కార్పొరేట్‌ లాభాల కోసమే..అడవుల విధ్వంసం

ప్రస్తుతం మన దేశంలో భూ వినియోగం విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరే కంగా ఉన్నాయి. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అవసరాల కోసం, గోల్ఫ్‌ కోర్సుల కోసం చాలా ఎక్కువమంది పేదలు నివసిస్తున్న భూములను ఖాళీ చేయిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో ఉండేవారికోసం అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.మోడీ ప్రభుత్వం మార్కెట్‌ అవసరాలకు (కార్పొరేట్ల అవసరాలకు) అనుగుణంగా భూ వినియో గాన్ని మార్చే పనిలో ఉంది. పెట్టుబడి ఆదిమ సంచయంతో ఇటువంటి మార్పులే జరుగు తాయి. భూమితో సహా అన్ని సంపదలూ సమిష్టిగా అనుభవిస్తున్నవిగాని, చిన్న చిన్న యజమానులు అనుభవిస్తున్నవి గాని కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో చిక్కడమే కాకుండా, ఆ సంపదల వినియోగం తీరు కూడా మారిపోతుంది. చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్తా కొద్దిమంది కార్పొరేట్ల పాలైతే అప్పుడు అక్కడ చిన్న తరహా ఉత్పత్తి విధానం పోయి,భారీ స్థాయి సరుకుల ఉత్పత్తి మొదలౌతుంది.
ఈ మోడీ ప్రభుత్వం నిరంతరం కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చడం కోసం పనిచేస్తూ వుంటుంది. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో, ఇతర రంగాలలో ఉన్న కార్పొరేట్లు ప్రాజెక్టులు చేపట్టి లాభాలను పిండుకోవడం కోసం దేశంలోని విస్తారమైన అటవీ ప్రాంతా లను నాశనం చేయడానికి అనుమతిస్తోంది. అందుకోసం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తెస్తోంది. తద్వారా ప్రభుత్వ సంరక్షణలో ఉండే కొన్ని అటవీ ప్రాంతాలను ఇకముందు అడవులుగా పరిగణించకుండా అటవీ సంరక్షణ చట్టం పరిధిలోంచి తొలగించనుంది.
1996లో సుప్రీం కోర్టు ఒక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం అటవీ ప్రాంతంగా ఉన్న భూమిని, అది ఎవరి స్వాధీనంలో ఉన్నప్పటికీ, దానిని ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదు చేయకపోయినప్పటికీ, ప్రభుత్వం సంరక్షిం చాల్సిందే. ప్రభుత్వ రికార్డులు అటవీ ప్రాంతాలను నమోదు చేయడంలో ఘోరంగా వెనుకబడ్డాయి. అడవి అనే నిర్వచనమే చాలా అస్పష్టంగా ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. అందువలన సుప్రీం కోర్టు ప్రతీ రాష్ట్రంలోనూ ఒక నిపుణుల కమిటీని నియ మించాలని, రికార్డుల్లో లేని అన్ని అటవీ ప్రాంతాలనూ గుర్తించాలని, వాటన్నింటికీ అధికారికంగా అటవీ ప్రాంతాలుగా గుర్తింపునివ్వాలని, అప్పుడే వాటిని చట్ట ప్రకారం సంరక్షించడం సాధ్యపడుతుందని ఆ తీర్పులో ఆదేశించింది. ఈ తీర్పు వచ్చిన 18 సంవత్సరాల తర్వాత కూడా, అంటే 2014 నాటికి కూడా హర్యానా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అటవీ ప్రాంతాలను గుర్తించడానికి కాని, వాటిని ప్రభుత్వ రికార్డులలో తగు విధంగా నమోదు చేయడానికి గాని ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. ఈ సంగతి ఒక పాత్రికేయుల బృందం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ లొసుగుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఏకంగా చట్టానికే సవరణలు తెచ్చి రికార్డులకెక్కని అటవీ భూములకు ప్రభుత్వ సంరక్షణ లేకుండా చేస్తోంది.
ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించ డమే. నిజానికి కేంద్రం ఇంతవరకూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసిన రాష్ట్రాలను హెచ్చరించి ఆ తీర్పు అమలు జరిగేలా చూసి వుండాలి. లేదా కేంద్ర ప్రభుత్వమే ఒక నిపుణుల కమిటీని నియ మించి అన్ని రాష్ట్రాలలోనూ నమోదు కావల సిన అటవీ ప్రాంతాలను గుర్తించి అవి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలని ఆ యా రాష్ట్రాలను ఆదేశించి వుండాల్సింది. అలా చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వాన్ని సాకుగా తీసుకుని సుప్రీం కోర్టు తీర్పునే రద్దు చేసేలా చట్ట సవరణకు సిద్ధం కావడం మోడీ ప్రభుత్వ తెంపరితనానికి నిదర్శనం.సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా తమ నిర్వహణలో ఉన్న తోటలను కూడా అడవులుగా గుర్తించే అవకాశం ఉందని ప్రైవేటు యజమానులు భయపడుతున్నారని, తమ భూములను తమకు నచ్చిన విధంగా వినియోగించుకునే హక్కు కోల్పోతామని వారు భావిస్తున్నారని, అందువలన ప్రైవేటు తోటల విస్తరణ ఆగిపోయిందని, దాని ఫలితంగా పచ్చదనం దెబ్బ తింటోందని, ప్రైవేటు యజమానుల భయాలను పోగొట్టి పచ్చదనాన్ని విస్తరించడానికే ఈ సవరణ తీసుకువస్తు న్నామని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఇది అందరినీ తప్పుదోవ పట్టించే వాదన. మొదటి విషయం: అడవుల, తోటల విస్తీర్ణం పెరగకపోడానికి ఒక కారణాన్ని అది ముందుకు తెచ్చింది. తోటలు పెంచుతున్న, పెంచాలని అనుకుంటున్న ప్రైవేటు యజమానుల మనసుల్లో భయాలు ఏర్పడ్డాయ న్నదే ఆ కారణం. అటువంటిది వాస్తవంగా ఉందో, లేదో, ఉంటే ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఉందో చెప్పగల గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. దానిమీద ఎటువంటి స్వతంత్ర అధ్యయనమూ లేదు, ఆధారాలూ లేవు. రెండవ విషయం:ఒకవేళ ప్రైవేటు యజమాను లకు ఆ విధమైన భయాలు నిజంగా ఉన్నా, అడవులకు, తోటలకు మధ్య తేడాను స్పష్టంగా తెలియజెప్పే విధంగా నిర్వచించడమే దానికి పరిష్కారం ఔతుంది. అలా చేయడం పోయి ఏకంగా చట్టాన్నే మార్చేయవలసిన అగత్యం ఏముంది? ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అడవీ ప్రాంతాలను సంరక్షించడం కాదు దాని లక్ష్యం. విస్తారమైన అటవీ ప్రాంతాలను వ్యాపారానికి అనువుగా మార్చివేయడమే. అలా గనుక జరిగితే పర్యావరణానికి కలిగే నష్టం అపారంగా ఉంటుంది. ఇప్పటిదాకా, దేశంలో అటవీ భూముల విస్తీర్ణం వాస్తవంగా ఎంత ఉందో ప్రభుత్వం అధికారికంగా వెల్లడిరచలేదు. అందులో ఎంతమేరకు ఇప్పుడు వ్యాపారానికి అనువుగా మార్చబోతున్నారో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. ఐతే ఈ రంగంలోని నిపుణులు మాత్రం గణనీయమైన అటవీ ప్రాంతాన్ని కోల్పోనున్నామని హెచ్చరి స్తున్నారు. ఉదాహరణకు హర్యానా రాష్ట్ర పరిధిలోకి వచ్చే ఆరావళీ పర్వత శ్రేణికి చెందిన అటవీ ప్రాంతం అధికారికంగా అడవిగా నమోదు కాలేదు. ఆ ప్రాంతం దేశ రాజధానికి దగ్గర్లో ఉంది. అందుచేత ఆ ప్రాంతంమీద చాలామంది రియల్టర్ల కన్ను పడిరది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వ్యాపారాలకు వినియోగించడం జరిగితే దేశ రాజధాని ప్రాంతంలో అత్యంత ఆవశ్యమైన పచ్చదనం కాస్తా కనుమరుగౌతుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లాలో శ్రీశైలం,ఆత్మకూరు, వెలుగోడు, మహానంది,శిరివెళ్ల,రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల పరి ధిలోని నల్లమల అటవీ ప్రాంతం ఉంది. టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్టు రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయార ణ్యాలు ఉన్నాయి. వీటిలో లెక్కలేనన్ని జీవజా తులు నివశిస్తున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 2006 రకాల పక్షులు,18రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. వివిధ జాతుల క్రిమి కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయో డైవ ర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఈ బయోడైవర్సిటీలో 2001 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఆయా జాతులకు చెందిన పూర్తి వివరాలు పొందుపరిచారు.
అటవీ నిబంధనలు పాటించాలి..
పులి, చిరుతలు తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చే వరకు మనిషిపై దాడిచేయవు. అలాగే ఎలుగు బంటి కూడా, పులిని ఒక సారి మనం చూశా మంటే అది వేయి సార్లు మనల్ని చూసే ఉం టుందని తెలుసుకోవాలి. అది ఎప్పుడూ మనిషిని తప్పుకునే తిరుగుతుంది. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయని చాలా మందికి తెలియదు. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రి పూట రహస్యంగా తిరుగుతూ తనకిష్టమైన కుక్కలను ఎత్తుకుపోతాయి. మనుషులపై దాడి చేయడం అరుదు. మనిషి నడిచి వెళితే పులులు చక్కగా గుర్తిస్తాయి. అతను తమ ఆహారపు మెనూలో లేడన్న విషయం వాటికి తెలుసు. అదే ద్విచక్ర వాహనాలపై వెళ్లిన ప్పుడు అది మొత్తం ఒక జంతువుగా భావించి దాడులు చేస్తాయి. అటవీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయ రాదు. అడవిలో నడిచే సమయంలో చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది. మనిషి చేతిలోని కర్ర ఎత్తినప్పుడు ఎదురుగా ఉన్న అటవీ జంతువుకు మనిషి రెండు రెట్లు ఎత్తుగా కనిపిస్తాడు. దీంతో వన్యప్రాణులు మనిషికి దూరంగా పారిపోతాయి. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. వాతావరణ కాలుష్యానికి పాల్పడకుండాఉండాలి. అటవీ నిబంధనలను తప్పకుండా పాటించాలి. వన్య ప్రాణుల ఆవాసాల్లో చొరబడి వాటిపై క్రూరత్వం ప్రదర్శించడం సరైంది కాదని వన్యప్రాణి ప్రేమికులు సూచిస్తున్నా రు. పర్యావరణానికి కలిగే అపార నష్టంతోబాటు ఆ అడవుల మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజల గతి ఏమౌతుంది? అడవుల్లో చిన్న తరహా అటవీ ఉత్పత్తులను సేకరించి తమ జీవనాన్ని వెళ్ళదీస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఆ అడవులు ధ్వంసం అయితే వారి జీవనోపాధి ఏమౌతుంది? వారికి ప్రభుత్వం ఏ ప్రత్యామ్నాయాన్నీ చూపించకుండా అడవులను ధ్వంసం చేయడానికి అనుమతిస్తే అది వారందరి జీవితాలనూ నాశనం చేయడమే ఔతుంది. ఉమ్మడి సంపదను కొందరు కొల్లగొట్టి పోగేసుకునే ‘’ఆదిమ సంచయం’’ ఫలితంగా అనేకుల జీవితాలు విధ్వంసం అవుతాయని మార్క్స్‌ చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. పలు దళిత, గిరిజన సంఘాలు మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణను బలంగా వ్యతిరేకించడంలో ఆశ్చర్యప డాల్సిందేమీ లేదు. అటవీ భూములను ప్రైవేటీకరించే ఈ ప్రయత్నం ఒక పెద్ద సవాలును ముందుకు తెచ్చింది. అది కేవలం అడవీ భూములకు సంబంధించినదే కాదు, మొత్తం భూమికి సంబంధించినది. మన దేశంలో భూమి కొరత చాలా ఉంది. అంతే కాదు, ఆ కొరతను భర్తీ చేయడం కూడా అసాధ్యం. అటువంటప్పుడు ఆ పరిమితమైన భూమిని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది ఉపాధి, ఆహార భద్రత, తదితర సామాజిక లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. ఆ లక్ష్యా లను సాధించడంలో భూమి వినియోగం కీలకం ఔతుంది. అందుచే త అటువంటి కీలకమైన భూమి వినియోగాన్ని ప్రైవేటు వ్యక్తుల ఇష్టాలకు వదిలిపెట్టకూడదు. భూమిని మొత్తంగా సమాజపరం చేయలేకపోవచ్చు. కాని భూ వినియోగాన్ని మాత్రం సామా జికంగా నియంత్రించాల్సిందే. వరిసాగులో ఉన్న భూములను ఇతరత్రా వినియోగించడాన్ని నియంత్రిస్తూ కేరళ రాష్ట్రంలో చేసిన చట్టం వెనుక ఉన్న తర్కం ఇదే.దీనర్ధం ఏమిటి? ఒకరివద్ద నుండి మరొకరు కొంత భూమిని కొంటున్నప్పుడు ఆ లావాదేవీని అనుమతించా లంటే ఒక షరతు విధించాలి. ఆ భూమి చేతులు మారాక దాని వినియోగం మారితే (పంట పొలంగా ఉన్నది కాస్తా ఇళ్ళ నిర్మాణా నికో, ఫ్యాక్టరీ కట్టడానికో ఉపయోగిస్తే) అలా మారిన వినియోగం సమాజానికి మోదయో గ్యంగా ఉండాలి అన్నదే ఆ షరతు. ఈ సూత్రా న్ని అనుసరించే 1996లో సుప్రీం కోర్టు అటవీ భూములను వేరే విధంగా వినియోగించడాన్ని నిరోధిస్తూ తీర్పు చెప్పింది. పర్యావరణ రక్షణ దృష్ట్యా, స్వేచ్ఛా మార్కెట్‌ (కార్పొరేట్లను) కార్యకలా పాలను నియంత్రిం చడం అవసరమేనని అందరూ ఒప్పుకుం టారు. కాని మొత్తం సమాజం ప్రయోజనా లను కాపాడాలంటే ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలను నియంత్రించాల్సిందే అన్న సాధారణ సూత్రం లో ఇదొక అంతర్భాగ మేనని అందరూ గమనించాలి.ప్రస్తుతం మన దేశంలో భూ వినియోగం విషయంలో ప్రైవేట్‌ కార్పొరేట్ల ప్రయోజనాలు సామాజిక ప్రయోజ నాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అవసరాల కోసం, గోల్ఫ్‌ కోర్సుల కోసం చాలా ఎక్కువ మంది పేదలు నివసిస్తున్న భూములను ఖాళీ చేయిస్తున్నారు. స్వల్ప సంఖ్యలో ఉండేవారి కోసం అధిక సంఖ్యాకుల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు.ఇప్పుడు దేశంలో భూ విని యోగాన్ని సామాజిక ప్రయోజనాల దృష్ట్యా నియంత్రించడానికి ఏ విధమైన పద్ధతులను ప్రవేశ పెట్టాలన్న ప్రశ్న మనల్ని వెనక్కి లాగే యకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి మార్కెట్‌లో అమ్మకానికి వచ్చే ఏ భూమినైనా మొదట ఆ కార్పొరేషన్‌కే అమ్మజూపాలి అన్న నిబంధన విధించాలి. అప్పుడు ఆ కార్పొరేషన్‌ ఆ భూమిని కొని దానిని తిరిగి మరొకరికి అమ్మేటప్పుడు ఆ కొనుగోలుదారులు దాన్ని సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వినియోగించే షరతును అమలు చేయగలుగుతుంది. లేదా, నేరుగానే ఇద్దరు వ్యక్తుల మధ్య భూ లావాదేవీ జరిగినప్పుడు దానిని కొనేవారు సామాజికంగా ఆమోద యోగ్యమైన రీతిలోనే వినియోగిం చాలన్న షరతును విధించవచ్చు. ఆ షరతును ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించవచ్చు.ఐతే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇందుకు పూర్తి వ్యతిరేక దిశలో అడుగులు వేస్తోంది. మార్కెట్‌ అవసరాలకు (కార్పొరేట్ల అవసరాలకు) అను గుణంగా భూ వినియోగా న్ని మార్చే పనిలో ఉంది.పెట్టుబడి ఆదిమ సంచయంతో ఇటు వంటి మార్పులే జరుగు తాయి. భూమితో సహా అన్ని సంపదలూ సమిష్టిగా అనుభవిస్తు న్నవిగాని, చిన్న చిన్న యజమానులు అనుభ విస్తున్నవి గాని కొద్ది మంది కార్పొరేట్ల చేతుల్లో చిక్కడమే కాకుండా,ఆ సంపదల విని యోగం తీరు కూడా మారి పోతుంది. చిన్న చిన్న రైతుల చేతుల్లో ఉండే భూమి కాస్తా కొద్ది మంది కార్పొరేట్ల పాలైతే అప్పుడు అక్కడ చిన్న తరహా ఉత్పత్తి విధానం పోయి, భారీ స్థాయి సరుకుల ఉత్పత్తి మొదలౌతుంది. నల్ల వ్యవసాయ చట్టాలు ఈలక్ష్యం కోసమే రూపొం దాయి. తమ తమ స్వంత వినియోగం కోసం గాని,ఎఫ్‌సిఐద్వారా దేశ ఆహార అవసరా లను తీర్చడం కోసం గాని ప్రధానంగా పంటలు పండిరచే చిన్న ర్కెటతుల నుండి భూమి కార్పొరేట్ల పరం చేసి సంపన్న పెట్టు బడిదారీ దేశాల అవసరాలను తీర్చే వాణిజ్య పంటలు పండిరచడానికిఆ చట్టాలు తోడ్పడ తాయి. ఇప్పుడు అటవీ సంరక్షణ చట్టానికి చేస్తున్న సవరణ కూడా అటవీ భూముల వినియోగాన్ని మార్చి స్వదేశీ, విదేశీ సంపన్ను ల అవసరాల కోసం మళ్ళించడానికే ఉప యోగపడుతుంది.ఆ అడవుల మీద ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులను అడివికి దూరం చేస్తుంది. (స్వేచ్ఛానుసరణ) – (ప్రభాత్‌ పట్నాయక్‌)

మనువాదం వర్సెస్‌ మానవాదం

మన దేశానికి సంబంధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరుస్తూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని మొదలుకొని కొందరు ముఖ్య మంత్రుల వరకు చేసే పనులన్నీ ఒకటే! ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగాలకు ప్రాధాన్య మిస్తున్నారు. వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా ?
ఇవాళ ప్రపంచంలో మూడు అతి పెద్ద భారీ వ్యాపార వస్తువులు ఉన్నాయి. ఒకటి-ఆయుధాలు, రెండు- మాదకద్రవ్యాలు, మూడు-ఆధ్యాత్మికత.ఆయుధాలు, మాదక ద్రవ్యాల తయా రీలో ఎంతోకొంత పని చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆధ్యా త్మికతలో ఇవ్వాల్సింది ఏమీ ఉండదు.చేయా ల్సింది కూడా ఏమీ ఉండదు. అందుకే భారత దేశంలో ఆధ్యాత్మికవేత్తలు ఎక్కువ. ఈ ఆధ్యాత్మిక సూపర్‌ మార్కెట్‌లో అడిగిన వెంటనే నిర్వాణం దొరుకుతుంది.ఈమెయిల్‌లో మోక్షం అందు తుంది.ఆత్మసాక్షాత్కారంలో క్రాష్‌ కోర్సు ఉం టుంది.నాలుగైదు సులభ వాయిదాలలో విశ్వ చైతన్యం లభిస్తుంది.ఈఆధ్యాత్మిక సూపర్‌ మార్కె ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా గొలుసు దుకాణాలు న్నాయి. అశాంతితో ఉన్న ఉన్నత వర్గాలు, సంపన్న కుటుంబాలు ఆ దుకాణాలలో ఆధ్యాత్మి కత పేరుతో దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ కొనుక్కుని తింటూ ఉంటాయి.అదేమిటో పూటపూటకూ రెక్కలు ముక్కలు చేసుకునే వారికి దీని అవసరమే ఉండదు.
నిజాలు చెప్పినప్పుడు ఎవరి మనోభా వాలైనా దెబ్బతింటే, వారు-వారి మనోభావాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ మారవు. వాటిని మార్చి చెప్పి కొందరికి సంతోషం కలిగించాలను కుంటే అవి, అప్పుడు నిజాలుగా ఉండవు కదా? నిజాలు తెలుసుకోవా లనుకున్న నిజాయితీ గలవారు మనోభావాల్ని మూసి పెట్టుకుని,నిజాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి! కృష్ణా కాన్షస్‌నెస్‌కు సంబం ధించిన ఓ స్వామి, మనల్ని ఎలా ఆలోచించమని చెపుతున్నాడో చూడండి…దేవాలయాల అవసరం చాలా ఉంది అని,మనతోనే చెప్పించాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. ఆయన ఇలా అన్నా రు… ‘దేవాలయాలు కట్టడానికి అనవసరం గా ధనం ఎందుకు ఖర్చు చేస్తున్నారూ? అని కొందరు అంటూ ఉంటారు. దేవాలయాలు కట్టడంకంటే పేదల ఆకలి తీర్చవచ్చు కదా? పాఠశాలలు, ఆసుపత్రులు కట్టొచ్చుకదా? అవసరమైన వారికి అవసరమైన రీతిలో ఖర్చు చేయవచ్చు కదా?’’ అని ప్రశ్నిస్తుంటారు. నిజమే! కానీ, క్లబ్‌లు, పబ్‌లు, సినిమా హాళ్ళు,క్రికెట్‌ల మీద ఎందుకు ఖర్చు చేస్తున్నారు-అనేది మాత్రం ఆలోచించరు. మనిష న్నాక ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అవసరం కదా అని అంటారు.కానీ,ఎన్‌లైట్‌మెంట్‌ కూడా అవసరమని ఆలోచించరు.మనిషైన వాడికి ఆధ్యాత్మిక చింతన, ప్రశాంత జీవనం అవసరమే కదా? మానసిక వేదనలతో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదుపుతప్పిన ఆవేశాలతో ఎందరో ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నారు. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన పనిలేదా? దైవ చింతనతో గడుపుతూ జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టు కోవాల్సిన పనిలేదా? మా హరేరామ హరేకృష్ణ మిషన్‌ లాంటివి పేదలకు ఉచిత భోజనం కూడా అందిస్తున్నాయి. మత పరమైన విహార యాత్రలు పెరిగితే,ఆర్థిక వనరులు పెరుగుతాయి.వాటి చుట్టూ మరెన్నో వ్యాపారాలు పెరుగుతాయి. ఇవన్నీ ఎందుకు ఆలోచించరూ?’’ అని స్వామి ప్రశ్నించారు. ఇందులో మనం ఎన్‌లైట్‌మెంట్‌- జ్ఞానోదయం గురించి మాట్లాడే పనేలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో ‘పూజారులు’గా ఉన్నవారికే జ్ఞానోదయం కాలేదు. ఇక ఓ గంట కోసమో, పూటకోసమో ఇలా వెళ్ళి అలా వచ్చేవారికి ఏం జ్ఞానోదయం అవుతుందీ? హరేరామ హరేకృష్ణ వాళ్ళు, సిక్కు గురుద్వార వాళ్ళు, సంత్‌సంగ్‌ల వాళ్ళు వాళ్ళదగ్గరికి వచ్చిన వారికి భోజనం పెడుతుంటారు. ఎందుకంటే వారి దగ్గరికి వచ్చినవారి సంఖ్య తగ్గిపోగూడదని! అది వారి జాగ్రత్త!! జనం ఆకలి తీర్చాలంటే మురికివాడల్లో తిండిలేక మలమల మాడుతున్న వారి దగ్గరికి వెళ్ళాలి. దేవాలయాల ముందు, మెట్ల మీద అడుక్కునేవారు ఉంటారు. వారి ఆకలి తీర్చాలి కదా ?
క్రికెట్‌, పబ్స్‌, సినిమాహాళ్ళూ ఎలా వ్యాపార కేంద్రాలో- అలా అన్ని మతాల అన్ని ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు కూడా వ్యాపార కేంద్రాలేనని మొదట ఒప్పుకోండి! ఎన్ని ఆత్మహ త్యలు ఈ దేవాలయాలు ఆపగలిగాయి? ఎన్ని అత్యాచారాల్ని, ఎన్ని హత్యల్ని, ఎన్ని డ్రగ్స్‌ దం దాల్ని ఈ దైవ క్షేత్రాలు ఆపగలిగాయీ? ఎవరైనా లెక్కలివ్వగలరా? ఈ ఆధ్యాత్మికత ఎందమందికి ప్రశాంతత ఇవ్వగలుగుతోంది? ఎంతమందికి ఆత్మస్థయిర్యాన్ని ఇవ్వగలుగుతోంది? ప్రపంచంలో ఎక్కడా లేని ఆధ్యాత్మిక కేంద్రాలు ఈ దేశంలో ఎక్కువ! మరి ఏ దేశంలోనూ లేని అల్లకల్లోలం ఈ దేశంలో ఎందుకుందీ? ఆత్మవిమర్శ చేసుకో వాలి కదా? దేవుడొక్కడే అని చెపుతున్నప్పుడు ఇన్ని రకాల ప్రార్థనా స్థలాలు ఎందుకున్నాయీ? వాటి మధ్య విభేదాలెందుకున్నాయి? వాటి కారణంగా జనం ఎందుకు విడిపోతున్నారూ? జనం మధ్య రాజకీయాలు చొరబడి అగాధాలు ఎందుకు పెంచుతు న్నాయీ? జనం మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలకు ఎందుకు దారి తీస్తున్నాయీ? ఏ మత కేంద్రంలోనైనా ‘మానవత్వం’ అనే మాట వినిపించదు ఎందుకూ?మనిషి ప్రమేయం లేకుం డా ఏ మతానికి చెందిన ఏదేవుడైనా ఏమీ చేయ లేడని ఎందుకు ప్రకటించరు?జ్ఞానోదయం సంగతి తర్వాత చూద్దాం ముందు మీరు చెప్పే దేవదేవుణ్ణి ‘నిజం’ చేసి చూపండి.
దేవుడే అబద్దం! అబద్దానికి బంగారు కిరీటాలుపెట్టి,పట్టుబట్టలు కట్టి, గుళ్ళూ గోపురాలు కట్టి,పూజలు, భజనలు చేసినంత మాత్రాన అబ ద్దం నిజమైపోతుందా?కల్పించుకున్న దేవుడు శక్తిమంతుడైపోతాడా?ఒకవైపు దేవుణ్ణి శక్తిమం తుణ్ణి చేయడానికి-మరోవైపు మనుషుల్ని విభజించి శక్తిహీనులుగా తయారు చేయడానికి రాసుకున్నదే‘మనుధర్మశాస్త్రం’.ఇది మనుషులంతా ఒక్కటే అని చెప్పే ఆధునిక మానవవాదం ముందు నిలవదు- మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏ ప్రార్థనా స్థలమూ అక్కరలేదు. ఏ నది ఒడ్డునో, చెరువు గట్టునో,చెట్ల మధ్యో గడిపితే చాలు. ఏదీ లేకపోతే డాబామీద పడుకుని ఆకాశం, నక్షత్రాలు చూస్తూ ఆనందించగలిగితే చాలు.దేవాలయాల చుట్టూ,ప్రార్థనా స్థలాల చుట్టూ తిరిగి ఎన్‌లైట్‌ మెంట్‌ పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా? వేల వేల మందితో కలిసి, క్యూలలో నిలబడి, దైవద ర్శనం గోలలో పడి, ఒళ్ళు హూనమై తల నొప్పు లు తెచ్చుకునే వారికి నిజంగానే జ్ఞానోదయం కావాలి.కానీ అవుతోందా? ఆధ్యాత్మిక ప్రశాం తత-అక్కడ లభిస్తోందా?ఎవరికి వారు ఆలోచిం చుకోవాల్సిన విషయం. పారసిటమాల్‌ బిళ్ళవేసు కుంటే జ్వరం తగ్గినట్టు-ఏ ప్రార్థనా స్థలానికో పోయి కూచుంటే జ్ఞానోదయమైన ఉదంతాలు న్నాయా? దేవాలయాల నిర్మాణం కన్నా పాఠశా లలు కట్టండి! ఆసుపత్రులు కట్టండి!! అని చెప్పేది ఎందుకంటే భావితరాల కోసం. ఇప్పటి పిల్లల్ని రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం. ఇక ఆసుపత్రులుంటేనే అందరి ఆరోగ్యాలు బావుంటాయి గనుక ! ప్రార్థనా స్థలాలకు వెళితే చదువురాదు,ఆరోగ్యమూ బాగుపడదు.లేని దేవుణ్ణి నమ్మి, మూఢభక్తికి అలవాటు పడి జీవితాన్ని అబద్దంగా మార్చుకోవడం జరుగుతోంది. జబ్బు లకు వైద్యం చేయించుకోకుండా దేవుడికి మొక్కు కున్నంత మాత్రాన, ముడుపులు కట్టినంత మాత్రాన, ఉపవాసాలున్నంత మాత్రాన ఎవరికీ ఏ జబ్బూ ఎప్పుడూ తగ్గలేదు.తగ్గినవి ఉంటే నిరూపించి చూపాలి కదా?ప్రార్థనా స్థలాన్ని కానీ, దైవ క్షేత్రాన్ని కానీ దర్శించుకుని వస్తే శరీరం నుంచి నెగటివ్‌ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది-అని కొందరు విశ్వాసకులు దుష్ప్రచారం చేస్తుంటారు.వ్యక్తిగతంగా మనిషి ఆలోచనా విధా నాన్ని బట్టి పాజిటివ్‌,నెగటివ్‌లు ఉంటాయి తప్పితే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమీ ఉండదు.మొక్కులు, ముడుపులు ఎంత హాస్యా స్పదంగా ఉంటాయో చెప్పడానికి ఇక్కడ ఒక వాస్తవ సంఘటనని గుర్తుచేస్తున్నాను. ఒకసారి ఒకతను అడవిలో నడుస్తూ ఉండగా చెప్పు తెగి పోయింది. తెగిన చెప్పుతో ముందుకు నడవలేక అతను ఒకచిలిపి పనిచేశాడు. దాని పక్కన గల ఒక చెట్టుకు తెగిన చెప్పులు తగిలించి, చెట్టు పక్కనఉన్న బండ మీద బొగ్గుతో ఇలా రాశాడు… ‘’ఈ చెట్టు కొమ్మమీద మీ చెప్పులను వేలాడదీస్తే మీ భార్య మీ చెప్పుచేతల్లో ఉంటుంది’’ అని… రాసి వెళ్ళిపోయాడు. అంతే! కొన్నాళ్ళకు ఆ చెట్టు కొమ్మలకు వందలచెప్పులు వేలాడబడ్డాయి. తెగిన చెప్పులు కాదు, వాడుకుంటున్న మంచి జతలు, కొత్తగా కొన్నవీ, అన్నీ చెట్టుకొమ్మల మీదికి చేరా యి. ఆ ప్రాంతంలో అదొక ఆచారమైంది. తర్వా త కాలంలో ఆ చెప్పుల చెట్టును వెతుక్కుంటూ జనం రాసాగారు. కొంతకాలానికి ఆ చెట్టు ఎటు వైపు ఉందో చూపడానికి డైరెక్షన్‌ బోర్డులు వెలి శాయి. చెప్పులచెట్టు-తిరనాళ్ళ అయ్యింది. ప్రతి సంవత్సరం జనం గుమిగూడి ఉత్సవం చేయడం ప్రారంభించారు. సంప్రదాయాల పేరుతో మూర్ఖత్వం ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ! ఇలాంటివి దేశంలో అనేక చోట్ల అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి.
‘ప్రపంచం మారాలని మనం కోరుకో వడం కాదు, మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది’అన్నాడు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టారు. మన దేశానికి సంబం ధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరు స్తూ ముందుకు సాగాల్సి ఉంది. పార్టీలు వేరైనా, వారు రాజకీయ ప్రత్యర్థులయినా దేశ ప్రధాని మొదలుకొని కొందరు ముఖ్యమంత్రుల వరకు చేసే పనులన్నీ ఒకటే! ప్రజా ధనాన్ని ఒకరు ఒక దేవాలయం మీద ఖర్చు పెడితే, మరొకరు మరో దేవాలయం మీద ఖర్చుపెడుతున్నారు. పూజలకు, యాగాలకు ప్రాధాన్యమిస్తున్నారు.వాటి వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటి? మూఢత్వంలోంచి వారు బయటికి రాకుండా అణిచిపెట్టడమే కదా? ఒకసారి ఆలోచించండి!
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌ – (డా.దేవరాజు మహారాజు)

స్వాతంత్య్ర ఉద్యమ సమిధ`భరత్‌సింగ్‌

ఉద్యమం అతని ఊపిరి. దేశభక్తి అతని హృదయం. స్వాతంత్య్రం అతని లక్ష్యం. పట్టుదల -శ్రమ అతని నేత్రాలు. నిస్వార్థం అతని రక్తం. ఫలితం ఉరి తీత.భగత్‌ సింగ్‌ పంజాబ్‌లోని లాయల్‌ పూర్‌ జిల్లా,బంగా సమీపంలోని ఖత్కర్‌ కలాన్‌ అను గ్రామంలో విద్యావతీ, సర్దార్‌ కిషన్‌ సింగ్‌ దంపతులకు జన్మించిన సంధూరaాట్‌ కుటింబీకుడు. ‘‘భక్తుడు’’ అనే పదమునకు పంజాబీలో భగత్‌ అనే పదంతో వాడతారు. ఆతల్లిదండ్రులకు కూడా దేశభక్తి ఎక్కువగా గల సిక్కుల కుటుం బంలోనివారు. స్వాతంత్య్రోద్య మంలోను, మరికొందరు మహారాజా రంజిత్‌ సింగ్‌ సైన్యంలోను పనిచేయడం వలన దేశభక్తి వారి కుటుంబాల్లో కలసిపోయి వారి సంతానానికి ‘‘భక్తుడు’’గా చెప్పబడే భగత్‌ నామకరణం పెట్టడం జరిగింది.
భగత్‌ సింగునకు మూడేళ్ల వయస్సులో తండ్రి కిషన్‌ సింగ్‌ ఎత్తుకుని అతని స్నేహితుడు నంద కిషోర్‌ మెహతాపాటుగా కొత్తగా మొక్కలు వేస్తున్న తోటలోనికి వెళ్ళడం జరిగింది.అక్కడే ఆడుకుంటున్న భగత్‌ సింగ్‌ మట్టిలో చిన్న చిన్న గడ్డిపరకలను నాటటం మొదలుపెట్టాడు. అతనిని తండ్రి ఏమి చేస్తున్నావు భగత్‌ అని ప్రశ్నిస్తే భగత్‌ ఇచ్చిన సమాధానానికి వారు అవాక్కయినారు. అతన నోట తుపాకులు నాటుతున్నా అని పలికేడు. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విధ్యార్థి దశలో భవిష్యత్తుకు బాల్యమే మొలక అని తెలియచేసాడు. విధ్యార్థి దశలో ఆట పాటలలో చుకుకుగా ఉంటూ అందరితో స్నేహంగా ఉండేవాడు. భగత్‌ బాబాయి అజిత్‌ సింగ్‌ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో,కంటనీరు పెట్టుకొన్న చిన్నమ్మ హర్నామ్‌ కౌర్‌ ను చూసి నాలుగేళ్ళ భగత్‌ సింగ్‌ పిన్నీ ఏడవద్దు,నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసాడు. స్వామీ దయానంద సరస్వతి అనుచరుడైన సింగ్‌ తాత అర్జున్‌ సింగ్‌ హిందూ సంస్కరణ ఉద్య మం ఆర్యసమాడంలో భాగం కావడం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం పడిరది. అపరిష్కృత కేసుల కారణంగా బ్రిటిష్‌ వారు అజిత్‌ సింగి పెర్సియాకు పారిపోగా కరోరి రైలు దోపిడీ నేరం మోపి సింగ్‌ బాబాయిని 1927 డిశంబర్‌ 19న ఉరితీసిన వైనం భగత్‌ మనో ఫలకంపై ముద్రపడి, ఈ దాస్యశృంఖలాల నుండి భారతదేశమును విడిపించాలనే కోరిక బలంగా నాటుకొనిపోయింది.13 ఏళ్ళ వయస్సులోనే గాంధీజీ తలపెట్టిన సహాయ నిరాకరణోద్యమానికి ప్రభావితు డయ్యాడు. బ్రిటిష్‌ దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్దాంతాలను అనుసరిం చాడు.1923లో పంజాబ్‌ హిందీ సాహిత్య సమ్మేళన్‌ నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్‌ విజయం సాధించాడు. ఆవయస్సులో ప్రముఖ పంజాబీ సాహిత్యానిన ఉటంకించడమే కాకుండా పంజాబ్‌ సమస్యలను తన సాహి త్యంలో ప్రస్థావించాడు.భగత్‌ లాహోర్‌లోని నేషనల్‌ కళాశాలో విధ్యాభ్యాసం చేశాడు. ఇంటిలోని పెద్దలు పెళ్ళి ప్రస్థావన తేగానే ఇష్టంలేని భగత్‌ఇల్లు వదలి పారిపోయి నౌజవాన్‌ భారత్‌ సభ (దానిని భారత యువ జన సంఘము అని కూడా అంటారు)లో చేరి, సహ విప్లవకారుల సహాయంతో యువతను ఆకట్టుకున్నాడు. ఫ్రొఫెసర్‌ విధ్యాలంకౌర్‌ విజ్ఞప్తి మేరక,అప్పట్లో రామ్‌ ప్రసాద్‌ బిస్మిత్‌, అఫ్పా ఖుల్లా ఖాన్‌ నాయకత్వం వహిస్తున్న హిందూ స్తాన్‌ గణతంత్ర సంఘంలోనూ చేరి విప్లవాత్మక సాహిత్యం ఉర్థూ,పంజాబీ వార్తాపత్రికలలో వార్తలు వ్రాసేవాడు, పర్యవేక్షించేవాడు. 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది విప్లవకారులు కీర్తి కిసాన్‌ పార్టీ పేరుతో ఢల్లీిలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. విప్లవకారు లను నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనలో ఉరితీయడం, కఠిన కారాగార శిక్షలు వేయడం తెలిసిన విషయమే. కటకటాల వెనకాల భగత్‌ సింగ్‌ ఒక అధ్యయన శీలిగా కాలాన్ని గడిపాడు.రాజనీతి,అర్థ శాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రభోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేసాడు. పుస్తకాలు చదువుతూ,చదువుతూ సింగ్‌కు ఇష్టమైనపాట,రామ్‌ ప్రసాద్‌ భిస్మిల్లాగారు వ్రాసిన పాటను మేరా రంగ్‌ దే బసంతీ చోలా పాడుకుంటారు. సింగ్‌ మంచి సాహితీవేత్త కూడా.ఉత్తమ సాహితీ వ్యసాలు,ఉద్యమ వార్తలు వ్రాయటంలో దిట్ట. అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి యువతను చైతన్యపరుస్తూ కర్తవ్యబోధ చేసే వాడు.30అక్టోబర్‌ 1928న బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌ ‘‘సర్‌ జాన్‌ సైమన్‌’’ నాయకత్వంలో ఏర్పడిరది.ఆ సమయంలో ఆ కమీషన్‌లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో భారతీయ రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి.ఫలితంగా, దేశ వ్యాప్తంగా పలు నిరసనలు వెల్లవెత్తా యి.30 అక్టోబర్‌ 1928న కమీషన్‌ లాహోర్‌ సందర్శించినపుడు సైమన్‌ కమీషన్‌కు వ్యతి రేకంగా లాలాలజపతిరాయ్‌ నేతృత్వంలో నిశ్శబ్ధ అహింసా పద్దతిలోఒకనిరసన కార్యక్రమం జరిగింది.అయితే అక్కడ హింసను రేకెత్తించటానికి పోలీసులే కారణమయ్యారు. ప్రశాంతంగా నిరసన చేసుకుంటున్న వారిపై లాఠీ చార్జి జరిపారు.లాలాలజపతిరాయ్‌ ఛాతీపై బలంగా కొట్టడంతో వారికి బలమైన గాయాలు తగిలాయి. తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కళ్ళార చూసిన యువకుడు భగత్‌ సింగ్‌ ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష బలంగా హృదయంలో స్థిరపడిరది. పోలీసు అధికారి స్కాట్‌ ను హతమార్చడానికి విప్లవ కారులు శివరామ్‌ రాజ్‌ గురు,జై గోపాల్‌, సుఖదేవ్‌ ధాపర్లలోతో చేతులు కలిపాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్‌ హతమయ్యాడు. పొరపాటు గుర్తింపు కారణంగా మరియు డి.ఎస్పీ జె.పి.సాండర్స్‌ కనిపించినపుడు సింగుకు జైపాల్‌ తప్పుగా సంకేతమిచ్చాడు.ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్‌ను హతమార్చడం జరిగింది. ఈ కారణంగా పోలీసులనుంచి దూరంగా లాహోరు పారిపోయాడు భగత్‌.విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటిషు ప్రభుత్వం మరిన్ని ప్రత్యేక అధికారాలు కల్పించింది.భగత్‌ సింగ్‌ వంటి దేశభక్తి ఉద్యమ కారులను అణచివేయడం ఈచట్టం యొక్క ముఖ్య ఉధ్దేశ్యము. ఆతరువాత ఈచట్టం ప్రజాహితం కోసమే అటూ ప్రత్యేక శాసనం క్రింద ఈచట్టాన్ని ఆమోదించారు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ఆమోదం కానున్న సమయంలో కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్థాన్‌ వాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది.దీనికి భగత్‌ సింగ్‌ ను కాకుండా మరొక విప్లవకారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అడ్డుపడ్డాడు.అయితే సింగు ఆశయాలను గౌరవించే మరికొందరు పార్టీ సభ్యులు ఆయనపై వత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా 8ఏప్రిల్‌ 1929 భగత్‌ సింగు మరి యొక విప్లవకారుడు కలసి అసెంబ్లీ వసారాలపై బాంబు విసిరి,‘‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ రిమం బర్డు-డైలీ టైమ్స్‌ పాకిస్థానీని తరువాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కలపత్రాలనువెదజల్లారు. కేంద్ర అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత, బాంబు దాడివల్ల ఏఒక్కరు మరణించడంగాని, గాయపడడంగాని జరుగలేదు.తమ వ్యూహంలో భాగంగానే ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో కూడినదాడి చేసినట్లు భగత్‌ సింగ్‌,దత్‌లు అంగీకరించారు. బాంబు గాయపరచేంత శక్తివంతమైనది కాదని, బ్రిటిష్‌ ఫోరెన్సిక్‌ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు.12 జూన్‌1929న సింగ్‌,దత్‌లు దేశ బహిష్కరణకు గురయ్యారు.అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపద్యంలో జె.పి.సాండర్స్‌ హత్య వెనుక భగత్‌ సింగ్‌,రాజ్‌ గురు,సుఖదేవ్‌లపై అభియోగాలు మోపారు.భారతదేశంలో స్వాతంత్య్ర సమర యోధుడు,విప్లవకారుడు,రచయిత, ప్రారంభ మార్సిస్టు,ఇప్పుడుపాకిస్థాన్‌ లాహోర్‌లో జన్మిం చిన ధైర్యశాలి.భారత్‌, బ్రిటిన్‌ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండు చేస్తూ జైలులో 64రోజులు నిరా హార దీక్షను చేపట్టడం ద్వార సింగ్‌ విపరీ తమైన మద్దతును కూడ గట్టుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు లాలాలజపతి రాయ్‌ని ఒకపోలిసు అధికారి హత్య నేరంపై ఉరితీసిన సంఘటన భగత్‌ సింగ్‌లో అగ్ని జ్వాలలు రేపాయి.ప్రతీకార వాంఛ పెరిగింది. మన మాతృదేశంపై పరాయి పెత్తనం సహించ లేకపోయేవాడు.ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్య్రసిద్ధికి పోరాడేలా యువతను ప్రేరేపించింది.అంతేకాక భారత్‌లో సామ్య వాద వ్యాప్తి మరింత పుంజుకుంది.భగత్‌ సింగ్‌ లో అరాజకవాదం (అనార్కిజం),సామ్యవాదం (కమ్యూనిజం)అనే భావనలు జీర్ణించుకున్నాడు. బకునిన్‌,మార్క్స లెనిన్‌ రచనలను ఎక్కువ చదివేవాడు.1928 మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో అరాజకత్వంపై పంజాబీ వార్తాపత్రిక కీర్తిలో వరుసగా అనేక కథనాలు ప్రచురిం చాడు.అరాచక తత్త్వాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోవటం లేదని చింతిస్తూ ఉండేవాడు. ‘‘అరాజకత్వం అనే పదానికి ప్రజలు భయపడుతున్నారు’’ అని ఆయన పేర్కొన్నాడు. భారత్‌లో విశ్వజనీన సహోదరత్వం అంటే సంస్కృతంలో చెప్పినట్టుగా వసుధైక కుటుంబకం మొదలైనవి రావాలని ఆకాంక్షించేవాడు. అరాజకత్వం సిద్ధాంతం గురించి విస్తృతంగా ప్రచారం చేసిన తొలి వ్యక్తి ఫ్రౌధన్‌.అందువలనే అరాజకత్వ వ్యవస్థాపకుడని పిలుస్తారు. 1931 లో జైల్లో ఉండగా నాస్తికవాద తత్త్వాన్ని వివరి స్తూ ‘‘నేను ఎందుకు నాస్తికుడిని’’ అంటూ ఒక వ్యాసం వ్రాసాడు.జైలులోఉండగా,మతం, దేవుడిపట్ల విశ్వాసం లేనివ్యక్తిగా సహచర విప్లవకారులు తనని విమర్శించిన కారణంగా ఈ వ్యాసం వ్రాయటం జరిగింది. తనను అహంకారిగా కూడా చిత్రీకరించుకున్న అరుదైన వ్యక్తిత్వం భగత్‌ సింగ్‌ది. స్వంత విశ్వాసా లను గౌరవించే సింగ్‌ సర్వశక్తి సంపన్నుడి పట్ల ధృడ విశ్వాసినని చెప్పేవాడు. అయితే ఇతరుల హృద యాలకు దగ్గరగా ఉండే కల్పిత గాథలు,విశ్వా సాలను నమ్మే స్థాయికి తాను దిగజారబోనని స్పష్టం చేసాడు. మతం చావును సులభతరం చేస్తుందనే వాస్తవాన్ని గుర్తించాలని అనేవాడు. డైరీ వ్రాసే అలవాటు వున్న భగత్‌ సింగ్‌ 404 పుటలను నింపాడు.తాను సమర్థించే పలు ప్రముఖుల ఉల్లేఖనాలు, వారి గొప్ప వాక్యాలను వ్రాసుకున్నాడు.భగత్‌ సింగ్‌ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శినిక అవగాహనకు అద్ధం పడుతుంది. 23 మార్చి, 1931న భగత్‌ సింత్‌ తోపాటు ఆయన సహచరులు,రాజ్‌ గురు,సుఖ్‌ దేవ్లను లాహోరులో ఉరితీసారు. సింగు ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న మద్ధతు దారులు ఆయనను ఆక్షణమే ‘‘షహీద్‌’’ అంటే అమరవీరుడుగా ప్రకటించారు. అప్పటి సూపరింటెండెంటు ఆఫ్‌ పోలీసు వి.ఎన్‌.స్మిత్‌ ఆజ్ఞ ప్రకారం సింగును ముందుగానే ఉరితీ సారు.సాధారణంగా ఉదయం 8గంటలకు తీసే ఉరిని, ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగా ఉరి తీయాలని నిర్ణయించుకున్నారు. సుమారు రాత్రి 7గంటల సమయంలో జైలు లోపలనుంచి ‘‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’’ అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. సింగు జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయంలో అది సంకేతమైంది. సట్లెజ్‌ నది ఒడ్డున ఉన్న హుస్సేనీవాలా వద్ద ఒక వీరుని దహనం జరిగింది.భగత్‌ సింగ్‌ స్మారక చిహ్నం నేడు భారత స్వాతంత్య్ర సమర యోధులను గుర్తుకు తెస్తుంది.
ఆఖరి కోరిక
తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలోనే తలవెండ్రుకలు, గడ్డం తీసివేయటం జరిగింది.‘‘దేశసేవ కోసంమే అదంతా తన సహచరుడు సిక్కు రూపాన్ని కూర్చుకునే విధంగా ఒత్తిడి చేసారు.’’
భగత్‌ సింగ్‌ కు సంబంధించి ప్రత్యేకించి ప్రము ఖులు ఆయన మరణం చుట్టూ నెలకొన్న సంఘ టనల వెనుక పన్నాగ సిద్దాంతాలు ఉన్నాయను కుంటారు.-ఆచార్య. దేవులపల్లి పద్మజ

లౌకిక సౌభ్రాతృత్వం విలువలు తిరిగి వికసించాలి..!

మహాత్మాగాంధీ,నెహ్రూ,భగత్‌సింగ్‌,ఆజాద్‌ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతం త్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75ఏండ్ల కింద ప్రారం భమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్స వం. ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ జరుపుకొనే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది. మూడు వందల ఏండ్లు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్రం, దైన్యా లతో ప్రజలు జీవిం చారు. ఆంగ్లే యులు మన దేశాన్ని జయించడానికి, సుదీర్ఘకాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. నైతిక పతనం ఎంత సులువో, దాన్ని తిరిగి నెలకొల్పడం చాలా కష్టం. మన దేశంలో మహమ్మా రిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యాలు,ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల,వర్ణ వ్యవస్థలు,సాంఘిక దురాచారాలు,నీచ స్వార్థాలతో సింథియా,హోల్కర్లు వంటి కొందరి రాజుల,ఆర్కాట్‌ వంటి నవాబులు అరా చక, భోగ లాలస,వ్యక్తిగత అహంకారాల వల్ల యావత్‌ ఉపఖండం దాస్యంలోకి వెళ్లిపోయింది.
దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.1757ప్ల్లాసీ,ఆంగ్లో-మైసూర్‌ యుద్ధా లు,1800 ఆరంభంలో హిందూ సాధువులు సంప్ర దాయ ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగు బాటు (ఈ ఉద్యమం ఇతివృత్తంగా బంకించంద్ర ఛటర్జీ‘ఆనందమఠం’అనే నవల రాశారు), 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం వీటిలో భాగమే.ఈ యుద్ధాల్లో మన ప్రజలనే సైన్యంగా మలచుకొని మన డబ్బుతొనే,మన పాలకులలో కొందరి ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు ఈ దేశభక్తియుత యుద్ధా లలో విజయం సాధించారు. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి. 1900 నుం చి స్వాతంత్య్ర సమరఆకాంక్ష మళ్లీ మొగ్గ తొడి గింది. దీనికి పునాదులు వేసిన వారు సామాజిక సంస్కర్తలు,కవులు,కళాకారులు.వీరి విశేష కృషితో భారతజాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఆంగ్లే యుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండటం సిగ్గు చేటనే భావన ప్రబలింది. 1880 నుంచి గెలుపోట ములతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా, ఉప్పెనగా కొనసాగిన1905,1917,1921,19 29,1942,1947వరకు ప్రజావెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
స్వాతంత్య్ర పాలన తొలినాళ్ళలో వైజ్ఞాని కవేత్త,సోషలిస్ట్‌ నెహ్రూ,సామాజిక విప్లవ నేత అంబే ద్కర్‌ల నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం,రవాణా, గనులు,శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉం చారు.చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చా రు.విద్య,పాలన,ఆర్థిక విషయాల్లో వేల ఏండ్లుగా భాగస్వామ్యానికి నోచుకొనివారికి చోటుదక్కింది, వ్యవసాయ వైజ్ఞానికరంగాల్లో స్వావలంబనతో పాటు అనేక విజయాలు సొంతం చేసుకున్నాం. వేల ఏండ్లుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచి నమత మౌఢ్యం,విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజల ఐక్యతను చీల్చే రాజకీయాలు పురుడు పోసు కొని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయో ద్యమంలో కానీ,సాంఘిక విప్లవాలతో కానీ సంబం ధం లేని శక్తుల పాలనలో ప్రస్తుత జీవన ప్రామా ణికత సూచికల్లో అన్నీఅధమస్థానాలే. సాధించుకున్న అనేక హక్కులను, రాజ్యాంగ వ్యవస్థలను, రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్యవ్యవస్థ స్ఫూర్తిని కాలరాస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతం త్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే బాధ్యతను విద్యా వంతులు,ప్రజాస్వామికవాదులు తీసుకోవాలి. లౌకిక,సౌభ్రాతృత్వ విలువలను తిరిగి వికసింప జేయాలి.
లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను కాపాడుకుందాం
భయంకరమైన మత విభజనల పెరుగు దలతోపాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనా గరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు.భిన్నాభిప్రా యంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మోడీ ప్రభుత్వం ‘’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’గా నామకరణం చేసింది. ఈ సందర్భం, దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే దృష్టిని సారించే పెద్ద ప్రచారంగా మారింది. దీని కోసం ఖాదీ, కాటన్‌,సిల్క్‌ కానటువంటి పాలిస్టర్‌ జెండాలను కూడా అనుమతించే విధంగా భారతదేశ జెండా కోడ్‌ను డిసెంబర్‌ 2021లో సవరించారు. దేశంలో అత్యంత పెద్ద పాలిస్టర్‌ ఉత్పత్తిదారులెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంపిక చేయబడిన సన్నిహితులు భారీ లాభాలనుపొందే అవకాశాలను ఇది సమ కూర్చుతుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేంతవరకు,ఆరెస్సెస్‌,బీజేపీలు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. కాషాయ జెండాపైనే వారికి విశ్వాసం. ఆరెస్సెస్‌కు భారత స్వాతంత్య్రో ద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇది చరిత్రకారులు నమోదు చేసిన, ఆనాటి బ్రిటిష్‌ ఇంటి లిజెన్స్‌ నివేదికలు ధృవీకరించిన నిజం.
మహోన్నతమైన పాత్ర
దీనికి భిన్నంగా, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌)కి చెందిన తొమ్మిది మంది వ్యవస్థా పక పొలిట్‌ బ్యూరో సభ్యులందరినీ బ్రిటిష్‌ ప్రభు త్వం అరెస్ట్‌ చేసింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో సుదీర్ఘ కాలంపాటు వారంతా జైల్లోనే గడిపారు. అండమాన్‌లోని సెల్యులార్‌ జైల్‌ (కాలాపాని) వద్ద పాలరాతిపై చెక్కబడిన చాలాపేర్లు కమ్యూనిస్ట్‌ విప్ల వోద్యమంతో ముడిపడి ఉన్నాయి. 1947 ఆగస్ట్‌, 15 నాటికి కన్ననూర్‌ జైల్లో ఖైదీగా ఉన్న కామ్రేడ్‌ ఎ.కె.గోపాలన్‌జాతీయ జెండాను ఆవిష్క రించాడు. 1932 హోషియార్‌పూర్‌ కలెక్టరేట్‌లో యూనియన్‌ జెండాను కిందకులాగి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన 16 ఏళ్ల హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ను బ్రిటిష్‌ వారు అరెస్ట్‌ చేశారు. కమ్యూనిస్టులకు, సీపీఐ(ఎం)కు దేశ భక్తి, త్యాగనిరతి అనేవి భారతదేశ సోషలిస్టు పరివ ర్తన యొక్క విప్లవ దార్శనికతకు అంతర్భాగంగా ఉంటాయి.1920లో దాని పుట్టుక నుండే కమ్యూ నిస్ట్‌ పార్టీ జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడం ఆరంభించింది. 1921లో అహ్మదాబాద్‌ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమా వేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మౌ లానా హస్రత్‌ మోహాని,స్వామీ కుమారానంద బ్రిటిష్‌ వారినుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాం డ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ దానిని గాంధీజీ అంగీకరించలేదు (‘సంపూర్ణ స్వరాజ్యం’ పిలుపు 1929లో మాత్రమే ఇచ్చారు). తరువాత 1922లో గయ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను పంచింది. ఆతర్వాత జరిగిన ఏఐసీసీ సమావేశా ల్లో కూడాఇది కొనసాగింది.జాతీయోద్యమ ఎజెం డాను ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పాత్రను పోషించారు.1940లలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూపోరాటాలు స్వాతంత్య్ర సాధనలో కీలకమైనవి.కేరళ లోని పున్నప్ర వాయలార్‌, బెంగా ల్‌ లోని తెభాగపోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీటిలో ముఖ్యమైనవి.భారతదేశంలోని భాషాపరమైన భిన్న త్వాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారిని స్వాతంత్య్ర పోరా టంతో ఐక్యంచేయడంతో,స్వతంత్ర భారత దేశంలో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది.లౌకికవాదంపట్ల కమ్యూనిస్టులకుండే అచం చలమైన నిబద్ధత, స్వాతంత్య్ర పోరాట కాలంలో చెలరేగిన మత ఘర్షణల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పి,నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్రను పోషించింది. కమ్యూనిస్టులు నేటికీ లౌకికవాదానికి అత్యంత నిబద్ధత కలిగిన సమర్థకులుగా ఉన్నారు.
చరిత్ర వక్రీకరణ
కానీ,నేడు తమను తాము స్వాతంత్య్రో ద్యమ పోరాటంలో భాగస్వాములమని తప్పుడు ప్రచారం చేసుకోవడం ద్వారా ఆరెస్సెస్‌, బీజేపీలు చరిత్రను వక్రీకరించి,చరిత్రను తిరగ రాసే ప్రయ త్నం చేస్తున్నాయి. హిందూత్వ, ఆరెస్సెస్‌ నాయకులు స్వాతంత్య్ర సమర యోధులని చిత్రీకరిస్తూ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. ఈప్రచారంలో ఉదహరిం చబడిన వారిలో వీడీ సావర్కర్‌ ముందున్నాడు. హిందూ మతాచారంతో సంబంధం లేని రాజకీయ లక్ష్యాలు గల ‘హిందూత్వ’ అనే పదాన్ని 1923లో కనుగొన్నది వి.డి.సావర్కర్‌. ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం మహ్మదాలీ జిన్నా పోరాటానికి నాయ కత్వం వహించడానికి రెండు సంవత్సరాల ముందే సావర్కర్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చా డు.దానిని బ్రిటిష్‌ వారు ప్రోత్సహించాడు.ఆ తర్వా త విషాదకరంగా దేశ విభజన జరిగింది. బ్రిటిష్‌ పాలకులతో సంధి కుదిరిన తరువాత సావర్కర్‌, తనరాజకీయ జీవితంలో ఎక్కు వ భాగం, కాంగ్రెస్‌, వామపక్షాల నేతృత్వం లోని ఉద్యమాలకు వ్యతిరేకం గానే ఉన్నాడు. హిందూ మహాసభ నాయకునిగా, 1942లో జరిగిన క్విట్‌ ఇండియా లాంటి ఉద్య మాలలో హిందూ మహా సభ, ఆరెస్సెస్‌ సభ్యుల భాగస్వామ్యం లేకుండా చూశాడు. వాస్తవాలన్నిటిని మరుగునపెట్టి వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కమ్యూ నిస్టుల విషయం పక్కన పెట్టండి, ప్రభుత్వ ప్రచారా లలో జవహర్‌ లాల్‌ నెహ్రూ గురించి కూడా ఎక్కడా ప్రస్తావిం చడం లేదు.భారత రాజ్యాంగం, స్వాతంత్య్ర భారత దేశం ఒకఆధునిక లౌకిక ప్రజా స్వామిక రిపబ్లిక్‌గా రూపొందేందుకు దారి తీసిన అనేక చర్చలు, తీర్మా నాలకు దారి చూపిన వ్యక్తి నెహ్రూ. ఈ విషయాన్ని మరుగుపరిచి బీజేపీ తన ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యం ఆలోచనను నిజం చేసే చర్యలను ముందుకు తీసు కొనిపోతోంది.
భారత రాజ్యాంగంపై దాడి
ఈఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే, మన రాజ్యాంగం కల్పించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణం పైన దాడి చేసి, బలహీనపరచి, నాశనం చేయాల్సి ఉంది. తదనుగుణంగానే 2019లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుండి…మన రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాలు తీవ్రమైన దాడికి గురవు తున్నాయి. చర్చలులేని తీరుతో పార్లమెంట్‌ సాంప్ర దాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఏ విధమైన చర్చలు లేకుండానే కేవలం మంద బలంతో చట్టా లను ఆమోదింపజేసు కుంటున్నారు. ప్రస్తుత పార్ల మెంట్‌ సమావేశాల్లో, ఆకాశాన్నంటే ధరలు, పెరిగి పోతున్న నిరుద్యోగం లాంటి ప్రజలెదుర్కొం టున్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేసిన నేరా నికి గతంలో ఏనాడూలేని విధంగా27మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. పని చేయని పార్ల మెంట్‌ చాలా ప్రమాదకరం.అంటే భారత రాజ్యాం గం యొక్క ప్రాముఖ్యత, ప్రజల సార్వభౌ మత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఎంపీల అధికారం, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం లేకుండాపోవడం.పార్లమెంట్‌ను బలహీనపర్చ డమంటే, ప్రజల సార్వభౌమత్వాన్ని రద్దు చేయడం, ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకొని, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వం వైపు వెళ్లడం.దాదాపు మూడేళ్లుగా ఆర్టికల్‌ 370,ఆర్టికల్‌ 35ఏ రద్దు సవాళ్లు, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం),రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికలబాండ్లు మనరాజ్యాంగాన్ని ఉల్లం ఘించే అంశాలుగా మారాయి. ఇవేవీ సుప్రీం కోర్టుకు వినిపించవు. న్యాయ వ్యవస్థ యొక్క నిష్పా క్షికత,స్వతంత్రత తీవ్రంగా రాజీ పడినప్పుడు, రాజ్యాంగ నిబంధనల అమలు,ప్రజాస్వామిక హక్కు ల హామీలు,పౌర హక్కులపై విచారణ ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది.అదేవిధంగా,ఒక ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ, స్వేచ్ఛాయుత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిష న్‌ స్వతంత్రత, నిష్పాక్షికత చాలా ముఖ్యమైనవి. ఇది రాజీ పడినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకే మాత్రం ప్రజల తీర్పును, ప్రజాస్వామిక అభిప్రాయా లను ప్రతిబింబించవు. సీబీఐ,ఇ.డిమోడీ ప్రభుత్వ రాజ కీయ ఎజెండాను అమలు చేయడానికి సాధనా లుగా మారిన తీరును దేశమంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచడం,ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన ప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడానికి గల హామీకై పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దానిని నాశనం చేస్తున్నారు.
తీవ్రమైన మత విభజనలు
ఇలా భారీగా రాజ్యాంగ క్రమాన్ని నాశ నం చేయడంతో పాటు భారతరిపబ్లిక్‌ లౌకిక ప్రజా స్వామిక లక్షణాన్ని నాశనం చేయడానికి విషపూరిత మైనద్వేషం,భయాల వ్యాప్తిపై ఆధారపడి క్రూరమైన రీతిలో మత విభజనల ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ‘బుల్డోజర్‌ రాజకీయాల’ వ్యూహ రచన, కొన్ని రాష్ట్రాల్లో హింసకు దారితీసే రీతిలో మైనా రిటీలను లక్ష్యంగా చేసుకోవడం, పార్లమెంట్‌ నూతన భవనంపైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సంద ర్భంలో హిందూ మతాచారాలను ఆచరించడం లాంటి చర్యలు భారతరాజ్యాన్ని,ప్రభుత్వాన్ని హిం దూత్వతో గుర్తిస్తున్నారు కానీ భారత రాజ్యాంగంతో కాదని స్పష్టం చేస్తున్నాయి.ఇలాంటి భయంకరమైన మత విభ జనల పెరుగుదలతో పాటు గతంలోలేని విధంగా ప్రజల పౌరహక్కులు,ప్రజాస్వామిక హక్కు లపై దాడులు జరుగుతున్నాయి.తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇత రులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభి ప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.ఈ హిందూత్వ కథనం విజయవంతం కావాలంటే,ఈ ఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ లోని సిద్ధాంతం కొనసాగడానికి భారతదేశ చరిత్రను తిరగ రాయా ల్సిన అవసరం ఉంటుంది. అందుకే విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు. వివేచనా రహిత ఆలోచనలను ప్రచారంచేస్తు న్నా రు.హేతుబద్ధత స్థానాన్ని మార్చేప్రయత్నం చేస్తు న్నారు.గుడ్డివిశ్వాసాలను ప్రచారం చేస్తూ, శాస్త్రీయ తను కాదని పురాణాలను ప్రచారం చేస్తు న్నారు. చరిత్రస్థానంలో హిందూ పురాణాలను, తత్వ శాస్త్రం స్థానంలో హిందూ ధర్మశాస్త్రాన్ని తీసు కొని రావడంద్వారా భారతదేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని నాశనం చేస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పౌష్టికాహార లోపం లాంటి రోజువారీ సమస్యలపై ప్రజా పోరా టాలను, ప్రతిఘటనలను పెంచడం ద్వారా భారత దేశం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాం గాన్ని రక్షించి, బలోపేతం చేసే బాధ్యతను తీసు కోవాలి. ప్రజా స్వామ్యం,ప్రజాస్వామిక హక్కులు,పౌర హక్కులు, లౌకికవాదాల రక్షణకై పోరాటా లను ఉధృతం చేయాలి. బలమైన ప్రజా పోరాటా లను ఉధృతం చేయడం ద్వారా సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. వామపక్ష శక్తుల ఐక్యతను సంఘటిత పరచడం, వామపక్ష ప్రజా తంత్ర శక్తుల్ని ఏకం చేయడం, హిందూత్వ మతో న్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన లౌకిక శక్తులను సిద్ధం చేయడం ద్వారానే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ రాజ్యాంగాన్ని రక్షించు కోగలం.ఈలక్ష్యాన్ని నిజం చేసే మన దేశభక్తి తోనే ఆగస్ట్‌ 15న అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీ య జెండాను ఆవిష్కరించి, మనరాజ్యాంగంలోని పీఠిక పై ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోవాలి.ఈఉన్మాద పూరిత,ఫాసిస్టు ప్రయ త్నాల నుండి స్వేచ్ఛకోసం, మనలౌకిక ప్రజాస్వామికరిపబ్లిక్‌నుకాపాడు కోవడం కోసం జరిగే పోరాటాన్ని బలపరుచు కుందాం!
భయంకరమైన మత విభజనల పెరుగు దలతో పాటు గతంలో లేనివిధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు..కొంతమంది జర్నలిస్టులు,ఇతరులు అనా గరిక చట్టాలకింద జైల్లోఉన్నారు. భిన్నాబి óప్రాయం తో కూడిన ప్రతీవ్యక్తీకరణను ‘దేశద్రోహం’గానే పరిగణిస్తున్నారు. (ప్రజాశక్తి సౌజన్యంతో) –(అస్నాల శ్రీనివాస్‌ / సీతారాం ఏచూరి)

జనగణనలో ఆదివాసీల మతమేమిటీ?

ఈ దేశంలోని 12 కోట్ల మంది ఆది వాసీలకు విలక్షణ మత అస్తిత్వం ఉన్నది. వారిని హిందు వులు లేదా ఇతర ప్రధాన స్రవంతికి చెందిన ఇతర మతాల వారిగా పరిగణించడం సబబు కాదు. 2021 జనాభా గణన ప్రక్రియలో ఆదివాసీ లను వారి సొంత మతాలకు చెందినవారుగా మాత్రమే నమోదు చేయాలి. ఈదేశంలో ఆదివాసీలకు సరైన గుర్తింపు ఉందా? కొత్త సంవత్సరం (2021)లో దేశ జనాభా గణన ప్రక్రియ మొదలవనున్నది. ఆదివాసీలను ఏ మతా నికి చెందిన వారుగా నమోదు చేయనున్నారు? ఈ విషయమై ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో ఆదివాసీలకు సముచిత గుర్తింపు లభించింది. అయితే అది ఎంతో కాలం కొన సాగలేదు.
భారతదేశ జనాభాలో ఆదివాసీల సంఖ్య12 కోట్లు. వీరి మతమేమిటి?ఆదివాసీ సమూహాలు అనుసరిస్తున్న మతంపై సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతోంది. జనాభా గణనలోనూ లేదా అటువంటి ఇతర గణనల్లోనూ ఆదివాసీ మతాలలో ఒకదాన్ని ఎంపిక చేసుకునేందుకు తమకు హక్కు కల్పించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి జనాభా గణన ప్రక్రియలో ‘మతం’కాలమ్‌లో‘ట్రైబ్‌’ అనేది తొమ్మిదో గుర్తింపులో ఉండేది. ఆదివాసీలు అంద రూ తమ మతాన్ని ‘ట్రైబ్‌’గా పేర్కొనేవారు. తరువాత ఈ ఆప్షన్‌ను తొలగించారు. ఫలితంగా ఆదివాసీలు వివిధ మతాలకు చెందిన వారుగా నమోదవు తున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని కించపరు స్తోందని ఆదివాసీలు వాపోతున్నారు. ఇప్పుడు జనాభా గణనలో ఆరు మతాలు-హిందూ, ముస్లిం, క్రైస్తవ,బౌద్ధ,జైన,సిక్కులకు మాత్రమే గుర్తింపు ఉంది.2011కి పూర్వం ఈ ఆరు మతాలతో పాటు ‘అదర్స్‌’(ఇతరులు) అనే ఆప్షన్‌ ఉండేది. ఆదివాసీలు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకునేవారు.ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. జనాభా గణన ప్రారంభమయిన 1871 మొదలు 1931దాకా ఆదివాసీలు తమ మతాన్ని ఆదివాసీమతంగా నమోదు చేసేవారు.స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా 1961 నుంచి ఆ అవకాశం లేకుండా పోయింది. హిందువులుగా, క్రైస్తవులుగా, ఇంకా ఇతర మతాలవారుగాఆదివాసీలను నమోదు చేయ డం జరుగుతోంది.‘ఆదివాసీ మతం’ అనే ఆప్షన్‌ను తొలగించడమంటే తమను మతపరమైన బానిసలు గా పరిగణించడం కాదా అని పలువురు ఆదివా సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సువిశాల దేశంలోని ఆదివాసీలు మొత్తం83 మతా చరణలను అనుసరిస్తున్నారు. విశ్వాసాలు, ఆచారా లు, ఆరాధించే దేవతలు, ఆరాధనా పద్ధతు లు మొదలైనవి భిన్నమైనవి అయినప్పటికీ తమకు మత పరంగా ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సహజంగా ఆరాటపడుతున్నారు. ప్రధాన స్రవంతి మతాలకు చెందినవారుగా గుర్తింపు పొందడానికి వారు నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్‌ శాసనసభ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రస్తావించ వలసి ఉంది.ఆరాష్ట్రంలోఅత్యధిక సంఖ్యలో ఉన్న శర్ణ ఆదివాసీల మతానికిగుర్తింపు నివ్వాలని, 20 21 జనాభా గణనలో ఆ మతానికి ఒక ప్రత్యేక గుర్తింపు క్రమసంఖ్య నివ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ జార్ఖండ్‌ శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.శర్ణ ఆదివాసీలకు గుర్తింపు విషయమై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి హేమం త్‌ సోరేన్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ విషయమై ఆయన ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. జార్ఖండ్‌ శాసనసభ తీర్మానం దేశవ్యా ప్తంగా ఆదివాసీల అస్తిత్వానికి జీవం పోసింద నడంలో సందేహం లేదు. మతపరంగా జాతీయ స్థాయిలో ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సమైక్యమయ్యేందుకు జార్ఖండ్‌ అసెంబ్లీ తీర్మానం విశేష ప్రేరణ నిచ్చిందనడంలో సందేహం లేదు. ఆదివాసీలను దశాబ్దాలుగా హిందు వులు లేదా ప్రధాన స్రవంతికి చెందిన ఇతర మతాలవారుగా ఎందుకు పరిగణిస్తున్నారు? ఇన్నేళ్లుగా ఆదివాసీలకు మతపరమైన నిర్దిష్ట గుర్తింపు లేకుండా ఎందుకు చేశారు? ఈ దేశంలో ఆదివాసీల అస్తిత్వం మూలాలు ఏమిటి? అనే దానిపై చర్చ జరగడం శ్రేయస్కరం. ఇటువంటి చర్చ జరగని పక్షంలో ఈ దేశ సామాజిక వాతావ రణంలో ఒక స్పష్టమైన మార్పు రావడం అసంభవం అనేది నేడు దేశహితులు అందరూ గుర్తించవలసిన వాస్తవం. నాగరికత ఆనవాళ్ళు అనేవి నవీన శిలా యుగంలో ప్రారంభమయ్యాయి. తమ జీవన ప్రస్థా నాన్ని ముందు తరాల వారికి తెలియజేయాలనే ఆలోచన ఈయుగ మానవులకు వచ్చింది. ఈ విష యమై వారి కార్యాచరణ అద్భుతమైనది. చిత్రాల రూపంలో బండరాయిపై చెట్లరసంతో ముదురు ఎరుపురంగు బొమ్మలు వేయడం ఆ కార్యాచరణలో భాగమే. అటువంటి బొమ్మలు నేడు ఆదివాసీలు నివసించే దట్టమైన అటవీ ప్రాంతాలలో, కొండ గుహలలో కానవస్తున్నాయి. పలువురి పరిశో ధనల్లో ఆబొమ్మలు ఆదివాసీల జీవనంలో భాగమైన పడగలలోని చిత్రలిపి, మౌఖిక సాహిత్యంలో ఉన్నవని నిర్ధారణ అయింది. నవీన శిలాయుగ మాన వులు తమ అస్తిత్వాన్ని చిత్రాల రూపంలో చాటిన మొదటి ఆదివాసీలు. ఆనాటి నుంచి నేటిదాకా ఆదివాసీల జీవనం అడవిలోనే సాగుతోందనడానికి ఇవి తిరుగులేని చారిత్రక ఆనవాళ్లు.
నవీన శిలాయుగంలోనే వ్యవసాయం అంకురించింది.ఆతర్వాత మనిషిని మరింత పరి పూర్ణంగా తీర్చిదిద్దిన నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతతో ఆదివాసీలు ఒక పరిపూర్ణ నాగరికత నిర్మించారని చెప్పవచ్చు.సింధు నాగరిక తలో ఉన్న చిత్రలిపి నేటి ఆదివాసి జీవనంలో సజీవంగా ఉంది. నేటి గోండ్వానా ప్రజల జీవన చిత్రాలు, వేషధారణ కూడా సింధు నాగరికత ఆదివాసి నాగరికతే అని దృష్టాంతీకరిస్తున్నాయి. గోండ్వానా జీవనంలో ప్రాచీన శిలాయుగంలో బండరాళ్ళపై చిత్రలిపి వేసిన ఆదివాసీలు నవీన శిలాయుగంలో దానిని పెద్ద పెద్ద వృక్షాల దారు వుపై వేశారు.సింధు నాగరికత నాటికి ఎర్రని గుడ్డపై చెట్లరసంతో బొమ్మలు వేసి పడిగెల రూపం లో వంశవృక్షాలలో జన్యుపరమైన విభజన చేసు కోవడం జరిగింది.నేటికీ ఆదివాసి ఇలవేల్పు జాతర లో తమ చరిత్రను వంశవృక్షాన్ని దైవ రూపంలో కొలుచుకుంటున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలు అయినా తమ వంశవృక్షం ఏమిటి అనే దాన్ని స్పష్టంగా చిత్రలిపి రూపంలో తెలుసుకునేంత గొప్ప శాస్త్రీయ పరిజ్ఞానం ఆదివాసి సమాజంలో మాత్రమే ఉంది. మరి ప్రాక్‌చరిత్ర నుంచి నేటి వరకు ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ఆదివాసీలు హిందు వులు లేదా ఇతర మతాలకు చెందిన వారు ఎలా అవుతారు? పాక్‌చరిత్ర నుంచి నేటి వరకు ఒక్క ఆధారం కూడా ఆదివాసి హిందువు అని చూపించే తార్కాణం ఏదీ కూడా లేదనేది స్పష్టాతిస్పష్టం. ఆదివాసి పూజా విధానంలో పురోహితులు ఉం డరు.ఆదివాసీలు ప్రత్యేక ఆచారాలతో పూజ నిర్వహించుకుంటారు.వారి పూజలు పకృతితో మిళి తమై ఉంటాయి. ఆదివాసీ పండుగలు, ఆచారాలు, కట్టుబాట్లు, జంతుబలులు, ఆహార అలవాట్లు, ఇలవేలుపు జాతరలు భౌగోళిక ప్రాంతాలవారీగా ఒక విలక్షణమైన పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఈరోజు విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసీ జీవనమే ఒక శాస్త్రీయ జీవనం. విగ్రహం ఆధారం లేనిపూజలు,ఈ సృష్టిలో భూగో ళాన్ని మించిన దైవం లేదని భూమిని కొలిచే భూమి పండుగ,మనిషికి ఆహారాన్ని అందించి ఆకలి తీర్చే ఉత్పత్తికి మూలమైన విత్తనాలను దైవంగా పూజించే విత్తనాల పండుగ ఆదివాసీల విశిష్ట జీవనశైలికి దర్పణాలు.ఉత్పత్తి ప్రక్రియలను ప్రకృతిలో అంతర్భా గంగా భావించి, పండుగలు చేసుకోవడం ఆదివాసీ ల విలక్షణత.ఉత్పత్తి ప్రక్రియలకు మించిన అంశా లు ఈ ప్రకృతిలో ఏమీ లేవు. కనుకనే ప్రకృతిలో ఉత్పత్తికి సంబంధించిన ప్రతి కదలికను ఆదివాసీలు పూజిస్తారు.రేలా పాటలు, కొమ్ము, దింసా, గుస్సాడీ దండారి పాటలు, అడవిలో ఆడే నెమలి ఆటలు, ప్రకృతిలో జంతువుల నుంచి నేర్చుకున్న కళలు. బాహ్యప్రపంచంతో సంబంధం లేని,దట్టమైన అడవులలో,కొండప్రాంతాలలో కల్మషం లేని విశిష్ట సంస్కృతి ఆదివాసీలది.మరి వారిని హిందువు లుగా భావించడం సబబేనా? ఈ వాస్తవాల దృష్ట్యా భారత రాజ్యాంగంలోని ఐదు,ఆరు షెడ్యూళ్లలో పేర్కొన్న ఆదివాసీ తెగలకు మతపరంగా ఒక నిర్దిష్ట గుర్తింపునివ్వాలి. ఇందుకు 2021 జనాభా గణన ప్రక్రియతో శ్రీకారంచుట్టాలి. ఆదివాసీలపై హిందూ, క్రైస్తవ,ముస్లిం మతాల పేరిట దాడులు జరిగినా, పరాయీకరణ కార్యక్రమాలు చేపట్టినా ఇందుకు బాధ్యులైన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపాలి.గోండ్వానా,ఇతర గిరిజన తెగల సంస్కృ తులను సంరక్షించాలి. ప్రకృతిని సంరక్షించే ఈ అడవిబిడ్డల విలక్షణ మనుగడను కాపాడడం ప్రభు త్వాల నైతిక కర్తవ్యం.
వ్యాసకర్త : వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తుడుం దెబ్బ

శ్రీ రవీంధ్రుని స్మరణలో..

భారత దేశానికి జాతీయ గీతాన్ని అం దించిన కవి,రవీంద్రనాథ్‌ ఠాగూర్‌(మే 7,1861-ఆగస్టు7,1941).ఠాగూర్‌గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని అందుకున్నాడు. నోబెల్‌ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేబేంద్రనాథ్‌ ఠాగూర్‌,శారదా దేవి దంపతులకు పదమూడు మంది సంతానంలో చిన్నవాడైన రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌1861 మే 7న జన్మించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రాథమిక విద్య మొత్తం ఇంట్లోనే.. కానీ సాహిత్య ప్రతిభ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. తన రచనలతో తక్కువ కాలంలోనే గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఆయన కవిత్వంలో అధిక ప్రతిభను కనబర్చారు. రవీంద్రనాథ్‌ రాసిన కవితా సంకలనం గీతాంజలి 1910లో పబ్లిష్‌ అయ్యింది. ఇది సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతిని గెలుచుకుంది. ఠాగూర్‌ అనేక ఇతర ముఖ్యమైన రచనల్లో మానసి(1890), సోనార్‌ తారి (1894), గితి మాలయ(1914),రాజా(1910),పోస్టాఫీసు (1912) మొదలైనవి ఉన్నాయి.రవీంద్రనాథ్‌ ఠాగూ ర్‌ ఎన్నో చిత్రాలను గీశారు. ఆయనకు సంగీతంపై ఆసక్తి ఉండడంతో కొన్నిపాటలు రాసి వాటికి సంగీ తం కూడా అందించారు.జాతీయస్వాతంత్య్రో ద్యంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బ్రిటీష్‌ సామ్రాజ్య వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.జలియన్‌ వాలా బాగ్‌ మారణకాండకు నిరసనగా అతడికి బ్రిటీష్‌ అధికారులు ఇచ్చిన ‘నైట్‌హుడ్‌’ బిరుదును కూడా తిరిగి ఇచ్చేశారు. జాతీయ భావాలు అధికంగా ఉన్న రవీంద్రుడు అనేక హిందూ మేళాలో దేశ భక్తి గీతాలను పాడేవారు.తన పాటలద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తట్టిలేపేవారు. బ్రిటీషర్లు బాల గంగాధర్‌ తిలక్‌ ను బంధించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. బెంగాల్‌ విభజనను వ్యతిరేకించారు.
మనం జాతీయ గీతంగా పిలుచుకునే ‘జనగణమణ’ను ఆయనే రచించారు.‘వందే మాత రం’ గేయాన్ని1896లో జరిగిన కాంగ్రెస్‌ సదస్సులో తొలిసారిగా ఆలపించారు.దీనిని బక్రించంద్ర చటర్జీ రచించారు.స్వాతంత్య్ర అనంతరం ఈ రెండిరటిలో దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని పెద్ద చర్చ జరిగింది. కానీ 1950 సంవత్సరం జనవరి 24వ తేదీన ‘జనగణమణ’ను జాతీయ గీతంగా ప్రకటించారు.1913 సంవత్సరంలో రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ తన కవితా రచన ‘గీతాం జలి’కిసాహిత్యంలో నోబెల్‌ బహుమతిని అందు కున్న మొదటి భారతీయుడు,అలాగే మొదటి యూరోపియనేతరుడు కూడా ఆయనే. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పిల్లల కోసం శాంతినికేతన్‌ అనే విశ్వవిద్యా లయాన్ని స్థాపించారు.దీనిని విశ్వభారతి విశ్వ విద్యాలయం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ప్రాచీన గురుకుల విద్యను అందించేవారు.
భారత జాతీయ గీతం-జన గణ మన, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించారు. బ్రిటీష్‌ రాజ్‌లో జార్జ్‌ ప్రశంసలతో జాతీయ గీతాన్ని కంపోజ్‌ చేశా రానే ఆరోపణలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ జాతీయ గీతం‘అమర్‌ సోనార్‌బంగ్లా’ కూడా ఆయన స్వరకల్పన చేసిందే. శ్రీలంక జాతీయ గీతం ‘శ్రీలంక మాత’కూడా ఠాగూర్‌సృష్టి నుండి ప్రేరణ పొం దింది. దీన్ని రచించిన ఆనంద్‌ సమర్కూన్‌ రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌తో శాంతినికేతన్‌లో నివసించారు. ఆనంద్‌ సమర్కూన్‌ ఒకసారి మాట్లాడుతూ ఠాగూర్‌ స్కూల్‌ ఆఫ్‌ కవిత్వం తనని బాగా ప్రభావితం చేసిందని చెప్పారు. ఠాగూర్‌ కవిత్వం సంగ్రహావ లోకనం అందులోని ఒక పేరాలో కనిపిస్తుంది. ‘జనగణమన అధినాయక జయహే’ అనే మన జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రుడు ప్రపం చానికంతటికీ ఎత్తయిన హిమాలయములో వున్న మానస సరోవరంలో వికసించిన పద్మం. ఆ పద్మ మే కవీంద్రుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.మేరు పర్వ తంలా పెరిగి తారల తాకునట్టి కీర్తి కిరీటం అలంక రించిన విశ్వకవి. హిందువుల మానసిక సౌంద ర్యాన్ని చూపించిన గీతాంజలి సృష్టికర్త మన రవీం ద్ర కవి. విశ్వ భారతి నిర్మాతసత్యం,శివం,సుం దరం త్రిగుణాత్మక తత్త్వగీతిగీతాంజలి. ఈ లోకా నికి ముముక్షువు వంటి కవి మన రవీంద్రుడు. ద్వంద్వాతీత, కళాసంపత్తి, సహితానాం భావము కలిగిన కవి. వీరు ప్రకృతి ప్రేమికులు. సమయము దొరికినప్పుడు తోటల్లోను,బహిరంగ ప్రదేశాల లోను విహరిస్తూ ప్రకృతిని ఆరాధించేవారు. చిన్నతనంలో వీరికి చదువుపై పెద్దగా మక్కువ ఉండేదికాదు. నిరాడంబరుడు. తన ఊహలకు కలలో రెక్కలు తొడిగి వాటిపై విహరిస్తూ, విచిత్ర లోకంలో గడిపేవాడు. విశ్వంలోని విచిత్రాలను తెలుసుకోవాలనే కుతూహలముతో ఉండేవారు. వారు పాఠశాలలోని చదువు కంటే, ఇంటిలోనే విధ్యాభ్యాసము చేయుటకు ఇష్టపడేవారు. సమ యపాలన అన్న అమిత మక్కువ. చదువవలసిన అంశాలను పద్దతి ప్రకారము అభ్యసించెడివారు. గణితము,చరిత్ర,భూగోళశాస్త్రము,సంస్కృత వ్యాకర ణము ఇష్టంగా చదివెడివారు.ప్రతి దినము వ్యాయా మము చేసెడివారు. చిత్రలేఖనము, సంగీతము, పుస్తక పఠనములపై ఇష్టపడేవారు. అనేక నాటకా లను వీక్షించేవారు. మాతృభాషపై ఎనలేని గౌరవ ము. రచనా వ్యాసంగముపై కూడా వారికి పట్టు అమితము.వారు అనేక వ్యాసాలు, పద్యాలు, విమర్శ లు వ్రాసేవారు.అవి వివిధ పత్రికలలో ప్రచురితమ య్యేవి.కాళిదాసు, షేక్సుఫియరు మొదలుగు వారి రచనలపై అభిరుచిని కలిగి వుండేవారు.కాని చదు వుల నిమిత్తమై ఇంగ్లండులోనిఒకపబ్లిక్‌ స్కూలు లోచేరి,అక్కడి ప్రొఫెసర్‌ మార్లేగారు ఆంగ్ల ఉప న్యాసములు విని, ఆంగ్ల సాహిత్యముపై మక్కువ పెంచుకున్నారు.18 నెలలు విధ్యాభ్యాసము కొరకు లండన్‌లో గడపినా తన మనసుకు నచ్చిన విధ్య ఏదీ పొందలేదు. ఎటువంటి విద్యార్హతలతో తిరిగి రాలేదు. తండ్రి సహాయముతో అనేక భక్తి గీతాలను ప్రచురించారు. రవీంద్రుడు ‘‘భగ్న హృదయము’’, ‘‘నిర్గరేర్‌ స్వప్నభంగ’’,ప్రభాతసంగీత’’ అనే కావ్యాలను రచించారు.రవీంద్రునికి అమితిమైన పేరు ప్రఖ్యా తులు తెచ్చిన రచన ‘‘గీతాంజలి’’.బెంగాలీ భాషలో రచించిన కొన్ని భక్తిగీతాలను ఆంగ్లములోనికి అనువదించి పొందుపరిచారు.ఈ రచన అనేక ప్రపంచభాషలలోనికి అనువదింపబడినది. నిరా శా, నిస్పృహలను దూరం చేస్తూ,సకల సృష్టిని ప్రేమ భావముతో చూచే శ్రమ తత్త్వాన్ని ముఖ్యాంశముగా గల గీతాంజలి నోబెల్‌ బహుమతిని సాధించినది. విశ్వకవిగా గుర్తింపబడినారు. ఆనాటి నుంచి వారి రచనలు విశ్వవ్యాపితమైనాయి.ఒక్క చిటికె కాల పరిమితిలో అయినా నీ సమీపంలో సేదదీరుటకు అనుమతి ఇవ్వమని భక్తిభావంతో భగవంతుని వేడుకున్న రవీంద్రునిలో ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ప్రకృతిని తన స్నేహితుడుగా తలుస్తూ చక్కని భావ ప్రకటన ఈ కవితలో కనపడుతుంది.
తాను చిన్నతనంలో ప్రకృతి ఒడిలో పెరిగిన విధంగా,పిల్లలందరూ తమ బాల్యాన్ని ప్రకృతి సహజీవనంతో గడిపితే మానసిక వికా సానికి దోహదం చేస్తుందని నమ్మేవారు. అందుకు అనుగుణంగా కలకత్తా నగరంలో ‘శాంతి నికేతము’ స్థాపించారు. ఇది పూర్వకాలపు గురుకులాన్ని పోలి వుండేది. విధ్యార్థులు బయట పచ్చికపై కూర్చుని విద్యను అభ్యసించెడివారు.ఇందులో చేరిన విధ్యా ర్థులు క్రమశిక్షణకు మారుపేరుగా పెరిగేవారు. ఉదయం మేల్కాంచినప్పటి నుండి, తిరిగి రాత్రి నిద్రించు వరకు చేయవలసిన దిన చర్యలను పద్దతి ప్రకారం ఆచరించే విధంగా విధి విధానాలను రూపొందించారు. వ్యాయామము, శుభ్రత పాటిం చుట, శాకాహార భోజనము,కాలినడక, పెద్దలను గురువులను గౌరవించుట,సత్యమునే పలుకుట, చెడు పనులను చేయకుండుట, ఆరోగ్య పరిరక్షణ మొదలగు ఉన్నత లక్షణాలను నేర్పుతూ నేటికీ క్రమ శిక్షణతో ముందుకు కొనసాగుతున్న గురుకులం శాంతినికేతనము.గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అని నమ్మిన రవీంద్రుడు, గ్రామాభ్యుదయానికి కూడ తమ వంతుగా గంగాతీరంలో‘శ్రీనికేతన్‌’ స్థాపిం చారు. పరమత సహనాన్ని ప్రబోధించారు. ప్రపం చము ఆనందమయమనీ, మనసుతో అనుభవిం చెడివారికి అవగతమౌతుందని భావించెడివారు. ఉన్నతమైన జాతీయ భావాలు ప్రదర్శించెడివారు. వీరి భావనలకు జవహర్‌లాల్‌ నెహ్రూ ముగ్ధుల య్యెడివారు.బెంగాల్‌ విభజనను తీవ్రంగా వ్యతి రేకించారు. ఈ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. బకింగ్‌ చంద్రచటర్జీ రచించిన ‘వందేమాతరం’జాతీయ గేయంగా గుర్తింపు పొం దగా, రవీంద్రుడ రచించిన ‘జనగణమన’ జాతీయ గీతంగా గుర్తింపు పొందాయి. భారత రాజ్యాంగ ములో వీటికి సమాన ప్రతిపత్తి కల్పించారు. శ్రీ రవీంద్రులు మనకు స్వాతంత్య్రము వచ్చునాటికి మన మధ్య లేకపోవటం తీరనిలోటు. ఆయన రచించిన జాతీయగీతాన్ని నిత్యం మనము ఆలాపి స్తున్నాము. వీరు రచించిన పుస్తకాలలో అనేక ఉత్తమ ప్రభోధాత్మక భావాలు ఉండేవి. ‘చెడుగా ఆలోచించే గుణం సగం సమస్యలకు కారణం’, ‘ఎక్కడవ్ఞినం స్వేచ్చగా మనగలుగుతుందో’,‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో’, ‘ప్రేమించే వ్యక్తికి దండిరచే అధికారం కూడా వుంటుంది’, ‘మూఢత్వ ము మరణానికి దారితీస్తుంది’,‘గడచిన ప్రతీ రోజు నుండి మనము కొత్త విషయాలు నేర్చుకోవాలి’, ‘వైఫల్యాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి’ వంటి సూక్తులు మనకు వీరి రచనలలో కనబడతాయి. వీరు తత్త్వదర్శి,దార్శినికులు శ్రీరవీంద్రనాథ్‌ ఠాగూర్‌.ఆయనన నిధి.వారి మాటలను అనుసరిం చుట మన విధి.రెండవ ప్రపంచ యుద్ధ సమ యంలో మానసింగా కృంగిపోయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌,ఏవైద్యానికి కోలుకోలేదు. వారు భారతదేశ మును శోకసంద్రములో ముంచి 1942, ఆగస్టు 7వ తేదీన పరమపదించారు. `జై భారత్‌-(డా.దేవులపల్లి పద్మజ)

విద్వేషాలలో సమిధలవుతున్న మహిళలు

మహిళలకు విలువ ఇవ్వని ఈ మనువాద పాలకులు అధికార పీఠాలు పొందారు. కడుపులో చేయిపెట్టి తిప్పినట్లు ప్రతి నిముషం ఎక్కడో ఒకచోట ఆడపిల్ల ఆర్తనాదం. దీనిని ఆపాలని మొత్తుకుం టున్నాం. ఆలకిం చడంలా? వదిలేద్దామా? వదిలేస్తే మనం బతగ్గలమా? రక్షణ ఉందా? మన బతుకుల కోసం మన బిడ్డల బతుకుల కోసం కదలాలి. బహు రూపాలలో. వంటరిగా కాదు. సమూహంగా. పాలకులకు చెవికెక్కే వరకు. వారు చెవినెక్కించుకోకపోతే గద్దె దించేందుకు.
మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటన భారతీయ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వెన్నులో వణుకు పుట్టించింది. స్త్రీలను గౌరవిస్తాం. మన భారతీయ సంస్కృతి ఇది అని చెప్పుకునే చోట…ఇంతగా బరి తెగించి బహిరంగంగా మహిళలను నగ్నంగా ఊరేగించే దుర్మార్గం ఏరకంగా సాగింది?‘’న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’’ అంటూ కాలి కింద చెప్పు మాదిరి అణిచివేయాలనేదుర్మార్గపు సాంస్కృతిక నేపథ్యం దీనికి కారణం కాదా? ఈ దుర్మార్గపు సంస్కృతిని ముసుగులా వేసు కున్న పురుషాధిపత్యభావజాలాన్ని, భూస్వామ్య ప్రవృత్తిని మూలాలకంటా ఛేదించాల్సిన అవ సరాన్నిమణిపూర్‌ ఘటనలు వెలుగులోకి తెచ్చా యి.ఆర్‌.ఎస్‌.ఎస్‌ సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటూ కాలం చెల్లిపోయిన భూస్వామ్య పురుషాధిపత్యాన్ని పున:ప్రతిష్టించే ప్రయత్నం చేస్తున్నది.బిజెపి అధికారంలోకి వచ్చేవరకు తన భావజాలాన్ని జనం మీద రుద్దడానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు పెద్దగా అవకాశం దొరకలేదు. చాప కింద నీరు మాదిరి పని చేస్తున్నా కోరలు పెరగలేదు.కానీ నయవంచక బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడంతో వారి ఎజెండాను అత్యంత చురుగ్గా అమలు చేయడం ప్రారం భించారు. తమ మిత్రులైన క్రోనీ క్యాపిటలిస్టుల లాభాల కోసం భూస్వామ్య సంస్కృతిని జోడిరచి మరీ ఈదేశంలో దళితులపై, ఆదివాసీలపై, వెన కబడిన శూద్ర తరగతులపై బుల్డోజర్‌ నడిపిస్తు న్నది. ఈ బడుగు బలహీనులను అణిచివేసేందుకు, సమస్త వనరులను కబ్జా చేసేందుకు పూనుకున్నది. కాశ్మీర్‌ భూభాగాన్ని క్రోనీ క్యాపిటలిస్టులకు అప్ప జెప్పేందుకు 370ఆర్టికల్‌నిరద్దు చేయడం చూశాం. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు ఓ ముస్లిం బాలికపై గుడిలో అత్యాచారానికి తెగబడడం గుర్తుండే వుం టుంది. అక్కడ భూమిని కబ్జా చేసేం దుకే మైనారిటీ తెగకు చెందిన ఆచిట్టితల్లిని చిది మివేశారు. నేడు మణిపూర్‌ కొండల్లో ఉన్న విలువైన ఖనిజ సంపద కోసం రావణ కాష్టం రగిలించారు.
ఆజ్వాలల్లో ఆడపిల్లలు సమిధలవు తున్నారు. ఒకరా? ఇద్దరా? ముగ్గురా? ఎందరు? లెక్కలు తేలాల్సి ఉంది. అసలు తేలుతాయా? అన్నది ఈరోజు అందరూ అడుగుతున్న ప్రశ్న. ఈ ఘటనలు చోటుచేసుకున్న రెండు నెలల వరకు, వీడియో వెలుగులోకి వచ్చేవరకు, సుప్రీంకోర్టు హెచ్చరికచేసే వరకు ప్రధానికి తెలియదా? తెలుసని ఈదేశ ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు.తెలియ డం మాత్రమే కాదు, వాటికి ప్రధాని, ఆయనను నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆమోదం కూడా ఉందని. ఆమోదం లేదా?దీనికి వారు సమాధానం చెప్ప గలిగే ఖలేజా ఉందా?బిల్కిస్‌ బానో మన ఆడప డుచు.పోరాడి గెలిచింది.ఏం చేశారు? ఆగస్టు 15 అమృతోత్సవాల సంబరాల్లో నిందితులకు స్వేచ్ఛని చ్చారు. పైగా ఏమన్నారు? బ్రాహ్మణులు-సంస్కార వంతులు. అంటే ఏమిటి అర్థం. ఇతర కులాలకు చెందిన వారు సంస్కారవంతులు కారనా! అత్యాచా రానికి పాల్పడిన వారు సంస్కారవంతులెలా అవు తారు? ‘ఈ దేశంలో స్త్రీ బ్రాహ్మణులకు మొదటి హక్కు.స్త్రీకి స్వతంత్రత లేదు’-అని మనుధర్మం చెప్తుంది. దాన్నే వీరు తమ చేతల్లో చూపిస్తున్నారు. సంఫీుయుల ప్రకారం కోర్టులు మను ధర్మాన్ని తప్ప ఐపిసిని అనుసరించకూడదు.హత్రాస్‌లో కోర్టు ఆ మనుధర్మాన్నే పాటించింది. ఎవరైనా చని పోయి నప్పుడు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తుంటాం. అయితే అవి అందరికీ లేవు.దళితులకు అసలే లేవు.అందుకే మనీషా వాల్మీకిని అర్థరాత్రి దహనం చేశారు. ప్రజాప్రతినిధి సింగార్‌ అత్యాచారం చేసిన కేసులో జైలుకు వెళ్ళాడు. కానీ బిజెపి నాయకత్వం పూలదండలతో స్వాగతించి భుజాన మోశారు. రెజ్లర్లు మన బిడ్డలు.కఠోర దీక్షతో విజయాలను ముద్దాడిన ప్రియపుత్రికలు.ఈదేశ ప్రతిష్టను ప్రపం చ పటంలో నిలబెట్టిన ఆడపిల్లలు.భద్రంగా కాపా డుకోవాల్సిన బిడ్డలు. తమ మీద లైంగిక దాడి జరిగిందని,న్యాయం చేయమని వారు రోడ్డెక్కినా ప్రధాని మోడీ మాట్లాడలేదని మన దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు.ఔరా!ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తమ సొంత పార్టీ మనిషిని మోడీ వెన కేసుకొస్తున్నాడేమని ఆశ్చర్యపోయారు అమాయకపు ప్రజలు. స్త్రీలు నో అంటే నో అనే అర్థమని అమితా బ్‌ బచన్‌ సినిమాలో చెప్తే మాకేంటి? మేం కోరుకున్న మహిళ మాచెంత ఉండాల్సిందే! అనే ధోరణే దీనికి కారణం కాదా.ఈ రోజు గుంటూరులో ఓరమ్య, విశాఖలో ఓవరలక్ష్మి, విజయవాడలో ఓ దీపిక… ఇలా ఎన్నిపేర్లని చెప్పుకోవాలి?ఆడపిల్లను కోరుకు న్నప్పుడు కాదంటే చంపటం ఈభావజాలం వల్లే కదా! మహిళలకు విలువ ఇవ్వని ఈ మనువాద పాలకులు అధికార పీఠాలు పొందారు. కడుపులో చేయిపెట్టి తిప్పినట్లు ప్రతినిముషం ఎక్కడో ఒకచోట ఆడపిల్ల ఆర్తనాదం. దీనిని ఆపాలని మొత్తుకుం టున్నాం.ఆలకించడంలా? వదిలేద్దామా? వదిలేస్తే మనం బతగ్గలమా? రక్షణ ఉందా? మన బతుకుల కోసం మనబిడ్డల బతుకుల కోసం కదలాలి. బహు రూపాలలో. వంటరిగాకాదు. సమూహంగా పాల కులకు చెవికెక్కే వరకు. వారు చెవి నెక్కించుకోకపోతే గద్దె దించేందుకు. మహిళల రక్షణ కోసం ఆర్తితో, ఆవేదనతో,ఆగ్రహంతో మహిళా సంఘం ఓ బృహ త్తర కార్యక్రమం చేపట్టింది. మహిళా సంఘాలు కలిసి రూపొందించిన కోర్కెల పత్రాన్ని ప్రజల ఎజెండాగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల రక్షణ కోసం నేడు పోరాట గడ్డ ఉక్కు నగరం విశాఖ నుండి ఒకయాత్ర, హిం దూపురం నుండి మరో యాత్ర ప్రారంభమైంది. హింస లేని సమాజంకోసం అన్ని జిల్లాల్లోనూ విస్తృ తంగా ప్రచార సభలు జరగనున్నాయి. ఆగస్టు 8న విజయవాడలో జరగనున్న బహిరంగ సభ నుంచి మహిళా రక్షణకోసం చేయిచేయి కలిపి నడుద్దాం.ఈ మహఉద్యమంలో భాగస్వాముల మవుదాం. మనువాద రాచరిక సంస్కృతిని, దానిని కాపాడే వారిని నిలదీద్దాం.వెలివేద్దాం.
ఇవి డిమాండ్లు …
జు మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయ నం చేయటానికి, చర్యలు తీసుకోవడా నికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో కమి షన్‌ ఏర్పాటు చేయాలి.
జు మహిళలపై హింసను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మహిళా సంఘాలు స్వచ్ఛం ద సంస్థలను ఆహ్వానించి కార్యాచరణను రూపొందించాలి.
జు మహిళలకు,చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
జు నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠినమైన శిక్షలు విధించాలి. చెరుకుపల్లి మండలంలో అమర్నాథ్‌ హత్య కేసును ఫాస్ట్‌ ట్రాక్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి.
జు ప్రభుత్వం మీడియా మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలి.హింస,అశ్లీలత, అసమాన తలను ప్రేరేపించే చలనచిత్రాలు,టీవీ సీరి యల్స్‌,ఇంటర్నెట్‌కార్యక్రమాలను నిషేధిం చాలి.
జు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌లపై చర్యలు ఉండాలి.
జు కాలేజీల్లో,పని ప్రదేశాల్లో వేధింపులను నిరో ధించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి,అమలు చేయాలి.
జు అన్ని విద్యాలయాల్లో లింగ సమానత్వాన్ని పెంపొందించే సిలబస్‌ను రూపొం దించా లి.బాలబాలికల మధ్య స్నేహపూర్వక అవ గాహనను కల్పించాలి.
జు పాఠశాలల్లో శారీరక దారుఢ్యాన్ని పెంచే ఆటలు, ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలు… అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
జు వన్‌ స్టాప్‌ సెంటర్లు, హెల్ప్‌ లైన్లు ఉమ్మడిగా సమన్వయంతో పని చేసే ఏర్పాటుచేయాలి. తగిన సిబ్బందిని నియమించాలి.ఏ నెలకా నెల జీతాలు చెల్లింపు చేయాలి.
జు మద్యం, మత్తు పదార్థాలను నియంత్రిం చేందుకు చర్యలు చేపట్టాలి. మండలానికి ఒక మద్యం షాపును మాత్రమే అనుమ తించాలి.
జు మద్యం,మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రభుత్వం విస్తృతప్రచారం చేయాలి.మద్యం మీద వస్తున్న ఆదాయంలో కనీసం ఒక్కశాత మైనా మద్య నియంత్రణకు కేటాయించాలి.
జు బాల్య వివాహాల నిరోధానికిగాను బాలిక లకు నిర్బంధ విద్య 19 సంవత్సరాల వరకు పెంచాలి.
జు ఒంటరి మహిళలకు, వారి కుటుంబాల్లోని పిల్లలకు అదనపు రక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
జు అనాథ బాలలు, ఆడపిల్లలు ఉన్న హాస్టళ్లలో, గెస్ట్‌ హౌస్‌లో పురుష సిబ్బంది ఉండరాదు.
జు పోలీసులకు జండర్‌ సెన్సిటివిటీ పెంచడా నికి క్రమబద్ధంగా శిక్షణ కార్యక్రమాలు ఉండాలి.సక్రమంగా లేని పోలీసు ఆఫీసర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
జు మహిళల సమానత సాధనకు చర్యలు ము మ్మరం చేయడం ద్వారానే హింసను కూడా అరికట్టడం సాధ్యమవుతుంది. కనుక అన్ని రంగాల్లో సమానత సాధనకు ప్రభుత్వం పూనుకోవాలి.
జు బాధితుల పునరావాసం కోసం కంపెన్సేషన్‌ ఇవ్వవలసిన నిధులను నెలలోగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
జు ఉపాధి గ్యారంటీ పథకాలు రూపొందించి అమలు చేయాలి. పెద్ద సంఖ్యలో ఉన్న అసంఘటిత మహిళా కార్మికులకు కార్మిక చట్టాలు అమలు పరిచేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
జు ప్రతివారం ఒకప్రాంతంలో మండల అధికా రులు మహిళల హక్కులను వివరిస్తూ అమలుకు పూనుకునే విధంగా ప్రచారం, కార్యాచరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి.
జు మహిళలకు విద్య,రక్షణ, ఉపాధి భద్రత కల్పించేందుకు రాజ్యాంగ విలువలను కాపాడే పద్ధతులను అమలు చేసేందుకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి అమలు చేయాలి. వ్యాసకర్త:ఐద్వా రాష్ట్ర కార్యదర్శి

ప్రభం జనం ఆపుదాం..!

దేశమంటే మట్టి కాదోయ్‌…దేశమంటే మనుషులోయ్‌…! మహాకవి గేయానికి ఆధునిక కాలంలో మరో మాట కలుపవచ్చు. మనుషులంటే వనరులోయ్‌…!! అని. అధిక జనాభా ఆర్థిక వృద్ధికి అవరోధం అనేది ఒకప్పటి మాట. ఇపుడు మానవ వనరులే చోదకశక్తిగా ప్రగతిశీలత కనబరు స్తున్న దేశం మనది. ప్రగతిఎక్కడుంటే మానవ వనరులు అక్కడికి పరుగులు తీస్తాయి. అక్షరాస్యత, వృత్తి నైపు ణ్యం, గతిశీలత ఉన్న జనాభా విశాఖ అభివృద్ధికి ఆయువుపట్టు. అయితే పెరిగిన జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం అవసరం. జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కథనం… ప్రపంచ జనాభాదినోత్సవం (జూలై11)సంద ర్భం గా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకా రం భారత్‌వచ్చే ఏడాది1.4బిలియన్ల (140 కోట్లు) జనాభాతో చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినదేశంగా అవతరించ నుం ది.ఈనివేదిక ప్రకారం ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్‌ నాటికి 800 కోట్లకు చేరనుంది. కానీ, ప్రస్తుతం జనాభా పెరుగుదల, గతంలో ఉన్నంత వేగంగా లేదు.1950తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగాఉన్నప్పటికీ, 2080ల నాటికి 10.4బిలియన్ల(1040కోట్లు)కు చేరుకుం టుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని నమ్ముతు న్నారు. కానీ, ప్రపంచ జనాభా పెరుగుదల అసమా నంగా జరుగుతోంది.వచ్చే 30ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50శాతానికి పైగా కేవలం 8దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిరచింది. కాంగో,ఈజిప్ట్‌, ఇథియోపి యా,భారత్‌,నైజీరియా,పాకిస్తాన్‌,ఫిలిప్పీన్స్‌, టాంజా నియా దేశాల్లోనే ఈఅధిక జనాభా రేటు నమోదవు తుందని చెప్పింది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశా లు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తిరేటు ప్రతీ మహిళకు సగటు న 2.1 కంటే తగ్గిపోయింది.61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం1శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.
ప్రపంచంలోనే అతి తక్కువ సంతానో త్పత్తి రేటు ఉన్న దేశాల్లోచైనా కూడా ఒకటి. చైనా లో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభా లో క్షీణత ప్రారంభమవుతుందని చైనా ప్రకటిం చింది.దేశంలో ‘ఒకేబిడ్డ’అనే విధానాన్ని విడిచి పెట్టి,ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా అనుకున్నదానికంటే వేగంగా తగ్గు తోంది.భారత్‌లో జనాభా పెరుగుతూనే ఉన్నందున, కచ్చితంగా చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్య ధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించ నుంది.జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి.సైన్స్‌,మెడిసిన్‌ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగు దలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాలరేటు తగ్గిపోవడంతోపాటు,ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండనుంది.కానీ, దీని ప్రకారం జనాభాలో 65ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10శాతంగా ఉండగా,2050 నాటికి16శాతానికి పెరుగు తుంది.ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.
జనాభా దినోత్సవం నేపపథ్యం ఇదీ..
ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కులు వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా దినోత్సవం,2023 ఇతివృత్తం ఏమిటంటే,‘‘హక్కులు,ఎంపిక చేసుకునే అవకాశాలే సమాధానం.జననాలరేటు పెరగడం లేదా తగ్గడం, ప్రజలందరి సంతానోత్పత్తి ఆరోగ్యానికి, హక్కులకు ప్రాధాన్యమివ్వడంలోనే మారుతున్న సంతానోత్పత్తి సామర్థ్య రేట్లకు పరిష్కారం ఉంది.’’యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏ రోజున ప్రపంచ జనాభా 500కోట్లకు చేరుతుందని అంచ నా వేస్తారో,ఆరోజున (1987 జూలై 11న) దీనిని జరపాలని నిర్ణయించింది. దీనిని కొనసాగించాలని 1990లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మా నం చేసింది. అధిక జనాభా ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపింది. కుటుంబ నియంత్రణ, పౌర హక్కులు, పేదరికం, మానవాళిపై అధిక జనాభా చూపే ప్రభావం గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉప యోగపడతాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారతదేశం నిలి చింది.అధిక జనాభా కారణంగా కోవిడ్‌-19 మహమ్మారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2030 ఎజెం డా అనేది ఆరోగ్యవంతమైన భూమండలంపై ప్రజ లందరికీ మెరుగైన భవిష్యత్తుకు ప్రపంచ బ్లూప్రింట్‌ అని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటో నియో గుటెరస్‌ అన్నారు. జనాభా వృద్ధి, వృద్ధాప్యం, వలసలు,పట్టణీకరణ సహా జనాభా ధోరణులతో ఈమిషన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుర్తిస్తు న్నట్లు తెలిపారు.
జనభాతో పాటు సమస్యలు ఎక్కువే..!
ఇక ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా పెరుగుతున్న జనాభాతో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది గత 32 ఏళ్లుగా జరుగుతున్నదే. అయినప్పటికీ ప్రతి ఏటా జనాభా పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. జనాభాతో పాటే తద్వారా వచ్చే సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. భారత్‌నే తీసుకుంటే ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 2100నాటికి మనదేశంలో జనాభా 1450 మిలియన్‌ తాకుతుందని అంచనా వే సింది.1950లో ఉన్న జనాభా 2100 నాటికి చైనా జనాభాను కూడా భారత్‌ దాటుతుందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తన నివేదికలో వెల్లడిరచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాభా ఉన్న 10దేశాల్లో ఒక్క ఆఫ్రికా దేశాలే ఐదుగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. ప్రపంచ జనాభాలో 16శాతం భారత్‌లోనే ఇక ప్రపంచ జనాభాపై ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి ఏటా దాదాపు 83 మిలియన్‌ పెరుగుతోంది. ఇక 2030 నాటికి ప్రపంచ జనాభా 8.6బిలియన్‌ మార్కును తాకుతుందని చెప్పడంలో ఎలాంటి సం దేహం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే ప్రపంచ భూభాగంలో కేవలం 2శాతం భూమిని మాత్రమే కలిగి ఉండే భారత దేశం… ప్రపంచ జనాభా విషయానికొచ్చేసరికి దాదాపు 16 శాతం జనాభా మనదేశమే అకామొడేట్‌ చేయడం విశేషం. ఇక భారత్‌లో 35శాతం జనాభాబీహార్‌,ఉత్తర్‌ ప్రదేశ్‌,మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఉన్నట్లు సమాచారం. అత్యధిక జనాభా ఉండటం వల్ల సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధానమైన సమస్య పేదరికం అని వెల్లడిస్తున్నారు.
2050 నాటికి స్త్రీ, పురుషుల జనాభా సమానం
2050 నాటికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా.2020లో, 1950 తర్వాత మొదటిసారిగా,జనాభా పెరుగు దల రేటు సంవత్సరానికి 1శాతం కంటే తక్కువగా పడిపోయింది. ఇది రాబోయే కొన్ని దశాబ్దాల్లో, ఈ శతాబ్దం చివరి వరకు మందగించడం కొనసా గుతుందని అంచనా వేసింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో,అంతర్జాతీయ వలసలు జనాభా మార్పులో ప్రధాన అంశంగా మారాయి. 2010, 2021మధ్య పది దేశాలు1మిలియన్‌ కంటే ఎక్కువ వలసదారుల నికర ప్రవాహాన్ని అనుభవించాయని అంచనా వేయబడిరది.ఈదేశాలలోచాలా వరకు,ఈ ప్రవాహాలు తాత్కాలిక శ్రామిక కదలికల కారణం గా ఉన్నాయి, అవి పాకిస్థాన్‌ (2010-2021లో -16.5 మిలియన్ల నికర ప్రవాహం), భారతదేశం (-3.5 మిలియన్లు),బంగ్లాదేశ్‌(-2.9 మిలియన్లు), నేపాల్‌ (-1.6మిలియన్లు),శ్రీలంక(-1 మిలియన్‌). జనాభా రెట్టింపుతో వనరులపై తీవ్ర ప్రభావం46 అతితక్కువ అభివృద్ధి చెందిన దేశాలు (ూణజు) ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఉండనున్నాయి.అనేక మంది 2023,2050 మధ్య జనాభాలో రెట్టింపు అవు తుందని అంచనా వేయబడిరది, వనరులపై ఇది అదనపు ఒత్తిడిని, సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ూణGం) సాధనకు సవాళ్లను విసిరింది.జనాభా, స్థిరమైన అభివృద్ధి మధ్య సంబంధాన్ని వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఇతర ప్రపంచ పర్యావరణ సవాళ్ల నేపథ్యం లో పరిగణించాలని యూఎన్‌ నివేదిక పేర్కొంది. జనాభా పెరుగుదల పర్యావరణ నష్టానికి ప్రత్యక్ష కారణం కాకపోవచ్చుబీ అయితే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు లేదా పరిగణించ బడిన కాలపరిమితి, అందుబాటులో ఉన్న సాంకేతి కత,జనాభా,సామాజిక,ఆర్థిక సందర్భాలపై ఆధార పడిదాని ఆవిర్భావ సమయాన్ని వేగవంతం చేయ వచ్చు.-జిఎన్‌వి సతీష్‌

అంతర్ధానమవుతున్న మాతృభాషలు

మనిషి తన తల్లికి ఎంత దగ్గరగా ఉంటాడో మాతృ భాషకు కూడా అంత దగ్గరగా ఉంటాడు. పిల్ల వాడు, తన భాషా సామర్ధ్యాన్ని తల్లి నుండి నేర్చుకుం టాడు. ఏతల్లీ కూడా అప్పుడే పుట్టిన పిల్లాడికి ఎలాంటి వ్యాకరణ నిబంధనల్ని బోధించదు. అయినా,తన తల్లి పెదాల కదలికలు, ఆమె అభినయా లను గమనించడం ద్వారా,ఆమె మాటల ధ్వని, ఆమాటల కూర్పును గ్రహిం చడం ద్వారా ఆపిల్లాడు అంత సంక్లిష్టమైన నిబంధనల్ని వంట బట్టించుకుంటాడు.పిల్లలు భాషలను పాఠశాలలో నేర్చుకుంటారనే ఒక విస్తృతమైన తప్పుడు అభిప్రా యం ఉంది.అది మాతృభాషేతర భాషల విషయం లో వాస్తవం కావచ్చు.ద్వితీయ, తృతీయ లేక ఇతర భాషల్ని వ్యాకర ణం,అనువాదంద్వారా నేర్చు కోవా ల్సి ఉంటుంది. కానీ పిల్లవాడు మూడు సంవత్స రాల వయసొచ్చే సమయా నికి మాతృభాష లోని దాదాపు అన్ని సంక్లిష్టతలను నేర్చుకోవడానికి అను గుణంగా మెదడు నిర్మితమై ఉంటుంది. లేఖనం (రాత) అనేది వేరే అంశం. కొన్ని లక్షల సంవత్స రాల మానవ జాతి చరిత్రలో, లేఖనం అనేది ఏడు వేల సంవత్సరాల క్రితమే వ్యక్తీకరణకు, సమా చారాన్ని అందించే,జ్ఞాపకాలను నిల్వ చేసే సాధనం గా మారింది. భాష అంటే ప్రాథమికంగా మాట్లాడ టం.లేఖనం ద్వారా తరాల మధ్య సుదీర్ఘ కాలం పాటు భాషాపరమైన సంబంధ బాంధ వ్యాలకు అవకాశం ఇవ్వడం భాషకుండే అదనపు లక్షణం.
నాబాల్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మాతృభాష కాని ఇతర అనేక భాషలను వారాంతపు సంతల్లో జనసమూహాలు మాట్లాడడం స్వయంగా విన్నాను. అప్పట్లో రేడియో అనేది మా గ్రామంలో ఓకొత్త యంత్ర పరికరం. ఇంట్లోకి కొత్త రేడియో సెట్‌ రావడంతో నేను ఎంతో ఆసక్తిగా స్టేషన్లను కదిలిస్తుండేవాడ్ని.వారాంతపు సంతల్లో వినని అనేక భాషల్ని రేడియోలో విన్నాను. దీంతో అసలు ఈ ప్రపంచంలో ఇంకా ఎన్ని భాషలు ఉన్నాయో తెలు సుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది.1970లో ఒక విశ్వవిద్యాలయం విద్యార్థిగా భారతీయ భాషలపై జనగణనకు సంబంధించిన చిన్న పుస్తకాన్ని చూశా ను.దానిలో 109భాషల జాబితా ఉంది. ఆ జాబి తాలో చివరన ఃఃఅన్ని ఇతర భాషలు అని ఉంది. అంటే 108భాషల కన్నా ఎక్కువ భాషలు ఉన్నా యనే దానికి ఇదొక సూచిక. ఇంతకన్నా ముందుగా జనాభా లెక్కల్లో మరికొన్ని వివరాలు తెలుసు కోవాలనే ఉద్దేశంతోయూనివర్సిటీ లైబ్రరీలో 1961 జనాభా గణాంకాల కోసం వెతికాను. ఆ గణాం కాలలో నేను దిమ్మతిరిగే విషయాలను గమనిం చాను.ఆజాబితాలో 1652 భాషల్ని తమ మాతృ భాషగా భారతీయులు పేర్కొన్నారు. పైన ఉదాహ రించిన భాషల గణాంకాలకు సంబంధించి రెండు రకాల సంఖ్యల్ని పోల్చితే 10 సంవత్సరాల కాలం లో (అంటే 1961-1971మధ్య కాలంలో) భారత దేశం మొత్తం 1544 భాషల్ని కోల్పోయింది. భాషా గణనను మామూలు అంక గణితం ద్వారా విభజిం చలేం.దానికి శిక్షణ పొందిన భాషా పండితుల పరిశీలన అవసరం ఉంటుంది. అందువలన భారతీ య జనగణన రిజిస్ట్రార్‌ దగ్గర పని చేస్తున్న భాషా పండితులు, విద్యావిషయక నిష్ణాతుల సాహిత్యం లో నమోదుచేయబడిన మాతృభాషల పేర్లు (జనా భా లెక్కల సమయంలో ప్రజలు చెప్పినవి) ఏమైనా ఉన్నాయేమోనని అందుబాటులో ఉన్న గ్రంథాల యాలలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. అందువల్ల సాధారణంగా భాషకు సంబంధించిన గణాంకా లను చివరగా ప్రకటిస్తారు.
1971 భాషా గణనకు, భాషా గణాం కాల ప్రకటన మధ్య కాలంలో బంగ్లాదేశ్‌ యుద్ధం జరిగింది.తరువాత కాలంలో బంగ్లాదేశ్‌గా మారి న తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ నుండి భాషా సమస్య పైనే విభజనను కోరింది. భారత ప్రభుత్వం భాషా వైవిధ్యం గురించి ఆందోళన చెంది,భాషల సంఖ్యను తగ్గించే మార్గాలను వెతికే నిర్ణయం చేసి వున్నట్లైతే, అది సహజమేనని భావిం చాలి.అందుకుగాను ప్రభుత్వం ఃఃపది వేల (భాషను మాట్లాడే వారి సంఖ్య) సంఖ్యఃః పరిమితిని విధిం చింది.ఈసంఖ్యా పరిమితికి ఎలాంటి శాస్త్రీయమైన పునాది లేదు. ఒక భాషను భాషగా పరిగణించా లంటే ఆ భాషను మాట్లాడేవారు కేవలం ఇద్దరుంటే చాలు.1970 ప్రాంతంలో 1544మాతృ భాషలు ఆకస్మికంగా మౌనం వహించాయా? కచ్చితంగా కాదు.అవికొద్ది జనాభా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో కొనసాగాయి.
ప్రభుత్వం కృత్రిమంగా విధించిన సీలింగ్‌ కారణంగా వాస్తవానికి ఎన్నిభాషలు అంత ర్ధానయ్యాయో తెలుసుకోవాలంటే1971 జనగణ నను 2011జనగణనతో పోల్చి చూడాలి. ప్రజలు తమ మాతృభాషగా పేర్కొన్న భాషల్ని లెక్కించ డానికి అదే జనగణన పద్ధతిని అనుసరించగా భారతదేశంలో ప్రజలు 1369 భాషలను మాట్లా డుతున్నట్లు 2011జనగణన నిర్ధారించింది. రెండు సంఖ్యలను పోల్చి చూడడం ద్వారా 1961 నుండి 2011వరకు…అంటే50 సంవత్సరాల్లో (1,652 -1,369¸283)283 భాషలు అంతరించి పొయ్యా యనే నిర్ధారణకు ఎవరైనా రావచ్చు. అంటే సంవ త్సరానికి సగటున నాలుగు లేక ఐదు భాషలు లేదా ప్రతీ రెండు లేక మూడు నెలలకొక భాష అంతరించినట్టు అర్థం చేసుకోవాలి. గతంలో ఓ వెయ్యి సంవత్సరాల పాటు అంతర్ధానమైనఃః భాషలు ఉనికిలో ఉన్నాయనే విషయాన్ని పరిగణన లోకి తీసుకుంటే, భారత దేశంలో భాషల అంత ర్ధానరేటు గుండెలు అదిరిపోయే విధంగా ఉంది. జనగణనమాతృభాషలనే మాటను ఉపయోగించి నప్పుడు,వాటిలో చిన్న లేదా అల్ప సంఖ్యాక భాష లు మాత్రమే కాక అధిక సంఖ్యాక భాషలు కూడా ఉన్నాయనే విషయం ఎవరికైనా అంత తేలిగ్గా స్ఫురణకు వస్తుందనుకోలేం.
భారతదేశ ప్రజలు మాట్లాడిన వివిధ భాషల వివరాలు దశాబ్దాలవారీగా చూస్తే, 1961 లో బంగ్లా మాట్లాడేవారు మొత్తంజనాభాలో 8.17 శాతం ఉండగా అర్ధశతాబ్దం తరువాత వారి సంఖ్య8.03శాతానికి తగ్గింది. మొత్తం జనాభాలో మరాఠీ భాష మాట్లాడేవారి సంఖ్య 7.62 శాతం నుండి 6.86శాతానికి, తెలుగు మాట్లాడేవారు 8.16 శాతం నుండి 6.70 కి, తమిళం మాట్లాడే వారి సంఖ్య మరీ దారుణంగా6.88శాతం నుండి 5.70శాతానికి దిగజారింది. వాస్తవానికి హిందీ భాష తరువాత ఎక్కువగా మాట్లాడే మొదటి ఎని మిది భాషలు-బంగ్లా,మరాఠీ, తెలుగు,తమిళం, గుజరాతీ,ఉర్దూ,కన్నడం,ఒడియా మొత్తం జనాభా లో 2011జనగణన ప్రకారం 42.37శాతం కాగా హిందీ ఒక్కటే 43.63శాతంగా నమోదైంది. హిందీ మాట్లాడేవారి సంఖ్య ఎప్పుడూ పెరుగు తూనే ఉంది.1961లో36.99శాతంగా నమోదైన హిందీ మాట్లాడే వారిసంఖ్య 2011నాటికి మొత్తం జనాభాలో 43.63శాతానికి పెరిగింది. హిందీ, సంస్కృతం,గుజరాతీ భాషలను మినహాయిస్తే మిగి లిన గుర్తించబడిన అన్ని భాషల అంతర్ధానం కొన సాగుతూనే ఉందని 2011జనగణన తెలియ జేస్తుంది.196లో సంస్కృత భాషను మాతృభాషగా పేర్కొన్న వారిసంఖ్య 2,212 మంది కాగా 2011 లెక్కల్లో ఆ సంఖ్య 11రెట్లు పెరిగింది. అంటే ఆ సంఖ్య 24,821కి పెరిగింది. 2011లో జరిగిన భాషా గణన వివరాలను 2018లో ప్రకటించారు. తమిళ భాష ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవభాషగా ఉంది.కన్నడం,మరాఠీ భాషలు సుమా రు రెండు వేల సంవత్సరాలుగా,మలయాళం, బంగ్లా, ఒడియా భాషలు కూడా దాదాపు 1000 సంవత్సరాలుగా జీవభాషలుగా ఉంటున్నాయి. సంస్కృతం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా జీవభాషగా లేకుండా నిలిచిపోయింది.దీనికి భిన్నంగా 17వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఇంగ్లీష్‌ భాష అందరి అంగీకారం పొందింది. దీనిని మాట్లాడే వారిసంఖ్య జనగణనలో 2,59, 878గా చూపబడిరది.ఇంగ్లీష్‌ దినపత్రికల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. భారతదేశంలో ఏడులక్షల గ్రామాల్లో, రెండు వేలనగరాలు, పట్ట ణాల్లో ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠశాలలు నిర్వహించ బడుతున్నాయి.ఇంగ్లీష్‌ టీవీఛానళ్ల రేటింగ్‌ పాయిం ట్లు కూడా పెరిగిపోతున్నాయి. అసలు ఇంగ్లీష్‌ మాట్లాడే వారి సంఖ్య (సంస్కృతం మాట్లాడే వారి సంఖ్యకు భిన్నంగా) పెరుగుతుండడం నిజమే అని తెలుస్తుంది.
విచారకరమైన నిర్ధారణ ఏమంటే భారతీయులు మాట్లాడే అల్పసంఖ్యాక, అధిక సంఖ్యాక భాషలన్నీ (హిందూత్వ భావజాలాన్ని అనుసరించేవారు ఇష్టపడే భాషలను మినహాయిస్తే) నేడు వాటి ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.మన రాజ్యాంగంలో పేర్కొన్న ట్లుగా బహు భాషలు మాట్లాడే వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న భారత దేశానికి ఇది మంచిది కాదు.(ఫ్రంట్‌లైన్‌ సౌజన్యంతో).
` వ్యాసకర్త:ఒబైడ్‌ సిద్ధిఖీ చైర్‌ ప్రొఫెసర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌,బయోలాజికల్‌ సైన్సెస్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, బెంగళూరు
-గణేష్‌ దేవీ

అనుకున్నంతగా..వానల్లేవు

వేసవిలో పంట చేతికొచ్చే సమయానికి వద్దన్నా రెండు దఫాలుగా రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. చేతికొచ్చిన వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే వానాకాలం సీజన్‌ నెలన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవకపోవడం గమనార్హం. ఎండాకాలం యాసంగిలో వద్దన్నా కురిసిన బారీ వర్షాలు అదే వానాకాలం వచ్చే ముఖం చాటేయడంతో ఆరుతడి పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల రాక కోసం తెలుగు రాష్ట్రాల రైతాంగం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
స్తారు నుంచి భారీవర్షాలు లేక కంది,సోయా, మిర్చి,వేరుశనగ మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు రెండాకుల దశలోనే ఉన్నాయి. ఆశిం చిన స్థాయిలో వర్షాలు లేక మొలకదశలోనే పత్తి ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈఏడాది రాష్ట్రంలోదాదాపు50లక్షలకు పైగా ఎకరాల్లో పత్తిసాగవుతుందని వ్యవసా యశాఖ అంచనా వేసింది.కాని వర్షాలు ముఖం చాయే టడంతో అడపదడపావాన లకు కొన్ని జిల్లాల్లో రైతులు విత్తనాలు వేశారు. ఇప్పటికీ దాదాపు 20లక్షల ఎకరాల్లో వర్షాలు పడితే పత్తినాటేం దుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.సాధారణం గా ఏటావర్షాకాలం ఆరంభంలో కురిసే వర్షా లతోనే రైతులు ఆతరుడి పంట విత్తనాలు వేస్తారు.వర్షాలు కురుస్తాయోమోనన్న ఆశతో ఈసారి కూడా రోహిణిలోనే పత్తివిత్తనాలు నాటారు. అయితే జూన్‌ నెలలో ఆరుతడి పంటలకు కావాల్సి నంతగా వర్షాలు కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తం గా చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. చెదురు ముదురు చినుకులకే విత్తనాలు విత్తినా అవి మొలకె త్తేందుకు, మొలకెత్తినా ప్రాణం పోసుకుని ఎ దిగేందుకు సరిపడా వర్షాలు లేక రైతులు తీవ్ర అవస్థులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం జులై మొదటి వారం గడిచిపోయినా కూడా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వానాకాలం పంట లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గతే డాది ఇదే సమయానికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైంది. కాని ఈ ఏడాది జులై రెండో వారంవచ్చినా వరుణుడు కరుణించడం లేదు. సాధారణంగా జూన్‌ నెలతలో 144.1మీమీ. వర్షపాతం కురవాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో కేవలం 66.9 మి.మీ. వర్ష పాతం అది కూడా మూడు, నాలుగు జిల్లాల్లోనే కురిసింది.దాదాపు 77.2మి.మీ లోటు వర్షపాతం జులైలో నమోదయింది. వర్షాలు పడక పత్తి మొక్క లు ఎండిపోతుండడంతో రైతులు కూలీలను పెట్టి మరి బిందెలు, ట్యాంకర్లతో మొక్కమొక్కకూ నీటిని పోస్తున్నారు.సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయని ఆవదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందడం లేదు. దీంతో కనీసం బోరు, బావినీటితోనైనా ఆరుతడి పంటలను కాపాడుకు నేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏటా మాదిరిగా జూన్‌ నెలలో వర్షాలు కురిస్తే పత్తి మొక్కలు జులై రెండో వారంకల్లా మొక్క ఎదగడంతోపాటు కొమ్మలు పెట్టే దశలో ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తు పెరగాల్సి ఉంది.కాని ఈ సారి నెలన్నర వానాకాలం సీజన్‌ గడుస్తున్నా పత్తి మొక్కలు ఇంకా రెండాకుల దశ లోనే ఉన్నాయి. మొక్క ఎదుగుదల ఆశించిన స్థాయి లో లేకపోతే కొమ్మలు రాకపోతే కాత తగ్గి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మరో రెండు వారాలు వర్షాలు కురవకపోతే ఆత ర్వాత కురిసినా పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతు లు చెబుతున్నారు.
ఏ పంట..ఎప్పుడు వేసుకోవాలంటే!
వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవు తున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధ మవు తున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవా లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒకరకమే సాగు చేస్తూ అన్న దాతలు నష్టపోతు న్నారు. అయితే అదును చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవ డంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడుసాగు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? అనే అంశాలపై నిపుణుల
సూచనలు, సలహాలు.
మొక్కజొన్న : మొక్కజొన్న పంటకాలం 110 నుంచి 120 రోజులు ఉంటుంది.జూన్‌ 15 నుంచి జూలై 15లోపు విత్తనాలు విత్తుకోవాలి.మొక్కజొన్న సున్నితమైన పంట. నీరు ఎక్కువ ఉన్నా, తక్కువున్నా తట్టుకోదు.కాండం తొలుచు పురుగుతో తీవ్ర నష్టం జరుగుతుంది. పంటసాగు చేసిన 30రోజుల లోపు కాండం తొలుచు పురుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.30రోజులు గడిచిన తర్వాత దాని ప్రభా వం పంటపై అంతగా ఉండదు. కాండం తొలుచు పురుగు ఉధృతికి జూలై చివరివారం నుంచి ఆగస్ట్‌ లో వాతావరణ అనుకూలంగా ఉంటుంది.జూన్‌ లో మొక్కజొన్న సాగు చేయడంవల్ల పంటకాలం 30రోజులుదాటి పురుగు ప్రభావం అంతగా ఉండదు.ఆలస్యంగా సాగు చేస్తే కాండం తొలుచు పురుగుతో నష్టపోవాల్సి వస్తుంది.రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 లోపు విత్తనాలు వేయాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 లోపు పంట చేతికొస్తుంది.
పెసర :పెసర పంట కాలం 60నుంచి 75 రోజులు ఉంటుంది.జూన్‌ 15నుంచి జూలై 15లోపు సాగు చేయాలి. ఆగస్టు 25 వరకు పంట చేతికొస్తుంది. ఆగస్టులో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉండ డంతో పెసర పంట నష్టపోయే ప్రమాదం ఉం టుంది.జూన్‌ 20లోపు సాగు చేస్తే ఆగస్టు 10లోపు పంట చేతికి వస్తుంది.రబీలో సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 30లోపు సాగు చేయాలి నవంబర్‌ 20 నుంచి జనవరి 15వరకు పంట చేతికొస్తుంది. పత్తి : పత్తి సాగును వీలైనంత వరకు తగ్గించాలి. పత్తి సాగుకు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధర లేకపోవ డంతో పత్తి సాగు రైతులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్ల రేగడి భూమిలో పత్తి సాగు చేసే రైతులు 60 నుంచి 70మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వా త పత్తి గింజలు విత్తుకోవాలి. జూన్‌ 20 నుంచి జూలై 20వరకు పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల రసం పీల్చుపురుగులు ఉధృతితక్కువగా ఉంటుంది.
కంది : కంది పంట కాలం 6 నెలలు. జూన్‌ 20 నుంచి జూలై చివరి వారం వరకు సాగు చేసు కోవాలి. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 15 వరకు పంట చేతికొస్తుంది. సకాలంలో కంది సాగు చేయ డం వల్ల జనవరిలో రెండో పంటగా పెసర సాగు చేసుకొవచ్చు.నీటి వసతి ఉన్న రైతులు కందిలో అంతర పంటగా సోయాబీన్‌, మొక్కజొన్న సాగు చేయడంవల్ల అధికలాభాలు సాధించవచ్చు. సోయాచిక్కుడు : సోయా చిక్కుడు పంట కాలం నాలుగు నెలలు ఉంటుంది. పెసరతో పోలిస్తే సోయా చిక్కుడు వర్షాలను తట్టుకునే అవకాశం ఉంటుంది. నీటి వనరు ఉన్న రైతులు జూన్‌ 20 నుంచి జూలై 10వరకు సాగు చేయాలి. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 20 వరకు పంట చేతికొస్తుంది. సోయాచిక్కుడు సకాలంలో సాగు చేయడం వల్ల రెండో పంటగా వేరుశెనగ,మూడో పంటగా వేసవి లో పెసరను సాగు చేసుకోవచ్చు.
మిరప : మిరప పంట కాలం ఏడు నెలలు ఆగస్టు మొదటి వారంలో నారు పోసుకుని సెప్టెంబర్‌లో నాటు వేసుకోవాలి. నకిలీ విత్తనాలు ఖరీదు చేసి మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు. గుర్తింపు పొందిన డీలరు వద్ద విత్తనాలతో పాటు తప్పనిసరి గా రశీదు తీసుకోవాలి. మిరప సాగుచేసే రైతులు తొలకరి వర్షాలు కురియగానే తక్కువ కాలంలో చేతికొచ్చే పెసర రకాలను సాగు చేసి దాని తర్వాత మిరప సాగు చేసుకొవచ్చు.
వరి : దీర్ఘకాలిక వరి రకాలకు సంబంధించి జూన్‌ మొదటి వారం నుంచి చివరి లోపు నారు పోసు కోవాలి. పంటకాలం 135 నుంచి 150 రోజులు ఉంటుంది.అక్టోబర్‌ 31నుంచి నవంబర్‌ 20 లోపు పంట చేతికొస్తుంది. మధ్యకాలిక రకాల నారును జూన్‌ 20 నుంచి జులై 10లోపు పోసుకోవాలి. పంటకాలం125 నుంచి 135 రోజులు. నవంబర్‌ 5నుంచి 25లోపు పంట చేతికొస్తుంది. వానకా లంలో సాగుచేసిన పంటసకాలంలో చేతికి రావ డంతో నవంబర్‌లో వేసవి వరి సాగు చేయడానికి వీలుంటుంది. వానకాలం ఆలస్యం చేయడం వల్ల యాసంగి కూడా ఆలస్యమౌతున్నది.ఏప్రిల్‌లో వడ గండ్ల వర్షాలకు వేసవిలో సాగుచేసిన వరి నష్టపో వాల్సి వస్తున్నది. మార్చి చివరి వరకు యాసంగి పంట చేతికొస్తే వడగండ్ల వానతో వచ్చే నష్టాలను అధిగమించొచ్చు. నేరుగా పొడి దుక్కిలో వరి సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలను జూన్‌ 20 నుంచి అక్టోబర్‌15లోపు సాగుచేయాలి.మధ్య కాలిక రకాలను జూన్‌ 20నుంచి జూలై 10లోపు సాగు చేయాలి. అక్టోబర్‌ చివరి వారం నుంచి నవంబర్‌ మొదటి వారంలో పంట చేతికొస్తుంది.
కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి
రైతులు పంటలను కాలానుగుణంగా ఎంపిక చేసుకోవాలి.ఏపంటలను ఎప్పుడు సాగు చేయాల నేది పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే వేసుకో వాలి.కాలానుగుణంగా సాగుచేయడం వల్ల మంచి దిగుబడులు పొందడమే కాకుండా రోగాల ప్రభావం తగ్గుతుంది.ఏ పంటలను సాగు చేయా లన్న విత్తనాలను ఎక్కడ పడితే అక్కడ కొనకుండా గుర్తిం పు పొందిన డీలర్‌ వద్దే కొనుగోలు చేసి రశీదును తప్పక తీసుకోవాలి.
ఖరీఫ్‌ సన్నద్ధత ఏదీ?
ఈమారు తొలకరి పలకరింపు ఆలస్య మైంది. జూన్‌ మూడవవారానికీ వర్షాల్లేక ఏరు వాక కదల్లేదు. ఖరీఫ్‌ సేద్యానికి అదను పదును తప్పేలా ఉంది.తుపాన్లు,వరదలు,అకాల వానలు, వర్షాభావం నిరుడు ఖరీఫ్‌ రైతుల ఉసురు తీశా యి. పంటలకు ధర సమస్య తిష్ట వేసింది. ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం ఉండనే ఉన్నాయి. ఈ తడవైనా ఖరీఫ్‌ పంటలు వేయబోతే ఆదిలో హంసపాదులా నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. సీజన్‌లో 21 రోజులు గడిచినా మబ్బు జాడలేదు. ఆ ప్రాం తం ఈ ప్రాంతం అని లేకుండా అధిక ఉష్ణోగ్రత లు, వడగాలులు, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికి పడాల్సిన సాధారణ వర్షంలో 61శాతానికిపైన తక్కువ పడిరది. చిత్తూరు మినహా అన్ని జిల్లాలూ 50-80 శాతం వర్షపు లోటు ఎదుర్కొంటున్నాయి.ఎ.పి.లో 679 మండ లాలుండగా 527 చోట్ల తక్కువ వర్షం పడిరది. 11 మండలాల్లో చినుకు లేదు.
మో91మండలాల్లో మాత్రమే నార్మల్‌, అంతకంటే కొంచెం వర్షం కురిసింది.ఈగణాం కాలు ప్రభుత్వానివి.క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వ్యవసాయ రాష్ట్రం ఎ.పి.కి ఖరీఫ్‌ కీలకమైనది కాగా రానురా ను రైతులకు సీజన్‌ భారంగా కష్టం గా తయారైం దని సాగు లెక్కలు తెలుపుతున్నాయి. గతేడాది నిర్ణయించుకున్న సాధారణ సాగు విస్తీర్ణంలో ఐదు న్నర లక్షలఎకరాల్లో విత్తనం పడక బీడు పడ్డాయి. రబీలోనూ పది లక్షల -ఎకరాల్లో పంట ల్లేక ఖాళీ పడ్డాయి. క్రమేపి సాగు తగ్గుతుండ టంతో నిర్ణయించుకునే నార్మల్‌ సాగు అంచనాలూ తగ్గిపోతున్నాయి.ఉదాహరణకు నిరుడు ఖరీఫ్‌ కంటే ఈ సారి ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు పడిపోయింది. ఒక్క సంవత్స రంలో అన్నేసి లక్షల ఎకరాల తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలో వేరుశనగ విస్తీర్ణం తగ్గి పత్తి, ఇతర వాణిజ్య పంటలు పెరుగుతున్నా యి. ధాన్యాగారాలైన గోదావరి,కృష్ణా,పెన్నా డెల్టా లలో వరి కుదించుకుపోయి ఆక్వా, ఇతర కమర్షి యల్‌ క్రాప్స్‌ వేస్తున్నారు. ఈ ధోరణులు ప్రభుత్వాల విధానాల పర్యవసానాలు. ఏపంట వేసినా పెట్టు బడులకు కనీస గ్యారంటీ లేనందున సేద్యం రైతు లకు జూదాన్ని తలపిస్తోంది. అందుకే తలో దిక్కు పోయి చేతులు కాల్చుకొని నష్టపోతున్నారు. చివరికి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులతో స్వంత వ్యవసాయం మాన్పించి కార్పొరేట్ల చెప్పుచేతల్లోకి చేర్చే కుట్ర జరుగుతోంది. ఇది రైతాంగానికి ప్రజల ఆహార భద్రతకు ప్రమాదం.
ఖరీఫ్‌ సన్నద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వనట్లే కనిపిస్తోంది. పంటలేయా లంటే రైతులకు కావాల్సినవి అదనకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరపతి, సాగు నీరు. వర్షాలు పడలేదు కాబట్టికానీ, లేకపోతే విత్తనాల కోసం వెదుకులాటే. రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని మమ అనిపించారు. ఇండెంట్‌ బాగా తగ్గించారు. వరి, ఇతర పంటలదీ అదే తీరు.నిరుడు నకిలీ, కల్తీ మిర్చి విత్తనాలు, నారుతో రైతులు భారీగా నష్టపోయారు. పత్తి విత్తనాలూ అంతే. ఇప్పటి వరకు రైతులకు నష్ట పరిహారం అందలేదు. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌ మొదలుకాక ముందే చాలాచోట్ల నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. పట్టుకున్నది గోరంత, పట్టుకోకుండా చెలామణి అవుతున్నది కొండంత.పురుగు మందుల అక్ర మాలు చెప్పనలవికావు. నాణ్యత విషయంలో రాజీ లేదని ప్రభుత్వం హూంకరిస్తుండగా జరిగేది జరిగి పోతోంది. నిరుడు ఎరువుల సరఫ రాలో అస్తవ్య స్తత వలన అదనుకు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్‌ రుణాల లక్ష్యాలు వందకు వంద శాతం చేరాయంటున్నా కౌలు రైతుల పరపతి అధమస్తంగా ఉంది. కేంద్ర బీమా పథకంలో చేరడంతో ఖరీఫ్‌ బీమా ఇంకా అంద లేదు. అకాలవర్షాల బారిన పడ్డ రైతుల్లో చాలా మందికి పరిహారం దక్కలేదు. రైతు భరోసా చాలా మందికి పడలేదు.పి.ఎంకిసాన్‌ జాడ లేదు. కేలం డర్‌ ప్రకారం కాల్వలకు నీళ్లొదులుతు న్నామం టున్నా చివరి భూములకు అందట్లేదు. మరమ్మ తుల్లేక కాల్వల్లో తగినంత నీరు పారట్లేదు. రిపేర్లు లేక చిన్న వానలకే డ్రైన్లు పొంగి పొలాలపై పడుతు న్నాయి. శ్రీశైలం దగ్గరే రిపేర్లు లేవు. ప్రభుత్వం మాత్రం ఆర్‌బికెల జపం చేస్తోంది.ఏర్పాట్లు లేకుం డా ఖరీఫ్‌ సజావుగా సాగదు. ప్రభుత్వం ఖరీఫ్‌ సన్నద్ధతపై దృష్టి నిలపాలి.
వ్యాసకర్త : కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి-(దొంగరి నరేశ్‌)

1 3 4 5 6 7 13