అరకులోయలో ఆదివాసీల అంతరంగం

“చూసే కళ్ళకు మనసుంటే-ఆ మనసుకు కూడా కళ్ళుంటే’పనిమట్లు, విత్తనాలు, ధింసా ఆటలు, గిరిజనుల జీవితం చిత్రించే బొమ్మల కొలువులు.. ఇవి అరకులోయ మ్యూజియంలో. చుట్టూ కాఫీ తోటలు, జలపాతాలు, బొర్రా గుహలు,బొంగుచికెన్‌ వంట కాలు కనిపిస్తాయి. కాని తెలుసు కుంటే కాని తెలియనివి,పల్లెలలో ఏడాది పొడుగునా గిరిజనులు చేసుకునే పనిపాట్లు,కట్టుబాట్లు,రాజులు/ప్రభు త్వాలు, ప్రజల మధ్యసంబంధాలు, పండుగలు, మొక్కులు, వంటలు, కష్టసుఖాలు.వాటిలో రాగం,తానం, లయలవలె అల్లుకుపోయిన ఆటపాటలు,కధలు,సామెతలు సాహిత్యం,లెక్కలు,ఆశయాలు ఆదర్శాలు….! అరకు,ఒడియా గిరిజన మాండలికం మాట్లాడే బగతలు, కొటియాలు,కొండదొరలుబీ తమ,తమ భాషలుగల కోదు(సామంత),పోర్జా/జోడియా వగైరా తెగలు నివసించే అరకులోయ బహుభాషల ప్రాంతం.”
అరకులోయలో జీవితకాలం గిరిజనాభివృద్ధికి పనిచేసిన కెనడా దేశీయుడు గుస్తాఫ్‌, ఆదివాసీ ఒడియా,తెలుగు అనువాదంతో తయారుచేసిన ‘ఆదివాసీ పండుగలు’ను 1976 లో పాడేరు గిరిజనాభివృద్ధి సంస్థ ప్రచురించింది. 76-82 మధ్య శక్తి శివరామకృష్ణ సేకరించిన తెలుగు గిరిజన గీతాలు’ మీద, 1991లో సమత రవి ఏర్పాటుచేసిన ప్రసంగాన్ని విన్న, నాటి ప్రాజెక్ట్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌, 200 కాపీలు కొని ఉపాధ్యాయులకు పంచిపెట్టారు. దాన్ని పరివర్ధిత ముద్రణగా తెచ్చే ప్రయత్నంలో 2002లో పాడేరు చుట్టూ తిరుగుతున్నప్పుడు, అప్పుడు Aష్‌ఱశీఅ ఎయిడ్‌లో, ఇప్పుడు అజిత్‌ ప్రేమ్‌జీ (Ajaఎ ూతీవఎjఱ) ఫౌండేషన్‌లో పని చేస్తున్న మిత్రుడు రఘు దగ్గర ఈగుస్తాఫ్‌ పుస్తకం దొరికింది.
ఇదేకాక తెలుగేతర తెగఅయిన కొంధులమీద ప్రముఖ భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి 1960 లో అధ్యయనం చేసారు. 65లో ఈ తెగలన్నిటిమీద జనగణన,ఎథ్నోగ్రాఫిక్‌ నోట్స్‌ తో పాటు,కొండిబా,లంప్తాపుట్టు, జెర్రిల, అన్నవరం గ్రామాలమీద మోనోగ్రాఫ్‌లు ప్రచు రించింది. కొండదొరలమీద రాఘవరావు 75 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్‌ పొందారు.1863,1907లో వచ్చిన విశాఖ డిస్త్రిక్‌ గజెటిర్‌లోగల అన్నిరంగాల చరిత్ర వీటన్నిటికి పునాది.నేటి అనంతగిరి,అరకు, డుంబ్రిగూడ,పెదబయలు,ముంచెంగిపుట్‌ మండలాలు,హుకుం పేట మండలంలో పెదగరువుదాకా,కొండదొరలు పాలించిన ఒక నాటి ఒడిశా జేపోర్‌ సంస్థానంలో పాడువా తాలూకాలోనివి. స్వతంత్రం తరువాత ఈ తాలూకాలో ఈమండలాలు ఆంధ్రప్రదేశ్‌ లో కలిసిపోయాయి. ఆ సంస్థానం ఆఖరి పాల కుడు విక్రమదేవవర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రోచాన్సెలర్‌. వారి బంధువులు కురుపాం, మేరంగి,సాలూరు,ఆంద్ర,పాచిపెంట పాలకులు, తమ రాజ్యాలను ప్రగతి పధంలో నడిపిస్తూ, దిగువనున్న విజయనగరం,బొబ్బిలి సంస్థా నాలకు పోటీగా,విశాఖనగరం అభివృద్ధి చేసారు. ఇక్కడి ఒకనాటి కాశీపట్నం జమిందారీలోది,ఘాటీ ఎక్కుతుంటే వచ్చే, అనంతగిరి మండలంలో పుణ్యగిరి తీర్ధం/ధారల గంగమ్మ. అక్కడ గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌లో ‘విరాట పర్వతం’అని ఎవరో నోట్‌ చేసారు. నిజమే. ఈ ప్రాంతం 14శతాబ్దివరకు వడ్డాది రాజధానిగా పాలించిన మత్స్యరాజుల విరాట రాజ్యం. వారూ ,జేపోర్‌ వారు బంధువులు. విరాటరాజ్యంలో అజ్ఞాత వాసం గడుపుతున్న పాండవులుగా గిరిజనులు తమను పోల్చుకుంటూ ‘పంచ పాండవుల పంట-దుర్యోధనుడి వంట’ అంటూ భారతకదను తమకు అనువుగా మార్చుకుని పిప్పలి, పసుపు,చిక్కుళ్ళు,అల్లం,అనాస వగైరా తము ప్రత్యేకంగా పండిరచే పంటల దోపిడిని ‘నందిపదం’లో పాడుకుంటారు.ఆసియా అంతా, పాండవులు, వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉన్నారు.అలాగే ధారల గంగమ్మ, అటువంటి క్షేత్రమే పాడేరు మండలంలో మత్స్యగుండం. ఈ నీటి వనరులు ప్రపంచ మంతా జలకన్యలవి, (ఙఱతీస్త్రఱఅం, అవఎజూష్ట్రం, ఎవతీఎaఱసం), క్రూరజంతువులతో నిండిన అడవులు కొండ రాజులు/దేవతలవిగా భావించి మొక్కే, మన ఆచారాల మూలాలు,గిరిజన సంస్కృతిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ‘తెలుగు గిరిజన గీతాలు’(91),పరివర్ధిత ముద్రణ ‘కొండకోనల్లో తెలుగు గిరిజ నులు’ (2007) తెలుగు తెగల ఈ వారసత్వాన్ని, నందిపదం వంటి వారిసాహిత్యంలో వ్యవసాయ విజ్ఞానం, సంస్కృతిని సమగ్రంగా తెలియచేస్తూ అరకులోయ సంస్కృతినికూడా అర్ధం చేసుకోటానికి సహకరిస్తుంది. తెలుగు గిరిజనుల నుడికారం తెలిస్తేనే,ఇతర తెగల భాషలు మనకు బాగా తెలుస్తాయి అంటారు భద్రిరాజు కృష్ణమూర్తి.. ఇక గుస్తాఫ్‌ పుస్తకం గిరిజన జీవితాన్ని నెలలవారీగా వర్ణిస్తూ, మనకు తెలియని గిరిజనుల ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. సహజ వ్యవసాయ విధానం అమలు చేస్తున్న మితృలకోసం ఇక్కడి వ్యవసాయ సంస్కృతిని పరిచయం చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్న గిరిజనులకోసం,ఈ పుస్తకాన్ని ముందు సంక్షిప్తంగా పరిచయం చేసి, క్రమంగా మిగిలిన పరిశోధనలను జోడిరచటం కొన సాగుతుంది..
చైత్రం/ఏప్రిల్‌-మే
‘విరాటరాజు దేశం ఇటికె పండుగలు, కాశివారి దేశం గంగ పండుగలు’ అని నందిపదం’లో పాడుకునే, ఈ నెలలో చేసే ఇటుకల/వేటల పండుగ గిరిజనులకు పెద్ద పండుగ .ఈ నెలలో ఆడవాళ్లదే రాజ్యం.ప్రతి ఇంటి మగ వాడు, తెల్లవారగానే ఆడవాళ్లు ఊగటానికి ఉయ్యాల కడతాడు.మగవారిని వేటకోసం కొండకు తరిమాక,ఆడవారు పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఈ పండుగకుముందు, కొండమామిడికాయలు తినరు.ఫాల్గుణం/పొగు నులో హోలీ కాల్చిన రోజునుండి పాడే సంగడి ఆటపాటలు ఈ నెలతో ముగుస్తాయి.ఆటకు రానివారిదగ్గర ఆడవారు పన్ను(పెజోర్‌) వసూలు చేస్తారు.మఖ,కృత్తిక,చిత్త.స్వాతిు-ఇలా ఎవరికి ఏ నక్షత్రం అనుకూలమో చూసి విత్తనాలు వేసుకుంటారు.
వైశాఖం మే-జూన్‌
ఈ నెల వేసగిలో వర్షాలు వడగండ్లతో పడతాయట.పెళ్ళిళ్ళ కాలం.ప్రకృతి అంతా పెండ్లిలో అయిరేని/బోయ్‌ కుండలలాగా రంగురంగులతో నిండి ఉంటుంది.వేటలు ముగుస్తాయి. గొట్న పండుగ చేసి,తోపహల్వా వండి, గౌడు పశువులకాపు మొదలు పెడ తాడు.గొట్న అంటే భోజనంకుండ. ఈ పండుగ తరువాతే పొలంపనిచేసే వారికి భోజనం తీసుకెళ్లటం మొదలు పెడతారు. పుష్య మాసం లో నియమించుకున్న పని వాళ్ళందరికీ ఆయా పొలాలు కేటాయిస్తారు.ఇటుకల పండుగలో వసూలు చేసిన పన్ను డబ్బులతో ఆడవారు పిట్టు వండుకుంటారు.
లండిజేట్‌/జ్యేష్టం
లండి/సామ పొట్టిజడలు వేస్తుంది.ఈనెలలో పొర్ణమి అయ్యాక సామలుచల్లరు.మెట్టుధాన్యం, చోడిలాంటి కొద్దిరోజుల పంటలు చల్లుతారు. ఆషాఢంబీమేఘాలు కమ్మి వర్షాలు కురుస్తాయి. గింజలు నూర్చేటప్పుడు పంట దిగుబడి ఎక్కువ గా ఉండాలని జన్ని పండుగ చేస్తారు. అడవి జంతువుల బారిన పడకుండా వచ్చిన పశువులకు నైవేద్యం పడతాడు.సామ పంటతో పూజారి నైవేద్యం పెడతాడు.
భాద్రపదం/బందపని
జాకరిమెట్టలో కొర్రపంటకు కొత్తల పండుగ చేసారు. కొత్తకుండ,కొత్తజిబ్బి,కొత్త తెడ్డులతో, తరగాయ్‌ దుంపలు,గుమ్మడికూర,కొత్త చింత కాయజాకరికి పెడతారు.’లోల్లోసే అన్నవారికి లోపలొక పిల్ల,సైలోరే అన్నవారికి చంకనొక పి ల్ల’లోల్లోసి/సైలోరి పాటలు మొదలుపెడతారు.
ఓస/ఆశ్వయుజం
పెద్ద పెద్ద వర్షాలు కురుస్తాయి.కొత్తధాన్యం అందుతుంది. పాలకులలో ఇసుకపోసి విత్తనాలు వేసి,పసుపునీళ్ళతో పెంచి మొలకె త్తాక ఆ పువ్వులను బల్లి/లక్ష్మి పువ్వులు అంటారు.ఆ పూలతో నేస్తం కట్టుకుంటారు. బల్లిపాటలు పాడతారు.ఈ నెలనుండి చలి మొదలవుతుంది. పంటలు నేలకొరిగి పరుచు కుని పోతాయి.ఓస అంటే ఒడియాలో పరుచు కొనుట అని అర్ధం .
దసరా
దసరాలో దుర్గ/మెరియా పడుతుందని నమ్మకం.జంతువులు కూడేనెల.నెలపొడిచి పదిరోజులయ్యాక (దశమి)దసరా పండుగ చేస్తారు.
దీపావళి
పంటలన్నీ పచ్చగా పండుతుంటాయి. జల కన్యల ప్రతినిధి కప్పదేవతకు పండుగ చేస్తారు. దీపావళి నాలుగురోజులు అన్నంపప్పు మాత్రమే తింటారు.
మార్గశిర
మంచు ముద్దలు ముద్దలుగా పడుతుంది.ఇళ్ళు, వాకిళ్ళు అలకటం తలంటి పోసుకోటం,లక్ష్మి దిగుతుంది. మూడురోజులు బల్లి పండుగ చేస్తారు.బల్లి నాటకాలు అడతారు.’బంగరాల బల్లి,బాలగొంతెమ్మ’ అంటూ పాండవుల తల్లి కుంతిని పిలుచుకుంటారు తెలుగు గిరిజనులు
పుష్యం/సంక్రాంతి
దీపావళికి తలస్నానం చేసినప్పటినుంచి మొదలైన దిమ్సా ఆటలు,పాల్గుణ పుష్య మాసాలలో ముగుస్తాయి.డప్పు,ఢంకా,కిరిడి, సన్నాయి,పిల్లనగ్రోవి,జోడుకొమ్ములు వాయిద్యాల కనుగుణంగా14 గతులలో గిరిజన జీవితాన్ని అభినయించేదే ధింసా ఆట..ఆడ వాళ్ళవి సైలోరిపాటలు,మగవాళ్ళది కోలాటం.
మాఘం
‘మాఘంలో మేఘం ఫాల్గుణంలో వర్షం’. పుట్టమట్టితో ఒకనంది/ఎద్దును, దుంపలతో ఒక నందిని తయారుచేసి వాటికీ పెళ్లి చేస్తారు. బస్కి పూలతో నేస్తాలు కట్టుకుంటారు.
ఫాల్గుణం /పొగును.
దీపావళిలో మొదలైన చలి పొగును మంటలో కాలిపోతుంది.నందిపండుగలో ఇచ్చిన విత్త నాలను హోలీ బూడిదలో వేస్తారు.హోలీ పాటలు పాడతారు.దుక్కులు మొదలు పెడతారు.
వ్యవసాయ వారసత్వం సమత టీంలో, దేవుళ్ళు సంజీవని సంస్థ,1990 నుండి రాష్ట్రమంతటినుండి విత్తనాల జాబితా పోగుచేయిస్తున్న డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ స్పూర్తితో డుంబ్రిగూడ మండలంలో ప్రారం భించిన విత్తనాలసేకరణ, పండుగలు చేయ టం,కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందింది.ఈ సొసైటీ కృషిలో సహకరించిన కామేశ్వర శర్మ, రవి విశ్వవిద్యాలయాలలో పర్యావరణ,వృక్ష శాస్త్రవేత్తలు. ఇతర శాస్త్రవేత్తలు,సంస్థలు తమ పక్కనే ఉంటూ చేసినకృషిని,అందరు శాస్త్రవేత్త లలాగే వీరుకూడా పట్టించుకోలేదు భద్రిరాజు కృష్ణమూర్తి నాయకత్వంలో 1960లోనే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రైతులనుండి సేకరించిన పదసంపదతో కూర్చిన వ్యవసాయ మాండలిక వృత్తి పదకోశంలో,427 వడ్లరకాలు,100 రకాల జొన్న,18 రాగి,ఆరికలు 5,కొర్ర 37, ఉలవలు 13,బొబ్బర 8,సెనగలు 8,నువ్వు 19,ఆముదాలు 7,చెరకు 2,పత్తి 12,పొగాకు 15,మిరప 10,కొబ్బరి 51,అరటి 15,నిమ్మ 8 రకాలు పేర్కొన్నారు. అయితే ఈ పదకోశంలో గిరిజనప్రాంతాల వివరాలు లేవు. దేవుళ్ళు వగైరాలు తయారు చేసిన విత్తనాల జాబితా ఈలోటును పూరిస్తుంది.భద్రిరాజు కృష్ణమూర్తి గారి ఇల్లు,నేడు వ్యవసాయరంగంలో పనిచేస్తున్న ‘వాసన్‌’ వగైరాల మాతృసంస్థ Aష్‌ఱశీఅ టశీతీ షశీతీశ్రీస ంశీశ్రీఱసaతీఱ్‌వ పక్కనే ఉండేది.కానీ ఆయన వ్యవసాయపదకోశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ పదకోశాల నిర్మాణంలో పాల్గొన్న చేకూరి రామారావు,బూదరాజు రాధాకృష్ణ పత్రికా రంగంమీద విశేష కృషి చేసారు.కాని వారు ఈ రైతుల పదసంపదను పత్రికలకు గుర్తుచేయ లేదు.Rబతీaశ్రీ సవఙశీశ్రీశీజూఎవఅ్‌,ూబ్‌్‌ఱఅస్త్ర శ్రీaర్‌ ్‌ష్ట్రఱఅస్త్రం టఱతీర్‌(83)బీఖీaతీఎవతీం ఖీఱతీర్‌(89) పుస్తకాలు రాసి, రైతును గూర్చి ముందు తెలుసుకోవాలని ఉద్బోధిస్తూ ూRAవిధానాలను ప్రచారం చేసిన రాబర్ట్‌ చాంబర్స్‌తో పనిచేసిన శాస్త్ర వేత్త సంఘి ( మేనేజ్‌) ఈ సంస్థలతో సన్నిహితంగా పనిచేసేవారు.అప్పట్లో పెర్మా కల్చర్‌ బిల్‌ మోలిసన్‌తో వీరందరూ ఒక కార్య శాల నిర్వహించారు.తూర్పు కనుమలలో చెద పురుగుల సమస్యగూర్చి అడిగినపుడు,చెదలున్న భూముల్లో చింత,పనసలు బాగా వస్తాయి. అవికూడా పంటలే.ప్రకృతికి ఎదురీదవద్దు అని, బిల్‌, హెచ్చరించారు. క్రమంగా ఈ ప్రాధా న్యతలు, పద్ధతులు మారిపోయాయి. అత్యధిక వర్షపాతం పొందే ఈప్రాంతంలో కొండ వాగులు,జోరెలగర్భంలో మళ్ళు కట్టి వరి పండిస్తారు.ఈ జోరెలలోనే నీటిమొక్కలు టవతీఅ, షవషaసలు అనాదిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు, కొండప్రాంతాలలో తీవ్రసమస్య భూమికోతను అరికడుతున్నాయి. వ్యవసాయం పెరిగినకొద్దీ నరికి వేయటంతో ఇవి అంత రించాయి. .హైదరాబాద్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగరత్నం నాయుడు, ఇటువంటి షవషaసలను, అడవులలో దొరికే aతీషష్ట్రఱస పూలను పెంచి అంతర్జాతీయ మార్కెట్‌ లో అమ్ముతున్నారు. జీలుగుకొమ్మలను పోలిన ఈ టవతీఅను గిరిజనులు ‘కన్నెజీలుగు’ (జలకన్యల),నీటిమీద పరుగెత్తే జూశీఅస ంసa్‌వతీ ను ‘గన్నికల పురుగు’ అంటారు. వారి మనో ప్రపంచంలో కప్ప,చేప,ఎండ్రిక మొదలైన జల చరాలు జలకన్యల ప్రతినిధులు.విశాఖ మన్యం లో అత్యున్నత శిఖరంపేరు ‘ఎండ్రిక’ పర్వతం. విశాఖ గజేటిర్‌, జేపోర్‌ రాజులు వారణాసి నుండి మాలీలను రప్పించిపూలు,పొందరల చేత కూరగాయలు ,వ్యవసాయానికి అవసరమైన ఇతర వృత్తులు ప్రోత్సహించారు అని తెలియ చేస్తుంది.. జేపోర్‌, అత్యధిక వరివంగడాలుగల ప్రాంతంగా శాస్త్రవేత్త రిచారియా 1970 లలోనే ప్రపంచానికి చాటారు. హరితవిప్లవం వ్యాప్తిలో పడి నిర్లక్ష్యం చేసిన,ఈ జన్యు సంప దను, ఆ విప్లవ పితామహుడు స్వామినాథన్‌ ఫౌండేషన్‌, ఇక్కడి 340 వరిరకాలు,వాటిలో 24 సువాసన కలవి,27 వరద,2 నిలవ నీళ్ళను,1 కరువును తట్టుకునేవి.8 రకాలు చిరు ధాన్యాలు,9 రకాల పప్పులు,5 నూనె గింజలు,3 పిచు చెట్లు,7 రకాల కూరగాయలు జాబితా ఇంతవరకు తయారు చేసింది.. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఖీAూ), భారతదేశంలోగల మూడుప్రదేశాలలో ఒకటిగా,జేపోర్‌ వ్యవ సాయ వారసత్వాన్నిగుర్తించింది.దశాబ్దాలుగా ఈ అరకులోయలో నేచర్‌,వికాస మొదలైన స్వచ్చంద సంస్థలు నాబార్డ్‌ మొదలైన సంస్థల విధానాలబట్టి వ్యవసాయాభివృద్ధి చేస్తూ , రైతు సంఘాలు నడిపిస్తున్నారు.మారుమూల ఉన్న సొవ్వ పంచాయితీలో పండే కూరగాయలను విశాఖలో అమ్మించటంలో దేవుళ్ళు విశేషమైన కృషి చేస్తున్నారు కాని,రవాణా ఖర్చులు పోగా మిగిలేది తక్కువ అని గిరిజనులు వాపోతు న్నారు. కేరళలో ఈ మాత్రంకూడా భూములు లేని గిరిజనులు ఇంటిచుట్టూ మిరియం పండిర చుకుని గడిస్తున్నారు. ఇక్కడ భూమికంటే అడవి ఎక్కువ.కాబట్టి అటవీ హక్కులగుర్తింపు ద్వారా అడవి కాపాడుతూ లాభం పొందే ప్రయత్నం చేయాలి, ఇందుకోసం గతంలో ధింసా గిరిజన సమాఖ్య 27 పంచాయతిలలోగల 217 అవాసాల సంప్ర దాయ వనరులపటాలు తయారుచేసింది. పోడు భూముల కొలతలు తక్కువగా చూపి నందుకు ఆందోళన జరి గింది.. ఆ కృషిని కొనసాగించాలి.ఆ ప్రయత్నం గ్రామసభలకు ప్రాణం పోస్తుంది. సరిjైున భూమి హక్కుల నమోదు,ఆ పధకాలకు ఇచ్చే రాయితీలను పొందటంలో న్యాయం చేస్తుంది. ‘వాసన్‌’ సొవ్వ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి నిధులకోసం ప్రయత్నిస్తున్నది. గ్రామసభలతో సంబధం లేకుండా తామే లభ్దిదారులను ఎంచుకొని,వారి ఖాతాలో ఇంటర్‌ నెట్‌ ద్వారా పధకాల తాలూకు సొమ్ము జమచేయటం,అవి దక్కించుకోటంలో అవకతవకలు, పడేపాట్లు,లోపాలను ‘నగదు బదిలీ సఫలమా,విఫలమా’ వ్యాసంలో (ఆంధ్రజ్యోతి) లో లిటేక్‌ చక్రధర్‌ ఎత్తిచూపారు. సహజ వ్యవసాయం ప్రకారం పేడపానకం వగైరా తయారుచేయటం గిరిజనులు నేర్చు కుంటుంటే , ఇదే సమయంలో కంపనీలు తయారు చేసిన ఈ పోషకాలనుకూడా అధి కారులు పంచుతున్నారు.సహజ వ్యవసాయం వల్ల పెట్టుబడులు తగ్గాయి కాబట్టి దిగుబడి తక్కువైనా పరవాలేదు అని గిరిజనులు అనుకుంటున్నారు.. గిరిజన సంక్షేమశాఖలో పనిచేసిన అధికారులు ప్రభుత్వకార్యక్రమాలలో తమ అనుభవాలతో అనేక రచనలు చేసారు. కాని వారి రచనలలో గిరిజన సంస్కృతిగూర్చి పొడి మాటలు మించి ఏమీ ఉండదు. అటు వంటి అధికారుల అధ్వర్యంలో నడిచే IుణA పాఠశాలలో చదివి ఉపాధ్యాయుడైన, సవర రచయిత మల్లిపురం జగదీశ్‌ ‘స్వతంత్రం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాలలో,నాలుగు దశాబ్దాల గిరిజనాభివృద్ధి సంస్థల పాలనలో గిరిజనుడి పరాయీకరణ ముమ్మరమైంది. చట్టాల అమలు ప్రశ్నార్ధకమైంది.అతడు లబ్దిదారుగా మారి, దరఖాస్తు దారుగా క్యూలో నుంచున్నాడు. గిరిజనసాహిత్యం అంటే ఉద్యమసాహిత్యం అనే పేరు పడిపోయింది. గిరిజన విద్యాలయాలనుండి, తన సంస్కృతి గురించి చెప్పుకోగల గిరిజన రచయిత ఎందుకు రాలేదు? (‘బహుళ’.పెర్స్పెక్టివ్స్‌ ప్రచు రణ 2019) అని నిలదీస్తున్నాడు.ఇలా.. ప్రజల జ్ఞానాన్ని, సంస్కృతిని పట్టించుకోకుండా, శాస్త్ర వేత్తలు,అధికారులు,సంస్థలు, ఎవరిదారిది వారుగా‘అభివృద్ధి’చేస్తూ జనాన్ని ముష్టివాళ్ళుగా మార్చారు. వీరంతా, ఇటువంటి ప్రశ్నలే వేసుకుని, ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సహజవ్యవసాయం ప్రచారం చేసే ప్రవక్తలు, సంస్కృతి అధ్యాత్మికతలంటూ పెద్ద పెద్ద ఉపదేశాలిస్తారు. వారిలో ఒకరు, వికారా బాదులో ఈ వ్యవసాయంచేసే విజయ రాంగారు, గత సంచికలో తెలియచేసినట్లు, అక్కడ చిరకాలంగా పనిచేసేణణూవలెనే,అక్కడి ప్రజలు పాడుకునే పాటలు,పండుగలు తెలుసు కునే ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రసంగా లలో అక్కడి గ్రామీణులు తలుచుకునే పాండ వులు,పర్వతాల,అనుముల బ్రహ్మారెడ్డివంటి కధలు,కార్తెలు,దుక్కులు,సామెతలేవీ నిపించవు. కొత్త పరిభాషను,పదజాలాన్ని,పండుగలు, యాత్రలను అలవాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారి వీరభద్రుడు తన ‘నేను నడిచిన దారులు’లో, అరకులో అభివృద్ధిని అధ్యయనం చేయటానికి వచ్చిన విద్యార్ధి బృందానికి,పైన చెప్పినట్లు, చుట్టూ కనిపించే విషయాలు వివరిస్తారు. గుస్తాఫ్‌ చేసే అభివృద్ధిని స్కేల్‌ అప్‌ చేయాల్సిన అవసరం బోధిస్తారు. కాని గుస్తాఫ్‌ గ్రంధస్తం చేసిన సంస్కృతి ప్రసక్తి తేలేదు..దేవుళ్ళు క్లాస్‌ మేట్‌,నేడు కాకినాడలో పశుసంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణగారు,తన కుమార్తె అభివృద్ధి (ణవఙశీశ్రీశీజూఎవఅ్‌ ూ్‌బసఱవం) విద్యార్ధి వైష్ణవితో, అరకులోయలోని సొవ్వలో, అనకాపల్లి వ్యవసాయశాఖవారు,పోషక సామగ్రి,పనిముట్ల పంపిణికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు వారిద్దరితో సంస్కృతిలో ఈ కనిపించని విషయాలు,చరిత్ర గుర్తు చేసే వీలు దొరికింది.విశాఖలో డుంబ్రి గూడ మండలం సర్పంచ్‌లతో వాసన్‌ నిర్వ హించిన సమావేశాలు,చొరవ తీసుకుని అరకు లోయలో చేసిన పర్యటనలో చూసిన పరిశీల నలు,60ఏళ్ల అభివృద్ధి చరిత్ర నేప ధ్యాన్ని కాగి తం మీద పెట్టటానికి తొందర పెట్టాయి.- (రచయిత : శక్తి స్వచ్ఛంద సంస్థ
వ్యవస్థాపకులు,శివ రామకృష్ణ