పీసా చట్టం`గిరిజనులకు వరం

రెండున్నర దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. ముఖ్యంగా ప్రముఖ విశ్రాంతి ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బీడీ శర్మ,ఎస్‌ఆర్‌ శంకరన్‌,దిలీప్‌ సింగ్‌ భూరియా వంటి గిరిజనతెగల స్పూర్తిదాతల సహకారం కూడా మరవలేనిది.73వ రాజ్యాంగ సవరణలో 1991లో అమలులోకి వచ్చిన పంచాయితీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీఫ్‌సింగ్‌ భూరియా నేతృత్వంలోని ఓకమిటీని నియమించింది. కమిటి సీపార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారు. ఈచట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు,అటవీ సంపదపై యాజ మాన్యహక్కులు కలిగి ఉంటారు.ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించు కుంటూ,గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు,వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, నష్టపరిహారం పంపిణీ,గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక,ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన,ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. అంతేకాదు ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లబ్దిదారుల గుర్తింపు,చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ,నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించబడ్డాయి.

ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధి కారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటు హక్కు కలిగి ఉన్న నివాసితు లంతా గ్రామసభ పరిధిలోకి తీసుకొచ్చిన పీసా చట్టం వచ్చి 25 ఏళ్లు పూర్తియింది. అయినా సరే నేటికీ చట్టం లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు పర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను గ్రామాల సమగ్ర అభివృద్ధి, గ్రామీణుల సాధికారత కోసం గ్రామ పంచాయతీలకు మార్గనిర్దేశం చేయ డంలో ప్రభుత్వ వ్యవస్థలు దీర్ఘకాలంగా విఫలమవుతూనే ఉన్నాయి. కొండ, కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్‌- షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం-1996) అమలులోకి వచ్చి పాతికేళ్లయింది. ఆదివాసుల జీవనోపాధుల మెరుగుదల, అటవీ హక్కుల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి తదితర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే పీసా చట్టం స్ఫూర్తిని ఇన్నేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయనే చెప్పాలి. గ్రామసభల స్ఫూర్తికి తూట్లుపంచాయతీ రాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకే రీతిన అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతో పాటు, వారి మద్దతు సంఘాలు పెద్దయెత్తున ఉద్యమించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా ఆధ్వర్యంలో 73వ రాజ్యాంగ సవరణతో 1992లో అమలులోకి వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టంపై ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని (పంచాయతీ రాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల విస్తరణ చట్టం) ఆమోదించింది. దాంతో ఆదివాసీ ప్రాంతాల్లో పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలను కేంద్ర బిందువుగా మార్చారు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌,రaార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌,మహారాష్ట్ర,కర్ణాటక, కేరళ, బిహార్‌లలోని షెడ్యూలు ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామసభలకు ఆ ప్రాంతంలోని సహజ వనరులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి.జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. విద్యా, వైద్య కేంద్రాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహార పంపిణీ, గనుల తవ్వకాలకు అవసరమైన లీజుల మంజూరుకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. ఆవాసాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనబీ గిరిజనాభివృద్ధి ఉప ప్రణాళిక నిధులను ఖర్చు చేసేందుకు తప్పనిసరిగా గ్రామసభల పాత్ర ఉండాలి. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు,మద్యం అమ్మకాలు,వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ తదితర విషయాల్లో గ్రామసభలకు పూర్తి అధికారాలు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసు కోవాలి.అమలులో అశ్రద్ధమహోన్నత లక్ష్యాలతో అమలులోకి తెచ్చిన పీసా చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని అశ్రద్ధ కనబరుస్తున్నాయి. చట్ట నియమాల రూప కల్పనలో ఏళ్ల తరబడి కాలయాపనవల్ల అసలు లక్ష్యం పూర్తిగా నీరుగారింది. తెలుగు రాష్ట్రా లకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1996లో చట్టం అమలులోకి వచ్చిన 15ఏళ్ల అనంతరం అంటే 2011లో సంబంధిత నియమ నిబంధనలు రూపొం దించింది. ఆ నియమాలు వచ్చిన రెండేళ్ల తరవాత 2013లో గిరిజన సంక్షేమ శాఖ- జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను ‘నోటిఫై’ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ‘పీసా’ అమలు ద్వారా గిరిజన ప్రాంతాల్లో గ్రామసభలకు హక్కులు వర్తింపజేసే ప్రయత్నమే జరగలేదు.పాతికేళ్లయినా..చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లు అవుతున్నా ఛత్తీస్‌గఢ్‌, రaార?ండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటివరకు చట్ట నిబంధనలను రూపొందించుకోలేదు. గుజరాత్‌లో అక్కడి అయిదో షెడ్యూలు ప్రాంతాల్లోనూ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని అమలుచేస్తున్నారు. ‘పీసా’ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించుకోవడంతో దాని అమలు తీరే మారిపోయే దుస్థితి దాపురించింది. షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకోసం భూసేకరణకు ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టువల్ల ప్రభావితమయ్యేవారికి నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఆ నిబంధనను అనేక రాష్ట్రాలు తమ ఇష్టానుసారం అన్వయించుకుని గ్రామ సభల హక్కులను నిర్వీర్యం చేశాయి. గనుల లీజులు, నీటిపారుదల నిర్వహణ,అటవీ ఉత్పత్తుల యాజమాన్యం… ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు శాసనాల్లో మార్పులు తీసుకువచ్చి గ్రామసభల ఉనికినే అపహాస్యం చేస్తున్నాయి.హక్కులతోనే వికాసందేశంలో అత్యంత వెనకబడిన జిల్లాలన్నీ దాదాపుగా ఆదివాసీ ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లోనే వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉంది. అందుబాటులోని వనరులపై హక్కులు కల్పించి, వారికి గ్రామసభల స్థాయిలో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వ్యయం, సంక్షేమ ఫలాల పంపిణీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పరిపాలన, కట్టుబాట్లు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు క్లిష్టంగాను, భిన్నంగాను ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యథావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాల పరిస్థితి దశాబ్దాలుగా గందరగోళంగా తయారైంది. గ్రామసభలను విస్మరించడం ఆదివాసుల్లో అసంతృప్తికి, అశాంతికి దారితీస్తుందని ఇప్పటికే అనేక ఉన్నతస్థాయి కమిటీలు కేంద్రానికి నివేదించాయి. గిరిజన ప్రాంతాల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌’ అధ్యయనంబీ రెండో పాలన సంస్కరణల కమిషన్‌, ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీబీ భూ పరాయీకరణ, నిర్వాసితుల సమస్య, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవ చంద్ర కమిటీలు- ‘పీసా’ను పటిష్ఠంగా అమలు చేస్తేనే, ఆదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి.నిర్వీర్యమవుతున్న రాజ్యాంగ రక్షణ కవచాలుపీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల అమలుకు రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యవస్థాగత యంత్రాంగమే సిద్ధం కాలేదు. దీంతో రాజ్యాంగ రక్షణ కవచాలు కాస్తా చేవ తగ్గి నిర్వీర్యం అవుతున్నాయి. పీసాతో సహా ఇతర గిరిజన రక్షణ చట్టాలు, సంబంధిత నిబంధనలపై శిక్షణ, అవగాహన పెంచే బాధ్యత, అమలు తీరును పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతి, పరిశోధన, శిక్షణ సంస్థలు సరిపడా సిబ్బంది, తగిన నిధులు లేక సతమతమవుతున్నాయి. పీసా చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంలోనైనా గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. కొత్తగా కొలువుతీరిన తెలుగు రాష్ట్రాల పంచాయతీ పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామీణ సభల కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలి. మరోవంక రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చి పీసా అమలుకు వాటిని సిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది!

గ్రామసభ, విధులు…

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మొదటి గ్రామసభ నిర్వహించడానికి డిప్యూటీ తహశీల్దార్‌ హోదాగల అధికారిని నియమించాలి. గ్రామసభ సమావేశానికి సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తాడు. సర్పంచ్‌ లేనప్పుడు గ్రామపెద్ద అధ్యక్షత వహించవచ్చు. మెజార్టీ గ్రామసభ్యుల్లో 1/3వంతు తక్కువ కాకుండా కనీసం 50శాతం మంది ఎస్టీ సభ్యులు హాజరైతేనే కోరంగా పరిగణిస్తారు. మెజార్టీ గ్రామసభ్యులు చేతులెత్తి ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. వీరికి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. ఏడాదికి రెండు సార్లు గ్రామసభ నిర్వహించాలి.గ్రామసభ అనంతరం నిర్ణయాలను నిర్వహణాధికారి చదివి, వినిపించి సభ్యుల ఆమోదం పొందాలి. సభ్యుల సంతకాలు విధిగా తీసుకోవాలి. ఈ తీర్మాణాలను నాలుగు వారాల్లోపు గ్రామసభ కార్యదర్శి సంబంధిత ప్రభుత్వ శాఖలకు, సంస్థలకు పంపాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పాధక ప్రణాళికలు, ఉమ్మడి భూముల జాబితా, ఇంటి స్థిరాస్తుల యాజమా న్యాల బదలాయింపులు, పంచాయతీ లెక్కల ఆడిట్‌ నివేధికలు, చౌకధర దుకాణం, అంగన వాడీ, సబ్‌సెంటర్‌, పాఠశాలల పనితీరు, సంక్షేమ హాస్టళ్ళ పనితీరు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామసభ జోక్యం చేసుకోవచ్చు.

భూసేకరణ, గిరిజన భూమి అన్యాక్రాంతం

ఏదైనా చట్టం కింద ప్రభుత్వం,సంబంధిత అధికారి భూసేకరణ ప్రతిపా దించినట్లైతే గ్రామసభ ద్వారానే జరగాలి. ప్రతిపాదిత భూసేకరణ, కొత్తగా స్థిరపడిన ప్రజలు, సమాజంపై చూపే ప్రభావం, ఉద్యోగవకా శాల పై గ్రామసభ పరిశీలన చేసి వాస్తవాలను పరిశీలించి భూసేకరణకు సిఫారసు చేయాలి. దీని ద్వారా నిర్వాసిత వ్యక్తుల పునరావాస ప్రణాళిక విషయంలో మండల ప్రజాపరిషత్‌ సిఫారసు చేయాలి. అట్టి మండల పరిషత్‌ సిఫారసులను భూసేకరణ అధికారి పరిగణలోకి తీసుకోవాలి. అంగీకరించని పక్షంలో మరోసారి పరిశీలన కోసం భూసేకరణ అధికారికి పంపాలి. రెండో సారి సంప్రదింపుల అనం తరం మండల ప్రజాపరిషత్‌ సిఫారసులకు వ్యతిరేకంగా ఉత్తర్వులను భూసేకరణ అధికారి జారీ చేసినట్లైతే అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలి.

ఖనిజాల వెలికితీత అనుమతులు, మద్యపాన నిషేద అమలు, క్రమబద్దీకరణ, అమ్మకాలపై ఆంక్షలు విధించ డం, మండల పరిషత్‌ అధికారాలు, నిధులు, ఎక్సైజ్‌శాఖ కింద మద్యం దుకాణాలు తెరవడానికి లైసెన్స్‌ పొందడం వంటి వాటన్నింటికీ ఈ పీసా చట్టం వర్తిస్తుంది. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గిరిజన భూమి అన్యాక్రాంతం కాబడితే చట్టబ ద్దంగా తిరిగి స్వాదీనం చేసుకోవడం, గిరిజనులతో చేసే వడ్డీ వ్యాపారంపై నియంత్రణ అధికారం పూర్తిగా ఈ పీసా చట్టం పరిధిలోకే వస్తాయి. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, విక్రయాలు ఉదా:- వెదురు, బీడీ ఆకుల మినహా చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, జిసిసికి ఉన్న హక్కులు గ్రామసభకు లోబడే ఉంటాయి.

వారపు సంతల నిర్వహణ..

షెడ్యూల్‌ ప్రాంతంలో గ్రామసంత లు నిర్వహించడానికి గ్రామ పంచాయతీ యే మార్కెట్‌ కమిటీగా ఉంటుంది. వారం వారం జరిగే సంతల్లో ఆ మార్కెట్‌ కమిటీ గా ఆయా గ్రామపంచాయతీలు విధులు నిర్వహిస్తాయి. స్థానిక గిరిజనులకే లైసెన్సు లు మంజూరు చేయాలి. మార్కెడ్‌యార్డుల నిర్వహణ, పోషణ, లావాదేవీలు, తాత్కాలి క నిలుపుదల, మూసివే యడం, ప్రారంభిం చడం, క్రమబద్దీకరించడం కమిటీలకు అధికారం ఉంటుంది. గ్రామపంచా యతీల ద్వారా అన్ని విద్యా సంస్థల పరిపాలన నివేధికలను కోరే అధికారం మండల పరిషత్‌కు ఉంటుంది. మండల పరిషత్‌ పరిధిలోగల అన్ని విద్యా సంస్థల బడ్జెట్‌ను మే 31 నాటికే ఆమోదించాలి. సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో విద్యార్థు లకు ఆహార సరఫరా, ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణ ను చట్టం కింద పర్యవేక్షించాలి. పంచాయ తీరాజ్‌ సంస్థలు తమ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలు, సంస్థలకు మద్ధతును, అంగన్‌వాడీ బడ్జెట్‌ను, జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ పథకం అమలు, పరిరక్షణ బాధ్యత చట్టం పరిధిలోనే ఉంటాయి..

పీసా పరిధిలోకి వచ్చే చట్టాలివే…

పీసా చట్టం పరిధిలోకి ఈ క్రింది చట్టాలు వస్తాయి. గనులు, ఖనిజాల (క్రమబద్దీకరణ, అభివృద్ధి) చట్టం 1957. ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత భూబదలాయింపు క్రమబద్దీకరణ నిబంధనలు 1959, షెడ్యూల్డ్‌ ప్రాంత వడ్డీవ్యాపార నిబంధనలు 1960, వ్యవసాయ ఉత్పత్తుల పశుగణన చట్టం 1966, అటవీచట్టం 1967, ఎక్సైజ్‌ చట్టం 1968, గిరిజన రుణవిమోచన రెగ్యులేషన్‌ చట్టం 1970, వాణిజ్య క్రమబద్దీకరణ నిబంధనలు 1979, అటవీ సంరక్షణ చట్టం 1980, విద్యాచట్టం 1982, సాగునీటి వ్యవస్థల నిర్వహణ చట్టం 1997, పంచాయతీరాజ్‌ సవరణ చట్టం 1998, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 చట్టాలు అమల్లో పీసా చట్టం ద్వారా గ్రామసభలు నిర్వహించి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.- గునపర్తి సైమన్‌