ఊరు ఉండమంటున్నది.. గోదారి పొమ్మంటున్నది…!

ఊరు ఉండమంటున్నది,గోదారి పొమ్మం టున్నది. ఊరు ఏరు రెండు ఉనికిని ఇచ్చేవే. కానీ రెండూ ఇపుడు వేలాది మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ఊరు మునిగి పోయింది, గోదావరి వరదై ముంచేసింది. ఇది మనసును ముల్లులా గుచ్చే సమస్య. చిత్రమయిన సమస్య. పోలవరం ప్రాజక్టు నిర్వాసితులు ఎదుర్కొం టున్న హృదయ విదారకమయిన సమస్య. కొన్ని వేల మంది ప్రజలు పోలవరం ప్రాజక్టు వల్ల నిర్వాసితుల య్యారు. వాళ్ల పునరావాసం మాత్రం జరగడం లేదు. వాళ్ల కోసం కొన్ని పునరావాస కాలనీలు కట్టారు. లెక్క ప్రకారం వాళ్లు ప్రాజక్టు ముంపునకు గురవుతున్న గ్రామాలు వదిలేసి, ఈ పునరావాలస కాలనీలలో స్థిరపడాలి.ఇది చెప్పుకునేందుకు చక్కటి మాట. అయితే,ఈ వేలాది మంది ప్రజలు.ఊ .ర్లొదలడానికి సిద్ధంగా లేరు. వరద ముంచుకొస్తున్నది. అధికారులు ఊర్లలోకి వచ్చి వెంటనే ఖాళీచేయండని హెచ్చరి స్తున్నారు.

Read more

ప్లాటీనం జూబిలీ స్వాత్రంత్య్ర సంబరాల సవివరంగా 

భారతదేశం సామ్రాజ్యవాదుల చేర నుండి బయటపడి స్వతంత్య్ర దేశంగా అవతరించి 75 సంవత్సరాలైంది. స్వాతంత్య్ర సాధన కోసం నేలకొరిగిన అసంఖ్యాకుల త్యాగనిరతికి పునరంకితమయ్యే ఉద్విగ్న సమయమిది. గాంధీ,నెహ్రూ,పటేల్‌ అకుంఠిత పోరాట పటిమకు ముందు రాణిలక్ష్మీబాయి,మంగల్‌ పాండే,భగత్‌ సింగ్‌,సుభాష్‌ చంద్రబోస్‌ అస్ఫకు ల్లా ఖాన్‌,రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ మరియు ఉద్ధం సింగ్‌ వంటి ఎందరో త్యాగధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈస్వాతం త్య్రం. దేశానికి స్వతంత్రాన్ని సిద్ధించి పెట్టిన అమరవీరులకు భారత జాతి సర్వదా రుణపడి ఉంటుంది. మన స్వాతంత్య్ర సంగ్రామం అజరామరమైనది.. శత్రుశేషం లేనిది. చాలా దేశాలు స్వాతంత్య్రాన్ని పొంది ఉండవచ్చు, అట్టి స్వాతంత్రం కోసం ఆదేశ సైనికులు వీరోచితంగా పోరాటం చేసి ఉండవచ్చు, కానీ మన స్వాతంత్య్ర సంగ్రామంలో అసంఖ్యాకమైన ప్రజానీకమే అన్ని రకాల సైన్యం. సత్యం, అహింసా,శాంతి ఆయుధాలుగా పోరాడి సాధించిన ప్రత్యేకత ఇది.

Read more

ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

‘‘ దేశంలో మహిళలు, చిన్నారులపై ఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. కఠిన శిక్షలు విధిస్తున్నా కామాంధులు ఆగడాలు కొనసాగుతున్నాయి. చిన్న పిల్లలపై కూడా కొందరు కామంతో కళ్లు మూసుకు పోయి, లైంగిక దాడులకు పాల్పడు తున్నారు. ఆడపిల్లలను గౌరవించేవారు కానీ…వారిని రక్షించేవారుకానీ….వారి హక్కు లను పరిరక్షించేవారు కానీ…. నేటికాలంలో నానాటికీ తగ్గిపోతూ ఉండటం,ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతుండడం చాలా దుర దృష్టకరం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై సామూహిక అత్యాచార ఘటనలు,లైంగిక వేధింపులు పెరుగుతుండటం బాధకరమైన విషయం ’’ జి.ఏ.ఎస్‌.కుమార్‌
‘మాకు సురక్షిత స్థలాలంటూ ఏమైనా ఉంటే అవి అమ్మ గర్భం, సమాధి మాత్రమే’ – నైతిక విలువలకు నిలువునా పాతరేస్తూ, ఆడబిడ్డలకు అడుగడుగునా నరకం చూపిస్తున్న సమాజంపై ఓ చిన్నారి ఛీత్కరింపు ఇది! గతేడాది డిసెం బరులో చెన్నరుకి చెందిన ఆ పదకొండో తరగతి విద్యార్థినిని ఒక ఉపాధ్యాయుడి కొడుకు అను నిత్యం వేధింపులకు గురిచేస్తుండగా.. సహించ లేక ఆత్మహత్య చేసుకుంది. బలవన్మర ణానికి ముందు భావోద్వేగంతో రాసిన లేఖ సమాజం లో మహిళల దుస్థితికి దర్పణం పట్టింది. ఆ చిట్టితల్లి మాటలను నిజం చేస్తూనే గుడిలో, బడిలో,బంధుమిత్రుల ఒడిలో,ఇప్పుడు ఆసు పత్రుల్లో,ఎక్కడైనా సరే,ఆడపిల్లలకు భద్రత లేని దౌర్భాగ్యపూరిత వాతావరణానికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అద్దంపడుతోంది. తరతరాలుగా అమ్మ దేవతలను ఆరాధిస్తూ,పరాయి స్త్రీల వంక కన్నెత్తి చూడటమే మహాపాపంగా భావించాలని చెప్పే నీతులన్నీ ఏమైపోతున్నాయి? దేశంలో మహిళ లకు రక్షణ కల్పించడమే ఒక ప్రధాన సమస్యగా మారిపోవడం సిగ్గుచేటు. మగపిల్లలను ముద్దు చేస్తూ ఆడపిల్లలను ఆంక్షల పంజరంలో బంధి స్తున్న పితస్వామ్య భావజాలం, వ్యక్తిత్వానికి వన్నెలద్దడంలో విఫలమవుతున్న విద్యా విధానం, నేరాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగపు ఘోర వైఫల్యాలు కలిసికట్టుగా మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోవడానికి కారణ మౌతున్నాయన్న నిపుణుల మాటలు అక్షర సత్యాలు. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి దారు ణాలు జరగనివ్వబోమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలోనే దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు,దిశ యాప్‌ అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటన్నింటి లోనూ ప్రచార్భాటం తప్ప ఆకృత్యాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలు కానరావు. ఆదిశ బిల్లు నేటికీ చట్ట రూపం దాల్చలేదంటే పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి అకత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. విచ్చల విడిగా సంచరిస్తున్న మానవ మగాల మాయల్లో చిక్కి విలవిల్లాడే మహిళలకు,చిన్నారులకు లెక్కే లేదు.దేశవ్యాప్తంగా నిత్యం ఇలాంటి ఘోరాలు నేరాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. చిన్నాపెద్దా తేడా లేదు..అడ్డూ అదుపూ అసలే లేదు..ఎన్ని రకాల చట్టాలు వచ్చినా, ఎంత గట్టి శిక్షలు అమలవుతున్నా అత్యంత పైశాచిక ప్రవత్తి కలిగిన మానవ మగాల పీడ వదలడం లేదు. ఉన్న చట్టాలకే చిన్నపాటి సవరణలు చేసి వాటికి నిర్భయ, దిశ అని పేర్లు పెట్టినంతనే మహిళలకు రక్షణ కల్పించినట్లు పాలకులు భావించడం వల్లే నేరస్తులు విచ్చలవిడిగా రాకాసి ప్రవత్తిని కొనసాగి స్తున్నారు. ఇలాంటి ఘటనల్లోని దోషులకు ఎలాంటి కాలయాపనా లేకుండా కఠినశిక్షలు పడేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికైనా ప్రభుత్వాలు చేపట్టాల్సి వుంది. అలాగే నానాటికీ సమాజంలో విచ్చలవిడితనానికి ముకుతాడు వేసే చర్యలు చేపట్టాలి. పెడమార్గాలు పట్టిన యువత మత్తు పదార్ధాల ఊబిలో పడిపో తోంది. స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా,ఆట బొమ్మగా పరిగణించే అత్యంత హేయమైన విష సంస్కతి నుంచి యువతను బయటపడేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ రవాణా, తరచూ బాలల అదశ్యం వంటి సంఘటనల్లోనూ వాటి వెనుకనున్న అరాచక శక్తుల పీచమణిస్తే తప్ప ఇలాంటి ఘోరాలు తగ్గవు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన అసాధారణమైనది. ప్రభుత్వ యంత్రాంగపు వైఫల్యం ఈ ఘటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జనంతో రద్దీగా ఉండే ఆసు పత్రిలో ఒక గదిలో సామూహిక అత్యాచారానికి దుండగులు ఒడిగటుతుండే అక్కడ యంత్రాం గం ఏమైపోయింది? బాధిత తల్లిదండ్రులు ఆ బిడ్డ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరు క్షంతవ్యం కాదు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో నిర్బంధించబడిరదన్న విషయం ఆమె తల్లిదండ్రులు చెబితే తప్ప గుర్తించలేని స్థితిలో ఆసుపత్రి, పోలీసు అధికార యంత్రాం గం మిన్నకుండడం దారుణం. వ్యవస్థలోని ఈ లోపాలన్నిటిని సరి చేస్తేనే మహిళలకు, చిన్నారు లకు రక్షణ దక్కేది. ఇలాంటి దురాగతాలు వెలుగులోకి వచ్చినప్పుడు హడావిడి చేయడం, నష్టపరిహారం ప్రకటించడంతో పాలకులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఇప్పటికైనా మహిళల రక్షణకు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇద్దరు పోలీసు అధికారులతోనే పరిమితం కాకుండా విజయవాడ దారుణ ఘటనటకు బాధ్యులైన వారందిరి పైనా కఠిన చర్యలు చేపట్టాలి.
స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు.
నేటి బాలికలే రేపటి స్త్రీమూర్తులు. స్త్రీ లేనిదే సమాజానికి అతీగతీ లేదు. స్త్రీ లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు. ఇవన్నీ అందరికీ బాగా తెలిసిన విషయాలే. తెలియనిదల్లా ఏమైనా ఉందంటే.. వారిని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్నదే. ప్రపంచ మంతటా పురుషాధిక్యత పెరిగిపోయిన నేటిరోజుల్లో, ఆడపిల్లల పరిస్థితి నానాటికీ మరింత దయనీయంగానే ఉంటోంది. నేటికీ ప్రపంచంలో బడి చదువులకు దూరమైన బాలికలు కనీసం 40 మిలియన్ల మందికి పైగానే ఉన్నారని నిపుణుల అంచనా. అంతేకాదు బాల్య వివాహాలతో నరకప్రాయమైన జీవితాలను అనుభవిస్తున్నవారు ప్రపంచంలో కోట్ల సంఖ్యలోనే ఉన్నారని కూడా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎంతో ఘనమైన సంస్కృతి సంప్రదాయలున్న మన దేశంలో కూడా స్త్రీల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల ఎంతోకాలం నుంచి అంతులేని వివక్ష కొనసాగు తూనే ఉంది. ఆడపిల్లలు పుడితే పెద్ద భారంగా పరిణ మిస్తారని, వారిని పెంచి పెద్దచేయడం ఒక సమస్య అని, వారికి పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం మరింత కష్టమని భావించే వారు పెద్దసంఖ్యలోనే ఉంటున్నారన్నది నిష్టుర సత్యం. మన కుటుంబవ్యవస్థలో బాలికల పట్ల చిన్నచూపు చూసేవారే అధికంగా ఉంటుండం బహిరంగ రహస్యం. అంతేకాదు మనదేశం లోనూ బాలికల పట్ల..మహిళలపట్ల లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలపై నేరాలు ఘోరాలు,దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై కూడా అమానుషాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుక్షణం అభద్రతాభావంతో తల్ల డిల్లే పసిమొగ్గలు ఎందరో!..ఈ బాధలు పడలేక..’ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టినా బావుణ్ణు’..అని మహిళాలోకం కన్నీరుపెట్టుకునే దుస్థితి ఎప్పటికి పోతుందో ఏమో!..ఆడపిల్లగా పుట్టడమే ఒక పాపంగానో, ఒక శాపంగానో భావించే దుర్గతి ఇలా ఇంకా ఎంతకాలం?పసిపాపగా పుట్టి..చెల్లిగా, ఇల్లా లిగా,తల్లిగా..ఈ కాఠిన్యపు ప్రపంచానికి ఆత్మీ యతాను బంధాలను ప్రేమానురాగాలను నేర్పేం దుకు వచ్చిన దేవతకు..ఈ లోకంలో ఎన్ని కష్టాలో..ఎన్ని కన్నీళ్ళో! చిన్నతనం నుంచే ఆడపిల్లలకు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వారిపై అధికారం చెలాయించడం, బాలికలు కదా అని చులకనగా చూడడం అనేక కుటుంబాల్లో సర్వ సాధారణ కృత్యమైపోతోంది. సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లల పట్ల చులకనభావమే కనపడుతోంది. అంతేకాదు, పుట్టినప్పుడే ఆడశిశువులను ఏ చెత్తకుప్పలోనే పారవేసే దయనీయ సంఘటనలు.. దృశ్యాలు కూడా మనం అప్పుడప్పుడూ వింటున్నవే..చూస్తున్నవే. బాలికలను అమానవీయంగా వ్యభిచారగృహాలకు తరలించే దౌర్భాగ్య ముఠాలకు కూడా కొదవ లేదనే సంగతి కూడా మనం వింటున్నదే. ఇక పేదింట్లో పుట్టిన ఆడపిల్లల సంగతి మరింత దారుణంగా ఉంటోంది. ఆడపిల్లగా పుట్టి చాకిరీకి, వంటింటి పనులకే పరిమి తమయ్యే వారి సంఖ్య లెక్కకు మిక్కుటంగానే ఉంటోంది. కుటుంబ పోషణను కూడా నెత్తినేసుకుని కూలిపనులకు కూడా వెళ్ళేవారు ఎందరో?.. సరైన పోషకాహారం కూడా లేక చిక్కి శల్యమ వుతున్న బాలికల సంఖ్య కోట్లల్లోనే ఉంది. కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలకు ప్రత్యేకస్థానంతో పాటు మంచి గౌరవం ఇవ్వడం, ఆప్యాయతానురాగాలతో వారిని పెంచి పెద్దచేయడం,వారి జీవితాలకు ఎల్ల వేళలా అండగా ఉంటూ వారిని సంరక్షించుకునే మంచిమనుషులు కూడా సమాజంలో లేక పోలేదు. అయితే పేదరికంతోనో,అవిద్య వల్లనో, అసమానత వల్లనో దేశంలో మరెంతోమంది బాలికల భవిష్యత్తు నేటికీ అంధకారమయంగానే ఉంటోంది.ప్రభుత్వాలు, పాలకులు ఎంతో మంచిమనసుతో బాలికల కోసం,మహిళల కోసం,స్త్రీల కోసం అనేక పథకాలు, వారి రక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటి కప్పుడు అనేకానేక చట్టాలు చేస్తూనే ఉన్నా.. సమాజంలో ఆడపిల్లల పట్ట, మహిళామతల్లుల పట్ల వివక్ష..అఘాయిత్యాలు తొలగిపోవడం లేదు. ఇకనైనా ఈ దుస్థితి..ఈ దుర్గతి మారాలి. ఆడపిల్ల లంటే మన ఇంటికి జీవనజ్యోతులని గ్రహించుకోవాలి. ఆడపిల్లలంటే కేవలం అబలలు కాదని,కాస్తంత ఆత్మవిశ్వాసాన్ని-ప్రోత్సాహాన్ని అందిస్తే చాలు..వాళ్ళు మనల్ని, మన కుటుంబగౌరవాన్ని,దేశ సౌభగ్యాన్ని కూడా నిలబెట్టే ధీరవనితలవుతారని,సమాజాన్ని ఆదర్శ వంతంగా,ప్రతిభావంతంగా తీర్చిదిద్దే ప్రతిభా మూర్తులని కూడా తెలుసుకోవాలి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఇవన్నీ చూసుకోవాలనే ఆలోచనలు మానుకుని..మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను, ముఖ్యంగా బాలికలను సంరక్షించుకోవాలి. ఆడపిల్ల పుట్టిందంటే మన ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంతోషించాలి. వారి మనసును కష్టపెట్టకుండా మంచి చదువులు చెప్పించి, ఇష్టపడే రంగాల్లో ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేయాలి. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిండుమనసుతో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. బాలికల పట్ల ఇలాంటి సదవగాహన, సద్భావనలు కలిగించేందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ప్రకటిం చింది. అందుకు సార్థకత చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషిచేసినప్పుడే మన జీవితాలూ సార్థకమవుతాయి. ముఖ్యంగా.. బాలికలు, మహిళలపట్ల మానవీయతతో.. ఆత్మీయతతో ఉంటూ, వారికి అన్నివిధాలా రక్షణ కలిగించాలి. అప్పుడు వారే కాదు మనం, మన కుటుంబం, మన చుట్టూ ఉన్న సమాజం, మన దేశం..మొత్తంగా ప్రపంచమంతా కూడా ఆనందంతో పల్లవిస్తుంది.. ఎనలేని సంతోష పౌభాగ్యాలతో వెల్లివిరుస్తుంది.కానీ నేటి ఆధునీక సమాజంలో ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైంది. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా ఆచరణకు నోచుకోవడంలేదు. మహిళలు హక్కులను పరిరక్షించే నాధుడు కరువయ్యారు.-

ధరలు పెంపుపై ప్రజాగ్రహం

ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణంగా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్‌ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ‘’ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌ లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్‌ కట్‌ ఉంది కదా’’ ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ‘’ఏరోజు వంట ఆరోజే వండుకోవచ్చునని అనుకోలేకుండా వున్నాం. గ్యాస్‌ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్‌ కట్‌ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు’’ అని వాపోయారు.
చాలా కాలం నుండీ శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయి వుంది.అయితే సకా లంలో తగు చర్యలు తీసుకోకుండా బాధ్యతారహి తంగా గొటబాయ రాజపక్స ప్రభుత్వం వ్యవహరిం చింది. ఆర్నెల్ల క్రితం అప్పుడే మేలుకున్నట్టు హడావుడిగా విదేశీ దిగుమ తులపై ఆంక్షలు ప్రకటించింది. తన వద్దనున్న విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటి పోవడం దీనికి కారణం. ఐతే ఇటువంటి తొందరపాటు నిర్ణయాల పర్యవసానాలు ఎంత వినాశకరంగా పరిణ మిస్తాయో, ప్రజలు ఎటువంటి కష్టనష్టాలను చవిచూడవలసి వస్తుందో ఆ ప్రభుత్వం ఆలోచించే ప్రయత్నం చేయలేదు. పైగా ప్రజల్లో పెల్లుబుకుతున్న నిరసనలను అత్యంత నిరంకుశంగా అణచివేయడానికి పూనుకుంది. అత్య వసర పరిస్థితి ప్రకటించింది.
ఒకవైపు సంపన్నులపై విధించిన పన్నులను బాగా తగ్గించినందువలన ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఇంకోవైపు చర్చిల్లో వివిధ ప్రాంతాల్లో 2019లో జరిగిన పేలుళ్ళలో వందలాది మంది మరణించాక పర్యాటకులు బాగా తగ్గిపోయారు. శ్రీలంకకు వచ్చే విదేశీ మారకద్రవ్యం కూడా దానితో పడిపోయింది. పులి మీద పుట్రలా కోవిడ్‌ వచ్చిపడిరది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ఇవి తక్షణ కారణాలు. ఆ దేశానికి కావలసిన ఇంధన అవసరాలన్నీ దిగుమతుల ద్వారా మాత్రమే తీరతాయి. అంతే కాక ఎరువులు, ఆహారధాన్యాలు. పప్పులు, ఖాద్యతైలాలు వంటివి కూడా దిగుమతుల ద్వారానే ఆ దేశం పొందు తుంది. ఎప్పుడైతే ఆ దిగుమతులకు కావలసిన విదేశీ మారక ద్రవ్యం లేకుండా పోయిందో ఒక్కసారి ఆ దేశ జనజీవనం ఛిన్నాభిన్నం అయిపోయింది. పెట్రోలు, గ్యాస్‌ తగినంత లేవు కనుక పని ప్రదేశాలకు ప్రయా ణించడం అసాధ్యం అయిపోయింది. ఇంధనం లేనం దున విద్యుత్తు కొరత తీవ్రం అయింది. రోజుకు 13 గంటల విద్యుత్తు కోత అమలవుతోంది. వంట గ్యాస్‌ కొరత వలన ఇళ్ళలో వంటలు వండుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ అస్తవ్యస్థ పరిస్థితి కారణం గా ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కాస్తా పూర్తిగా పోయింది. రేపేం కానుందోనన్న భయాందోళనలు పెరిగిపోయాయి. సరుకుల కోసం ఒక్కసారి సూపర్‌ మార్కెట్ల మీద పడ్డారు. అక్కడ అనివార్యంగా పెద్ద మొత్తంలో సరుకులను కొనకుండా ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది.‘ఎక్కువ మొత్తంలో సరుకులను కొని మాత్రం ఏం చేయగలం? ఇంట్లో ఫ్రిజ్‌ లో దాచుకోడానికి వీల్లేకుండా పవర్‌ కట్‌ ఉంది కదా’ ఇది ఒక గృహిణి బాధ అయితే మరొకరు ‘’ఏరోజు వంట ఆరోజే వండు కోవచ్చునని అనుకోలేకుండా వున్నాం. గ్యాస్‌ అయిపోతే పరిస్థితి ఏమిటి? పవర్‌ కట్‌ కూడా ఉంది. ఏమీ తోచడం లేదు’’ అని వాపోయారు. ‘ఇంట్లో డబ్బు పెద్ద మొత్తంలో తెచ్చిపెట్టుకుందామంటే ఈ అల్లక ల్లోలంలో దానిని ఎవరు లాక్కుని పోతారో అన్న భయం ఉంది. పోనీ ఎప్పటికప్పుడు బ్యాంక్‌ ఎటిఎం నుంచి తీసుకుందామంటే పవర్‌ కట్‌ తో ఆ ఎటిఎంలు ఎప్పుడు పని చేస్తాయో తెలియకుండా ఉంది.’’ అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు గోల పెడుతున్నాడు. శ్రీలంకలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు బాగా పాపులర్‌. కాని ఇప్పుడు పవర్‌ కట్‌ కారణంగా ఆ సెంటర్ల లోని ఓవెన్లు,హీటర్లు,పని చేయడం లేదు.మరీ పెద్ద సెంటర్ల లోనైతే జనరేటర్లు ఉన్నాయి. కాని వాటికి సరిపడా చమురు లభించడం లేదు. ఇక చిన్న సెంటర్లయితే ఎప్పుడు నడపాలో, ఎప్పుడు మూసేయాలో తెలియని స్థితి ఉంది.‘’పోర్టులో మా కంపెనీ ఆర్డరు చేసిన మెటీరి యల్‌ దిగింది. అక్కడే ఉంటే ఎక్కువ చార్జీలు చెల్లిం చాల్సి వస్తుంది అని ఆ సరుకుని మా గోడౌన్‌ లోకి తెచ్చి దింపాం. కాని ఇక్కడి నుంచి మా వర్క్‌ సైట్‌ కి దీని ని రవాణా చేయడానికి డీజిల్‌ దొరకడం లేదు. మా పని అంతా ఆగిపోయింది.’’ ఓ బడా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ బాధ ఇది.‘’మా పౌల్ట్రీ లోని కోళ్ళు పూర్తిగా పెరిగిపోయాయి. వాటిని కోసి అమ్మేయకుండా వుంచి మేపాలంటే తడిసి మోపెడౌతోంది. పవర్‌ కట్‌ వలన ఫ్రీజర్లు పని చేయడం లేదు. అందుకే అన్నిం టినీ చంపి పూడ్చిపెట్టేశాం’’ అన్నాడో కోళ్ళఫారం యజమాని. ఇంకోవైపు మార్కెట్‌ లో కోడిమాంసం ధర మాత్రం ఒక్క నెలలోనే రెట్టింపు అయిపోయింది. శ్రీలంకలో మత్స్యకారుల సంఖ్య చాలా ఎక్కువ. కాని వాళ్ళు చేపల వేటకు పోవాలంటే బోట్లు నడవడానికి డీజిల్‌ గాని, కిరోసిన్‌ గాని కావాలి. అవి దొరకడం లేదు. ఒకవేళ అతి కష్టం మీద సంపాదించి చేపలు పట్టి తెచ్చినా,వాటిని అమ్మడానికి మరో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్‌కి తీసుకెళ్ళాలి. దానికి రవాణా లేదు.అందుచేత చాలామంది మత్స్య కారులు చేపల వేట మానుకున్నారు. దీంతో చేపల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏపనీ లేక పోయినా సెల్‌ ఫోన్‌ పట్టుకుని కాలక్షేపం చేసేయ వచ్చునను కునేవారి పరిస్థితీ ఏమాత్రం బాగులేదు. 13 గంటల పవర్‌ కట్‌ వలన ఆ సెల్‌ ఫోన్లు, సెల్‌ టవర్లు పని చేయడం లేదు. టీవీల్లో దూరి సమయం గడిపేయవచ్చుననుకునేవారి పరిస్థితీ అలాగే ఉంది. ‘మాకు రాజకీయాలు అనవసరం. దేశం ఏమౌతోందో నాకెందుకు? నా పరిస్థితి బ్రహ్మాండంగా సాగిపోతోంది. నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చల్లగా ఉంటే చాలు’’ అనుకునే మధ్యతరగతి ప్రబుద్ధులంతా ఇప్పుడు అందరికన్నా ముందు రోడ్ల మీదకి వస్తున్నారు. అధ్యక్షుడి ఇంటి ఎదురుగా వేలాదిమంది నిరసన తెలపడానికి నిల బడితే వాళ్ళని పోలీసులు అరెస్టులు చేశారు. వారిలో ఓ 50 మంది మీద కేసులు పెట్టి కోర్టుకి తెచ్చారు. ఆ 50 మంది కోసం వాదించడానికి 300మంది లాయర్లు తయారైపోయారు. అయినా గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి ఇంకా కళ్ళు తెరుచుకున్నట్టు లేదు. ‘’ఇదంతా కొంతమంది అరాచక మూకలు విదేశీ శక్తుల ప్రోద్బలంలో సాగిస్తున్న కుట్ర. దేశంలో అరబ్‌ వసంతం తీసుకొద్దాం అంటూ వాళ్ళు సోషల్‌ మీడియాలో మెసేజ్‌ లు పెడుతున్నారు.’’ అంటూ అధ్యక్షుడి భవనం అధికార ప్రతినిధి ప్రకటించాడు. కాని ఈ ప్రభుత్వాన్ని శ్రీలంకలో ఎవ్వరూ నమ్మడం లేదు. ప్రజలు ఎంత విసిగిపోయారంటే వాళ్ళు ఇప్పుడు ఏ ప్రత్యామ్నాయం గురించీ ఆలోచించడమే లేదు. ఈ గొటబాయ రాజపక్స కుటుంబం. ఈ ప్రభు త్వం దిగిపోతే చాలునని వాళ్ళు ముక్తకంఠంతో డిమాం డ్‌ చేస్తున్నారు. ప్రజలు అక్కడ ప్రతిపక్షాలనూ నమ్మడం లేదు. ప్రతిపక్షాలకు పగ్గాలు అప్పగించడం వలన ఏప్రయోజనమూ ఉండదని వారు భావిస్తున్నారు. ‘’ఒక చేతకాని ప్రభుత్వం బదులు మరో చేతకాని ప్రభుత్వం వస్తే ఏమిటి ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నారు. ఆదేశానికి సహాయం కోసం భారత ప్రభుత్వం పంపు తున్న వస్తువులను అక్కడి ప్రభుత్వ అధికారులకు అప్పగించడం బదులు భారత ప్రభుత్వమే నేరుగా మాకు అందించడం మంచిది అని ఆ ప్రజలు అనుకుం టున్నారు. ప్రతిపక్షాలు బలంగా లేకపోవడంతో బాటు శ్రీలంక సైన్యం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంది. ఐతే ఒకవేళ ఈ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేకుండా పోతే ఏంజరుగుతుందో చెప్పలే మంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో తమిళుల ఉద్యమానికి భారత దేశం అండదండలివ్వడం వలన శ్రీలంకలో సింహళీ యులలో ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం నుండి వచ్చి శ్రీలంకలో భూముల్ని, ఆస్తుల్ని చౌకగా కొనేసి పెత్తనం చేస్తారేమోనన్న భయాలు కూడా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం పొరుగు దేశాలు వేటితోనూ సత్సంబంధాలను నెలకొల్పు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఈ రకమైన అపనమ్మకాలు కలగడానికి దోహదం చేసింది. అయితే చైనా గురించి వీళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ‘’చైనాని ఎందుకు నిందించాలి? ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులకి మా ప్రభుత్వ నిర్వాకమే కారణం. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ హైవే ని చైనా యే నిర్మించింది. కొలంబోలోకి ప్రవేశించే దగ్గర బ్రహ్మాండమైన జంక్షన్‌ (ఇంటర్‌ఛేంజ్‌) నిర్మించింది కూడా చైనా వారే. ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన లోటస్‌ టవర్‌ కూడా వాళ్ళు నిర్మించినదే. నగరంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎన్నింటినో వాళ్ళు కట్టారు’’ అని చైనా గురించి అనుకూలంగానే అక్కడ ప్రజలు మాట్లా డుతున్నారు. 2009 వరకూ శ్రీలంకలో తమిళ ఉద్యమమే అన్ని ఇబ్బందులకూ కారణమని పాలకులు సాకు చూపించు కున్నారు. ఆతర్వాత కూడా కొంత కాలం అదే సాకుని చూపారు. 2019లో చర్చిల్లో బాంబు పేలుళ్ళ తర్వాత ఇప్పుడు ముస్లింల నుండి ప్రమాదం అని చెప్తున్నారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో పాలకులు ఎన్ని సాకులు చెప్పినా, ఎవరిమీద నెపం మోపాలని చూసినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. నిరంకుశంగా అణచివేయాలనను కుంటున్నరాజపక్సప్రభుత్వానికి…రాజపక్స కుటుంబ మూ, ఆ ప్రభుత్వం మాత్రమే సంక్షోభానికి కారణం అంటున్న ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోంది.
సామాన్యులే సమిధలా…!
రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్‌టిసి బస్‌ చార్జీలను పెంచడం దారుణం. నిరుపేదల, సాధారణ ప్రజల ప్రయాణ సాధనాలుగావున్న పల్లె వెలుగు, సిటీ సర్వీసుల కనీస చార్జీలతోపాటు అన్ని స్టేజిలకూ భారం పెంచడం ద్వారా సర్కారు సామాన్యులను సమిధల్ని చేస్తోంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీస్‌ ప్రయాణికులపై టిక్కెట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్‌, సిటీమెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో రూ.5, సూపర్‌ లగ్జరీ, ఎసి సర్వీసుల్లో రూ.10 చొప్పున ఈ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ సర్వీసుల్లో కనీస ధర రూ.10గా చేయడంతో పాటు సేఫ్టీ సెస్‌ పేరుతో అదనంగా మరో రూపాయి వసూలు చేస్తున్నారు. రిజర్వు బ్యాంకుతో, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించి చిల్లర కొరత నివారించ వలసిందిపోయి కొరత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రౌండప్‌ చార్జీలను వసూలు చేస్తామనడం మోస పూరితం. తాజా పెరుగుదల వల్ల ఆర్‌టిసికి అదనంగా రోజుకు రెండు కోట్లు, లేదా ఏడాదికి రూ.720 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నా అది వాస్తవంలో పన్నెండు వందల కోట్లు దాటుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా ఆర్‌టిసి ఛార్జీలు పెంచి జనానికి గోరుచుట్టుపై రోకటి పోటు వేసినట్టయింది. 2019లో చార్జీలు పెరిగాయని, అప్పుడు లీటర్‌ డీజిల్‌ ధర రూ.67గా ఉండగా ప్రస్తుతంరూ.107కి పెరిగాయని అధికారులు చెబు తున్న మాట నిజం. అయితే, ఈ పెరుగుదలకు కేవలం మోడీ ప్రభుత్వ విధానాలే కారణం తప్ప వేరేమీ కాదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వంతోతలపడి, ప్రజా రవాణా వాహనాలకైనా తక్కువ ధరకు డీజిల్‌ సాధిం చుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా ఆ భారాన్ని ప్రజలపైకి మళ్లించడం సబబు కాదు. కనీసం కేంద్రంతో పోరాడి, సాధించలేని స్థితిలో దాన్ని ప్రజలముందు దోషిగా నిలిపినా కొంతవరకు సబబుగా వుండేది. సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగావున్న ఆర్‌టిసి ఖాళీ స్థలాలను బిఓటి పద్ధతిలో ప్రైవేటువారికి అప్పగించాలనడం మోసపూ రిత ఆలోచన. వివిధ నగరాలు, పట్టణాల నడిబొడ్డు నవున్న ఆర్‌టిసి స్థలాలను ప్రైవేటుకు దఖలుపర్చడం ప్రజల సంపదను అస్మదీయులకు కట్టబెట్టే దుష్ట తలంపే! కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకానికి ఇది ప్రతిరూపమే. ఆర్‌టిసి స్థలాలను సంస్థ విస్తరణకు, ప్రయాణికుల సౌకర్యాలకు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ ప్రైవేటుకు అప్పగించడానికి వీల్లేదు. ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తే ప్రజలు, ఆర్‌టిసి ఉద్యోగులు ఉద్యమించి ప్రజల ఆస్తిని కాపాడుకోవాలి. ఇప్పటికే ధరలు పెరిగి పన్నుల భారంతో సతమ త మవుతున్న ప్రజలకు ఇది కోలుకోలేని దెబ్బ. పేద, మధ్యతరగతి, నిరుద్యోగులు, విద్యార్థులు బస్సు ప్రయా ణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నందున పెంచిన బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించు కోవాలి. సంస్థ నష్టాలకు కారణాలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అవసరం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బల్క్‌ డీజిల్‌ ధర పెంచినపుడు ఆర్‌టిసి బస్సులకు తక్కువ ధరకు రిటైల్‌ బంకుల్లో డీజిల్‌ ఫిల్లింగ్‌ చేయించి ఎంతో కొంత పొదుపు చేయగలిగారు. సరుకు రవాణా (కార్గో)పై మరింత కేంద్రీకరిస్తే ఆదా యం పెరచుకో వచ్చు.
ముఖ్యంగా స్టేజి క్యారేజిలు గా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను అదుపు చేస్తే ఆర్‌టిసి ఆక్యుపెన్సీ పెరగడంతోపాటు ఆదాయ మూ వృద్ధి చెందుతుంది. అలాగే లాభసాటిగా వుండే అంతర్రాష్ట్ర సర్వీసుల విస్తరణకు కృషి చెయ్యాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తగు ఒప్పందాలు చేసు కోవాలి. అన్ని విధాలుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, సంస్థ ఆదాయం పెంచుకోవడం, దుబారా ఖర్చులు తగ్గించడానికి సకల చర్యలు చేపట్టడంతోపాటు అవినీతి, లీకేజిలను అరికట్టడంపై సర్కారు కేంద్రీకరిస్తే ప్రజలపై భారాలు వేయాల్సిన అవసరమే లేదన్న నిపుణుల మాట ప్రత్యక్షర సత్యం.-(వ్యాసకర్త : పాత్రికేయుడు ఇటీవల శ్రీలంక పర్యటించిన ప్రత్యక్ష కథనం ఆధారంగా) (ఆర్‌.కె.రాధాకృష్ణన్‌ )

తెరపైకి మ‌ళ్లీ ఉత్త‌రాంధ్ర అణువిద్యుత్ కుంప‌టి

ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుకు గుర య్యాయి. ప్రగతి అన్నది ఎరగనివి. వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఉత్తరాంధ్ర నెత్తిన అణు కుంపటి పెట్టి…ప్రజలకు కంటి నిండా కునుకు కూడా లేకుండా చేయనున్నాయి. కొవ్వాడపై ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 1208మెగావాట్ల సామర్ధ్యంతో 6 రియా క్టర్లతో కూడిన అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయం గా ఆమోదించిందని…పిఎంఓ కార్యాల యం సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.
అణు ప్రమాదాల నష్టాన్ని పూడ్చుకునే సామ ర్థ్యం అభివృద్ధి చెందిన దేశమైన జపాన్‌ కే లేకుండా పోయింది. అలాంటిది మన దేశం ఇటువంటి విపత్తులను తట్టుకోగలదా? అసలు ఒక దివాళా తీసిన కంపెనీతో ఒప్పందం చేసుకోవడమేమిటి? ప్రపంచమంతా నిషేధిస్తున్న అణు విద్యుత్‌ మనకు అవసరమా? ఇవన్నీ తెలిసి కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు ఉవ్విళ్లూరుతోంది? ఇతరరాష్ట్రాలు నిరా కరించిన అణు విద్యుత్‌ ప్లాంట్‌ పట్ల జగన్‌ ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి. కేంద్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్‌ లోని మితివిర్ధిలో అణు విద్యుత్‌ కేంద్రం పెట్టాలని 2007లో నిర్ణయించింది. 2013 నాటికి పర్యావరణ,అటవీ అనుమతులు పొందింది. అయినా ఆగమేఘాల మీద2016 జూన్‌4వ తేదీన మితివిర్ధిలో నిర్మించాలనుకున్న అణు విద్యుత్‌ కేం ద్రాన్ని కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంజిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం ? ప్రపంచంలోనే అణువిద్యుత్‌ పరిశ్రమలు ఎక్కడా పెట్టడంలేదు. అణువిద్యుత్‌ కేంద్రాల్లో భద్రత లేదని ప్రపంచంలోని అణు నిపుణులు వక్కాణిస్తున్నారు. పార్లమెంట్‌లో మనరాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అడిగినప్రశ్నకు వెస్టింగ్‌హౌస్‌ అనే అమెరికా కంపెనీతో ఒప్పందంఖరారు చివరి దశలోఉందని ప్రభుత్వం తనసమాధానంలో తెలిపింది. ఈ కంపెనీ అమెరికాలో దివాళాతీసి ఐ.పి పెట్టింది. అలాంటి కంపెనీతో నేడుమోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఎలాఅర్థం చేసు కోవాలి? ఈఒప్పందంలో మరో ప్రమాదక రమైన అంశమేమిటంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే,ఆకంపెనీకేమీ సంబంధం ఉండదట! బహుళజాతి సంస్థల బండారం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇటీవలి విశాఖ ఎల్‌.జి పాలిమర్స్‌ ఉదంతం మన ముందే ఉంది. 1984లో భోపాల్‌లో జరిగిన ఘోర గ్యాస్‌ లీకు ప్రమాదానికి సంబంధించి ఇదే అమెరికాకు చెందిన యూనియన్‌ కార్బైడ్‌ బహుళజాతి సంస్థ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా నేటికీ పూర్తిగా పరిహారం చెల్లించలేదు. వారు చెల్లించక,మన ప్రభుత్వాలూ పట్టించుకోక పోవ డంతో నేటికీ వేలాది మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ బాధపడుతూనే ఉన్నారు. అదే విధంగా అమెరికాలోని ఐస్లాండ్‌,రష్యాలోని చెర్నో బిల్‌, 2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో జరిగిన ప్రమాదంతో ఆరాష్ట్రమంతా తీవ్రంగా నష్ట పోయింది. పూర్తిగా వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆ రాష్ట్రంలో రేడియేషన్‌వల్ల గాలి,భూమి, నీరు విషతుల్యం అయ్యాయి. ఈవిస్ఫోటనం తర్వాత ఏ దేశంలోను అణు విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు. ఇప్పటికేవున్న అణు విద్యుత్‌ కేంద్రా లను అనేక దేశాలు మూసివేస్తున్నాయి. మనకు రియాక్టర్లను ఎగుమతి చేస్తున్న అమెరికా తమ దేశంలో 4విద్యుత్‌ కేంద్రాలు మూసివేసింది. జపా న్‌లో 2 అణు విద్యుత్‌ కేంద్రాలు తప్ప మిగిలినవన్నీ మూసివేయడం జరిగింది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగితే 170కిలోమీటర్లు విస్తరించి దక్షిణాన కాకినాడ,ఉత్తరాన ఒడిషా లోని చత్రపూర్‌ వరకు జీవకోటి నశిస్తుంది. ఈ ప్రాం తాన్ని సర్వనాశం చేస్తుంది. ఒకేచోట 6 రియాక్టర్లు పెట్టడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. వెస్టింగ్‌ హౌస్‌ ఉత్పత్తి చేసే ఎ.పి1000అనే రియాక్టర్లు ఇంత వరకు ప్రపం చంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలా లేదు. ఎక్కడా పరీక్షించని రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన అమెరికా రుద్దుతున్నది. అమెరికా కోసం భారత ప్రయోజనాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయి. పైగా1208 మెగావాట్ల సామ ర్ధ్యంతో 6 రియాక్టర్లతో కూడిన ఈఅణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుతో 8వేల మందికి ఉపాధి దొరుకు తుందని సాకుగా చూపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తూ ప్రత్యక్షంగా 30 వేల మందికి,పరోక్షంగా లక్షమందికిపైగా ఉపాధి కల్పిస్తున్న విశాఖస్టీల్‌ ప్లాంటును ఎలాగైనా అమ్మి తీరుతామని చెబుతూనే మరోవైపు అత్యంత ప్రమా దకరమైన అణువిద్యుత్‌ కేంద్రంతో 8వేల మందికి ఉపాధి కల్పిస్తామనడంపూర్తిగా అసంబద్ధం కాదా? అణువిద్యుత్‌ కేంద్రాలకు పెట్టుబడి బాగాఅధికం. ఒక మెగావాట్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తికి రూ.48 కోట్లు ఖర్చు అయితే ఒకమెగావాట్‌ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.5కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్‌ టెక్నాలజీ నేడు బాగా అభివృద్ధి అవుతున్నది. పర్యా వరణ సమస్య వుండదు. విండ్‌ టెక్నాలజీ కూడా నేడు అభివృద్ధి చెందుతున్నది. పర్యావరణ సమస్య లేని విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.
ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర ప్రభుత్వం అణు విద్యుత్‌ కేంద్రాన్ని అంగీకరించకూడదు. కేంద్ర ప్రభుత్వనిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తేవాలి. రాష్ట్రానికి తీవ్ర ప్రమాదకారి అయిన అణు విద్యుత్‌ కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు,మేధావులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించాలి.ప్రజలకు చౌకగా విద్యుత్‌ను అందించగలిగే పర్యావరణ హితమైన పవర్‌ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
‘‘రేపు అణు విద్యుత్‌ కేంద్రం వస్తే మీ ఊరే ఎగిరి పోతుంది…ఇంకా రోడ్లెందుకు, స్కూళ్లెందుకు?’’
మీగ్రామం భవిష్యత్తులో మాయమై పో తుంది. అలాంటి గ్రామానికిరోడ్లు,కాలువలు వేయ డం ఎందుకు దండగ.ఇదేమాట గత ఐదేళ్లుగా అధికారుల నోటవింటున్నాం.కానీ,మా గ్రామం మాయమైపోలేదు. ఊరు అభివృధ్ది జరగలేదు’’- ఇది కొవ్వాడ మత్స్యలేశం గ్రామస్థుల ఆవేదన కొవ్వాడ మత్స్యలేశం (కొవ్వాడ)ఒకమత్స్యకార గ్రామం. ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండ లంలో ఉంది. దేశంలోనే అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఇక్కడ ఏర్పాటవుతోంది.‘‘మాఊరిలో కరెంట్‌ కంపెనీ వస్తుందని చెప్పారు. అందరు భూములు,ఇల్లు ప్రభుత్వానికి అప్పగించేస్తే… అం దుకు డబ్బులు ఇచ్చి, మరొక చోట ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. కొందరం ఒప్పుకున్నాం, మరికొం దరం ఒప్పుకోలేదు. అలా కాలం గడుస్తున్న కొద్దీ మెల్లగా అందర్ని ఒప్పించారు. మీ అందర్ని ఇక్కడ నుంచి తీసుకునివెళ్లి మరోచోట పెడతామని చెప్పా రు. చెప్పి ఆరేడేళ్లు అవుతోంది.కానీ ఇప్పటి దాక అధికారులు అప్పుడప్పుడు వచ్చిపోవడమే కానీ… అసలేం జరుగుతోందో మాకు తెలియడం లేదు. వాళ్లు అన్నట్లుగానే మాగ్రామం ఎప్పుడు మాయమ వుతుందా అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.మాపరిస్థితి ఏంటోఅర్థం కావడం లేదు’’ అని 52ఏళ్ల కొవ్వాడ వాసి రాము ఎదుట వాపోయారు.
ఆరు రియాక్టర్లతో అణు విద్యుత్‌ కేంద్రం
కొవ్వాడలో దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.ఈఒప్పందంలో భాగం గా అణు విద్యుత్‌ ప్రాజెక్టును కొవ్వాడ, దాని పరిసర గ్రామాల్లో నిర్మించేందుకు భూ సేకరణ చేయాలని నిర్ణయించారు. ఇక్కడే ఆరురియాక్టర్లతో అణు విద్యు త్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా తీర ప్రాంతంలో 2400ఎకరాల్లో విస్తరించి ఉన్న కొవ్వా డ,కోటపాలెం,రామచంద్రపురం,గూడెం,టెక్కలి, గ్రామాలను ఖాళీ చేయించేందుకు నిర్ణయించారు. ఇక్కడే అణు విద్యుత్‌ కేంద్రం రియాక్టర్లు, ఉద్యోగుల కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. ఇదంతా 2012 నుంచి జరిగి,2017 నాటికి ఈ గ్రామా లను ఖాళీచేయించి,పునరావాస కాలనీలకు తరలిం చాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఆ తేదీ దాటి ఐదేళ్లయినా…
అణు విద్యుత్‌ ప్లాంట్‌కు సంబంధించిన భూ సేకరణ జరిగి, నిర్వాసితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఇచ్చి…వారిని పునరావాస కాలనీలకు తరలించేందుకు కటాఫ్‌ తేదీ2017 ఏప్రిల్‌ 30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీ దాటిపోయి ఐదేళ్లు కావస్తోంది. అయినా ఎక్కడ గ్రామాలు అక్కడే ఉన్నాయి. ‘‘మమ్మల్ని పునరావాస కాలనీలకు తరలిస్తామన్నారు.అసలు ప్రాజెక్టు పనులే ప్రారంభం కాలేదు. పైగా మాకు ఇస్తామన్న ప్యాకేజీ లు సైతం ఇంకా అందరికి అందలేదు. మొత్తం రూ.18 లక్షలు ఇస్తామన్నారు. అలాగే కటాఫ్‌ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు సైతం ప్యాకేజీ వర్తింపజేస్తామన్నారు. ఆతేదీకి 18ఏళ్లు దాటిన వాళ్లకి ప్యాకేజీ ఇవ్వలేదు. పైగా అనుకున్న తేదీకి తరలించకపోవడంతో…గ్రామంలో చాలా మందికి 18ఏళ్లు వచ్చాయి. వీరికి ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వా లని డిమాండ్‌ చేస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించడమో,లేదా మాగ్రామాల్ని అభివృద్ధి చేయ డమో చేయాలి’’అని పెదకొవ్వాడ నివాసి మంగ రాజు చెప్పారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ సాకుతో అభివృద్ధి చేయడం లేదు’’
అణు విద్యుత్‌ ప్లాంట్‌ పరిధిలో సుమారు 8వేల మంది గ్రామస్థులు ఉన్నారు. వీరందరూ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇల్లు సరిపోక పోయినా,కట్టుకునేందుకు డబ్బులున్నా, మరొక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు.‘‘ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది.గోడలు బీటలు వారాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కన్నాలుపడి, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. గ్రామంలోనిరోడ్ల పరిస్థితి అయితే దారుణం. ఇక విద్యుత్‌, కాలువలు లాంటి మౌలిక సదుపాయాలు వైపు ఏఅధికారి చూడటం లేదు. కారణమడిగితే రేపో మాపోమాయమైపోయే గ్రామం,దీనికి సౌకర్యా లేందుకు,డబ్బులువృథా అని అంటున్నారు. అలాగని తరలించడమూ లేదు’’ అని మత్స్యకార నాయకుడు బి.రాంబాబు చెప్పారు.‘‘అభివృద్ధి పనులైతే లేవు. కటాఫ్‌ డేట్‌ నుంచి అధికారులకు మా గ్రామాలంటే చిన్నచూపు అయిపోయింది. ఆతేదీ నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. పునరా వాస ప్యాకేజీలో భాగంగా ఇచ్చిన డబ్బులు ఖర్చవు తున్నాయి. కాలనీలు ఇంకా ఇవ్వలేదు. పోనీ ఇల్లు సరిపోవడంలేదు,మరోగదో,చిన్న ఇల్లో కట్టుకుందా మంటే…అది వృథాఅయిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ప్రభుత్వం పునరావాస కాలనీలు, ప్యాకేజీల అం శాన్ని క్లియర్‌ చేసి తరలించక పోతే… ఆందోళ న చేస్తాం’’ అని రాంబాబు అన్నారు.
భూసార పరీక్షలు అడ్డుకున్నందుకు అరెస్టులు
నిర్వాసితుల్లో కొందరికి ఇంకా ప్యాకేజీ డబ్బులు అందలేదు. వాటిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరు.పైగా ఊర్లో రెండేళ్లుగా పెద్ద పెద్ద మిషన్లు తీసుకొచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తు న్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అరెస్ట్‌ చేశారని అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాసితుల్లో ఒకరైన అప్పన్న చెప్పారు.‘‘ప్లాంట్‌ కు సంబంధించిన పనుల్లో భాగంగా నిర్వాసితగ్రామాల్లో ఎక్కడోఒకచోట రోజూ భూసార పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని సార్లు వాటిని అడ్డుకుంటే మాపై కేసులు పెట్టారు. మాకు ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా మా మీదే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ…మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించ నైనా,తరలించాలి. లేదంటే మా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటాం’’ అని అప్పన్న తెలిపారు.
‘‘అణు విద్యుత్‌ ప్లాంట్‌ వద్దే వద్దు’’
కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్లాంట్‌ వద్దం టూ వామపక్షాలు,ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్రను నాశనం చేసే కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.‘‘అమెరికా ఆర్థిక సహాయంతో కొవ్వాడలో కేంద్రం తలపెట్టిన అణువిద్యుత్‌ ప్లాంట్‌ ఉత్తరాంధ్రలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ అణువిద్యుత్‌ను వదలి…ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తుంటే, భారత దేశంలో మాత్రం అణు విద్యుత్‌ ప్లాంట్లను ఎందుకు ప్రొత్సహిస్తున్నారు? ప్రమాదకరమైన వీటిని వెంటనే రద్దు చేయాలి. లేనిపక్షంలో అన్ని పార్టీలు, సంఘాలతో ఉద్యమిస్తాం’’ అని సీపీఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు చెప్పారు. బొగ్గు, గ్యాస్‌, జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి వాడే ఐదోపెద్ద వనరు అణు విద్యుత్‌. ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం.దానిసామర్థ్యం రెండు వేల మెగావాట్లు.కొవ్వాడలో రూ.61వేల కోట్ల అంచనా వ్యయంతో ఆరుఅణువిద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ ప్రాజెక్టు ఇదే. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా,అమెరికా రియాక్టర్‌ల నిర్మాణ సంస్థ వెస్టింగ్‌ హౌస్‌ కంపెనీల మధ్య కొవ్వాడలో ఆరు అణు విద్యుత్‌ రియాక్టర్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.బొగ్గు,గ్యాస్‌,జలవిద్యుత్‌, పవన్‌ విద్యుత్‌ తర్వాత దేశంలో విద్యుత్‌ఉత్పత్తికి వాడే ఐదో పెద్ద వనరు అణు విద్యుత్‌.ప్రస్తుతానికి తమిళనాడు కుడంకుళంలో ఉన్న న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంటే దేశంలో అతిపెద్ద అణువిద్యుత్‌ కేంద్రం. దాని సామర్థ్యం రెండు వేల మెగావాట్లు. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం సామర్థ్యం(ఒక్కొక్కటి1208 వీఔ చొప్పున్న 6రియాక్టర్లు)7,248 మెగావాట్లు. ఇది పూర్తయితే దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్‌ కేంద్రమవుతుంది. ఇది దేశంలోని 22 ఆపరేషనల్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్లలో 6.780 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ. (ఈ సమాచారం పార్లమెంట్‌ సభ్యుడు జీవీఎల్‌ నరసిం హరావు అడిగిన ప్రశ్నకు సహాయమంత్రి జితేం ద్రసింగ్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా 31.03. 22 తేదీన తెలిపినది)
శరవేగంగా పనులు జరగాలి: ప్రత్యేక అధికారి
కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్మాణా నికి అవసరమైన భూసేకరణ చాలా వరకు పూర్తయి నట్లు శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అణు విద్యుత్‌ కేంద్రం ప్రత్యేక అధికారి ఎం.విజయ సునీత తెలిపారు. కోర్టుకేసులు,పునరావాస ప్యాకే జీల క్లియరెన్స్‌ ఆలస్యం కారణాంగా కొంత భూ సేకరణ మిగిలి ఉందని, న్యూక్లియర్‌ ప్లాంట్‌ కు అవసరమైన 2060 ఎకరాల భూమిలో 1480 ఎకరాలు ఇప్పటికే సేకరించామని తెలిపారు. ‘‘కొవ్వాడలో మౌలిక సదుసాయాలపై కూడా దృష్టి పెట్టాం. ప్లాంట్‌ పనుల ప్రారంభంలో ఆలస్యం జరగడంతో అది గ్రామంలోని మౌలిక సదుపాయల కల్పన పై ప్రభావం చూపింది. ప్లాంట్‌ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అంతలోపు… తాత్కలిక మౌలిక సదుపాయలను కల్పిస్తాం. త్వరి తగతిన ఈ ప్రాజెక్టుపూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.నిర్వాసితులను ఎచ్చర్ల వద్ద ధర్మా వరంలో నిర్మించే నిర్వాసిత కాలనీలకు తరలిస్తాం’’ అని విజయ సునీత చెప్పారు.-(అల్లు రాజు)

ప్రజల భాగస్వామ్యంతోనే వికేంద్రీకరణ

జగన్‌గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ, పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అభివృద్ధికి తక్షణం చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చ, ఆ సం దర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. ప్రజల్లో మరింత గందరగోళం పెంచుతోంది. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటి? పాలనా వికేంద్రీకరణ అంటే ఏమిటి? రాజధాని వికేంద్రీకరణ అంటే ఏమిటి? ఇలాంటి అనేక అంశాలు ఈరోజు చర్చనీయాంశాలుగా మన ముందుకు వచ్చాయి. – (వి.శ్రీనివాసరావు)
అభివృద్ధి అంటే పెద్దపెద్ద రోడ్లు, విమానా శ్రయాలు, పోర్టులు మాత్రమే కాదు. ఈరోజు యువతకు ఉపాధి కల్పించగలిగిన పరిశ్రమల స్థాపన, ప్రజలందరికీ తిండి పెట్టగలిగిన వ్యవసాయ ఉత్పత్తి పెంపుదల ఈ రెండు లేకుండా అభివృద్ధి జరగదు. అలాంటి అభివృద్ధి జరిగినా అది గాలిబుడగలా ఏదో ఒకరోజు పేలిపోతుంది తప్ప ప్రజలకు ఫలితాలు ఇవ్వదు. ఈరోజు రాష్ట్రంలో చాలా జిల్లాలు, మండలాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వెనుకబాటుకు ప్రధానమైన కొలబద్ద అక్కడ సహజ వనరులను ఉపయోగించుకుని పరిశ్ర మలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా, వ్యవసా యానికి నీటి వనరులు ఉన్నాయా లేదా, ఆధునిక పద్ధతులలో వ్యవసాయం జరుగు తున్నదా లేదా? ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడి దారీ అభివృద్ధినే మనం ఈ రోజుఅభివృద్ధిగా భావిస్తున్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందున్న భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు, అలాగే అత్యంత పురాతనమైన ఆదిమ వ్యవస్థ అవశేషాలు కూడా నేడు రాష్ట్రంలో కొనసాగు తున్నాయి. అటు ఆదిమ వ్యవస్థ, ఇటు కాలం చెల్లిన భూస్వామ్య వ్యవస్థ, మరొక వైపు ముందు కు పోలేక సంక్షోభంలో కొట్టుమిట్టా డుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ,ఈ మూడు మిశ్రమ రూపాలు మన రాష్ట్రంలో కనిపిస్తుం టాయి. కాబట్టి వెనుకబడినటువంటి భూస్వామ్య వ్యవస్థ అవశేషాలున్న ప్రాంతాల్లో కూడా పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, పరిశ్ర మలు అభివృద్ధి అయితే దాన్ని మిగతా ప్రాంతాలతో ముందుకు పోవడంగా మనం భావిస్తాం.కానీ పెట్టుబడి దారీ అభివృధ్ధి కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. అందులో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాల మూలంగా సంపద కేంద్రీకరణ పెరిగి ఆర్ధిక వ్యత్యాసాలు తీవ్ర రూపంలో ముందుకు వస్తున్నాయి. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి మాంద్యం ఏర్పడుతున్నది. నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రాంతీయ, సామాజిక వ్యత్యాసాలు కూడా పెరుగు తున్నాయి. ఈ వ్యత్యాసాల ఫలితమే ఆర్ధిక సంక్షోభం రూపంలో మనకు కనిసిస్తున్నది. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు పోవాలనుకున్నా సాంకేతిక, యాంత్రిక విస్తరణకు అవకాశాలున్నా వాటిని ఉపయో గించుకోలేని స్థితికి ఈరోజు వ్యవస్థ చేరింది. మనం ప్రపంచంలో ఒక సూపర్‌ పవర్‌ కావాలని కోరుకుంటున్నా ఇప్పటికీ వెనుకబడే ఉన్నాం. మన జిడిపి మైనస్‌ల్లో నడుస్తున్నది. కనీసం ఈరోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధిలో పోటీ పడుతున్నామా అంటే 5జి టెక్నాలజీ మొదలుకొని మిషన్‌ లెర్నింగ్‌ల్లో కానీ, ఇంటర్నె ట్‌ ఐఒటి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో గానీ ఎందులో కూడా మనం ముందుకు పోలేకపో తున్నాం. అన్నింటికీ మించి ఈరోజు టెక్నాలజీ లో కీలక స్థానం వహిస్తున్న సెమీ కండెక్టర్లను తయారు చేసుకోలేకపోతున్నాం. ఒక చిప్‌ను కూడా స్వతంత్రంగా తయారు చేసుకోలేని స్థితిలో మన దేశం ఈ రోజు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలున్నా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. విదేశీ మారకద్రవ్య లోటు ఏర్పడి అమెరికా లాంటి దేశాల పెత్తనానికి తలొగ్గాల్సిన స్థితి వస్తున్నది. అందు వల్ల ఒక సమగ్రమైన రూపంలో అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి. ఆర్ధిక అసమానతలూ తగ్గాలి. ఈ అవగాహన పాలకులలో లోపించింది. కేవలం కంటికి కనబడే రోడ్లు, ఫ్లైఓవర్లను మాత్రమే అభివృద్ధిగా చూస్తే అది భ్రమ అవుతుంది. రెండవ అంశం అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు అబివృద్ధి వికేంద్రీకరణ ఎంత అవసరముందో మన రాష్ట్రం వెనుక బాటును చూస్తేనే అర్ధమవుతుంది. రాష్ట్ర విభజనకు కూడా ఇదొక ముఖ్యమైన కారణం. ఒకప్పుడు తెలంగాణ బాగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగం పెద్దయెత్తున పరిశ్రమలు పెట్టిన తరువాత దానికి అనుబంధంగా చాలా ప్రైవేటురంగ పరిశ్రమలు వచ్చాయి. హైదరాబాద్‌ నగరం అభివృద్ధి కావడంలో ప్రభుత్వ రంగం పునాదిగా పని చేసింది. ఆ తరువాత 90వ దశకం నుండి ఐటి అభివృద్ధి కావడంతో కొత్త రూపం ధరించింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న దేశీయ,విదేశీ పెట్టుబడులన్నింటికీ కేంద్రంగా హైదరాబాద్‌ రూపుదాల్చింది. ఈ క్రమంలో మొత్తం అబివృద్థి అంతా హైదరాబాద్‌, దాని చుట్టూ కేంద్రీకరించడం వల్ల తెలంగాణాలోని మిగతా ప్రాంతాలతో సహా ఆంధ్ర,రాయలసీమ ప్రాంతాలు కూడా వెనుకబడ్డాయి. ఈ అభివృ ద్ధిలో వచ్చిన వ్యత్యాసాల్లో నుండే తెలంగాణా ఉద్యమం కూడా వచ్చింది.ఈ అభివృద్ధిలో వచ్చిన కేంద్రీకరణ ఫలితంగానే కోస్తా, రాయలసీమ ప్రజలు సమైక్యాంధ్ర కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఒక సమగ్రమైనటువంటి వికేంద్రీకరణ పద్ధతిలో అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్రం చీలిపోయే పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్‌లాగే విశాఖపట్నంలో కూడా ప్రభుత్వ రంగం అబివృద్ధి అయ్యింది. కానీ క్రమంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పరం చేసి దాని అభివృ ద్ధిని దెబ్బకొడుతున్నారు. తాజాగా మోడీ ప్రధాన మంత్రి అయ్యాక విశాఖ నగరానికి జీవనాడిగా, అభివృద్ధికి పునాదిగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడమో, మూసే యడమో చేస్తామంటున్నారు. అంతకుముందు హిందుస్థాన్‌ జింక్స్‌, ఇంకా కొన్ని పరిశ్రమలను మూసేశారు. అక్కడ ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున రావడం లేదు. ఉన్న ప్రభుత్వ రంగమూ పోయింది. అత్యంత వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతం, అత్యంత అభివృధ్ధి అయిన విశాఖ నగరం ఒకే జిల్లాలో పక్కపపక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని రాజధా నిగా నిర్ణయించిన తరువాత 33 వేల ఎకరాలను తీసుకుని విద్య, వైద్యం తదితర అనేక రకాల హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి రాజధాని లక్ష కోట్ల వ్యయంతో అభివృద్ధి మొత్తాన్ని కేంద్రీకరించే మాస్టర్‌ప్లాన్‌ను ఆరోజే సిపియం వ్యతిరేకించింది. అమరావతిలో శాసన, పరిపాలన రాజధాని ఉండాలి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అన్ని వెనుకబడిన జిల్లాల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ రాష్ట్ర మంతా విస్తరింపజేయాలని కోరాము. ఆరకం గా అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా వెనుక బడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుం డా స్థానిక యువతకు ఉపాధి కల్పనకు కూడా ఒక మార్గంగా ఉంటుంది. లేనియెడల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లాగా మరొక చీలికకు పునాది ఏర్పడినట్లుంటుందని ఆరోజే హెచ్చరించాము. ఏమైనా అమరావతి రాజధానిగా ఉండాలన్న అంశంలో సిపిఎం ఆనాడే కచ్చితమైన వైఖరి ప్రకటించింది. అదే సందర్భంలో వైఎస్సార్‌ సిపితోపాటు అన్ని పార్టీలు దానిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ రీత్యా ఈరోజు అమరావతి రాజధాని అనేది తెలుగు ప్రజల ఉమ్మడి భావంగా ఉన్నది అనడంలో సందేహంలేదు. ఇక మూడవ అంశం పరిపాలన వికేంద్రీకరణ. జగన్‌ గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ,పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం, తద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. స్వాతంత్య్రోద్యమంలో గ్రామస్వరాజ్యం అనే భావన ఏర్పడిరది. కానీ దానికి భిన్నంగా స్వాతంత్య్రానంతరం దీర్ఘకాలం స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా అభివృధ్ధి కూడా కేంద్రీకరించబడిరది. కేంద్రంలో, రాష్ట్రాల్లో నిరంకుశ ప్రభుత్వాలు ఏర్పడడానికి, ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదంగా పరిణమించిన విషయం మనకు తెలుసు. స్థానిక సంస్థలకు అధికారాలు, దానితోపాటు చట్టబద్ధంగా ఫైనాన్స్‌ కమిషన్‌ల ద్వారా నిధుల విడుదల జరిగితే గ్రామ, వార్డు స్థాయిల్లో జనసభలు జరిపి ప్రజలకు ఏది అవసరమో అక్కడ ఆ రకమైన అభివృధ్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరిపాలనలో ప్రజలు ప్రత్యక్ష భాగస్వాములవుతారు. ఇదే వికేంద్రీక రణకు అసలైన అర్ధం. స్థానిక సంస్థల ద్వారా పాలనా వికేంద్రీకరణ అనే నమూనా కేరళలో అత్యంత జయప్రదంగా అమలైంది. ఐక్యరాజ్య సమితితో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు దాన్ని ఒక ఆదర్శంగా అంగీకరి స్తున్నాయి. మన రాష్ట్రంలో పాలనా వికేంద్రీ కరణ అనే పేరుతో రాజధానిని ముక్కలు చేయడాన్ని సమర్ధించు కుంటున్నారు. నిజానికి రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈరోజు కూడా గ్రామ స్థాయిలో సచివాలయాలు పెట్టారు. వలంటీర్ల వ్యవస్థను పెట్టారు. వాళ్ళద్వారా నేరుగా రాష్ట్ర రాజధాని నుండి ప్రభుత్వమే వారికి ఆదేశాలు ఇచ్చి నడుపుతున్నది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఉన్న వివిధ డిపార్ట్‌మెంట్‌లు,ఆ డిపార్ట్‌మెంట్‌ లకు సంబంధించిన వ్యక్తులు గ్రామ,వార్డు సచివాలయాల్లో వారికి అనుబంధంగాఉంటారు. వీరు క్రింది వారికి ఆదేశాలిచ్చి పనులు చేయిం చే పద్ధతి నడుస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రమే కాకుండా పౌరుల మీద నిఘా పెట్టడానికి, ఆందోళన కారులను ఆపడానికి, నిరోధిం చడానికి, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పేరిట పాలక వర్గాలకు అనుగుణంగా ప్రజలను మలచడానికి, రాజకీయంగా ప్రభావితం చేయడానికి ఈ వ్యవస్థలు ఉపయోగపడు తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న పంచాయితీలు, మున్సిపాలిటీలు నామమాత్రంగా మారాయి. కనీసం రోడ్లు వేసుకోగలిగిన పరిస్థితిగాని, కుళాయిలు పెట్టుకోగలిగిన పరిస్థితి గాని లేదు. దీనికి ‘మీరు పన్నులు వసూలు చేసుకోండి, ఆదాయాలు పెంచుకోండి’ అని వారికి సల హాలు ఇస్తున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ షరతులను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలపై రుద్దుతున్నది. ఎక్కడికక్కడ ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచారు. నీళ్ళపన్ను పెంచుతున్నారు. ఎప్పుడో కట్టుకున్న ఇళ్ళకు ఇప్పుడు అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. కన్వర్షన్‌ పేరుతో అదనపు భారం మోపుతున్నారు. అలాగే వివిధ రకాలైన భారాలను ప్రజలపై వేస్తున్నారు. ఈ రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా ప్రజలనుండి బలవంతంగా వసూలు చేసుకోమనడం వల్ల అవి ప్రజలకు భారంగా మారుతున్నాయి. అభివృద్ధికి తగిన నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయడం కోసం స్థానిక సంస్థలు ఉండాలి తప్ప ప్రజల మీద భారాలు వేయడానికి ఒక సాధనంగా స్థానిక సంస్థలను మలిస్తే అప్పుడు కూడా వికేంద్రీకరణకు అర్ధం లేకుండా పోతుంది. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు కేటాయించడం ద్వారా మాత్రమే పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది. ఈ రకంగా అభివృద్ధి వికేంద్రీకరణకు, పాలనా వికేంద్రీకరణకు ఒక స్పష్టమైన నిర్వచనం ఇచ్చుకుని తదనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి బయట పడ వచ్చు. రాజధానిని ముక్కలు చేయకుండానే అమరావతిలోనే శాసన, పరిపాలన రాజధానిని ఉంచి దాని చుట్టూ మొత్తం వికేందీక్రకరణ చేయడం సహేతుకంగా ఉంటుంది. అదే సమయంలో శాసన, పరిపాలన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. రాజధానిలో అంతర్భాగంగా ఉండాలన్న నియమం లేదు. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట, హైకోర్టు బెంచ్‌లు మరొక చోట వివిధ ప్రాంతాలలో ఉండి ప్రజలకు హైకోర్టును అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో కూడా ప్రజల వాంఛకు అనుగుణంగా హైకోర్టును కర్నూలులో పెట్టి మిగతా ప్రాంతాలలో అవసరమైన చోట్ల బెంచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా హైకోర్టును అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. ఆ రకంగా న్యాయవ్యవస్థను విడిగా చూసి శాసన పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధిని, పాలనను వికేంద్రీకరించి అమలు చేయడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది.

ముస్లీం మ‌హిళ‌లు బాధితుల‌వుతున్న వేళ‌…

మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణ యించుకుంటే,వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించు కోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కును మితవాదులకు స్పష్టంగా చెప్పదలచు కున్నారు.
భారతదేశంలో…హిందూ మహిళల్లో కుల,మత,వర్గ బేధాలు ఉన్నట్లే…ముస్లింల మధ్య కూడా విభజనలు ఉన్నాయి. కానీ నేడు ముస్లిం మహిళలందరిలో కాదనలేని ఒక ఉమ్మడి అంశమే మంటే, రాజకీయ చదరంగంలో సంఘ పరివార్‌ వారిని పావులుగా వాడుకుంటున్నది. 2019లో బిజెపి ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కొత్తచట్టం చేసిన నాటి నుండి ఇటీవల కాలంలో కర్ణాటక విద్యాసంస్థల్లోకి హిజాబ్‌ ధరించిన మహి ళలను అనుమతించని వివాదం వరకు సంఘ పరివార్‌,ముస్లిం మహిళలను లక్ష్యంచేస్తూ వస్తున్నది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తనను తాను ముస్లిం మహిళల రక్షకుడిగా చెప్పుకున్నారు. తాను, తన పార్టీ ముస్లిం పితృస్వామిక బంధనాల నుంచి ముస్లిం మహిళలను కాపాడుతున్నామని చెప్పారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, కాలేజీలకు వెళ్లే దారిలో ముస్లిం బిడ్డలు వీధి రౌడీల అల్లరి చేష్టలతో అనేక ఇబ్బం దులను ఎదుర్కొనేవారనీ, కానీ తమ ప్రభుత్వ చర్యల ఫలితంగా వారికి భద్రత ఏర్పడిరదని చెప్పారు. చరిత్ర తెలిసిన వారు ముఖ్యంగా, 2002లో నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మితవాదుల మారణహోమానికి, దాడులకు గురైన మహిళలు ఆయన ప్రసంగాల్లో చెప్పిన విషయాలను విశ్వసించరు. దౌర్జన్యకారులు ప్రధానంగా ముస్లిం మహిళలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడ్డారు. వారిపై సామూహిక అత్యా చారాలకు పాల్పడి, వారి ఇళ్లను లూటీ చేసి, ధ్వం సం చేశారు. అహమ్మదాబాద్‌ లోని నరోదా పాటియా ఊచకోతలో గర్భవతి కౌసర్‌ బానూ షేక్‌ను మంటల్లో వేసి చంపారు. బతికి బయట పడ్డవారు,సాక్షులు ప్రాణాలను చేతబట్టుకొని సంవ త్సరాల పాటు శరణార్థ శిబిరాల్లో గడిపారు. మత ప్రాతిపదికన సమీకరణలు మారడం ద్వారా ఆ దాడుల ప్రభావం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. 2002 తరువాత పుట్టిన తరానికి చెందిన ప్రజలకు ఇప్పుడు ఓటు హక్కు లభించింది. ఆ హింసకు సంబంధించి వీరికెవరికీ తెలియనప్పటికీ,దాని ప్రభావంతో ఇప్పటికీ బాధపడుతున్నారు.
2014 తరువాత బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంకేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత,మితవాద ప్రభుత్వం చేతిలో ఉన్న రాజ్యాం గ యంత్రాంగం,సంఘ పరివార్‌ శక్తులు ముస్లింలను భయకంపితులను చేస్తూ, నేరస్థులుగా పరిగణిస్తూ, నిర్బంధంలో ఉంచుతున్నారు. ముస్లిం పురుషుల జీవితాలు నాశనం కావడంతో,దాని కొనిసాగింపుగా వారి కుటుంబాలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాల నలో 2020 ఢల్లీి అల్లర్లు, గోరక్షక దళాల పేరుతో చట్ట విరుద్ధంగా అనేక మందిని చంపారు. ముస్లిం లకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు నిత్యకృ త్యంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను అణచివేసి, విద్యా ర్థులు, కార్యకర్తలను మూకు మ్మడిగా అరెస్ట్‌ చేశారు. వారిలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. మితవాద శక్తుల అవిశ్రాంత దాడుల తర్వాత ముస్లింలను ఒక పక్కకు తోశారు. కొంతమంది మతపరమైన గుర్తింపును చెరిపి వేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకుంటే, వారిలో కొంతమంది గొంతెత్తి, రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీక రణ స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకునే హక్కును ఉపయోగించుకోవడం ద్వారా తమ గుర్తింపును నొక్కి చెప్పాలని అనుకున్నారు. విద్యావంతులైన ముస్లిం యువతులు హిజాబ్‌ (తలకు ముసుగు/హెడ్‌ స్కార్ఫ్‌) ధరించడం ద్వారా వారికున్న హక్కు ను మితవాదులకు స్పష్టంగా చెప్పదలచుకున్నారు.
హిజాబ్‌ సమస్య దుష్ఫలితాలు
ఆన్‌లైన్‌ వేలం కేసుల విషయంలో అధి కారులు చర్యలు తీసుకుంటున్నా, కర్ణాటక లోని పాఠశాలల్లో హిజాబ్‌ చుట్టూ నడుస్తున్న వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాం శమైంది. కొన్ని రోజుల్లోనే హిజాబ్‌ సమస్య, సుదూరంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా దాని ప్రభావాన్ని చూపింది. కానీ ముస్లిం ప్రజల్లో ఉన్న భిన్నత్వం వలన పదాలఅర్థాలు భిన్నంగా ఉన్నాయి. ఉదాహ రణకు,బెంగాల్‌ ముస్లిం జనాభా ఎక్కువ గా నివసించే ఢల్లీి మురికివాడల్లో ‘హిజాబ్‌’ అనే పదం విదేశీపదం.ఇళ్ళలోపని చేసే,నిర్మాణ రంగం లో పనిచేసే మహిళలు ఒక్కోసారి ముసుగు ధరి స్తారు. దానిని వారు ‘ఇస్కబ్‌’ అంటారు. ఇంటిపని చేసే తబస్సుమ్‌,అక్కడే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు…దాన్నిచున్నీ,దుపట్టా,పర్దా లేక పల్లూ (చీరకట్టినప్పుడు) అంటారు. వారు బయటికి వెళ్ళిన ప్పుడు తలను కప్పుకుంటారు.కానీపని చేసే సమ యంలో,ఇంట్లోఉన్నప్పుడు,సైకిల్‌ తొక్కే సమయంలో వివిధ సందర్భాలలో దానిని ధరించరు. దానితో పాటు పెళ్లికాని అమ్మాయిలు కూడా వాటిని ధరిం చరు. పది సంవత్సరాల వయసు నుంచి తబస్సుమ్‌ ఇస్కబ్‌ ను ధరించడంవల్ల అది ఆమెకు బాగా అలవాటైపోయింది. ఒకవేళ ఆ ముసుగు లేకుంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని ఆమె చెప్పింది. కానీ ఆమె బుర్కా అలవాటు కాకూడదనే ఉద్దేశ్యంతో ఇంత వరకు బుర్కాధరించలేదు. బుర్కా ధరిస్తే పని చెయ్యడం సాధ్యం కాదని,ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుందని చెప్పింది. ఖురాన్‌ చెప్పింది నేను చేస్తాననీ, నేను మంచి వ్యక్తిగా ఉండే ప్రయ త్నం చేస్తాననీ, ఎవరో ఏదో అనుకుంటారని బాధ పడితే ఎలా సంపాదించి,ఎలా పిల్లలకు తిండి పెడతానని అంటుంది. భారతదేశంలో హక్కులూ, ఆచారాల మధ్య జరుగుతున్న సమీకరణ చర్చల్లో తబస్సుమ్‌ లాంటి శ్రామిక వర్గ ముస్లిం మహిళకు తన భావాలను వెల్లడిరచే కొద్దిపాటి స్థలమే ఉం టుంది. అదే నిజమైన విషాదం.
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు : మౌలికంగానే లోపభూయిష్టం
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు సహేతుకమైన సర్దుబాటు ఆవశ్యకతను గుర్తించడంలో విఫల మైంది. విద్యాసంస్థల్లో విద్యార్థులు తలకు కండు వాలు ధరించడంపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేక విధాలా తప్పు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించడంపై తలెత్తిన వివా దంపై ప్రశ్నలు లేవనెత్తిన తీరు రాజ్యాంగ సూత్రా లను దెబ్బతీసేదిగా ఉంది. నిర్దేశిత యూనిఫామ్‌కు అదనంగా ధరిస్తున్నారా? యూనిఫామ్‌ రంగుకు ఎలాంటి తేడా లేని హిజాబ్‌ ధరించడం వల్ల పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడం సరైనదా? కాదా? అన్న విషయాన్ని పరిశీలించడంలో కోర్టు విఫలమైంది. ఇస్లాంలో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ఆచారమని, అందువల్ల, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద ప్రసాదించబడిన మత స్వేచ్ఛలో భాగంగా దీనికి రాజ్యాంగపరమైన రక్షణ ఉందని విద్యార్థులు చేసే వాదనతో విభేదిస్తూ ఖురాన్‌లోని చరణాలను బెంచ్‌ ఉటంకించింది. ఇదా అసలు సమస్య? విద్యార్థుల మధ్య సమానత్వ భావనను దెబ్బతీయకుండా సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా తరగతి గదిని బహుళత్వంతో కూడిన సమాజం అనుమతించే ‘సహేతుకమైన సర్దుబాటుకు అనుకూలమైన వాదనను కోర్టు తోసిపుచ్చింది. పాఠశాలల వంటి ‘’ బహిరంగ స్థలాల్లో ‘’ దుస్తులకు సంబంధించిన నియమాలు అవసరమే కావచ్చు. కానీ సూచించిన యూనిఫారానికి ఇబ్బంది కలిగించని రీతిలో అదనంగా చిన్న వస్త్రాన్ని ధరించే సర్దుబాటును సైతం తిరస్కరించడంలో హేతుబద్ధత ఏమిటో అర్థం కావడం లేదు. ‘మనస్సాక్షి స్వేచ్ఛ’పై ఆధారపడిన వాదనను తిరస్కరించిన కోర్టు అందుకు పిటిషన్లలో తగిన వివరణ లేకపోవడాన్ని ఒక సాకుగా చూపింది. యూనిఫామ్‌ ఆవశ్యకతను గురించి కోర్టు నొక్కి చెబుతూ, సమానత్వం, సజాతీయత యొక్క ఉల్లంఘించలేని చిహ్నం అని ఉద్ఘాటించింది. సజాతీయత అంటే సర్దుబాటుకు ఆస్కారమిచ్చే వాదనలను మొత్తంగా తోసిరాజ నడమన్నట్టుగా కోర్టు చూసింది. ఈ కేసులో ‘ఎసెన్షి యల్‌ ప్రాక్టీస్‌’ (మౌలికమైన ఆచరణ)ను పరీక్షకు పెట్టాల్సిన అవసరం ఉందా అనేది మరో ప్రశ్న. పూర్తిగా మతతత్వంతో కూడిన దురాచారమైతే, దానిని కేంపస్‌ వెలుపల ఉంచవచ్చు. ఏకరూపత, వేరుపరిచే భావనను తొలగించడం అనేవి మంచి లక్ష్యాలే. అయితే, ఇటువంటి అంశాలపై తలెత్తే చిక్కులను వేదాంతాల జోలికి పోకుండానే పరిష్కరించవచ్చు. ‘ మౌలికమైన మతపరమైన ఆచారాలు’ ను పరీక్షించడం మొదలు పెడితే దానికి ఇక హద్దు పద్దు ఉండదు. ఇటువంటి వాటిని నిర్ణయించడానికి సుప్రీంకోర్టు తిరుగులేని ప్రమాణాలను నెలకొల్పింది. మౌలికమైన ఆచారాలు అని దేనిని పిలుస్తామంటే, అది లేకపోయినా లేదా తొలగించబడినా మొత్తం మతమే నాశనమయ్యే ప్రభావాన్ని కలిగి ఉండేవాటిని మాత్రమే. .కొన్ని మౌలికమైన ఆచారాలు కాపాడబడితే కాపాడుకోనివ్వండి. అటువంటి వాటివల్ల ఏ మతపరమైన ఆచారమూ మనుగడ సాగించదు. దానికి బదులు సమానత్వం, గౌరవం, గోప్యత, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన వంటి రాజ్యాంగ విలువలకు రక్షణగా ఆర్టికల్‌ 25ని క్లెయిమ్‌ చేయడాన్ని పరీక్షిస్తే ఎక్కువ ప్రయోజనం. ఏదేమైనప్పటికీ ఇటువంటి వాటిని’ మౌలిక ‘ పరీక్షకు ఎన్నడూ పెట్టకూడదు.. ఎందుకంటే ఇది వేదాంత భావనలను మిగతా వాటిపై స్వారీ చేయడానికి సిద్ధాంతపరంగా అనుమతిస్తుంది. ఆ భావనలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమా, కాదా అన్నదాంతో నిమిత్తం లేకుండా ఒక మతానికి ఆవశ్యకంగా పరిగణించబడుతూ ఉంటాయి. స్వేచ్ఛలు ముఖ్యం కాబట్టి మత స్వేచ్ఛ ముఖ్యమే.కానీ మతాలు కాదు ముఖ్యం. – దివ్యా త్రివేది

భారత రత్నం
డా ॥ బి.ఆర్‌. అంబేద్కర్‌

(భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.)
ప్రపంచ మహా మేధావు ల్లో డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరు. భారతీయ సమాజాన్ని సమూలంగా మార్చడానికి కృషి చేస్తూ, ఆ క్రమంలో అర్థశాస్త్రాన్ని అన్వయించి సామాజిక సాంస్కృతిక, రాజకీయ, నైతిక, ధార్మిక విషయాలను చర్చించారు. అంబేద్కర్‌ రచనలు, ప్రసంగాలు, సంభాషణలు ఇప్పుడు 23 సంపుటాలుగా లభ్యమ వుతున్నాయి. ఇప్పుడు అంబేడ్కర్‌ సమగ్ర దృక్పథం ఏమిటో తెలుసుకోవడానికి ఇవన్నీ అందు బాటులోకి వచ్చాయి. గతంలో గాంధీ, నెహ్రూలకు ఇచ్చిన ప్రాధాన్యత అంబేడ్కర్‌కు ఇవ్వకపోవడం వల్ల అంబేడ్కర్‌ సమగ్ర అధ్యయనం సాగలేదు. అంబేడ్కర్‌ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాం తం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయ డానికి కులనిర్మూలనను ప్రతిపా దించారు. – Saiman Gunaparthi
సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. సోక్రటీస్‌,ప్లేటో, అరిస్టాటిల్‌, బుద్ధునితో పోల్చదగిన పాత్ర. అంబేద్కర్‌కు ముందు భారతదేశంవేరు, అంబేద్కర్‌ తరువాత భారతదేశం వేరు. అంబేద్కర్‌ ఆలోచన, కార్యాచరణ ద్వారా ఆయన భారతదేశ స్వరూపాన్ని మార్చగలిగాడు. అంబేద్కర్‌ గొప్ప మానవతావాది. గొప్ప హేతువాది. గొప్ప కరుణశీలి.తన జీవితంలో ఎదురైన అస్పృ శ్యతను, కులాన్ని నిర్మూలించడం కోసం ఆయన అహరహం కృషి చేశారు.అంబేద్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించి దాన్ని సామాజిక మానవ తావా దంగా పునర్నిర్మించి నవయాన బౌద్ధాన్ని ప్రపంచానికి అందించాడు. అంబేద్కర్‌ బౌద్ధప్రబోధంలో జఠిలత్వాన్ని తగ్గించి గాంభీర్యాన్ని పెంచాడు. అంబేద్కర్‌ సామాజిక, రాజకీయ సిద్ధాంతాలన్నీ బౌద్ధంలో ఉన్న మైత్రీ భావంతో ముడిపడి ఉన్నాయి. ఆయన తన విద్యాసంపన్నతను, మేథోవిస్తృతిని అహం కారానికి,ఆధిపత్యా నికి, నియంతృత్వానికి దారి తీయకుండా కరుణ,ప్రేమ,ప్రజ్ఞలతో కూడిన నూత్న భారతాన్ని ఆవిష్కరించడానికి రాజ్యాంగ నిర్మాణం లో లౌకిక, ప్రజాస్వామ్య, సమతా భావాలను సమన్వయించాడు. భారతదేశంలో కులం నిర్మూలించబడటం వలన స్వేచ్ఛ, స్వాతం త్య్రం,సౌభ్రాతృత్వం ప్రజల్లో వెల్లి విరుస్తుందని,అప్పుడు కులభావం లేకుండా ప్రతిభనుబట్టి,జ్ఞానాన్ని బట్టి, క్రియను బట్టి ప్రజలకు విద్యా, పారిశ్రామిక,ఉద్యోగ వ్యవస్థల్లో స్థానం లబి స్తుందని ఆయన తన ఉపన్యాసాల్లో బోధించారు. కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేరని వర్ణము,కులము ఇవన్నీ కూడా ఒకానొకనాడు రూపుమాస్తాయని అంబేద్కర్‌ సిద్ధాంతీకరించాడు.అంబేద్కర్‌ పోరాట యోధుడు.అణగారిన ప్రజలకు ఆయన బోధి స్తూ ‘మన హక్కులను అన్యాయంగా అపహరించిన వారి నుండి తిరిగి పొందడానికి నిరంతర పోరాటమే శరణ్యమని ‘నవసమాజ నిర్మాణం ప్రార్థనలతోను, నినాదాలతోను జరగ దని,దానికి విప్లవమే శరణ్యమని ఉద్భోదిం చాడు.ఆయన ఆర్థిక, వాణిజ్య ధర్మశాస్రాల్లో పరిశోధనలు చేసి పిహెచ్‌డి పట్టాలు పొందిన మేథావి. అందుకే ఆయన ‘యుగయుగాలుగా దాస్య శృంఖలాల తో మగ్గిపోతున్న పీడిత వర్గా లను నా జీవితకాలంలో పాలకులుగా చూడాలి, అదే నా జీవితలక్ష్యం అని తన జీవితలక్ష్యాన్ని వెలుగెత్తిచాటిన రాజకీయ,సామాజిక దార్శ నికుడు.ఆయన ఒక్క దళితుల కోసమే కాదు, మొత్తం భారతదేశంలోని అన్నివర్గాలకోసం పోరాడాడు. ముఖ్యంగా స్త్రీల గురించి మాట్లా డుతూ స్త్రీలను బానిసత్వపు సంకెళ్ల నుండి విముక్తి చేయాలంటే మనోవికాసం కలిగిన మహిళలంతా హిందూ మతం నియమించిన మూర?సిద్ధాంతాలపైన తిరుగుబాటుచేయాలి. వివాహం చేసుకున్న స్త్రీ, భర్తతో సమానంగా ఉంటూ భర్త స్నేహి తురాలిగా వ్యవహరిస్తూ, అతని బానిసగా లోబడకుండా జీవించాలి. అప్పుడే స్త్రీలు తమ గౌరవాన్ని పొందగలు గుతారు. స్త్రీజాతి అభివృద్ధిలోనే సమాజాభివృద్ధి ఉందని నా విశ్వాసం. గర్భవతిగా ఉన్నశ్రామిక స్త్రీకి విశ్రాంతి ఇవ్వవలసిన బాధ్యత మనపైన ఉంది. నేను ప్రతిపాదిస్తున్న ఈ బిల్లు ముఖ్యో ద్దేశం ఇదే. స్మృతులు స్త్రీలకు కల్పించిన హక్కులనే పొందుపరచి ఈ హిందూకోడ్‌ బిల్లును రచించాను.స్త్రీలసాంఘిక పురోగతికి అడ్డుగా ఉన్న ధర్మశాస్త్రాల అడ్డంకి తొలగిం చడమే ఈబిల్లు ధ్యేయం. సంపదపైనే స్వాతంత్య్రం ఆధారపడి ఉంది.కాబట్టి స్త్రీలు సంపాదనాపరులై హక్కులు సాధించుకొని తమ స్వాతంత్య్రాన్ని తిరిగి పొందాలనిస్త్రీ విముక్తి దాతగా ఆయన ప్రజ్వలించారు.1951 ఫిబ్రవరి5వతేదీన హిందూ కోడ్‌ బిల్లు పార్లమెంట్‌లో చర్చకువచ్చింది.అప్పటి కేంద్ర మంత్రి అయినఎన్‌.వి. గాడ్గిల్‌ ఈ బిల్లుద్వారా భారతదేశంలో స్త్రీలకు రాబోతున్నవిప్లవాత్మ కమైన భవిష్యత్తుకు కారణం డాక్టర్‌బి.ఆర్‌. అంబేద్కర్‌ అని,ఆయన భారతదేశంలో స్త్రీ సంస్కర్తలు ఎవరూ చేయలేనిపని చేశారని కొని యాడారు. దుర్గాభాయ్‌దేశ్‌ముఖ్‌ హిందూ కోడ్‌ బిల్లును సమర్ధిస్తూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్త్రీ దాస్య విమోచకుడని పేర్కొనడం జరిగింది. ఈ రోజున స్త్రీలు అనుభ విస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు,విద్య,గౌరవం,ఉద్యోగోన్నతులన్నీ అంబేద్కర్‌ హిందూకోడ్‌ బిల్లు ద్వారా తెచ్చినవే. హిందూకోడ్‌ బిల్లుపార్లమెంట్‌లో వీగిపోయి నప్పుడు అంబేద్కర్‌ ఎంతో ఆవేదన చెందారు. ఆయన తన న్యాయమంత్రిత్వ పదవికి ఈ కార ణంగా 1951 సెప్టెంబర్‌ 27న తేదీన రాజీనా మా చేశారు.అదికూడా భారతదేశంలో సంచల నాత్మక విషయమైంది. ఆ సందర్భంగా ఆయన ఎంతో ఆవేదన చెందాడు.ఎంతో మనోవేదనతో ఆయన హిందూకోడ్‌ బిల్లును త యారు చేయడంలో ఎంతో శ్రమకులోను కావాల్సి వచ్చింది.1947 ఏప్రిల్‌ 11వ తేదీన ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాను. 1949 ఏప్రిల్‌ 19న తేదీన ఈ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపారు. 1950 ఫిబ్రవరి వరకు ఈబిల్లు నిర్లక్ష్యం చేశారు.1950 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును వాయిదా వేశారు. 1951 ఫిబ్రవరి సమావేశంలో ఈ బిల్లులోని ఒక్కొక్క అంశం మీద చర్చించి 1951వ సంవత్సరం చివరకు బిల్లును అస్తిపం జరంలా చేసి చివరకు ఆమోదించలేదు. అందుకు నేను మనస్తాపం చెంది, స్త్రీలకు స్వేచ్ఛ కలిగించని ఈ పార్లమెంట్‌లోని క్యాబినెట్‌ మినిస్టర్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆయన దళితుల కోసం ఎంత చేశాడో స్త్రీల విముక్తి కోసం కూడా అంతే చేశాడు. అంబేద్కర్‌ శూద్ర కులాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్నోచట్టాలను తీసుకు వచ్చారు. ఆయన శూద్రులకు, అతి శూద్రు లకు ఇద్దరికీ తమ కులబానిసత్వాల నుండి బయట పడటం కోసం బౌద్ధ స్వీకారాన్ని ప్రబోధిం చారు. ఆయన నిమ్నకులాల మధ్య ఉన్న అంటరానితనాన్ని పోగొట్టడం కోసం గొప్ప ప్రబోధనలు చేశారు. నిమ్నకులాల మధ్య ఉన్న అంటరానితనాన్ని నాశనం చేయాలంటే కులాం తర వివాహాలు తప్ప వేరే మార్గం లేదు. గుర్తుంచుకోండి, కులాంతర వివాహాలు జరిగితే ఉపకులాలు వాటంతట అవే నాశనమైతాయి. అంటరానివారు సాంఘిక వెలిని ఎలా అంత మొందించగలరు? అందుకున్న ఒకే ఒక మార్గం కులతత్వం లేని ఇతర వర్గాలతో సోదరత్వాన్ని, బంధుత్వాన్ని పెంచుకొని వారిలో లీనమవ్వ డం. ఈ సమాధానం చాలా తేలికైనది. కాని ఈ సమాధానపు విలువను చాలామంది ఒప్పు కోరు. కారణమేమిటంటే అతి తక్కువ మందికి మాత్రమే బాంధవ్యపు విలువ, ప్రాధాన్యత తెలుసు అని సమాజం మార్పును పైనుంచే కాకుండా కింద నుంచి కూడా ప్రారం భిం చాడు. కులం అనేది ఎక్కడ చిట్టెంగట్టుకు పోయినా దానిని బద్ధలు చేయడం కష్టం. కులంనుంచి బయటపడ్డవాళ్లు విస్తృత మైన సమా జంలో ప్రతిభావంతులుగా ముందుకు నడుస్తారు. తమ పిల్లలకు మొత్తం ప్రపంచంలో నచ్చినవారిని పెళ్లి చేయగలుగుతారు. ప్రపం చం మొత్తంలో ఎక్కడైనా విద్య చెప్పించగలు గుతారు. ఈ స్వేచ్ఛ లన్నీ మనం అంబేద్కర్‌ ద్వారా పొందినా ఆయనను జ్ఞాపకం చేసు కోలేకపోతున్నాం. అంబేద్కర్‌ గొప్ప రాజనీతి జ్ఞుడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో ఆయన ప్రజాస్వామిక పునా దులను గట్టిపరిచాడు.ఆయన పరిపూర్ణ రాజ్యసిద్ధాం తాన్ని ప్రతిపా దించిన హాబ్స్‌,హెగెల్‌, బొసా న్క్వెట్‌ తదితరులతో ఆయన ఏకీభ వించలేదు. రాజ్య సమర్థుకులు భావించినట్లు రాజ్యమే అంతిమం అనే విధానాన్ని వ్యతిరేకించి రాజ్యం ఒక మానవ సంస్థగా భావించారు. ఎందు కంటే ఆలోచనకు ఆచరణకు రాజ్యమేగాక ఇతరంగా అనేకమైన మూలాలు ఉన్నాయని అంబేద్కర్‌ భావించారు. రాజ్యం ఒకసంస్థగా భావించి దాని లక్ష్యం ఈ విధంగా సూత్రీక రించారు. జీవనానికి, స్వేచ్ఛకు ఆనందంగా జీవించడానికి,స్వేచ్ఛగా మాట్లా డడానికి హక్కును కల్పించగలగాలి. సామాజిక, రాజకీయ,ఆర్థిక అసమానతలను తొలగించి అణచివేయబడిన వర్గాలకు చక్కని అవకాశా లు కల్పించాలి. భయం నుండి విముక్తిని కోరిక నుండి విముక్తిని అనుభవించే విధంగా ప్రతి వ్యక్తికీ అవకాశం కల్పించాలి. రాజ్యం మనిషినీ, సమాజాన్ని ఒక సేవకుడుగా సేవించాలే తప్ప యజమా నిలా ఆధిపత్యం వహించకూడదు. అందుకనే స్వాతంత్య్రానంతరం ఆయన ప్రజల హక్కుల పరిరక్షణ కోసం దృఢంగా నిల బడ్డాడు.ఆయన స్వతంత్రం కోసం మనషి నిరంతర పోరాటానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఉద్దేశంలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ స్వతంత్రం మాత్రమేకాదు. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతి క, సామాజిక, తాత్త్విక స్వతంత్రం ఉంటేనే స్వాతంత్య్రం ఉన్నట్లు భావించాలని ఆయన నొక్కిచెప్పారు. ఆయన ఉద్దేశ్యంలో రాజ్యం అనేది మానవ్ఞల కోర్కెలను, ఆశయాలను సఫలీకృతం చేసే ఒక సాధనం మాత్రమే. రాజ్యానికి, వ్యక్తికీ మధ్య అంతస్సంబంధాలు ఈ దిశలోనే ఉండాలని ఆయన భావించారు. అంబేద్కర్‌ తన స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌లో పరిశ్రమలను భూములను జాతీయం చేస్తే దేశ సంపద పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయ భూమి లేనివారికి వ్యవసాయ భూమి కల్పించడం వల్ల వాళ్లు ఆ భూమిని ఎంతో శ్రద్ధగా చేసుకుని ఉత్పత్తిని పెంచుతారని కొంత మంది చేతుల్లోనే ఎక్కువ భూమి ఉండడం వల్ల భూమి నిర్ల క్ష్యం అయ్యే ప్రమాదముందని అంబేద్కర్‌ ఆనాడే ప్రబోధిం చాడు. కానీ పాలకవర్గాలు నిరుపేదలకు భూమిని పంచటంలో ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నా యి.అందువల్ల ఎక్కువమంది వ్యవసాయ కూలీలు మనకు ఏర్పడ్డారు. వ్యవసాయ కూలీల్లో కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు. అస్పృశ్యులను కూడా ఆయన మీరు ఇతరుల కంటే తక్కు వనే ఆత్మన్యూనతా భావాన్ని వదులుకోవాలని పిలుపునిచ్చాడు. మిమ్మల్ని అన్ని రంగాల్లోకి రావడానికి సంబంధించిన ద్వారాలను తెరుస్తున్నారు.మీరు ప్రతిభావం తంగా సమర్థవంతంగా వాటిలోకి ప్రవేశించి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని కూడా ఆయన చెప్పటం జరిగింది. అంబేద్కర్‌ దళితుల్లో ఉన్న తాగుడు వంటి దురా చారాలకు వ్యతిరేకంగా పోరాడాడు.మీలో వ్యక్తిత్వం రూపొందాలంటే మీరుబౌద్ధాన్ని స్వీకరిం చాలి.ఎటువంటి దుర్వ్యసనాలు లేకుండా మీ సంపదను పిల్లలకు విద్య నేర్పించడం కోసం ఉపయుక్తం చేయండని ఆయన పదేపదే తన ఉపన్యాసాల్లో చెప్పాడు. నేను ఒకతల్లి లేని పిల్ల వాడిగా ఎదిగి ఇవాళ వేల పేజీలు గ్రంథాలు రాయగలిగానంటే అక్షరం ఎవరి సొత్తు కాదు. అక్షరంద్వారా ఎవరైనా ప్రపంచ మానవ్ఞనిగా ఎదగొచ్చని ఆయన తన ప్రజలకు ప్రబోదం చేశాడు. అంబేద్కర్‌ తనప్రబోధాల్లో ప్రజలు భిక్ష గాళ్లుగా మార కూడదు. శ్రమద్వారా, ఆత్మ గౌరవం ద్వారా నిరంతరం ఉత్పత్తిలో పాల్గొ నడం ద్వారా మేథో సంపదను పెంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోండని ఆయన బోధి స్తూ వెళ్లారు. ఆయనది ఆత్మ గౌరవ ఉద్యమం. మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం. కులంద్వారానో,మతంద్వారానో, అధి కారం ద్వారానో,అనువంశికంగా సంపాదించిన సంపద ద్వారానో మనిషి ఉన్నతం కాలేదు. పాలకులు, ప్రజలు రాజ్యాంగంలో రూపొం దించిన లౌకిక,ప్రజాస్వామ్య, సమసమాజ భావజాలంతో,మానవ తావాదంతో సామాజిక విప్లవ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆయన ప్రబోధించిన బోధనలను ఆచరించటం ద్వారా భారత దేశంలో సామాజిక పునరుజ్జీవన ఉద్య మంలో మనమూ భాగస్వాములు అవుదాం.
భారతరత్న జీవిత విశేషాలు
అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం. అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. 1891లో ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని అంబవాడేలో (అప్పటి సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’అన్న ఊరిలో) తల్లిదండ్రులు రాంజీ మలోజీ సాక్వా ల్‌,భీమాబాయ్‌ జన్మించారు. ఆయన పూర్తి పేరు భీమ్‌ రావ్‌ రాంజీ అంబేద్కర్‌. చదువు కోవాలన్నా మంచినీళ్ళు తాగాలన్నాకులమే అడ్డుగా నిలబడిరది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ,వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొం దించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కొందరివాడు కాదు అందరి వాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావా ల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహానాయకుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్పనాయకుడు అంబేద్కర్‌. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాం గంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు. అంబేద్కర్‌ విభిన్న అం శాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. ‘ప్రజాస్వామ్యం’, ‘అంటరానితనం’, ‘కుల నిర్మూ లన’, ‘మతమార్పిడి’,‘బౌద్ధమతం’, ‘హిందూ మతంలోని చిక్కుముడులు’, ‘ఆర్థిక సంస్కర ణలు-దళితులు’,‘భారతదేశ చరిత్ర’ మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. అంబేడ్కర్‌ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులం ఒక పెట్టుబడిగా,అదనపు సంపదగా,అదనపు విలువగా,అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్‌ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. తెలుగు నాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యం లో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది.1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్‌ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్‌ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు.
బాబాసాహెబ్‌ ప్రత్యేకతలు-దక్కిన గౌరవాలు
బాబాసాహెబ్‌ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు.ప్రతి ప్రసంగం అత్యంత ప్రభా వితం చేయగలిగేవే. లండన్‌ యూనివ ర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్‌. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన ఆరుగురు మేధావు లలో బాబాసాహెబ్‌ ఒకరు. లండన్‌ విశ్వ విద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ పీహెచ్‌డీని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.
అంబేద్కర్‌ విద్యాభ్యాసం
ా బీ.ఏ (బాంబే విశ్వవిద్యాలయం, 1912)
ా ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915)
ా ఎమ్మెస్సీ (లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏకనామిక్స్‌, 1921)
ా పీహెచ్‌డీ (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)
ా డీఎస్‌సీ (లండన్‌ విశ్వవిద్యాలయం, 1923)
ా బారిష్టర్‌ ఎట్‌ లా (గ్రేస్‌ ఇన్‌ లండన్‌, 1923)
ా ఎల్‌ఎల్‌డీ( కొలంబియా విశ్వవిద్యా లయం, 1952, గౌరవపట్టా)
ా డీ.లిట్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా)
కుటుంబ నేపథ్యం
మరాఠీ నేపథ్యం గల అంబేద్కర్‌ కుటుంబం. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబేవాడ గ్రామంలో నివాసం ఉండేది. వీరి వంశీకులు మహార్‌ కులానికి చెందినవారు. తండ్రి రాంజీ బ్రిటీష్‌ ఇండియన్‌ ఆర్మీలో సుబేదారు. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడ్డారు. మిగిలినవారు.. ఇద్దరు అక్కలు.మంజుల, తులసి,ఇద్దరు అన్నలు బలరాం,ఆనందరావు మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన చిన్నతంలోనే అంట రానితనాన్ని ఎదుర్కొన్న అంబేద్కర్‌ పాఠశాలలో వేరే పిల్లలతో కలవకుండా,మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒకమూల కూర్చోబెట్టేవారు. నీళ్ళు తాగాలంటే ప్యూన్‌ మాత్రమే వచ్చి ఇచ్చే పరిస్థితి.బరోడా మహారాజు శాయాజీరావ్‌ గైక్వాడ్‌ ఇచ్చిన 25రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ.పూర్తి చేశారు. విదే శాల్లో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పని చేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందు కొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరిన అంబేద్కర్‌.1915లోఎం.ఏ.,1916లో పి. హెచ్‌.డి. డిగ్రీలను పొందిన అంబేద్కర్‌, 1917లో స్వదేశం వచ్చాక మహారాజా శాయా జీరావ్‌ సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా నియామకం అయ్యారు. ఇక అంబేద్కర్‌ గాంధీ ఉద్యమము నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్‌డ్‌ క్లాస్‌ కాంగ్రెస్‌, ఆలిండియా షెడ్యూ ల్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ వంటి అనేక రాజకీయ పార్టీ లను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. స్వాతంత్య్రం అనంతరం స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను అప్పగించిన నెహ్రూ..ప్రభుత్వం భారత రాజ్యాంగ పరిషత్‌ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసి దృఢమైన రాజ్యాంగాన్ని తయారు చేయడంలో విజయం సాధించారు. తరతరాలుగా బడుగు,బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవి తాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్‌. వ్యవసా యాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన అంబేద్కర్‌..వారసత్వ,వివాహ చట్టా లలో లింగ సమానత్వాన్ని వివరించడానికి ప్రయత్నించారు. హిందూ కోడ్‌ బిల్లు ముసా యిదాను పార్లమెంటులో నిలిపివేయడంతో.. 1951లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబరు14న నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించిన అంబేద్కర్‌..తన జీవితంలోని ముఖ్యాంశాలను తన ఆత్మకథ ‘వెయిటింగ్‌ ఫర్‌ ఏ వీసా’లో రాసుకున్నారు. మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1954లో డిసెంబర్‌ 6న తన ఇంట్లోనే కన్నుమూశారు అంబేద్కర్‌. దళితుల హక్కులు,అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాటం చేసిన యోధుడిగా గుర్తింపు పొందారు. 1990లో అత్యున్నత భారతరత్న పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. (సేకరణ : థింసా ఎడిటోరియల్‌ డెస్క్‌)

అక్షరాలకు గుడి కట్టిన సవర తెగ గిరిజనులు

‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే ‘మతార్బనోమ్‌’.మత్‌ అంటే దృష్టి,తార్‌ అంటే వెలుగు,బనోమ్‌ అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు,మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తాం. అక్కడే సవర భాషను నేర్పుతాం. అందుకోసం చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటు న్నారు’’
ఏదైనా ఆలయానికో,మందిరానికో వెళ్తే, అక్కడ దేవుడు, దేవత విగ్రహాలు,పటాలు కనిపి స్తాయి. వారికి పూజలు,భజనలు చేయడం కనిపిస్తుంది. కానీ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చాలా ఆలయాల్లో అక్షరాలకు పూజలు చేస్తారు. వాటికి మందిరాలు కట్టి భజనలు చేస్తారు. అక్షరమంటే అంత ప్రేమ ఆ గిరిజనానికి.ఇంతకీ అక్షరానికి ఆలయం ఎందుకు? ఆ ఆలయాల ప్రత్యేకత ఏంటి?గిరిజన గ్రామాలకు వెళ్తే వింతైన ఆచారాలు, నమ్మకాలు, జంతు బలులు, గ్రామ దేవతల పూజలు ఇటువంటివే సాధారణంగా కనిపిస్తాయి.కానీ, ఇందుకు పూర్తిగా భిన్నమైన గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ అక్షరాలకు ఆలయాలు కట్టి పూజలు చేస్తారు. ఇలా ఎందుకంటే తమ మాతృభాషని రక్షించుకునేందుకు అంటారు.
అక్షర బ్రహ్మ ఆలయాలు
అక్షరాలను ప్రతిష్టించి పూజించే ఆలయాలను ‘అక్షర బ్రహ్మ’ ఆలయాలు అంటారు. పెద్ద ఆలయాలు నిర్మించేందుకు అవకాశం లేని చోట, చిన్న మందిరాలు కట్టి అక్షరాలకు పూజలు చేస్తున్నారు. ఆ ఆలయాలు, మంది రాలు అన్నీ కూడా సవర గిరిజన తెగ నిర్మించుకున్నవే. తమ మాతృభాషను కాపాడుకోవడానికి ఇలా అక్షరానికి ఆలయం కట్టడం కంటే మంచి మార్గమేముందని వాళ్లంటున్నారు. ‘‘ఏపీ, ఒడిశా ఏజెన్సీల్లో సవర తెగ ఎక్కువగా కనిపిస్తుంది. మేం మాట్లాడే సవర భాష చాలా పురాతనమైనది. కానీ దానికి లిపి లేదు. అందువల్ల మా పూర్వీకుల సంప్రదా యాలు మాకు సరైన రీతిలో చేరలేదు. దాంతో, లిఖిత రూపంలో ఉన్న ఇతర గిరిజన సంప్రదా యాలనే సవర సంప్రదాయాలుగా అనుస రించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సవర సంప్రదా యాలను ముందు తరాల వారికి అందిం చాలంటే లిపి అవసరమని మావాళ్లు గుర్తించారు. ఒడిశాకు చెందిన సవర పండితుడు మంగయ్య గొమాంగో పన్నెండు సంవత్సరాలు కృషి చేసి 1936లో సవర భాషకు లిపి రూపం ఇచ్చారు. అదే మా మాతృభాష. ఈ లిపి ఇంటింటికి చేరాలంటే ఏం చేయాలనే ఆలోచన నుంచి పుట్టినవే అక్షర బ్రహ్మ ఆలయాలు’’ అని సవర తెగ గురువు సవర కరువయ్య తెలిపారు.
అక్షర చైతన్యం.. మాతృభాషా ఉద్యమం
గిరిజనుల్లో చైతన్యం నింపేందుకే గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్టించారు. అక్షరమే దైవం, దానికే మేం పూజలు చేస్తాం అంటారు గిరిజనులు. అక్షరాలకు దేవాలయాలు, మందిరాలు నిర్మించి వాటి ద్వారా సవర భాష లిపిని అందరికి నేర్పుతున్నారు. ‘‘శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాతృభాషను కాపాడుకునేందుకు 28 అక్షర బ్రహ్మ ఆలయాలు, మందిరాలున్నాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్షరానికి ఆలయాలు కట్టడం వెనుక ఒక ఉద్యమమే జరిగింది. అదే ‘మతార్బనోమ్‌’.మత్‌ అంటే దృష్టి,తార్‌ అంటే వెలుగు,బనోమ్‌ అంటే విస్తరించడం. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం. మాతృభాష గొప్పతనం తెలిపేందుకు ప్రతి గురువారం అక్షర బ్రహ్మ ఆలయాలు,మందిరాల వద్ద భజనలు, పూజలు చేస్తాం. అక్కడే సవర భాషను నేర్పుతాం. అందుకోసం చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. గ్రామంలోని దాదాపు అందరూ మా భాష నేర్చుకుంటు న్నారు’’ అని అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతి తెలిపారు.
‘అక్షరానికి పూజలు చేస్తే దేవతలకు పూజలు చేసినట్లే’
అక్షరమంటే ముక్కోటి దేవతలతో సమానమని సవర గిరిజన సమూహాలు భావిస్తాయి. అందుకే అక్షరానికి పూజలు చేస్తే దేవత లందరికీ పూజలు చేసినట్లేనని నమ్ముతారు. దేవతా రూపంలో విగ్రహాలు లేకున్నా, అక్షర బ్రహ్మ ఆలయాల్లో పండుగలు నిర్వహిస్తారు. ‘‘ఇలా అక్షరాలకు గుడి కట్టి పూజించే సంప్ర దాయం మరెక్కడ ఉండదు. అక్షరంలోంచే త్రిమూర్తులు పుట్టుకొచ్చారని పెద్దలు చెప్తారు. ఓంకారం అక్షరమే. అందుకే ఓంకార రూపం వంటి ఆకారం మధ్యలో సవర లిపి అచ్చులు, హల్లులు ఉంచి వాటికే పూజలు చేస్తాం. మా తెగలో అక్షరానికి తప్ప వేరే దేవుడు, దేవతల విగ్రహాలకు పూజలు చేయం. ఈ లిపికి, అక్షరానికి పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్లే’’ అని నౌగడ గ్రామ అక్షర బ్రహ్మ ఆలయ గురువు సవర వెంకటరావు చెప్పారు. ‘ఆయనే మా దైవం.. అక్షరమే మా ఆయుధం’ సవర భాషకు లిపిని అందించిన సవర పండిత్‌ మంగయ్య గొమాంగో తమ ఆరాధ్య దైవమని సవర గిరిజనం చెప్తారు. మంగయ్య గొమాంగో అందించిన అక్షరాలే సవర తెగకు ఆయుధాలని, వాటి ద్వారానే చైతన్యం పొందుతున్నామని సవర గిరిజన గురువులు అంటున్నారు. ‘‘అక్షరానికి గుడి కట్టి ప్రత్యేక పూజలతో సవర లిపి ప్రాముఖ్యతను ప్రచారం చేస్తున్నాం. సవర లిపికి 24 అక్షరాలు ఉంటాయి. అందులో 16 హల్లులు, 8 అచ్చులు ఉంటాయి. వీటిని రాతిపై చెక్కి దేవాలయాల్లో పెడుతున్నాం. అక్షరాలను గోడలపై చిత్రాలుగా వేసి, లేదా పటాలు కట్టి వాటికి మందిరాలు నిర్మిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం నౌగడ, ముత్యా లు,శంభాంలలోనూ,విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కన్నాయిగూడ, లక్కగూడల్లోనూ అక్షరబ్రహ్మ ఆలయాలు నిర్మించాం. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామాల్లో అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాల పేరున ప్రచార మందిరాలు ఏర్పాటు చేసుకున్నాం’’ అని సవర గురువు, అక్షర బ్రహ్మ ప్రచారకుల సంఘం జిల్లా కోఆర్డినేటర్‌ కరువయ్య చెప్పారు. పాఠశాలల్లో తెలుగు, ఒడియాలతో పాటు సవర భాషను కూడా నేర్పించమని గిరిజన సంఘాలు ప్రభు త్వాన్ని కోరడంతో, కొన్ని పాఠశాలల్లో ఆ భాష ను చేర్చారు. ‘‘ఈ తరం పిల్లలు తమ మాతృభాషలోనే ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకే తెలుగు, ఇంగ్లిష్‌, ఒడియా వంటి భాషలను సవర భాష ద్వారా నేర్పుతున్నాం. మాతృభాష ద్వారా నేర్చుకుంటే ఏదైనా సులభం అవుతుంది. పైగా మా సొంత భాషను వదిలి ఇతర భాషల పట్ల మోజు పెంచుకోవడం సరైనది కాదు. ఉపాధి,ఉద్యో గాల కోసం ఏ భాషైనా నేర్చుకోవచ్చు. కానీ మా మాతృభాష బతికుండాలి కదా. అందుకే ఈ ప్రయత్నం. వలంటీర్ల సహాయంతో తరగతులు చెప్తున్నాం. అందరూ ఈ తరగతు లకు హాజరవుతున్నారు. సవర భాష అక్షరాలు, పదాలను చెప్తూ, వాటికి సమానమైన తెలుగు, ఇంగ్లిష్‌, ఒడియా పదాలు రాయడం నేర్చుకుంటున్నారు’’ అని కరువయ్య చెప్పారు.
‘వీడియోలు, స్టూడియోలు, పాఠాలు’
సవర భాషకు ప్రచారం కల్పిస్తూ వీడియోలు తయారు చేస్తున్నారు. దాని కోసం సతివాడ గిరిజన గ్రామంలో చిన్న స్టూడియో కూడా ఏర్పాటుచేసున్నారు. పాటల ద్వారా మాతృ భాషకు ప్రచారం కల్పిస్తున్నారు. స్వచ్ఛందంగా కొందరు అక్షర బ్రహ్మ మందిరాలకు వచ్చి సవర భాష నేర్పుతున్నారు. ‘‘నేను సవర భాష నేర్చుకున్నాను. నాకు తెలుగు కూడా బాగా వచ్చు. తెలుగు,ఒడియా,ఇంగ్లిష్‌ వంటి భాషల్లోని పదాలను సవర భాషలో బోధించి, అర్థాలు వివరిస్తాను. దీని ద్వారా మా మాతృ భాషను రక్షించుకోవడమే కాకుండా, ఇతర భాషల్లోని వివిధ అంశాలను మా భాష ద్వారా నేర్పడాన్ని ఆస్వాదిస్తున్నాను. మాలో అందరికీ తెలుగు వచ్చు. కానీ సవర భాష అందరికీ రాదు. అందుకే మా మాతృభాషను అందరికి నేర్పించాలనే ఉద్దేశంతోనే నేను, నాలాంటి వాళ్లు వచ్చి పాఠాలు చెప్తున్నాం’’ అని నూకా లమ్మ గూడ గ్రామానికి చెందిన సవర సుబ్బలక్ష్మీ చెప్పారు. ‘గిరిజనమే ఆదర్మం కావాలి’‘‘మాతృభాషకు మించినది ఏదీ లేదు. అది అమ్మ భాష. మాతృభాషని విస్మరిస్తే ఏ భాషైనా మనుగడ కోల్పోతుంది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా భాషలు అలాంటి ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడు కోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన దేశంలోని అనేక గిరిజన తెగలకు లిపి లేదు. లిపి లేని భాషకు ఎక్కువ కాలం మనుగడ ఉండదు’’ అని ఏయూ తెలుగు విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు అన్నారు. ‘‘తమ భాషను బతికించుకునేందుకు సవర గిరిజనం చేస్తున్న కృషి చాలా గొప్పది. అసలు అక్షరానికి ఆలయం కట్టడమనేదే చాలా గొప్ప ఆలోచన. ఇదే తరహాలో వారు సవర లిపిని వ్యాప్తి చేసి, సవర భాషకు మంచి గుర్తింపు తీసుకుని రావాలి. వారి స్ఫూర్తి తెలుగుతో సహా మిగతా భాషలకు ఆదర్శం కావాలి’’ అని ఆయన అన్నారు.(బీబీసీ సౌజన్యంతో) -లక్కోజు శ్రీనివాస్‌

పిల్లలు ఇక్కడ.. బడి ఎక్కడో..!

ఇంతకు మునుపు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో, పిల్లలు దాని బారిన పడ్డారా లేదా అనే విషయం మనకు తెలియదు కానీ,భౌతిక విద్యా బోధన విధానానికి మాత్రం ఆన్‌లైన్‌ విద్య ప్రత్యామ్నాయం కాదనే విషయం మనకు తెలుసు. పిల్లలు ముఖ్యంగా ప్రైమరీ,ప్రీప్రైమరీ చదివే చిన్నారులు…తోటి పిల్లలు,ఉపాధ్యాయులు, ఇతరుల నుంచి (హ్యూమన్‌ ఇంటరాక్షన్‌) నేర్చుకోగలగడంతో పాటు సామాజికంగా,మానసికంగా అభివృద్ధి చెంద గలరు.అయినా,పాఠశాలలు మూసివేయడం ద్వారా మనం వారి జీవితాలతో ప్రయోగాలు చేస్తున్నాం. వీటి ఫలితాలు చాలా వినాశకరంగా ఉంటున్నాయి. సెప్టెంబర్‌, 2021 సర్వే నివేదిక ప్రకారం… పిల్లల్లోచదివే,రాసేసామర్థ్యంస్థాయి బాగా తగ్గిపో యింది. సగం మంది పిల్లలు కొన్ని పదాల కంటే ఎక్కువ చదవలేక పోతున్నారు. మూడో వంతు పిల్లలు చదువుకునే క్రమంలోనే లేరు.
కోవిడ్‌-19 మన జీవితాలు తలకిందు లు కాకూ డదనే విశ్వాసం అలాగే మిగిలి పోయిం ది. డెల్టా కన్నా ఒమిక్రాన్‌ ఎక్కువగా వ్యాప్తి చెంది… తక్కువ ప్రభావం చూపుతున్నప్పటికీ…మనపై విధించిన ఆంక్షలు రోజువారీ జీవితాలపై మరొక సారి ప్రభావం చూపుతున్నాయి. ఒకవేళ రాత్రి కర్ఫ్యూలు, సరిహద్దుల్లో సోదాల లాంటి నిబంధ నలు ఇంతకు ముందున్న వేరియంట్‌ను కట్టడి చేయనట్లయితే…వేగంగా వ్యాప్తి చెందే వేరి యంట్‌ను కూడా ఆ నిబంధనలు కట్టడి చేయవనే విషయం వివేకవంతులకు స్పష్టమవ్వాలి.
లోపించిన హేతుబద్ధత
కానీ,ఇరవై నెలల పాటు పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించినప్పుడే మన హేతు బద్ధతను వదిలేశాం. రాజకీయ నాయకులకు పాఠ శాలలు ఒకతేలికైన లక్ష్యాలుగా మారాయి. పాఠ శాలల మూసివేత,కోవిడ్‌ను కట్టడి చేసే ఒక సున్ని తమైన చర్య అనీ, దాని కోసం వారేదో చేస్తున్నారనే భావనను ప్రజల్లో కలిగిస్తుంది. కానీ ఇది, హేతు బద్ధతలో, వాస్తవంలో పాదుకొనని ఒక భావోద్వేగ ప్రతిచర్య. కోవిడ్‌-19 రెండవ వేవ్‌ ముందు కూడా, చిట్ట చివరికి మూసివేసేది, మొట్ట మొదట ప్రారం భించాల్సింది పాఠశాలలేనని అనేకమంది నిపుణు లు సూచించారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకోక పోవడం వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన కాలంలో సుదీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసివేసిన దేశాలలో భారత్‌ ఒకటిగా నిలిచింది. ఇదీలాగుంటే కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యావిధానం గోరుచెట్టుపై రోకలపోటు చందంగా మారింది. ప్రక్షాళన కారణంగా ఎంతో మంది పేద పిల్లలకు విద్య దూరం కావడంతో దాని ప్రభావంతో తల్లిదం డ్రులకు భారంగా పరిణ మించింది. ప్రాథమిక పాఠశాలలు మూసివేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.3,4,5 తర గతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సర్క్యులర్‌ 172 విడుదల చేసింది. వచ్చేవిద్యా సంవత్సరంనాటికి మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యా ర్థులను ఉన్నత పాఠశాలలకు తరలించనుంది. ప్రాథమిక పాఠశాలలు ఒక కిలోమీటర్‌ పరిధిలో వుండాలన్న విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి భిన్నంగా 1,2తరగతుల పిల్లలను అంగన్‌వాడీలకు అప్ప గించనుంది. అందుబాటు లోని ప్రాథమిక విద్యను పేదలకు అందకుండా చేస్తోంది. ప్రాథమిక పాఠ శాలలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్వగ్రామమైన చిన మేరంగి హైస్కూల్‌లో2.25కిలోమీటర్ల దూరం లోవున్న అల్లువాడ, దాసరిపేట, తాళ్లడుమ్మ, చిన మేరంగి కాలనీ, చినమేరంగిలోని ఆరు ప్రాథమిక పాఠశాలలను కలిపేస్తున్నారు. ప్రాథమిక పాఠశా లలను మూసేసే పని ప్రారంభించింది. ప్రభుత్వ చర్యలవల్ల ప్రాథమిక పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లలేనంత దూరం పెరుగుతుంది. 3,4,5 తరగ తుల పిల్లలు కిక్కిరిసిన రద్దీతో వాహనాలు తిరుగు తున్న రోడ్లను దాటి సురక్షితంగా పాఠశాలకు వెళ్లి రాగలారా? సాధ్యం కాదు. వెళ్లిన పిల్లలు తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పదు. దూరం గానున్న బడులకు పిల్లలను పంపించేందుకు తల్లి దండ్రులు భయపడితే వారే తీసుకెళ్లి తీసుకురావాలి. లేదంటే ఆటోలకు పంపించాలి. ప్రతిపేటలో పిల్ల లు బడికెళ్లి సురక్షితంగా రావడానికి వీలుగా బడు లు పెట్టారు. వయసును బట్టి పిల్లల మానసిక ఎదుగుదల,పరివర్తనలో తేడా వుంటుంది. అందు వల్ల చిన్న పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు ఒకే ఊరిలో ప్రైమరీ,హైస్కూల్‌ ఏర్పాటు చేశారు. ఆడుతూ,పాడుతూ,ఏడుస్తూ బడికివెళ్లే ఆరేళ్ల పిల్లడు,13ఏళ్లు దాటిన పిల్లలతో ఇమడలేడని గుర్తించి…అనేక కమిషన్ల సూచన ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠ శాల నెలకొల్పారు. ఇపుడా ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏకపక్షంగా మూసేస్తోంది.
వ్యవసాయం, కూలి పని చేసుకునే జనం తెల్లారగానే పనిలోకి పోవాలి. రోజూ పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు రావడం సాధ్యం కాదు. కనుక పిల్లలను ఆటోలకు పంపించాలి. అందుకు డబ్బు పెట్టాలి. ‘అమ్మఒడి’కి ఇచ్చిన డబ్బు అందుకు సరిపోవచ్చు. కుటుంబంలోని మిగతా పిల్లలకు ‘అమ్మ ఒడి’ వర్తించదు కనుక తల్లిదండ్రులు చేతి డబ్బు పెట్టుకోవాలి.లేదంటే పిల్లలను బడికి పంప డం ఆపేస్తారు.‘అమ్మ ఒడి’ శాశ్వత పథకం కాదు. ప్రభుత్వం మారితే ‘అమ్మ ఒడి’ వుండదు. ‘అమ్మ ఒడి’ లేకపోతే తల్లిదండ్రులపై చదువుల భారం పెరుగుతుంది. అధికారం లోకి రేపు ఎవరొచ్చినా మూసేసిన పాఠశాలలను తెరిపించరు. అందుకని సర్కారు బడులను సంరక్షించుకోవడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
మౌలిక సదుపాయాలు లేకుండానే….
హైస్కూళ్లకు తరలిస్తున్న 3,4,5 తరగ తుల పిల్లలకు తరగతి గదులున్నాయా? బెంచీలు, కుర్చీలున్నాయా? ఇతర మౌలిక సదుపాయాలు న్నాయా? అవేమీ లేవని అన్ని చోట్లా ఒకటే మాట. మరెందుకు ఇంత తొందర? హైస్కూళ్లలో తరగతి గదులు లేవు గనుక టీచర్లు విలీన తరగతుల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి పాఠాలు చెప్పాలట? గంట గంటకు ప్రైమరీ స్కూల్‌ నుండి హైస్కూలుకు, హైస్కూల్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌కు టీచర్లు పరుగులు తీయాలా? సాధ్యాసాధ్యాలపై కనీసం ఉపాధ్యాయ సంఘాలతోనైనా ప్రభుత్వం చర్చించలేదు? మేము నిర్ణయించాం. మీరు అమలు చేయండి అని విద్యాశాఖ అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.
యువతకు తీరని అన్యాయం
ప్రపంచబ్యాంకు సలహాతో చంద్రబాబు ప్రారంభిం చిన విద్య ప్రైవేటీకరణను రాజశేఖ రరెడ్డి విస్తృత పరిచారు. ప్రైవేటు బిఇడి కాలేజీలకు విస్తారంగా అనుమతులు ఇచ్చి ట్రైనింగ్‌ పూర్తి చేస్తే టీచర్లు అవుతారనే భ్రమ యువతలో కల్పించారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసి ట్రైనింగులు, ఆపైన కోచింగులు పూర్తిచేసి టీచర్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఆశాభంగమే మిగిలింది. ప్రాథమిక పాఠశాలల మూసివేత మూలంగా ఖాళీగాఉన్న 25వేలు టీచర్‌ పోస్టులు భర్తీ చేయక పోగా మరో 75వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు తేలు స్తున్నారు. ఇపుడున్న 1:0విద్యార్థి,టీచర్‌ నిష్ప త్తిని1 :35 గా మార్చేశారు. గత రెండేళ్లు డీఎస్సీ లేదు.
ఎస్‌.సి,ఎస్‌.టి,బి.సిలుప్రభుత్వవిద్యను కాపాడుకోవాలి
వేల సంవత్సరాలపాటు భూమిపై హక్కు లేక ఆర్థిక అణచివేతకు, చదివే హక్కు లేక కుల పీడనకు గురైన ఎస్‌.సి,ఎస్‌.టి బి.సి సామా జిక తరగతుల ప్రజలు ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అందు బాటులో ఉండడంతో కొంతమేరకైనా చదువు కోగలుగుతున్నారు. అత్యంత వెనకబడిన తరగతుల (ఎం.బి.సి) పిల్లలు నేటికీ ప్రభుత్వ బడికి కూడా వెళ్లలేకపోతున్నారు. ఈ తరగతుల పిల్లలు రాష్ట్ర ప్రభుత్వనిర్ణయంతో తీవ్రంగ నష్టపోతారు. ఉన్నత సామాజిక తరగతుల్లోని పేదలుకూడా నష్టపో తారు. నూతన విద్యావిధానం అమలు చేయడం అంటే ఇదే! విద్యారంగంలో తిరోగమనాన్ని నిల వరించి అందరికీ ప్రభుత్వ విద్య అందే విధంగా, విద్యా హక్కు అమలు సంపూర్ణంగా జరిగేలా విశాల ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం నేడు మన ముందుంది.పేద పిల్లలకు విద్య దూరం..తల్లిదం డ్రులకు భారంగా పరిణమించకూడదు.
విద్యకు సంబంధించిన సమస్యలు ఏదో ఒక రోజు పరిష్కారం చేస్తారనే ఒక నిరాధారమైన, అస్పష్టమైన హామీలను అంగీకరించినప్పటికీ, మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉం టున్నాయి. పాఠశాలలు మూసివేసినప్పటికీ, పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా పెరిగినట్లు బ్రిటన్‌ దేశపు నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా,‘అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియా ట్రిక్స్‌’’ పిల్లల్లో మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ‘’జాతీ య ఎమర్జెన్సీ’’గాపేర్కొంది.భారతదేశంలో, మాన సిక ఆరోగ్య సమస్యల్ని పక్కకు పెడితే, పాఠశాలల మూసివేత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా పౌష్టికాహార లోపాలసమస్య మరింత అధ్వా న్నంగా తయారైంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరే కంగా కొన్ని దశాబ్దాలుగా సాధించిన ప్రగతి, పాఠ శాలల మూసివేత కారణంగా వెనుకపట్టు పట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం,10.1మిలియన్ల మంది బాలకార్మికులు ఉన్నారని ఒక అంచనా. పౌష్టికాహార లోపాలు, బాల కార్మికులకు సంబం ధించిన రోజువారీసమాచారం మన దగ్గర ఉండి ఉంటే, బహుశా మనం భారతదేశం లోని పిల్లల బాధల పైన దృష్టి పెట్టేవారం.అంతే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలు మూసివేసి ఉండేవాళ్ళం కాదు. ‘పిల్లలు పాఠశాలల నుండి ఇంటి దగ్గర ఉండే పెద్దలకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం ఉంద’’ని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు అంటువ్యాధిని అడ్డుకోలేవనే విషయం తెలుసు కాబట్టి, పెద్దవారి ప్రయోజనాల కోసం, పిల్లల పాఠశాలలను మూసివేయడం అసం బద్ధమైన విషయం. పిల్లలకు శాస్త్రీయమైన పరీక్షల తర్వాత ఉపయుక్తమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరు. ఇప్పటికీ పరిశీలనలో ఉన్న వ్యాక్సిన్‌కు…విద్యను, పాఠశా లలను ముడిపెట్టడంలో అర్థం లేదు. పిల్లలకు కోవిడ్‌-19 ఎమర్జెన్సీ లేదు కాబట్టి వారికి వ్యాక్సిన్‌ అత్యవసరం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. వాస్తవానికి, రోగి నిరోధకశక్తికి సంబంధించి ‘’నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌’’ (ఎన్‌.టి.ఎ.జి) అభిప్రాయమిది. 15-18 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వ ఆమోదం, ఎన్‌.టి. ఎ.జి అభిప్రాయాన్ని సవాల్‌ చేస్తున్నది. విద్య అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. పాఠశా లలను సుదీర్ఘకాలంపాటు మూస ివేయడం ద్వారా, ఒక బలహీనమైన ప్రత్యామ్నా యానికి అవకాశం ఇవ్వడంద్వారా,మనంపిల్లల హక్కులను ఉల్లం ఘనకు గురిచేస్తున్నాం. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పిల్లల కోసం నోళ్ళు విప్పాలి. అంటు వ్యాధుల వ్యాప్తి, నియంత్రణ శాస్త్రవేత్తలు,డాక్టర్లు, విద్యావేత్తలు ధృ వీకరించినట్లు‘పిల్లలకు 2022 సంవత్సరం సంతో షంగా ఉండాలని’ కోరుతూ మనలో ఒకగ్రూప్‌ ఓప్రయత్నాన్ని ప్రారంభించింది.2022 ఆ తరు వాత కాలం కూడా పిల్లలు అన్ని విధాలా సంతోష కరమైన పాఠశాల జీవితం,సంతోషకరమైన బాల్యా న్ని పొందాలని ఆశిద్దాం. (వ్యాసకర్త ఐ.ఐ.టి ముంబైలో (‘ద హిందూ’సౌజన్యంతో )(ప్రొఫెసర్‌.భాస్కరన్‌ రామన్‌/ఎం.కృష్ణమూర్తి)

1 2 3 4 5 6 9