బడుల్లో కరోనా భయం..తగ్గిన హాజరుశాతం..!

” పిల్లల్ని బడికి పంపాలంటే భయం, ఆపేస్తే చదువు ఏమైపోతుందోనని దిగులు’ .ఏపీలో తల్లితండ్రులు ‘‘మా పిల్లల్ని స్కూల్‌కు పంపినా పంపకపోయినా మేం తప్పు చేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా, పంపించక చదువులో వెనుకబడినా తల్లిదండ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయామని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు. కరోనా సమయంలో పిల్లలను స్కూలుకు పంపించడం గురించి విశాఖ మురళీనగర్‌కు చెందిన సరళ ఈ మాట అన్నారు. ‘‘కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటాయించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’ అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాల టీచర్‌ రవి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలుస్తోంది. అయితే, పిల్లల చదువులు పాడవకుండా, వారు కరోనా బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు విషయాలు వెల్లడిరచారు” .
ఏపీ రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ కుదిపే స్తుంది. దీనిప్రభావం అధికంగా పిల్లలపై చూపడం తో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు భయాం దోళనకు గురవుతున్నారు. దీంతో పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడు తున్నా రు. బడికి వచ్చిన పిల్లలు కరోనా బారిన పడుతుం డటంతో..ఏపీవైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాద నలు చేసింది. ఏదైనాస్కూల్లో ఒకేరోజు ఐదు పాజి టివ్‌ కేసులు నమోదైతే..ఆస్కూలును మూసి వేయాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు, టీచర్లకు క్వారంటైన్‌ పూర్తయ్యేవరకు క్లాసులు నిర్వ హించవద్దని…లేదంటే వైరస్‌వ్యాప్తి తీవ్రమవు తుం దని హెచ్చరించింది. పాజిటివ్‌ కేసులు నమోదైన స్కూళ్లను వెంటనే శానిటైజ్‌ చేసి ప్రతిఒక్కరికీ కరోనా టెస్టులు చేయాలని సర్కార్‌ సూచించింది. అలాగే హాస్టళ్లు,రెసిడెన్షియల్‌ పాఠ శాల్లలోని విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే సమీ పంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించే బాధ్యతను వార్డెన్లు,ప్రిన్సిపాల్స్‌ తీసుకోవాలని సూచిం చింది. ప్రతిస్కూల్లో టీచర్లు, ఇతర సిబ్బందికి రెండు వారాలకు ఒకసారితప్పని సరిగా కరోనా టెస్టులు చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. చిన్నారుల్లో ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసేలా సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. టెస్టు లకు సంబంధించిన సదుపాయలను తామే కల్పిస్తా మని ఏపీఆరోగ్య శాఖ తెలిపింది.‘పిల్లల్ని బడికి పంపాలంటే భయం,ఆపేస్తే చదువు ఏమైపోతుం దోనని ఏపీలో తల్లితండ్రులుదిగులు పడుతున్నారు. ‘మాపిల్లల్ని స్కూల్‌కు పంపినా పంప కపోయినా మేం తప్పుచేసినట్లే. స్కూల్‌కి పంపించాక కరోనా వచ్చినా,పంపించక చదువులో వెనుకబడినా తల్లిదం డ్రులుగా సరైన నిర్ణయం తీసుకోలేక పోయా మని మమ్మల్నే అంటారు. ఇలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’.కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ పిల్లలు బడికి హాజరు కావడం తప్పనిసరి. ఇప్పటీకే చాలా మంది పిల్లలు బేసిక్స్‌ మరిచిపోయారు. వాళ్లకు అదనపు సమయం కేటా యించి బ్రిడ్జ్‌ కోర్సులు చెప్తున్నాం’’అని విశాఖ పెద జాలారిపేట ప్రాథమిక పాఠశాలటీచర్‌ రవి అన్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయని తెలు స్తోంది.
చదువులో వెనుకబడుతున్నారు
చాలా కాలంగా బడులకు దూరమైన పిల్లల చదువులో ఇప్పటికే వెనకబడిపోయారు. చాలా మంది ఇంతకు ముందు నేర్చుకున్నవి చెప్ప లేకపోతున్నారు. కొందరు అలవాటు తప్పడంతో ఏం చెప్పాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. కొందరు పిల్లలు తెలిసినవి గుర్తు తెచ్చుకోవడంలో ఆలస్యం అవుతోంది. పిల్లల్లో సమస్య అయితే ఉంది. మరోవైపు కార్పొరేట్‌ స్కూళ్ల లో చదివే పిల్లలతల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు ఇంటి దగ్గరైనా మంచి శిక్షణ ఇవ్వగలుతున్నారు. కానీ,ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు అన్‌లైన్‌ క్లాసులు, తల్లిదండ్రుల శిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించి తరగతులు నిర్వహించాలి అని ఏపీ మున్సి పాల్‌ టీచర్స్‌ఫేడరేషన్‌ (ఎఫ్‌ఏపీటీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి సిద్ధార్ధ్‌ చెప్పారు. ఏ ప్రభుత్వ పాఠ శాలకైనా అక్కడున్న విద్యార్థులు, పాఠశాల విస్తీర్ణం లెక్కల ప్రకారం ప్రభుత్వం గ్రాంట్‌ రిలీజ్‌ చేస్తుంది. దానిని స్కూల్లోని మరుగుదొడ్లు పరిశుభ్రత, కరెంట్‌ బిల్లులు చెల్లింపులు,ఇతర అవసరాలకు వాడుతుం టారు. ఈనిధులనే కరోనా సమయంలో శానిటైజర్లు, మాస్కులుకొనడానికి వాడమంటున్నారని…కానీ నాడు-నేడు పథకంప్రారంభమైన తర్వాత ఆ నిధులు విడుదల కావడం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి.‘‘థర్డ్‌ వేవ్‌ నేపథ్యంతో ప్రతి పాఠశాలకు సబ్బులు,శానిటైజర్లు,మాస్కులు,థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్‌ లను పాఠశాల అభివృద్ధి నిధులతో కొనుక్కోమని అంటున్నారు. నాడు-నేడు పథకం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధినిధులు ఇవ్వడం లేదు. ఒకటి రెండు నెలలంటే,టీచర్లు తలాకొంత వేసుకుని భరించగలం.కానీ నెలనెలా అంటే కష్టమవుతుంది. అలాగే రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకున్న టీచర్లతోనే టీచింగ్‌ చేయించాలి. టీచర్లందరికీ వందశాతం వ్యాక్సినేషన్‌ వెంటనే పూర్తి చేయాలి.మిడ్‌ డే మిల్స్‌ కూడా కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశ ముంది.అందుకే పిల్లలకు డ్రై రేషన్‌ ఇవ్వడం మంచిదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. శ్రీకాకుళంలో 57,విజయనగరం31,విశాఖలో 68, తూర్పుగోదావిరిలో 49,పశ్చిమగోదావరిలో48, కృష్ణాలో36,గుంటూరులో55,ప్రకాశం13, నెల్లూరు 30,చిత్తూరు55,కర్నూలు44,కడప 42, అనంత పురం28…ఇలామొత్తం556మంది ఉపాధ్యా యులు కరోనాతో చనిపోయారు. ఇటీవల మరణిం చిన వారిని కూడా కలుపుకుంటే మరో 20శాతం పెరుగుతారు.విద్యార్థుల్లో కూడా కొందరు చనిపో యారు. అయితే ప్రస్తుతం పిల్లలు,ఉపాధ్యాయు లలో ఒకరినుంచి ఒకరికి కరోనాసోకకుండా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ పాఠాలు చెప్తున్నాం. అయినా భయం వెంటాడుతూనే ఉంది అని ఎఫ్‌ఏపీటీవో ప్రతినిధి రవిసిద్ధార్ధ్‌ చెప్పారు.
కొన్ని స్కూళ్లలో భయాలున్నా…హాజరు పెరిగింది
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలాఎక్కువ ప్రాణాలు బలి తీసుకుంది. అందుకే, సెకండ్‌ వేవ్‌ తర్వాత బడులు ప్రారంభిచగానే తమపిల్లలను పంపించడానికి తల్లి దండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే క్రమంగా హాజరు శాతం పెరిగింది. అదే సమయం లోనే కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ వార్తలు వస్తుండటం వారిలో ఆందోళన కలిగిస్తోంది. బడులు ప్రారం భించినప్పుడు 20శాతం మాత్రమే హాజరయ్యారు. అలా పిల్లల హాజరు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 85శాతానికి చేరుకుంది. మళ్లీఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయం మొదలైంది.కోవిడ్‌ భయంతో స్కూళ్లు మూసేస్తే, ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతారు.అయితే,ప్రభుత్వం కోవిడ్‌ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంది. తల్లిదం డ్రులు ఎలాంటి సంకోచం లేకుండా తమ పిల్లలను బడికి పంపవచ్చు అని విశాఖ జిల్లా విద్యాశాఖా ధికారిణి ఎల్‌.చంద్రకళ చెప్పారు. కరోనా నిబం ధనల అమలుకు పాఠశాలల రీ ఓపెన్‌ మార్గదర్శ కాలు జారీ చేశాం. వీటి అమలుపై కూడా పర్య వేక్షణ ఉంది. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం బడుల్లో తరగతులు నిర్వహించాలి. అలాగే, ఏదైనా పాఠశాలలో ఐదు కంటే ఎక్కువ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వస్తే క్వారంటైన్‌ పీరియడ్‌ కింద 14రోజు లు మూసివేస్తున్నామఅని విశాఖ డీఈవో వెల్లడిర చారు. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో పిల్ల లను స్కూళ్లకు పంపడం ఎంతవరకు సేఫ్‌ అనే ప్రశ్న తల్లిదండ్రులను వేధిస్తోంది. స్కూళ్లకి పంపక పోతే పిల్లలు విద్యాసంవత్సరం నష్టపోతారనే భయం,పంపితే కరోనా వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. కరోనా భయం ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని మా పిల్లలను బడికి పంపుతున్నాం. అయితే స్కూల్‌ గేటు దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌,మాస్కులు వంటివిచూస్తున్నా…బడి లోపల,తరగతి గదుల్లో ఎలాఉంటుందో…? అక్కడ పిల్లలు ఎలా ఉంటున్నారోననే అందోళన ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించకపోవడం కూడా చూస్తున్నాం అని విశాఖ మురళీనగర్‌ కు చెందిన సరళ చెప్పారు. సరళ కూతురు చాందిని మాధవదార జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది.ఆన్‌లైన్‌ తరగ తులే మంచిదని సరళ భావిస్తున్నారు. మా పిల్లలు చదివే స్కూల్లో టీచరుకు కరోనా వచ్చింది. ఆ సమయంలో చాలా టెన్షన్‌ పడ్డాం. మా పిల్లలకు కూడా వచ్చిందేమోనని అనుకున్నా. మా అమ్మనాన్న కూడా పిల్లలను బడికి పంపివాళ్ల ప్రాణాలతో ఆడుకుంటారా అని తిట్టారు. దాంతో మేం చేస్తున్నది సరైనదో,కాదో అర్థం కావడంలేదు. అన్‌లైన్‌ తరగ తులే బెటరని మాకు అనిపిస్తుంది అన్నారు. ఏదైనా స్కూల్లో విద్యార్థులు,ఉపాధ్యాయుల్లో కరోనా పాజి టివ్‌ వస్తే, అది ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో తెలుసుకోవడంకష్టం.పైగా బడిలోకరోనా సోకిం దా? కరోనాతో స్కూలుకు వస్తే, అది మిగతావారికి వచ్చిందా?అనేది చెప్పడం కూడా కష్టమని వైద్యులు అంటున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో పెద్దలు,సెకండ్‌ వేవ్‌లో యువత,మధ్యవయస్కులు కోవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పుడు వీరిలో చాలా మందికి వ్యాక్సినేషన్‌ అవ డంతో,థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపే అవకా శం ఉంది. బడులకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు, మిగతా సభ్యులందరూ వ్యాక్సీన్‌ వేయించుకున్నారా అనేది తెలుసుకోవాలి.ఆడేటా ప్రతిస్కూల్లో ఉం డాలి. రెండు డోసుల వ్యాక్సీన్‌ వేసుకోని తల్లిదం డ్రుల పిల్లలను బడికి పంపించకూడదు. లేదంటే వారి నుంచి పిల్లలకు…వారి నుంచి మిగతా పిల్ల లకు కరోనా సోకే అవకాశం ఉంది అని విశాఖ లోని చిన్నపిల్లల వైద్యులు సతీష్‌ చెప్పారు. పిల్లలకు కరోనా గురించి అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని డాక్టర్‌ సతీష్‌ భావిస్తున్నారు. ప్రతి స్కూల్లో వారానికి ఒకసారి కరోనా టెస్టులు చేయాలి. అదే సమయంలో సోషల్‌ డిస్టైన్సింగ్‌, శానిటైజేషన్‌, మాస్కులు ధరించడం లాంటి అంశాలపై తరగతి గదుల్లో పిల్లలతో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలి. కోవిడ్‌ ప్రొటోకాల్‌పై అవగాహన లేని పిల్లలకు శిక్షణ ఇవ్వాలి అన్నారు. అయితే కోవిడ్‌ నిబంధ నలు పాటించకపోతే ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌లో పిల్లలపై ప్రభావం అధికమయ్యే అవకాశాలున్నాయని డాక్టర్‌ సతీష్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కోవిడ్‌ ప్రొటో కాల్‌ పాటిస్తున్న వారి సంఖ్య తగ్గిపోయిందని అన్నా రు. ఏదిఏమైనా కనీసం మరోఏడాది పాటైనా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించడం మంచిదని ఆయన సూచిం చారు.జిఎన్‌వి సతీష్‌