మ‌హానీయ స్వామి వివేకానంద‌

ఉన్నతమైన ఆశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయి. కారణం ఆ భావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ, ప్రతీ ఆలోచనా విధానంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషా యాం బరాలు ధరించి, పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచుకుని, అర్థని మీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేకమంతమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మి కతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయా లను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మిం చడం, ఆసౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింప చేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంతరాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృతమైన కొత్త విషయాలను అనుభవిస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసుకుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద.

1863వసం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివేకానంద ఆరేళ్ళ ప్రాయం నుంచే అంతర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడ్కె ఉండేవారు. జ్యోతిర్మ య ప్రకాశంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనా త్మకత,ఆత్మ ప్రతిష్ట, ఆత్మ ప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆ చ్కెతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చ్కెతన్య స్వరూ పుడు. ‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తునంత స్పష్టంగా చూశాను,మతం అనేది అనుభూతి పొంద వలసిన సత్యం,లోకాన్ని మనం అర్దం చేసుకోవటం కన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’ అనిప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో ్ఞన,కర్మ,భక్తి,యోగమార్గాలో కాన రాని మెరుగులు ఆస్వాదించి వారి వచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధ రించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసంగం బాహ్యంగా ఎగసిన ఉత్సాహపుటలలోనే కాక,ఉద్వేగప్రవాహాలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం.దానిని గురించి ఒక్కమాటలో చెప్పటాని కో,వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడ మే కాదు,సాక్షాత్తు భారతదేశం కూడా గర్వించేలా చేసింది.అమెరికాలో ఎగసిన ఒకఅలభారత దేశం లో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది.‘‘నేను ఎవరిని?ఆసియావాసినా?ఐరోపావాసినా? అమెరి కావాసినా?ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. మనుషులు ఎలా జీవించాలో స్వామి మాటల్లో… ‘‘అందాన్ని పెంచుకుంటే నిన్ను కెమేరాలో బంధించి ఆనందిస్తారు..అస్తిని పెంచుకుంటే నిన్ను గంధపు చెక్కలలో తగులబెడతారు.పేరును పెంచుకుంటే నిన్ను సన్మాన పత్రాలతో సన్మానిస్తారు.హోదాను పెంచుకుంటే నిన్ను హోర్డింగులలో నిలబెడతారు అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే నిన్ను జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు’’
ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మ జ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వా న్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహిం చేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘ టించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పేవారు. జీవి తంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పేవారు.‘‘ఆహార నియం త్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియంత్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది. మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమ తత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదించేవాడు. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతములతో లేదు అది ఆచరణలే ఆధ్యాత్మి కంగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసించేవారు. వివేకానందను విదేశాలలో అనేకు లు కుమారునిగా, సోదరునిగా భావించారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపి స్తుంది. భారతదేశంలో ఇటువంటి బాంధవ్యాలు కొత్త కాదు.విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమై నప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతి మౌఢ్య,వర్ణమౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసులను దోచుకోవడం గమనార్హం.అహింసలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్య నిష్టుని సాన్నిహిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకానంద ఆత్మ్ఞనంలో సుప్రతిష్టుల్కె ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకా నంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు.తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్య జించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరిం చారు. భారతదేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు,పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాదలను విదేశాలలో ఇనుమడిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగించారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయినప్పటికి, ప్రతి ప్రసంగంలోనూ మనవాస్తవిక చిత్రాన్ని ఆవి ష్కరించేవారు.మతాలమధ్య వ్యత్యాసాలు ఉండ పచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు.హైందవుల శాంతి కాము కత్వాన్ని తన అహింసా తత్వంతో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈభారతదేశం ప్రపంచాన్ని జయి స్తుంది. అందుకే ‘‘ఓ భారతమా! నీ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని జయించు!’’అంటూ స్వామి సింహ నాదం చేసేవారు. ప్రశాంతత,పవిత్రత,త్యాగశీలత, సౌభ్రాతృత్వాల సందేశాలను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింప చేయటంలో విజయం సాధించారు. దుస్తరమైన అద్వ్కెతాన్ని కళాత్మకమైనదిగానూ,సజీవమైనది గానూ వర్ణించారు.భయం కలిగించే యోగ సంప్ర దాయాలను అత్యంత శాస్త్రీయంగానూ, ఆచరణ యోగ్యంగానూ వివరించే మానసికశాస్త్రంగా వివరించేవారు.సత్యమనేది మతానికి ఆపాదించటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీర గంభీరత్వంతో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు.మనలో నిద్రాణ మైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు. ‘‘మన జాతీయ ఆత్మన్యూనతాభావ జాఢ్యాన్ని వదిలించు కునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’ అని రాజాజీ పేర్కొన్నారు.వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి.లేఖ మూలంగానే తమ భారతీయ మహ త్కార్యాన్నిప్రారంభించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించుకున్న మనస్సులో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయనటంలో అతిశయోక్తిలేదు. ‘అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రతారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు. ఇక ఈ అగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి.దాని వెలుగుతోనే ఇదంతా వెలిగిం పబడుతున్నది.’’‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచలను నేను క్షుణ్ణంగా చదివాను, ఆ తరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచన చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుం టున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకా నందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు, వెనుకబడ్డ వారికి సేవ చేయడం దీని ప్రధానోద్దేశా లలో ఒకటి‘ అని ఉద్భోదించి భారతీయ యువతకు దిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమ యంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము,దోపిడీకి గురిచేయ డమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత స్వామి. తన 33 ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధ్కెర్యం సడలి, దౌర్భ్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామకృష్ణు శిష్యుణ్ణి నేను’’ అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్త దౌర్బ Ûల్యాలు, అధ్కెర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు.శ్రీవివేకానందుని జన్మ దినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజన దినోత్సవం’’గా ప్రకటించింది. ‘‘జనన మరణాలు సహజం, కాని నా భావనలు మావ వాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’అన్న స్వామి వివేకా నందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం, సర్వదా ఆచరణీయం.!-డా.దేవులపల్లి పద్మజ