సుప్రీం కోర్టు ప్రకారమే అటవీ నిర్వచనం

‘‘ అడవులు భూగోళపు ఊపిరితిత్తులు.అడవి చల్లగా ఉంటేనే మానవాళి భవిత భద్రంగా ఉంటుంది. కీకారణ్యమైనా,చిట్టడవిjైునా,నాలుగు చెట్లు ఒకచోట ఉంటే భూగోళానికి చేసే మేలు ఇంత అంత కాదు! కానీ,అంతులేని లాభాపేక్షతో కార్పొరేట్లు అడవులను కబళించడానికి ఎప్పటికప్పుడు విరుచుకు పడుతుంటారు.తమ చెప్పుచేతల్లోని ప్రభుత్వాలతో అనుకూల చట్టాలను తయారు చేయించుకుంటారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈదిశలో భారత అటవీ (సంరక్షణ)చట్టం 1980ని సవరించడానికి చేసిన ప్రయత్నానికి అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యంగా గత ఏడాది అడవుల నిర్వచనాన్ని మారుస్తూ తీసుకు వచ్చిన చట్ట సవరణను తాత్కాలికంగా నిలిపి వేసింది.1996లో వెలువరించిన టిఎన్‌ గోదా వర్మన్‌ తిరుములపాడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పులో నిర్దేశించిన అటవీ నిర్వచ నానికి అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌డి.వై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆహ్వానించదగిన పరిణా మం. నిఘంటవుల్లోని అర్థాన్ని అడవికి ప్రామాణి కంగా తీసుకోవాలని ఈతీర్పులో ధర్మాసనం పేర్కొంది.వర్గీకరణలు,యాజమాన్యాలతో సంబం ధం లేకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అడవులుగా భావించే ప్రాంతాలను (డీమ్డ్‌ ఫారెస్ట్స్‌) గుర్తించడానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇన్ని కీలకమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టే ఆ తీర్పును ఒక మైలురాయిగా భావిస్తారు ’’
భూమిని గుర్తించే ప్రక్రియలో 1996లో టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమల్‌పాడ్‌ తీర్పులో పేర్కొన్న ‘అటవీ’ నిర్వచనం ప్రకారం..రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా వ్యవ హరించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ సంరక్షణ చట్టానికి 2023లో చేసిన సవరణలను సవాలుచేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌,న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.పిటిషనరు తరపున సీనియర్‌ న్యాయవాదులు ప్రశాంతభూషన్‌,చంద్రసేన్‌ వాదనలువినిపిస్తూ 2023 సవరణలోని సెక్షన్‌ 1ఎగోదావర్మన్‌ తీర్పులో ఇచ్చిన ‘అడవి’నిర్వచనం కుదించబడిరదని, దీని ప్రకారం భూమిని అటవీగా నోటిఫై చేయాలని, ప్రభుత్వంలో ప్రత్యేకంగా అటవీగా నమోదు చేయాలని పేర్కొన్నారు.ఈనిర్వచనాన్ని కుదించడం వల్ల దాదాపు1.99 లక్షల చదరపు కిలోమీటర్ల అటవీ భూమి‘అటవీ’ పరిధినుండి బయటపడుతుందని అన్నారు.అడవులను అటవీయేతర వినియోగానికి మళ్లించబడుతున్న భూముల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని సిజెఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
‘రూల్‌ 16ప్రకారం రాష్ట్ర ప్రభు త్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు పరిపాలన కస రత్తు పూర్తి చేయడానికి పెండిరగ్‌లో ఉంది. గోదావర్మన్‌లోని ఈకోర్టు తీర్పులో స్పష్టంగా వివ రించబడిన సూత్రాలను తప్పనిసరిగా పాటిం చాలి.16వ నిబంధనలో నిపుణుల కమిటీ గుర్తిం చాల్సిన అటవీ,వంటి ప్రాంతాలు,వర్గీకరించని అటవీ భూములు,కమ్యూనిటీ ఫారెస్ట్‌ భూము లు ఉంటాయి.అందువల్ల గోదావర్మన్‌ తీర్పులో వివ రించిన విధంగా ‘అటవీ’ అనే వ్యక్తీకరణ పరిధికి అనుగుణంగా ఉండేలాచూసుకోవాలి’అని పేర్కొం ది.ఈ ఆర్డర్‌కు సంబంధించి అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలితప్రాంతాలకు సర్క్యులర్‌ను జారీచేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశిం చింది.ఈఉత్తర్వు తేదీనుండి రెండువారాల వ్యవధిలో రాష్ట్రాలు ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీలతో అడవులుగా గుర్తించబడిన భూమికి సంబంధించిన సమగ్ర రికార్డును అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లు,కేంద్ర ప్రభుత్వం తమకు అందించాలని ధర్మా సనం ఆదేశించింది. నిపుణుల కమిటీల నివేదిక లను మార్చి 31లోగాఫార్వార్డ్‌ చేయడంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని,ఈ రికార్డులు ఏప్రిల్‌ 15 నాటికి అధికారిక వెబ్‌సైట్‌లో డిజిటలైజ్‌ చేయాలని,అందుబాటులో ఉంచాలని సూచిం చింది.2023రూల్స్‌లోని రూల్‌16ప్రకారం ఏర్పా టైన నిపుణుల కమిటీలుగోదా వర్మన్‌ తీర్పు ప్రకా రం ఏర్పాటైన మును పటి నిపుణుల కమిటీలు చేసిన పనిని దృష్టిలో ఉంచుకోవాలి. అయితే, 2023 నిబంధనల ప్రకారం ఏర్పడిన నిపుణుల కమిటీలకు రక్షణకు అర్హమైన అటవీభూముల పరిధిని విస్తరించేందుకు స్వేచ్ఛ ఉంటుందని ధర్మా సనం స్పష్టం చేసింది.ముందస్తు అనుమతి లేకుం డా అటవీ భూములను జంతుప్రదర్శన శాలలు, సఫారీలకు తెలియజేయ కూడదని పేర్కొంది. తదుపరి విచారణ జులైకు వాయిదా వేసింది.
40 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణ
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1951నుండి75వరకు దేశ వ్యాప్తంగా 40లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆ నేపథ్యంలోనే భారత అటవీ (సంరక్షణ) చట్టాన్ని రూపొందించి 1980లో ఆమోదించారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇతర అవస రాలకు అటవీ భూమిని మళ్లించడం గణనీయంగా అదుపులోకి వచ్చింది.గతంతో పోలిస్తే 1981 నుండి 2022 వరకు అటవీ భూముల నిర్మూలన పదిశాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ,చట్టంలోని లొసుగులను అవకా శంగా తీసుకుని అడవుల నరికవేత కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని గూడలూరులో చోటుచేసుకున్న కలప అక్రమ నరికివేతకు సంబం ధించి దాఖలైన టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమలన పాడ్‌ కేసులో అటవీప్రాంతాల రక్షణను ప్రధా నంగా చేసుకుని సుప్రీం ఇచ్చిన తీర్పులో ‘అడవి’ని విస్తృతంగా నిర్వచించింది. ఇది కార్పొరేట్లకు ఆటంకంగా మారింది.ఈనిబంధనలను మార్చా లన్న ఒత్తిడి పెరిగింది.ఈ నేపథ్యంలో వారి కను సన్నల్లో నడిచే మోడీప్రభుత్వం గతఏడాది ప్రభు త్వ రికార్డుల్లో నమోదైన భూమిని మాత్రమే అడవి గా గుర్తిస్తూ అటవీ చట్టానికి సవరణ తీసుకు వచ్చింది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అడవుల పరిధిలోకి వస్తాయన్న భయంతో ప్రైవేటు వ్యక్తులు ప్లాంటేషన్లు,తోటలు పెంచడం లేదని తన చర్యను ప్రభుత్వం సమర్ధించుకుంది. వాతా వరణ లక్ష్యాలను అందుకోవాలంటే ప్రైవేటు ప్లాంటేషన్ల భాగస్వామ్యం అవసరమని అడ్డగోలు వాదనకు దిగింది.ప్రభుత్వం చేసిన సవరణతో దేశ వ్యాప్తంగా1.99 లక్షలచదరపుకి.మీల భూమి అడవులపరిధి నుండి బయటకు వస్తుందని అం చనా.మన రాష్ట్రంలోనూ వేలఎకరాల అటవీ భూమికి రెక్కలు వస్తాయని అంటున్నారు. ఇప్పటికే యురేనియం తవ్వకాల పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అడవుల విధ్వంసం ప్రారంభమైంది. పర్యాటక ప్రాంతాల్లో భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వాలపై ఒత్తిడిఎలానూఉంది. వీటన్నింటితో పాటు కేంద్ర సవరణ అమలు లోకి వస్తే అటవీహక్కుల చట్టానికి పెద్ద ఎత్తున గండి పడే ప్రమాదం ఉంది. అత్యున్నత న్యాయ స్థానంలో ఈ వాదనలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. ఆశాజనకమైన ఫలితం వచ్చినప్పటికీ అది మధ్యం తర తీర్పే! ప్రభుత్వం చేసిన సవరణను న్యాయ స్థానం పూర్తిగా కొట్టివేయలేదు. అడవులను గుర్తి స్తూ రికార్డులు తయారు చేయడానికి ప్రభుత్వానికి గడువిస్తూ అంతవరకు పాత నిర్వచనం అమలు లో ఉంటుందని పేర్కొంది. దీనర్ధం కార్పొరేట్‌ కత్తి వేలాడతూ ఉందనే!ఈ ప్రమాదాన్ని తిప్పికొట్టి, ఆకుపచ్చటి అడవులను పరిరక్షించు కోవడానికి ప్రజలను చైతన్యం చేయడం ఒక్కటే మార్గం.
అటవీ నిర్వచనం
అటవీ శాస్త్రం వ్యవసాయం మరియు పర్యావరణ పరిరక్షణను అడ్డుకునే ఒక శాస్త్రం. అడవులలో పంటలను నిర్వహించడం మరియు అటవీ దోపిడీని మెరుగుపరచడం దీని బాధ్యత. లో అటవీ నిర్వచనం పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడం,సహజ వస్తువుల ఉత్పత్తి ద్వారా పర్యావరణం,ప్రకృతి పరిరక్షణ ప్రధాన లక్ష్యం. అటవీప్రాంతం నిర్వచనంలో,అడవుల పెంపకం మరియు నిర్వహణకు బాధ్యత వహి స్తున్నది మనం చూస్తాము. అడవులను నాటడం, పర్యా వరణ నాణ్యతను మెరుగుపరచడం,పశువుల పొలాల ఉత్పత్తి,నిర్వహణ ద్వారా సహజ పర్యా వరణాన్ని రక్షించడం దీని ప్రధాన లక్ష్యం. మన దేశంలో,అటవీప్రాంతం సహజపర్యావరణ వ్యవ స్థను నాశనం చేయకుండా కలప మరియు కార్క్‌ చాలా ముఖ్యమైన అభివృద్ధిని ఉత్పత్తి చేసింది. అటవీ సంరక్షణలో చేర్చబడిన కార్యకలాపాలలో, అడవులు,పర్వతాల నుండి విస్తరించే అటవీ చెట్ల పంటల నాటడం,నిర్వహణ అభివృద్ధిని మేము కనుగొన్నాము.ఆచరణాత్మక ప్రయోజనాల కోసం, ఇది వ్యవసాయంతో పాటు కుటుంబ శాస్త్రంగా పరిగణించబడుతుంది, అయినప్పటికీ దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. మొదటి మరియు అతిపెద్ద వ్యత్యాసం ఉత్పత్తి పద్ధతి. వ్యవసాయానికి కొన్ని నెలల్లో పండ్లు మరియు పంటలను పొందడం భారీగా ఉత్పత్తి చేయడం అవసరం, అయితే అటవీప్రాంతం ఫలితాలను చూడటానికి దశాబ్దా లు అవసరం. నాటిన జాతులను బట్టి ఈ సమ యాలు మారవచ్చు.సహజంగానే, మేము జాతు లను పెంచడానికి ఎంచుకున్న వాతావరణం పర్యావరణ వ్యవస్థను బట్టి,ఈ సహజ వనరును పొందటానికి ఎక్కువ లేదాతక్కువ సమయం పడు తుంది.సేంద్రీయ మట్టినిఉత్పత్తి చేసే జాతులు అటవీ అటవీనిర్మూలనకు కూడా ఉపయోగి స్తారు. అటవీ కార్యకలాపాలలో వివిధ చికిత్సలు పద్ధతులతో అడవుల పెంపకం వంటి కార్యకలా పాలు ఉంటాయి. పదార్థాలు,సహజ వనరుల నిర్వహణ మరియు ఉపయోగం పర్యావరణానికి అనుకూలమైన రీతిలో మరియు సాధ్యమైనంత తక్కువ నష్టంతో నిర్వహించడానికి రూపొందించ బడిరది. ఈ విధంగా, అటవీ నిర్వచనం ఏర్పడు తుంది వివిధ అటవీ పర్యావరణ వ్యవస్థలలో శ్రేయస్సు ఉత్పాదకత మధ్య మంచి సంబంధం. మేము పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి సహజ వనరులను రక్షించడానికి మాత్రమే ప్రయ త్నించము, కానీ దాని నుండి ఆర్ధిక ప్రయోజనా లను కూడా పొందవచ్చు.
రకాలు ` లక్షణాలు
ప్రతి ప్రాంతానికి అవసరమైన భూభా గాన్నిబట్టి అనేకరకాల అటవీప్రాంతాలు ఉన్నా యి:ఇంటెన్సివ్‌ ఫారెస్ట్రీ:సాగు చేస్తున్న ప్రాంతం ఎక్కువ ఉత్పాదకతను నిర్ధారించడానికి ఇది వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది. అంటే, పర్యావర ణాన్ని పరిరక్షించేటప్పుడు అత్యధిక వనరులను ఉత్పత్తి చేయడానికి మేము ప్రయత్నిస్తాము. విస్తృతమైన అటవీ: ఇతర ఆర్థిక మరియు సామా జిక కార్యకలాపాలు చేర్చబడిన ప్రదేశాలలో కొన్ని కార్యకలాపాలను నిర్వహించే బాధ్యత ఇది. ఈ కార్యకలాపాలను అభ్యసించడం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే, అది పెరిగిన ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ గురించి జనాభాకు అవగా హన కల్పించడం. అదనంగా, ఇది పర్యాటకం పర్యావరణ విద్య వంటి జనాభాకు కొన్ని సేవలను కూడా అందిస్తుంది. దీనికి ధన్యవాదాలు, అడ వుల ఉత్పతి నిర్వహణ స్థిరమైన మార్గంలో కాలక్రమేణా హామీ ఇవ్వబడుతుంది.
ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
మొదటి స్థానంలో చెట్లు లేని ప్రాంతా లలో అటవీ నిర్మూలన లేదా అటవీ నిర్మూలన ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి అని మేము కనుగొ న్నాము.ఆఎడారి ప్రాంతాలను పునరుద్ధరించ డానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది అనేక జాతుల మొక్కలు మరియు జంతువు లకు జీవన వనరులో భాగం.ఈవిధంగా మీరు అద్భు తమైనఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తారు.ఇది మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా గాలిని బాగా శుద్ధి చేయగలదు, ఇది అనేక పర్యావరణ ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది నదులకు ఆహారం ఇస్తుంది మరియు వివిధ ప్రాంతాలకు తాగునీటిని అందిస్తుంది. అయితే, ఇది కొన్ని నష్టాలను కలిగి ఉంటుంది. అటవీ నిర్వహణ లోపం ఉన్నప్పుడు ఈ లోపాలు ప్రధానంగా కనిపిస్తాయి.సరిగ్గా నిర్వహించక పోతే,పర్యావరణానికి హాని కలిగించడం మరియు మొక్క జంతు జాతులకు అపాయం కలిగించడం సులభం.నిర్వహణ సరిగా లేకపోవడంవల్ల మాన వులు సహజ పర్యావరణ వ్యవస్థలలో గొప్ప అసమతుల్యతను కలిగిస్తారు. ఉదాహరణకి, అధిక లాగింగ్‌, అననుకూల మరియు / లేదా ఆక్రమణ జాతులను నాటడం ద్వారా పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.ఈ కార్యాచరణ నుండి ఉత్పన్నమ య్యే అన్ని ప్రతికూలతలు, నిర్వహణ సరైన మార్గం లో చేయనప్పుడు జరుగుతుంది. ఇది సమతుల్య పద్ధతిలో చేసినంత కాలం, అది ప్రయోజనాలను మాత్రమే తెస్తుంది.ఇది సామాజిక,ఆర్థిక పర్యా వరణ వినియోగాన్ని ఇవ్వడానికి అత్యంత అధోకర ణం చెందిన ప్రాంతాలలో ఉపయోగించవచ్చు. ఈ సమాచారంతో మీరు అటవీ నిర్వచనం దాని ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోవచ్చని నేను ఆశిస్తున్నాను.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

విజన్‌ విశాఖ సదస్సు

విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హోటల్లో విజన్‌ విశాఖ సదస్సు మార్చి 5నపారిశ్రామికవేత్త లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి హజరై విశాఖపట్నాన్ని ఎలా తీర్చి దిద్దాలి? రాష్ట్రానికి విశాఖపట్నం ఎందుకు అవసరం అన్న అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉందని వివరిం చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వ్యవసా యాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశంమొత్తం చూసుకుంటే జీఎస్డీపీలో వ్యవ సాయం వాటా17-18శాతంగా ఉంది.మన రాష్ట్రంలో అయితే ఇది35శాతంగాఉంది. ద్వితీయ, తృతీయ రంగాలు వృద్ధి చెందకపోతే రాష్ట్రం కూడా ఆర్ధికంగా నిలబడలేదు.ప్రాథమిక రంగమైన వ్యవసాయరంగంతో పోలిస్తే ద్వితీయ రంగం, తృతీయ రంగాలు శరవేంగా వృద్ధిచెందాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ముందున్న సవాళ్లను అధిగమించ గలం. అప్పుడే మనం ఆశించిన ఆర్థికాభి వృద్ధిని సాధించగలం.రాష్ట్ర విభజనవల్ల పెనుసవాళ్లు మనకు ఎదురవుతున్నాయి.హైద రాబాద్‌ నగరాన్ని కోల్పోయాం.దీనివల్ల రాష్ట్రం మీద పెను ప్రభావం పడిరది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఒక చోదకశక్తి అవసరం.ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ఆర్థిక చోదకశక్తి అయిన హైదరాబాద్ను మనం కోల్పోయాం.ఆర్థిక ప్రగతి లక్ష్యాలను చేరుకోవ డానికి ఒక వాహనం మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలను భావించి…ఆరోజుల్లో కేంద్ర ప్రభుత్వం వాటిని విరివిగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఐడీపీఎల్‌, ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎఫ్సీ, ఐఐసీటీ లాంటి సంస్థలు హైదరా బాద్లో స్థాపించబడ్డాయి.పెద్ద ఎత్తున పెట్టు బడులు హైదరాబాద్కు వచ్చాయి.దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని ఏఇతర ప్రాంతంతో పోల్చు కున్నా హైదరాబాద్‌ బాగా అభివృద్ధి చెం దింది. ఇలాంటి సంస్థలు వస్తే గనుక వెంటనే అభివృద్ధి పరంగా మంచి మార్పు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి జీతాలు లభిస్తున్న ఉద్యో గులు ఉంటారు. ఇది వలయంలా మారి మంచి సంస్థలు రావడం,తద్వారా మంచి ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.తద్వారా నగరం బాగా విస్తరిస్తుంది.ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వరంగ సంస్థల్లో 90 శాతం సంస్థలు కేవలం హైదరాబాద్లోనే స్థాపించబడ్డాయి. దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందింది. దురదృష్టవ శాత్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా ప్రాంతా ల్లో అలా జరగలేదు.ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపే సేవారంగం జాతీయ స్థాయిలో చూస్తే జీఎస్డీపీలో 55శాతంకాగా, కానీ తెలంగాణలో సేవా రంగం దాదాపు 62.87శాతంగా ఉంది. కాని మన రాష్ట్రంలో సేవారంగం వాటా కేవలం 40శాతం మాత్రమే. తెలంగాణలో సేవారంగానికి సంబంధించి అత్యధిక వాటా హైదరా బాద్నుంచే వస్తోంది.అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ పెరుగుతుంది. తయారీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే జీఎస్డీపీలో సమాన స్థాయిలో ఉన్నప్పటికీ సేవా రంగం విషయంలో గణనీయ ప్రగతి చోటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసా యరంగంతో పోలిస్తే సేవారంగంలో మంచి వృద్ధిరేటు సాధ్యం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీసు రంగం బాగా పెరగాల్సిన అవసరం ఏ రాష్ట్రా నికైనా ఉంది. 2022-3 ఆర్థిక సంవత్స రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం కేవలం రూ.2,19,518కాగా, తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,12,398లు. తెలం గాణ తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్‌ నుంచే వస్తోంది.సహజ సిద్ధంగా మనకున్న బలాలను వినియోగించుకుంటూ ఆర్థిక పురోగతిలో ముందుకుసాగాల్సిన అవ సరం ఉంది. దేశంలోనే రెండో అతిపెత్త సముద్రతీర ప్రాంతం మనకు ఉంది.974 కి.మీ పొడవైన తీర ప్రాంతం కారణంగా పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మనకు అపార అవకాశాలున్నాయి. దీనివల్ల తయారీ రంగాన్ని కూడా గట్టి ఊతం లభిస్తుంది. పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా తయారీ రంగానికి తగిన సహకారాన్ని అందిస్తూ ,974 కి.మీ. తీరంవెంబడి వివిధ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసుకుంటూ, మరోవైపు విశాఖ పట్నాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ రెండూ కలిసి రాష్ట్రానికి మంచి ఆర్థిక ప్రగతిని అందిస్తాయి. 2019కు ముందు కేవలం 4చోట్ల నుంచే ఎగుమతులు జరిగేవి.కాని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మరో నాలుగు పోర్టు లు కడుతున్నాం. వీటి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు రూ.16వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే దాదాపుగా రూ.4వేల కోట్లు ఖర్చు చేశాం. రామాయపట్నం పోర్టులో వచ్చే నెలలోనే షిప్పులు వచ్చే పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు. మచిలీపట్నం, కాకినాడలోని ప్రయివేటు పోర్టు, మూలపేట పోర్టులవద్ద కూడా పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. నాలుగులో మూడు పోర్టులు ప్రభుత్వ రంగంలో వస్తుం డగా,మరో పోర్టు ప్రయివేటు రంగంలో వస్తోంది.బ్లూ ఎకనామీకి ఊతమిచ్చేలా 10 పిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నాం.తీరం వెంబడి ప్రయాణిస్తే ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఒక ఫిషింగా హార్బర్‌ ఉంటుంది. అలాగే 6 ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటితోపాటు పారిశ్రామిక నోడ్స్ను అభివృద్ధి చేస్తూ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్ను నెలకొల్పాం. అచ్యు తాపురం,ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో పారి శ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నాం.అలాగే రాష్ట్రమంతటా కూడా సమతుల్య అభివృద్ది ఉండేలా చూస్తున్నాం. ప్రభుత్వం తీసుకుం టున్న సానుకూల చర్యలవల్ల, వ్యాపార అను కూల వాతావరణం వల్ల గడచిన మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక వేత్తలకు, పారిశ్రామిక రంగాన్ని రాష్ట్రం ఎంత స్నేహపూర్వకమైనదో చెప్పడానికి ఇదే ఉదాహ రణ. గత ఏడాది ఇదే విశాఖట్నంలో నిర్వ హించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సంద ర్భంగా రూ.13లక్షల కోట్లకుపైగా విలువైన 352 ఒప్పందాలు కుదిరాయి.దాదాపు 6 లక్ష ల మందికి ఉద్యోగావకాశాలు లభించను న్నాయి. ఇందులో 39శాతం ఒప్పందాలు ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఇప్పటికే కార్య రూపంలోకి వచ్చాయి. మిగిలిన ఒప్పందాలు కూడా శరవేగంగా అమల్లోకి వస్తున్నాయి. కేవలం అతి పెద్ద తయారీ పరిశ్రమలు రావడంద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి, లబ్ధిదారు లను సుస్థిర స్వయం ఉపాధి మార్గాలవైపు నడిపించింది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గణనీయమైన మార్పును తీసుకు వచ్చాయి.లంచాలకు తావులేకుండా, దళారీలు లేకుండా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా పథకాలు డీబీటీ పద్ధతిలో అమలు చేసింది. ప్రతి సంక్షేమ పథకం కూడా లబ్ధిదారులను చేయిపట్టుకుని నడిపించాయి. ఉదాహరణకు చేయూత పథకాన్ని తీసుకుంటే క్రమం తప్పకుండా ఒకే మహిళకు రూ.18,750లు చొప్పున నాలుగేళ్లపాటు స్థిరంగా ఇచ్చాం.ఆ లబ్ధిదా రులైన మహిళలను బ్యాంకులతో అనుసం ధానం చేశాం. అమూల్‌, ఐటీసీ, రియలన్స్‌, పీ అండ్‌ జీ లాంటి పెద్ద కంపెనీల భాగస్వా మ్యంతో వారికి స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశాం.వాల్లకాళ్లమీ వాళ్లు నిల బడేలా చేశాం.రాష్ట్రం ప్రభుత్వం ఈ ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇలాగే అమలు చేసింది. ఇదివరకు జీవనోపాథి పొందుతున్న మార్గాన్ని బలోపే తం చేయడమో లేక కొత్త ఉపాథి మార్గాన్ని సృష్టించడమో జరిగింది.
ఉద్యోగ రంగాన్ని మొత్తం చూస్తే.. ప్రభుత్వంలో ఉన్నవి కొన్ని మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మేం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యగుల సంఖ్య 4లక్షలు అయితే, మేం వచ్చిన తర్వాత సుమారో మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను జోడిరచ గలిగాం. దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య 4లక్షలు అయితే,50శాతం అధికంగా కొత్త ఉద్యోగాలను మేం అధికారం లోకి వచ్చాక సృష్టించగలిగాం.అలాగే భారీ పరిశ్రమల విషయంలో కూడా కోట్లాది రూపాయల పెట్టుబడులను పెడితే,ఆ పెట్టు బడులు ఉద్యోగావకాశాల రూపంలో మారేది కూడా స్వల్పంగానే ఉంటుంది.కాని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో పెద్ద వాటా వ్యవసాయం సహా ఇతర మూడు రంగాల్లో ఉన్నాయి. వ్యవసాయరంగంపై 62శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు.52 శాతం మంది రైతులకున్న భూమి అర హెక్టారు లోపలే.70 శాతం మంది రైతులకున్న భూమి హెక్టారు లోపలే.అభివృద్ధిగురించి మనం మాట్లాడుకు నేటప్పుడు ఈ వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మనకు పెద్ద మొత్తంలో సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వీరు ఆదాయాలు పొందలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూప్పకూలి పోతుంది. అందుకే రైతులకు చేయూనిచ్చి నడిపించడానికి,ఆర్బీకేలద్వారా,అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లను పెట్టడంద్వారా,రైతు భరోసా ద్వారా వారికి తోడుగా నిలుస్తున్నాం.ఉపాథి రంగంలో వ్యవసాయానిది ప్రముఖ పాత్ర. ఇక మరో కీలక రంగం ఎంఎస్‌ఎంఈలు. అతి భారీ,భారీ పరిశ్రమలవల్ల కేవలం3-4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే ఎంఎస్‌ ఎంఈల్లో 30లక్షల మంది ఉద్యోగాలు చేస్తు న్నారు.ఎంఎస్‌ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది.వీటన్నింటికంటే ఎక్కడు మంది స్వయం ఉపాధి మార్గాల ద్వారా జీవిస్తున్నారు.1.5 కోట్ల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేం వెనుక వీరి పాత్రే కీలకం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్ర మాల ద్వారా వీరికి చేదోడుగా నిలుస్తోంది. వారి స్వయం ఉపాధికి సహకారాన్ని అంది స్తోంది.ఉదాహరణకు చూసుకుంటే రాష్ట్రంలో కోటిమందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలు,ఎన్పీఏలు 80 శాతం వరకూ ఉండేవి.ఇప్పుడు కేవలం 0.3శాతం మాత్రమే ఉన్నాయి. కోటిమంది మహిళలు దీనిపై ఆధారపడి ఉన్నారు. అలాగే కార్లు, వాహనాలు నడుపుతూ బతుకుతున్న వారిని వాహనమిత్ర ద్వారా చేదోడుగా నిలు స్తున్నాం. అలాగే కులవృత్తులు చేసుకుంటున్న నాయీబ్రాహ్మణులు,రజకులు, టైలర్లు వంటి వారికి కూడా ప్రభుత్వం చేదోడుగా నిలి చింది. ఆర్థికాభివృధ్ధిలో వీరందరిదీ కీలక పాత్ర. రాష్ట్రంలో ఇలా ప్రతి వర్గానికి కూడా చేయూత నందించేలా ప్రభుత్వం అనేక కార్య క్రమాలు చేపట్టింది. కోవిడ్‌ లాంటి సంక్షోభ సమయంలో కూడా ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో ప్రోత్సాహకాలను విడుదలచేసి ప్రభుత్వం వారిని ఆదుకుంది. ఇది ఎంఎస్‌ ఎంఈల రంగాన్ని రక్షించింది. అందుకే ఈ రంగంలో వృద్ధి గతంతో పోలిస్తే గణనీయం గా ఉంది. 2018-19లో ఆర్థిక వృద్ధిరేటులో రాష్ట్రం చివరల్లో ఉంటే గత ఏడాది మొదటి ఐదు రాష్ట్రాల్లో నిలవడం దీనికి నిదర్శనం. భారత్లో తయారీ రంగం జీవీఏలో రాష్ట్ర తయారీ రంగం జీవీఏ 2019-24 మధ్య 4శాతంగా ఉంటే,2014-19 మధ్య కేవలం 2.9శాతం మాత్రంగా ఉండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మరి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి? వైజాగ్‌ విషయంలో మనం ఏం చేయాలి? వైజాగ్‌ అభివృద్ధి చరిత్రను మనం ఏరకంగా మార్చా లి? వచ్చే పదేళ్లలోగా మనం హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలతో ఎలా పోటీపడాలి? అన్నదానిపై మనం దృష్టిపెట్టాలి. ఇదే విజన్‌ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి. ఈ ప్రాంతం పట్ల ఈ నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్త శుద్ధి లేకపోతే ఈ విజన్‌అన్నది సాకారం కాదు, వాస్తవంలోకి రాదు. అన్నికంటే ముందు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇక్క డకు వచ్చి నివాసం ఉండాలి. ఆది నేను అనగానే,మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలు ఉన్న నెగెటివ్‌ మీడియా ఒక్కసారిగా బోరున విలపిస్తాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వైజాగ్కు మారుస్తా న్నామంటే చాలు, ఇక్కడ భూముల కబ్జాచే యడానికి వస్తున్నారనీ, అది చేస్తున్నారనీ, ఇది చేస్తున్నారనే రక రకాల కథనాలు ప్రచురి స్తున్నారు, ప్రసారంచేస్తున్నారు.
సిగ్గులేకుండా ఇలాంటి రాతలు రాస్తున్నారు. సిగ్గులేకుండా చూపిస్తున్నారు.కోర్టులకువెళ్తున్నా రు. కేసులు వేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వాళ్లు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి విశాఖపట్నం రాకూడదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇక్కడకు వస్తే,ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్గా పురోగతి సాధిస్తుంది. అందుకే సీఎం ఇక్కడకు రాకూ దని అనుకుంటున్నాకు. దీనివెనుక మరోచోట వారికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. బినామీల పేర్లతో భూములు కొన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూ టివ్‌ క్యాపిటల్‌ అనగానే ఈ భూముల కొన్న వారంతా అక్కడ వారి భూముల రేట్లు తదు పరి పడిపోతాయని ఒక్కసారిగా భీతిల్లి పోయారు. వారి స్వప్రయోజనాల కారణంగా వైజాగ్‌ సందిగ్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది.నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. మార్పులు అనేవి అనివార్యం. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరులతో పోటీపడాలంటే వైజాగ్‌ అనేది ఎకనామిక్‌ ఇంజిన్‌-ఆర్థిక చోద కశక్తి కావాల్సిందే. నాకేమైనా స్వప్రయోజనం ఉంటే నేను కడప గురించి మాట్లాడేవాడిని. రాష్ట్రం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదీ అనేది నా అభిప్రాయం.భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది,మన పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది,ఏం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి, దేని వల్ల ఆర్థికంగా పురోగమిస్తాం, అనేరకంగా మనం ఆలోచన చేయకపోతే,ఈ కోణంలో మనం వైజాగ్ను మనం ఆలోచించలేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అన్నది మనం అంతా ప్రశ్నిం చుకోవాలి.
నాయకుడి దార్శినికత తప్పు అయితే…
నాయకుడి దార్శినికత నెగెటివ్‌ అయితే… వైజాగ్‌ వృద్ధిచెందదు,విస్తరించదు.దురదృష్టవ శాత్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పట్నం కోసం ఎవరైనా నిలబడ్డారంటే..అది నేను మాత్రమే. ఇది వాస్తవం. విశాఖపట్నం కోసం ప్రతిపక్షాలతోనూ, స్వప్రయోజనాలున్న మీడియాతోనూ పోరాడుతున్నాం. వారిలో ప్రతి ఒక్కరూ కూడా విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధాని కాకూడదని కోరుకుం టున్నారనేది వాస్తవం.వైజాగ్‌ తప్పనిసరిగా అభివృద్ధి చెందాలి. ఒకవైపు కోర్టు కేసులు నడుస్తున్నాయి, మరోవైపు విశాఖపట్నాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటాను.నా ప్రమాణస్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుంది.వైజాగ్‌ పట్ల నాకు న్న కృతనిశ్చయం ఇది.
విశాఖ అభివృద్ధికోసం పదేళ్ల విజన్‌ఇది.
మనం ఈ నగరాన్ని ఓన్‌ చేసుకోవాలి. కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దాలి. దీనికోసం సాకారమయ్యేలా, వాస్తవ రూపంలో ప్రతింబింబించేలా వైజాగ్‌ కోసం మార్గదర్శక ప్రణాళిక రూందించాం.పెద్దగా కలలు కని, ఆచరణలో మాత్రం ఏమీ సాధ్యంకానట్టుగా కాకుండా వాస్తవిక దృక్పథంతో,అనుకున్నవన్నీ సాకారమయ్యేలా ఈ విజన్ను రూపొందిం చాం.పదేళ్లకాలంలో ఇవన్నీకూడా వాస్తవ రూపం దాలుస్తాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వ మే కాకుండా కేంద్ర ప్రభుత్వం,పీపీపీ పద్ధతు ల్లో, ప్రయివేటు రంగం వీరందరూ కూడా ఈ విజన్‌ సాకారంలో భాగస్వాములు అవుతారు. పదేళ్లకాలంలో హైదరాబాద్‌,బెంగుళూరు, చెన్నై నగరాలకు పోటీగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేలా ఈ విజన్‌ ఉంటుంది.రాజధానిగా అమరావతి ఆలోచనను నేను ఎందుకు వ్యతిరేకించాలి? అలాంటి వ్యతిరేకత కూడా నాకేమీ లేదు. పైగా శాసన రాజధానిగా అమరావతిని ప్రటించిందీ, నిర్ణయించిందీ నేనే. కర్నూలును కూడా న్యాయరాజధానిగా ప్రకటించిందీ నేనే. నాకేం ఎలాంటి వ్యతిరే కతా లేదు. కాని వాస్తవం ఏంటంటే.., అమ రావతి అనేది 50వేలఎకరాల వర్జిన్‌ ల్యాండు, ఖాళీ భూమి. రోడ్లు,నీళ్లు,విద్యుత్‌ లాంటి కనీస సదుపాయాలు కల్పించడానికి మాత్రమే వాళ్లు ఇచ్చిన డీపీఆర్‌ ప్రకారమే ఎకరాకురూ.2కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతి ప్రాంతంలో భవనాలు రావాలంటే దానికి ముందు కనీ సంగా రూ.1లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది.ఇవాళ మనం ఒకలక్ష కోట్లు అనుకుంటే..20 ఏళ్లలో ఏటా రూ.5వేల కోట్లు చొప్పున వేసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లో, అది చివరకు ఖర్చులు పెరిగీ, పెరిగీ ఏరూ.15లక్షల కోట్లో అయినా అవు తుంది. అందుకనే అమరావతి ఆలోచనకు నేను వ్యతిరేకం కాదు, కాకపోతే అక్కడ అది చేయలేం అంటున్నాం.
కాని వైజాగ్‌ విషయానికొస్తే.. కనీస మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. మంచి రోడ్లు, కరెంటు,తాగునీటి సదుపాయం.. ఇలా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కొన్ని మెరుగులు దిద్దితే సరిపోతుంది. వీటితో సిటీ రూపురేఖలు గణనీయంగా మారుతాయి. కార్యనిర్వాహక రాజధానిగా ఇక్కడకు మారే సమయంలో ఉద్యోగులు పనిచేసుకునేందుకు ఐకానిక్‌ సెక్రటేరియట్‌ ఒకటి ఉండాలి. ఇది దేశం దృష్టిని ఆకర్షించాలి.అలాగే దేశం అంతా ఇటు చూసేలా ఐకానిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌,అలాగే అహ్మదాబాద్‌ తరహాలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఉండాలి. మ్యాచ్లు జరిగేటప్పుడు దేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తంకూడా మాట్లాడుకోవాలి. ఇవన్నీవస్తే ప్రపంచంలో వైజాగ్‌ స్ధాయి పెరుగుతుంది.దేశం మొత్తమే కాదు, ప్రపం చం మొత్తం సంభ్రమాశ్చర్యంతో చూస్తుంది. ప్రపంచ ఆధునిక సాంకేతిక రంగంలో అంశా లను బోధించేలా ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూని వర్శిటీ ఒకటి రావాల్సి ఉంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలో మన విద్యార్థులకు ఇది చక్కటి వేదిక కావాలి. అలాగే భోగాపురం ఎయి ర్పోర్టు నిర్మాణం శరవేంగా సాగుతోంది.15-18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా వేగంగా పనిచేస్తున్నారు.భోగాపురం ఎయిర్‌ పోర్టును అనుసంధానించేలా ఆరు లేన్లతో అందమైన బీచ్‌ కారిడార్‌ రోడ్డు ప్రాజెక్టు కూడా రావాల్సి ఉంది.అలాగే మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌,ఏడాది కాలంలోగా ప్రారంభమయ్యే మూలపేట పోర్టు.దీంతో మొత్తం హారిజాంటల్‌ గ్రోత్‌ కారిడార్‌ ఏర్పడుతుంది. అలాగే డేటా సెంటర్‌, సబ్మెరైన్‌ కేబుల్‌ రూపంలో పెద్ద పెట్టుబడులు అదానీ పెడుతుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ చేశాం. వచ్చే 5-6 ఏళ్లలో విడతల వారీగా ఈప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆతిథ్య రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయి. ఓబరాయ్‌, మై ఫెయి ర్‌ కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. బెస్ట్‌ ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలు రాబోతున్నాయి. అలాగే ఎన్టీపీసీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ రూపంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు రాబోతు న్నాయి. ప్రధానమంత్రి నిన్ననే దీనికి శంకు స్థాపన చేశారు. ఇవన్నీ కూడా సాధ్యం కానివి కాదు. ఇవన్నీకూడా వాస్తవరూపంలోకి వచ్చేవే. వచ్చే పదేళ్లలో ఇవన్నీ రాబో తున్నాయి. ఇవేమీ ఊహించలేనివి కూడా కాదు. ఇవన్నీకూడా సాకారమయ్యేవే. అలాగే హైస్పీడ్‌ రైలు కారిడార్లపై కూడా ప్రధాన మంత్రితో మాట్లాడుతున్నాం. హైదరాబాద్‌-వైజాగ్‌,విజయవాడ-బెంగళూరుల మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకోసం సంప్రదిస్తున్నాం. ఇవన్నీరావమే కాకుండా, సీఎంకూడా ఇక్కడకు వస్తే పదేళ్లకాలంలో వైజాగ్‌ ప్రపంచంలోని, దేశంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడుతుంది. ఇన్ని అడ్డంకులు ఉన్నా, అవరో ధాలు ఉన్నా విశాఖ నగర వాసులకు నేను ఒక్కటే చెప్తున్నాను.మనం తప్పక విజయం సాధిస్తాం.విశాఖపట్టణంలోని వి-కన్వెన్షన్‌ హాలులో జరిగిన భవిత కార్యక్రమంలో భాగంగా ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా శిక్షణ పొంది ప్రయివేటు రంగాల్లో ఉపాధి పొందిన యువత తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. విద్యా దీవెన,వసతి దీవెనల సాయంతోనే చదువుకున్నాం ః దీపిక,గ్రాడ్యు యేట్‌ ఇంజినీర్‌ ట్క్రెనీ, రాయల్‌ ఎన్ఫీల్డ్‌ మోటర్‌ కంపెనీ,చెన్నై. మాది విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను.మా నాన్న ఫోర్క్‌ లిఫ్ట్‌ ఆపరేటర్‌. అమ్మగృహిణి.నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకు న్నాం.నేను నా గ్రాడ్యు యేషన్‌ పూర్తయిన తర్వాత ఆటోమేషన్‌ రంగంలో స్ధిరపడాలని భావించాను.సీడాప్‌ ద్వారా స్కిల్‌ కాలేజ్లో జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్‌ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎంపికయ్యాను. రాయల్‌ ఎన్ఫీల్డ్‌ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యు యేట్‌ ఇంజినీర్‌ ట్క్రెనీగా సెలక్ట్‌ అయ్యాను. మా బ్యాచ్లో అనేక మంది వివిధ కంపెనీలకు సెలక్ట్‌ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి,ఏపీ ప్రభుత్వా నికి, స్కిల్‌ డెవల ప్మెంట్కు, సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు.నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేశాను. అప్పుడు ఏపీ ఎస్‌ఎస్డీసీ స్కిల్‌ ట్క్రెనింగ్‌ ప్రోగ్రామ్‌ లో 45రో జులు శిక్షణ తీసుకు న్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకు న్నాను.మెషిన్‌ ఆపరేటింగ్‌, సాప్ట్స్కిల్స్‌, కమ్యూ నికేషన్‌ స్కిల్స్‌ నేర్పారు. -జిఎన్‌వి సతీష్‌

చిత్తడి నేలను కాపాడుకుందాం

జీవ వైవిధానికి నెలవులుగా గుర్తింపు పొందిన చిత్తడి నేలలు ఎక్కువ లోతు లేకుండా వివిధ జంతు, వృక్ష జాతులకు అవాసాలుగా ఉంటాయి. ఎన్నో రకాల చేపలు,పక్షులకు ఆహారాన్ని సమకూరుస్తూ.. వాటి సంతానోత్పిత్తికి, అవాసాలకు అవి ప్రధాన ఆధారా లుగా నిలుస్తున్నాయి. రామ్‌సర్‌ అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ ఒప్పందం ప్రకారం ప్రవహించే లేదా స్థిరమైన నీటిని కలిగి ఉన్న ప్రాంతాలన్నీ చిత్తడి నేలలే.2014కు ముందు రామ్‌సర్‌ జాబితాలోని చిత్తడి నేలలు దేశీయంగా 26 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం అవి 75కి చేరినట్లు ఇటీవల మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వాటి పరిరక్షణ ప్రయ త్నాల్లో స్థానిక ప్రజలు ఎప్పుడూ ముందు వరసలో ఉం టున్నట్లు తాజా బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు.
అడవులను ప్రకృతికి శ్వాసకోశాలుగా పరిగణిస్తే,చిత్తడి నేలలను మూత్రపిండాలుగా అభివర్ణిస్తారు.అవి నీటి నుంచి వ్యర్ధాలను తొలగించి శుద్ది చేస్తాయి.భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. సముద్ర తీర స్థిరీకరణ,వరదల నియంత్రణ వంటి ఎన్నో సేవలను చిత్తడినేలలు అందిస్తాయి.అధిక వర్షాలవల్ల వచ్చే నీటిని స్పాంజిమాదిరిగా అవిశోషించుకొని వరదలను నియంత్రిస్తాయి.ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలకు మత్స్యసంపద ద్వారా ఆహార భద్రతను, జీవనోపాధులను చిత్తడి నేలలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం మనుగడ అత్యంత ప్రమాదంలో పడిన ఆవరణ వ్యవస్థలుగా వాటిని పరిగణిస్తున్నారు. చిత్తడి నేలలు కలుషితమైన నీటి నుండి నైట్రోజన్‌ మరియు ఫాస్పరస్‌ వంటి వ్యర్థా లను గ్రహించి కిడ్నీలాగా శుభ్రపరిచే కీలకమైన పర్యావరణ వ్యవస్థ సేవను అందిస్తాయి. కాబట్టి, మనం మన అవయవాలను జాగ్రత్తగా చూసు కున్నట్లే, ఈకీలక పర్యావరణ వ్యవస్థలను భవిష్యత్తు కోసం కాపాడుకోవడం మన బాధ్యత.మరియు ఈ ప్రాథ మిక కర్తవ్యాన్ని మనకు గుర్తు చేయడానికి ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ఇక్కడ ఉంది.నీరు భూమి లో కలిసేచోట చిత్తడి నేల ఏర్పడుతుంది. సరళం గా చెప్పాలంటే, ఇది ప్రధానంగా సంతృ ప్తమైన లేదా శాశ్వతంగా లేదా కాలానుగుణంగా నీటితో నిండిన భూభాగం.చిత్తడినేలలు,చెరువులు, సరస్సులు, ఫెన్స్‌,నదులు,వరద మైదానా లు,చిత్తడి నేలలను కలిగి ఉన్న లోతట్టు చిత్తడి నేలలు, సముద్రతీర చిత్తడినేలలు,వీటిలో ఉప్పునీటి చిత్తడి నేలలు,ఈస్ట్యూరీలు,మడ అడవులు మరియు మడుగులు ఉన్నాయి.మానవ నిర్మిత చిత్తడి నేలలు కొన్ని చేపలచెరువులు, వరి వరిపంటలు మరియు సాల్ట్‌పాన్‌లు.భారతదేశం వంటి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో,చిత్తడి నేలలు మిలియన్ల మంది మానవులు మరియు వన్యప్రాణుల దా హాన్ని తీర్చే మంచినీటి యొక్క ప్రముఖ వనరులు. భూమిపై జీవాన్ని నిలబెట్టేది నీరు! అయినప్పటికీ, ఈజీవితపు అమృతం కనుమరుగవుతోంది, అందువల్ల,అనేక నగరాలు దానిలోని ప్రతి చుక్కను రక్షించడానికి పెనుగులాడుతున్నాయి. సర్వత్రా ఉన్నప్పటికీ,సంభాషణ పరంగా చిత్తడి నేలలు తరచుగా విస్మరించబడతాయి.నీటి విపత్తు అదృ శ్యంపై,చిత్తడి నేలలపై కన్వెన్షన్‌ సెక్రటరీ-జనరల్‌ మార్తా రోజాస్‌ ఉర్రెగో,‘‘మేము తీవ్రపరిణా మా లతో నీటి సంక్షోభంలో ఉన్నాము మరియు చిత్తడి నేలలు దాని తీర్మానానికి కేంద్రంగా ఉన్నాయి’’ అని నొక్కి చెప్పారు.‘‘భూమిపై ఉన్న నీటిలో ఒకశాతం కంటే తక్కువ మంచినీరు ఉపయోగ పడుతుంది మరియు ఎక్కువగా నదులు, ప్రవా హాలు, సరస్సులు, చిత్తడి నేలలు, ఈస్ట్యూరీలు మరియు జలాశయాలు వంటి చిత్తడి నేలలలో నిల్వ చేయబడుతుంది. మనం ప్రతిరోజూ కనీసం 10 బిలియన్‌ టన్నుల మంచినీటిని వినియోగి స్తాము-భూమి తిరిగి నింపగలిగే దానికంటే ఎక్కువ. అయినప్పటికీ, 2050 నాటికి 10 బిలి యన్ల జనాభాకు 55% ఎక్కువ నీరు అవసరం అవుతుంది.ఈ దిశగా, ప్రపంచ నాయకులు ఫిబ్రవరి 2,1971న ఇరాన్‌లో రామ్‌సర్‌ కన్వె న్షన్‌గా పిలవబడే చిత్తడి నేలలపై కన్వెన్షన్‌పై సంతకం చేయడం ద్వారా భవిష్యత్‌ తరాలకు మరియు భూమి కోసం చిత్తడి నేలలను పరిరక్షిం చాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ చారిత్రాత్మక ఒప్పం దాన్ని ఆమోదించడం ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తించబడిరది. ప్రపంచవ్యాప్తంగా, రామ్‌సర్‌ కన్వెన్షన్‌ ద్వారా దాదాపు 2300 చిత్తడి నేలలు గుర్తించబడ్డాయి. ఈరోజు 50వసంవత్సర వేడుకలకు అంకితమైన థీమ్‌ ‘వెట్‌ల్యాండ్‌ అండ్‌ వాటర్‌’.ఈ ముఖ్యమైన మంచినీటి వనరుపై అవగాహన పెంచడం థీమ్‌ లక్ష్యం. అంతేకా కుండా, ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల నష్టాన్ని పునరుద్ధరించడానికి మరియు ఆపడానికి వారి నమ్మకాన్ని పునరుద్ఘాటించాలని కూడా ఈ రోజు ప్రజలను కోరింది.
భారతదేశంలో,చిత్తడి నేలలు 15. 26 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయని అంచనా వేయబడిరది,ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో4.63%కి సమానం.1982లోభారత ప్రభుత్వం సంతకంచేసిన రామ్‌సర్‌ కన్వెన్షన్‌ కింద ఇవి రక్షించబడ్డాయి.రామ్‌సర్‌ కన్వెన్షన్‌ కింద, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన 37చిత్తడి నేలలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. భారత దేశం కూడా అతిపెద్ద రామ్‌సర్‌ సైట్‌లలో ఒకటిగా ఉంది,అంటే సుందర్‌బన్స్‌ 4,230 చద రపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. భారతదేశం కూడా విభిన్న రకాల చిత్తడి నేలలకు ఆతిథ్యం ఇస్తుంది, వీటిలో ముఖ్యమైనవి గంగా మరియు బ్రహ్మపుత్ర వంటి నదుల వరద మైదానాలు,హిమాలయాల ఎత్తైన ప్రాంతాలు, మడుగులు మరియు తీరప్రాంతంలోని మడ చిత్తడి నేలలు. అయితే గత నాలుగు దశాబ్దా లుగా దేశం దాదాపు మూడిరట ఒకవంతు చిత్తడి నేలలను కోల్పోయినందున ఈవిలువైన పర్యా వరణ వ్యవస్థ ముప్పులో పడిరది.
చిత్తడి నేలలకు ముప్పు
పట్టణీకరణ,వ్యవసాయ విస్తరణ, ఆనకట్టల నిర్మాణం,సిల్టేషన్‌, వాతావరణ మార్పు, పర్యాటకం కోసం భూమిని క్లియరెన్స్‌ చేయడం, ఆక్రమణ జాతులు మరియు కాలుష్యం కార ణంగా అత్యంత ఉత్పాదక చిత్తడి నేలలు అంచున ఉన్నాయి.ఈపైన పేర్కొన్న కారణాలవల్ల, 1700 ల నుండి భూమి దాదాపు 87% సహజ చిత్తడి నేలలను కోల్పోయిందని అంచనాలు సూచిస్తు న్నాయి, అయితే వాటిలో దాదాపు 35% 1970ల నుండి కోల్పోయింది.అడవుల కనుమరు గయ్యే రేటుతో పోలిస్తే చిత్తడి నేలలు మూడిర తలు వేగంగా కనుమరుగవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రామ్‌సర్‌ కన్వెన్షన్‌ కింద ప్రణా ళిక చేయబడిన చర్యలు అమలు చేయకపోతే, రాబోయే సంవత్సరాల్లో భూమి మరో ముఖ్యమైన మంచినీటి వనరులను కోల్పోవచ్చు. వరదలు, అలలు మరియు కరువుల వంటి విపత్తుల ప్రభా వాన్ని తగ్గించడంలో ఈ వనరులు కీలక పాత్ర పోషిస్తాయి మరియు పోషకాలు మరియు రసాయ నాలను రీసైకిల్‌ చేస్తాయి. వారు మట్టిలో కార్బన్‌ నిల్వ చేయడానికి ప్రసిద్ధి చెందారు, ఇది వాతా వరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడుతుంది.ప్రపంచవ్యాప్తంగా,చిత్తడి నేలలు ఏడాది పొడవునా విభిన్న వృక్షజాలం మరియు జంతుజాలం,జాతులకు హాట్‌స్పాట్‌. అందువల్ల, అవి మన గ్రహం యొక్క మొత్తం శ్రేయస్సు,వనోపాధికి ముఖ్యమైనవి. తగ్గిన కాలు ష్యం,వ్యర్థాల ఉత్పత్తి వ్యక్తిగత స్థాయిలో సహాయ పడగలిగినప్పటికీ, మెరుగైన విధానం మరియు నియంత్రణ కోసం ఒత్తిడి చేయడం ద్వారా దేశ స్థాయిలో ప్రకృతిఈ విలువైన బహుమతులను సంరక్షించవచ్చు.
జల, వృక్ష సంపదకు కొల్లేరు ఆలవాలం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంత రించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపా డితే అది భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతు న్నారు. సృష్టిలో సహజసిద్ధంగా మానవాళి మనుగడ కోసం ఏర్పడిన సంపదను విస్మరిస్తున్నారు. ప్రపంచ దేశాలుసైతం పర్యావరణాన్ని పరిరక్షిం చండి, ప్రకృతిని కాపాడడండి అంటూ పదేపదే హెచ్చరిస్తున్నా వాటి వినాశనానికి చేసే వికృతి చేష్టలు తగ్గలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన సంప దను రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతు న్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఏకైక చిత్తడి నేలలు ఏలూరు జిల్లాలో విస్తరించిన 77,136 ఎకరాలు కొల్లేరు సరస్సు మాత్రమే.ఈ చిత్తడి నేలలు అనేక జీవరాశులకు, పక్షులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందువల్లే ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన పక్షులు వలసవస్తున్నాయి.ప్రపంచంలోని 164 దేశాలు చిత్తడినేలల పరిరక్షణకు ఒప్పంద సంతకాలు చేశాయి. వీటిలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది.2002 సంవత్సరంలో కొల్లేరును రామ్‌సర్‌ సైట్‌లోనికి తీసుకున్నారు. భారతదేశంలో 21 రాష్ట్రాల్లో 46 ప్రాంతాలను చిత్తడినేలలుగా గుర్తించారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పలు రకాల పోటీలు నిర్వహించి ఈనేలల విశిష్ట తను విద్యార్థులకు తెలియజేస్తూ ఉంటారు.
చిత్తడి నేలల ప్రాధాన్యం
సముద్రం, నది ఇతర నీటి వనరుల తీర ప్రాంతాల్లో లోతు తక్కువ ఉండి ఎక్కువ కాలం నీటినిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. మంచినీటి సరస్సులు, ఉప్పునీటి సర స్సులు,మడ అడవుల తీరప్రాంతాలన్నీ చిత్తడి నేలలే. అరుదైన మొక్కలు, పక్షులు, జంతువులు, చేపలు గుడ్లుపెట్టడానికి ఈనేలలు చాలా అను కూలం.నీటి నాణ్యతను పెంచడంలో, కాలు ష్య కారకాలను గ్రహించడంలో ఈచిత్తడినేలలు ప్రాధాన్యత పోషిస్తాయి. మానవ తప్పిదాలతో పర్యావరణానికి చాలాహాని జరుగుతుంది. ప్రజలు వ్యవసాయ, ఆక్వా అవసరాలకు ఈ భూములను ఆక్రమించుకుని రసాయన ఎరువులు వాడడం వల్ల నివాసయోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతో చిత్తడి నేలలు విధ్వంసానికి గురవు తున్నాయి. ప్రపంచం పరిశ్రమల కోసం ఈ చిత్తడి నేలలు కేటాయించడంతో మరింత వినాశనానికి దారితీస్తున్నాయి.
కొల్లేరును కాపాడే ప్రయత్నాలు నిల్‌..
పేరుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సుగా గుర్తించినప్పటికీ ఎక్కడచూసినా ఆక్రమణల పర్వమే. 2006లో కొల్లేరు ప్రక్షాళన కోసం ఆపరేషన్‌ నిర్వహించినప్పటికీ దానిని పూర్తి స్థాయిలోవినియోగంలోకి తీసుకురాలేకపోయారు. మళ్లీ చెరువులు తవ్వ కాలు చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసు కోవడంతోపాటు ఈ అక్రమ చేపల చెరువు గట్ల వల్ల ఎగువ నుంచి కొల్లేరులోకి నీరు రావడం లేదు. దీంతో ప్రతి ఏడాది చిత్తడినేలలు కాస్తా ఎడారిగా మారి సహజజాతి మత్య్స సంపద అంతరించిపోతుంది. అధికార రాజకీయ నాయ కుల ఒత్తిడితో అటవీశాఖ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా చిత్తడినేలలను పరిరక్షించుకుంటే మానవాళికి ఎంతో దోహదపడుతుందని, వీటి పరిరక్షణ చర్య లు చేపట్టాలని పలువురు పర్యా వరణ ప్రేమికులు కోరుతున్నారు.
అవగాహన అంతంత మాత్రమే
కొల్లేరు చిత్తడి నేలలకు అనువైన ప్రదేశం అయినప్పటికీ వీటి పట్ల ప్రజల్లో అవగాహన, ప్రభుత్వ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే సాగుతూ ఉంటాయి. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కొల్లేరు విశిష్టతను తెలిపేందుకు పక్షుల పండుగ, సంప్రదాయకమైన తాటిదోనెల పోటీలను నిర్వహించేవారు. వీటితోపాటు ఫిబ్రవరి 2న పలు ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు చిత్తడినేలల ప్రాముఖ్యతపై వ్యాసరచన, డిబేట్‌, డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించేవారు. ప్రస్తుతం అయితే విద్యార్థులకు పోటీలు మాత్రమే నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఈనేలల ప్రాముఖ్యతను కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలకు తెలియజేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
చిత్తడి నేలలను పరిరక్షించాలి..
చిత్తడి నేలలు పర్యావరణానికి, ప్రజలకు, అనేక జీవరాశులకు ఎంతో దోహదపడుతాయి. వీటిని కాపాడుకునేందుకు కృషి చేయాలి. చిత్తడి నేలల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వీటిని సంరక్షించుకునే చర్యలను ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాలి.
-చింతపల్లి వెంకటనారాయణ,సాహితీవేత్త, కొల్లేరు వాసి – (జి.ఎ.సునీల్‌ కుమార్‌)

సరికొత్త నవయుగం..యువతతోనే సాధ్యం

ఏ దేశానికైనా శక్తివంతమైన యువత పెట్టనికోట. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. మన దేశానికి ఇదే అతిపెద్ద వనరు. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతిపథంలో దూసుకెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. నా నమ్మకం, ఆశ అంతా యువతపైనే’ అని స్వామి వివేకానంద అన్నట్లుగా సమాజ అభ్యుదయానికి యువత సంకల్పం తీసుకోవాలి.
మానవ సమాజం నిరంతరం ప్రవహించే జీవనది. ఆదిమవ్యవస్థ నుంచి ఆధునిక సోషలిస్టు సమాజం వరకూ వివిధ దశలుగా సాగుతూనే వుంది. వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, మానవుడు కొనసాగుతూనే వుంటాడు. మానవజాతికి సుదీర్ఘ చరిత్ర వుంది. పుట్టింది మొదలు చనిపోయే వరకూ మనిషి నిరంతరం పరిణామం చెందుతూనే వుంటాడు. ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య మార్పు జరుగుతూ వుంటుంది. ముందు తరాలకన్నా తర్వాతి తరాలు మరొక అడుగు ముందుకేస్తుంటాయి. ఈ క్రమంలో పాత విలువలు, సాంప్రదా యాలను దాటుకొని, కొత్తదనం వైపు యువత పరుగులు పెడుతుంది. ఈ మార్పు కాల ప్రవాహంలో ఒక భాగం. ఏ విలువా స్థిరంగా పాతుకొని వుండదు. అయితే, ఈ మార్పును అర్థం చేసుకోవడానికి చారిత్రక పరిశీలన, శాస్త్రీయ దృష్టి, సామాజిక దృక్పథం అవసరం. సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం మనిషి జీవితం ఐదు దశలుగా సాగుతుంది. ఆ ఐదు దశల్లో అంత్యంత విలువైనది యవ్వనదశ. 15-35 ఏళ్ల మధ్య వయస్సుగల వారిని యువజనులుగా పరిగణిస్తారు. ఇది చురుగ్గా,సృజనాత్మకంగా వుండే దశ.వర్గ,వర్ణ,లింగ భేదం లేకుండా, పేదలు, ధనవంతులన్న తేడా లేకుండా వీరందరూ ఒక సాంఘిక సమూహం. ఇంటిలోనైనా, వీధిలోనైనా ఉరకలెత్తే సమూహం యువతరం.సందడికైనా,సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అలాగ. దేహానికి రుధిరం ఎలాగో సమాజానికి నవతరం అలాగ.ఎక్కడైనా,ఎప్పుడైనా దేన్నయినా శోధించి..సాధించి, అధిగమించి.. అధిరోహించి విజయ పతాకాన్ని ఎగరేయడం యువతరానికి సహజ సిద్ధంగానే సమకూరే విద్య. దానికి సరైన నైపుణ్యమూ,సహకారమూ, లక్ష్యమూ జోడిరచగలిగితే- ఆ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.అదేసమయంలో అలా ‘పట్టించుకోనివ్వని’ విధంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలూ స్వారీ చేస్తుంటాయి. ‘ఇవాళ్టి యువతను బట్టే.. రేపటి భవిష్యత్తు ఉంటుంది’ అంటారు విల్లీ స్టార్గెల్‌. ‘నేటి బాలలే రేపటి పౌరులు’గా, దేశభవితకు పునాదిరాళ్లుగా ఎదగాలంటే ఎలాంటి యువతరం ఈ దేశానికి అవసరం? నేటి యువతరం ఎలా ఎదుగుతోంది? అన్నది పరిశీలించాల్సిన అవసరం వుంది.
మనం ఎక్కడున్నాం.. అంటే?..
చరిత్రలో అయినా, సమాజంలోనైనా యువత పాత్ర ఎంతో కీలకం. ఏ ఉద్యమం విజయ వంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా వారి క్రియాశీలత ప్రధానం. అందుకనే వందేళ్ల క్రితం వివేకానందుడు ప్రత్యేకించి యువతరాన్ని మేల్కొలిపే ఉద్యమం చేపట్టాడు. యువతరం పూనుకుంటే దేశాన్ని ముందుకు నడిపించ వొచ్చని స్పష్టం చేశాడు. ‘ప్రశ్న ఆయుధం కావాలి. ప్రతి దానికీ తలూపటం కాదు, తర్కించాలి. హేతు బద్ధంగా లేని దేనినీ నమ్మక్కర్లేదు’ అని చాటిచెప్పాడు. కానీ, ఇన్నేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూస్తే.. మనం ఎక్కడ ఉన్నాం? ప్రపంచ దేశాలన్నింటి కన్నా అత్యధిక యువ జనాభా వున్న దేశం భారత్‌. ప్రపంచంలో 180 కోట్ల యువజనులు ఉంటే- అందులో 28 శాతం మన యువతే! మన దేశంలో ఇప్పుడు సగటు వయసు 29 ఏళ్లు. అంటే భారత్‌ నవనవలాడుతున్న ఒక యువజన దేశం. మరి వుండాల్సినంత ఉత్తేజంతో.. ఉత్సాహాలతో మన యువతరం ఉందా? అంటే ప్రశ్నార్థకమే. అధికారిక లెక్క ప్రకారం- దేశంలోని 30 శాతం మంది యువతకు ఉద్యోగం కానీ, ఉపాధి కానీ లేదు. ఈ విషయంలో మనం శ్రీలంక, నేపాల్‌ కన్నా వెనకబడి వున్నాం. సంఖ్య రీత్యా ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో వున్న మనం.. ఆ యువశక్తిని పనికి ఉపయోగించుకోవటంలో 103వ స్థానం. యువతరం అంటే కేవలం ఓట్లు కాదు, వనరులు కూడా. ఫలితమూ, ప్రయోజనమూ, ఉత్పాదకత ఉన్న రంగాల్లో యువత నిమగమై ఉండాలన్న మన స్వాతం త్య్రోద్యమ స్ఫూర్తి.. ఆచరణలో అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చదువులు, సాంకేతికత పెరిగేకొద్దీ ఉత్పాదక రంగాల్లో యువత భాగస్వాములు కావాలి. కానీ, నేడు అందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. సాంకేతిక విప్లవాన్ని వినియోగించుకొని అజ్ఞానపు సామ్రాజ్యం పెచ్చరిల్లుతోంది. ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై..’ విలసిల్లాలని అభిలషించిన గురజాడ వంటి మహాకవుల మాట ఇప్పుడు..కుల,మత,ప్రాంత విభేదాల దొంతర్ల మోతలో పొల్లుపోతోంది. యువశక్తి దేశ సర్వతోముఖాభివృద్ధికి, శాస్త్రీయ పురోగమ నానికి, సమభావన, సౌభ్రాతృత్వం విలసిల్లే దిశగా దోహదపడాలి.‘ఓ తరం గొప్పదవు తుంది. అది మీ తరమే కావొచ్చు. మీ గొప్ప దనాన్ని వికసింపనివ్వండి’ అంటారు నెల్సన్‌ మండేలా. నవీన పథంలోకి దేశాన్ని మళ్లిం చటానికి ఉపయోగపడాలి. అది ఈ తరమే కావొచ్చు.
ఉపాధి.. ఉద్యమాలు..
యువతరం దేశానికి ఇంధనం. ప్రగతికి రథ చక్రం. చరిత్రలో ఏ మార్పు సంభవించినా అది ఉరకలెత్తే యువత వల్లే సాధ్యం. అలాంటి యువశక్తి నిర్వీర్యమౌతుందన్నది నిష్టురసత్యం. దేశంలో దాదాపు 16శాతం నిరుద్యోగం ఉంది. సామర్థ్యం ఉన్నప్పటికీ చదువుకు తగ్గ ఉద్యోగాలులేక నానా తిప్పలూ పడాల్సి వస్తోంది. పెద్దపెద్ద ప్యాకేజీల గురిం చి వార్తలు వస్తున్నా.. నిజానికి అలాంటి వేత నాలు పొందుతున్న వారి సంఖ్య మూడు శాతానికి మించిలేదు. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న సాఫ్ట్‌వేర్‌ వంటి రంగా ల్లో పనిఒత్తిడి, పనిగంటలు దారుణంగా ఉం టున్నాయి. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో, వచ్చే వేతనంలో ఎంత కోత పడుతుందో అర్థంకాక సీనియర్లను సైతం భయం వెంటాడు తోంది. ఇలాంటి సమస్యలపై 150ఏళ్ల క్రితమే సాధారణ కార్మికులు సంఘటితమై పోరాడారు. చాలా సదుపాయాలు సాధించు కున్నారు. ఇప్పుడు ప్రశ్నించే గొంతులను రాజ్యం నియంతృత్వంగా అణచివేస్తోంది. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీ మరింత పెరిగింది. ఈ మధ్యకాలంలో అమెరికా, ఫ్రాన్స్‌,ఐరోపా దేశాల్లోని యువత తమ హక్కుల కోసం రోడ్లమీదకి వస్తున్నారు. నిరస నల ప్రవాహమవుతున్నారు. ‘యువతరం శిరమెత్తితే..నవతరం గళమిప్పితే/ లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా?’ అన్న కవి ఆశాభావం వృథా పోకుండా.. మన దేశం లోనూ నిరుద్యోగ యువత గళం విప్పాలి. దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి.
పెరుగుతున్న అసంతృప్తి
దేశ ఆర్థిక,రాజకీయ,సామాజిక రంగాల.. దశ, దిశలను అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. అటువంటి యువతను మతోన్మాదం వైపు, కులోన్మాదం వైపు.. ఉగ్రవాదం వైపు నడిపిస్తూ.. తప్పుడు వాగ్దానాలతో పాలక వర్గాలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. యువతరం శక్తిసామ ర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా యువతరంలో పెరుగుతోన్న అసంతృప్తిని ఇటీవల ఒక మీడియా రిపోర్ట్‌ తెరపైకి తెచ్చింది.‘రాబోయే రోజుల్లో/ నెలల్లో పెద్ద ఎత్తున వచ్చే తిరుగుబాట్లలో మీరు చురుగ్గా పాల్గొంటారా..?’అనే ప్రశ్నను 35 దేశాల్లోని 18-34ఏళ్ల మధ్య వయస్కులైన సుమారు 5,80,000 మందిని అడిగితే.. ‘పాల్గొంటాం..!’ అని సగం మందికి పైగా చెప్పారట. దీన్నిబట్టి యువతలో ఎంత అసంతృప్తి దాగుందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు మన దేశమేమీ అతీతం కాదు. చదవడానికి సీట్లు రాక,చేయడానికి ఉద్యోగం లేక రగిలిపోతున్న యువతరం పాలకవర్గాల కుటిలనీతిని గుర్తించాలి. ‘క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటారు గుర్రం జాషువ. మన చుట్టూ జరుగుతోన్న వాస్తవ పరిస్థితులను గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు వహించినా ఒక తరం అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. యువశక్తి దేశాభ్యుదయానికి జీవనాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది. దేశం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించిన భగత్‌సింగ్‌ లాంటి మహనీయుల త్యాగాలను అందుకోవాలి. స్వాతంత్య్రం కోసం వారు చిందించిన నెత్తుటి ధారలను గుండెలకు అదుముకోవాలి. మనకు కావాల్సింది కేవలం రాజకీయ స్వాతంత్య్రమే కాదు.. కోట్లాది భారతీయులు కలలుగన్న ఆర్థిక స్వాతంత్య్రం కూడా. కుల మతాల వివక్షలేని సామాజిక న్యాయం కావాలి. రైతన్నలు పస్తులుండని స్వర్ణయుగం రావాలి. వరకట్న దురాచారం, లైంగిక దాడులు, అవినీతి, దోపిడీలకు ఆస్కారం లేని సమసమాజం కావాలి. అలాంటి మరో ప్రపంచం.. సరికొత్త నవయుగం..యువతతోనే సాధ్యం.
పొంతనలేని మాటలు, చేతలు..
ఎన్నికల హామీలు, రాజకీయ పార్టీల ప్రచారాలలోని వాస్తవాలను యువత అవగతం చేసుకోవాలి. పొంతలేని, ఆచరణ సాధ్యంకాని వారి మాటలు, చేతలను అర్థం చేసుకోవాలి. వాస్తవాలను బేరీజు వేసుకోవాలి. మతము-కార్పొరేట్ల కలయిక దేశానికి హాని కరం. వారే ఇప్పుడు దేశాన్ని నడిపిస్తు న్నారు. వీరి కబంధ హస్తాల్లో చిక్కుకొని దళిత, గిరిజన బలహీన వర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ వర్గాలకు చెందాల్సిన దేశ సంపదను, ప్రకృతి వనరులను ఒకరిద్దరికే దోచిపెడుతున్నారు. యువశక్తిని నిర్వీర్యం చేయడం ద్వారా రాజకీయాలంటే విముఖత చూపేలా వారిని దూరం పెట్టేస్తున్నారు. మాకెందుకొచ్చిన రాజకీయాలు అని యువత అనుకోవడం వల్లనే అనర్హులు, సంఘవ్యతిరేక శక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. దేశాన్ని ప్రజలను దోచుకుంటున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను సమూలంగా నాశనం చేస్తున్నారు. అవినీతి భ్రష్ట రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే.. యువత రాజకీయా ల్లోకి రావాలి. రాజకీయాలకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. నవ యవ్వనంతో తొణికిసలాడే సరికొత్త భారతాన్ని ఆవిష్కరించే శక్తి యువతరానికే వుంది. ఆ దిశగా యువతరం తమ మేధకు పదునుపెట్టాలి.
యువరక్తం.. కవితత్వం..
యువరక్తానికి.. విప్లవానికి, కవిత్వానికి.. గట్టి సంబంధం ఉంది. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, చంద్రశేఖర్‌ ఆజాద్‌, రుద్రమదేవి, రaాన్సీ లక్ష్మీబాయి, బుద్ధుడు, శంకరాచార్య, స్వామి వివేకానంద వంటివారు యువకులుగా వున్నప్పుడే ప్రపంచంలో ఒక సుస్థిర స్థానం పొందారు. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అని భగత్‌సింగ్‌ నినదించింది, దేశాన్ని కదిలిం చింది 23 ఏళ్ల యువకుడిగా ఉన్న ప్పుడే. అల్లూరి సీతారామరాజు ‘వందేమాతరం’ అని విశాఖ మన్యాన్ని చైతన్యబాటలో కదిలించింది 24 ఏళ్ల వయస్సుకే.‘శీతకాలం కోత పెట్టగ/ కొరడు కట్టీ/ ఆకలేసీ కేకలేశానే’ అనే కవితతో శ్రీశ్రీ ‘జయభేరి’ మోగించింది 23 ఏళ్ల వయస్సులోనే. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నా.. ఒక్క మంచి కవితా రాయలేదే’ అని మహాకవి జాన్‌మిల్టన్‌ మధనపడిరదీ లేలేత ప్రాయం లోనే. సాహిత్యంలో ‘సర్రియలిజం’ ప్రక్రియను ప్రవేశపెట్టిన రaంరaామారుత ఫ్రెంచ్‌ కవి ఆర్థర్‌ రాంబో తన టీనేజ్‌లోనే రాయవలసిం దంతా రాసేసి,20వ ఏట రిటైర్‌ అయి పోయాడు. 80ఏళ్ల వయస్సులో అమెరికా వెళ్ళిన ఇంగ్లీష్‌ కవి విలియమ్‌ వర్డ్స్‌వర్త్‌.. తన పద్యాలు చదువుతున్న కుర్రాళ్లను ఆపి, ‘ఈ మధ్య రాసినవి చదవొద్దు.నా తొలిరోజుల్లో రాసినవి చదవండి. అవే నాకు ఇష్టం’ అని సూచించాడట. టి.ఎస్‌. ఇలియట్‌ తన మాస్టర్‌ పీస్‌ అయిన ‘దివేస్ట్‌ ల్యాండ్‌’ ను, జాన్‌కీట్స్‌ తన అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసేశారు. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితి’నని శ్రీనాథుడే స్వయంగా రాసు కున్నాడు. ‘ఎమోషనల్‌ ఫెర్వర్‌ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. దానికి కారణం యవ్వనంలో ఉండే దూకుడు,నిలదీత,ఆగ్రహం, తిరుగుబాటు- కవికి భావోద్వేగాల ఆవేశాన్నిస్తాయి. కవిత్వం నీటిబుగ్గలా ఉబుకుతుంది. ఆ స్వచ్ఛత దానికి సజీవత్వాన్నిస్తుంది.తెలుగులో భావ, అభ్యుద య, విప్లవ కవులు,ఆ తర్వాత స్త్రీవాద,దళిత, మైనారిటీ, బహుజన కవులంతా దాదాపుగా అయితే ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనప్రాయంలో ఉన్నప్పుడో రాసినవే ఎక్కువ.
పెరుగుతున్న నిరుద్యోగం..
నిరుద్యోగ యువత రోజురోజుకు పెరుగుతోంది. ఉపాధి కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కేంద్ర బిజెపి ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది. మోడీ చెప్పిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. నల్లధనం బయటకు రాలేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదు. విభజన హామీలు అమలు కాలేదు. కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు నిర్మించి వుంటే ఈపాటికి వేలమందికి ఉపాధి లభించి వుండేది. ఉద్యోగాల గురించి అడిగితే బజ్జీలు, పకోడీలు అమ్ముకోండంటూ అమిత్‌ షా యువతకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏ దేశంలోనైనా యువత యొక్క శక్తి సామర్థ్యాలు సక్రమంగా సరైన మార్గంలో ఉపయోగించుకుంటేనే ఆ దేశం అభివృద్ధి సాధ్యమవుతుంది. గత 77ఏళ్ల స్వాతం త్య్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేశాయి. దేశంలో గత 45ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ లెక్కలు చెబుతున్నాయి. సిఎంఐఇ చెబుతున్న లెక్కల ప్రకారం..ఐదు కోట్ల మందికి తక్షణమే ఉపాధి కల్పించాలి. లేదంటే దేశం తీవ్ర సంక్షోభంలో పడుతుం దని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగం పెద్దఎత్తున పెరిగింది. చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదు. ఇంజనీరింగ్‌ చదివిన వారిలో కేవలం 15 శాతం మందికి మాత్రమే వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తున్నాయి. పిహెచ్‌ డి, పీజీలు, బిటెక్‌ చదివినవారు ఉపాధి కోసం చిన్నచిన్న ఉద్యోగాలు చేసు కోవాల్సి వస్తోంది. మరికొందరు ఆటోలు నడుపుకునే పరిస్థితికి నెట్టబడ్డారు. ఇంకొం దరు నిరాశ, నిస్పృహలతో డ్రగ్స్‌కు, నేరాలకు బానిసలవుతున్నారు. దేశానికి బలీయమైన శక్తిగా రూపొందాల్సిన యువతను ప్రభుత్వాలు నేరస్తులుగా,ఉగ్రవాదులుగా మారుస్తున్నది. యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని, భవితకు బాటలు వేసుకునే ఆత్మవిశ్వాసం వారి సొంతం. చెడు వ్యసనాలకు బానిసలై పెడదోవ పడితే భవితకే నష్టం. వీరిలో కొందరు యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చు కొని కష్టపడుతున్నారు. మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు,సెల్‌ఫోన్లు,సోషల్‌ మీడియా,మద్యం,డ్రగ్స్‌ వంటి అలవాట్లకు బానిసలై విలువైన జీవితాన్ని పాడు చేసుకుం టున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసంప్రయత్నిస్తున్నారు.
ప్రకటనల ప్రభావం..
ఈ ఆధునిక యుగంలో వివిధ మాధ్యమాలో వస్తున్న ప్రకటనలు ముఖ్యంగా యువతను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. ఆయా ప్రకటన లలో కనిపించే సెలబ్రిటీలను గుడ్డిగా అనుకరిస్తూ తమ ఆరాధ్యదైవంగా అనుసరి స్తారు. ఈ సెలబ్రిటీల హెయిర్‌ స్టైల్‌ ఎలా వుంటుంది,వారు ఏ బ్రాండ్‌ దుస్తులు ధరిస్తా రు, ఏ బ్రాండ్‌ ఫెర్ఫ్యూమ్స్‌ వాడతారో.. వాటి నే తామూ వాడాలని కోరుకుంటారు. దీని కారణంగా మధ్యతరగతి ఆర్థిక సంక్షోభానికి గురవుతుంది. ప్రతి ఒక్కరూ వారు కోరుకునే అన్ని విలాసాలను కొనుగోలు చేయలేరు. కానీ, బ్రాండెడ్‌ బట్టలు, సౌకర్యాలను పొందాలన్న కోరిక యువతలో ఒత్తిడిని పెంచుతోంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా..ఈ ఒత్తిడి వారికి నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే విధంగా వారిని ప్రేరేపిస్తుంది. వివిధ ఆఫర్‌లు, డిస్కౌంట్‌ల ద్వారా ఆకర్షితులవు తున్నందున కొన్నిసార్లు ఈ యువత తమకు అక్కరలేని వస్తువులనూ పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు ఉద్యుక్తులవుతారు. కార్పొరేట్‌ కంపెనీలు తమ లాభాలను పెంచుకునేందుకు ఇలాంటి అనేక వ్యూహాలను అనుసరిస్తుంటారు. యువత తమ తొందర పాటుతోనో, ఆయావస్తువులపై వున్న మోజు తోనో కంపెనీల వ్యూహంలో చిక్కుకుంటు న్నారు. వీటితో పాటు సినిమాలు, డ్రగ్స్‌ కూడా యువతపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. నేటి యువత తమ ఆలోచనా శక్తికి పదును పెట్టాలి. వీటి నుంచి బయటపడాలి.
సమానత్వం దిశగా..
స్త్రీ-పురుష సమానత్వం సాధించే దిశగా గతంలో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న ఈపాటి మార్పు. ఈ ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుంది. కట్నాలు తీసుకోని యువకులు ఈ మధ్య కాలంలో చాలా పెరిగారు. కానీ, ఆ సంఖ్య ఇప్పటికీ అత్యల్పమే. దీనిపట్ల యువతలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం వుంది. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, వ్యవహరించడం బాగా పెరగాలి. కానీ, ఈ కాలంలో సైన్స్‌ని, చాదస్తాన్ని కలగలిపి మాట్లాడేవారు పెరిగారు. మనం గొప్పవాళ్లం అని చెప్పుకోవడానికి మన గతమంతా ఘనమైనదేనని జబ్బలు చరుచుకోవడం మంచిది కాదు. తార్కిక దృష్టితో చూస్తే.. మంచి చెడ్డలు రెండూ విడివిడిగా బోధపడ తాయి. గతంలో మంచి కొంచెమేనని, రానున్నది మంచికాలనమని వందేళ్లనాడే ఉద్ఘాటించాడు మహాకవి గురజాడ. వాస్తు, జ్యోతిష్యం వంటివి ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో ప్రజలకు కొంత ఉపయోగడ్డ మాట నిజమే. ఇప్పుడు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంతకు మించి అభివృద్ధి చెందింది. ఇంకా వాటిని పట్టుకొని వేలాడ్డంలో ఔచిత్యం లేదు. కొందరు పాత నమ్మకాల్లో ఏదో అంతరార్థం వుందంటూ.. సైన్సుని గుప్పించి చెబుతూ వుంటారు కుహనావాదులు.
నాడే అధికం..
ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా, అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా చెప్పబడుతోన్న మనదేశంలోని చట్టసభల్లో వారికెంత ప్రాధాన్యతనిస్తున్నామో ఆలోచిం చాల్సిన తరుణం ఇది. 2011జనాభా లెక్కల ప్రకారం..66% జనాభా 35ఏళ్లలోపు వారే ఉన్నారు. లోక్‌సభలో ఈ యువతరం శాతాన్ని చూస్తే నిరాశే కలుగుతుంది. మొత్తం 545 మంది సభ్యులున్న ప్రస్తుత 17వ లోక్‌సభలో 35 ఏళ్లలోపు వారి సంఖ్య కేవలం 21 మాత్రమే. పేదరికం విలయ తాండవం చేస్తున్న..అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఏర్పడిన తొలి లోక్‌సభ (1952)లో యువ సభ్యుల సంఖ్య 82. ఇప్పటివరకు ఆ రికార్డు అలాగే వుంది. భారత్‌ ప్రపంచ యువ దేశంగా ఆవిర్భవిం చిన ఈ సమయంలోనే..35 ఏళ్లలోపు సభ్యుల సంఖ్య ఎన్నడూ లేనంతగా 21కి పడిపో యింది. తొలి లోక్‌సభలో సభ్యుల సగటు వయసు 46.5 కాగా, ప్రస్తుత లోక్‌సభలో సగటు వయసు 55 ఏళ్లు. అయితే, మహిళల వాటా పెరిగింది. యువతరం పెరగకున్నా సభలో మహిళల వాటా పెరగడం సంతోషిం చాల్సిన అంశం. తొలి సభలో 22 మంది (4.41%) మహిళా ఎంపీలుండగా..ప్రస్తుత సభలో వారి సంఖ్య 78 (14.36%)గా ఉంది. ఇంత మంది మహిళలు లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఏ సభలోనూ లేరు. అయితే, మహిళలు బయటకు రావడానికి అనేక ఆంక్షలున్న రోజుల్లో రాజకీయాల్లోకి ఆమాత్రమైనా వచ్చారంటే.. ఆ సంఖ్య తక్కువేమీ కాదు.
సమాజ సేవలో ….
లే.. మేలుకో.. లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించకు అన్నారు స్వామి వివేకానంద. వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నాడాయన. జాతి నిర్మాణ క్రతువులో యువత భాగస్వామ్యం ఎంతో కీలకం. దేశ సంపదను పెంచి పోషించే చోదక శక్తి యువతే. మేము సైతం సమా జానికి సేవ చేయాలనే భావన యువతలో అధికమవుతున్నది. కొంతమంది ఇప్పటికే వివిధ సంఘాలు స్థాపించి, లేదా గ్రామాల్లో ఒక్కటిగా అయి తమ సమీపంలో ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సరదాలు.. షాపింగ్‌ సినిమా.. యువత అంటే ఇంతేనా? కాదు.. అంతకుమించి అని నిరూపి స్తున్నారు ఈ యువకులు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించి పెద్ద మనసు చాటు కుంటున్నారు. మానవత్వం మురిసేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు.– (రాజాబాబు కంచర్ల)

జనం ప్రేమ గెలుచుకున్న కోయ దొరసాని

అనసూయ అలియాస్‌ సీతక్క నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణ మహిళ లేదా రాజకీయ వారసత్వం అందుకున్న మహిళ అయితే అందులో ప్రత్యేకత ఏమీ లేదు.కానీ మావో యిస్టుగా ఉండి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత మంత్రి కావడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఒక గిరిజన మహిళ అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని,కేసులను తలపడి.. చివరకు రాజ్యాంగాన్ని రచించే టీంలో భాగస్వామ్యులవుతున్నారంటే ఒక్క సీతక్కకే సాధ్యం. ప్రజల్లో ఉంటూ..నిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వాళ్లకు ఎక్కడా అపజయం ఉండదు అనడానికి సీతక్క జీవితమే ఉదాహరణ…
ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాత్రుస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ జాడ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతని నాలుకమీద కాల్చిన ఇనపకడ్డీతో వాత పెట్టి,అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాకగానీ వాళ్ళు అతన్ని ఇంట్లోకి రానివ్వరు…అటువంటి తెగలో పుట్టిన ఆమె ఓ కొండ దొరసాని…ఆదివాసుల సాధికారతను కాలరాసిన మధ్యయుగా లనాటి రాజ్య దురహంకారంమీద వీరోచితంగా పోరాడి తమ స్వాభిమా నాన్ని చాటిన సమ్మక్క,సారలమ్మల పోరు వారసత్వం ఆమెది.ఆమె ‘రణధీర’ తనకి యుద్ధం కొత్తకాదు,ధిక్కారం తన రక్తంలోనే వారసత్వంగా తెచ్చు కుంది. అందుకే చిన్నతనంలో కత్తిపట్టి అడవి బాట పట్టినా ఎమ్మెల్యే అయ్యాక తన మనుషుల ఆకలి తీర్చడానికి కొండలు కోనలు దాటినా జనం కోసమే! ఆమె పేరు ‘ధనసరి అనసూయ’ అలియాస్‌ ‘సీతక్క’.అడవిలో పుట్టి అడవిలో పెరిగిన సీతక్కకి కష్టాలు,కడగండ్ల గురించి పుస్తకాలలో చదవా ల్సిన పనిలేదు. గ్రంధాలయాలలో వుండే పుస్తకా లకు మించిన జ్ఞానం ఆమెకి అనుభవాలనుంచి అబ్బింది. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా విసిరేసిన కోయ గూడెంలో అరకొర సౌకర్యాలు, అగచాట్లమధ్య పెరిగిన తనకి ఆకలి రుచి తెలుసు. అలాగే, సాయుధదళాలలో అడవి లోత ట్టు ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు కనీసం తిన డానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా లేక పస్తులతో నడిచినరోజులు, పాచి పట్టిన అన్నా న్ని ఎండబెట్టుకుని తిన్నరోజులూ తెలుసు.
అడవిలో దొరికే ఆకూ,అలమా ఏరు కొచ్చుకుని,పోడు వ్యవసాయంలో పండిన రాగి గింజలతో అంబలి కాసుకుతాగే ధనసరి సమ్మక్క, సమ్మయ్యల రెండవ సంతానం‘అనసూయ’. తన కంటే ముందు అన్న‘సాంబయ్య’ వున్నాడు. సమ్మ క్క, సమ్మయ్యల బిడ్డగా మొదలైన అనసూయ ‘సీతక్క’ గా మారడం వెనకవున్నది బతుకునుంచి వచ్చిన తిరగబడే తత్వమే! వుమ్మడి వరంగల్‌ జిల్లా, (ప్రస్తుత ములుగుజిల్లా) ములుగు మండ లం, జగ్గన్నపేటలో పుట్టింది. అటవీ గ్రామమైన తమ గూడెంకి తరచూ ‘అన్నలు’ వచ్చి కరప త్రాలు పంచి, పాటలు పాడి, జనానికి దొరల దౌర్జన్యాలను ప్రశ్నించే చైతన్యాన్ని అందించేవారు. అనసూయ మేనమామ ఆమె బాల్యంలోనే అన్న లలో కలసిపోయాడు. ఆమె అన్న‘సాంబయ్య’ కూడా జనశక్తి పార్టీ కొరియర్‌గా వున్నాడు. హై స్కూలు రోజులనుంచే విద్యార్ధి ఉద్యమాలలో క్రియాశీలకంగా వుండే అనసూయ పదో తరగతి అయ్యాక జనశక్తి పార్టీ వుద్యమకారిణిగా సాయుధ దళాలలోకి వెళ్ళింది. అక్కడే వుద్యమ తరగతు లకు హాజరై సిద్ధాంతపరమైన పుస్తకాలు, సాహి త్యం చదివింది. ఆయుధాలు ఉపయోగించడం, దళాలను ఆర్గనైజ్‌ చెయ్యడంలో నేర్పుగలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందడంతోపాటు తక్కువ సమయంలోనే దళ కమాండర్‌ స్థాయికి ఎదిగి మూడు జిల్లాలకు తన కార్యక్రమాలను విస్తరింప జేసింది.దళ కమాండర్‌గా వున్నప్పుడు తన మారు పేరు ‘రణధీర్‌’.నల్లగా,పొడుగ్గా,చలాకీగా ఖాకీ యూనిఫారంలో అచ్చం అబ్బాయిలాగే వుండేది. అయితే అక్కడ వుండే పితృస్వామిక ధోరణి ‘రణధీర్‌’ని ‘సీత’ని చేసింది.ఉద్యమ పెద్దలు ‘కుంజా రాము’ అనే నాయకుడితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించి,పార్టీ పద్ధతుల్లోనే పెళ్లి జరిపినా, ఆ రాముడికి సహచరిగా ఆమె‘సీత’,‘సీతక్క’ అయ్యిం ది.ఖమ్మం జిల్లాకొత్తగూడెం వాడైన రాము కూడా కోయ జాతికి చెందిన తన దూరపు బంధువు కావడం విశేషం.
సీత గర్భవతిగా వున్నప్పుడు పోలీసు లకి చిక్కిఅరెస్టై, జైలు జీవితం గడిపింది. ప్రసవం సమయానికి బైటికొచ్చి పుట్టిన రెండునెలల బాబుని బంధువులకు అప్పగించి మళ్ళీ రసహ్య జీవితం లోకి వెళ్ళింది. తర్వాత బంధువుల నుంచి బాబు ని ఆమెతల్లి తీసుకెళ్ళి పెంచి హాస్టల్‌లో చేర్చింది. సుమారు ఎనిమిదేళ్ళు జనశక్తి నక్సలైట్‌గా,దళ కమాండర్‌గా వుద్యమానికి అంకితమై చావైనా, బతుకైనా జనం కోసమే అనుకున్న సీతక్కకి పార్టీ లో ఏర్పడిన సిద్ధాంతపరమైన విభేదాలు, చీలిక లు ఆమెని జనజీవన స్రవంతిలోకిరాక తప్పనిస్థితి కలిగించాయి. ఈలోపల తనభర్త రాముతో కూడా విభేదాలు వచ్చి విడిపోయింది. రాము జనశక్తి పార్టీలోనే కొనసాగి కొన్నాళ్ళ తర్వాత ఎన్కౌంటర్‌ లో చనిపోయాడు. తన ఉద్యమ సహచరులంతా తలోదారి చూసుకున్నప్పుడు సీతక్క కూడా బైటి కొచ్చి మధ్యలో ఆగిపోయిన చదువుని కొనసాగిం చింది. హైదరాబాద్‌లో ఒక చిన్న రూమ్‌ తీసు కుని ఐదుసంవత్సరాల న్యాయశాస్త్రంలో ఎల్‌ ఎల్‌బీ పూర్తి చేసింది.తన ఖర్చులు,చదువు కోసం ఆదివాసుల సమస్యలమీద పనిచేసే ‘యక్షి’ అనే ఒక ఎన్‌.జి.ఓలో వుద్యోగంలో చేరింది. నక్సలైట్‌ గా తెలంగాణలో బాగా గుర్తింపు పొందిన సీతక్క బైట ‘లా’ స్టూడెంట్‌ ‘ధనసరి అనసూయ’గా మళ్ళీ రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అయినా పాత కేసులు ఆమెని ప్రశాంతంగా బతకనివ్వ లేదు. ఎప్పుడుబడితే అప్పుడు పోలీసు స్టేషన్లకి పిలిపించేవారు.ఒకవైపు ఆర్ధికఇబ్బందులు, మరో వైపు కేసులు…ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు ఆమె రాజకీయాలను అనూహ్య మైన మలుపు తిప్పాయి.‘లా’ పూర్తయ్యాక వరం గల్‌ వెళ్లి గతంలో తనకేసులు వాదించిన సీని యర్‌ అడ్వకేట్‌,వెంకటస్వామిరెడ్డిగారి దగ్గర జూనియర్‌ లాయర్‌గా చేరి కొన్ని నెలలు పని చేశాక 2004 ఎలక్షన్లకు ముందు కొందరు మిత్రుల ప్రోద్బలంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆ బూర్జువా పార్టీకి కూడా జన సామాన్యంలో పాపులారిటీ వున్న ‘సీతక్క’ అనే మాజీ నక్సలైట్‌ ఇమేజ్‌ మీదనే మక్కువ కాబట్టి మళ్ళీ ‘ధనసరి అనసూయ’ ప్రజానాయకురాలు ‘సీతక్క’ అయ్యింది.
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తరపున పోటీ చెయ్యడానికి పార్టీలో ఎప్పటినుంచో కొన సాగుతున్నా సీటు దక్కని వాళ్ళున్నప్పటికీ ప్రజా జీవితంలో మమేకమై గుర్తింపు పొందిన సీతక్కకి ములుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో షెడ్యూలు ట్రైబ్స్‌కి రిజర్వు అయిన ములుగు అసెంబ్లీ నియోజ కవర్గం సీటురావడం సులభతరం అయింది. కానీ,2004లో రాజశేఖర్‌ రెడ్డి ప్రభావంతో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్ధి‘మోదం వీరయ్య’చేతిలో ఓడి పోయింది. అయినప్పటికీ ఆమె వెనుకంజ వెయ్య కుండా అటు జనంలోనూ,ఇటు పార్టీలోనూ తన ప్రభావం పెంచుకుంటూ 2009 అసెంబ్లీ ఎన్నిక ల్లో అదే మోదం వీరయ్య మీద బంపర్‌ మెజారిటీ తో గెలిచింది.అయితే అప్పటికే మలి దశ తెలం గాణా ఉద్యమం ఊపందుకుంది. తాను ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ తమపార్టీ ఓడిపోవడంతో ప్రజలకు సీతక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే స్థితి లేకపోగా తాను తెలంగాణా బిడ్డగా తన ఆంధ్రా పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించాల్సి రావడం ఆమెని తీవ్ర ఘర్షణకు లోను చేసింది. అయిన ప్పటికీ తన తెలంగాణా అస్తిత్వ ప్రకటన చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధుల సమ్మెకి మద్దతు పలికి వారితో పాటు ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అరెస్టై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించింది.2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలం గాణా రాష్ట్రం ఏర్పడినా సీతక్క తెలుగుదేశం పార్టీలో వుండడం వలన ఆమెకి రాజకీయ లబ్ది జరగలేదు. తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ క్రమం లోనే ఆమెకి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకవైపు, తెలంగాణా రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) నుంచి ఒకవైపు ఆహ్వానాలురావడం, ఆమె తెలంగాణాని ఇచ్చిందనే అభిమానంవల్ల,టీడీపీ రేవంత్‌ రెడ్డి కుటుంబంతో సీతక్కకి వున్న సాన్నిహిత్యంవల్ల ఆమె కాంగ్రెస్‌ పార్టీవైపే మొగ్గుచూపింది. మళ్ళీ ములుగు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్‌ అభ్యర్ధి గా పోటీచేసి ఈసారి కాంగ్రెస్‌ ప్రభావం తగ్గి పోవడం వలన తన ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్ధి చందూ లాల్‌ చేతిలో ఓడిపోయి 2018 అసెంబ్లీ ఎన్ని కలలో అదే చందూలాల్‌ మీద కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయింది. సీతక్క. మొదట తెలుగుదేశం పార్టీ పాలిట్‌ బ్యూరో సభ్యు రాలి స్థాయికి ఎదిగిన ఆమె తర్వాత కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై జనబాహుళ్యంలో గొప్ప ప్రాబల్యం, చరి ష్మా కలిగిన నాయకురాలిగా, తనపార్టీలోనేకాక తెలంగాణా రాష్ట్రంలోనే ఒక ప్రజామోదం పొం దిన మేటి నాయకురాలిగా గుర్తింపు పొందు తుంది.
పోరాట పటిమకు మారుపేరు సీతక్క పట్టుదలకు, పోరాట పటిమకు మారు పేరైన సీతక్క విప్లవ పార్టీలలోనే కాక బూర్జువా పార్టీల ప్రత్యక్ష రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె విప్లవ పార్టీలో నక్సలైట్‌ గా సీతక్క బాగా సాహసోపేతమైన నాయకురాలి గా, రెబల్‌ గా పేరుతెచ్చుకుంది. తన నాయకత్వం లోని దళం ఆడవాళ్ళమీద దౌర్జ్యన్యాలు చేసే మగ వర్గశత్రువులకు మర్మాంగాలను తెగ్గోయడం, గుండు కొట్టించి ఊరేగించడంవంటి శిక్షలు విధిం చేవారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ప్రతి పక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఆదివాసుల సమ్మక్క, సారలమ్మ దేవతల మేడారం జాతరలో కోయ తెగవారికి భాగస్వామ్యం లేకపోవడంపై ప్రభుత్వ అధికారులతో చర్చించి ఆదేవతల వారసులకు జాతరలోచోటు కల్పించడానికి కృషి చేసి సాధిం చింది. అలాగే ఆదివాసుల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టంపై అసెంబ్లీలో తరచుగా ఆలోచనాత్మకమైన చర్చ లేవనెత్తుతూ వస్తుంది. ఆదివాసీ తెగల ప్రధాన సమస్యలైన మౌలిక వసతులు లేకపోవడంపైన అసెంబ్లీలో గళమెత్తింది. ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు,పాఠశాలలు,హాస్పటళ్ళు లేకపో వడం పైన ఆమె నిత్యం అధికారులతో చర్చించి కొంత మేరకు సాధించగలిగింది. అడవి లోపల గూడే లలో జీవించేవారికి రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డు లు లేకపోవడంపై ఆమె ఆందోళన చేస్తుంది. ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన రెండుసార్లూ తానున్న పార్టీలు గెలవక ఆమె ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదు. తన స్వభావమే అధికార,ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకమైన ప్రతి పక్ష ధోరణి కాబట్టి ఎక్కడున్నా ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడడాన్ని కొనసాగించింది. తెలంగాణా రాష్ట్రం వస్తే అన్ని సమ స్యలు పరిష్కారమౌతాయని ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ రాష్ట్రం ఇచ్చిన వారితోపాటు ప్రజల్ని కూడా వంచించి తమ కుటుంబ పాలనని కొనసాగిస్తున్నదని సీతక్క ఆరోపణ. నీళ్ళు,నిధులు,నియామకాలు వస్తాయ ని చెప్పే ముఖ్యమంత్రి,ఆయన సహచర మంత్రు లు వాటిని గాలికి వదిలెయ్యడమే కాక ప్రజా సమస్యల మీద మాట్లాడేవారిని నేరస్తులని చేసి శిక్షిస్తున్నారని, హైదరాబాద్‌ లో ఒకప్పుడు ప్రజలు తమ నిరసనని వ్యక్తం చేసుకునే ధర్నా చౌక్‌ కూడా లేకుండా పోవడమే ఆపరిస్థితికి చక్కటి తార్కాణం అని ఆరోపిస్తుంది. ప్రజలు ఆశించిన తెలంగాణా రాలేదని, ఇది దొరల పాలన అని ఆమె విమర్శ. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నా ఇక్కడి పాలకులు ప్రజలకు కనీసం మాస్కులు కూడా పంపిణీ చెయ్యడం లేదని, బైట వ్యాపారులు మాస్కులను అధికరేట్లకు అమ్ముతున్నారని అసెంబ్లీ లో సీతక్క మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఇంత మంది మంత్రులకు లేనిబాద ఈమెకెందుకని ఆమె మాటలకు ఎగతాళిగా నవ్వి హేళన చేసి నప్పుడు సీతక్క అవమానంగా భావించింది. నవ్విన నాపచేనే పండుతుంది అనుకుని లాక్దౌన్‌ ప్రకటించి నాక తన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన ఆర్ధిక సహకారంతో ములుగు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు,ముఖ్యంగా రవాణా సౌకర్యాలు లేని ఆదివాసీ తండాల ప్రజ లకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలు పెట్టింది.గత మార్చి 23నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగొందలు గ్రామాల ఆదివాసులకు, దళితులకు సరుకులు పంచింది. మాస్కులతో పాటు బియ్యం,కూరగాయలు,నూనె సబ్బులు ట్రాక్టర్‌, జీపులలో వేసుకుని అటవీ ప్రాంతంలో వెళ్ళగలిగినంత మేరకు వాహనాలలో వెళ్లి ఇంకా లోతట్టు గూడేలకు తన సహచరులతోపాటు స్వయంగా తానుకూడా సరుకుల మూటలు మోస్తూ ఎగుడు దిగుడు అడవి బాటల్లో, వాగులు, వంకలు దాటుకుని వెళ్తుంది. అడవి బిడ్డలకు పౌష్టికా హారం గురించి, కరోనా వ్యాధి సోకకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతలను వివరిస్తుంది. ఆడవాళ్ళను, పిల్లల ను కూర్చోబెట్టుకుని నేను కూడా ఇటువంటు గూడేలలో సరైన తిండి, వసతి లేకుండా పెరిగిన దాన్నే అని వారిలో ఒకదానిగా వివరిస్తుంది సీత క్క. ఆమె సేవగురించి పత్రికలూ,సోషల్‌ మీడి యా వేనోళ్ళ కొనియాడుతుంటే అధికార పార్టీకి అక్కసుగా ఉండి ఆమెమీద అవాకులూ, చవాకు లూ పేలుతుంది.మరికొందరు గిట్టనివాళ్ళు ఆమె తన సొంత డబ్బుతో సరుకులు ఇస్తుందా? అని విమర్శిస్తున్నారు.సీతక్కకి మోతాదు మించి ప్రచా రం లభిస్తున్నదని అసూయతో తప్ప ఆమెలా జనంతో మమేకమయ్యే నాయకులు దాదాపు లేరనే చెప్పాలి.ప్రధాన స్రవంతి రాజకీయాలలో వున్న ప్పుడు కొన్ని ఎత్తుగడలు వెయ్యాల్సిరావడం ఎవరి కైనా తప్పదు. అంతమాత్రాన తన నియోజకవర్గ ప్రజలపట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల ఆమెకున్న శ్రద్ధ, ప్రేమలను సీతక్క పనితీరును దగ్గరగా గమనించిన వారెవరూ కాదనలేరు. సీతక్క అంటే ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి కనీస సౌకర్యాలకు నోచు కోని అభం శుభం తెలియని ఆదివాసీ ప్రజలకు తమజాతిలోంచి ఉద్భవించిన ఒక మణి మాణి క్యం.సీతక్క చైతన్యవంతమైన సాహిత్యాన్ని చదవడమేకాక ‘వెన్నెల’ అనే కలం పేరుతో కవి త్వం రాసేది.‘యక్షి’ అనే సంస్థలో పనిచేస్తున్న పుడు ఆదివాసీల ఉనికిమీద వ్యాసాలు కూడా రాసింది. ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టంమీద, ఆదివా సుల హక్కులమీద ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కవితలు రాసింది. ఆమెకి కష్టపడి పనిచెయ్యడం ముందునుంచీ అలవాటే! నక్సలైట్‌ గా బైటికొచ్చి హైదరాబాద్‌ లో చదువు కొనసాగించేటప్పుడు కూడా తనసొంత ఊరెళ్ళి తునికాకు పనికి, వ్యవ సాయ పనులకి వెళ్లి వచ్చిన కూలి డబ్బులతో ఫీజులు కట్టుకునేది. బాబు ‘సూర్య’ని కష్టపడి ఎం.టెక్‌ దాకా చదివించింది, తనుకూడా తల్లి కష్టం చూసి బాగా పట్టుదలతో చదివి నాగపూర్‌ ట్రిపుల్‌ ఐటిలో సీటు తెచ్చుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్లో సైన్స్‌ లో ఎమ్మే పూర్తిచేసి ఇప్పుడు అదే యూనివర్సిటీలో గొత్తి కోయల జీవన ప్రమాణాలు-స్థితిగతులమీద పీహెచ్‌.డీ చేస్తుంది.
సీతక్కది అచ్చమైన ఆదివాసీ స్వాభి మానం, స్వయం పాలనని, స్వేచ్ఛని ప్రేమించే గుణం.నగరంలో వుండి ఎమ్మే,ఎల్‌.ఎల్‌.బి చేసినా,ఎమెల్యే అయినా ఆదివాసి సంస్కృతి అంటే తనకి సహజాతంలా వచ్చిన ప్రేమ వెలిసిపోలేదు. రెండేళ్లకోసారి వచ్చే వనదేవతల మేడారం జాతరతోపాటు ఆదివాసుల గూడేలలో జరిగే పండగ పబ్బాలకు, శుభకార్యాలకు, చావులకు ఆమె తప్పకుండా హాజరవ్వడమే కాక వారి సంస్కృతిలో భాగమైన ఆట, పాటలలో పాల్గొం టుంది. పెళ్ళికి,చావుకీ తప్పనిసరిగా మోగే డోలు వాయిద్యమంటే ఆమెకి ఇష్టం,డోలు శబ్దం విన గానే అప్రయత్నంగానే తనకాళ్ళు చిందేస్తాయి. అందుకే, తన కొడుకు ‘సూర్య’ వివాహానికి చత్తీస్‌ ఘడ్‌ నుంచి డోలు వాయిద్యకారులైన గొత్తికోయ లను పిలిపించింది. నక్సలైట్‌గా తను తిరిగిన అటవీ గ్రామాలే కాదు,మైదాన ప్రాంతాలలో కూడా ప్రతివూరు,పల్లె,వాగు,వంకా తనకి పరిచ యమే. తన నియోజకవర్గంలో వుండే సుమారు వంద ఏజెన్సీ గ్రామాలలో ప్రతి చిన్న ఆదివాసీ గూడెం పేరును గుర్తు పెట్టుకుంటుంది. అగ్రకుల బూర్జువా పార్టీలలో చేరినప్పటికీ సీతక్క జనంతో తనకున్న ప్రత్యక్ష సంబంధాలను మాత్రం వదులు కోలేదు. ఆమెని తమ బిడ్డగా భావించే ములుగు ప్రాంతపు గ్రామాలలో ఆమె జనంలోకి చొచ్చుకుని పోతుంది. అందరితో ప్రేమగా వారి పరిస్థితు లను లోపలి వ్యక్తిగా అర్ధం చేసుకునే సీతక్కకి తనని ఎవరన్నా ‘మేడం’ అని సంబోధిస్తే ఇష్టం ఉండదు, ‘మేడం’అంటే దూరం పెట్టినట్టుగా, ‘అక్క’ అంటే ఇంట్లోవాళ్ళం అన్నట్టు వుంటుంది అని తను కూడా తన పార్టీ కార్యకర్తలను, అనుచ రులను ‘అన్నా, అక్కా’ అనే పిలుస్తుంది.
తనకి మామూలు అర్ధంలో దేవుడు, మతం అనేవాటిపైన నమ్మకం లేదు,గుళ్ళూ, గోపురాలకు వెళ్ళదు. కానీ, ఆదివాసీ అస్తిత్వాన్ని చాటే ఆదివాసుల పిత్రుదేవతారాధన,ప్రకృతికి సంబంధించిన జాతరలలో ఇష్టంగా పాల్గొం టుంది. సీతక్కది అసలైన ఆదివాసీ రూపంబీ నల్లని రంగుతో సాదాసీదా ముతక చీరలు కట్టు కుని జనంతో కలసిపోయే సీతక్క అంటే అడవి బిడ్డలకు ఒక సమ్మక్కనో,ఆమె బిడ్డ సారలమ్మనో చూసినట్టుంటుంది. జనం ప్రేమలను గెలుచుకున్న కోయ దొరసాని ఆమె. ఆమె ఆదివాసీ సాధికార తకు ప్రతీక, ముందునుంచీ స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు ఆమెకి పెట్టని ఆభరణాలు. తాను గన్‌ పట్టినా,గన్‌ మెన్‌తో వున్నా ఆమెది పోరాటదృష్టే! ఒకపుడు తనవెంట పడిన పోలీ సులు ఇప్పుడు తనకి రక్షణగా వెంట నడవడం చూసి నవ్వుకుంటుంది ఈ అడవి చుక్క. ఆమె మాటల్లోనే ‘ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం/ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం’ ఆమె నైజం.
‘అనంతయానం’లో తొలి ఆదివాసీ కేబినెట్‌ మంత్రి` సీతక్క
గత ముప్పై ఐదేళ్ల క్రితం ఆదివాసుల సమస్యలను ఎదిరించడానికి అడవిబాట పట్టిన ‘ఆమె’ నేడు అధికార పక్షంలో ఒక ముఖ్యమైన పాలనాదీశురాలు.తెలంగాణ రాజకీయ చరిత్రలో ఆమె మకుటం లేని మహారాణిగా నిలిచింది. నేటి ప్రజా ప్రభుత్వంలో ఆమె తెలంగాణ కేబినెట్‌ మంత్రి. ఆమె పేరే ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క. డిసెంబర్‌ 7న మూడో శాసన సభలో కొలువుదీరిన ఆమె ఎల్బి స్టేడియంలో హర్షద్వా నాల మధ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ  శాసనసభలోనే ఇప్పటివరకు సీతక్క తొలి ఆదివాసీ మంత్రి కావడం విశేషం. ములు గు ప్రజలకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు సీతక్కగా సుపరిచితమైన డాక్టర్‌ ధనసరి అనసూ య రాజకీయ రంగంలో అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం లో పంచాయతీరాజ్‌,మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రిగా కొలువుదీరారు. డాక్టర్‌ అనసూయ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టింది. ఆది వాసీ కోయతెగకు చెందిన ఆమె ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు దగ్గరలోని జగ్గన్నగూడెంలో ధనసరి సమ్మక్క, సమ్మయ్య దంపతులకు 1971, జులై 9న జన్మించింది. బాల్యం నుంచి బాగా చదుకోవాలని పట్టుదలతో బడికి వెళుతున్న సంద ర్బంలో ఆమెకు కొన్ని ఆటంకాలు వెంబడిర చాయి. తన14ఏళ్ళ వయసులోనే అన్నయ్య సాం బయ్య ను పోలీసులు అకారణంగా ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆమె ప్రజా వ్యతిరేక శక్తులను ఎదిరించడానికి 1988 లో అన్నల బాట (అడవి దారి) పట్టింది. అప్పుడే ఆమె అడవిలో ‘సీతక్క’గా మారింది. కొన్నాళ్ళ తర్వాత పోలీసుల చేతికిచిక్కి కొద్ది రోజులు జైలు జీవితం గడిపింది.జైలు నుండి విడుదలయ్యాక ఇంటర్‌, డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తి చేసుకొని అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ బుల్లెట్‌ పట్టింది. వార్‌ ఉద్యమంలో కమాండర్‌ స్థాయికి ఎదిగింది. తన సహచరుడు అయిన కొత్తగూడ మండలం మోకాళ్లపల్లికి చెందిన కుంజా రామును పెళ్లి చేసుకుంది. కుమారుడు సూర్య జన్మించాక అమ్మ మ్మ ఇంట్లోనే పెట్టి ఉద్యమాన్ని,కుటుంబాన్ని వేరుగా చూసింది. 2001లో బుల్లెట్‌ను వీడి ప్రజా జీవితంలోకి ప్రవేశించింది. తన కుటుం బాన్ని చూసుకుంటూనే ప్రజా సమస్యల పరిష్కారా నికి బ్యాలట్‌ వైపు మొగ్గు చూపింది.అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ములుగు (ఎస్టీ)టికెట్‌ను సీతక్కకు కేటాయించారు. తెలం గాణ అసెంబ్లీలో ఆదివాసీల తరపున అటవీ హక్కులు, గూడేలా అభివృద్ధి గురించి ప్రశ్నించే గొంతుకగా మారింది. మరోవైపు 2014లో మహాకూటమి నుండి ఓడిపోగా 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరినారు. అనంతరం సీతక్కకు ఏ.ఐ.సి.సి.అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ. ఐ.ఎన్‌.సిమహిళా కమిటీలో ప్రధాన కార్యద ర్శిగా నియమించారు.తను రాజకీయ జీవితాన్ని అనుభ విస్తూ కూడా న్యాయ శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యు యేషన్‌ ( ఎల్‌ఎల్‌ ఎం ) చదువుకున్నారు. 2018 లో కాంగ్రెస్‌ నుంచి గెలిచినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. మొక్కవోని దీక్ష లాగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొలిటికల్‌ సైన్స్‌లో ‘‘ తెలం గాణకు గొత్తి కోయలు వలస రావడానికి గల సామాజిక అంతరాలు ‘‘ అనే అంశం మీద పి. హెచ్‌.డి పట్టా పొందినారు.ఎమ్మెల్యే గా ఉంటూ డాక్టరేట్‌ పొందిన తొలి ఆదివాసీ మహిళ మరి యు డాక్టర్‌ సీతక్కగా రికార్డ్‌ సొంతం చేసుకు న్నారు.  2019-20 మధ్య కరోనా మహ మ్మారికి కకావికలమైన ఆదివాసులు మంగపేట, వెంకటాపురం పరిధిలోని అడవిలో నిరాశ్రయు లుగా మిగిలారు.బంధాలు,బంధుత్వాలు తెగి పోయిన పరిస్థితుల్లోనూ‘‘నేనున్నా’’నంటూ కాలి నడక నడుస్తూ గోత్తికోయలను ఆదుకున్నది ఈ సీతమ్మ.2022,ఏప్రిల్‌ 28న మంగపేట మండ లంలోని శనిగకుంట అనే ఆదివాసీ గ్రామంలో ఎరగడివల్ల సుమారు 40దగ్ధం అయినవి. సర్వం కోల్పోయి నిలువ నీడలేని ఆదివాసులకు సీతక్క అండగా నిలిచింది.ఈ సంఘటనను తను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంతో వారికి తగిన పునరావాసం కలిగింది. ఈఏడాది (2023) ఆగష్టులో కురిసిన భారీ వర్షాలకు ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం మండలం మల్యాల,కొండాయి,దొడ్ల తదితర ఆదివాసీ గ్రామాలు నీట మునిగినవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకురాలి హోదాలోనూ పునరావాస సేవలు స్వశక్తితో అందించారు. ప్రభు త్వం నుండి  ఆదివాసులకు ఎలాంటి సహా యం అందలేదు.తన నియోజక పరిధిలోని కొన్ని ఏజెన్సీ గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులకు నోట్‌ బుక్స్‌,స్టడీ మెటీరియల్‌, ఎగ్జామ్స్‌ మెటీరియల్‌ పంచి పెట్టారు. అక్కడి జనాలని కదిలిస్తే ‘‘ మాతరం లో  కాకతీయుల ఆరాచకాలపై తిరగబడ్డ వీరవనితలు సమ్మక్క సారక్కలను చూడలేదు కాని ప్రజా సమస్యలపై వీర్చోతింగా పోరాడుతూ నేడు తెలంగాణ సేవకురాలిగా నిలిచిన సీతక్క ను చూడటం తమ అదృష్టంగా భావిస్తున్నామ’’ ని ఆదివాసులు,గిరిజనేతరులు సైతం పేర్కొనటంవిశేషం.నేడుతెలంగాణ మంత్రి మండలిలో సీతక్క డిసెంబర్‌ 14(2023) న పంచాయతీ రాజ్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా విధులు స్వీకరించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో యావత్తు తెలం గాణ ప్రజలకు సేవచేస్తారని,ప్రత్యేకించి గిరిజనుల హక్కులకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం!- (చల్లపల్లి స్వరూపరాణి/గుమ్మడి లక్ష్మీనారాయణ)

శతాబ్దాల సాంస్కృతి సమాహారం

స్వచ్ఛమైన సెలయేళ్లు..దట్టమైన అడవులు.. గంభీరమైన కొండలు.. పక్షుల కిలకిలారా వాలు. పచ్చని ప్రకృతి అందాలు వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుత నానికి సజీవ సాక్ష్యంగా. పాలకుల ఆలన కోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసి స్తోంది. అడవితల్లి బిడ్డలుగా ,ప్రకృతి ఒడే అవాసంగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని, ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది. విద్య,వైద్యం వంటి మౌళిక సదుపాయాలకు నోచుకోని గూడే లెన్నో కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నింపే సర్కారు వచ్చింది.వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది.-(భమిడిపాటి గౌరీశంకర్‌)
జాతులు..భాషలు
జిల్లాలో 2.36 లక్షల మంది గిరిజనులున్నారు. వీరిలోట్రైబల్‌ సబ్లన్‌ మండలాల్లో నివసించే సంఖ్య1.87 లక్షలుగా ఉంది. గిరిజనుల్లో 36 జాతులున్నాయి.ఉత్తరాం ధ్ర జిల్లాల్లో సవర, కొండదొర, గదబ, వాల్మీకి,జాతాపు, కోయ, భగత జాతులు ప్రధానమైనవి. సవరభాష శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకేలాఉంటుంది. వీరి అభ్యున్నతికి ఏర్పాటైన ఐటీడీఏకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయిస్తున్నాయి. సగటున ఒక్కో ఐటీడీఏకి ఏటా రూ.300 కోట్ల నిధులు వస్తున్నాయి. కానీ అందులో గిరిజనులకు ఈ నిధుల్లో చేరేది నామమాత్రమే. నిక్కచ్చిగా ఈ నిధులన్నీ గిరిజనులకే ఖర్చుచేసి ఉంటే గిరిజనుల ఎప్పుడో మారిపోయి ఉండేవి.
సజీవ సంప్రదాయాలకు నిలయం
గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏ పల్లెకు వెళ్లినా సవరజాతి గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. సవర భాషలో పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.ఆడవేషంలోవున్న యజ్ఞుడు అనే పురోహితుని పాత్రలో పెళ్లితంతు నిర్వపి వధూవరులను మేనమామలు భుజాలపై ఎక్కించుకొని నృత్యం చేస్తూ ఊరేగించడం నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం.
కనీస సౌకర్యాలు కరువు
నేటికీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపా యాలు లేవు. కనీసం తాగునీరు, రోడ్డు మార్గం లేదు. వైద్య సదుపాయాలు లేక ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. గర్భిణులు, వృద్ధులు అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. నేటికీ వైద్యం కోసం, విద్య కోసం గిరిజనులు కొండలు గుట్టలు దాటి కాలినడకనచ,డోలీ సాయంతో మైదాన ప్రాంతాలకు రావాల్సిందే. వీరి తండాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు.ఉండ టానికి ఇళ్లు లేవు. ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వారి వనరులను లాక్కుంటున్నారు. క్వారీలు నడుపుతూ ఖనిజ సంపదను కొల్లగొడు తున్నారు. బాక్సైట్‌, గ్రానైట్‌ దోచుకుంటున్నారు. పిండిచేసి గిరిజనులకు పోడు వ్యవసాయం చేసి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గిరిజనుల జీవితాల్లో మార్పునకు సీఎం వైఎస్‌ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తొలిత కురుపాం,సాలూరు గిరిజన రిజర్వర్డు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇచ్చారు. ఎన్నిక ల్లో గెలిచిన వెంటనే తన తొలి కేబినెట్లో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి స్థానం కల్పించారు. గిరిజన శాఖ మంత్రి పదవిని ఇవ్వడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదానిచ్చి ఉన్నత స్థానం కల్పించారు. తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు గిరిజిన సంక్షేమశాఖ మంత్రి పదవినిచ్చారు. గత ప్రభుత్వాలు ఎస్టీ సప్లాన్‌ నిధులను ఇతర ఖర్చులకు వాడేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో దళితతేజం సభ నిర్వహణకు సబ్‌ ప్లాన్‌ ఖర్చు చేశారు. ఇలాంటి వాటిని అరి కట్టడానికి అధికారం గిరిజనుల చేతుల్లో ఉండాలి. గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండా లని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతుండే వారు. సాంఘిక సంక్షేమ శాఖలో మిళితమై ఉండటంవల్ల గిరిజనులకు అన్యాయం జరుగు తుందని వేడుకునేవారు. వారి గోడువిన్న జగన్‌ గిరిజనులకు ప్రత్యేక మంత్రిని ఇచ్చారు. గిరిజనుల బతుకులు బాగుచేయాలనే ఉద్దేశం తో గిరిజన సలహామండలిని ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో,గిరిజన ఎమ్మెల్యేల భాగస్వా మ్యంతో సీఎం ఏర్పాటు చేశారు. గత ప్రభు త్వంలో అప్పటి పాలకులు పదవిలో ఉన్నన్నా ళ్లూ గిరిజన సలహా మండలి ఊసెత్తలేదు. ప్రజా సంకల్ప యాత్రలో ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ అందిస్తానని హామీ ఇచ్చి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే దానిని నెరవేర్చారు.200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగాన్ని ఉచితం చేశారు.దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కుటుంబాలకు ప్రయో జనం చేకూరుతోంది.
సవరల సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించే ప్రయత్నాలు
గిరిజనులకు సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది, వారి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం మరియు భాషకు ధన్యవాదాలు. వారి స్వంత లిపి లేనప్పటికీ, ప్రత్యేకమైన వారసత్వం ఏదో ఒకవిధంగా శతాబ్దాలుగా తరువాతి తరానికి అందించబడుతోంది.కానీ ప్రస్తుత తరం ఆంగ్లం,తెలుగు ఒడియా భాషలలో సాధారణ విద్య,అధ్యయనానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సవర కమ్యూనిటీకి చెందిన గిరిజన పెద్దలు తమ సంస్కృతి, సంప్రదాయం భావితరాల కోసం భాషను పరిరక్షించడంపై ఆందోళన చెందుతున్నారు.
సవర సంస్కృతీ దర్పణాలు గిడుగు కథలు
సవర భాష కోసం నిరంతరం పరిశ్రమించిన పండిత మాన్యుడు గిడుగు రామమూర్తి పంతులు.సవరల భాష, యాస, సంస్కృతుల పట్ల ఆయనకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచే యటం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కొందరు ఆలోచించి వదిలేస్తారు. కొంతమంది మాత్రమే ఆలోచించి ఆచరిస్తారు.అతి కొద్ది మంది మాత్రమే లోతైన అధ్యయనంతో విజయం సాధిస్తారు. గిడుగు రామమూర్తి ఇటువంటివారే. సవరభాషకు ఓ లిపిని ఏర్పాటు చేయడమే కాక, వారి జీవనసంస్కృతి మూలాల లోనికి దగ్గరగా వెళ్ళారు. అధ్యయనం చేశారు. వారి జీవితాలను చరిత్రగా రికార్డు చేశారు. సవరభాషకు నిఘంటువు, వ్యాకరణం కూర్చారు. పాటలని సేకరించారు. వాచకాలను రూపొందించారు. సవరభాష నేర్చుకోవటం తేలిక అనేది ఆయన భావన. గిడుగు రామమూర్తి పాండిత్యం ఎంతో నిర్మాణాత్మమెనది. గ్రాంథిక భాషను ఖండిరచడం వెనుక ఉన్నది ఈ అంశమే! సవర భాష విషయంలో ఆయన చేసిన స్వయంకృషి శ్లాఘనీయం.
సవరల జీవన విధానంలోని సంస్కృతి సంప్రదాయాలను వ్యక్తిగమెన కార్యనిర్వహణ రంగాలను గిడుగువారు దగ్గరగా పరిశీలించారు. వాటిని ‘సవర కథలు’గా రాశారు. ‘సవర భాషలో నేను వ్రాసిన మొదటి పుస్తకంలోని కథలకు ఇంచుమించుగా సరైన తెలుగు చేసి ఈ పుస్తకం వ్రాసినాను. ఈ సవర %-పుస్తకంలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో ఉన్న ఈసపు కథలను పట్టి వ్రాసినాను’ అని ఆయన ఆ పుస్తకం ముందుమాటలో చెప్పారు. ప్రతి వాక్యాన్ని సవరలకు వినిపించి, వారి సవరణలు, సలహాలు, సూచలను అనుసరించి తిరగ రాశారు. కథలలోని విషయాలు సవరల వ్యవహారాన్ని అనుసరించి వాళ్ళకు తెలిసేటట్లు చేర్పులు మార్పులు చేశారు. కనుక ఈ సవర కథలు సవరల నిజజీవన చిత్రణ దృశ్యాలు.. సాక్ష్యాలు. ‘కోదుల భాషలో ముగ్గురు నలుగురు కొన్ని పుస్తకములు వ్రాసినారు. కాని.. సవర భాషలో ఇదివరకు ఎవరూ పుస్తకాలను వ్రాయలేదు. నేను వ్రాసినవే మొదటి పుస్తకాలని’ గిడుగువారు చెప్పుకున్నారు. ఫిక్షన్‌ అండ్‌ ది రీడిరగ్‌ పబ్లిక్‌’ అనే పుస్తక రచయిత క్యు.డి.లీవీస్‌ కథను గూర్చి చెబుతూ కథ ప్రధాన లక్షణమైన క్లుప్తత కేవలం రూపానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. జీవితానికి, జీవిత దృక్ప థానికి రూపం. జీవితంలోని ఒక ముక్కను తీసుకుని దానికి వ్యక్తిత్వం ఇవ్వాలన్న ఆకాంక్ష లోంచి కథకు రూపం వచ్చిందంటారు. కథల్లో కొద్దిమంది లేదా ఒక జీవితం కొన్ని శకలా లుగా గోచరమవడం పాఠకులకు కొత్త కాదు. కానీ తనకు తెలియని ప్రపంచంలోని భాష, వ్యక్తులు, జీవన విధానాలను కథలుగా మలచడంలో ఎన్నో ఇబ్బందులున్నాయి. చదువరి వీటిని తనవిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో గురించి వారంటే తెలియని వారు ఎందుకు తెలుసుకోవాలి? అటువంటి కథలు ఎందుకు చదవాలి? ఇవి సామాన్య చదువరుల ప్రశ్నలు. ప్రపంచీకరణ నేపథ్యంలో సాహిత్యం కొత్త సిద్ధాంతాలను, వాతావరణాలను సృష్టించుకుంటూ వస్తున్నది. మన చుట్టూ ఉన్న సమాజం నాగరికత ఆనవాళ్ళు అభివృద్ధి పరంగా శరవేగంగా మార్పుకు లోనవుతున్నది. కాని అలాలేని జీవితాలున్నాయి. జీవన గమనాలున్నాయి. ఎటువంటి కృతక వర్ణాలను అంటించుకోని స్వచ్ఛమైన మన్యాలున్నాయి. వాటిలో ప్రజాసమూహాలున్నాయి. ప్రకృతి వారికి పాఠశాల..కూడు, గుడ్డ, భాష కూడా అక్కడ నుంచి వచ్చినదే. భయంకమెన క్రూరమృగాలు, సాధు జంతువులు వారిని దగ్గరగానే చూస్తాయి. వారు కూడా వాటితో సహజీవనం చేస్తారు. సవరలు ఇందుకు మినహాయింపు కాదు. సవర దక్షిణ ముండాభాష. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా ఐదులక్షలకు పైనే. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. వీరి గృహాలు ఒకదానికెదురుగా మరొకటి ఉంటాయి. వీరి భాషలో గ్రామాన్ని గొర్భాం అంటారు. అంటువ్యాధుల వల్ల, పులి, అగ్ని వంటి వాటి ప్రమాదాల వల్ల జనం చనిపోతే ఆ గ్రామాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళిపోతారు. నేటికీ వారిని అనాగరికులుగానే సభ్య సమాజం గుర్తిస్తుంది. మనిషికి ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని గాఢంగా నమ్ముతారు. ఆత్మల్లోకి మనుషులు ప్రవేశించగలరనే విశ్వాసాలు ఉన్నాయి వారికి. వీటిని గిడుగువారు దగ్గరగా చూశారు. తనవిగా భావించారు. వారితో కలసిమెలసి సవరభాషకు ఓ శాశ్వతను తీసుకువచ్చారు. వీటినే ‘సవర కథలు’ ద్వారా అందించారు. ‘సవర కథలు’ చాలావరకు చిన్న పిల్లల కథలు వలే ఉన్నా సవరల మనస్త త్వాన్ని చెబుతాయి. సవరల జీవితాల్లోని ఓ తాత్వికతతో కూడిన విశ్వాసాలున్నాయి. వాటి వెనుక నీతివంతమైన వ్యవహారా లున్నాయి. కష్టపడే తత్వాన్ని నీతి ఆవహిస్తే స్వచ్ఛత కనిపిస్తుంది. ఇది ప్రకృతి గుణం. ‘నక్కా-గద్దా’,‘మూడు పిల్లులు- కోతి’,‘గొప్ప వాడి కథ’, ‘అత్యాశగల ఒక మనిషి’ వంటి కథలలోని నీతిని సవరల జీవనవిధానంలోని భాగంగా భావించడం కన్నా,వారి మనస్త త్వాన్ని, మానవతా దృక్పథాన్ని పరోక్షంగా చెబుతాయి. ఈ కథలలోని రెండవ పుస్తకం ముందుమాటలో ‘ఇందులోని కథలు అన్నీ సవర వాళ్ళు నాఎదుట చెప్పినవే. ఇంచు మించుగా వాళ్ళ మాటలే’ అంటారా యన. ఈ సంపుటంలోని కొన్ని కథలు వారు విన్నవి. కొన్ని కల్పనలు. కొన్ని కథలు వారివే. సవరలు పచ్చిబూతులు యథేచ్ఛగా ఉపయోగిస్తారు. అవి ఈ కథల్లో లేకుండా చూశారు గిడుగువారు. ఈ కథల్లో సవర జీవన విధానంతో పాటు వారి భాషను కూడా ఆయన సహజంగా గిడుగువారు ప్రతిపాదిం చారు. నాలుగో భాగం సవర కథల్లో పూర్తిగా సవరలకు సంబంధించిన జీవన విధానపు భాషా వ్యవహారం కనిపిస్తుంది.ఇళ్ళు,పొలం,సంత,తగవులు, పూజలు,కల్లు తాగడం,సోది,కేసులు, పోలీసు లు,జడ్జిలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి సంభాష ణలోని సహజ త్వాన్ని గిడుగు అందించారు. సవర భాషాలిపికర్తగా,వ్యవ హారిక భాషా ఉద్యమ కారుడిగా చరిత్రకెక్కిన ఆయనకు, వర్తమానం లో ఎదురవుతున్న అవరోధాలన్నిటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవటమే మన అర్పించే నిమెన నివాళి.
గిరిజనుల ప్రకృతి ఆరాధనే
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదా యాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యతను చాటేలా నిర్వహించే ఈ పండుగ వారి సంప్రదాయానికి అద్దం పడుతున్నది. పంటలు బాగా పండాలని, పశు సంపద అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి ఆరాధన ఆ పండుగ అంతర్లీనంగా ఉం టుంది. అత్యధికంగా తండాలు కలిగిన పాలకవీడు మండలం లోపాటు బొమ్మల రామారం,తుర్కపల్లి మండలాల్లోనూ సీత్లా పండుగ సందడి నెలకొన్నది. లాలితండా, బెట్టెతండా,పాడ్యాతండా,చెర్వుతండా, కల్మటితండా,కొత్తతండా,శూన్యంపహాడ్‌, దేవ్లాతండా,మీగడంపహాడ్‌ తండా, లక్ష్మీతం డాల్లో పండుగలు జోరందుకున్నాయి. గిరిజ నుల తొలి పండుగ సీత్లా. ఆషాఢ మాసం పెద్ద పుష్యాల తొలి పాదంలో ఈ పండుగను జరుపుకొంటారు. తండాలోని కుటుంబాలన్నీ సామూహంగా ఏర్పడి ప్రకృతి దేవతలైన సీత్లా భవానీతో పాటు ఆరుగురు భవానీల ప్రతిమ లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. వర్షాలు బాగా కురువాలని పాడి పంటలతో పల్లెలు, తండాలు సస్యశ్యా మలంగా ఉం డాలని కోరుతూ మొక్కులు చెల్లించు కొం టారు. ఏడు రకాల వంట కాలతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఆటా పాటలతో గిరిజన సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తారు.ఈ తంతులో కుల పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. సాయంత్రం వేళ అమ్మ వార్లకు గొర్రె పోతు లను బలి ఇచ్చి,పేగు పైనుంచి పశువులను దాటిస్తారు. దీనినే దాటుడు పండుగ అని అంటారు.

పేదలకు భూ పంపిణీ

పేద రైతులకు భూములపై సర్వ హక్కులు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే..శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూముల కేటాయించాం..నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటుంటే ఈ పెత్తందారులకు నచ్చడం లేదు..గజ దొంగల ముఠా మాటలు నమ్మి మోసపోవద్దు.. చంద్రబాబు ఏనాడూ ప్రజలకు మంచి చేసి అధికారంలోకి రాలేదు.. నూజివీడు బహిరంగ సభలో సీఎం జగన్‌.
పేదలభూములపై వారికి సర్వ హక్కు లు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.రైతుల భూసమస్యలకు పరిష్కారం చూపించామని, 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తున్నామని,కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందా ర్లకు నచ్చడం లేదని,పేదవర్గాలపట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ప్రతిపక్షం కుట్రలు చేయా లని చూస్తోందని ఆరోపించారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46, 463.82ఎకరాలకు సంబంధించి42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరు పేదలకుభూముల పంపిణీని ప్రారం­భించడం తోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఇనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన,గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభిం చారు.
ఈ సందర్బంగా నవంబర్‌ 17న నూజివీడులో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని, రెండో దశలో 24.6లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని,నాలుగువేల గ్రామాల్లో రీసర్వే పూర్త యిందని,సర్వే పూర్తైన గ్రామాల్లో అక్కడి సచి వాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చుని, భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికా ర్డులు అప్‌డేట్‌ చేశామని తెలిపారు. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని, అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని, చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించా మన్నారు.శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో1,563 గ్రామాల్లో 951 ఎకరా ల ప్రభుత్వ భూమిని కేటాయించారు. -జిఎన్‌వి సతీష్‌

మిచౌంగ్‌ తుఫాన్‌…

ఓ వైపు చలికాలం కొనసాగుతూ ఉంటే మరో వైపు మిచౌంగ్‌ తుఫాను ముంచేసింది. వరిరైతుల ఉరేసింది. ఈ విపత్తు అన్నదాత ఆశల్ని ఊడ్చేసినంది. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో వరి నేలవాలింది. కోతకొచ్చిన లక్షల ఎకరాల వరిని నేలమట్టం చేస్తూ ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని నీటముంచుతూ.. మిచౌంగ్‌ తీవ్ర తుఫాను తీరందాటింది. చేతికొచ్చేసినట్లే అనుకుంటున్న వరి రైతుల ఆశల్ని తుఫాను తుడిచిపెట్టేసింది. రాయలసీమ,కోస్తా జిల్లాలో ఉద్యాన పంటలకూ తీరని నష్టాన్ని మిగిల్చింది. తీవ్ర తుఫాన్‌ కారణంగా వ్యవసాయ,ఉద్యాన పంటల నష్టమే రూ.10వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.అతి భారీ వర్షాలు, గంటలకు వంద కి.మీ.వేగంతో వీచిన గాలుల తీవ్రతకు వందల గ్రామాలు వణికిపోయాయి. 8 జిల్లాలో 60మండలాల్లో తీవ్ర తుపాను ప్రభావం చూపింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం క్రమాంగా మిచౌంగ్‌ తుఫాన్‌గా ఏర్పడిరది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఎక్కువగా చూపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సాధారణంగా ప్రకృతిలో అనేక మార్పుల వల్ల భూకంపాలు, తుఫాన్లు వస్తుంటాయి. వాతా వరణ ప్రభావం వల్ల తుఫాన్‌ ఏర్పడి అది సృష్టించే బీభత్సం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. అయితే ప్రతి తుఫాన్‌ కి వాతావరణ శాఖ వారు ఒక పేరుపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. బంగాళా ఖాతం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడి అల్ప పీడనం కారణంగా క్రమేణా వాయు గుండంగా మారి తుఫాన్‌ రూపం దాల్చు తుంది. దీని ప్రభావం దేశంలోని పలు రాష్ట్రా ల్లో భారీ వర్షాలు పడుతుంటాయి.ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి పోతాయి. విపరీతమైన గాలులు వీయడంతో కట్టడాలు నేటమట్టం అవుతుంటాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలను వణికి స్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.వివరాల్లోకి వెళితే..
తుఫాన్‌ అంటే ప్రజలు భయంతో వణికిపోతుంటారు. ప్రతి ఏటా ప్రపంచ వాతావరణ సంస్థ (%ఔవీూ%) సైక్లోన్‌ పరిస్థితిని బట్టి ఈ పేరును పర్యవేక్షిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఏర్పడే తుఫానులను ఆ ప్రాంతాలలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, ఉష్ణ మండల తుఫాన్‌ హెచ్చిరికల కేంద్రాల నుంచి పేర్లను సేకరించి వాటికి అనుగుణంగా తుఫాన్‌ పేరును సూచిస్తాయి. 2021లో ఏర్పడిన తౌటే తుఫాన్‌కి మయన్మార్‌ పేరు పెట్టింది. మయన్మార్‌లో తౌటే అంటే పెద్ద శబ్ధం చేసే బల్లి అని అర్థం.ఈతుఫాన్‌ భారీ శబ్ధాలు చేస్తూ రావడంతో మయన్మార్‌ వాతావరణ శాఖ తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును పెట్టింది.ఆతర్వాత ఏపీని వణికిం చిన హుద్‌ హుద్‌ తుఫాన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ దీని ఎఫెక్ట్‌ ఆ ప్రాంతం లో కనిపిస్తూనే ఉంది. హుద్‌హుద్‌ తుఫాన్‌ కి ఆపేరు ఒమన్‌ సూచించింది. ఇది ఇజ్రా యెల్‌ జాతీయ పక్షి హుపో.హుద్‌హుద్‌ అంటే ఆఫ్రో-యురేషియా అంతటా కనిపించే రంగుల పక్షి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు, తమిళనాడును వణికిస్తున్న తుఫాన్‌ కి మిచౌంగ్‌ అని పేరు పెట్టారు. ‘మిగ్గామ్‌’ అని ఉచ్చరించే మిచాంగ్‌ పేరును మయన్మార్‌ సూచించింది. మిచాంగ్‌ అంటే ‘బలం’ లేదా ‘స్థిరత’ అని అర్థం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా మిచౌంగ్‌ తుఫాన్‌ గా ఏర్పడిరదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి దీని ప్రభావం విపరీతంగా చూపిస్తుంద. గంటకు 8 కిలో మీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం మరో రెండు రోజులు ఉండ వొచ్చని.. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఈ తుఫాన్‌ ప్రభావం తమిళనాడులో భారీగా చూపించింది. చెన్నైలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఇప్పటికే స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌రంగంలోకి దిగి సహాయకచర్యలు ప్రారంభించింది.
మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌..142 రైళ్లు రద్దు!
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుఫాను తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ తుఫాన్‌ కోస్తావైపు కదులుతున్నట్టు వాతా వరణశాఖ ప్రకటించింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్‌ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళా ఖాతం లో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్‌ సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం లోపు నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశ ముందని ఐఎండీ వెల్లడిరచింది.ఇక తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలను, మత్స్యకారులను జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కోస్తా, రాయలసీమలో సోమ మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ ప్రకటించింది. ఈ క్రమంలో ఆప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం రైళ్లపై పడిరది. ఈ తుపాను నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే విభాగం అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 3వ తేదీ నుంచి 6 తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేసినట్టు సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం శుక్రవారం వాయుగుం డంగా మారింది. మిచౌంగ్‌ తుఫాన్‌ ఆదివారానికి తుపానుగా బల పడిరది. దీంతో నేడు, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలానే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిరది.ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణి కులను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) హెచ్చరిక జారీ చేసింది. మిచాంగ్‌ తుపాన్‌ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో తిరిగే 142 రైళ్లు రద్దు చేశామని సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేశ్‌ చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణి కులు గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్‌.. చెన్నై విమానా శ్రయం మూసివేత!
మిచౌంగ్‌ తుపాను ప్రజలను వణికిస్తోంది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరాన్ని మిచౌంగ్‌ తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలవల్ల చెన్నై ప్రజల జీవనం దెబ్బతింటోంది. కాలనీలు, ప్రధాన రహదారులు అన్నీ జలాశయాలను తలపిస్తున్నాయి. ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరి స్తున్నారు. విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ సేవలకు కూడా అంతరాయం వాటిల్లింది. ఇప్పుడు చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసేశారు. విమాన రాకపోకలను తాత్కాలి కంగా నిలిపివేసినట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం మిచౌంగ్‌ తుపాను కారణంగా చెన్నై ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడిరది. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు రైళ్ల సేవలను నిలిపివేశారు. రోడ్డు మార్గాన కూడా చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు విమాన రాకపో కలకు కూడా అంతరాయం ఏర్పడిరది. రన్‌ వేని క్లోజ్‌ చేస్తున్నట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడిరచారు. రాత్రి 11 గంటల వరకు విమానాల టేకాఫ్‌, ల్యాండిరగ్‌ జరగదని..రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ప్రకటించారు. వాతా వరణం అనుకూలించక పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేశారు. తుపాను ప్రభావం వల్ల తీర ప్రాంతాలైన చెన్నై, కాంచీపురం,తిరువల్లూర్‌,చెంగలపట్టు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతోంది. ఈ వర్షాల కారణంగానే విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మిచౌంగ్‌ తుపాను కారణంగా ప్రస్తుతం 80 నుంతి 90కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షపు నీటి వల్ల విమానాలు, రోడ్డు రవాణా మాత్రమే కాకుండా.. రైళ్ల రాకపోకలకు కూడా అంత రాయం ఏర్పడిరది. చెన్నైలో దాదాపు 14 సబ్‌ వేలను వర్షపు నీటివల్ల మూసి వేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఇంక ఈ మిచౌంగ్‌ తుపాను వల్ల అటు తెలుగు రాష్ట్రా ల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడిరచారు. ఈ తుపాను నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఈ నేపథ్యంలోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఈదురు గాలులు కూడా వీచే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఆంధ్రాలో అధికా రులు తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే మరో 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తు న్నారు. మరోవైపు మిచౌంగ్‌ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, కాలనీలు అన్నీ జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల కాలనీల్లో పార్క్‌ చేసిన కార్లు కాగితపు పడవల్లా వరద నీటిలో కొట్టుకుపో తున్నాయి. ఇప్పటికే చెన్నై నగరానికి మంచి నీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు అన్నీ నిండిపోయాయి. ఇంకా వర్షాలు కురుస్తూ ఉండటంతో అవి పొంగే ప్రమాదం కూడా ఉందంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే నెట్టింట చెన్నై నగరానికి సంబం ధించిన విజువల్స్‌ వైరల్‌గా మారాయి. అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలకు ఆ దృశ్యాలు సాక్ష్యం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నా రు. మరోవైపు ఏటా ఇలాంటి వరదలు వస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. 5 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే రోడ్లు జలమ యం అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుపానుతో వరి పంటకు తీవ్ర నష్టం
తుపాను వల్ల జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాన్ని రవాణాకు వాహనాలు లేకపోవడంతో కొంతమంది రైతులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకొని తమ ధాన్యాన్ని తరలించు కుపోయే పనిలో ఉండగా,మరి కొంతమంది రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని టార్పలిన్లతో కప్పి భద్రపర్చుకొంటున్నారు. ఇప్పటికే పొలం లో కోసి ఉన్న పంటను కుప్పలు వేసుకుని పంటను తడవకుండా కాపాడుకునే పనిలో కొంతమంది రైతులు నిమగమైనారు. కల్లాల్లో, పొలాల్లో ఎక్కడ చూసినా రైతులు పండిన పంటను, అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని, బస్టాండ్లో నింపిన ధాన్యాన్ని తరలించే పనిలోనే ఉంటూ తమ పంటను కాపాడుకునే పనిలోనే ఉన్నారు.పాలకొండ: తుపాను హెచ్చ రికతో రైతులకు పాట్లు తప్పటం లేదు. ఓ మోస్తారు వర్షం కురువడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరి పొలాలు, కల్లంలో ఉన్న వరికుప్పలను తర్బాన్లనతో రక్షణ కల్పించుకున్నారు. మండలంలో 17 వేల ఎకరాల్లో వరిసాగవుతోంది. అయితే ఈసారి సాగునీరందక వ్యయప్రయాసాలు పడి మోటర్లు సాయంతో సాగునీటిని పొలాలకు అందించారు. పంట చేతిక అందిన సమ యంలో తుఫాన్లు రావడంతో పంట ఏమివుతుందో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో గోపాలపురం, భాసూరు,వి.పి రాజుపేట, అంపిలి తదితర ప్రాంతాల్లో పొలాల్లోనే ధాన్యం కుప్పలు ఉన్నాయి. దీంతో ధాన్యం తడిసి రంగు మారుతుందన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులపాటు ఈ వర్షాప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలో మిచాంగ్‌ తుపానుతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. రెండు రోజులుగా ఈ తుపాను ప్రభావం ఉండడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏజెన్సీలో చినరామదేవనాపురం, పెదరామం, దోను బాయి తదితర ప్రాంతాల్లో కోతలైపోవడంతో రైతులు ఆదరా బాధరాగా వరి చేను పంట పొలాల్లోనే కుప్పలు వేస్తున్నారు. మరి కొంత మంది వరిచేలపై టార్బన్‌ కప్పుతున్నారు. చేతికి అందించిన పంట చేజారి పోతుందే మోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది 2532 ఎకరాల్లో వరి నాట్లు పడగా,580 ఎకరాల వరకు కోతలు జరిగాయి. కోసిన పంటను సురక్షిత ప్రాంతా లకు తరలించాలని పనిలో రైతులు ఉన్నారు. పొలాల్లో కాస్త మిగిలి ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు అప్రమత్తమ య్యారు. కోసిన వరి పంట కల్లానికి తీసుకువచ్చి కుప్పలుగా పెట్టి టార్ఫాన్లతో కాపాడుకుంటున్నారు. మరి కొన్నిచోట్ల ఆదివారం రాత్రి నుంచి మిషన్లతో నూర్పులు చేపట్టి పంటను ఇంటికి తీసుకెళ్తున్నారు. సకాలంలో వర్షాల్లేక పంట ఎండిపోయి కరువు ఏర్పడిరదని ఆందోళన చెందుతున్న తరుణంలో మరోవైపు తుఫాను ప్రభావంతో మిగిలిన కాస్త పంటైన దాచుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. అప్రమత్తమైన అధికారులుతుపాను కారణంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి విపత్తు వచ్చిన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా గుమ్మిడి లక్ష్మీపురం మండలంలోని 27 పంచాయ తీలు అధికారుల దృష్టి సాధించారు. తుపాను కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు.వాతావరణ మార్పులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కడ వర్షం పడుతుందోనని వరిరైతులు వణికిపోతు న్నాయి. ప్రస్తుతం మండలంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంటను రక్షించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. కోసిన పనులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. సుమారు 1700 వేల వరిసాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన వరి పైరు కోతలు జరుగుతున్నాయి.ఈ పరిస్థితుల్లో వర్షం కురిస్తే వరి పనలు, ధాన్యం పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మను షులు తో కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలించి వాటిపై పరదాలు కప్పి రక్షణ చర్యలు చేపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో ఆపకుండా, గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని, వీటిని తరలించేందుకు సరిపడా వాహనాలను ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.-గునపర్తి సైమన్‌

పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల ..హక్కు..!

ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా చర్చనీ యాంశమైన అంశాల్లో పెన్షన్‌ కూడా ఒకటి.కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్న నూతన పెన్షన్‌ విధానాన్ని దేశవ్యా ప్తంగా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా గడవ వల సిన జీవితా లు ఈ విధానంతో ప్రశ్నార్ధకంగా మారుతుం డటమే దీనికి కారణం. శక్తియుక్తులన్నీ ఉద్యోగు లుగా ఖర్చు చేసిన తరువాత, మిగిలిన జీవితాన్ని గౌరవప్రదం గా గడపడానికి ఉద్దేశించిందే పెన్షన్‌! అయితే, అటు వంటి పరిస్థితి నిజంగా ఉందా అంటే లేదు అన్నదే సమా ధానం. అనేక రంగాల మాదిరే ఈ విషయంలో నూ మనదేశానిది అథమస్థానమే. అమెరి కాకు చెందిన కన్సల్టింగ్‌ కంపెనీ మెర్సర్‌, స్వచ్ఛంద సంస్థ సిఎఫ్‌ఎ ఇన్‌స్టి ట్యూట్‌ కలిసి సంయుక్తంగా విడుదల చేసిన తాజా ప్రపంచ పెన్షన్‌ సూచీ (2023)లో భారత దేశ స్థానం చివరి నుండి మూడవది !
మొత్తం47దేశాల్లో ఆసంస్థ సర్వే నిర్వహించగా భారత్‌ 45వ స్థానంలో నిలిచింది. 2022 లో 44దేశాలకుగాను మన దేశం 41 వ స్థానంలో నిలిచింది. అంటే గత ఏడాదితో పోల్చినా మన స్థానం మరింత దిగజారిందన్న మాట. ఇదీ సీనియర్‌ సిటిజన్లకు మనం ఇస్తున్న గౌరవం! ఈవాస్తవాన్ని గుర్తించి, మెరుగైన విధా నాన్ని రూపొందించడానికి మనపాలకులు సిద్ధ పడకపోవడమే విచారకరం. ప్రపంచ ఆకలి సూచీ రిపోర్టును తిరస్కరించినట్టే దీనిని కూడా మోడీ ప్రభుత్వం తిరస్కరించింది.2021లోపెన్షన్‌ సూచీ లో భారత్‌ చివరిస్థానంలో నిలవడంతో పార్లమెం టులో ప్రస్తావనకు వచ్చింది.దీనిపై వివిరణ ఇచ్చిన ప్రభుత్వం ఆ సూచికలో విశ్వసనీయ సమా చారం లేదని,అన్ని అంశాలను పరిగణలోకి తీసు కోలేదని ప్రకటించింది. ఆ తరువాతైనా పెన్షన్‌ విధానంలో మెరుగైన మార్పులు తీసుకువచ్చిందా అంటే అదీ లేదు.ఏటికేడాది దిగదిడుపే !
నిజానికి,మెర్సర్‌-సిఎఫ్‌ఎ ఇన్‌స్టిట్యూట్‌ గత పదిహేను సంవత్సరాలుగా విడుదల చేస్తున్న గ్లోబల్‌ పెన్షన్‌ ఇండెక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తిం పు ఉంది.తాజా సర్వేను 64శాతం ప్రపంచ జనాభాకు ప్రాతినిధ్యం వహించేలా 47 దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఆ దేశాల్లోని పెన్షన్‌ విధానా లను సమగ్రంగా అధ్యయనం చేయడంతో పాటు, 50 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు నిర్వా హకులు తెలిపారు. ఈ సర్వేలో 85 పాయింట్లతో నెదర్లాండ్స్‌ మొట్టమొదటి స్థానంలో నిలవగా, 83.5పాయింట్లతో ఐస్‌ల్యాండ్‌ రెండవ స్థానం లో,81.3 పాయింట్లతో డెన్మార్క్‌ మూడవ స్థానంలో నిలిచాయి.45వస్థానంలో నిలిచిన భారత్‌కు 45.9పాయింట్లు దక్కగా,42.3 పా యింట్లతో అర్జెంటీనా చిట్టచివరన నిలిచింది. అమెరికాతోపాటు మధ్యస్థంగా ఉన్న అనేక దేశాలు తీసుకురావాల్సిన మార్పులను పేర్కొన్న నివేదిక, చైనా,కొరియా సింగపూర్‌, జపాన్‌ వంటి దేశాలు మెరుగైన విధానాలను అమలు చేస్తున్నాయని తెలి పింది. అదే సమయంలో భారత్‌ పనితీరుపై అది పెదవి విరిచింది. నయా ఉదారవాద విధా నాల ఫలితంగా దుర్భరమౌతున్న బతుకులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాల్లో వస్తున్న మార్పులు, అంతకంతకు భారమౌతున్న వైద్య ఖర్చుల తీరును ప్రస్తావించిన నివేదిక వీటిని తట్టుకునే విధంగా పెన్షన్‌ విధానాలను రూపొం దించాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
మెరుగైన పెన్షన్‌ విధానం కోసం దేశంలోనూ,ప్రత్యేకించి మనరాష్ట్రంలోనూ ఉద్యోగులు,ఉపాధ్యాయులు సాగిస్తున్న పోరాటాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి.ఈ సందర్భంగా ప్రస్తా వనార్హం.ఉద్యోగ విరమణ అనంతరం గౌరవ ప్రదమైన జీవితంకోసం పాతపెన్షన్‌ విధానం కావాలని ఉద్యోగులు,ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అం టోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి భిన్నం గా కంట్రిబ్యూషన్‌ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్‌ను వీరు తిరస్కరిస్తున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తుం డగా,మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాధ్యం కాదని,ఖజానాపై పెనుభారం పడుతుందని చెబు తుండటం విచిత్రం! ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మొండి వైఖరికి నిరసనగా యుటిఎఫ్‌ ఆధ్వ ర్యంలో రాష్ట్ర స్థాయిలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. క్షేత్రస్థాయికి పోరాటాన్ని తీసుకు పోవడంలో భాగంగా జిల్లా, మండల స్థాయిల్లో నూ దీక్షలు చేపట్టనున్నారు. పాత పెన్షన్‌ విధానా న్ని అమలు చేస్తామన్న పార్టీకే రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని ఉపాధ్యాయ నేతలు ఇచ్చిన పిలుపు అత్యంత సముచితమైనది. గౌరవప్రదమైన పెన్షన్‌ ప్రభుత్వం ఇచ్చే భిక్షకాదు.ఉద్యోగుల హక్కు! అని నినదిస్తూ ఇటీవల ఢల్లీిలో భారీర్యాలీ జరిగిం ది. రాష్ట్రంలోనూ అంచెలం చెలుగా ఈ పోరా టం విస్తృతమౌతోంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఉద్యోగులు,ఉపా ధ్యాయల న్యాయసమ్మతమైన డిమాం డ్లను పరిష్క రించాలి.- జిఎన్‌వి సతీష్‌

కంటకాపల్లి రైల్వే ప్రమాదంలో మృత్యుఘటికలు

ఈ ఘోర ఘటన మరువ లేనిది. ఎన్ని రైల్వే ప్రమాదాలు జరిగినా సామాన్యుడు ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభు త్వాలకు పట్టడం లేదు. అందుకే పదే పదే ఒకే తరహా ప్రమాదాలు ప్రయాణీకులను బలితీసుకుంటున్నాయి. విజయనగరం జిల్లా కంటకాపల్లి దరిలో జరిగిన ఘటనే తార్కాణం. అక్టోబర్‌ 29న పొద్దు వాలు తున్న సమాయన సంభవించిన ఘోర రైలు ప్రమాదం పదమూడు మంది అమా యకుల ప్రాణాలను కబళించింది. వంద మంది వరకు క్షతగాత్రులను చేసింది. విశాఖ నుంచి పలాస వెళుతున్న ప్యాసిం జర్‌ రైలుకు సిగల్‌ అందక కంటకాపల్లి సమీపంలో ట్రాక్‌పై నిలిపిఉంచగా, వెనక నుంచి అదే పట్టాలపై విశాఖ నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్‌ రైలు వేగంగా ఢకొట్టిెంది.ఆ ధాటికి రాయగడ రైలు కొన్ని బోగీలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని పక్క ట్రాక్‌లోని గూడ్స్‌ రైలు మీదికి దూసుకెళ్లాయి. ఈ భీతావహంలో చని పోయిన వారిలో ఇద్దరు లోకో పైలెట్లు, గార్డు కూడా ఉండటం విషాదం. ముందుగా వెళ్లిన రైలుకు సిగల్‌ అందని పరిస్థితి ఉండగా వెనుక మరో రైలును అదే ట్రాక్‌పై పంపడం రైల్వే భద్రత డొల్లత నానికి నిదర్శనం. ఇదే రూట్‌లో ఒడిశా లోని బాలాసోర్‌ వద్ద జూన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది మరణించగా 1,200 మంది గాయపడ్డారు. ఆ ఘోర కలిని మర్చిపోక ముందే అదే తరహాలో సిగల్‌ వైఫల్యం కారణంగా మూడు రైళ్లు గుద్దుకు న్నాయి.ఈ నెలలోనే బీహార్‌లో పట్టాలు ఊడి పోవడాన్ని గమనించిన డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో పెనుముప్పు తప్పింది. నాలుగు మరణాలు,70 మందికి గాయా లతో సరి పోయింది. వరుస రైలు ప్రమాదాలతో రైలు ప్రయాణ మంటేనే ప్రజలను భీతిల్లజేస్తోంది. దుర్ఘటన జరిగిన ప్రతిసారీ ప్రముఖుల సంతాపాలు, పరామర్శలు, తృణమో పణమో పరిహారాలు మినహా ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి,కారణాలు కనుగొని,పునరావృతం కాకుండాపటిష్ట చర్యలు చేపట్టే విషయంలోకేంద్ర ప్రభు త్వం బాధ్యత తప్పింది.ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజలను ఏమారు స్తోంది.రైల్వే భద్రత విషయంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని 2022లో విడుదల చేసిన కాగ్‌ నివేదిక కుండబద్దలు కొట్టింది.దాదాపు రైలు ప్రమాదాలన్నీ పట్టాలు తప్పడం వల్లనే సంభవిస్తున్నాయని, పట్టాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాల్సి ఉండగా, 2017 లో ప్రత్యేకంగా నెలకొల్పిన రాష్ట్రీయ రైలు రక్షణ నిధి నిధులు తగ్గించిన వైనాన్ని కాగ్‌ ఎత్తి చూపింది. అలాగే రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ రిపోర్టు ప్రకారం రైలు ప్రమాదాలపై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలపై ఎలాంటి చర్యలూ లేవు. ఇదీ ప్రయాణీకుల ప్రాణాలకు మోడీ ప్రభుత్వం ఇచ్చే విలువ. బాలాసోర్‌ ఘటన విషయానికే వస్తే సిబిఐ దర్యాప్తు చేసి ముగ్గురు అధికా రులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్‌ వేసి మమ అనిపించింది. కానీ సిగలింగ్‌ వ్యవస్థ ఏమాత్రం మారలేదని విజయనగరం ఘటన వలన తేటతెల్లమవుతోంది.కేంద్రంలో బిజెపి వచ్చాక రైల్వేల ప్రైవేటీకరణ దూకుడుగా జరుగుతోంది. వందల ప్రైవేటు రైళ్లొచ్చాయి. అదానీ వంటి కార్పొరేట్లకు రైల్వే ఆస్తులు ధారాదత్తమవుతున్నాయి. రైల్వే ప్రత్యేక బడ్జెట్‌ ఎత్తేశారు. ప్యాసింజర్‌ రైళ్లు రద్దవుతూ వందేభారత్‌, హైస్పీడ్‌ ట్రైన్లు ప్రవేశపెడు తున్నారు. 2022 చివరి నాటికి రైల్వేలలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయాన రైల్వేశాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడిరచారు. రైళ్లల్లో ప్రతి రోజూ రెండున్నర కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఒక వైపు రైల్వేల ద్వారా ఏడాదికి రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని మోడీ ప్రభుత్వం ఆర్జిస్తూ మరో వైపు ప్రయాణీకుల భద్రతకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కూడా కేటాయిం చడం లేదు. సిబ్బంది లేని వేలాది లెవెల్‌ క్రాసింగ్‌లు పెట్టుకొని బుల్లెట్‌ రైళ్లనడం మోడీ ప్రభుత్వానికే చెల్లుతుంది. రైలు ప్రమాదాలను మానవ తప్పిదంగానో,కుట్రగానో చిత్రించడం తప్పించుకొనే ఎత్తు. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్‌ రంగ రవాణా వ్యవస్థ మన రైల్వే. అత్యధిక ఉద్యోగులు పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా మన రైల్వేలకు పేరుంది. రైల్వేలపట్ల ప్రభుత్వ విధానాల్లో మార్పు రానంత వరకు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల చందమే. విజయ నగరం దుర్ఘటనతోనైనా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మేల్కోవాలి.ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి.
సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపాలు..
దేశ రైల్వేలో భద్రతా సిబ్బంది కొరత, సిగలింగ్‌ వ్యవస్థ ఆపరేషన్స్‌ నిర్వహణ విష యంలో కేంద్రంలోని మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో, గడిచిన ఆరేళ్లుగా తూర్పు కోస్తా రైల్వే పరిధి లోని వాల్తేరు డివిజన్‌లో ప్రమాదాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భారీ ఘటనలు చోటుచేసు కున్నాయి. ఇక్కడ సుమారు రెండు వేల మంది ఇంజనీరింగ్‌ సిబ్బంది కొరత ఏళ్ల తరబడి వెంటాడుతోంది. 2013లో విజయ నగరం జిల్లా గొట్లాంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక బోగీలో పొగ వచ్చిందని, ఏదో ప్రమాదం జరగబోతుందనే కంగారులో రైలు గొలుసు లాగి పక్కనే మరో రైల్వే ట్రాక్‌లోకి ప్రయాణి కులు వెళ్తున్న క్రమంలో ఆ ట్రాక్‌పై వచ్చిన రైలు ఢకొనెడంతో మృతి చెందారు. 2016 లో కూనేరులో హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 41 మంది మరణించారు. దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశాలోని బాలాసూర్‌లో ఎదురెదురుగా వచ్చిన రైళ్లు ఢకొన్నె ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. తాజాగా వాల్తేరు డివిజన్‌ పరిధిలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ వద్ద 2023 అక్టోబర్‌ 29 రాత్రి రాయగడ-విజ యవాడ ఎక్స్‌ప్రెస్‌ రైలు పలాస పాసింజరును ఢకొనెడంతో సుమారు 13మంది విగతజీవు లయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, మోడీ ప్రభుత్వం రైల్వేల భద్రతను పట్టించు కోకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమిక విశ్లేషణ ఇలా ఉంది. వాల్తేరు డివిజన్‌లో ప్రధాన, నిత్యం బిజీగా ఉండే రైల్వే లైను ఇది.మూడు రైల్వే లైన్లు ఇక్కడ ఉన్నాయి. మధ్య లైనులో ఈ తాజా ఘటన జరిగింది. హౌరా-చెన్నరు వెళ్లే రైళ్లు,కోరమండల్‌,కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌,సరుకు రవాణా గూడ్స్‌ రైళ్లు ఈ లైన్లోనే వెళతాయి.వాల్తేరు రైల్వేలో కీలకమైన మూడు లైన్లు ఇవే అయినప్పటికీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం ఘటనపై రైల్వే ప్రాథమిక అంచనాలు ఇలా ఉన్నాయి. స్నిగల్‌ వ్యవస్థల్లో రెడ్‌ (ఎరుపు)-1,గ్రీన్‌ (ఆకుపచ్చ)-2 సిగల్‌ లైట్లు ఉంటాయి. పూర్తిగా రెడ్‌ ఉంటే ఆగడం,గ్రీన్‌ ఉంటే వెళ్లడం చేయాలి.పసుపు లైట్లు రెండు ఉం టాయి. అవి రెండూ వెలిగితే ప్రొసీడ్‌ (2 సెక్షన్లు) లైన్లు క్లియర్‌గా ఉన్నాయని అర్థం. కానీ,ఒక పసుపు లైటు వెలిగి ఉంటే ఒక సెక్షన్‌ క్లియర్‌ అని, ఆగిఆగి వెళ్లాలని సంకే తం.తాజాగా జరిగిన ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్‌ కాస్త వేగంగా ప్రొసీడ్‌ అయ్యారని అంచనా వేస్తున్నారు.దీన్నే సిగల్‌ ఓవర్‌ సీగా రైల్వే పరిభాషలో పేర్కొం టున్నారు.
సిఆర్‌ఎస్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభం
కంటకాపల్లి ఘటనపై ఇన్వెస్టిగేషన్‌కు కమిషనర్‌ రైల్వే స్టేఫ్టీ (సిఆర్‌ఎస్‌)ను కేంద్రం సోమవారం నియమించింది. ప్రత్యేక సాంకే తిక నిపుణుల బృందం వాల్తేరు డివిజన్‌లో ఈ మేరకు పరిశీలన చేయనుంది. మూడు రోజుల తర్వాత పేపర్‌ నోటిఫికేషన్‌ కూడా ఆనవాయితీ ప్రకారం విడుదల చేసి ప్రత్యక్షం గా, పరోక్షంగా ఎవరైనా ఈ ఘటనపై వివరాలు అందజేసేవారుంటే ఫలానా చోట కలవాలని ఈ కమిటీ తెలియపరచనుంది. ప్రజలు,రైల్వే సిబ్బంది, ప్రయాణికులందరినీ ఇలా విచారణ చేశాక పదిరోజుల తర్వాత ఈ ప్రమాద కారణాన్ని వెల్లడిరచనున్నారు. నానాటికీ తీసికట్టుగా భద్రత
ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, సౌత్‌ కోస్ట్‌ రైల్వేల్లో లోకో పైలట్లకు అధిక పని ఒత్తిడి ఉందని కోర మండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి ముందే కేంద్రానికి రైల్వే బోర్డు నివేదించింది.ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ట్రాక్‌లకు ఇరువైపులా పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని బోర్డు చెప్పినా రైల్వే శాఖకు పట్టలేదు. లోకో పైలట్ల పని 12 గంటలకు మించకుండా ఉండాలని సూచిం చింది.కానీ,12గంటలపైనే వీరితో పని చేయించుకుంటోంది.సదరన్‌ రైల్వే పరిధిలో 392 లోకో పైలట్ల పోస్టులు ఖాళీలు ఉన్నా యి.2017 నుంచి 2021 కాలానికి కేంద్ర ప్రభుత్వం భద్రతా నిధి కింద రూ.20వేల కోట్లు ఏర్పాటు చేయాలి. కానీ,రూ.4వేల కోట్ల మేరే జమ చేసింది. ఈ విషయంలో కేంద్ర వైఫల్యంపై కాగ్‌ 2021లో తప్పు పట్టింది.అదే విధంగా రైల్వే లైన్ల మరమ్మ తుల నుంచి సిబ్బంది సంఖ్యను పెంచే అంశం వరకూ వివిధ అంశాలపై వివిధ కమిటీలు, రైల్వే ట్రేడ్‌ యూనియన్లు, ప్రజాసంఘాలు ఇచ్చిన సిఫార్సులు ప్రభుత్వం ముందు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వర్షాకాలంలో వానలు పడటం,వరదలు రావడం కొత్తేమీ కాదు.అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్ష పాతం నమోదు కావడమూ,ఫలితంగా అనూహ్య వరదలు సంభవించడమూ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నదే!ఆ విష యం పక్కన పెట్టినప్పటికీ లైన్లను నిరంతరం కాపలా కాస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యల కోసం హెచ్చరికలు చేసే గ్యాంగ్‌మెన్ల వ్యవస్థ రైల్వేశాఖకు ప్రత్యేకం. కీలకమైన ఈ వ్యవస్థలో నియమకాలు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయాయి.ఉన్న వారిని కూడా ఏదో రకంగా వదిలించుకోవడానికే రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. సమాచార సాంకేతిక విప్లవానికి ఆకాశమే హద్దుగా మారిన ప్రస్తుత రోజుల్లోనూ తాతల కాలం నాటి బూజు పట్టిన విధానాలనే రైల్వేశాఖ అమలు చేస్తోంది.ఫలితంగా రైలు పట్టాల వెంట నిరం తరం పహరా కాయాల్సిన గ్యాంగ్‌మెన్లపై పని భారం విపరీతంగా పెరుగుతోంది. ఒక్క గ్యాంగ్‌మెన్ల విషయంలోనే కాదు, ప్రయాణీ కుల భద్రతతో ముడిబడిన డ్రైవర్లు, గార్డులు, సిగలింగ్‌ సిబ్బంది, తదితర ఉద్యోగాల భర్తీ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానిది ఇదే వైఖరి. ప్రయాణీకుల భద్రతపై ఏ మాత్రం ఆలోచించే ప్రభుత్వమైనా మొట్టమొదట ఈ విషయంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయమై విమర్శల వర్షం కురిపించిన బిజెపి నేతలు అధికారం లోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వానికన్నా అధికంగా ప్రైవేటీకరణ రాగాన్ని ఆలపిస్తు న్నారు. ఉట్టికెగిరే సత్తా లేకపోయినా ఆకాశాని కెగిరేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మోడీ ప్రభుత్వం ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో అట్టహాసంగా ఆవిష్కరించిన బుల్లెట్‌ ట్రైన్‌ విన్యాసమూ ఆ కోవలోనిదే. దేశవ్యాప్తంగా అత్యధిక రైలు ప్రమాదాలు పట్టాలు తప్పడం కారణంగానే జరుగుతున్నాయి. నిర్వహణ, నాణ్యత లోపాలే దీనికి కారణమని వివిధ కమిటీల నివేదికలు ఇప్పటికే నిగ్గు తేల్చాయి. గడిచిన దశాబ్ద కాలంలో సగటున ఏడాదికి 150కి పైగా ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండవ స్థానంలో లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద జరిగిన ప్రమాదాలు నిలి చాయి. వీటిలో అత్యధిక భాగం ప్రమాదాలకు సిబ్బందినే కారణంగా చూపుతున్న రైల్వేశాఖ వారికి అవసరమైన ఆధునిక సదుపాయాలను, తగిన సంఖ్యలో మానవ వనరులను కల్పిం చడంపై మాత్రం దృష్టి సారించ డంలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ అత్యాధునిక ప్రమాద హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైల్వేమంత్రి ఊరించినప్పటికీ ఆదిశలో ఇప్పటి వరకు అడుగులు పడలేదు. ఆధునిక ట్రాక్‌ను ఏర్పాటు చేస్తామని, వెల్డింగ్‌లో నూతన విధానాలను అనుసరించి రైళ్లు పట్టాలు తప్పడాన్ని నిరోధిస్తామని చెప్పిన మాటలకూ ఇంతవరకు అతీగతీ లేకపోవడం విచారకరం. రైల్వే మంత్రిత్వ శాఖే నియమించిన డాక్టర్‌ అనిల్‌ కకోడ్కర్‌ నేతృత్వంలోని హైలెవల్‌ కమిటీ ఐదు సంవత్సరాల కాలంలో భద్రతా ప్రమాణాల పెంపు కోసం లక్ష కోట్ల రూపా యలను ఖర్చు చేయాలని రెండు సంవత్సరాల క్రితం సూచించింది. ఇప్పటి వరకు ఆ దిశలో కేటాయింపులు నామమాత్రమే! భద్రతకు సంబంధించిన మౌలిక వనరుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాలని, అడ్వాన్స్‌డ్‌ సిగలింగ్‌ వ్యవస్థ కోసం మరో రూ.20 వేల కోట్లు కేటాయించాలన్న ఆ కమిటీ సిఫార్సులు కాగితాలకే పరిమితమ య్యాయి. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సిఫార్సులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశలో చేసిన సూచనల అమలుకు మాత్రం తహతహ లాడుతోంది. – గునపర్తి సైమన్‌

1 2 3 4 5 6 11