రైతు గెలిచాడు

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. దేశంలో తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉం దన్న ప్రధాని…. వ్యవసాయ బడ్జెట్‌ ను ఐదు రెట్లు పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని వెల్లడిరచారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం.. పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం.. క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న,సన్నకారు రైతులకు మేలు చేసేం దుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు మోదీ సంచలన ప్రకటన. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ గతేడాది నవంబరు 26 నుంచి రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నవంబర్‌ 19న(శుక్రవారం) జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటిం చారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన రోజున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మోదీ పేర్కొ న్నారు. అయితే,కొత్త సాగు చట్టాల వల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని మోదీ అంతకు ముందు వ్యాఖ్యానించారు. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా.. అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పూర్తిచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నవంబర్‌ నెలాఖరు నుంచి జరిగే పార్లమెంట్‌ సమా వేశాల్లోనే ప్రకటన చేస్తామని తెలిపారు. అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని వెల్లడిరచారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టా మని,ఫసల్‌ బీమా యోజనను మరింత బలో పేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘గ్రామీణ మార్కెట్లకు సంబంధించి మౌలిక వసతులను బలోపేతం చేశాం..పంటకు కనీస మద్దతు ధరను కూడా పెంచాం..క్రాప్‌ లోన్‌ను రెండిరతలు చేశాం.. రైతుల సంక్షేమం కోసం ఎంత చేయాలో అంతా చేశాం.. రైతన్నల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేశాం.. చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చాం’ అన్నారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులను మేము ఒప్పించ లేకపోయాం. ఈచట్టాలపై వారికి అవగాహన కల్పించేందుకు ఎంతో చేశాం. అయితే రైతుల్లో ఒక వర్గం మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిం చింది. చట్టాలలో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమయ్యాం. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది’ అని పేర్కొన్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26నుంచి ఢల్లీి శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. ఏడాదిగా రోడ్లపైనే తిష్ట వేసి..అక్కడే తిండి,అక్కడే నిద్ర. కొంత మంది తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.
రైతు విజయం
కేంద్ర మూడు నూతన సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతు పోరాట ఘన విజయం. స్వాతంత్య్ర భారతాన సల్పిన ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ ఘట్టం. నల్ల చట్టాల రద్దు కోరుతూ సంవత్సర కాలంగా ఢల్లీి సరిహద్దుల్లో లక్షలాది రైతులు బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నా మొండిగా వ్యవహరించింది మోడీ సర్కారు. ఆందోళన చేస్తున్న అన్నదాతలపై పాశవిక నిర్బంధాలకు, కిరాతక దాడులకు ఒడిగట్టింది. రోజు రోజుకూ ఆసేతు హిమాచలం రైతు ఉద్యమం సంఘటితమవుతున్నదని గ్రహించిన మీదట ఇక తలవంచక తప్పదని భావించి స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. బిజెపి ఏమి చేసినా దాని వెనుక కచ్చితంగా రాజకీయ ప్రయోజనం ఉండి తీరుతుంది. ఏడాదిగా అప్రతిహతంగా సాగిస్తున్న రైతు ఆందోళనను చిన్న చూపు చూసిన బిజెపి, రైతాంగంలో, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను ఇటీవలి ఉప ఎన్నికల్లో చవి చూసింది. లఖింపూర్‌ ఖేరి మారణకాండ, కోర్టు మందలింపులు బిజెపిని ఇంటా బయటా రోడ్డుకీడ్చాయి. ఇప్పటికీ వెనక్కి రాకపోతే త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో పార్టీ పుట్టి మునగడం ఖాయమని తలచి చట్టాల రద్దుకు ఉపక్రమించిందనేది బహిరంగ రహస్యం. చట్టాల రద్దుపై జాతి నుద్దేశించి చేసిన ప్రకటనలోనూ ప్రధాని తన మాటల గారడీని వదిలిపెట్టలేదు. రైతుల సంక్షేమం కోసమే చట్టాలను తెచ్చినప్పటికీ, కొన్ని వర్గాల రైతులకు సర్ది చెప్పలేకపోయామని పేర్కొని, అసలు చట్టాల్లో తప్పేమీ లేదంటూ నల్ల చట్టాలను తెల్లగా మార్చే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛా మార్కెట్‌ కోసం ఎఎంసి రద్దు, కాంట్రాక్టు సేద్యం, నిత్యావసరాల నిల్వలపై పరిమితుల ఎత్తివేతకు ఉద్దేశించిన చట్టాలు కార్పొరేట్ల విచ్చలవిడి దోపిడీకి ఊతం ఇచ్చేవి. ఇప్పటి వరకు కొన్ని పంటలకు ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను హరించేవి. ఈ నేపథ్యంలో చట్టాలు చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసమన్న ప్రధాని వాక్కు నయ వంచన. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థలో వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోని అంశం. రాష్ట్రాలను పట్టించుకోకుండా, రైతులతో సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాలు చేశారు. ఈ వాస్తవాలను మోడీ తన ప్రకటనలో ప్రస్తావించకుండా దాచారు. వినాశకర చట్టాలు తెచ్చినందుకు ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పలేదు. తెచ్చిన చట్టాలను అమలు చేయనందుకు కార్పొరేట్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతానికి చట్టాలను రద్దు చేసినా, ఇంకా వాటి ముప్పు తొలగి పోలేదని ప్రధాని మాటల్లో స్ఫురిస్తోంది.రైతులు కేవలం మూడు సాగు చట్టాల రద్దు కోసమే ఉద్యమం చేయడం లేదు. అన్ని పంటలకూ ఎంఎస్‌పి ని చట్టబద్ధ హక్కు చేయాలంటున్నారు. ప్రధాని ప్రకటనలో ఎక్కడా ఎంఎస్‌పి ప్రస్తావన లేదు. విద్యుత్‌ సవరణల చట్టం రైతులకు హానికరం. ఆ సవరణలను సైతం రద్దు చేయాలని రైతులు అడుగుతున్నారు. మూడు చట్టాల రద్దు ప్రధాని ప్రకటనతోనే జరగదు. పార్లమెంట్‌ ఆమోదిం చిన చట్టాలను రద్దు చేయాలంటే తిరిగి పార్లమెంట్‌లోనే చేయాలి. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు ప్రధాని. అప్పటి వరకు వేచి చూస్తామన్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నిర్ణయం సముచితమైనది. ఉద్యమ ప్రధాన డిమాండ్‌ ఎంఎస్‌పికి చట్టబద్ధత మీదా తేల్చుకోవాలన్న ఎస్‌కెఎం యోచన సరైనది. నలభై రైతు సంఘాలు కలగలిసిన ఎస్‌కెఎం నాయకత్వంలోని ఉద్యమం, ఆ పోరాటానికి అందుతున్న విశాల మద్దతు బృహత్తరమైనది. అంతటి ఒత్తిడి ఫలితంగానే విధి లేక కేంద్రం చట్టాల రద్దుకు దిగొచ్చింది. తమ ఉద్యమం తమ కోసమే కాదని, ప్రజలందరి కోసమని రైతులు నినదిస్తున్నారు. కార్మిక కర్షక ఐక్యత కూడా ఈ సందర్భంలో వెల్లివిరిసింది. కార్పొ రేట్లకు, వాటి అనుకూల ప్రభుత్వాలకు రైతు ఉద్యమం సింహస్వప్నంగా నిలిచింది. సుదీర్ఘ పోరాటంలో 750 మంది అమరులు కావడం మామూలు విషయం కాదు. మహత్తర రైతు ఉద్యమం అభినందనీయమైనది. ఇక్కడితో ఆగకుండా వ్యవసాయ, రైతు రక్షణకు మరింత ఉధృతంగా సంఘటిత ఉద్యమం కొనసాగితేనే అసలైన లక్ష్యం సిద్ధిస్తుంది.
తొలుత కేబినెట్‌ ముందుకు.. దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.దాదాపు ఏడాది కాలంగా నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఆందోళనలతో కేంద్రం ఇటీవల దిగొచ్చింది. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త చట్టాలను ఉపసంహరించుకునే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. నవంబర్‌ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో మూడు నూతన సాగు చట్టాల రద్దు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.
కొత్త చట్టాల రద్దు ఇలా..
గత ఏడాది ఇదే సమయంలో నూతన సాగు చట్టాలను ఆమెదించింది కేంద్రం. రైతులకు మేలు చేసేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే కొంత మంది రైతులు మాత్రం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారు. దిల్లీ సరిహద్దుల్లో పలు మార్లు ఈ నిరసనల్లో హింస కూడా చెలరేగింది. ఈ పరిణామా లన్నింటి నేపథ్యంలో ఇటీవల గురునానక్‌ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రైతులు ఉద్యమం వీడి ఇళ్లకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా రైతులకు క్షమాపణ కూడా చెప్పారు.అయితే సాగు చట్టాలు సన్నకారు రైతులను ఆదుకునేందుకే తెచ్చామని..కానీ అందరికీ దీనిని అర్థమయ్యేలా వివరించలేకపోయామని మోదీ పేర్కొన్నారు. మోదీ సర్కార్‌ సాగు చట్టాలపై వెనక్కి తగ్గడాన్ని విపక్షాలు.. ప్రముఖులు అందరూ స్వాగతిం చారు.
సాగు చట్టాల రద్దు ప్రక్రియ ఇలా..
సాగు చట్టాలను రద్దు చేసే ప్రక్రియ.. కూడా చట్టాలు ఆమలులోకి వచ్చిన విధంగానే ఉంటుంది. అంటే.. ఏదైనా చట్టం కావాలంటే పార్లమెంట్‌?లో అందుకు సంబంధఇంచి బిల్లు ప్రవేశ పెట్టాలి. దానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది. ఏదైనా చట్టాన్ని రద్దు చేయాలన్నా ఇదే ప్రక్రియ ఉంటుంది.
క్షమాపణ చెప్పిన ప్రధాని
2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని.. వారి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చానని చెప్పారు.వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని.. ఏటా రూ.1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మోదీ చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పారు. ‘ప్రభుత్వం ఈరోజే వ్యవసాయానికి సంబధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే జీరో బడ్జెట్‌ వ్యవసాయం, అంటే సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, క్రాప్‌ పాటర్న్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో మార్చడానికి, ఎంఎస్‌పీని మరింత ప్రభావంగా, పారద ర్శకంగా మార్చడానికి, ఇలాంటి అన్ని విషయా లపై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిదులు, రైతులు ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు ఉంటారు’.
సుదీర్ఘ రైతు ఉద్యమంలో కీలక నేతలు ..
358 రోజుల అలుపెరగని రైతుల పోరాటం .. మోడీ ప్రభుత్వం దిగి వచ్చేలా చేసింది. రైతులకు క్షమాపణ చెబుతూ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించేలా చేసింది. వణుకు పుట్టించే చలి, వేసవిగాలులు, తుఫానులు వేటికీ వారు వెనుకంజ వేయలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలతో వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించేది లేదంటూ ప్రతినబూనారు. మాజీ సైనికుడు, వైద్యుడు, ఎన్నికల సర్వే అధికారి, జాత్‌ నేత, మహిళా హక్కుల కార్యకర్త ఇలా కొందరు రైతుల నిరసనను ఏడాది పాటు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. కొందరి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. ఈ ఉద్యమంలో పాల్గన్న ప్రతి రైతు ఒక నాయకుడే. ఇది భారత్‌లో ప్రజా ఉద్యమాలను పునర్నిర్వచించింది. భవిష్యత్‌ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వారి నాయకత్వంతో రైతుల మధ్య రాజకీయ విభజనను తగ్గించడంలో సహాయపడిరది. పంజాబ్‌,హర్యానా,ఉత్తర ప్రదేశ్‌ నుండి రైతులు ఉమ్మడి వేదికపై సమావేశమై సుదీర్ఘ కాలం పోరాడేందుకు మార్గం సుగమం చేసింది.
మహిళల పాత్ర
ఈ నిరసనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కీలకంగా మారింది. ఉద్యమంలో మహిళల గొంతును వినిపించేలా చేయడంలో హరీందర్‌ బిందు, జస్బీర్‌ కౌర్‌ నట్‌లు ముందంజలో ఉన్నారు. ప్రత్యేక మరుగుదొడ్లు వంటి వసతులు లేనప్పటికీ ట్రాక్టర్లు నడిపారు. విప్లవ గీతాలు పాడారు. జాతీయ రహదా రులను తమ నివాసాలుగా మార్చు కున్నారు. పితృస్వామ్య సమాజం, పురుష ఆధిక్య సమాజంలో పలువురు సామాజిక శాస్త్రవేత్తలు మహిళా మేల్కోల్పును చూశారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) ఏక్తా ఉగ్రహాన్‌ మహిళా విభాగం ఇన్‌చార్జ్‌ హరీందర్‌ బిందు పంజాబ్‌లోని మారుమూల గ్రామాల నుండి మహిళలను ఉద్యమంలో నిమగం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె స్వయంగా నిరసన ప్రాంతంలోనే నెలల తరబడి ఉన్నారు. నిరసనలో చేరేలా పలువురు మహిళలను ప్రోత్సహించారు. పంజాబ్‌ వ్యవసాయ సంస్థలలో మహిళల భాగస్వామ్యాన్ని చూసి, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలోని తమ సహచరులు కూడా మహిళలను నిరసనలోకి తీసుకువచ్చేలా ప్రేరణ పొందారని, ఇది గొప్ప విజయమని ఆమె హరీందర్‌ అన్నారు. పంజాబ్‌లోని ప్రముఖ మహిళా రైతు నేతల్లో ఒకరైన జస్బీర్‌ కౌర్‌ తిక్రీ సరిహద్దుల్లోని నిరసనలో మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించారు. పంజాబ్‌ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులుగా జస్బీర్‌ వ్యవహరిస్తున్నారు. కాలేజీ రోజుల్లో దళిత హక్కుల కార్యకర్తగా పనిచేసిన ఆమె వ్యవసాయ రంగంలో మహిళల దుస్థితిని చూసి పోరాటం దిశగా వారిని నడిపించేందుకు నడుం బిగించారు.ఆమె కుమార్తె నవకిరణ్‌ నట్‌ కూడా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రైతు ఉద్యమాన్ని గురించి వివరించిన వార్తాపత్రిక ట్రాలీటైమ్స్‌ వ్యవస్థాపక సభ్యులలో నవకిరణ్‌ కూడాఉన్నారు. గతేడాది నుండి వీరిద్దరూ నిరసన ప్రాంతంలోనే ఎక్కువ సమయం గడిపారు.
డా. దర్శన్‌ పాల్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా కింద వివిధ రైతు సంఘాలను ఏకం చేసి సైద్ధాంతిక రూపాన్ని అందించిన దర్శన్‌ పాల్‌ వైద్యుడని చాలా మందికి తెలియదు. పంజాబ్‌ సివిల్‌ మెడికల్‌ సర్వీస్‌లో అనస్థీషియా విభాగంలో పనిచేసే ఆయన 2000 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2016లో క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌లో చేరడానికి ముందు రైతు సంఘాల కార్యకలాపాలలో పాల్గొన్నారు. అనంతరం ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఉద్యమంలో పాల్గనడమే కాకుండా నిరసన ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందేందుకు కృషి చేశారు. రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వాలని మొదటి నుండి ఆయన పోరాటం చేశారు. 2020 జూన్‌లో కేంద్రం వ్యవసాయ ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించిన రైతు సంఘాల్లో ఆయనది కూడా ఒకటి. ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెఎస్‌సిసి)లో సభ్యులు కూడా. పంజాబ్‌ నుండి ఉద్యమాన్ని ఢల్లీి వరకు తీసుకెళ్లడంలో పాల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన ప్రేరణతోనే ఎఐకెఎస్‌సిసి సభ్యులు యుపి,రాజస్తాన్‌,కర్ణాటక, మహారాష్ట్ర నుండి రైతులను ఢల్లీి సరిహద్దులకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు.
రాకేష్‌ తికాయత్‌
పశ్చిమ యుపికి చెందిన జాత్‌ నేత రాకేష్‌ తికాయత్‌ వ్యవసాయ ఉద్యమాన్ని పునరు ద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు. పంజాబ్‌,హర్యానా నుండి రైతు నిరసనను ఢల్లీికి మారినప్పటికీ కొన్ని నెలల పాటు తికాయత్‌ పేరు వినిపించలేదని రాజకీయవిశ్లేషకుడు అశుతోష్‌ కుమార్‌ తెలిపారు. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీ అనంతరం రైతుల నిరసన విఫలమవుతుందనుకున్న సమయంలో తికాయత్‌ ముందుకు వచ్చారు. ఆయన ఉద్వేగ భరితమైన ప్రసంగాలు రైతులను ఉత్తేజ పరిచాయి. అనంతరం నిరసన మరింత బలంగా మారింది. తికాయత్‌ తండ్రి మొహీందర్‌ తికాయత్‌ కూడా వ్యవసాయ నేత అని, 1980లో కేంద్ర ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారని అశుతోష్‌ తెలిపారు. నిరసనలో కుల, మత విభజనలను తలెత్తకుండా ఉండేందుకు పలు మహా పంచాయత్‌లను నిర్వహించారు.
బల్బీర్‌ సింగ్‌ రేజ్వాల్‌
పంజాబ్‌ నుండి ఢల్లీికి ఉద్యమాన్ని తీసుకెళ్ల డంలో కీలకంగా వ్యవహరించిన మరో నేత బల్బీర్‌సింగ్‌ రేజ్వాల్‌. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)లో ప్రముఖంగా వ్యవ హరించారు. అనంతరం భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు)ని ఏర్పాటు చేసి రైతు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. వివిధ సమస్యలపై పంజాబ్‌లోని రైతులను ఐక్యం చేసిన అనుభవం ఉద్యమంలో రైతులను సమీకరించడంలో ప్రముఖంగా నిలిచింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టి నప్పటినుండి బల్బీర్‌ సింగ్‌ ట్రాక్టర్‌ ర్యాలీలు చేపడుతూ నిరసన తెలిపారు. అనంతరం ఢల్లీి సరిహద్దులోనూ ఉద్యమాన్ని నడిపించారు.
జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌
మాజీ సైనికుడైన జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌ పదవీ విరమణ అనంతరం వ్యవసాయం ప్రారంభించారు. 2002లో బికెయు (ఏక్తా ఉగ్రహాన్‌) స్వంత శాఖను ఏర్పాటు చేసుకు న్నారు. పంజాబ్‌లోని మాల్వా ప్రాం తంలో రైతుల ఉద్యమం సుమారు ఏడాది పాటు కొన సాగేలా చర్యలు చేపట్టారు. చిన్న, సన్నకారు రైతులతో ఉన్నప్పటికీ.. రైతు సంఘాల్లో అతి పెద్ద సభ్యత్వాన్ని కలిగి ఉందని మాజీ ప్రొఫెసర్‌ మంజిత్‌ సింగ్‌ తెలిపారు.
యోగేంద్ర యాదవ్‌
ఉద్యమ ప్రతినిధి యోగేంద్రయాదవ్‌ అనడంలో అసత్యం లేదనేలా ఉద్యమంలో యోగేందర్‌ పాలుపంచుకున్నారు. ఎన్నికల సర్వే అధికారి, కార్యకర్త అయిన యోగేంద్ర ఉద్యమాన్ని గురించి ఆంగ్లంలో అందరికీ చేరువయ్యేలా చేశారు. యోగేంద్ర యాదవ్‌ ఇంటర్వ్యూలు నిరసనలను ప్రపంచప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లాయి. నిరసనలపై అసత్యాలు ప్రచారం చేసినప్పుడల్లా మీడియా సమావేశాల ద్వారా ఎస్‌కెఎం వైఖరిని స్పష్టం చేశారు. (‘ది వైర్‌’ సౌజన్యంతో)
-గునపర్తి సైమన్‌

అడుగంటిన బొగ్గు నిక్షేపాలు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విద్యుత్‌ కేంద్రా లలో బొగ్గునిల్వలు అంతరించి పోవడంతో రాబో యే రోజుల్లో రాష్ట్రం అంధకారమయం కానున్నది. బొగ్గు నిల్వలు తగినంతగా ఉన్నాయా లేవా అని ముందుచూపు లేనట్లు ప్రభుత్వాలు వ్యవహ రిస్తు న్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రజలకు విద్యుత్‌ పొదుపు గురించి ఉచిత సల హాలు మాత్రం ఇస్తున్నారు విద్యుత్‌ శాఖ అధికారులు. సాయంత్రం పూట ఆరు గంటల నుండి పది గంటల వరకు ఏసీలు వాడొద్దని సెలవిస్తు న్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గునిల్వల కొరత ఏర్పడటం, కేంద్రం నుంచి సహకారం లభించక పోవడం వంటి కారణాలతో రాష్ట్రంలోని ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు బొగ్గు సంక్షోభం బారిన పడ్డాయి. ఇప్ప టికే చాలా వరకూ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అంత రించిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా సగం కెపాసిటీ మేరకే విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్‌ కోతలు విధిస్తోంది. సింగరేణి గను లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని పవర్‌ ప్లాంట్లకు రావాల్సిన బొగ్గు నిల్వలు దాదాపుగా నిలిచిపోవడంతో పవర్‌ ప్లాంట్లు అల్లాడు తున్నాయి. మన రాష్ట్రంలో 9ధర్మల్‌ విద్యుత్‌ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో విశాఖ జిల్లా పరవాడలోని ఎన్టీపీసీ సింహాద్రి సూపర్‌ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 2000 మెగావాట్లు, గాజువాక లోని వీటీపీఎస్‌లో 1040 మెగావాట్లు, విజయవాడలోని ఎన్టీ పీఎస్‌లో 1760 మెగావాట్లు,కడప జిల్లా ముద్దనూరు లోని ఆర్టీపీఎస్‌ లో 1650 మెగా వాట్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని డీఎస్టీపీఎస్‌ లో 1600 మెగావాట్లు,సింహపురి ధర్మల్‌ పవర్‌ స్టేషన్లో 600 మెగావాట్లు,మీనాక్షి ధర్మల్‌ పవర్‌ స్టేషన్లో 1000 మెగావాట్లు, సెంబ్‌ కార్ప్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌లో 1320 మెగావాట్లు, ఎస్జీపీఎల్‌ పవర్‌ స్టేషన్లో 1320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ మొత్తం ప్లాంట్లు కలిపి 12 వేల 290 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కాని బొగ్గు కొరత కారణంగా సగం ఉత్పత్తే సాధ్యమవుతోంది. కొన్ని రోజులుగా ఇదే పరిస్ధితి. ప్లాంట్లు పూర్తిగా పని చేయక పోవడంతో ఆమేరకు విద్యుత్‌ ఉత్పత్తి కూడా భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. రేపు,ఎల్లుండి కల్లా మిగిలిన నిల్వలు కూడా తరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.అప్పుడు ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. బొగ్గు కొరత కార ణంగా ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రతిరోజూ దాదాపు 2000 మెగావాట్లకు పైగా కొరత ఏర్పడుతోంది. ఇది ఇవాళ రేపట్లో మరింత ఎక్కువ కానుంది. సంక్షోభం తీవ్రతరం అయితే, డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్‌ నుండి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడ డడంతో….బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు కొనాల్సిన దుస్థితి ఏర్పడిరది. అలా చేయాలన్నా ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు ఉండాలి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం…ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. పైగా ఇప్పటికే ఆస్తి పన్ను, ట్రూ అప్‌ చార్జీల పేరుతో విద్యుత్‌ చార్జీల పెంపుదలపై ప్రజాగ్రహనికి గురైంది. ఇప్పుడు విద్యుత్‌ కొనుగోలుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి డిస్కంలపై ఆర్థిక భారం తగ్గించాలంటే విద్యుత్‌ చార్జీలు పెంచక తప్పదు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యంచేసి, ప్రతి రోజు డీజిల్‌,పెట్రోలు,గ్యాసు నిత్యావసర సరుకులు ధరలను పెంచుకుంటూ పోతోంది కేంద్ర ప్రభు త్వం. చెంపదెబ్బ గోడ దెబ్బ మాదిరిగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.
విద్యుత్‌ సంక్షోభంపై కేంద్రం అప్రమత్తం..
దేశంలోని అనేక విద్యుత్‌ కంపెనీలలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాలలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిరది. మున్ముందు కాలంలో దేశంలోని పలు ప్రాంతా ల్లో కారు చీకట్లు అలుముకోనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ముందుగా దక్షిణ భారత దేశంలోని బెంగళూరు పట్టణంలో అంధకారం నెలకొంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్‌ సంక్షోభం,బోగ్గు నిల్వల కొరతపై దృష్టిసారించింది. బొగ్గు నిల్వల కొరత, విద్యుత్‌ అంతరాయాల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర అప్రమత్తమై.. అధి కారులు,బొగ్గు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు హోంమంత్రి అమిత్‌ షా..ఇప్పటికే కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌ కె సింగ్‌,బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలో బొగ్గు నిల్వల కొరత,విద్యుత్‌ అంతరాయాల నేపథ్యంలో ఈ సమీక్షపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు ప్లాంట్లల్లో విద్యుత్‌ ఉత్పత్తిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రాల్లో దిగజారుతున్న పరిస్థితుస్థిలపై ఢల్లీి, పంజాబ్‌,కేరళ,మహారాష్ట్ర,కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. దీంతో పాటు విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అక్టోబర్‌ 7న కేంద్ర విద్యుత్‌ అథారిటీ నివేదిక ప్రకారం, దేశంలోని 135 ప్లాంట్లలో 110కర్మాగారాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అలాగే 16 ప్లాంట్లలో ఒక్క రోజుకు సరిపడా కూడా బొగ్గు నిల్వ లేదని సమచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే బొగ్గు సరఫరాను పెంచినట్లు కోల్‌ ఇండియా ప్రకటనను విడుదల చేసింది. దసరా అనంతరం బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతా మని ప్రకటించింది.
అసలు బొగ్గు కొరతకు కారణాలేంటి.?
నల్లబంగారానికి డిమాండ్‌ పెరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. సరఫరా చేయడానికి సరిపడా బొగ్గు ‘కోల్‌ ఇండియా’ దగ్గరఉందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ కావాల్సినంత బొగ్గు ఉందం టోంది. కానీ..థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మాత్రం కొన్ని రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. అసలు ఈ కొరతకు కారణాలేంటి? కరెంట్‌ అవసరం ఒక్కసారిగా ఎందుకు పెరి గింది? కొన్ని రోజుల నుంచి బొగ్గు కొరతకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపి స్తున్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్‌ కొరత తప్పదనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. మనది ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా మునుపెన్నడూ లేని విధంగా కరెంట్‌ సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 70శాతం ఎలక్ట్రిసిటీ థర్మల్‌ ప్లాంట్ల నుంచే వస్తుంది. అయితే.. కొన్నాళ్ళ క్రితం కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉండడం వల్ల కంపెనీలు మూత పడ్డాయి. దాంతో కరెంట్‌ వినియోగం తగ్గింది. ఆ తర్వాత కంపెనీలు తెరిచినా థర్డ్‌ వేవ్‌ భయంతో పూర్తి ఆక్యు పెన్సీతో పనిచేయలేదు. తక్కువ స్టాఫ్‌తో తక్కువ ప్రొడ్యూస్‌ చేశాయి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీలు పూర్తి కెపాసిటీతో పనిచేస్తు న్నాయి. దానివల్ల కరెంట్‌ వాడకం బాగా పెరిగింది. ప్రొడక్షన్‌ పెంచాల్సి వచ్చింది. కానీ.. ప్రొడక్షన్‌కి తగ్గట్టు బొగ్గు సరఫరా జరగడం లేదు. దానివల్ల నిల్వలు తగ్గుతు న్నాయి. ఈ కొరత ఇలాగే కొనసాగితే ఈ ఎఫెక్ట్‌ దాదాపు అన్ని రంగాల మీద పడే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. దేశంలో బొగ్గు కొరత ఉందని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి చెప్పినా.. కేంద్రం మాత్రం పరిస్థి తులు బాగానే ఉన్నాయని అవసరమైనంత బొగ్గు సరఫరా చేయడానికి రెడీగా ఉన్నామని చెబు తోంది. కాకపోతే ప్లాంట్లలో నిల్వలు తక్కువగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. పైగా ‘‘ఎవరికి కావాలో చెప్పండి. సప్లై చేస్తాం’’ అంటూ కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ చెప్పారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. కానీ..అది కేవలం స్టోరేజీ మాత్రమే ప్రతి రోజూ సప్లై జరుగుతూనే ఉందన్నారు. దీంతో అసలు బొగ్గు కొరత ఉందా? లేదా? అని అందరూ చర్చించుకుం టున్నారు. అయితే.. పరిస్థితులను బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నదనే తెలు స్తోంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు బాగా పెరిగాయి. పొరుగు దేశం చైనా లో బొగ్గు కొరత వల్లే కరెంట్‌ ప్రొడక్షన్‌ బాగా తగ్గింది. పరిశ్రమలతోపాటు ఇళ్లకు కూడా కరెంటు కోతలు పెడుతున్నారు. అదే పరిస్థితి మనకూ వచ్చే ప్రమాదముందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఇక బొగ్గు సరఫరా లేకపోవడం వల్లే బీహార్‌,రాజస్థాన్‌,జార్ఖండ్‌,పంజాబ్‌,ఏపీ వంటి రాష్ట్రాల్లో కరెంట్‌కోతలు ఎక్కువగా ఉంటున్నాయని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు.
మనకూ సమస్యేనా?
సింగరేణి బొగ్గు గనులు మన రాష్ట్రంలోనే ఉన్నా..రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. జెన్‌కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో మామూలుగా 15రోజులకు సరిపడా బొగ్గు స్టోర్‌ చేస్తారు. కానీ..ఇప్పుడు నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు,ఈస్టేషన్లకు తక్కువగా సప్లై చేస్తూ, కొరతతో ప్రొడక్షన్‌ ఆగిపోయే స్థితిలో ఉన్న స్టేషన్లకు సింగరేణి సంస్థ బొగ్గు సప్లై చేస్తోందని తెలుస్తోంది. కానీ..వర్షాలవల్ల కొన్నా ళ్ల సింగరేణిలో ప్రొడక్షన్‌ తగ్గినా ఇప్పుడు మళ్లీ మెరుగుపడిరది. ఇప్పుడు రోజుకు 1.8 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తోంది. అందులో తెలంగాణలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్లకు 30,000టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. మిగతాది కర్నాటక,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు సరఫరా అవుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి తెలంగాణలో ఎటువంటి సమస్య రాదని తేల్చిచెప్పారు. ‘‘తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’’ (ుూGజుచీజూ) ప్రకారం.. తెలంగాణలో థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో 3,772.5 మెగావాట్ల కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చు. ప్రస్తుతం 3.8 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి చెప్పారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం దగ్గర ఉన్న 2,600 మెగావాట్ల నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ పవర్‌ స్టేషన్‌ కూడా తెలంగాణలో కరెంట్‌ సరఫరాకు సాయం చేస్తుంది.
‘పిట్‌హెడ్‌’ కాబట్టి ఇబ్బంది లేదు
బొగ్గు గనులకు 50కిలోమీటర్లలోపు ఉండే థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను ‘పిట్‌హెడ్‌’ అంటారు. వీటికి బొగ్గును అందించడం పెద్ద కష్టమేమీ కాదు. అందువల్ల ట్రాన్స్‌పోర్టేషన్‌ టైం, ఖర్చు కూడా చాలా తక్కువ. మన దగ్గర ఎక్కువగా ‘పిట్‌హెడ్‌’ ప్లాంట్లే ఉన్నాయి. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
కొరత ఎందుకొచ్చింది?
పొరుగుదేశం చైనాలో కూడా కరెంట్‌ కొరత ఏర్పడిరది. కొన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఆ పరిస్థితి మనకు రాకూడదనే బొగ్గు మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఇంటర్‌-మినిస్టీరియల్‌ సబ్‌-గ్రూప్‌ వారానికి రెండుసార్లు బొగ్గు స్టాక్‌ పరిస్థితి గురించి తెలుసుకుంటోంది. సమస్యలను పరిష్కరిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌,వర్షాలు, ఫ్యాక్టరీలు ఎక్కువ కరెంట్‌ వాడడం ఇలా.. బొగ్గు కొరత ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్‌
లాక్‌డౌన్‌ వల్ల స్టాఫ్‌ని తగ్గించుకున్న ఫ్యాక్టరీలు మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయేమోననే భయంతో పూర్తి ఆక్యూపెన్సీతో ప్రొడక్షన్‌ మొదలుపెట్టలేదు. కానీ.. ఇప్పుడు మళ్లీ తేరుకున్నాయి. స్టాఫ్‌ని పెంచుకుని పూర్తి కెపాసిటీతో ప్రొడక్షన్‌ మొదలుపెట్టాయి. మళ్లీ మామూలు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా కరెంట్‌కు డిమాండ్‌ పెరిగింది. కరెంట్‌ వాడకం పెరగ డం వల్ల దాని ప్రొడక్షన్‌కు ఉపయోగించే బొగ్గుకు కూడా డిమాండ్‌ బాగా పెరిగింది. అందుకే కొరత ఏర్పడిరది. ఈమధ్యే దేశంలో కరెంట్‌ వాడకం రోజుకు 4బిలియన్‌ యూనిట్లు దాటింది. ఇందులో 65నుండి 70శాతం బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతోంది. 2019 ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నెలకు దాదాపు 106.6 బిలియన్‌ యూనిట్లు, అదే 2021లో నెలకు 124.2 బిలియన్‌ యూనిట్లు కన్జ్యూమ్‌ అయింది.
వర్షాలు:
ఈ ఏడాది సెప్టెంబర్‌లో బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడ్డాయి. దాంతో ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీళ్లు నిండడం వల్ల కోల్‌ ప్రొడక్షన్‌ తగ్గింది. ఈ సమస్య దాదాపు ప్రతి ఏటా ఉంటుంది. కానీ..ఈ సారి డిమాండ్‌ పెరిగి, ప్రొడక్షన్‌ తగ్గడంతో కొరత ఏర్పడిరది. రుతుపవనాల మొదలవడానికి ముందే ఎక్కువ బొగ్గును స్టోర్‌ చేసుకోగలిగితే ఈ సమస్య వచ్చేది కాదు.
ఇంటర్నేషనల్‌ మార్కెట్‌
అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు బాగా పెరిగాయి. మనం ఎక్కువగా ఇండోనేసియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. ఇండోనేసియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధర మార్చి-2021లో టన్నుకు 60డాలర్లుగా ఉంది. అదే (సెప్టెంబర్‌, అక్టోబర్‌లో 160 డాలర్లకు పెరిగింది. దానివల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న ప్లాంట్లలో ప్రొడక్షన్‌ తగ్గింది. 2019తో పోల్చితే ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసు కుంటున్న బొగ్గుతో ప్రొడ్యూస్‌ చేసే కరెంట్‌ 2021లో 43.6శాతం తగ్గింది. దీంతో బొగ్గు కొరతను తగ్గించేందుకు కోల్‌ ఇండియా బొగ్గు ప్రొడక్షన్‌ను పెంచింది. అక్టోబర్‌ 7న, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (జIూ)1.501 మిలియన్‌ టన్నుల బొగ్గును సప్లై చేసింది. దానివల్ల వాడకానికి, సప్లైకి మధ్య ఉన్న తేడాని తగ్గిం చింది. సప్లై క్రమంగా పెంచాలని బొగ్గు మంత్రిత్వశాఖ తెలిపింది.
అందరికీ ఇదే పరిస్థితి
మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ధరల పెరుగుదల, పెట్రోల్‌ సంక్షోభం వంటివి ఇబ్బందికరంగా మారాయి. యూరప్‌ లో నేచురల్‌ గ్యాస్‌ ధర ఈఏడాది దాదాపు నాలుగింతలు పెరిగింది. ఇక కరెంట్‌ చార్జీలు మూడిరతలు పెరిగాయి. మన దేశంలో కూడా పెట్రోల్‌,వంట గ్యాస్‌ ధరలు బాగా పెరిగాయి. కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో ఏకంగా ఫుడ్‌ ఎమ ర్జెన్సీ ప్రకటించారు.ఎండ ఎక్కువగా ఉంటేనే కరెంట్‌ ఎక్కువ ప్రొడ్యూస్‌ అవుతుంది. గాలితో కూడా కరెంట్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చు. విండ్‌ పవర్‌ను కరెంట్‌గా మార్చడానికి విండ్‌ టర్బైన్‌లను వాడతారు. దీనికి మెకానికల్‌ పవర్‌ కోసం గాలి మరలను వాడతారు. కాకపోతే ఇది గాలి ఎక్కువగా వీచినప్పుడే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఖర్చయ్యే కరెంట్‌లో విండ్‌ పవర్‌తో దాదాపు రెండు శాతం ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. నేచురల్‌ గ్యాస్‌ టర్బైన్లు, ఆవిరి టర్బైన్లను వాడి కరెంట్‌ను ఉత్పత్తి చేయొచ్చు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల కంటే నేచురల్‌ గ్యాస్‌ మండిర చడంవల్ల తక్కువ కాలుష్యం అవుతుంది. ఇది చాలా తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను రిలీజ్‌ చేస్తుంది.కాబట్టి థర్మల్‌ పవర్‌ కంటే నేచురల్‌ గ్యాస్‌తో కరెంట్‌ను ప్రొడ్యూస్‌ చేయడమే బెటర్‌. నేచురల్‌ గ్యాస్‌ వల్ల పెట్రోలి యంను కాల్చడం కంటే 30%తక్కువ, బొగ్గును కాల్చడం కంటే 45%తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ రిలీజ్‌ అవుతుంది.న్యూక్లియర్‌ ఫూజన్‌ ద్వారా ఇది పవర్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. కాబట్టి ఇదిథర్మల్‌ పవర్‌ కంటే బెటర్‌. ఎందుకంటే ఇందులో కార్బన్‌ ప్రొడ్యూస్‌ అవ్వదు. థర్మల్‌ నుంచి న్యూక్లియర్‌ పవర్‌కి మారడం వల్ల డీకార్బోనైజింగ్‌ అవు తుంది. కానీ.. న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్ల సేఫ్టీపై ఎన్నో భయాలు ఉన్నాయి. అందుకే మన దేశంలో అణు విద్యుత్‌ చాలా తక్కువగానే ఉత్పత్తి అవుతుంది.
కొరత రాకుండా ఏం చేయాలి?
బొగ్గు కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసు కోవాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వర్షాలు, వరదల వల్ల సెప్టెంబర్‌లో బొగ్గు ప్రొడక్షన్‌ తగ్గుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. వర్షాకాలం రాకముందే ఎక్కువగా తవ్వి స్టోర్‌ చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే.. ఎలాగూ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైడల్‌ పవర్‌ జనరేషన్‌ కెపాసిటీని పెంచుకోవాలి. సెప్టెంబరు 30 వరకు గడిచిన ఆరు నెలల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నుండి 14%,మాత్రమే కరెంట్‌ ప్రొడ్యూస్‌ అయింది. డ్యామ్‌ల దగ్గర మరిన్ని హైడ్రో పవర్‌ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని అల్యూమినియం, సిమెంట్‌ కంపెనీలు ఎక్కువగా బొగ్గును కొంటుంటాయి. ఆ కొనుగోళ్ల మీద కూడా ఎప్పటికప్పుడు కంట్రో ల్‌ ఉండాలి. దేశంలో బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతుండడం వల్ల రిఫైనరీల నుంచి అల్యూ మినియం, మాం సం ప్రాసెసింగ్‌ చేసే సంస్థల వరకు చాలా కంపెనీలపై ఎఫెక్ట్‌ పడుతోంది. ఎక్కువ ఎఫెక్ట్‌ పడే కంపెనీలు ఇవి..
పెట్రోలియం
పవర్‌ రేషన్‌ పరిస్థితి మరింత దిగజారితే… పెట్రోలియం రంగం మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్‌ పడే ప్రమాదం ఉంది. అయితే.. పెట్రోలియం రిఫైనరీలకు ఎక్కువగా కరెంట్‌ అవసరం ఉంటుంది. ఒకవేళ వాటికి సరిపడా కరెంట్‌ అందించకపోతే వాళ్లకున్న క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి పవర్‌ జనరేట్‌ చేసు కుంటారు. అయితే.. వాటిలో చాలా యూనిట్లు గ్యాస్‌ ద్వారా నడుస్తాయి. దానివల్ల నేచురల్‌ గ్యాస్‌ ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ రంగంలో ప్లాస్టిక్‌, ఫైబర్‌, సింథటిక్‌ రబ్బర్‌ తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెహికల్‌ టైర్లు, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ తయారుచేసే వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు. కొన్ని పరిశ్రమలకు సొంత పవర్‌ యూనిట్లు ఉండవు. అందుకని ప్రొడక్షన్‌ ఆగకుండా ఉండేందుకు వాళ్లు డీజిల్‌ జనరేటర్లను వాడతారు. ఇండియాలో పెద్దస్టీల్‌ ఫ్యాక్టరీలకు సొంత పవర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్లు బొగ్గును వేలం పాటలో కొనుక్కుంటారు. ఇక చిన్న చిన్న ఫ్యాక్టరీలు సొంతంగా కరెంట్‌ను తయారు చేసుకోలేవు. కాబట్టి వీటిలో ప్రొడ క్షన్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
-డా.ఎం.సురేష్‌ బాబు

చత్తీష్‌ఘ‌డ్ గ‌వ‌ర్న‌ర్‌తో స‌మ‌త ర‌వి భేటీ

చత్తీష్‌ఘర్‌ రాష్ట్ర పీసా చట్టం గ్రూప్‌ వర్కింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌,సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి ఆ రాష్ట్ర గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌తో రవి పలు అంశాలు ప్రస్తావించారు. షెడ్యూల్‌ ప్రాంత చట్టాలు పరిరక్షణ, పీసా చట్టం`1996 అమలు,గ్రామసభల పటిష్టకు కృషి చేస్తానని తెలిపారు. షెడ్యూల్డు ప్రాంత పాలన,రాజ్యాంగ నియమాలు,భూమి బదలాయింపు నిబంధనలు 1/70,అటవీ హక్కుల గుర్తింపు చట్టం`2006,ఆదివాసీ హక్కలు వంటి కీలకమైన విషయాలుపై చర్చించారు. అదేవిధంగా సమత వ్యవస్థాపక దినోత్సవం ఏర్పా టుపై గవర్నర్‌ అనుసూయ ఉయిక్‌తో ప్రస్తావించారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. చారిత్రాత్మకమైన సమత తీర్పు షెడ్యూల్‌ ప్రాంత ఆదివాసీలకు రక్షణ కవచంలాంటిదని కొనియాడారు.గిరిజన హక్కులను పునరుద్దరించిన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుని పేర్కొన్నారు.ఆదివాసీ హక్కుల కోసం పోరాడే ఒక చిన్న సామాజిక కార్యాచరణ సంస్థ అయిన సమత అన్యాయాలపై గళమెత్తడానికి వివిధ మార్గాలను ఎంచుకొని చైతన్యవంతమైన రాజకీయ నిర్ణయాలు,న్యాయసాధనకు అసంఖ్యాక న్యాయమార్గాల ద్వారా ప్రజా ఉద్యమాన్ని నడిపిన మహా కర్తవ్యమని సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిని ప్రశంసించారు.అట్టడుగు స్థాయిలో గిరిజనుల సంక్షేమం,అభ్యున్నతికోసం శ్రమించే సామాజిక సంస్థని కితాబునిచ్చారు. గవర్నర్‌ను కలసిన వారిలో మైన్స్‌,మినరల్స్‌ అండ్‌ పీపుల్స్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ శర్మాలి(గుజరాత్‌)సమత డైరెక్టర్‌ విక్కీ పాల్గొన్నారు.- గునపర్తి సైమన్‌

ప్రకృతి వైఫరిత్యాలు`పెరుగుతున్న మార్పులు

భూకంపం,తుఫాను,వరదలు,సునామీ మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి,ప్రాణనష్టాలు జరు గుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొన డానికి,ముందుగా సిద్ధం కావటానికి మానవ చైత న్యం అవసరం.పునరావాస పనులు,ప్రథమ చికిత్స, ఆహారం,బట్ట్‌లు,మందులు,రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురించి ప్రజలు తగినంత అవగాహన కలిగివుండాలి.

ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం. అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాలవంటి ప్రకృతివైపరీత్యాలు సంభ వించ డంవల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాలబారిన పడ తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్ర మత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు,ఆహారపదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకో వలసిన జాగ్రత్తలపట్ల అవగాహన కలిగించడానికి ప్రయ త్నం చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు 12 నుండి 15 సంవత్సరాల వయస్సుగల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధా న్యత ఇవ్వాలి. ఓవైపు కరోనా వైరస్‌ కల్లోలం..
మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. ఇక వర్షాలు, వరదలతో సీజనల్‌ వ్యాధు లు కూడా విరజంభించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఏపీప్రభుతం చర్యలు చేపట్టింది. తాజాగా ఏపీరాష్ట్రవిపత్తుల నిర్వహణశాఖ ప్రభుత్వ కోవిడ్‌-19 నియమాలు పాటిస్తూ సహాయక చర్యల్లోని అధికారులకు సహకరించండని సూచిస్తూ ప్రజలకు ఓ లేఖను రిలీజ్‌ చేసింది. అంతేకాదు.. ప్రజలు వరదల సమయంలో ఏమి చేయాలి.. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలి..ఒకవేళ వరదలు లోతట్టు ప్రాంతాలకు వస్తే.. అక్కడ ప్రజలు ఏ విధమైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి అనే అంశాలను వివరిస్తూ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె. కన్న బాబు ఓలేఖను రిలీజ్‌ చేశారు
వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ా వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
ా మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
ా విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్‌ స్తంభాలతో పాటు, పడిపోయిన విద్యుత్‌ లైన్ల కు దూరంగా ఉండండి.
ా ఓపెన్‌ డ్రెయిన్స్‌ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆప్రదేశంలో కనిపించే విదంగా చిహ్నాలు,ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
ా వరదనీటిలో నడవకండి లేదా డ్రైవ్‌ చేయవద్దు
ా రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
ా తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి.
ా తినే ఆహార పదార్ధాలపై ఎల్లపుడూ మూతలు వేసి ఉంచండి
ా వేడిచేసిన లేదా క్లోరినేటెడ్‌ నీరు త్రాగాలి.
ా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు
వరదల వచ్చిన తర్వాత చేయాల్సిన / చేయకూడని పనులు
్చ మీ పిల్లలను వరద నీటిలో ఆడనివ్వకండి
్చ రిపేర్‌కు వచ్చిన విద్యుత్‌ వస్తువులను ఉపయోగించవద్దు
్చ అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందించిన ప్రధాన స్విచ్లులను,ఎలక్ట్రిక్‌ ఉపకరణాలను వాడడం మానెయ్యాలి
్చ తడిగా ఉంటే విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.
్చ విరిగిన విద్యుత్‌ స్తంభాలు,తీగలు,పదునైన వస్తువులను పరిశీలించండి
్చ వరద నీటిలో కలిసిన ఆహారం తినవద్దు.
్చ మలేరియావంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
్చ వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
్చ నీటి మార్గాలు/మురుగునీటిపైపులు దెబ్బతి న్నట్లయితే టాయిలెట్‌ లేదా కుళాయి నీటిని వాడకండి.
్చ నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.
్చ మీ ప్రాంతంలో వరదలు సంభవించి ఖాళీ చేయవలసివస్తే మంచం,టేబుళ్లపై మీ ఫర్నిచర్‌ ఇతర ఉపకరణాలను పెట్టండి.
్చ టాయిలెట్‌ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి
్చ మీ కరెంట్‌,గ్యాస్‌ కనెక్షన్‌ ను ఆపివేయండి
్చ ఎత్తైన భూ ప్రదేశం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి.
్చ మీ వద్ద ఉన్నఅత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె,విలువైన వస్తువులు,ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్ళండి.
్చ నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.
్చ తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
భూమి వేడెక్కితే ఏం జరుగుతుంది?
గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు. మనుషుల చర్యల వల్ల వాతవరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత15డిగ్రీసెంటీగ్రేడ్లు.గతంలో ఇది ఇంత కన్నా ఎక్కువగా,తక్కువగా కూడా ఉంది.ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ దీనికి కారణమని వారు చెబుతున్నారు.
గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్‌హౌజ్‌వాయువులు గ్రహిం చుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలి తంగా వాతావరణం,భూ ఉపరితంల వేడెక్కు తున్నాయి. ఈఎఫెక్ట్‌ లేకపోతే భూమి ఇంకో 30డిగ్రీ సెంటీగ్రేడ్స్‌ చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమ య్యేది.అయితే ఈ గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌కు పరిశ్రమలు, వ్యవసాయంవల్ల వెలువడే వాయువులుతోడై మరిం త శక్తిని గ్రహించి, ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం),వాతావరణ మార్పులు అంటారు.
గ్రీన్‌ హౌజ్‌ వాయువులు ఇవే…
గ్రీన్‌హౌజ్‌ వాయువుల్లో అత్యంత ప్రభా వవంతమైంది నీటిఆవిరి.కానీ,అది వాతా వర ణంలో కొన్ని రోజులపాటే ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ చాలా కాలం ఉంటుంది. అది పారిశ్రా మికీకరణ కన్నా ముందుఉన్న స్థాయిలకు వెళ్లాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుంది. సముద్రాల్లాంటి సహజ జలవనరులు దాన్ని పీల్చుకోగలవు. శిలాజ ఇంధనాలను మండిరచడంవల్లే అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతోంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి,కాల్చేయడంవల్ల కూడా కార్బన్‌ వెలువడుతోంది.గ్లోబల్‌వార్మింగ్‌ ఎక్కువవు తోంది.1750లో పారిశ్రామిక విప్లవం మొదలై నప్పటితో పోలిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు 30శాతం పెరిగాయి.అయితే,కార్బన్‌డైఆక్సైడ్‌ అం తటి స్థాయిలో అవి లేవు.
గ్లోబల్‌ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?
పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్‌ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి. 2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది. కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనీనదాలు కరుగుతున్నాయి. ఆర్కిటిక్‌ సముద్ర మంచు 1979కి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫొటోలు సూచిస్తున్నాయి. మొక్కల్లో పూలుపూసే, పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలను1.5డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసు కోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు,నాయకులు అంటున్నారు. గ్రీన్‌ హౌజ్‌ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగు తున్న కృషికి ఐరాసనేతృత్వం వహిస్తోంది. ఇప్పటి కిప్పుడు గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారాలు గణనీ యంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది?
వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుదన్నదానిపై స్పష్టత లేదు.ప్రతికూల వాతా వరణ పరిస్థితులు పెరుగతాయి. దీంతో మంచినీటి కొరత ఏర్పడొచ్చు. ఆహారఉత్పత్తిపైనా తీవ్ర ప్రభా వం పడొచ్చు. వరదలు, తుఫానులు, వడగాలుల వల్ల మరణాల సంఖ్య పెరగొచ్చు. భూతాపం పెరగడంవల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. సముద్ర మట్టాలు పెరుగు తాయి కాబట్టి వరదలు కూడా పెరగొచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామ ర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)అంచనా వేసింది. వాతావరణంలో పెరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు ఎక్కువగా పీల్చుకోవడంవల్ల వాటి ఆమ్లత్వం ఇంకా పెరగొచ్చు. కోరల్‌ రీవ్స్‌కు ముప్పు ఏర్పడొచ్చు. వాతావరణ మార్పులపై స్పందించడమే ఈశతాబ్దంలో మానవాళికి అతి పెద్ద సవాలు కాబోతోంది.
`వ్యాసకర్త : వాతావరణ మార్పుల పరిశోధకుడు,సెంట్రల్‌ యూనివర్శిటీ,హైదరాబాద్‌
మల్లేష్‌ నాయక్‌


కుదుపేసిన గులాబ్‌ తుఫాన్‌

గులాబ్‌ తుఫాను గజగజా వణికిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లోను ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు భయపడేలా చేసింది. లోతట్టు కాలనీలను ముంచేసింది. అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. చాలాచోట్ల గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ వ్యాప్తంగా 1.64 లక్షల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.

ఆంధ్రప్రదేశ్‌ను గులాబ్‌ తుఫాను వణి కించింది. ఆనాటి1990తుఫాన్‌ను తలపిం చింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. జోరుమని వీచే గాలులు.. హోరుమని జోరు వాన..ఇళ్ల నుంచి జనంబయకు రావాలంటనే భయపెట్టింది. కళింగపట్నానికి సమీపంలో తీరం దాటిన ‘గులాబ్‌’ తుపాను రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఒడిశాతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్‌కు ఎక్కువ నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా కుండపోతగా కురిసిన వర్షాలకు ఆర్గురు బలయ్యారు. అపార ఆస్తినష్టం సంభవించింది. 1.6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. తుపానుధాటికి ఉత్తరాంధ్రలో విద్యుత్‌, కమ్యూ నికేషన్‌ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-85 కి.మీ వేగం తో వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ స్తంభాలు, మొబైల్‌ సిగల్‌ టవర్లు పడిపోయాయి. చెట్లు కూలి పోయాయి. జలమయమైన పలుగ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు లేక, ఫోన్లు పనిచేయక, సురక్షితమైన మంచినీరు దొరక్క ప్రజలు పడిన అవస్థలు వర్ణనా తీతం. నాగావళి,వంశధార,వేదావతి నదులు పొంగుతుండడంతో వరదలు పొటెత్తే ప్రమాద ముంది.గులాబ్‌ ధాటికి ఒడిశాను అనుకుని ఉన్న ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో వజ్రపు కొత్తూరు, సంత బొమ్మాళి బాగా దెబ్బతి న్నాయి. కోవిడ్‌-19మహమ్మారి నుంచి ఇప్పు డిప్పుడే తేరుకుంటున్న ప్రజలను ఇది కోలుకోలేని దెబ్బతీసింది. లక్షకు పైగా ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగింది. వేరు శనగ, మిరప, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటి ల్లింది. విద్యుత్‌ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు ఈ తుపాను దెబ్బకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పారిశుధ్యం,నీటి సరఫరా వ్యవస్థస్తంభించి పోయిం ది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. గులాబ్‌ విపత్తు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోనే లేదు, మరో తుపాను పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధిక జనాభా, అంతంతమాత్రమే మౌలిక సదుపాయాలు కలిగిన మన దేశంలో చిన్న విపత్తు కూడా పెద్ద నష్టం కలిగించే అవకాశముంది. దీనికి తోడు తుపానుల స్వభావంలోనూ పెనుమార్పులు చోటుచేసుకుం టున్నాయి.
భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం భయంకర తుపా నుల రూపంలో వ్యక్తమవుతుందని వాతావరణ మార్పుల సదస్సు (ఐపిసిసి) చేసిన హెచ్చరిక సరైన దేనని తాజా తుపాను నిరూపించింది. 2020లో బెంగాల్‌ను కుదిపేసిన ‘అంఫని’, అంతకుముందు గుజరాత్‌ను కకావికలం చేసిన ‘తౌకే’్టలతో పోల్చితే గులాబ్‌ తీవ్రత తక్కువే కావచ్చు. కానీ,ఈ ఉష్ణ మండల తుపాను లక్షణాలు చాలా ప్రమాదక రమైనవి. తేమ, అధిక పీడనాశక్తి కలిగి వుండడం వల్ల ఇవి ఒక్కసారిగా కుంభవృష్టిని కురిపిస్తాయి. గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో కురిసిన కుంభవృష్టి ఇందుకొక ఉదాహరణ. 2019లో ఎనిమిది ప్రమాదకర తుపానులు సంభవిస్తే 2020లో అయిదు ప్రమాదకర తుపానులు చోటుచేసుకున్నాయి. వీటి నుంచి పాఠాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. విపత్తు సంభవించిన తరువాత అరకొర పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం ఇది తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరి స్తోంది. గతంలో హుదూద్‌ తుపాను సందర్భంగా వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఆచరణలో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గులాబ్‌ తుపాను గురించి ప్రధాని ఆరా తీశారే తప్ప బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణా లను మాఫీ చేయడానికి వెంటనే సిద్ధపడే మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే విషయంలో కనీస మానవత్వ స్పందననైనా కనపరచకపోవడం దుర్మార్గం. తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, శిబిరాల నుంచి ఇళ్లకువచ్చినవారికి వెయ్యి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏమూలకూ చాలదు. తుపా నులు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఆర్థికంగా, సంస్థాగతంగా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. అలాగే బీమా వ్యవస్థను పటిష్ట పరచడం,పాలనాపరమైన సన్న ద్ధత పెంచుకో వడం,ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం గావించ డం వంటివి చేపట్టాలి. తక్షణం గులాబ్‌ నష్టాలను సమగ్రంగా అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం తగు పరిహారం చెల్లించాలి.
కుదిపేసిన గులాబ్‌ :తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆ తర్వాత అర్ధరాత్రి నుంచే విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మరుచటి రోజు తెల్లవారుజాము నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాల్లోనూ పలుచోట్ల కుంభ వృష్టి కురిసింది. ఈతుఫాను కారణంగా 277 మండ లాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98మండలాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గంటకు 79 కిలోమీటర్ల నుంచి100కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపో కలకు,విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. విజయనగరం,విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతె నల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామా లకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్‌స్టేషన్లు, పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వా సుపత్రుల్లోకి వరద నీరుచేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీట మునిగాయి. భారీవర్షాలకు విశాఖ పట్నంలో వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు 10వేల మంది ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మన్యంలో గెడ్డలు పొంగిపొర్లాయి. జిల్లాలో147విద్యుత్తు సబ్‌స్టేషన్లపై తుపాను ప్రభావం చూపడంతో వందల గ్రామాలు అంధ కారంలో చిక్కుకున్నాయి. రైవాడ, కోనాం మినహా మిగతా అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు. ఈదురుగాలులకు గార, శ్రీకా కుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్య లో వృక్షాలు నేలకొరిగాయి. చాలాచెట్లు విద్యుత్తు తీగల పై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూ లాయి. గిరిజనగ్రామాలు జలది గ్బంధంలో ఉన్నాయి. సాలూరు మండలం మామి డిపల్లి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా నీట మునిగి మం దులు,పరికరాలుఅన్నీ తడిచి పోయాయి. ఈదురు గాలులకు గార, శ్రీకాకుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్యలోవృక్షాలు నేలకొరిగాయి. చాలా చెట్లు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. విజయనగరం జిల్లా నెల్లి మర్ల,గజపతినగరం,పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు,కాజులూరు,కడియం,రామచంద్రా పురం, అమలాపురం,పి.గన్నవరం,కాకినాడ, రాజమహేం ద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు పడ్డాయి. రంపచోడవరం- గోకవరం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీవృక్షం నేలకూలడంతో రాక పోకలు స్తంభించాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నీటిలో నిలిచి పోయింది. స్థానికులు వాగు దాటించారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు, కాజులూరు, కడియం,రామచంద్రాపురం,అమలాపురం, పి.గన్న వరం,కాకినాడ,రాజమహేంద్రవరం,మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10సెం.మీ నుంచి 16 సెం.మీవానలుపడ్డాయి. రంపచోడవరం- గోకవ రం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలు స్తంభిం చాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృ తంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ నీటిలో నిలిచిపోయింది. స్థానికులు వాగు దాటించారు. భారీ వర్షాల ధాటికి విజయ నగరం జిల్లా బొండపల్లి మండలం గదబపేటలో చెట్టుకూలి ఒకరు,తమటాడలో గోడ కూలి మరొ కరు చనిపోయారు. గుర్ల మండలం కోట గండ్రేడు లో ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృత్యు వాతపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి అప్పల నరసయ్య కాలనీలో ఏళ్ల భావన అనే మహిళ మరుగుదొడ్డిలో ఉండగా మరో ఇంటి గోడ కూలి మరుగుదొడ్డిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మర ణించింది. సుజాతనగర్‌లో వర్షంతో విద్యుదాఘా తానికి గురై నక్కా కుశ్వంత్‌ కుమార్‌ అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. తుఫాను కారణంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాలతో చెరువులను తలపిస్తోంది. మోకాళ్ల లోతు నీరులోనే ప్రయాణి కులు ఇబ్బంది పడుతూ ఎయిర్‌ పోర్టులోకి చేరుకోవాల్సి వచ్చింది. విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 750 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రహదారులు, 50 కల్వర్టు లు దెబ్బతిన్నాయి. బొర్రా- చిమిడిపల్లి మార్గంలోని కేకేలైన్‌లో రైలు పట్టాలపైకి బురద కొట్టుకొచ్చింది. కొత్తవలసలో రైలు పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఎల్‌కోట సమీపంలో కొత్తవలస-కిరండోల్‌ మార్గంలో ఒక లైన్‌ దెబ్బతింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1.57 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 6,465 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. చాలా మండలల్లో పైర్లు బాగా పండాయి..
ఈ ఏడాది మంచి పంట వస్తుందని ఆశించిన సమయంలో గులాబ్‌ కన్నీరే మిగి ల్చింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజ లకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుం టామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర,ఉభయగో దావరి జిల్లాల్లో సహాయ,పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరి గిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. ఉత్తరాంధ్రలో గులాబ్‌ తుపాన్‌ బీభత్సం, ఐదుగురు మృతి,ఇద్దరు గల్లంతు
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు
గులాబ్‌ తుపాను వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల రూపాయల పరిహా రాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులను ఆదుకు నేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడ్డ బాధితులకు రూ. 1000, సహాయ శిబిరాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లే బాధితులకూ రూ.1000 తక్షణమే ఇవ్వాలని చెప్పారు. బాధితుల పట్ల మాన వతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలని నష్టం అంచనాలు వేసి రైతులను ఆదుకో వాలని ఆదేశించారు.
పంట నష్ట పరిహారాన్ని కూడా సాధ్య మైనంత త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవా లన్నారు. శ్రీకాకుళం నుంచి సిఎస్‌ ఆదిత్య నాధ్‌ దాస్‌ తుపాను అనంతర పరిస్థితులను సిఎంకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని చెప్పారు. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయని వాటిని తొలగిం చామని అన్నారు. విశాఖ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతంలో సహయ కార్యక్రమాలు ముమ్మరం చేశామని లోతట్టు ప్రాంతాల్లోని వారిని శిబిరాలకు తరలించామని చెప్పారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి మంత్రి బొత్స,శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్‌, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్‌ పాల్గొని తుపాను పరిస్థితులను సిఎంకు వివరించారు.
ధూళి తుఫాన్‌ :
వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్తగా రూపొందించుకుంటున్నారు. ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని నిలిచే రీతిలో సదుపాయాల కల్పన ఉండాలనే స్పృహ పెరిగింది. కానీ మన దేశంలోని నగరాలు మాత్రం వాతావరణ మార్పు వల్ల కలిగే బీభత్సాలకు తట్టుకుని నిలిచే విధంగా లేవు. ఇటీవల ఉత్తరాదిని తుఫాను అల్లల్లాడిరచిన సందర్భంగా ఈ విషయం మరింత స్పష్టమైంది. మన విధాన కర్తలు దృష్టి సారించవలసిన మరో ముఖ్యమైన అంశం వ్యవసాయ రంగం. ప్రకృతి బీభత్సం వల్ల పంట చేను దెబ్బ తినడాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. వాతావరణ మార్పు వల్ల రుతువులు గతి తప్పుతున్నాయి. మన దేశాన్ని వాతావరణ మార్పు వల్ల కలిగే ప్రకృతి బీభత్సాలు వెంటాడుతున్నాయనేది తాజా వైపరీత్యాలను బట్టి వీటిని తట్టుకొనే విధంగా మనం సిద్ధపడి లేమని కూడా స్పష్టమైంది. ఈ నెల మొదటి వారంలోనే ధూళి తుఫాను ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో బీభత్సాన్ని సృష్టించింది. దీని నుంచి దేశం తేరు కోక ముందే మళ్ళా గులాబ్‌ తుఫాన్‌ అకాల వర్షం కకావికలు చేసింది. పిడుగులతో కూడిన రాళ్ళ వాన, పెనుగాలలు కలిసి అనేకమంది ప్రాణాలు బలిగొన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యం మూలంగా వివిధ రాష్ట్రాలలో భారీగా ప్రాణనష్టం జరిగింది.
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రాళ్ళవాన, పిడు గులు పడి 50మందికి పైగా మరణించారు. ఎనభై మందికిపైగా గాయపడ్డారు. చెట్లు విరిగిపడ్డాయి, ఇండ్లు కూలిపోయాయి. ఢల్లీిలోనైతే ధూళి తుఫా నుకు,భారీవర్షం తోడైంది. రాకపోకలు నిలిచి పోయాయి. ఇద్దరు మరణించారు. డ్బ్భై విమానా లను దారి మళ్ళించవలసివచ్చింది. పశ్చిమ బెంగా ల్‌లో పన్నెండు మంది మరణించారు. ధూళి తుఫాను మూలంగా ఉత్తర, పశ్చిమ భారతమంతా ఉక్కిరిబిక్కిరయింది.ఉత్తరప్రదేశ్‌,రాజస్థాన్‌,ఉత్త రాఖండ్‌,మధ్యప్రదేశ్‌,పంజాబ్‌,హర్యానా రాష్ట్రా లలో వంద మందికిపైగా మరణించారు. వంద లాది మంది గాయపడ్డారు. పెనుగాలులు సృష్టిం చిన విలయానికి ఇళ్లు కూలిపోయాయి, చెట్లు పెకిలించుకుపోయాయి, పంటలు దెబ్బతిన్నాయి. రవాణా, విద్యుత్‌ వ్యవస్థలు ఛిన్నాభిన్నమైనయి.
-జిఎన్‌వి సతీష్‌

సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు

‘‘ అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీనపడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేద్కర్‌ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఫ్న్‌ సర్కారుపైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది.’’

రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం,ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ,రాజ్యాంగేతర,ప్రజాస్వామ్య, శాసనసంస్థలు ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం వినాశకారకం. రాజ్యాంగం ఏర్పర్చినవి రాజ్యాంగ సంస్థలు. వివిధ రాజ్యాంగ అధికరణల ద్వారా 20 రాజ్యాంగ సంస్థలు ఏర్పడ్డాయి. అవి: దేశ,రాష్ట్ర ఆర్థిక సంఘాలు (ఎఫ్‌సీ),వస్తుసేవల శిస్తు సంఘం, సమాఖ్య, రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్లు, దేశ,రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఈసీ), కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అటార్నీ జనరల్స్‌, భారత కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (సీఏజీ),జిల్లాల, మెట్రొపాలిటన్ల ప్రణాళిక సంఘాలు, అంతర్రాష్ట్ర మండలి,ఎస్సీ,ఎస్టీ,బీసీల జాతీయ కమిషన్లు, ఆదివాసీ ప్రాంతాల, ఎస్టీ, బీసీల అధికార భాష కమిషన్లు, పార్లమెంటు అధికారభాష కమిటి,మైనారిటి భాషల ప్రత్యేక అధికారి. సీఏజీ,ఈసీ,ఎఫ్‌సీ ప్రధాన రాజ్యాంగ సంస్థలు. ప్రభుత్వ కార్యనిర్వాహక తీర్మానాలు, చర్యల ద్వారా రాజ్యాంగేతర సంస్థలు ఏర్పాటవుతాయి. ఇవి:భారత రూపాంతర జాతీయ సంస్థ (నిటి ఆయోగ్‌), జాతీయ అభివృద్ధి మండలి,జాతీయ,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ),కేంద్ర నిఘా సంస్థ(సివిసి),జాతీయ లోక్పాల్‌,రాష్ట్ర లోకాయత్‌లు,కేంద్ర,రాష్ట్ర సమాచార కమిషన్లు.
శాసన,కార్యనిర్వాహక,న్యాయవ్యవస్థలు ప్రజాస్వామ్య సంస్థలు. మాధ్యమాలను ప్రజాస్వామ్య నాల్గవ స్తంభంగా పరిగణిస్తారు. ఇవి రాజ్యాంగ సూత్రాల అమలులో, ప్రజాస్వామ్య నిర్మాణ, నిర్వహణల్లో కీలక పాత్ర పోషిస్తాయి. శాసనవ్యవస్థ,రాజ్యాంగ పరిధిలో చట్టాలుచేసే అతిశక్తివంతమైన ప్రజాప్రతినిధుల వేదిక. వ్యవహారాలు చట్టబద్దంగా, లావాదేవీల లాభార్జన న్యాయసమ్మతంగా ఉండాలి. పౌరప్రయోజనాలు పరిరక్షించబడాలి. వ్యాపార లాభాలను సమాజ ప్రయోజనానికి వాడాలి. కార్యనిర్వాహక సంస్థ రాజకీయ ప్రతినిధులు సమాజాన్ని శాసించరాదు. సమాజ నిర్మాణాన్ని, పనితీరును నియంత్రించరాదు. రాజ్యాంగం సమాఖ్య సూత్రాలను పొందుపరిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులను నిర్వచించింది. కార్యనిర్వాహకులు సమాఖ్య పరిధి, పరిమితులు దాటరాదు. చట్టాలు రాజ్యాంగ పరిధిలో ఉండేలా చూడటం న్యాయవ్యవస్థ బాధ్యత. రాజ్యాంగ వ్యతిరేకత, పాలన అక్రమాలను ప్రశ్నించడం, న్యాయవిరుద్ధ చట్టాల నుండి ప్రజారక్షణ, వివాద పరిష్కారం న్యాయవ్యవస్థ రాజ్యాంగ అధికారాలు. వైద్య విజ్ఞాన శాస్త్రాల అఖిల భారత సంస్థ ఎఐఐఎంఎస్‌,భారతీయ వజ్రాల సంస్థ,భారత చలనచిత్ర,దూరదర్శన్‌ సంస్థ(ఎఫ్‌.టి.ఐ.ఐ),జాతీయ అధికార శిక్షణ, బొగ్గు నిర్వహణ భారతీయ సంస్థ, భారత రిజర్వు బ్యాంకు,రైల్వే,పెట్రోలియం సంస్థలు సమాఖ్య ప్రభుత్వ భాగస్వామ్య చట్టబద్ద సంస్థలలో కొన్ని.
ఇప్పుడు ఈ సంస్థలన్నీ సంఫ్న్‌ భావజాల వ్యక్తుల చేతుల్లో బందీలు.గతంలో ప్రగతిశీల కాంగ్రెసీయులు, గాంధీయన్లు, సోషలిస్టులు, వామపక్షవాదుల ఆధ్వర్యంలో నడిచేవి. వారు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునేవారు. తెరవెనుక ఏంచేసినా వేదికలపై నీతి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడేవారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు జంకేవారు. నేటి సంఫీుయ అధికారులకు సిగ్గు ఎగ్గు లేవు. వైదిక హైందవ ఆర్య బ్రాహ్మణత్వ ఆధిపత్య రూపాలలో సంస్థలను నడుపుతున్నారు. ఆర్థిక సంఘాలు పాలక అనుకూల ప్రతిపాదనలు చేస్తున్నాయి. వస్తుసేవా శిస్తు వ్యవస్థ కరోనా కాలంలోనూ, టీకాలకు కూడా పన్నులు తగ్గించలేదు. రాష్ట్రాల వాటాలను ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్లు పాలక పక్షపాతంగా పనిచేస్తున్నాయి. అటార్నీ జనరల్స్‌ ప్రజా వ్యతిరేకంగా వాదిస్తున్నారు. వలసకార్మికులకు, కోవిడ్‌ చావుల అనాథలకు ఆర్థిక సాయంలో మానవత్వరహిత వాదనలు చేశారు. సీఏజీ ముందస్తు స్పందన, ప్రతిస్పందనల బాధ్యతలను మరిచింది. ప్రభుత్వ న్యాయవాదులు ప్రజాపక్షం కాక ప్రభుపక్షం వహించారు. ప్రణాళిక మండళ్లకు పాలకుల మాటే ప్రణాళిక. అంతర్రాష్ట్ర మండలి సంఫ్న్‌ పాలిత రాష్ట్రాల పక్షపాతిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఘాలను ప్రభుత్వం పట్టించుకోదు. లక్షద్వీప్‌ పాలనాధికారి చట్టాలు ఉల్లంఘనలకు ఉదాహరణలు. అధికార భాషాసంఘం, మైనారిటి భాషల అధికారి ఉనికి కోల్పోయారు. ప్రతిచోటా సంస్కృతాన్ని రుద్దుతున్నారు. ప్రజల మాతృభాషలను మాతృభాషలు చేస్తున్నారు. నిటి ఆయోగ్‌, అభివృద్ధి మండలి ప్రయివేటీకరణకు మద్దతు ఇస్తున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరెట్‌, మానవ హక్కుల కమిషన్లు, నిఘా, సమాచార సంఘాలు పాలకుల జేబు సంస్థలుగా మారాయి. న్యాయస్థానాల పోరుపడలేక, అధికారం చేపట్టిన ఆరేండ్లకు, కోరలులేని పాములాంటి లోక్పాల్‌ను నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా మోడీ గుజరాత్‌ లోకాయత్‌ను నియమించ లేదు. ఆ పనిచేసిన మహిళా గవర్నర్‌ను ముప్పుతిప్పలుపెట్టి ఇంటికి పంపేదాకా నిద్రపోలేదు. పదుల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి ఆ నియామక రద్దుకు కోర్టుల్లో దావాలు నడిపారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి రక్షకులెవరు? ప్రజాస్వామ్య చట్టబద్ద సంస్థలు కూడా పాలక పక్షానికి వంతలుగా మారాయి. రాజ్యాంగ సంస్థల విచ్ఛిత్తితో ప్రజలకు రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య మానవత్వ హక్కులు నిరాకరించబడుతున్నాయి.
పార్లమెంటు కమిటీలను నియమించ కుండా ప్రతిపక్షాలను బెదిరించి, భ్రమపెట్టి, ఆశపెట్టి, బయటకునెట్టి ఏకపక్షంగా చట్టాలు చేశారు. రాష్ట్రాల జాబితాల్లో చొరబడ్డారు. కరోనా కాలంలో ప్రత్యామ్నాయ పక్షాలు, ప్రజా సంఘాలు నిరసన తెలుపలేని స్థితిలో, అవకాశ వాదంతో రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలు చేశారు. పౌరసత్వ సవరణ, కొత్త విద్య, కార్మిక, వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలు వీటిలో కొన్ని. 40మంది సంఫ్న్‌ గూండాలు 11.8.21న రాజ్యసభలో ప్రవేసించి మహిళా ఎంపీలపై దౌర్జన్యంచేసి బీమా చట్టం ఆమోదించుకున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ ముందెన్నడూలేనంత పక్షపాతంగా వ్యవహరిస్తోంది. కోర్టు తీర్పులూ సంఫ్న్‌ పాలకులకు అనుకూలంగా ఉన్నాయి. 5, 7 మంది న్యాయమూర్తుల ధర్మపీఠాల్లో కూడా అసమ్మతి నమోదుకాదు. న్యాయం ఏకపక్షంగా మారింది. అయోధ్య, రాఫెల్‌, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తీర్పులు వాటిలో కొన్ని. ‘’కోర్టుల్లో మా అనుకూల తీర్పులు యాధృచ్ఛికంకాదని’’ బీజేపీ ప్రముఖ నాయకుడే అన్నారు. అనుమాన న్యాయమూర్తులను హత్యచేసే రాజకీయ స్థితి దాపురించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే రెండు రోజుల్లో రిటైర్‌ అవుతారనగా న్యాయమూర్తుల తీరు మారింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రమణ వ్యాఖ్యానాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. కాని కొట్టినవారిని శిక్షించకుండా కొట్టిన విధానం మంచిదికాదు, వాడిన ఆయుధం సరైంది కాదన్నట్లు ఉంది. చట్టాల రద్దు ప్రతిపాదించకుండా వాటి దురుపయోగాన్ని ఎత్తిచూపి లాభం లేదు. 70శాతం మీడియా ప్రభుత్వ రాజకీయ-వాణిజ్య భాగస్వామి ముకేశ్‌ అంబానీ సొంతం. మిగిలిన మీడియా సంఫ్న్‌ సంస్థల యాజమాన్యంలో, ప్రభుత్వ మీడియాగా పనిచేస్తోంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు, సమానత్వం, ప్రజాభిప్రాయం, సంక్షేమం, పౌర, మానవ హక్కుల పట్ల ప్రభుత్వ ఉల్లంఘనలను ఈ మీడియా ఎత్తిచూపదు. సమర్థిస్తుంది.
అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీనపడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేద్కర్‌ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఫ్న్‌ సర్కారుపైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది.
-ఎస్‌.హనుమంతరెడ్డి

దిశ చట్టం ఉన్నా..ఆగని అఘాయిత్యాలు

‘‘ దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడిరది. దిశ కేసుల దర్యా ప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి,విశాఖపట్నం,మంగళగిరి లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.’’

రెండు సంవత్సరాలుగా ప్రేమించి అక్టో బర్‌ నెలలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అను మానంతో విజయనగరం జిల్లాలో తగలబెట్టా డొకడు. అభం శుభం తెలియని దళిత చిన్నారిపై గుంటూరులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు వరుసకు మామ అయిన ప్రబుద్ధుడు. దిశ చట్టం అమలు గురించి ఎంతో ఆర్భాటంగా చెప్పుకునే రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అంద రూ చూస్తుండగా ఇంజినీరింగ్‌ చదువుతున్న రమ్య అతిదారుణంగా హత్యకు గురికావడం అందరిని కలచివేసింది. నిర్భయ, దిశ,అశ్లీలతవ్యతిరేక చట్టాలు ఎన్ని వచ్చినా అమ్మాయిలపై అఘాయి త్యాలను, ప్రేమోన్మాదుల దాడులను,యాసిడ్‌,లైంగిక దాడు లను నివారించ లేక పోతున్నాయి. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది. రోజు రోజుకు పేట్రేగిపోతున్న అశ్లీల సినిమాలు,సాహిత్యం, ప్రకటనలను ప్రభు త్వాలు కట్టడి చేయలేక పోతు న్నాయి. కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయి తప్ప చేసిందేమీ లేదు. దిశచట్టం అమలులోకి వచ్చిన సంవత్సరంలోనే దాదాపు ఆరుగురు ఇంజి నీరింగ్‌ చదివే అమ్మా యిలు హత్యకు గురయ్యా రంటే…వార్తల కందని, నిరక్ష రాస్యులైన మహిళలు ఎందరో ?
మహిళలపై హింస అనేది సామాజిక, ఆర్థిక, అభివృద్ధి…విద్య,మానవ హక్కులు,చట్టాలు, ఆరో గ్యానికి సంబంధించిన సమస్య. మహిళలపై హిం సకు మానసిక అనారోగ్యానికి మధ్య గల సంబం ధాన్ని తగినంతగా పరిశోధించలేదు. ఇంట ర్నెట్‌ పుణ్యమా అని పోర్నోగ్రఫీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. కరోనా పుణ్యమా అని అన్ని ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న ఈ తరుణంలో సమస్య విపరీతంగా పెరిగిపోయింది.భారతదేశంలో ప్రత్యే కంగా ఏచట్టంలోనూ అసభ్యత, అశ్లీలత నిర్వ చించ బడలేదు. కానీ భారతీయ శిక్షాస్మృతి-1860, సమాచార సాంకేతిక చట్టం-2000 ప్రకారం… అశ్లీలత,అశ్లీలతతో కూడిన వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం…అసభ్యకర, అశ్లీల వస్తువులను విక్రయించడం వంటివి శిక్షార్హమైన నేరాలు. మహి ళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారా లను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం దిశ చట్టాన్ని రూపొందించింది. అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో14రోజుల్లోనే విచా రణ పూర్తి చేసే విధంగా ఈచట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం 21రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా, చుట్టూ ఉన్న సమాజం, మనుషులలో మార్పు రానిది ప్రయోజనం లేదు. ఈ రోజు సామజిక మాధ్యమాల ద్వారా మంచి కంటే చెడును ఎక్కువ ఆకళింపు చేసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఉపాధి లేకుండా యువతను నిర్వీర్యం చేసిన ఘనత మన పాలకులది. ఇంజినీరింగ్‌ చదివిన వారిలో తొంభై ఐదుశాతం మందికి ఉద్యోగాలు లేవు. ప్రయివేటు రంగంలో పనిచేసే వారికి అరవై శాతం మందికి జీతాలులేవు. తొంభైశాతం ప్రజలు అభ ద్రతా భావంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయం లో ఇలాంటి దారుణాలకు కొదవ లేకుండా పో యింది. ప్రజలకు నాణ్యమైన విద్య,సంస్కృతి,మాన వ విలువలు,పర్యావరణం,మంచి ఆరోగ్య ఆహార పు అలవాట్ల గురించి చెప్పే విద్యాసంస్థలు కరువ య్యాయి. కేవలం డబ్బే పరమావధిగా కార్పొ రేట్‌ కళాశాలలు, విద్యా సంస్థలు ఏర్పడి నడుస్తు న్నాయి. వీటి మాయాజాలంలో పడిన తల్లిదండ్రులకు సమాజం గురించి పట్టడం లేదు. తమ పిల్లలకు మంచి ప్లేస్‌మెంట్‌ వచ్చి ఎక్కువ డబ్బు సంపాదిస్తే చాలు అనుకునేలా తయారవుతున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉన్నంతవరకు మహిళలపై దాడులను అరికట్టడం అంత సులభం కాదు.
మహిళల రక్షణలో ‘దిశ’ మారదు
మహిళలు, బాలికలకు రక్షణ కవచం లా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ‘దిశ’ నిర్దేశంలో మార్పులేదని మరోసారి రుజువైంది. హైదరాబాద్‌ లో దిశ ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అటు వంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం2019 డిసెంబర్‌ 13న అసెంబ్లీలో, డిసెంబర్‌ 16నమండలిలో దిశ బిల్లును ఆమో దించి 2020 జనవరి 2నచట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆబిల్లుపై కేంద్రం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చేందుకు రాజీలేని వైఖరితో ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం` 2019 (పాతబిల్లు)ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2020 (కొత్తబిల్లు)ని శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది.ఈ నేప థ్యంలో ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, బాలలపై జరిగే నేరాలపై విచారణకు ప్రత్యేక న్యాయ స్థానాలు)చట్టం-2020కి ప్రభుత్వం మరింత పదును పెట్టింది. అసెంబ్లీ,మండలి ఆమోద ప్రక్రి య పూర్తి కావడంతో ఈ బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2)ప్రకారం గవర్నర్‌ పరిశీలన అనం తరం వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు
ా దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ కచ్చితంగా అమలు చేయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడానికి ముందు నుంచే ఏపీలో ఈ విధానం అమల్లో ఉండటం విశేషం. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
ా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 దిశ పోలీస్‌ స్టేషన్లలో 18 కస్టమైజ్డ్‌ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లోని ప్రత్యేక పరికరాలతో సాంకేతిక సిబ్బంది నేర స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు.
ా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సత్వర సహాయం అందించేలా ఆవిష్కరించిన దిశ యాప్‌ను ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గత 8 నెలల్లో 98,380 మంది ఎస్‌ఓఎస్‌ ద్వారా పోలీసుల సహాయం కోరారు.
ా దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7 రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడిరది.
ా దిశ కేసుల దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.
ా రాష్ట్రంలో11 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 700 పోలీస్‌స్టేషన్లలో ఉమెన్‌ స్పెషల్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. దిశ బిల్లులో ప్రస్తావించిన అనేక విషయాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు వచ్చాయి.
దిశ బిల్లులో ప్రధానాంశాలు..
్చ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)- 1860,క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)- 1973లను ఉపయోగిస్తారు.
్చ ఐపీసీ సెక్షన్‌ 326ఎ,326బి,354,354ఎ, 354బి,354సి,354డి,376,376ఎ, 376బి,376ఎబి,376సి,376డి, 376డిఎ,376డిబి,376ఈ,509లతో పాటు పోక్సో యాక్ట్‌, కేంద్ర చట్టాల్లోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు.
్చ 18ఏళ్లలోపు బాలబాలికలపై లైంగిక దాడులు,అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ -పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టంపరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది.
్చ జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది.
్చ కేసుల నమోదుకు ఆన్‌లైన్‌ విధానం అమలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడే వారి వివరాలు అపరాధుల రిజిష్టర్‌ (ఆన్‌లైన్‌ విధానం)లో నమోదు చేస్తారు.
్చ వేగంగా దర్యాప్తు పూర్తి చేసేలా ప్రతి జిల్లా స్థాయిలో ఒక డీఎస్పీ నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.
్చ బాధిత మహిళకు సత్వర న్యాయం జరిగేలా, దోషులకు వేగంగా శిక్షలు అమలు చేసేలా ఈ కేసుల కోసం ప్రతి జిల్లాలో ఒకటి, అంతకంటే ఎక్కువగా ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటిలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)ను కూడా నియమించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం- 2019
నిర్భయ (2012), ఉన్నావ్‌ (2017), దిశ (2019)..నేరాలతో దేశం ఉలిక్కిపడిరది. భవిష్యత్తులో ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలను పకడ్బంధీగా అమ లుచేసే చట్టాలు ఉండాలి. ఆలస్యంగా దొరికిన న్యాయం అన్యాయంతో సమానం అంటారు. ఎందరో నేరస్తులు భారతీయ శిక్షాస్మృతిలోని లొసు గులను అవకాశాలుగా తీసుకుని దర్జాగా తప్పించు కుంటున్నారు. బాధితులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం దొరకని సంద ర్భాలు కోకొల్లలు. వీటన్నింటి దృష్ట్యా న్యాయ విచా రణ ప్రక్రియ వేగవంతం చేయాలని, నేరానికి పాల్ప డ్డ వ్యక్తులకు సత్వర శిక్షను అమలు చేసే ఉద్ధేశ్యంతో రూపొందించిందే దిశ యాక్ట్‌-2019 .
ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే…?
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ డిసెంబర్‌ 13,2019 ఆమోదించింది.డిసెంబర్‌ 16న శాసన మండలిలో దిశ బిల్లును ఆమోదించి.2020 జనవరి2న చట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంప డం జరిగింది.రాష్ట్రపతి ఆమోదముద్రవేస్తే ఆంధ్ర ప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ)చట్టం-2019 (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌), ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగెనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈచట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష ఖాయం.
ఈ చట్టం ఎలా వచ్చిందంటే…?
తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్‌ శివార్లలో 2019,నవంబరు 27నజరిగిన వెటర్నరీ డాక్టర్‌ దిశ గ్యాంగ్‌ రేప్‌,హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించక పోయినా..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. దిశ దుర్ఘటన వంటి నేరాలు మునుముందు జరగకూడదని, నేరం చేస్తే కఠిన శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని, మహిళలపై, పిల్లలపై అఘా యిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుం దని,బాధితులకు సత్వరన్యాయం చేయాలనే ఉద్ధే శ్యంతో వచ్చిందీ చట్టం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం.
ఏపీ దిశచట్టం, ప్రత్యే క కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యాంశాలు:
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు,మరణ దండ న శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ ‘దిశ’ చట్టం దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండునెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం4నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించి నట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడుతుంది. ఈచట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా జీరో ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. 18 ఏళ్లలోపు బాల బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ -పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభు త్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నా రులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది. జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవు తుంది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. మహిళలు,చిన్నారులపై లైంగిక దాడు లు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)-1860, క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)-1973లను ఉపయోగి స్తారు.సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధిం చడం,వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాం టివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. అందుకు ప్రత్యేకంగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో అదనంగా 354(ఇ),354 (ఎఫ్‌) అనే కొత్త సెక్షన్లను చేర్చారు.

  1. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354(ఇ)
    మెయిల్స్‌, సోషల్‌మీడియా, డిజిటల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష
  2. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354 (ఎఫ్‌)
    పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే పదేళ్ల నుంచి నుంచి 14ఏళ్ల వరకూ శిక్ష. నేరం తీవ్రతను బట్టి 14ఏళ్ల నుంచి జీవిత ఖైదువిధిస్తారు. పోస్కో చట్టం కింద ఇంతవరకూ 3 నుంచి 5ఏళ్ల వరకు జైలుశిక్ష అమలౌతుంది.ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రం లోనూ మహిళలు,పిల్లలపై నేరాల సత్వర విచార ణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్ది రాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. కాని, దేశ చరిత్రలోనే తొలి సారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా 13జిల్లాల్లో ప్రతిజిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కోర్టుకూ ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అత్యాచారం, సామూ హిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌ మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధిం చడం వంటి నేరాలు,పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి వస్తాయి. నింది తులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా లేదా స్పష్టమైన ఆధారా లున్నా తక్షణమే మరణశిక్ష విధించేలా చట్టం చేశారు. అందుకనుగుణంగా సెక్షన్‌ 376 (రేప్‌)కి సవరణ చేశారు. జడ్జిమెంట్‌ పీరియడ్‌ను కూడా 4 నెలల నుంచి 21 రోజులకు కుదించి, విచారణ 7 రోజుల్లో,ట్రయల్‌ 14రోజుల్లో పూర్తి చేసి 21 రోజుల్లో నిందితులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటారు. క్రిమినల్‌ ప్రొసీజరల్‌ యాక్ట్‌ 173, 309కి మార్పులు చేశారు. చిన్నారుల మీద దాడులు,లైంగిక వేధింపుల విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు… దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవ రణ చేశారు. పోస్కో యాక్టు ప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. దానిని కూడా మార్చి జీవితఖైదు విధించేలా చట్టం చేయడం జరిగింది. ఇక ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరునెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 3 నెలలకు తగ్గించారు. మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తులపేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే,ఏనేరగాడు,ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరా లకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలం దరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.
    దిశ మొబైల్‌ యాప్‌
    మహిళా భద్రత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్‌ జస్టిస్‌ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసింది.విశాఖపట్నం,విజయవాడ, తిరు పతిల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణ పోలీసు సహాయం పొందేందుకు‘దిశ మొబైల్‌ అప్లికేషన్‌’ను ప్లే స్టోర్‌లో అందుబాటలోకి తెచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను ఫిబ్రవరి8,2021న అధికారికంగా ప్రారంభించించారు.
    ఎందుకు?
    విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి? ఎవరికి ఫోన్‌ చేయాలి? ఫోన్‌ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్‌ చేయకపోతే పరిస్థితి ఏమిటి? ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఏపీ ప్రభుత్వం‘దిశ’యాప్‌ను ప్రారంభించింది
    డౌన్‌ లోడ్‌.. ఉపయోగించడం ఇలా..
    ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రే షన్‌ చేసుకోవాలి.యాప్‌లోఎస్‌వోఎస్‌ బటన్‌ ఉం టుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్‌ చేసి,అందులో ఉన్న ఎస్‌వోఎస్‌ (పుష్‌ బటన్‌ మెస్సే జ్‌ ఆప్షన్‌) బటన్‌ నొక్కాలి. ఆవెంటనే వారి ఫోన్‌ నంబర్‌,చిరునామా,వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్‌)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. ఆ వెంటనే కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమ వుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ఈఆప్షన్‌ ద్వార పోలీసు లు యాప్‌ వినియోగదారులకు ఏకకాలంలో సూచనలు,సలహాలుఅందించి, వారిని జరగ బోయే ప్రమాదాల గురించి అప్రమత్తం చేస్తారు. పోలీసు లతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు,స్నేహితు లకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు ఉం టుంది.విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్‌ వెంటనే దిశకమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ ఏర్పటు
    తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్‌ ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాం డ్‌ కంట్రోల్‌ రూమ్‌కు, వారి బంధువులకు చేరవేసే రక్షణ కల్పించే వెసులుబాటు
    దిశ యాప్‌లో డయల్‌ 100. 112 నంబర్లతో పాటు పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్‌ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఈయాప్‌లో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం దిశ మొబైల్‌ యాప్‌ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు,ఎక్కువ మం దికి ఈయాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం కూడా అందిస్తోంది.
    ఇతర దేశాల్లో శిక్షలు ఇలా..
    అత్యాచార నిందితుల్ని నేరుగా ఉరికం బం ఎక్కిస్తారు. కొన్ని కేసుల్లో దోషుల పురు షాంగాన్ని తొలగించి నపుంసకులుగా కూడా మారు స్తారు. ఇదంతా నేరం జరిగిన రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేక పోయినా ఉరిశిక్ష విధించడం విమర్శలకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఉరి తీశాక వారు నిర్ధోషులని తేలడం గమనార్హం.
    ఇరాన్‌: అత్యాచార దోషుల్ని కాల్చి చంపుతారు. లేదంటే ఉరితీస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితు రాలు క్షమించడానికి అంగీకరిస్తే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
    ఆష్గానిస్తాన్‌: రేపిస్టులకు శిక్ష పడిన నాలుగు రోజుల్లోనే ఉరి తియ్యడమో, లేదంటే కాల్చి చంపడమో చేస్తారు.
    యూఏఈ: రేప్‌ చేసిన ఏడు రోజుల్లో ఉరికంబం ఎక్కిస్తారు.
    సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అత్యాచార నేరం రుజువైతే బహిరంగంగా తలనరికి చంపు తారు.
    నెదర్లాండ్స్‌: మహిళలపై జరిగే లైంగిక వేధింపు లన్నింటినీ అత్యాచారం కిందే పరిగణిస్తారు. అమ్మా యి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా అక్కడ నేరుగా జైలుకి పంపిస్తారు. నేర తీవ్రత ఆధారంగా 4 నుంచి 5 సంవత్సరాలు శిక్ష ఉంటుంది.
    ఫ్రాన్స్‌: అత్యాచార చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అత్యాచార కేసుల్లో 15ఏళ్లు కారాగార శిక్ష విధిస్తారు. జైల్లో ఉన్నన్ని రోజులు వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. నేర తీవ్రతని బట్టి దానిని 30 ఏళ్లకు పెంచుతారు.
    గణాంకాల ప్రకారం..
    దేశం దశ దిశలా.. నలుమూలలా.. ప్రతిరోజూ మహిళల అక్రందనలు వినిపిస్తునే ఉన్నాయి. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ తాజాగా విడుదల చేసిన (2020,సెప్టెంబర్‌ 29) గణాం కాల ప్రకారం సగటున దేశవ్యాప్తంగా రోజుకు 87 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. 2012 నిర్భయ ఘటనకు ముందు 25 వేల కంటే తక్కువ, 2013లో 33,707,2016లో 38,947 కేసులు నమోదు కాగా 6,289 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 2017లో32,559,2018లో33,356, 2019లో 32,033 నమోదయ్యాయి. కానీ శిక్షలుపడ్డ దాఖ లాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఈ కేసుల్ని విచారించడానికి కోర్టుల్లో తగిన సిబ్బంది లేక పోవడంతో పెండిరగ్‌ కేసుల సంఖ్య తడిసి మోపె డవుతోంది. ఇకఅత్యాచార కేసుల్లో దోషులుగా తేలేవారి సంఖ్య కూడా అత్యంతస్వల్పంగా ఉంది. చాలా ఏళ్లపాటు 25నుంచి 30శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ 2014లో మాత్రం శిక్షల రేటు 27 నుంచి 38 శాతానికి పెరిగింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని 2019నాటికి దేశంలో 664 ఉంటే, అవి కూడా సరిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. మన దేశంలో ఉరి శిక్ష పడాలంటే కనీసం5ఏళ్లు పడు తుంది. ఎందుకంటే ప్రత్యేక కోర్టుల్లో శిక్ష పడితే పై కోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు.. అక్కడ శిక్ష ఖరారు చేసినీ అమలౌతుందన్న గ్యారెంటీ లేదు. మరణ శిక్ష పడిన దోషులకు రాష్ట్రపతిని క్షమాభిక్ష అడిగే హక్కు కూడా ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి కొన్ని కేసుల్లో ఉరిశిక్ష అమలుకే 20 ఏళ్లు దోషులు జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే సత్వర న్యాయం మన దేశంలో సాధ్య పడటం లేదు. 1991 నుంచి 2017 డిసెంబర్‌ చివరి నాటికి 371మందికి ఉరిశిక్ష పడిరది. కానీ గత 15 ఏళ్లలో ఎనిమిది మందికి (నిర్భయ దోషులతో సహా) మాత్రమే ఉరిశిక్ష అమలు జరిగిందంటే న్యాయం జరగడంలో ఎంత అన్యాయం జరుగు తుందో అర్థమవుతోంది.
    ఈ పరిస్థితి మరాలంటే..
    గర్భస్థ పిండాలుగా ఉన్నప్పటి నుంచి కడ శ్వాస వరకు మహిళలపై గౌరవ భావం కలిగేలా మన సమాజానికి అవగాహన పెంచాలి. కటుంబం, బడి,పనిప్రదేశం, బహిరంగ స్థలం.. ఇలా అన్ని చోట్ల, ప్రతిస్థాయిలో వివక్ష పోవాలి. మనిషి తప్ప సృష్టిలోమరే జీవి పాల్పడని అతి హీనమైన నేరం అత్యాచారం. అది సామూహికంగా జరిగి, ఘాతు కమైన హత్యతో ముడిపడటం భూమ్మీద అతిపెద్ద నేరం. దీనికి సమాజం నుంచే పరిష్కారం లభిం చాలి. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధా లుగా,అన్ని స్థాయిల్లో సమాజం సమాయత్తం కావాలి. ఇది సమష్టి బాధ్యత.
    -డా.యం.సురేష్‌ బాబు

గిరిజ‌నుల గోడు వినేదెవ‌రు?

‘’దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు.. ఇనుము, బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి’’.

రిజర్వేషన్లు అభివృద్ధికి గొడ్డలి పెట్టు అన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు పాలక వర్గాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా గిరిజనులకు కల్పించిన భూ హక్కు చట్టం నుంచి రిజర్వేషన్ల వరకూ దేని అమలు పైనా ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. ఎస్టీ రిజర్వేషన్లలో ఇతరులనూ చొప్పించాలని పాలకులు చూస్తుంటే.. కోర్టుల తీర్పులు వాటికి బలాన్నివ్వడం మరింత బాధాకరం. ఉమ్మడి ఏపీలో ఏజెన్సీల్లోని స్కూల్‌ టీచర్ల నియామకాల్లో గిరిజనులకే 100%రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన జీవోను ఏజెన్సీల్లోని ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందనే పేరుతో సుప్రీం కోర్టు రద్దు చేసి ఏడాది కావస్తున్నా, దాని పునరుద్ధరణకు రాష్ట్ర సర్కారు సీరియస్గా ప్రయత్నించకపోవడం దారుణం. మన దేశంలో అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ఏవో లొసుగులను అడ్డం పెట్టుకుని ఉల్లంఘిస్తున్నారు. ఏపార్టీ పాలనా పగ్గాలు చేపట్టినా సరే వాటిలో అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలే పెత్తనం చేయడం వల్ల వారికి ఈ రిజర్వేషన్లపై సానుకూల దృక్పథం కొర వడిరది. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులపై సదభిప్రాయం లేకపోవడంతో రాజకీయ అవసరాల కోసం పైపై ప్రచారాలు చేసుకోవడం తప్ప నిజంగా మేలు చేసే ఆలోచన కనిపించడం లేదు.
ఒక వైపే ప్రచారం
మన దేశంలో అధికారంతోపాటు ప్రసార సాధనాలను గుప్పిట పెట్టుకున్న ఉన్నత సామాజిక వర్గాలు పీడిత, బాధిత వర్గాలకు రాజ్యాంగపరంగా కల్పించిన వెసులుబాట్లను ప్రచారం చేసినంతగా వాటి అమల్లో లొసుగులపై చర్చ పెట్టవు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగం గురించి జరిగే ప్రచారం ఆచట్టాన్ని వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నవారి గురించి చెప్పే విషయంలో జరగదు. ఈచట్టానికి అపప్రద తెచ్చిపెట్టడమే వారి ఉద్దేశం కనుక అణచివేతకు గురవుతున్న బాధితులను వదిలేసి, చట్టం దుర్వినియోగం గురించి పెద్దగా చర్చలు పెడుతారు. కానీ ఏ శక్తుల కారణంగా ఇది జరుగుతుందో విశ్లేషించేందుకు మాత్రం మనసు రాదు.
ఏజెన్సీల్లో యువతకు చేదోడైన జీవో అది
బయటి ప్రపంచం పోకడలకు చాలా దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో జనం జీవన శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లకు చదువులు, ఇతర మౌలిక సదుపాయాలు నేటికీ అంతంత మాత్రంగానే అందుతున్నాయి. పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో హాస్పిటల్స్‌, స్కూళ్లలో పని చేయాలన్నా కూడా ఇప్పటికీ మైదాన ప్రాంత వాసులు అంతగా సుముఖత చూపడం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. దీంతో 1986లో జీవో నంబర్‌ 275 ద్వారా ఉమ్మడి ఏపీలో నాటి సర్కారు ఏజెన్సీల్లో టీచర్‌ ఉద్యోగాలకు గిరిజనులకే 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1989లో ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులు, 1998లో సుప్రీం కోర్టు తీర్పుతో ఆ రిజర్వేషన్లు నిలిచిపోయాయి. అయితే 2000 సంవత్సరంలో నాటి ప్రభుత్వం మళ్లీ జీవో నంబర్‌ 3ద్వారా మళ్లీ 100శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మళ్లీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరులకు అన్యా యం జరుగుతోందంటూ వాదనలు వినిపించారు. అయితే గిరిజన యువతలో చదువుకున్న వాళ్లు తమ ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్లుగా ఉద్యోగాలు పొంది తమ తర్వాత జనరేషన్‌ పిల్లలకు చదువులు చెబుతూ వస్తున్నారు. వారికి ఉపాధి కల్పించడంతో పాటు తమ ప్రాంతానికి మేలు చేయడంలో ఈ జీవో చేదోడుగా ఉండేది. గతఏడాది ఏప్రిల్లో సుప్రీం కోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ జీవో అత్యంత వివాదాస్పద ఉత్త ర్వుగా జడ్జిలు పేర్కొన్నారు. జీవో నంబర్‌3 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చారు. అది చెల్లదంటూ తాము ఇచ్చిన ఉత్తర్వును ఉల్లంఘి స్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా నియామకాలు, పదోన్నతులు చేపట్టినట్టయితే 1986 నుంచి జరిగిన నియామకాలన్నీ తిరగదోడతామని హెచ్చరించడం బాధాకరం. వాస్తవానికి ఆ జీవో రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5 ప్రకారం ఇచ్చారని, ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, దీనిపై జుడిషియల్‌ రివ్యూ చేసే హక్కు కూడా ఉండద ని వాదించి గిరిజన హక్కులను కాపాడ డంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్‌ అయింది. ఏజెన్సీల్లో ఇతరుల జనాభా ఎట్ల పెరిగింది?
జీవో నంబర్‌ 3ని మొదటి నుంచి వ్యతిరేకి స్తోంది ఏజెన్సీల్లోని గిరిజనేతర వర్గాలే. ఈ జీవో వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు. అసలు పరిశీలించాల్సిన విషయం ఏజెన్సీల్లో ఇతర వర్గాల జనాభా ఎలా పెరిగిందన్నది. వాస్తవానికి 1950 నుంచి 80 దశకం వరకు ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల జనాభా 90 శాతం ఉంటే 90ల్లోకి వచ్చేసరికి వారు మైనారిటీలుగా మారిపోయారు. మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన భూస్వామ్య, వ్యాపార, గిరిజనేతర వర్గాలు అక్కడి భూమి, ఆర్ధిక వ్యవస్థను తమ గుప్పిట పెట్టుకున్నాయి. జనాభా పరంగానూ మెజారిటీలుగా మారి పోయారు. ఒక్క ఆదిలాబాద్‌ అనే కాకుండా ఏజెన్సీ విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనడానికి లేదు.ఆ భూపరి రక్షణ హక్కు చట్టాలకు సైతం ఈ వర్గాలు తూట్లు పొడిచాయి. రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా సరే గిరిజన చట్టాలను ఆధిపత్య వర్గాలు నీరు గార్చేశాయి. పెసాచట్టం నిబంధనలకు నీళ్లు వదిలి పెట్రోలు పంపులు, కర్మాగారాలు, సినిమా హాళ్లు, పిండి మిల్లులు ధాన్యం మిల్లులు, ఐస్‌ ఫ్యాక్టరీలు, మద్యం దుకాణాలు.. ఇలా ఒకటేంటి ఏజెన్సీలో అన్నీ బినామీల పేరుతో నడిపిస్తున్నారు. పేరు గిరిజనులది.. పెత్తనం అగ్రవర్ణాల పెద్దలది. గిరిజనుల వనరులను అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించేస్తున్నారు. పైగా చట్టానికి తూట్లు పెట్టేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు కాబట్టి చాపకింద నీరులా పనుల్ని చక్కబెడుతున్నారు. కానీ జీవో 3 ద్వారా గిరిజనులకు దక్కే గుప్పెడు ఉద్యోగాలపై గిరిజనేతరులంతా ఏకమై పోరాటం చేయడం ఘోరం.
అడుగడుగునా ఉల్లంఘనలే
నిజానికి బ్రిటిష్‌ కాలం నుంచి ఊపిరి పోసు కున్న ఏజెన్సీ చట్టాలన్నీ గిరిజన తెగలను గిరిజ నేతరులు, మైదాన ప్రాంత దోపిడీ నుంచి రక్షిం చేందుకు ఉద్దేశించినవే. స్వాతంత్య్ర అనం తరం రూపొందిన 1/70చట్టం ఇందులో కీలక మైంది. రాజ్యాంగ పరిధిలో 1/70చట్టాన్ని నిర్వ చించినా జీవో నంబరు 3దాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పడేదే తప్ప ఎంతమాత్ర మూ ఆ చట్రానికి బాహ్యంగా లేదు.కానీ1/70లో భాగమైన అన్ని చట్టాలు ఏండ్లకు తరబడి అడు గడుగునా ఉల్లంఘనకు గురవుతూ వచ్చాయి.
రివ్యూ పిటిషన్‌ వేసి వదిలేస్తరా?
ఏజెన్సీలో ఎస్టీల రిజర్వేషన్లను వ్యతిరేకించే అగ్రవర్ణ, బీసీ వర్గాలు మైదాన ప్రాంతం వచ్చేసరికి రెండుగా విడిపోతాయి. గిరిజనుల జీవన విధానమేంటి? వారి వెనుకబాటు ఏంటి? వారికున్న ఆర్థిక వనరులేంటి? ఆహార భద్రత ఎంత? మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలను పరిగణనలోకి తీసుకుంటే జీవో 3 వారి త్యాగా లకు పెద్ద తులాభారమేం కాదు. గిరిజన సంస్కృతి,సంప్రదాయాలను రక్షించాలన్న ఆశయంతో తెచ్చిన రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు కూడా ఏనాడూ వారికి భద్రత కల్పించింది లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు అంతో ఇంతో ఉపాధి కల్పిస్తున్న జీవో నంబర్‌ 3 విషయంలోనూ తెలంగాణ సర్కారు గిరిజనుల కోసం చేసిందేమీ లేదు. ఏడాది క్రితం జీవో రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వచ్చింది. అయితే దాని పునరుద్ధరణ కోసం కోర్టులో ఒక రివ్యూ పిటిషన్‌ వేసి గిరిజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని కంటితుడుపుగా ప్రకటన చేయడం మినహా చేసిందేమీ లేదు. దాదాపు ఈఏడాది సమయంలో సీరియస్గా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.
గిరిజన భూములు ఆక్రమించేదెవరు?
షెడ్యూల్డ్‌ తరగతులు, ఇతర అటవీ వాసుల (అటవీ హక్కుల చట్టం), 2006 చారిత్రకంగా బాధలు పడ్డ వారి హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించింది. దీనినే అటవీ హక్కుల చట్టం అంటున్నారు. అడవుల్లో ఉంటూ భూముల హక్కుల తిరస్కరణకు గురైనవారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు గిరిజనుల హక్కులను హరించేదిగా ఉంది. ఈ తీర్పువల్ల 16 రాష్ట్రాలలోని 10లక్షలమంది గిరిజనులకు నష్టం కలిగే పరిస్థితి తలెత్తింది. సుప్రీం కోర్టుకు తమ పరిస్థితి ఇంకా నివేదించాల్సిన వారు అనేక మంది ఉన్నారు కనక వీరి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. అటవీ హక్కుల చట్టం న్యాయబద్ధతను ప్రశ్నిస్తూ వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ అన్న స్వచ్ఛంద సంస్థ, ఉద్యోగ విరమణ చేసిన కొందరు అటవీ శాఖ అధికారులు పిటిషన్‌ పెట్టుకున్నందువల్ల ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాము వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అటవీ హక్కుల సం రక్షణ చట్టం కింద కొందరి వాద నను తిరస్కరించడానికి గల ప్రక్రియను వివరించాలని రాష్ట్రాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలగజేస్తుంది. సాంప్రదాయికంగా అడవుల్లో జీవనం కొనసాగిస్తున్న వారిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు ఇలాంటి అర్జీ దాఖలైనప్పుడు సుప్రీం కోర్టు ఉత్తర్వువల్ల 2002,2004 మధ్య అనేకమంది అటవీ వాసులు నిర్వాసితులయ్యారు. ఇది హింసకు, మరణాలకు, నిరసనలకు దాదాపు మూడు లక్షల కుటుంబాలు నిర్వాసితులు కావడానికి దారి తీసింది. తాజా ఉత్తర్వు ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులపట్ల అనుసరిస్తున్న విధానానికి అనువుగానే ఉంది. గిరిజనుల ప్రయోజనాలను ప్రభుత్వ న్యాయవాదులు కనక సమర్థించి ఉంటే ఈ ఉత్తర్వు మరోలా ఉండేది. అడవులు తగ్గిపోవడానికి, అటవీ భూములు ఆక్రమణకు గురికావడానికి గిరిజనులే కారణం అని ఈ పిటిషన్‌లో వాదించారు. గిరిజనులు, అడవుల్లో నివాసం ఉంటున్న వారు అటవీ భూములను ఆక్రమిస్తున్నారన్న వాదన ఎంతవరకు నిలబడగలుగుతుంది? వలసవాద ప్రభుత్వం వారి హక్కులకు భంగం కలిగించింది. అప్పుడు కొన్ని నిబంధనలున్నా గిరిజనులు తమ హక్కులను అనుభవించ గలిగారు. అయితే స్వాతంత్య్రం తర్వాత నూతన అటవీ విధానంవల్ల గిరిజనులకు చాలాకాలంగా ఉన్న హక్కులకు భంగం కలిగింది. దీనికి తోడు దేశంలోని భూభాగంలో మూడిరట ఒక వంతు అడవులు ఉండాలన్న విధానంవల్ల గిరిజనుల హక్కులు హరించుకు పోయాయి. అసలు చెట్లే లేని భూభాగాలు కూడా అటవీ శాఖ అధీనంలోకి వచ్చి ఇవి అమాంతం అటవీ భూములైపోయాయి. అటవీ శాఖ వేలాది కిలోమీటర్ల మేర గిరిజనుల భూములను ఆక్రమించింది. 1980నాటి అటవీ (సంరక్షణ) చట్టం,1972 నాటి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం కూడా గిరిజనుల హక్కులకు భంగం కలిగించాయి. అంటే నిజానికి అటవీ భూములను ఆక్రమిస్తున్నది ప్రభుత్వమే. అటవీ భూములు తగ్గిపోవడానికి ప్రధాన బాధ్యత గిరిజనులదా, అడవుల్లో ఉండే వారిదా అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గనుల తవ్వకానాకి, పరిశ్రమలు నెలకొల్పడానికి అటవీ భూములను వాడుకున్నారు. గిరిజనులను నిర్వాసితులను చేశారు. ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నప్పటి నుంచి మునుపెన్నడూ లేని రీతిలో బడా కంపెనీలు, బహుళజాతి గుత్త కంపెనీలు గిరిజన ప్రాంతాలలో ఉన్న వనరులను కొల్లగొట్టడానికి అడవుల్లో తిష్ఠ వేశాయి. కాని అడవులు క్షీణించడానికి నెపం గిరిజనుల మీద తోస్తున్నారు. ప్రైవేటు ప్రయోజనాలకోసం అడవులను కొల్లగొట్టే వారి మీద ఏ నిందా లేదు. అడవుల్లో పర్యావరణాన్ని, వన్య జీవుల్ని నాశనం చేస్తున్నది ఈ కంపెనీలే. అడవులు క్షీణించిపోవడానికి గిరిజనులే కారణం అని వాదిస్తున్నప్పటికీ ఇప్పటికీ దట్టమైన అడవులున్నది గిరిజనులు ఉండే చోటే ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం అనుసరిస్తున్న అటవీ పరిరక్షణ విధానాలు సక్రమమైనవేనా అని ఆలొచించాలి.అటవీ శాఖ, అధికారులు, అడవులను పరిరక్షించడానికి పాటుపడ్తున్నామని చెప్పుకునే కులీన, పట్టణ ప్రాంత వాసులు అటవీ హక్కుల చట్టాన్ని వ్యక్తిరేకిస్తూనే ఉన్నారు. ఈ చట్టానికి నిబంధనలు తయారు చేసినప్పటి నుంచీ ఇదే ధోరణి. ఈ చట్టం అమలుపై నిరంతరం విమర్శలు వస్తూనే ఉన్నాయి. అటవీ భూములపై హక్కులను గుర్తించడం మూడు దశల్లో జరుగుతుంది. గ్రామసభ ఈ హక్కుల పరిరక్షణకు సిఫార్సు చేస్తుంది. ఆ తరవాత ఈ అభ్యర్థన సబ్‌ డివిజన్‌ వ్యవస్థ స్థాయికి వెళ్తుంది. ఆ తరవాత పరిశీలనకోసం జిల్లా స్థాయి అధికారులకు పంపుతారు. ఇందులో కేవలం అధికారులు మాత్రమే ఉంటారు. ఇందులో అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. హక్కులు కోరే వారి వాదనను తిరస్కరించడం ఎప్పుడూ అందులోని మంచి చెడ్డలపై ఆధారపడుతుందని కాదు. ఈ తిరస్కరణ చాలావరకు ఏకపక్షంగా ఉంటుంది. గ్రామసభ సిఫార్సును వ్యతిరేకించే వర్గాలు ఉంటాయి. ఈ వర్గాలు అటవీ భూములను ప్రైవేటు రంగం వారికి, వ్యాపరస్థులకు అప్పగించాలని చూస్తాయి. చిన్నా చితక కారణాల ఆధారంగానే గిరిజనుల హక్కులను తిరస్కరించిన సందర్భాలున్నాయని గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖే అంగీకరించింది. ఈ తిరస్కరణను సవాలు చేస్తూ కోర్టుల్లో దాఖలైన లక్షలాది పిటీషన్లు విచారణకే నోచుకోవడం లేదు. తగిన విధానం అనుసరించకుండా ఎవరినీ నిర్వాసితులను చేయకూడదని అటవీ హక్కుల చట్టంలోని 4 (5) సెక్షన్‌ చెప్తోంది. కానీ అధికారులే దీన్ని ఉల్లంఘిస్తుంటారు. చట్టం నిబంధనలను ఖాతరు చేయకుండా తిరస్కరించిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తిరస్కరిస్తున్న ఉదంతాలెన్నో! నిబంధనల ప్రకారం అయితే క్షేత్ర స్థాయిలో సర్వే చేసి కాని నిర్ణయించకూడదు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు పరిష్కరించిన తీరు కూడా ఏ మాత్రం నమ్మకం కలిగించేదిగా లేదు. గిరిజనులకు సంబంధించిన అంశాల మీద న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అవగాహన ఉన్నట్టు లేదు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది. –మన్నారం నాగరాజు

వైవిద్య జీవ‌నం..అడ‌వులే జీవ‌నాధారం

అడవి మార్గంలో రైలులో ప్రయాణిస్తుండగా దేవులపల్లి భావోద్వేగానికి గురయ్యారట. అందులోంచి పుట్టిన పాట..
‘ఆకులో ఆకునై.. పువ్వులో పుప్వునై.. కొమ్మలో కొమ్మనై.. నునులేత రెమ్మనై.. ఈ అడవి దాగిపోనా.. నేనెటులైనా ఇచటనే ఆగిపోనా..’ అన్నది. అడవి అందాలను ఆస్వాదించాలని ఎవరికి మాత్రం ఇలా అనిపించదు..? పచ్చని చెట్ల నీడన సేదదీరాలని, గలగల పారే సెలయేటి నీటిని దోసిటపట్టి తాగాలని, పక్షుల కిలకిలా రావాలను, పూల సుంగధాలను ఆస్వా దించాలని, చెట్టుపై మాగిన పండ్లను కోసి తినాలని.. ఇలాంటి అనుభవం జీవితంలో ఒక్కటైనా ఉండాలని ఎవ్వరనుకోరు..! ఇంతటి స్వచ్ఛమైన జీవితం అనుభవించే తెగ.. ఆదివాసీ. వారి మనుగడకు ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా, అభివృద్ధికి దూరంగా ఉంటున్నా.. అడవినే నమ్ముకుని అక్కడే ఉండిపోతున్నారు. వారి జీవనం, సంస్కృతి, సంప్రదాయాలలో వైవిధ్యం ఉంటుంది. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ నేపథ్యంలో నల్లమల గిరిజనుల జీవనంపై ప్రత్యేక కథనం.

  • ా సంస్కృతికి ప్రాణమిచ్చే ఆదివాసులు
  • ా అభివృద్ధి దరిచేరని జీవితాలు
  • ా అందని ప్రభుత్వ పథకాల ఫలాలు
  • ా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆదర్శంగా నిలుస్తున్న గిరిజనులు
  • ఆదివాసీలు,గిరిజనులు ఏ దేశానికైనా మూలవాసులన్నది మానవ శాస్త్రవేత్తల భావన. సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూహాలు గిరిజన తెగలు. వీటికి సామా జికంగా, సాంస్కృతి కంగా ప్రత్యేకతలున్నాయి. వీటితో పాటు వైవిధ్య చరిత్ర,సంస్కృతులున్నాయి. జన జీవన స్రవంతిలో భాగంగా కొందరు..దూరంగా ఇంకొందరు జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతా ల్లోనూ భిన్న తెగలకు చెందిన గిరిజ నులున్నారు. ప్రస్తుతం భారత జనాభాలో దాదాపు 8`9శాతం ప్రజలు వివిధ గిరిజన సమూహాలకు చెందినవారే. ఆంథ్రోపాలజీకల్‌ సర్వే ఆఫ్‌ ఇండి యా అధ్యయనం ప్రకారం ఒక్కో గిరిజన తెగ ఒక నిర్ధిష్టమైన భౌగో ళిక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. ఒక గిరి జన తెగ విభిన్నరాష్ట్రాల్లో విస్తరించి ఉండటం అరుదు. ప్రతి గిరిజన సమూహానికి ఒక నిర్ధిష్టమైన పేరుంటుంది. ఒకేరకమైనభాష,సంస్కృతిఉంటాయి. ఒకేరకమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉంటారు. ఒకే న్యాయం,ఒకేచట్టం ఉంటాయి. అంతర్వివాహ పద్దతిని ఆచరిస్తారు. గిరిజన సమూహాలకు ప్రత్యే కమైన మతవిశ్వాసాలు,ఆరాధన పద్దతులు ఉం టాయి. ముఖ్యంగా ప్రకృతి శక్తులను ఆరా ధిస్తారు. వీటితోపాటు ప్రతిగిరిజన సముదాయా నికి ఒక స్వయం ప్రతిపత్తిగల రాజకీయ వ్యవస్థ ఉంటుంది. ఈనాటికీ చాలా తెగలు ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ప్రవేశించినా,తమను తాము నియంత్రిం చుకునే స్వీయ రాజకీయ వ్యవస్థను(ఆదివాసీ మండలి) కొనసాగిస్తున్నాయి. ఆయా తెగల పెద్దలు ఇందులో సభ్యులుగా ఉంటారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ కార్యకలాపాలను వీరే నియంత్రి స్తుం టారు. అన్నింటికీ మించి ఇవి ఏకరూపత కలిగిన సమూహాలు. వీటన్నింటిలోనూ గోత్ర వ్యవస్థ అంత స్సూత్రంగా పనిచేస్తుంది. గిరిజన సమాజంలోని సభ్యుల ప్రవర్తనను గోత్రవ్యవస్థ నియంత్రిస్తుంది. స్వగోత్రికలు రక్తబంధవులనే భావన కలిగి ఉంటా రు. అందుకే స్వగోత్రీకులు పెళ్లిళ్లు చేసుకోరు. ప్రతి గోత్రానికి ఓటోటెమ్‌ ఉంటుంది. టోటెమ్‌ అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆ మత పరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆరాధాస్తారు. ఈ చిహ్నం ఒక వ్యక్తి కావోచ్చు.. జంతువు,చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావోచ్చు. అది వారి తెగకు గుర్తు.
  • దేశంలో మూడు రకాల తెగలు : భారత్‌లో మనకు మూడు రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి
  • 1) దట్టమైన అటవీ ప్రాంతాల్లో,పర్వత ప్రాంతా ల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్ధికం గా,రాజకీయంగా స్వతంత్రంగా జీవించినప్ప టికీ ఆర్ధికంగా వెనకబడిన తెగలివి.
  • 2) అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నా,వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధా లుంటాయి. సామా జిక,వ్యాపార సంబంధా లుండే అవకాశముంది.
  • 3) మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు. జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈమైదాన ప్రాంతాల్లో స్థిరపడిన,గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించు కుంటాయి. అందుకే వారిలో విద్య,ఆర్ధిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేంలో తీసుకుంటే బిల్లులు,సంతాల్‌(మధ్యప్రదేశ్‌)లు, ముండాలు (బీహార్‌),మహారాష్ట్ర,తెలంగాణలోని రాజ్‌ గోండులు,లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ,ఆర్ధిక,విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు.
  • ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు అంత రించిపోతున్న తరుణంలో వారి సంరక్షణ దిశగా ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టింది. ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని 1994లో ప్రకటించింది. 1997లో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ.. ప్రపంచ దేశాల ప్రతినిధులను తీర్మానానికి ఆహ్వానించింది. 143 ఐరాస సభ్యుదేశాలు ఓటింగ్‌లో పాల్గొనగా 125దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదిం చారు. 14 మంది తటస్థ వైఖరి తెలపగా, కేవలం నలుగురు వ్యతిరేకించారు. అప్పటి నుంచి గిరిజన హక్కులు, వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో 5వేల ఆదివాసీ తెగలున్నాయి. 6, 700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల పైమాటే. ఆదివాసీ తెగలు,భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆది వాసుల సాంస్కృతిక జీవనాన్ని, వారిహక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఆదివాసీ దినోత్సవం జరపాలని ఐక్య రాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలులోకి తెచ్చింది.
  • ఆదివాసీ ప్రపంచం అభివృద్ధి ముసుగులో : మన దేశ పార్లమెంటులో ఎంతో మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నా ఆదివాసీ సమ స్యలపై వారేనాడూ నోరు విప్పింది లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసులపై నరమేథం కొనసాగు తోంది. అంతర్యుద్ధం వంటి పరిస్థితుల మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. ఆదివాసులను పూర్తిగా అంతరింపజేసి వారి సమాధులపై సామ్రా జ్యాల నిర్మాణం జరుగుతున్న ఆధునిక చరిత్ర నేటికాలంలోనూ సాగుతోంది. రెడ్‌ ఇండియన్‌లను నిర్మూలించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల పంథా లో ఆదివాసుల అంతానికి అన్ని దేశాలూ నడుం కట్టిన పరిణామాలను ఇప్పుడు ప్రతి దేశంలోనూ చూడవచ్చు. ఈచరిత్రను మనదేశ పాలకులు కూడా అందిపుచ్చుకున్నారు. మరోవైపున ఆదివాసుల రక్షణకు ఐరాస తీర్మానించిన విధానాలను వివిధ దేశాల ప్రభు త్వాలు పూర్తిగా పక్కనబెడుతున్నాయి. ఈ క్రమం లో ఆదివాసుల ఉమ్మడి జీవన వ్యవస్థ వార సత్వం ధ్వంసమైపోతోంది. మన దేశంలోనూ ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ పరమైన రిజర్వే షన్లను అమలు చేయడంలో మన పాలకవర్గాలు తీవ్రంగా విఫలమ య్యాయి. ఆనకట్టలు, ప్రాజెక్టు లు, మైనింగ్‌..ఇలా దేశంలో ఏ భారీ నిర్మాణాలకు పూనుకున్నా బలవు తున్నది ఆదివాసీలే. నిత్యం వీరు ఎదుర్కొంటున్న ప్రాణాంతక వ్యాధులకు చికిత్స లేదు. వీరిభాషకు గుర్తింపు లేదు. ప్రాణా లకు విలువ లేదు. వారి చరిత్రకు గౌరవం లేదు. ఈ విధ్వంసకర అభివృద్ధి నుంచి తమ రక్షణకు ఆదివాసీ తెగలు ఏకమ వ్వాలి. మన దేశ మైనింగ్‌ మాఫియా దోపిడీలో ప్రతి ఆదివాసీ అనాథ అయితే ఓపెన్‌ కాస్టులు వారి శ్మశాన వాటికలు. ఈశ్మశాన వాటికల్లో ఆది వాసులను తగులబె డుతున్న బహుళజాతి కంపె నీలకూ,వారికి వత్తాసుగా నిలుస్తున్న దళారీ పాల కవర్గాలకూ వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న పోరాటాలకు సకలవర్గాల ప్రజలూ అండగా నిల వాలి. ఆదివాసులు తమ అస్తిత్వాన్ని, మను గడను కోల్పోతే, ఈసమాజానికీ,చరిత్రకీ,సంస్కృతికీ, సంప్ర దాయాలకూ చాలా ప్రమాదమని భావించక తప్పదు.
  • షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన చట్టాల ఉల్లంఘన
  • రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్‌లో గిరిజనుల స్వయం ప్రతిపత్తి, గ్రామస్వరాజ్యం గిరిజనులను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనీ, నీళ్లు, అడవి, భూమి వనరుల మీద గిరిజనులకు సంపూర్ణ హక్కు ఉండాలని చెప్పింది. గిరిజన భాషా, సంస్కృతి, వేష ధారణ, గిరిజన ఆవాసాలు అభివృద్ధి చెందాలంటే 5వషెడ్యూల్‌ చట్టాలు పకడ్బందీగా అమలు కావాలి. అందుకు రాష్ట్ర గవర్నర్‌ ఎప్పటికప్పుడు గిరిజనుల స్థితిగతులపై పర్యవేక్షించాలి. గిరిజనులను సమా జంలో భాగస్వాములు చేయడానికి విధానాలు సవరించుకోవడం కోసం ప్రత్యేక ప్రొవిజన్లు ఏజెన్సీ లో కల్పించబడ్డాయి. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ ప్రాతినిధ్యం గిరిజను లకు కల్పించినా సంపూర్ణంగా అమలు కావడం లేదు.
  • పండుగలంటే ప్రాణం : గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకుంటారు. హిందు వులు జరు పుకునే సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలతో పాటు గోండులు ప్రతి నెలా ఒకపండుగ చేసు కుంటారు. దసరా అనంతరం గిరిజన గ్రామాల్లో దీపావళి వేడుకలు ప్రారం భమవుతాయి. దీపావళి సందర్భంగా గిరిజన గ్రామాల్లో దండారి నృత్యం చేస్తారు.పక్క గ్రామా లవారితో సంబంధాలు పెంచు కోవడం కోసం దండారి బృందాలు పక్క గ్రామా లకు అతిథులుగా వెళ్లివారి ఐక్యతను చాటిచెబు తారు. చైత్రమాసంలో చెంతు భీమన్న పండుగ జరిపి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. మేలో పెర్సాపేన్‌ పూజలు, జూన్‌ లో మెహతుక్‌ పండుగ, జూలైలో అకోపేన్‌ పూజలు, ఆగస్టులో పొలాల,సెప్టెంబర్‌లో పెత్రమాస (పెద్దలపండుగ) చేసుకుంటారు. అక్టోబర్‌లో దసరా, దీపావళి, డిసెంబర్‌లో సెట్టి పండుగ చేసు కుంటా రు. జనవరిలో సం క్రాంతి,ఉగాది చేసుకుంటారు. గిరిజన జీవన విధా నంలో పండుగలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరిం చుకుంటాయి.
  • గూడేల్లో కనీస సౌకర్యాలు కరువు : రెండు తెలుగు రాష్ట్రాల గిరిజన గ్రామా ల్లో వర్షాకాలంలో పొంగిపొర్లే వాగులు ఆది వాసీ గ్రామాలను బాహ్య ప్రపంచంతో వేరు చేస్తున్నాయి. వ్యాధులతో బాధ పడుతున్న ఆదివాసులు వాగులు దాటుకొని ఆసుపత్రులకు రావడం కూడా గగనమే. రోడ్డు సౌకర్యం సరిగాలేక గ్రామాల్లో అభివృద్ధి కనిపిం చడం లేదు. కనీసవతసతులైన రోడ్లు,రవాణా, తాగు,సాగునీరు,విద్యుత్‌,విద్యా వైద్యం తదితర వసతులకు ఆదివాసీ గ్రామాలు నోచు కోవడం లేదు.104,108అంబులెన్స్‌లు కూడా వెళ్ల లేని గ్రామాలు ఏజెన్సీలో అనేకంగా ఉన్నాయి. వాగుపై వంతెనలు నిర్మించకపోవడంతో వర్షా కాలంలో వాగులు ప్రవహిస్తే గిరిజనులు బాహ్య ప్రపంచాకి దూరంగా ఉండిపోతున్నారు. ఫలితంగా అంటు వ్యాధులు ప్రబలితే వైద్యం అందక గ్రామా ల్లోనే తనువు చాలిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో మంచినీటి వనరులున్నా విద్యుత్‌ సమస్యలతో పథకాలు పని చేయక కలుషిత నీరు తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నారు.
  • మారని జీవితాలు :పాలకులు, అధికారులు మారుతున్నా ఆదివాసుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఐటిడిఎ ఏర్పాటు చేసి కోట్లాది రూపా యలు విడుదల చేస్తున్నా అవి వారిదరి చేరడం లేదు. ఐటిడిఎలో కీలక అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉంటుండడంతో అభివృద్ధి పథకాల అమ లులో తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఆదివాసీల సంక్షేమంకోసం ఐటిడిఎ ద్వారా ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు.ప్రతి ఏడాది ఆదివాసులను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వందల సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం కరు ణించడం లేదు. శాశ్వత పరిష్కారాలను కను గొన డానికి ప్రయత్నించడం లేదు. ఏజెన్సీ ప్రాంతం లోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చాలాపోస్టు లు ఖాళీగా ఉన్నాయి.
  • రైతులపై కరువు ఛాయలు : అటవీ హక్కు చట్టంతో కొంతమంది ఆది వాసులకు ప్రయోజనం చేకూరినా వాటి ఫలాలు పూర్తిగా పొందలేకపోతున్నారు. గిరిజనుల భూ సమస్య పరిష్కరించడంలో ఐటిడిఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శ లున్నాయి. వారు పండిరచే పంటకు సరైన మార్కెట్‌ సౌకర్యం కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫల మైంది. పంటలు నష్టపోతే నష్టపరిహారం సైతం పొంద లేకపోతున్నారు. గిరిజనుల భూముల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ స్థానంలో కూడా రెగ్యులర్‌ అధికారి కరువై పోవడంతో ఇన్‌ఛార్జీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరిత హారం పథకం కూడా గిరిజనులకు కష్టాలను తెచ్చి పెడుతోంది. కొన్ని చోట్ల గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వక పోగా, హరితహారం పేరుతో పొలాల్లో గుంతలు తవ్వడం తో గిరిజనులు ఆందోళన చెందు తున్నారు. –గునపర్తి సైమన్‌

వలస కార్మికుల కోసం సామాజిక వంటశాలలు

‘‘ వలస కార్మికులకు తిండిగింజలు సరఫరా చేయ డానికి అవసరమైన పథకాన్ని రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేయాలి. రాష్ట్రప్రభుత్వాలు తమ సొంత పథకాలను జూలై31లోపు మొదలు పెట్టి కరోనా కొనసాగినంత కాలం అమలు చేయాలి. ఒకే దేశం ఒకే రేషన్‌ పథకాన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు జూలై31లోపు దాన్ని అమల్లోకి తీసుకు రావాలి అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. వలసకార్మికులకు రెండుపూటల తిండి కోసం కార్మి కులు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ సామూహిక వంటశాలలు కొన సాగించాలని జస్టీస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టీస్‌ ఎం.ఆర్‌. షాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ఏర్పాటు చేసి అందు లో దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటితరంగ కార్మికులు, వలసకూలీల వివరాల నమోదు ప్రక్రియను జూలై31 లోపు మొదలు పెట్టాలని ఆదేశించింది. కార్మికుల వివరాల నమోదు కోసం నేషనల్‌ డెటాబేస్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయడంలో కేంద్ర కార్మికశాఖ చేసిన జాప్యాన్ని సుఫ్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కార్మికులు ప్రభుత్వాల నుంచి వివిధసంక్షేమ పథకాలు అందు కోవడం కోసం వేచిచూస్తున్న తరుణంలో కేంద్ర కార్మికశాఖ ఉదాసీనంగా,నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం క్షమార్హం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం . ఇప్పటికైనా పోర్టల్‌ను తక్షణం ఏర్పాటు చేసి అమల్లో కి తీసుకురావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. అసం ఘటితరంగ కార్మికులు,వలసకూలీల వివ రాల నమో దుకు కేంద్రప్రభుత్వం నేషనల్‌ ఇన్ఫర్మేటి క్స్‌ సెంటర్‌తో కలసి ఒక పోర్టల్‌ను రూపొందించాలి. ఇదే సమ యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘ టిత రంగ కార్మికుల వివరాలను నేషనల్‌ డేటాబేస్‌లో నమోదు చేసే ప్రక్రియను జూలై31లోపు మొదలు పెట్టి డిసెంబరు31నాటికి పూర్తిచేయాలి’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

రేషన్‌ కార్డు లేదన్న సాకుతో ఏ ఒక్క వలస కార్మికునికి అందునా ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో రేషన్‌ నిరాకరించడం ఎంతమాత్రమూ తగదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని సుప్రీం కోర్టు జూన్‌ 29న ఒక తీర్పులో ఘాటుగా హెచ్చరించింది.‘‘వలస కార్మికుల్లో ఎక్కువ మంది పేదరికంతో చదువుకు దూరమైనవారే.వారి వద్ద ఏ విధమైన కార్డులు ఉండవు.అంతమాత్రం చేత వారికి ఈకరోనా సమయంలో రేషన్‌ను ప్రభు త్వం ఎలా నిరాకరిస్తుంది.వీరిలో చాలామందికి ఎలాంటి స్థిరమైన ఉపాధి ఉండదు. అయినా కనీస అవసరాలు తీరితే చాలు అనుకుంటారు వీరు’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌,జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ధర్మాసనం తమ 80పేజీలతీర్పులో పేర్కొం ది. దేశ జనాభాలో నాలుగింట ఒక వంతు అంటే 38కోట్లుగా వలసకార్మికులు ఉన్నారని,దేశ పురోగా భివృద్ధికి, ఆర్ధికాభివృద్దికి వలసకార్మికుల కంట్రిబ్యూ షన్‌ చాలా గొప్పదని అన్నారు. వలస కార్మికుల్లో ప్రతి ఒక్కరికీ రేషన్‌ అందేలా చూడా ల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని,వలసకార్మికులకు డ్రై రేషన్‌ ఇచ్చేందుకు అనుగుణమైన పథకాలను జూలై31 లోగా రూపొందించాలని కేంద్ర,రాష్ట్రప్రభుత్వా లకు గడవుఇచ్చింది.రెండు పూటలా భోజనం ఏఒక్క వలసకార్మికుడికి నిరాకరించకుండా చూడా లని రాష్ట్రప్రభుత్వాలను కోరింది. వలస కార్మికు లను చేరుకునేందుకు అన్నీ రాష్ట్రాలు, కేందప్రాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరింది. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన అదనపు తిండిగింజలను కేంద్రం సరఫరా చేయాలని, కరో నా కాలమంతటా కీలకమైన ప్రాంతాల్లో సామా జిక వంటశాలలను నడపాలని కోరింది. ఆహార హక్కు జీవించేందుకు తప్పనిసరి అని చెప్పింది. హుందాగా జీవించే హక్కులో ఇదోక భాగమని కోర్టు ప్రభుత్వానికి హితబోధ చేసింది. జూలై31 నుంచి ఒకదేశం ఒకే రేషన్‌ కార్డు విధానాన్ని అన్ని రాష్ట్రాలుపూర్తిగా అమలు చేయనున్నందున, అప్పటి లోగా వలస కార్మికులందరినీ జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఈ పథకంలోకి తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.
వలస కార్మికుల ఆందోళనలపై కేంద్ర కార్మిక,ఉపాధి మంత్రిత్వశాఖ ఉదాసీనవైఖరిపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస కార్మికులు డేటాను పోర్టల్లో ఉంచడంలో ఆలస్యం జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై31లోగా వలస కార్మికుల కోసం పోర్టల్‌ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ‘‘అసం ఘటిత,వలసకార్మికుల వివరాలు నమోదు చేయ డానికి కేంద్రప్రభుత్వం జూలై 31లోపు పోర్టల్‌ని అభివృద్ధి చేసి..అందుబాటులోకి తీసుకురావాలి. జూలై 31లోపు ఈ ప్రక్రియను ప్రారంభించాలి’’ అని పేర్కోంది.
ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న లాక్‌డౌన్‌ తరహా పరిస్థితుల వల్ల ఉపాధిని కోల్పో యిన వలస కార్మికులకోసం దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ఆదేశాలను జారీచేసింది. కేంద్ర ప్రభు త్వం అమలు చేయదలిచిన వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకానికి సంబంధించిన ఆదేశాలు అవి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా వలస కార్మి కులకు ఉన్నచోటే చౌక దుకాణాల ద్వారా నిత్యా వసర సరుకులను అందజేయాలని సుప్రీం కోర్టు తాజాగా సూచనలు ఇచ్చింది. జులై31వతేదీ నాటికి..ఈ వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాం తాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనికి డెడ్‌ లైన్‌ కూడా విధించింది. జులై 31వ తేదీ నాటికి ఈపథకాన్ని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనితోపాటు-వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్‌లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలనిసూచిం చింది.
పోర్టల్‌ ద్వారా నమోదు..
అసంఘటిత రంగానికి చెందిన కార్మి కులు,వసల కూలీల వివరాలను నమోదు చేయ డానికి ప్రత్యేకంగా ఓపోర్టల్‌ను రూపొందిం చాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. జులై31వతేదీ నాటికి ఈపోర్టల్‌ను అందు బాటులోకి తీసుకుని రావాలని, దీనికోసం నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. డిమాండ్లకు అను గుణంగా..ఆహారధాన్యాలు, నిత్యావసర సరుకులను రాష్ట్రాలకు సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాంట్రాక్టర్ల వివరాలు కూడా..
జులై31వ తేదీనాటికి డ్రై రేషన్‌ను చేపట్టాలని,కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సమసిపోయేంత వరకూ దాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు ఆదేశించింది. వన్‌ నేషన్‌..వన్‌ రేషన్‌ కార్డు పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేయని రాష్ట్రాలు తాము విధించిన డెడ్‌లైన్‌ నాటికి అందుబాటులోకి తీసుకుని రావాలని పేర్కొం ది. అంతర్రాష్ట్ర వలస కార్మికులు (రెగ్యు లేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ యాక్ట్‌)-1979 కింద కాంట్రాక్టర్లు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కంపెనీల వివరాలన్నింటినీ నమో దు చేయాలని సుప్రీంకోర్టురాష్ట్రాలకు సూచిం చింది.
కమ్యూనిటీ కిచెన్లు సైతం
వలసకార్మికుల సంక్షేమం కోసం కమ్మూ నిటీ కిచెన్లను అందుబాటులోకి తీసుకుని రావాలని, కరోనా సంక్షోభం ముగిసేంత వరకూ వాటిని కొనసాగించాలని ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల వలస కార్మికులు ఉపాధిని కోల్పోయిన విష యం తెలిసిందే. ఫలితంగా-వారు వందలాది కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుకున్నారు.
సుమోటోగా స్వీకరణ
దీన్ని గతఏడాది మేలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టింది. తాజాగా ఈఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులకు ఉన్నచోటే ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు పథకం ఇప్పటికే జాప్య మైందని న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యా నిం చింది.
ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు
ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు పథకం జూలై 31కల్లా దేశవ్యాప్తంగా అమలు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలసకార్మికుల డాటా బేస్‌ నిమి త్తం జాతీయ స్థాయిలో వర్కర్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశిం చింది. ‘వలసకార్మికుల సమస్యలు,కష్టాలు’పై సుమో టో కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం ఈ మేరకు 80పేజీల తీర్పు వెలువరించింది. ప్రతివారికీ ఆహారంతోపాటు కనీస అవసరాలను పొందే హక్కుతోపాటు,రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అసంఘటితరంగ కార్మికులకోసం జాతీయస్థాయి డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని 2018లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని ఈసందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. ఈ విష యంలో కేంద్ర కార్మికశాఖ కనబరుస్తున్న ఉదాసీ నత,నిర్లక్ష్య వైఖరి క్షమించరాదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. వలస కార్మికులకు రేషన్‌ సరు కుల పంపిణీకి తగిన పథకం తీసుకు రావాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా రాష్ట్రాల పథకా లన్నీ జూలై 31కల్లా అమలులోకి రావాలని, అదే రోజుకల్లా వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ అమలులోకి తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు కాంట్రాక్టర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేసి కార్మికుల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలంది.రెండు పూటలా ఆహారం దొరకని వలస కార్మికులకు సామూహిక వంట శాలలు ఏర్పాటు చేయాలని, ఆయా పథకాలన్నీ కరోనా మహమ్మారి ఉన్నంత వరకూ కొనసాగిం చాలని పేర్కొంది.వలస కార్మికు లకు రేషన్‌ సరఫరానిమిత్తం తగిన పథకం రాష్ట్రాలు తీసుకు రావాలి.ఆమేరకు కేంద్రం అదనపు ఆహార ధాన్యాలను రాష్ట్రా లు కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి సంబంధించి తగినపథకాన్ని జూలై 31లోగా తీసుకొచ్చి అమలు చేయాలని తెలిపింది.
దేశంలో వలస కార్మికుల తరలింపుపై ఏకీకృత విధానం అవసరమని సుప్రీంకోర్టు కేంద్రా నికి సూచించింది. వారిని వారి స్వస్థలాలకు తరలిం చే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వ యం ఉండాలని, ప్రతి కార్మికుడూక్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని కోరింది. వీరి దుస్థితిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ముగ్గురు జడ్జీల ధర్మాసనం.. కేంద్రానికి మొత్తం 50 ప్రశ్న లను వేసింది.లాక్‌ డౌన్‌ అమల్లో ఉండగా ప్రధా నంగా వలస జీవుల తరలింపు పైనే దృష్టి పెట్టింది. వారికి షెల్టర్‌,ఫుడ్‌, వారిట్రాన్స్‌ పోర్టేషన్‌ తదిత రాలపై కేంద్రం చేపట్టిన చర్యలను వివరంగా తెలుసుకుంది. ప్రతివారినీ ఒకేసారి వారి ఇళ్లకు పంపడం సాధ్యంకాదని, కానీ వారికి రవాణా సౌకర్యం కల్పించేంతవరకు తగిన వసతి, ఆహారం సమకూర్చవలసిన అవసరం ఉందని కోర్టు పేర్కొం ది. కాగాకేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ..
గతేడాది మే1న శ్రామిక్‌ రైళ్లను ప్రారం భించినప్పటి నుంచి ఇప్పటి వరకు 91లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించినట్టు వెల్లడిరచారు. వలస కార్మికుల అంశంపై రాజకీయ ప్రసంగాలతో కూడిన పిటిషన్లను అనుమతిం చరాదని, అలాంటి వారు కావాలంటేఅఫిడవిట్లు దాఖలు చేసుకోవాలని ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. వలస జీవులకు రైల్వే శాఖ 84లక్షల ఆహార పాకె ట్లను అందించిందని తుషార్‌ మెహతా తెలిపారు. ఈ సదుపాయం మరికొన్ని రోజులు కొనసాగుతుం దన్నారు. కాగా-తమ పేర్ల నమోదు లోను, టికెటింగ్‌ సిస్టంలోను జాప్యం జరుగు తుండ డంతో..ఇంకా వేలాది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు చట్టవిరుధ్ధంగా తిరుగుతున్న వాహనా లను ఆశ్రయి స్తున్నారు.మరికొందరు కాలి నడకనే సాగుతున్నారు. Saiman Gunaparthi

1 2 3 4 5 6