వారా నడుస్తాయి. దానివల్ల నేచురల్‌ గ్యాస్‌ ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ రంగంలో ప్లాస్టిక్‌, ఫైబర్‌, సింథటిక్‌ రబ్బర్‌ తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెహికల్‌ టైర్లు, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ తయారుచేసే వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు. కొన్ని పరిశ్రమలకు సొంత పవర్‌ యూనిట్లు ఉండవు. అందుకని ప్రొడక్షన్‌ ఆగకుండా ఉండేందుకు వాళ్లు డీజిల్‌ జనరేటర్లను వాడతారు. ఇండియాలో పెద్దస్టీల్‌ ఫ్యాక్టరీలకు సొంత పవర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్లు బొగ్గును వేలం పాటలో కొనుక్కుంటారు. ఇక చిన్న చిన్న ఫ్యాక్టరీలు సొంతంగా కరెంట్‌ను తయారు చేసుకోలేవు. కాబట్టి వీటిలో ప్రొడ క్షన్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
-డా.ఎం.సురేష్‌ బాబు

చత్తీష్‌ఘ‌డ్ గ‌వ‌ర్న‌ర్‌తో స‌మ‌త ర‌వి భేటీ

చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర పీసా చట్టం గ్రూప్‌ వర్కింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌,సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి ఆ రాష్ట్ర గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌తో రవి పలు అంశాలు ప్రస్తావించారు. షెడ్యూల్‌ ప్రాంత చట్టాలు పరిరక్షణ, పీసా చట్టం`1996 అమలు,గ్రామసభల పటిష్టకు కృషి చేస్తానని తెలిపారు. షెడ్యూల్డు ప్రాంత పాలన,రాజ్యాంగ నియమాలు,భూమి బదలాయింపు నిబంధనలు 1/70,అటవీ హక్కుల గుర్తింపు చట్టం`2006,ఆదివాసీ హక్కలు వంటి కీలకమైన విషయాలుపై చర్చించారు. అదేవిధంగా సమత వ్యవస్థాపక దినోత్సవం ఏర్పా టుపై గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌తో ప్రస్తావించారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. చారిత్రాత్మకమైన సమత తీర్పు షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసీలకు రక్షణ కవచంలాంటిదని కొనియాడారు.గిరిజన హక్కులను పునరుద్దరించిన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుని పేర్కొన్నారు.ఆదివాసీ హక్కుల కోసం పోరాడే ఒక చిన్న సామాజిక కార్యాచరణ సంస్థ అయిన సమత అన్యాయాలపై గళమెత్తడానికి వివిధ మార్గాలను ఎంచుకొని చైతన్యవంతమైన రాజకీయ నిర్ణయాలు,న్యాయసాధనకు అసంఖ్యాక న్యాయమార్గాల ద్వారా ప్రజా ఉద్యమాన్ని నడిపిన మహా కర్తవ్యమని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిని ప్రశంసించారు.అట్టడుగు స్థాయిలో గిరిజనుల సంక్షేమం,అభ్యున్నతికోసం శ్రమించే సామాజిక సంస్థని కితాబునిచ్చారు. గవర్నర్‌ను కలసిన వారిలో మైన్స్‌,మినరల్స్‌ అండ్‌ పీపుల్స్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ శర్మాలి(గుజరాత్‌)సమత డైరెక్టర్‌ విక్కీ పాల్గొన్నారు.- గునపర్తి సైమన్‌

ప్రకృతి వైఫరిత్యాలు`పెరుగుతున్న మార్పులు

భూకంపం,తుఫాను,వరదలు,సునామీ మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి,ప్రాణనష్టాలు జరు గుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొన డానికి,ముందుగా సిద్ధం కావటానికి మానవ చైత న్యం అవసరం.పునరావాస పనులు,ప్రథమ చికిత్స, ఆహారం,బట్ట్‌లు,మందులు,రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురించి ప్రజలు తగినంత అవగాహన కలిగివుండాలి.

ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం. అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలవంటి ప్రకృతివైపరీత్యాలు సంభ వించ డంవల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాలబారిన పడ తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్ర మత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు,ఆహారపదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకో వలసిన జాగ్రత్తలపట్ల అవగాహన కలిగించడానికి ప్రయ త్నం చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు 12 నుండి 15 సంవత్సరాల వయస్సుగల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధా న్యత ఇవ్వాలి. ఓవైపు కరోనా వైరస్‌ కల్లోలం..
మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. ఇక వర్షాలు, వరదలతో సీజనల్‌ వ్యాధు లు కూడా విరజంభించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఏపీప్రభుతం చర్యలు చేపట్టింది. తాజాగా ఏపీరాష్ట్రవిపత్తుల నిర్వహణశాఖ ప్రభుత్వ కోవిడ్‌-19 నియమాలు పాటిస్తూ సహాయక చర్యల్లోని అధికారులకు సహకరించండని సూచిస్తూ ప్రజలకు ఓ లేఖను రిలీజ్‌ చేసింది. అంతేకాదు.. ప్రజలు వరదల సమయంలో ఏమి చేయాలి.. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలి..ఒకవేళ వరదలు లోతట్టు ప్రాంతాలకు వస్తే.. అక్కడ ప్రజలు ఏ విధమైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి అనే అంశాలను వివరిస్తూ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్న బాబు ఓలేఖను రిలీజ్‌ చేశారు
వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ా వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
ా మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
ా విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్‌ లైన్ల కు దూరంగా ఉండండి.
ా ఓపెన్‌ డ్రెయిన్స్‌ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆప్రదేశంలో కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
ా వరదనీటిలో నడవకండి లేదా డ్రైవ్‌ చేయవద్దు
ా రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
ా తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి.
ా తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి
ా వేడిచేసిన లేదా క్లోరినేటెడ్‌ నీరు త్రాగాలి.
ా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు
్చ మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి
్చ రిపేర్‌కు వచ్చిన విద్యుత్‌ వస్తువులను ఉపయోగించవద్దు
్చ అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందించిన ప్రధాన స్విచ్లులను,ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి
్చ తడిగా ఉంటే విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.
్చ విరిగిన విద్యుత్‌ స్తంభాలు,తీగలు,పదునైన వస్తువులను పరిశీలించండి
్చ వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
్చ మలేరియావంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
్చ వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
్చ నీటి మార్గాలు/మురుగునీటిపైపులు దెబ్బతి న్నట్లయితే టాయిలెట్‌ లేదా కుళాయి నీటిని వాడకండి.
్చ నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
్చ మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసివస్తే మంచం,టేబుళ్లపై మీ ఫర్నిచర్‌ ఇతర ఉపకరణాలను పెట్టండి.
్చ టాయిలెట్‌ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి
్చ మీ కరెంట్‌,గ్యాస్‌ కనెక్షన్‌ ను ఆపివేయండి
్చ ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి.
్చ మీ వద్ద ఉన్నఅత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె,విలువైన వస్తువులు,ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
్చ నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.
్చ తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత15డిగ్రీసెంటీగ్రేడ్లు.గతంలో ఇది ఇంత కన్నా ఎక్కువగా,తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు.
గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌హౌజ్‌వాయువులు గ్రహిం చుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలి తంగా వాతావరణం,భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమ య్యేది.అయితే ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయంవల్ల వెలువడే వాయువులుతోడై మరిం త శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభా వవంతమైంది నీటిఆవిరి.కానీ,అది వాతా వర ణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రా మికీకరణ కన్నా ముందుఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడంవల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి,కాల్చేయడంవల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది.గ్లోబల్‌వార్మింగ్‌ ఎక్కువవు తోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలై నప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.అయితే,కార్బన్‌డైఆక్సైడ్‌ అం తటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. మొక్కల్లో పూలుపూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలను1.5డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసు కోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు,నాయకులు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగు తున్న కృషికి ఐరాసనేతృత్వం వహిస్తోంది. ఇప్పటి కిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీ యంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహారఉత్పత్తిపైనా తీవ్ర ప్రభా వం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడంవల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. సముద్ర మట్టాలు పెరుగు తాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామ ర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడంవల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు. వాతావరణ మార్పులపై స్పందించడమే ఈశతాబ్దంలో మానవాళికి అతి పెద్ద సవాలు కాబోతోంది.
`వ్యాసకర్త : వాతావరణ మార్పుల పరిశోధకుడు,సెంట్రల్‌ యూనివర్శిటీ,హైదరాబాద్‌
మల్లేష్‌ నాయక్‌


1 2 3 4 5 6 7