మహానీయ స్వామి వివేకానంద

మహనీయ స్వామి వివేకానంద ఉన్నతమైన ఆశయాలు ఏదోఒకరోజు సర్వజనాంగీ కారాన్ని పొందుతాయి. కారణం ఆభావన, ఆశయాలు ప్రతి కార్యరంగంలోనూ,ప్రతీ ఆలోచనా విధా నంలోనూ ఉత్తేజం కలిగించేవి కాబట్టి. కాషాయాంబరాలు ధరించి,పద్మాసనస్థుల్కె, ఒకదాని మీద మరొకటిగా కరకమలాలను ఒడిలో ఉంచు కుని,అర్థనిమీనేత్రుల్కె ధ్యానమగ్నుల్కె వివేక మం తమైన ఆనందం అనుభవించే స్వామి వివేకానంద లోకానికి ప్రకాశానిచ్చే ఒక జగద్గురువు. సామాజిక సృహతో కూడిన ఆధ్యాత్మికతను ప్రజలకు ఉపదేశించడం, ఇంద్రియాతీత విషయాలను వివేకించటం ద్వారా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించడం, ఆ సౌధంలో చ్కెతన్యమూర్తులుగా జనులను విరాజిల్లింపచేయటం స్వామి వివేకానంద అపురూప ఆశయం. విశ్వాసంతో నిరంత రాభ్యాసాన్ని చేస్తూ, మనసు పొరలలో నిభిఢీకృ తమైన కొత్త విషయాలను అనుభ విస్తూ, క్రొంగొత్త శక్తుల వశీకరింపచేసు కుంటూ ఊహాతీత వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవటానికి దివ్య ప్రేరణ స్వామి వివేకానంద. 1863వ సం.లో కలకత్తా నగరంలో జన్మించిన స్వామి వివేకానంద ఆరేళ్ళ ప్రాయంనుంచే అంతర్ముఖ అన్వేషణలో మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నుడ్కె ఉండేవారు.జ్యోతిర్మయ ప్రకా శంలో జీవిస్తూ చిరుప్రాయంలోనే సృజనా త్మకత, ఆత్మ ప్రతిష్ట, ఆత్మ ప్రేరణలో దివ్యదర్శనాలు అనుభవించారు. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఆచ్కెతన్యంలో విరాజిల్లే అంతర్ముఖ చ్కెతన్య స్వరూపుడు.‘‘నేను భగవంతుడిని నిన్ను చూస్తు నంత స్పష్టంగా చూశాను,మతం అనేది అను భూతి పొందవలసిన సత్యం,లోకాన్ని మనం అర్దం చేసుకోవటంకన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’’అని ప్రవచించే శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సాన్నిధ్యంలో న,కర్మ,భక్తి,యోగ మార్గాలో కానరాని మెరు గులు ఆస్వాదించి వారి వచనాలను విపులీకరించి లోకాన్ని ఆశ్చర్యచకితులను చేసారు. పశుప్రాయులుగా జీవిస్తున్న వారిని మానవ స్థాయికి ఎదగచేయడమే ప్రధాన ధ్యేయంగా లోకాన్ని ఉద్ధరించిన మనీషి స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన స్వామి ప్రసం గం బాహ్యంగా ఎగసిన ఉత్సాహపు టలలోనే కాక, ఉద్వేగ ప్రవాహాలోనే కాక, నరనరాల్లోకి చొచ్చుకుని పోయిన నూతన కాంతి పుంజం. దానిని గురించి ఒక్క మాటలో చెప్పటానికో, వ్రాయటానికో కుదిరేది కాదు. చికాగో ప్రసంగం స్వామి వివేకానందకు అమెరికాలో గుర్తింపు రావడమే కాదు, సాక్షాత్తు భారతదేశం కూడా గర్వించేలా చేసింది. అమెరికాలో ఎగసిన ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేసింది.‘‘నేను ఎవరిని?ఆసియా వాసినా? ఐరోపా వాసినా?అమెరికా వాసినా? ఈ వ్యక్తిత్వాల వింత సమ్మేళనాన్ని నాలో అనుభూతి చెందుతున్నాను’’ అనేవారు స్వామి. మనుషులు ఎలా జీవించాలో స్వామి మాటల్లో…‘‘అందాన్ని పెంచుకుంటే నిన్ను కెమేరాలో బంధించి ఆనందిస్తారు అస్తిని పెంచుకుంటే నిన్ను గంధపు చెక్కలలో తగులబెడతారు పేరును పెంచుకుంటే నిన్ను సన్మాన పత్రాలతో సన్మానిస్తారు హోదాను పెంచుకుంటే నిన్ను హోర్డింగులలో నిల బెడతారు అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే నిన్ను జనం గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు’’
ప్రతి మతంలోని, ప్రతి సిద్ధాంతంలోని మంచిని గ్రహించి హృదయంలో దీప్తిస్తున్న ఆత్మ జ్యోతిని అవలోకనం చేసుకుంటే సర్వమత ఏకత్వాన్ని దర్శించవచ్చని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి శ్రీవివేకానంద. హిందూమతాన్ని కించపరిస్తే సహించేవారు కాదు. దానిని తీవ్రంగా ప్రతిఘ టించి హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పే వారు.జీవితంలో అన్ని విషయాలపైన కఠోర నియమం, నిఘా అవసరం అని చెప్పేవారు. ‘‘ఆహార నియంత్రణ ముఖ్యంగా పాటించాలి. ఆహార నియంత్రణ లేకుండా మనస్సుని నియంత్రించటం సాధ్యం కాదు. అవసరం కన్నా ఎక్కువ తినడం అనేక హానులకు దారితీస్తుంది.మితిమీరి తినడం వలన మనశ్శరీరాలు చెడిపోతాయి’’ అనేవారు. ప్రేమతత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని సడలనీయవద్దని గట్టిగా ప్రభోదిం చేవాడు.మతం అనేది సిద్ధాంత రాద్ధాంత ములతో లేదు అదిఆచరణలే ఆధ్యాత్మికంగా పరిణతి చెందడంలో మాత్రమే వుంది అని విశ్వసించేవారు. వివేకానందను విదేశాలలో అనేకులు కుమారునిగా, సోదరునిగా భావిం చారని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఆయన పరిణతి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటు వంటి బాంధవ్యాలు కొత్త కాదు. విదేశాలలో ఇటువంటివి ఉత్పన్నమైనప్పుడు ఆయన వైఖరి విశిష్టత అర్థం అవుతుంది. జాతి మౌఢ్య, వర్ణ మౌఢ్యం విలయతాండవం చేసే రోజులలో అప్పట్లో బానిస దేశంగా పరిగణించే భారతదేశం నుండి వెళ్ళి అసంఖ్యాక మనసు లను దోచుకోవడం గమనార్హం. అహింసలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో వైరాలకు చోటులేదు. సత్యనిష్టుని సాన్ని హిత్యంలో అసత్యం నశించిపోతుంది. అందుకే అన్ని ఎల్లలను అతిక్రమించిన స్వామి వివేకా నంద ఆత్మ్ఞనంలో సుప్రతిష్టుల్కె ఉండగా ఎలాంటి వివక్షత తలెత్తడం సాధ్యంకాదు. వివేకానంద ఆధ్యాత్మిక శక్తి గురించి విన్న విదేశీయులు ఆయనతో సన్నిహితంగా మెలగటానికి మక్కువ చూపేవారు. తాను జన్మించిన కుటుంబాన్ని పరిత్యజించి ప్రపంచమనే పెద్ద కుటుంబాన్ని స్వీకరించారు. భారతదేశం కూడా తక్కిన దేశాలతో పాటు అభివృద్ధి పొందగోరితే పేదలు, పామరులు పురోగనమం చెందాలి. అందుకే పేదలకు కూడా విద్య గరపమని ఆయన నొక్కి వక్కాణించారు. భారతదేశపు గౌరవ మర్యాదలను విదేశాలలో ఇనుమ డిరపచేయటానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పటికే ప్రచారంలోవున్న భారత వ్యతిరేకతను తొలగించటానికి నడుం బిగిం చారు. భారతీయ ఆధ్యాత్మికతలోని వివిధ పరిణామాలు ఆయన ఉపన్యాసాలలో ప్రధానాంశాలు అయిన ప్పటికి,ప్రతి ప్రసంగంలోనూ మన వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించేవారు. మతాల మధ్య వ్యత్యాసాలు ఉండపచ్చు కాని వాటి మధ్యగల సామాన్య మౌలికతను గుర్తించమని చెప్పేవారు. హైందవుల శాంతి కాముకత్వాన్ని తన అహింసా తత్వంతో వెల్లడిచేసేవారు. శక్తివంతమైన ఈ భారతదేశం ప్రపంచాన్ని జయిస్తుంది. అందుకే ‘‘ఓభారతమా! నీఆధ్యా త్మికతతో ప్రపంచాన్ని జయించు!’’ అంటూ స్వామి సింహనాదం చేసేవారు. ప్రశాంతత, పవిత్రత,త్యాగశీలత,సౌభ్రాతృత్వాల సందేశా లను వివరించి సహన రహిత చెవిటి చెవులలో ప్రతిధ్యనులు ఉద్భవింపచేయటంలో విజయం సాధించారు.దుస్తరమైన అద్వ్కెతాన్ని కళాత్మ కమైనదిగానూ,సజీవమైనదిగానూ వర్ణించారు. భయం కలిగించే యోగ సంప్రదాయాలను అత్యంత శాస్త్రీయంగానూ,ఆచరణ యోగ్యం గానూ వివరించే మానసిక శాస్త్రంగా వివరిం చేవారు. సత్యమనేది మతానికి ఆపాదించటం మూర్ఖత్వం అని చెప్పేవారు. విదేశాలలో ధీర గంభీరత్వంతో ఎన్నో ఆటుపోటు లను ఎదుర్కొని సత్యంవైపు అడుగులు వేసారు. మనలో నిద్రాణమైవున్న శక్తిని తట్టిలేపిన మహనీయుడు.‘‘మన జాతీయ ఆత్మన్యూన తాభావ జాఢ్యాన్ని వదిలించుకునేలా చేసిన వ్యక్తి వివేకానంద’’అని రాజాజీ పేర్కొన్నారు. వివేకానందుని లేఖలు భారతీయులలో దాగివున్న శక్తిని వెలువరించి చింతనను జాగృతం చేసాయి.లేఖ మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని ప్రారంభించారు. భగవదనుగ్రహం వలన పావనత సంతరించు కున్న మనస్సులో ఉద్భవించిన చింతనలే లోకాన్ని కదిలించి వేస్తాయనటంలో అతిశ యోక్తిలేదు. ‘అక్కడ సూర్యుడు ప్రకాశించ డు.చంద్రతారకలు అసలే ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవవు.ఇక ఈఅగ్ని మాట ఎందుకు! ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తాయి.దాని వెలుగుతోనే ఇదంతా వెలిగింపబడుతున్నది.’ ‘‘స్వామి వివేకానంద ప్రసంగాలను, రచలను నేను క్షుణ్ణంగా చదివాను,ఆతరువాత నా దేశభక్తి వేయి రెట్లు అయింది. యువకుల్లారా! ఆయన రచన చదవాల్సిందిగా మిమ్మల్ని కోరు కుంటున్నాను’’ అని మహాత్మాగాంధి అన్నారు. వివేకానందుడు రామకృష్ణ మఠం స్థాపించి ‘‘పేదలకు,వెనుకబడ్డ వారికిసేవ చేయడం దీని ప్రధానోద్దేశాలలో ఒకటి‘అని ఉద్భో దించి భారతీయ యువతకుదిశానిర్దేశం చేశారు. భారతదేశాన్ని పురోగమింప చేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమ యంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడము, దోపిడీకి గురి చేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేతస్వామి.తన 33ఏళ్ళ వయసులోనే మరణించి భారతదేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని అనాధలుగా మార్చివేశారు. మనలో ధ్కెర్యంసడలి,దౌర్భ్యం ఆవహిస్తే ‘‘నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామ కృష్ణు శిష్యుణ్ణి నేను’’అనే భావనలు మనసులో నింపుకుంటే సమస్తదౌర్భ ల్యాలు,అధ్కెర్యము మటుమాయమయుతాయి అని సర్వులకు ప్రభోదించేవారు. శ్రీవివేకానందుని జన్మదినం పురస్కరించుకుని భారతప్రభుత్వం ‘‘జాతీయ యువజనది నోత్సవం’’గా ప్రకటించింది.‘‘జనన మరణాలు సహజం,కాని నాభావనలు మావ వాళికి కొంతవరకైనా అందించగలిగితే నా జీవితం వ్యర్థం కాలేదనుకుంటాను’’ అన్న స్వామి వివేకానందుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం,సర్వదా ఆచరణీయం.- (డాక్టర్‌.దేవులపల్లి పద్మజ), వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి, విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం,ఫోను. 9849692414

ఆదివాసులు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు

భారతదేశ మూలనివాసులు ఆది వాసులు వారి అభివృద్ధి స్వాతంత్య్రానికి పూర్వ ము,తర్వాత కూడా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.ఈస్టు ఇండియా కంపనీ,బ్రిటీషు పాలకులు,నిజాంప్రభుత్వము,కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ప్రవేశపెట్టిన చట్టాలు చేపట్టిన పథకాలతో వారు ఆశించినంత అభివృద్ధి జరుగలేదు. హైద రాబాదు రాష్ట్రంలో నిజాం ప్రభుత్వంపై జోడే ఘాట్‌ కేంద్రముగా 1940 సం॥లో కుమ్రంభీము నాయకత్వాన ప్రకృతి సంపదలైన (జల్‌,జంగల్‌, జమీన్‌)నీళ్లు,అడవి,భూమిపైహక్కులు, అధికారము కొరకై గోండుల తిరుగుబాటు జరిగింది.ఈ సం ఘటనలో నిజాం సర్కారుకు భీమ్‌ వర్గానికి మధ్య జోడేఘాట్‌లో భీకర పోరాటం జరిగింది. దీనిలో కుమ్రం భీమ్‌ మరణించాడు.
ఆదిలాబాద్‌ అడవులలో నివసిస్తున్న ఆదివాసుల అశాంతికిగల కారణాలను అధ్య యనము చేయటానికి నిజాం ప్రభుత్వము ప్రముఖ మానవ పరిణామశాస్త్రవేత్తను నియమిం చింది. ఆదివాసులు మరియు ఇతర వెనుక బడిన తరగతుల వారి అభివృద్ధి కొరకు సలహాదా రుగా మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఆంత్రోపా లజీ డిపార్టుమెంటుకు ఆచార్యులుగా కూడా నియమించింది. ప్రొ.హైమండార్ఫ్‌ తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిం చారు.మొదట నల్లమల అడవులలో నివ సిస్తున్న చెంచుల గురించి, భద్రాచలం ప్రాంతం లోని కోయలు,కొండరెడ్ల గురించి మరియు ఆదిలా బాదులోని గోండుల గురించి విస్తృతమైన పరిశో ధనలు చేసారు. అంతేకాకుండా ఈశాన్య భారత ప్రాంతములో నివసిస్తున్న కొనియాక్‌ నాగాలు, అపతానీల గురించి కూడా అనేక పరిశో ధనలు చేశాడు. ఆదివాసుల అశాంతికి గల కారణా లలో ముఖ్యముగా వారికి సాగుభూమిపై అటవీ సంపద మీద హక్కులు కోల్పోవడం, ఆదివాసేతర భూస్వా ములు క్రింది స్థాయి అధికారుల దోపిడి, దౌర్జా న్యాలు పెరిగిపోవడం వారి తిరుగుబాటుకు కార ణాలుగా గుర్తించాడు. నిజాం ప్రభుత్వము గోండుల ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగు పర్చటం ద్వారా వారిఅశాంతిని కొంతవరకు దూరం చెయ్యవచ్చని భావించింది. ప్రొ.హైమం డార్ఫ్‌ దంపతులు తమ కార్యక్షేత్రాన్ని ఆదివాసి గ్రామమైన మార్లవాయి కేంద్రముగా ఎంచుకు న్నారు. ప్రధా నంగా విద్య పరిపాలన పరమైన సూచనలతో నిజాం ప్రభుత్వానికి నాలుగు నివేది కలు సమర్పిం చాడు. గోండులు తమ ఆదిమ జీవనవిధా నం నుండి బయట పడటా నికే కాక భూదాహం గల ఆదిపత్య కులాలవారి నుండి తమనుతాము రక్షిం చుకోవడానికి మార్గా లను,అధికారులతో వ్యవహ రించడంలో తమ భూముల అక్రమ బదిలీలను అడ్డుకోలేక పోవడం వారినిరాశక్తతకు ప్రధాన కారణం వారి నిరక్షరా స్యతగా గుర్తించారు.వారికి ప్రభుత్వ చట్టా లు, నిబంధనలు తెలియకపోవడం వలన దురు ద్ధేశపూరితులైన ఆదివాసేతరులు, అవినీతిపరులైన క్రింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది చేతిలో మోస పోవాల్సి ఉంటుంది. కాబట్టి గోం డుల పరిస్థితిలో మార్పుకు అక్షరాస్యతను పెంచు కోవడమే మొదటి మెట్టుగా భావించారు.
గోండు విద్యాప్రణాళిక రూపొం దించి 1943 వ సం॥లో మార్లవాయి,గిన్నెధారి కేంద్రాలుగా శిక్షణ పాఠశాలలను ప్రారంభిం చారు.ఈ ప్రణాళిక ప్రధాన ఉద్ధేశ్యం ఆదివాసు లకు చదువు నేర్పేందుకు ఆదివాసీ యువకులని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం.గోండు భాషలో వ్రాయడం,చదవడమేకాక రెవెన్యూ,అటవీ శాఖల నిబంధనల గురించి వాటి పనివిధానంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక స్కూళ్లను కూడా నెలకొల్పారు. ఈ విద్యా కార్యక్రమాలలో వృత్తి శిక్షణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన,రోజూవారి జీవితానికి అవసరమయ్యే ఇతర విషయాలను కూడా భోదించేవారు. ప్రొ.హైమండార్ఫ్‌ దంప తులు చేపట్టిన మరోముఖ్య కార్యక్రమం భూ పంపి ణీ,ఆదివాసుల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కు రెవెన్యూశాఖలోనే సాంఘిక సంక్షేమ సంస్థను నెలకొల్పి అక్కడి ఉద్యోగులకు స్వయంగా తానే ఉస్మానియా యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చేవారు. 1946 నాటికి ‘‘నోటిఫైట్‌’’ ఆదివాసీ ప్రాంతాలను సాధారణ పరిపాలనాశాఖ నుండి వేరుచేసి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఆయనే ‘‘మోజాం హుసేన్‌’’ ూజూవషఱaశ్రీ ుతీఱపవం ూటటఱషవతీ. భూపంపిణీ కార్యక్రమ పథకంలో కీలకపాత్ర పోషించారు.1948 నాటికి ఆదిలాబాద్‌ గోండు లు,కొలాంలకు ఒకలక్ష అరవైవేల (1.60 లక్షలు) ఎకరాల భూములకు ‘లావాణి’ పట్టాల రూపంలో పంచిపెట్టారు.వాటిని ఇప్పటికి ప్రొ. హైమండార్ఫ్‌ పట్టాలుగా పేర్కొంటారు. ఇంతేకాకుండా సం॥రా నికి ఒకసారి పుష్యమాసంలో ఆదివాసుల సంప్ర దాయబద్దముగా నిర్వహించే నాగోబా జాతరలో ఆదివాసుల సమస్యలను పరిష్కరించే వేదికగా జిల్లా అధికారుల సమక్షంలో ‘‘ప్రజాదర్బార్‌’’ ను కూడా ఏర్పాటుచేసాడు. నిజాంసర్కారుపై భారత ప్రభుత్వం తీసుకున్న పోలీసు చర్యఫలితముగా హైదరాబాద్‌ రాష్ట్రంలోని నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం కావడం, కొన్నేళ్ల తర్వా త 1956లోతెలంగాణా ప్రాంతాన్ని మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్రంలో కల్పడంవలన నిజాం ప్రభు త్వానికి అంతవరకుప్రొ.హైమండార్ఫ్‌ రూపొం దిచిన ప్రణాళికలు ఆయన చేపట్టిన సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథ కాలు అమలుకు నోచుకో కుండా అస్తవ్యస్తమై పోయినాయి.ఈ పరిణామాల కారణంగా తెలం గాణ,కోస్తాంధ్రలోని ఆదివాసీ ప్రాంతాల గిరిజ నులు విచ్చలవిడిగా దోపిడి పీడనలకు గురైనారు. సొంతగడ్డపై నిలువ నీడ లేకుండా అడవి లోతట్టు ప్రాంతానికి తరిమి వేయబడ్డారు. ఫలితముగా ఆదివాసీ ప్రాంత ప్రజలు కమ్యూనిస్టు పార్టీల నాయ కత్వంలో‘‘దున్నేవాడిదేభూమి’’నినాదంతో ప్రారం భమై సాయుధ పోరాటాలవైపుకు ఆకర్షితులైనారు.
ఆదిలాబాద్‌ నుండి శ్రీకాకుళం వరకు విస్తరించి ఉన్న (ఎజెన్సీ) మన్యప్రాంత గిరిపుత్రు లలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా వారి అభివృద్ధి ని ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వాలపై అసంతృప్తి పెరిగింది. శ్రీకాకుళంలోని మొండెంఖల్‌ నుండి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెళ్ళివరకు నక్సల్‌బరి ఉద్యమాలు అడవిలో ఊపందుకున్నాయి. గోండు గూడాలలో వారి సంప్రదాయ వాయిద్యమైన ‘‘తుడుం’’ మోగింది. తమ హక్కుల సాధన కొరకు, దోపిడి పీడనల విముక్తి కొరకు ఆదివాసులు చైతన్య వంతులైనారు.పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ అనుబంధ ‘‘గిరిజ న రైతు కూలి సంఘం’’ ఆధ్వర్యంలో 20ఏప్రిల్‌, 1981న ఇంద్రవెళ్ళి సంతలో సభ నిర్వహిస్తే ప్రభు త్వం దానిని అడ్డుకొని నిరాయుధులైన వందల మంది అమాయక గోండులపై కాల్పులు జరిపి మరో జలియన్‌ వాలా భాగ్‌ను సృష్ఠించింది. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా ప్రకంపనలురేపింది.
భారతీయ ఆదివాసులు మాట్లాడే భాషలు, వారి సామాజిక వ్యవస్థ, సంస్కృతి, నివాస ప్రాంతాలు, జీవనశైలి, ఆదివాసేతర సమాజాల కంటే భిన్నముగా ఉండటం వలన వారు నివసించే ప్రాంతాల పరిపాలన కొరకు మానవ పరిణామ శాస్త్రవేత్తల పరిశోధన గ్రంథాలు, సూచనలు, నివేది కలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేకమైన పరిపాలన వ్యవస్థను తయారు చేయడం జరిగింది. బ్రిటీషు ప్రభుత్వము1917 సం॥లోనే ఆదివాసులు అధిక ముగా నివసించే ప్రాంతాలను నోటిఫైడ్‌ షెడ్యూలు ప్రాంతాలుగా గుర్తించింది. వారి సామాజిక, సాం స్కృతిక,ఆర్థిక అభివృద్ధికై భారత ప్రభుత్వము ఈశా న్య భారత ప్రాంతములో నివసించే ఆదివాసుల కొరకు స్వయం ప్రతిపత్తిగల జిల్లా కౌన్సిల్లను ఏర్పా టు చేసింది.మధ్య భారతప్రాంత ఆదివాసుల కొరకు వారి భూముల రక్షణకై ప్రత్యేకించి భూ బదలాయిం పు నిరోధక చట్టం వడ్డీ వ్యాపారుల నిరోధక చట్టం ప్రవేశపెట్టింది.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ముందుచూపుతో భారతీయ ఆదివాసుల అభివృద్ధికై ప్రత్యేక పరిపాలన వ్యవస్థ కొరకు ఈశాన్య భారతప్రాంత రాష్ట్రాలకు ఆరవ (6)షెడ్యూలు మరియు మధ్య భారత ప్రాంత రాష్ట్రా ల్లా ఆదివాసులకు అయిదవ(5)షెడ్యూలును భారత రాజ్యాంగంలో పొందుపర్చారు. భారతదేశ మొదటి ప్రధాని శ్రీ పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ కూడా ఈ ప్రాంతఆదివాసి ప్రజల అభివృద్ధి కొరకై ప్రత్యే కమైన‘‘పంచశీలసూత్రాలను’’ప్రవేశపెట్టారు.ఈశాన్య భారతములో కొంతవరకు ప్రగతి జరిగినప్పటికీ మధ్య భారత ప్రాంతములోని ఆదివాసులకు ఆశించి నంత ప్రగతి ఏమాత్రము కూడా జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలాకాలము వరకు గిరిజన అభి వృద్ధి కార్యక్రమాలు సాంఘిక సాంక్షేమశాఖలో భాగంగానే కొనసాగాయి. 1974 సం॥లో ఆదివా సులు అధికముగా ఉన్న తొమ్మిది (9) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కొరకు జి.ఓ.నెం.856సాంఘిక సాంక్షేమశాఖ తేది. 29. 10.1974ద్వార ‘‘సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ’’ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన సాంక్షేమశాఖకు ఆసిఫా బాద్‌ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నుకోబడిన గోండులలో ప్రథమ పట్టభదృడుశ్రీ కోట్నాక భీమ్‌రావు గిరిజన సాంక్షేమశాఖా మంత్రి గా నియమితులైనారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొమ్మిది (9) సమీకృత గిరిజనాభి వృద్ధి సంస్థలఏర్పాటు చేసింది. సమీకృత గిరిజనా భివృద్ధి సంస్థ లకు స్థాయి సీనియర్‌ IAS అధికారి నాయకత్వాన ఆ సంస్థ పరిదిలోని ప్రభుత్వ శాఖలన్నింటిని సమన్వయపరుస్తూ ఏకీ కృత పరిపాలన చెయ్యవలసి ఉంటుంది. సంబంధిత జిల్లా కలెక్టర్లు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలకు జష్ట్రaఱతీఎaఅ లుగా వ్యవహరిస్తారు. ప్రతిమూడు(3) నెలలకొకసారి ఈసంస్థలు అక్కడి ఆదివాసుల సామాజిక,ఆర్థిక అభివృద్ధి కొరకు చేపట్టిన పథకాల ప్రగతిని సమీక్షించుటకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు మరియు గిరిజన సాంక్షేమ శాఖామా త్యుల అధ్యక్షతన గవర్నింగ్‌ బాడీ సమావేశము నిర్వహించాలి. దురుదుష్టవశాత్తు చాలాకాలము వరకు ఈసంస్థల వ్యవస్థలంతాకూడా కొన్ని జిల్లా లలో జిల్లా కలెక్టర్ల కార్యాలయాలలో బంధీలై దీర్ఘానిద్రావస్థలో మునిగిపోయినది.
అంతేకాకుండ సాధారణముగా మైదాన ప్రాంతాలోల సరిగ్గా పనిచెయ్యని, అసమర్థులైన అధికారులను, సిబ్బందిని ఆదివాసీ ప్రాంతాలకు తరచుగా నియమిస్తారు. ఇందులో మొదటి రకం మొదటి నియామకం రెండోరకం పదోన్నతి, మూ డోరకం శిక్షించుటకు వీరు ఆదివాసుల సమస్యలను పట్టించుకోరు. అర్థం కూడా కావు. చుట్టపుచూపుగా వచ్చి విధులు నిర్వహిస్తారు. బదిలీల కొరకై రాజ కీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు. రవాణా సౌకర్యాలు, స్థానికంగా ఉండటానికి కనీస వసతి కూడాలేని ప్రాంతాలలో ఆదివాసుల భాష వారి జీవనశైలి తెలియని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ద్వారా ఆదివాసులకు ఒరిగేది ఏమి లేదు. పైగా వీళ్ళంతా వేతనంతో పాటు ఏజెన్సీ ప్రాంత అలవె న్సులు కూడ పొందుతుంటారు. 1981ఏప్రిల్‌ 20 సోమవారం ఇంద్రవెళ్లి సంతలో గోండులపై జరిగిన కాల్పుల సంఘటన తర్వాత భారతదేశానికి మళ్ళీ వచ్చిన ప్రొ॥హైమండార్ఫ్‌ దంపతులు ఆదివాసి గ్రామాలను విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి ఆదివాసుల స్థితిగతులను పరిశీలించినప్పుడు తమకు1940 నాటి పరిణామాలే గుర్తుకు వస్తు న్నాయని ఆవేదన వ్యక్త పర్చారు. తాము నిజాం ప్రభుత్వ కాలములో ప్రవేషపెట్టిన పథకాలను ఆదివాసుల భూములను పరిరక్షించే చట్టాలను వారి కొరకు ప్రస్తుత ప్రభుత్వాలు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయకపోవటమే ముఖ్యమైన కారణాలుగా పేర్కొన్నాడు. ఆదివాసుల అశాంతికి గల వివిధ కారణాలను తెల్పుతూ వారి అభివృద్ధి కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్ట వలసిన పథకాలపై పలు సూచనలు చేస్తూ ప్రభు త్వానికి తన నివేదిక సమర్పించాడు. ప్రొ॥ హైమం డార్ఫ్‌ దంపతుల సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఆదివాసుల అభివృద్ధికై పలు సంస్కరణలు చేపట్టింది.ఆదివాసులు ఎదుర్కొం టున్న సమస్యలపై అవగాహన కల్గి వారిపై అపార మైన సానుభూతి,చిత్తశుద్ధి గల అధికారులను ఉట్నూర్‌ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో నియ మించారు.1975 సం॥లోనే ఏర్పాటై ఉట్నూర్‌ కేంద్రంగా పని చేయవలసిన సంస్థ జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌ కార్యాలయము నుండి పని చేస్తుం డటం కొత్తగా నియమించబడిన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
1982 ఫిబ్రవరి నెలలో ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీఎమ్‌.వెంకటపూర్ణ చంద్రశేఖర శాస్త్రి, IAూ గారు,గోండు తెగనుండి మొదటిగ్రూప్‌`1అధికారిమడావి తుకారాంసహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్‌) గారుఆదిలాబాద్‌ జిల్లా కేంద్రము నుండి పనిచేస్తున్న IుణA సంస్థ కార్యాలయాన్ని అరవై (60) కి.మీ. దూరములో గల గిరిజన బాలుర వసతి గృహము ఉట్నూరుకి మార్చేశారు. ఈ సంస్థలో పని చేయటానికి ఆశక్తి గల సిబ్బంది అందరూకూడా ఉట్నూరులోనే ఉండి పనిచేయవలసిందిగా ఆదేశాలుజారీ చేసారు. ఆది వాసులంటే అపారమైన ప్రేమాభిమానాలు, అంకితభావముగల అధికారి శాస్త్రీ గారు రాత్రిం బగళ్ళు గోండుగూడాలలో పర్యటించి వారి సాధక బాదకాలను అర్థం చేసుకుంటూ అనతి కాలంలోనే గోండు భాష నేర్చుకున్నారు. సహాయ ప్రాజెక్టు అధికారి శ్రీ మడావి తుకారాం గారి సహకారంతో IుణA లో చిత్తశుద్దిగల అధికారుల బృందాన్ని కూడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వం పై ఆదివాసులకు గల అసంతృప్తిని తొలగించుటకు వారికి ప్రభు త్వంపై నమ్మకాన్ని కల్గించటానికి ఎనలేని కృషి చేసారు. మారుమూల ఆదివాసి గ్రామాల నుండి చదువుకున్న స్థానిక గోండు యువకులను ఎంపిక చేసి IుణA సంస్థకు ఆదివాసులకు మధ్య సంధాన కర్తలుగా పనిచేయటానికి ఇరవై (20)మందిని Gశీఅస పఱశ్రీశ్రీaస్త్రవ ఔవశ్రీటaతీవ ూటటఱషవతీం (Gపఔూ) లుగా నియమించారు. ఆదిమ గిరిజనాభివృద్ధి సలహా సంఘం Aపశీతీఱస్త్రఱఅaశ్రీ ుతీఱపవం ఔవశ్రీటaతీవ Aసఙఱంశీతీవ జశీఎఎఱ్‌్‌వవ (AుఔAజ) ఏర్పాటు చేసి దానికి మాజీ గిరిజన సంక్షేమ శాఖామాత్యులు శ్రీ కొట్నాక భీమ్‌రావ్‌ను జష్ట్రaఱతీఎaఅ గా నియ మించారు. ఆదివాసుల విప్లవ జ్యోతి అమరవీరుడు కుమ్రం భీమ్‌ వర్ధంతి సభను ఆయన వీరమరణం పొందిన జోడేఘాట్‌లో 1983 సం॥ నుండి ప్రతి సంవత్సరము ఆశ్వాయుజ మాసం పున్నమి రోజున ప్రభుత్వ పరంగా IుణA ఆధ్వర్యంలో సభ నిర్వహిం చడం మొదలైనది. గోండుల సామాజిక, సాంస్కృ తిక,సాంప్రదాయ సంస్థలైన‘‘రాయ్‌సెంటర్ల’’ వ్యవస్థ ను పునరుద్దరించే కార్యక్రమాలను చేపట్టారు. రాయ్‌ సెంటర్లసభలు,సమావేశాలు ఏర్పాటు చేసి పరి పాలనలో భాగస్వాములను చేస్తూ ఆదివాసీ గ్రామా ల అభివృద్ధికి ఎటువంటి పథకాలు అవస రమో వారి సలహాలు,సూచనలను పరిగణలోనికి తీసు కోవడం మొదలుపెట్టారు.ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు అధికారి శాస్త్రిగారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం, గిరిజన సహకార సంస్థ ూబప-జశీశ్రీశ్రీవష్‌శీతీ, ూజూవషఱaశ్రీ ణవజూబ్‌వ జశీశ్రీశ్రీవష్‌శీతీ కార్యాలయాలతో పాటు అక్కడ పనిచేసే అధికారు లకు,ఇతర సిబ్బందికి కూడా నివాస గృహాల నిర్మా ణము పూర్తి చేసారు.ఫారెస్టు, పోలీసు, ఇతర అన్నీ ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఉట్నూర్‌లో వెలి సాయి. కుమ్రం భీమ్‌ కాంప్లెక్సు నిర్మాణం పూర్తి కావడంతో ఉట్నూర్‌ పట్టణం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయినవి.ఉట్నూరు నుండి ఇందన్‌ పల్లి వరకు జన్నారంను కలుపుతూ రోడ్డు మార్గం ఏర్పాటు అయినది. ప్రాజెక్టు అధికారి శాస్త్రి గారు పరిపాలన సౌలభ్యం కొరకు తాలుకా వారిగా సెక్టోరల్‌ అధికారుల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రతి సెక్టారుకు IుణA పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను నియమించారు. వారిద్వారా ఆది వాసులు ఎదుర్కొంటున్న తాత్కాలిక,దీర్ఘకాలిక సమస్యలను విశ్లేషిస్తూ ఐటిడిఏ చేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ, వాటి వర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు. శాస్త్రిగారిఐటిడిఏ దళంలోని ముఖ్యమైన సభ్యులు. మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేశారు. ఆదివాసులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ద టానికి గిరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టారు. ఇరవై (20) మంది బడి ఈడు పిల్లలున్న ఆదివాసి గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పా టు చేసారు. మాద్యమిక, ఉన్నత పాఠశాల విద్యకై నూట ముప్పై మూడు (133) ఆశ్రమ పాఠశాలలు, ఏడు (7)వసతిగృహాలు, బాలికల కొరకై ప్రత్యేకించి నలభై ఎనిమిది (48) ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసారు.ఈ పాఠశాలల పర్యవేక్షణ కొరకు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి,సహాయ గిరిజనాభివృద్ధి అధి కారులు,ప్రత్యేక విద్యాశాఖాధికారి కూడా నియమించబడ్డారు. చాలా వెనుకబడిన కొలాం తెగవారి కొరకు నియమించి ఆసిఫాబాదు కేంద్రంగా ప్రత్యేక పాఠశాలను పది (10) శాటిలైట్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేసారు. ఆదివాసుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఆదివాసి గ్రామంలో స్థానిక ఆదివాసి మహిళను ఎంపిక చేసి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గానియమించారు. వారికి ఆరోగ్య సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకుఐటిడిఏ పరిదిలోని ముప్పై ఒకటి (31)ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు,నూట ఎనభై ఆరు (186) ఆరోగ్య ఉపకేంద్రాలు, ఆరు (6) సామాజిక ఆసుపత్రులను పర్యవేక్షణ కొరకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా మలేరియా నియంత్రణ ఆధికారిని కూడా నియమించారు. ఆదివాసుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చటానికై వ్యవసాయం, పాడి పరిశ్రమ,పట్టు పరిశ్రమ,పండ్లతోటల పెంప కం కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. చెన్నూర్‌, భీమారం,బెల్లంపల్లి,జంబుగామ్‌,బెజ్జూరు, ఆసిఫాబాద్‌, ఇచ్చోడ మరియు ఉట్నూరులో స్థానిక ఆదివాసి యువతీ యువకులను ప్రోత్సహించి, మామిడి మొక్కల నర్సరీల పెంపకంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ప్రతిశాఖ నుండి అధికారులను నియమించి వాటిని పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టారు. ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు అధికారి శాస్త్రిగారి ఆధ్వర్యంలో ఐటిడిఏ ప్రధాన కార్యాలయం,గిరిజన సహకార సంస్థ కార్యాలయాలతోపాటు అక్కడ పనిచేసే అధికా రులకు, ఇతర సిబ్బందికి కూడా నివాస గృహాల నిర్మాణము పూర్తి చేసారు. ఫారెస్టు, పోలీసు, ఇతర అన్నీ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉట్నూర్‌లో వెలిసాయి. కుమ్రం భీమ్‌కాంప్లెక్సు నిర్మాణం పూర్తి కావడంతో ఉట్నూర్‌ పట్టణం రూపు ంఖలు పూర్తిగా మారిపోయినవి. ఉట్నూరు నుండి ఇందన్‌పల్లి వరకు జన్నారంను కలుపుతూ రోడ్డు మార్గం ఏర్పాటు అయినది.ప్రాజెక్టు అధికారి శాస్త్రి గారు పరిపాలన సౌలభ్యం కొరకు తాలుకా వారిగా సెక్టోరల్‌ అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి సెక్టారుకు ఐటిడిఏపరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను నియమించారు. వారి ద్వారా ఆదివాసులు ఎదుర్కొంటున్న తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలను విశ్లేషిస్తూ ఐటిడిఏచేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ, వాటి వర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు.
ఆదివాసులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దటానికి గిరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కర ణలు చేపట్టారు. ఇరవై (20) మంది బడి ఈడు పిల్లలున్న ఆదివాసిగ్రామాలలో ప్రాథమిక పాఠ శాలలు ఏర్పాటు చేసారు.మాద్యమిక,ఉన్నత పాఠశాల విద్యకై నూట ముప్పై మూడు (133) ఆశ్రమ పాఠశాలలు,ఏడు (7) వసతి గృహాలు, బాలికల కొరకై ప్రత్యేకించి నలభై ఎనిమిది (48) ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసారు. నియ మించబడ్డారు. చాలా వెనుకబడిన కొలాం తెగ వారి కొరకు నియమించి ఆసిఫాబాదు కేంద్రం గా ప్రత్యేక పాఠశాలను పది (10)శాటిలైట్‌ సెంట ర్లను కూడా ఏర్పాటు చేసారు. ఆదివాసుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలలోభాగంగా ప్రతి ఆది వాసి గ్రామంలో స్థానికఆదివాసి మహిళను ఎంపిక చేసి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గా నియమించారు. వారికి ఆరోగ్య సూత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం, సీజనల్‌ వ్యాధుల నియం త్రణకు ఐటిడిఏ పరిదిలోని ముప్పై ఒకటి (31) ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు,నూట ఎనభై ఆరు (186) ఆరోగ్య ఉపకేంద్రాలు,ఆరు(6) సామాజిక ఆసుపత్రులను పర్యవేక్షణ కొరకు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జిల్లా మలేరియా నియంత్రణ ఆధికారిని కూడా నియమించారు. ఆదివాసుల ఆర్థిక పరిస్థితులను మెరు గుపర్చటానికై వ్యవసాయం, పాడి పరిశ్రమ,పట్టుపరిశ్రమ,పండ్లతోటల పెం పకం కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. చెన్నూ ర్‌,భీమారం,బెల్లంపల్లి,జంబుగామ్‌, బెజ్జూరు, ఆసిఫాబాద్‌,ఇచ్చోడ మరియు ఉట్నూరు లో స్థానిక ఆదివాసి యువతీ యువకులను ప్రోత్సహించి, మామిడి మొక్కల నర్సరీల పెంపకంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసారు.ప్రతిశాఖ నుండి అధికారులను నియమించి వాటిని పర్యవేక్షించే బాధ్యతలను చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సమగ్రగిరిజనాభివృద్ధి (ఐటిడిఏ) సంస్థ లు ఆదివాసుల అభివృద్ధి కొరకు చేపట్టిన పథకాలు కొంతమేర పురోగతి సాధించాయని చెప్పవచ్చును. అల్లంపల్లి ఎదురు కాల్పుల సంఘటన తర్వాత ఉట్నూరు ఐటిడిఏసంస్థ గిరిజనుల కొరకు గిరి జనులే ఉపాధ్యా యులుగా నెలకు వెయ్యి (1000/-) రూపాయల గౌరవవేతనంతో ఒక వెయ్యి (1000) మంది స్థానిక యువతీ యువకులను ఎంపిక చేసి గిరిజన విద్యావికాస కేంద్రాలను 1987సం.లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయ నైపుణ్యా లతో సంబంధము లేకుండా కనీస విద్యాఅర్హత పదవ తరగతి చదివితే చాలు, ఈ యువత విద్యతోపాటు ఆయా గ్రామాల అభి వృద్ధికి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంధాన కర్తలుగా పాటుపడ్తారనే సదాశయముతో ప్రభుత్వం వీరిని నియమిం చింది.గిరిజన యువతకు ఉపాధి కల్పిం చటం, వారిని నక్సలైట్ల కార్యక్రమాల నుండి దూరం చేసి ప్రభుత్వంపై నమ్మకము కల్పిం చటం ప్రభుత్వం యొక్క ప్రధాన ఆశయం. గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగముగా ముఖ్య మంత్రి చీ.ు.రామారావుగారు ప్రతిఇంటికి నాల్గు వేలు చొప్పున పదివేల (10, 000) సెమిపర్మనెంట్‌ ఇండ్లు మంజూరు చేసారు. మారుమూల కొండప్రాంత గిరిజనులకు ఇంటికి వెయ్యి (1000)చొప్పున బెంగళూరు గూన ఐటిడిఏ సెక్టొరల్‌ అధికారులద్వార పంపిణి చేసారు. ఈఇండ్ల నిర్మాణములో చాలాచోట్ల గిరిజ నులకు, ఫారెస్టు అధికారులకు మధ్య తగాదాలు, ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.
గిరిజనులు భూమి సాగు చేసుకోవ డానికి ఎడ్ల జతల పంపిణీ కార్యక్రమం, వ్యవసా య బావుల నిర్మాణకార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేపట్టారు. ఈ అబి óవృద్ధి కార్యక్రమా లన్ని ఒక దశాబ్దకాలము పాటు నిర్విరామంగా కొనసాగాయి.ఇందులో ఎక్కువశాతం ప్రక్క రాష్ట్ర మైన మహారాష్ట్రలో దీ.జ.లుగా ఉన్న లంబా డాలు వలసవచ్చి ఇక్కడి స్థానిక గిరిజ నులు పొందవలసిన ప్రభుత్వ పథకాలను వీరు పొందు తున్నారు.విద్యా, వైద్యము, ఉపాది నియ మకాలను వీరే దక్కించుకుంటున్నారు. స్థానిక ఆది వాసుల భూములను కూడా కాజేయటంతో వలస లంబా డీలకు,స్థానిక గోండులకు మధ్య తీవ్ర ఘర్ష ణలు మొదలై పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా మారాయి. వ్యాసకర్త : డాక్టర్‌. తొడసం చందూ,విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
సెల్‌ : 9440902142,

క్షీణిస్తున్న వలస కార్మికుల హక్కులు

అత్యధిక మంది వలస కార్మికులు వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణ రంగాలలో కనిపిస్తారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 10 శాతం వలస కార్మికుల శ్రమ నుండే వస్తోంది. అయితే,వలస కార్మికులు ఎంత మంది వున్నారు?వారు ఏ రంగంలో పని చేస్తున్నారు? ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నారు? తెలుసు కునే వ్యవస్థ లేదు. పర్మినెంట్‌ వర్కర్ల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు వున్నట్లు జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దుర్బలమైన, ప్రమాదకరమైన, ఎటువంటి భద్రత లేని పరిస్థితులు ఈ రంగంలో నెలకొన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 45 కోట్ల 60 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో 41 శాతం మంది తమంతట తాముగా వలస కార్మికులుగా మారలేదు. తమ ప్రాంతాలలో నెలకొన్న నిరుద్యోగం వలస వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టింది. వీరి జనాభా లెక్కలు సరిగా వుండవు. వాటి మీద ఆధార పడలేం. ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ 2013లో దేశంలో అంతర్గతంగా తిరిగే వలస కార్మికులు కోటిన్నర నుండి 10 కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఏరకంగా చూసినా భారతదేశంలో వలస కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్నట్లు తేలుతుంది. అందుకని వీరి పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా పేదరికం,దుర్బలత,అభద్రత, ఉద్యోగంలో పెట్టుకునే పద్ధతికి…ఈ కార్మి కుల సామాజిక స్థాయికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవాలి.ఈ కార ణంగా వీరు ప్రమాదకరమైన,అతి తక్కువ వేతనాలున్న పనులను చేయాల్సి వస్తోంది. కుల,లింగ వివక్షలను ఎదుర్కొం టున్నారు. కీలక రంగాలైన వ్యవసాయం,పరిశ్రమలు, నిర్మాణ రంగాల కార్యకలా పాలు వీరు లేనిదే నడవవు. కానీ వీరి కనీసభద్రత, న్యాయమైన వేతనాలను పట్టించుకునే దిక్కులేదు. వలస కార్మికులకు వర్తించే ప్రస్తుత చట్టాలు లేబర్‌ కోడ్లలో భాగం కాను న్నాయి. లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే లోపు ‘అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (పని మరియు సర్వీసు కండిషన్ల క్రమబద్ధీకరణ) చట్టం-1996, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం-2008 అమలులో వుంటాయి.కోవిడ్‌ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న విషాదకర పరిస్థితులను, ఆరోగ్య-సామాజిక భద్రతా వైఫల్యాలను గమనించిన అత్యున్నత న్యాయస్థానం తనంత తానుగా వీరితరపున కేసు తీసుకొని అనేక నిర్ధారణలకు వచ్చింది. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌కు ‘ఈ-శ్రమ’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 2021 డిసెంబర్‌ ఆఖరు లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు/వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ‘ఈ-శ్రమ’ రిజిస్ట్రేషన్‌కు కార్మికుల నుండి స్పందన చాలా పరిమితంగా వుంది. అందులో వారికి ఎలాంటి ప్రయెజనం కనపడకపోవడం అందుకు కారణం. పైగా ‘ఈ-శ్రమ’ నెట్‌ సౌకర్యంతో కూడుకున్నది కావడంతో కార్మికులు దీనిలో తమంత తాముగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. ఇప్పటికే నిర్మాణ (సెస్సు-సంక్షేమ పథకాలు), వ్యవసాయ రంగాలలో (రైతు బంధు పథకం) పరిమితమైన ఇతర పథకాలు ఉన్నాయి. 140 రకాల వృత్తులలో కార్మికులు పనిచేస్తున్నట్లుగా గుర్తించామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ తాము ఏ రకమైన సామాజిక భద్రతను ప్రవేశపెట్టేదీ ఇంత వరకు నిర్ణయించలేదు. ‘ఈ-శ్రమ’ లో రిజిస్ట్రేషన్‌కు ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ఉన్న వారు అర్హులు కారు. సంఘటిత రంగంలో పని చేసే లక్షలాది మంది కాంట్రాక్టు వర్కర్లు, చిన్న మధ్యతరహా సంస్థల్లో పని చేసే కార్మికులకు ఈ రెండూ ఇప్పటికే ఉంటాయి. కాబట్టి వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. వలస కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ‘వలస కార్మికుల చట్టం-1979’ రద్దును ప్రకటించింది. దీనికి బదులుగా వచ్చేటటువంటి కోడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల కష్టాలను పెంచుతుంది. 1979 చట్టం యజమానులకు, కాంట్రాక్టర్లకు, సబ్‌ కాంట్రాక్టర్లకు నిర్ద్ఱేశిత ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మికులను పెట్టుకోవాలంటే ముందుగా వీరు రిజిస్టరై ఉండాలి. ప్రతి వలస కార్మికుని సమాచారాన్ని, వారికి చెల్లించే వేతనాల వివరాల నమోదును స్పష్టీకరించింది. ఇవన్నీ ఇప్పుడు కోడ్‌లో లేవు. ఇటీవల అగ్ని ప్రమాదాలలో కార్మికులు చనిపోయినప్పుడు వారి గుర్తింపుకు వ్యక్తిగత రికార్డులు లేకపో వటం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. వారు పలానా వారు అని గుర్తించటానికి వంశీకుల డిఎన్‌ఎ లను పరీక్షించాల్సి వచ్చింది. యజమానులు తమ దగ్గర ఉన్న వలస కార్మికుల నియామకం,నమోదు,రవాణా, నివా సం,కనీస వేతనం, కాలనుగుణ వేతనాలు తదితర సమాచారాన్ని తప్పకుండా నిర్వహిం చాలని 1979 చట్టం నిర్దేశించింది.వేతనాల చెల్లింపు, ఆరోగ్య సౌకర్యాల కల్పన, పని ప్రదే శంలో రక్షణ కల్పించే డ్రస్సులు, మంచినీటి సౌకర్యం, క్యాంటిన్‌, మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు, ప్రయాణ ఖర్చులను గ్యారంటీ చెయ్యటానికి-అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా లైసెన్సింగ్‌ అధికారి తీసుకుంటారు. కాంట్రాక్టర్లుగానీ, ముఖ్య యజమాని గానీ వేతనాలు చెల్లించక పోతే ఈ నిధి నుండి చెల్లిస్తారు.ఈ హామీలను లేబర్‌ కోడ్‌లో ఉపసంహరించారు.1979 చట్టంలో ఇంకొక ముఖ్యమైన నిబంధన ప్రకారం వలస కార్మికులు పారిశ్రామిక వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని…తాము పనిచేసే ప్రాంతాలు, స్వస్థలాలు రెంటిలోనూ వినియో గించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా వలస కార్మికులకు వర్తించే ఇటువంటి 4చట్టా లను కూడా కోడ్‌ ఒక్క కలం పోటుతో స్వాహా చేసింది. వీధి వ్యాపారులతో సహా అందరికీ సామాజిక భద్రత కల్పించబడు తుందని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటిం చారు. ఇంత వరకు దానికి సంబంధించిన ఎటువంటి పథకం తయారు కాలేదు. కానీ వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ పరిమితి 5 నెలల నుండి 10నెలల వరకు పొడిగించారు. రిజిస్ట్రేషన్‌ వలన వలస కార్మికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పెద్ద సంఖ్యలో వలస కార్మికుల హక్కులు నిరాకరించ బడ్డాయి. అంతకు ముందున్న అనేక సౌకర్యా లను వలస కార్మికులు కోల్పోతారు.
కార్మికుల చట్టాలు ఇవీ…

  1. పనిగంటలు ఎనిమిదికి తగ్గింపు
  2. లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం
  3. వేతన చెల్లింపు చట్టం
  4. కనీస వేతనాల చట్టం
  5. ఉద్యోగుల వేతన సవరణ చట్టం
  6. భారత కర్మాగారాల చట్టం
  7. భారత కార్మిక సంఘ చట్టం
  8. కార్మికుల పరిహార చట్టం
  9. కార్మికుల రక్షణ చట్టం
  10. ప్రసూతి ప్రయోజనాల చట్టం
  11. కార్మిక రాజ్య బీమా(ఈఎస్‌ఐ) చట్టం
  12. మహిళలు,బాల కార్మికుల రక్షణ చట్టం
  13. బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్‌ చట్టం
  14. మహిళా కార్మికుల సంక్షేమ నిధి
  15. బొగ్గు గనుల్లో భూగర్భ పనుల్లో మహిళల నియామకంపై నిషేధం పునరుద్ధరణ
  16. వేతనంతో కూడిన సెలవులు
  17. సామాజిక భద్రత
    పనిగంటలు ఎందుకు తగ్గించారంటే…
    పనిగంటలను 12 నుంచి ఎనిమిదికి తగ్గించాలని 1942 నవంబరు 27న దిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన నాలుగో భారత కార్మిక సదస్సులో అంబేడ్కర్‌ తొలిసారిగా ప్రతిపాదించారు.1945 నవంబరు 27,28 తేదీల్లో జరిగిన ఏడో సదస్సు కర్మారాగాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సదస్సు లో కేంద్ర, ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలు, యాజ మాన్య సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక పనిగంటలతో కార్మికుడికి తగినంత వ్యక్తిగత సమయం లేకుండా చేయడం సరికాదని కార్మిక శాఖ తన మెమోరాండంలో చెప్పింది. వ్యక్తిగత ఎదుగుదలకు, శారీరక సామర్థ్యం పెంపునకు కార్మికులకు వ్యక్తిగత సమయం అవసరమని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కార్మికులు తీవ్రమైన పని ఒత్తిడికి లోనయ్యారని, వారికి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉందని, పనిగంటల తగ్గింపునకు ఇది సరైన సమయమని ఆ సందర్భంగా వివరించింది. తక్కువ పనిగం టలతో ఉపాధి పెరుగుతుందని కూడా చెప్పింది. పనిగంటల తగ్గింపునకు అను గుణంగా వేతనాల తగ్గింపునకు, డీఏ తగ్గింపు నకు(ధరలు పడిపోతే తప్ప) వీల్లేదని మెమో రాండం స్పష్టం చేసింది. పనిగంటలు, సామాజిక భద్రత ఇప్పుడెలా ఉన్నాయి? పనిగంటలు, కార్మికుల సంక్షేమం ఇప్పుడెలా ఉన్నాయనేదానిపై ‘ఫోరమ్‌ ఆఫ్‌ ఐటీ ప్రొఫెష నల్స్‌(ఫర్‌ఐటీ)’ అధ్యక్షుడు కిరణ్‌ చంద్రను సంప్రదించగా- నేటి తరం పరిశ్రమలతో ‘ఎని మిది గంటల పని, ఎనిమిది గంటల నిద్ర, ఎనిమిది గంటల సామాజిక జీవనం’ అనే విధానం గందరగోళంలో పడిపోయిందని విచారం వ్యక్తంచేశారు. ఇప్పడు ఉద్యోగుల్లో అత్యధికులకు పని ప్రదేశానికి వెళ్లి వచ్చేందుకే కనీసం నాలుగు గంటలు పడుతోందని, ఇలా పనిగంటలు 12కు పెరిగాయని చెప్పారు.
    ‘వెట్టిచాకిరీగా మారింది’
    గృహవసతి,ఆరోగ్యం, విద్య విషయాల్లో సామాజిక భద్రత కొరవడటంతో ఉద్యోగమనేది వెట్టిచాకిరీగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.ఐటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఆధ్వర్యంలో రెండేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలితాలిస్తోందని, పరిస్థితిలో మార్పు వస్తోందని కిరణ్‌ ఆశా భావం వ్యక్తంచేశారు. నేటి తరం కార్మిక వర్గం సంఘటితమవుతోందని, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తోందని తెలిపారు.
    కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు అంబేడ్కరే
    విధాన స్థాయిలోనే కాకుండా రాజకీయ స్థాయిలోనూ అంబేడ్కర్‌ కార్మిక సంక్షేమానికి కృషి చేశారు. కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయ నాయకుడు ఆయనే.1936 ఆగస్టులో అంబేడ్కర్‌ ‘ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(ఐఎల్‌పీ)’ని స్థాపించారు. తమది కార్మి కుల పార్టీ అని ఐఎల్‌పీ ప్రకటించుకొంది. కార్మిక వర్గాల సంక్షేమమే పరమావధిగా కలిగిన కార్మిక సంస్థగా ఐఎల్‌పీ 1937లో వెలువరించిన విధానపత్రంలో తనను తాను అభివర్ణించుకొంది. 1937లో జరిగిన ప్రావిన్సి యల్‌ ఎన్నికల్లో ఐఎల్‌పీ 17స్థానాల్లో పోటీచేసి,14 చోట్ల విజయం సాధించింది. పోటీచేసిన 13 రిజర్వుడు స్థానాల్లో 11చోట్ల, పోటీచేసిన నాలుగు జనరల్‌ సీట్లలో మూడు చోట్ల గెలిచింది.
    కోణార్క్‌ ఎక్స్‌ ప్రెస్‌
    ‘‘బతుకు తెరువు కోసం తమిళనాడు, కేరళ, కర్ణాటక,ఒడిశా,గుజరాత్‌,మహారాష్ట్ర వంటి చోట్లకు వెళ్తాం.నేనే కాదు,మా ఊళ్లో చాలా మందిమి వెళతాం.ఇంకే చేయాలి? ఇక్కడ చేపల పట్టే వసతుల్లేవు. ఇక్కడుంటే బతకలేం. మేం వలస వెళ్లాల్సిందే’’ అని శ్రీకాకుళం జిల్లా వాసి చెప్పారు. మత్స్యకారులే కాదు,చాలా కులాల వారు ఇలా వలస వెళ్తుంటారు. 2021-22 ప్రభుత్వ లెక్కల ప్రకారం వ్యవసాయం, పరిశ్రమలు, రెండిరటిలోనూ శ్రీకాకుళం, విజయనగరం బాగా వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు జిల్లాలనూ ఆర్థికంగా వెనుకబడ్డ జిల్లాలుగా నీతి ఆయోగ్‌ గుర్తిం చింది.కానీ,ఈ జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులు కేంద్ర రాష్ట్ర రాజకీయాల మధ్య ఇరుక్కుపోయాయి. బతుకుదెరువు కోసం మన దేశ, విదేశాలకు వెళ్లిపోతున్న శ్రీకాకుళం జిల్లా లోని లొడ్డపుట్టి గ్రామస్తులను కలవడానికి వెళ్లాము. తమ గ్రామస్తులు ప్రపంచంలోని ప్రతిదేశంలోనూ ఉన్నారని చెప్పారు. విదేశాలకు వలసవెళ్లి అక్కడ పనులు చేస్తున్న కొంత మందితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడిర చారు. ఇక్కడి వారు భవన నిర్మాణంలో నైపు ణ్యం కలిగిన వాళ్ళు. మన దేశంలో కన్నా ఇతరదేశాలలో తమ పనికి ఆదాయం మెరుగ్గా ఉండటంతో వీరంతా తమ కుటుంబానికి దూరంగా విదేశాలకు వెళ్లి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.33 ఏళ్ల శేఖర్‌ సింగ పూర్‌,దుబాయ్‌,అజర్‌ బైజాన్‌,రష్యా దేశాల్లో వెల్డర్‌గా పనిచేసి తిరిగొచ్చి సొంతూరిలో ఇల్లు కట్టుకున్నారు. (అమితవ్‌ గుహ)- వ్యాసకర్త : ఆలిండియా సిఐటియు సెక్రటరీ

గోండు రాజుల పాలనకు నిదర్శనాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనుల సంఖ్య ఎక్కువ. అందులో గోండు జాతీయుల సంఖ్య మరీ ఎక్కువ.. ఈ జిల్లాలో వివిధ రాజవంశీయుల పాలనా కొనసాగింది. అయితే గోండు జాతి ప్రజలు ఎవరి పాలనలోఉన్నా వారి సంప్ర దాయాలను, కట్టు బాట్లను, ఆచార వ్యవహారాలను కాపాడు కున్నారు. సిర్పూర్‌(టి) కేంద్రంగా ప్రారంభమైన వారి పాలన, వివిధ ప్రాంతాల్లో విస్తరించింది. క్రీ.శ.870 నుండి 1750 శతాబ్దము వరకు గోండ్వానా రాజ్యాన్ని గోండు రాజులు పరిపాలించారు.వీళ్ళు1350 శతా బ్దము నుండి 1600 శతాబ్దము వరకు స్వతంత్ర రాజులుగాను, ఆ తరు వాత1751శతాబ్దము వరకు సామంతరాజులుగాను,గోండ్వానా ప్రాంతాన్ని పరిపాలించారు. ఈభూభాగంలో దట్టమైన అడవి సంపద, విస్తారమైన ఖనిజ సంపద, సారవంతమైన నల్లరేగడి భూములు, అనేక రకాల చిరుధాన్యాలు , వాణిజ్య పంటలకు నిలయాలు.గోండ్వానా ప్రాం తము దక్షిణాన గోదావరి,పెన్‌గంగా వరకు ప్రాణహిత నదుల పరి వాహక ప్రాంతము నుండి ఉత్తరాన నర్మదా నది పరివా హక ప్రాంతము వరకు విస్తరించిన భూ భాగము. ఇది గోండు రాజులకు గుండెకాయ లాం టిది. క్రీ.శ.1895 కాలములోనే రాజ భీమ్‌బల్లాల్‌ సింగ్‌ గోండుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలకు పెద్దపీఠ వేసి వారిని సమీ కరించి ‘ సిర్‌పూర్‌’ కేంద్రముగా తన రాజ్య స్థాపన చేసాడు. ఆయన తర్వాత పరిపాలించిన గోండురాజులు హీరాసింగ్‌, కేసరిసింగ్‌, ధిన్కర్‌ షా,రామ్‌సింగ్‌,సూరజ్‌ భల్లాల్‌షా వీరిలో రాజ సూరజ్‌ భల్లాల్‌షా ‘‘ఢల్లీి’’ చక్రవర్తుల మెప్పు పొంది ‘‘శేర్‌షా’’ అనే బిరుదు పొందా డు.దక్షిణ మాండ్లాలోని గోండ్వానా ప్రాం తాన్ని కూడా బహుమతిగా పొందాడు. ఈయన కుమారుడు రాజా ఖాంద్యా భల్లాల్‌ షా సిర్‌పూర్‌ రాజధానిని ప్రస్తుత భల్లా ర్‌షాకు,ఆతర్వాత చాందాకు మార్చాడు (ప్రస్తుత చంద్రాపూర్‌).చాందా రాజధానిగా రాజా ఖాం ద్యా భల్లాల్‌షా10,000 గుఱ్ఱాలు,40,000 సైన్యం,వైరాగర్‌లో వజ్రాలగనులు కలిగి16 వ శతాబ్ద ప్రారంభము వరకు పరిపాలించాడు. కాకతీయ రాజుల పతనానంతరము గోండు రాజులు పెన్‌గంగా నది పరివాహక ప్రాంతానికి ఉత్తరాణ రాంటెక్‌,నాగపూర్‌ వరకు విస్తరిం చారు. క్రీ.శ.1412లో గోండ్వానా,బేతూల్‌ ప్రాం తంలోని ఖేరళా రాజ్యాన్ని పరిపాలించిన గోండు రాజు రాజనర్సింగు పై ఫిరోజ్‌షా బహ్మని దాడి చేసి మూడువందల (300) ఏనుగులను స్వాధీన పర్చుకొని తనకు సామంతరాజుగా చేసుకు న్నాడు.క్రీ.శ.1421లోఅహ్మద్‌షా బహ్మని గోం డ్వానాలో భాగమైన మహోర్‌ కోటపై ఐదువేల (5000) మంది సైనికులతో దాడిచేసి కలామ్‌ నగరాన్నిఅక్కడి ముత్యాలగనులను వశపర్చు కున్నాడు.బహ్మని సుల్తాన్‌ల కంటే ముందు ఉట్నూర్‌,బోథ్‌, కిన్వట్‌,ఆదిలాబాద్‌,రాజురా తాలుకాలు బీదర్‌లో భాగంగా గోండురాజులచే పరిపాలిం చబడినవి.నిర్మల్‌,లక్షెటిపేట,చెన్నూర్‌ తాలుకాలు మొదట కాకతీయరాజులు తర్వాతి బహ్మని సుల్తానులు ఆతర్వాత గోల్కొండ రాజులచే పరిపాలించబడినవి. సిర్‌పూర్‌, ఆసిఫాబాద్‌ తాలుకలు చాందా కేంద్రముగా గోండురాజుల పరిపాలనలో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నవి. క్రీ.శ.16051627 శతాబ్దములోనే మొగల్‌ చక్రవర్తి అయిన జహంగీర్‌ గోండురాజులకు వారి సరిహద్దు ప్రాంత గ్రామాలపై వారికి గల హక్కులు అధికారాలకు సంబంధించిన రాజపత్రాలు పేర సనద్‌లు జారీచేసారు. క్రీ.శ.1750లో జనగామ (ప్రస్తుత ఆసిఫాబాద్‌) గవర్నర్‌గా కొనసాగిన గోండురాజు రాజాచంద్ర అక్బర్‌షా కాలములోనే కొన్ని మోఖాసీ మరియు రాజుల కుటుంబాలు మధ్య భారత్‌ నుండి ఆదిలాబాద్‌ ప్రాంతానికి వలస వచ్చాయి. అటువంటి వారిలో ముఖ్యులు ఉట్నూర్‌ తాలుకా లక్కారం లోని ఆత్రం రాజావారి కుటుంబము, చాందా నుండి ఆసిఫాబాద్‌ తాలుకా తిర్యాణిలోని మడావి మోఖాసి వారి కుటుంబము, దేవ్‌గడ్‌ నుండి రొంపల్లిలోని పంద్ర మోఖాసీ వారి కుటుంబం నాగ్‌పూర్‌ నుండి వలస వచ్చారు. బోథ్‌ తాలుకా ఖరాత్వాడలోని దుర్వ మోఖాసీ కుటుంబము, మోవడ్‌లోమ ప్రాంతము నుండి కిన్వట్‌ తాలుకాలోని గేడాం మోఖాసీవారి కుటుంబము,మానిక్‌గడ్‌ నుండి లక్షెటిపేట్‌ తాలుకా వెంకట్రావ్‌పేటలోని ఆత్రం రాజావారి కుటుంబము,సీతాగొంది నుండి ఇంద్రవెల్లిలోని చహ్కటి రాజావారి కుటుంబము, అంకోలి నుండి అదేవిధంగా సిర్‌పూర్‌ తాలుకా తాండూర్‌కు బ్రహ్మణదేశ్‌ముఖ్‌లు మహోర్‌ ప్రాంతము నుండి వలస వచ్చి గోండుల వతన్లను స్వాదీనము చేసుకున్నారు. కాలక్రమేన గోండ్వానా ప్రాంతము 1751 నుండి 1773 వరకు మరాఠాలు ఆ తర్వాత నిజాం రాజుల ఆదీనములోనికి వచ్చాయి. గోండు రాజుల మధ్య ఐకమత్యము లేకపోవుట వారి నాయకత్వ లోపము వలన మొగలుల,మరాఠాల సైన్యము చేతిలో ఓడిపోయినారు. తర్వాత గోండు రాజులు వారి సామాజిక మరియు సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన సమస్యల పరిష్కా రానికి సరిపోయె మోఖాసీ గ్రామ పటేల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాని రాజకీయ వ్యవహారాలను అంతగా పట్టించు కోలేదు. దీనికితోడు 18వ శతాబ్ద చివరన మరియు 19వ శతాబ్ద ప్రారంభములో ఏర్పాటు చేసిన దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌ల వ్యవస్థ వలన గోండురాజులకు, మోఖాసీలకు తీరని అన్యా యం జరిగినది. ప్రభుత్వ వ్యవస్థలోకాని పరిపాలనలోకాని భాగం కాకుండా వారి సామాజిక మరియు మతపరమైన గ్రామ పెద్దలుగా గోండుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలకు మాత్రమే పరిమితమైనారు. అందుకుగాను వ్వవసాయము చేసే ప్రతి కుటుంబము నుండి సంవత్సరానికి చిన్న మొత్తంలో ధనం, ధాన్యం రూపంలో కొంత రుసుము వసూలు చేసేవారు.మొగలుల మరాఠాల కాలములో కొన్ని గ్రామాల సమూ హాన్ని ‘పరిగణ’గా గుర్తించి రెవెన్యూ వసూలు చేసే బాధ్యతను దేశ్‌ముఖ్‌లకు మరియు రెవెన్యూ పద్దులను నిర్వహించే బాధ్యతలను దేశ్‌పాండేకు అప్పగించారు. వీరికి అదనపు పారితోషికాలుగా ఆయా గ్రామాలపై పటేల్‌, సట్వారీలుగా వతన్‌ గిరి కూడా అప్పగించారు. అదే గోండురాజు లకు, మోఖాసీలకు ఎటువంటి ప్రాధాన్యము ఇవ్వకుండా వారు చెయ్యవలసిన రెవెన్యూ వసూలును మోఖాసీల ద్వారా చేపించేవారు. ఎందుకంటే దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండేలు గిరజనేతర వతన్‌దార్లు, జాగిర్‌దార్లు. తమ అధికారాన్ని అమలుపర్చుటకు మోఖాసీలను గ్రామ పట్టేళ్లను ఉపయోగించేవారు. చాందా రాజధానిగా పరిపాలించిన గోండు రాజుల కాలంలో మోఖా సీలు ప్రముఖ పాత్ర పోషించారు. వారి పరిది లోని గ్రామాలలో సామాజిక, రాజకీయ, సంస్కృతి సాంప్రదాయాలలో ఆచార వ్యవహా రాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలుగుకుండా చూసేవారు. శాంతిభద్రతలను సామరస్యంగా నిర్వహించేవారు. ఎవరైనా మోఖాసీ తీర్పు న్యాయ సమ్మతంగా లేదనుకుంటే నేరుగా రాజదర్బారుకు వెళ్ళి న్యాయము కోరే సౌకర్యము కూడా గోండు ప్రజలకు ఉండేది. రాజు తర్వాత రాజులాగ మోఖాసీలు కూడా ప్రజల ఆదరాభిమానాన్ని, గౌరవాన్ని పొందే వారు. గ్రామ స్థాయిలోని వ్యవస్థను గ్రామ పెద్దలైన పటేల్‌, మహజన్‌, దేవారి మరియు హవల్దార్‌ నిర్వహిస్తారు. కుటుంబ సమస్యలు ముఖ్యముగా భార్యాభర్తల మధ్య వచ్చే తగా దాలు, అన్నదమ్ముల మధ్య ఏర్పడే భూమి పంపకాల సమస్యలు గ్రామ పటేల్‌ ఆధ్వర్య ములో గ్రామస్తులంతా చర్చించి పరిష్కరిస్తారు. పున్నమి, అమావాస్యలప్పుడు వచ్చే గ్రామదేవ తల పండుగలు, పెండ్లిలకు సంబంధించిన తంతు జరపడానికి గ్రామదేవరి సహకారముతో పటేల్‌ నిర్వహిస్తాడు. గ్రామపెద్ద అయిన పటేల్‌ ఆదేశాలను గ్రామస్తులందరికి తెలియపర్చే బాద్యత హవల్దార్‌ది. గ్రామాల మధ్య తగా దాలు వచ్చినప్పుడు ఏ కుటుంబమైన కుల బహిష్కరణకు గురైనప్పుడు ఆ ప్రాంత మోఖాసీ ప్రవేశించి కులపెద్దల సమ్మతితో సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాడు.ప్రొఫెసర్‌ వాన్‌ప్యూరర్‌ హెమండార్ప్‌ ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త నిజాం ప్రభుత్వ వెనుక బడిన కులాల అభివృద్ధి సలహాదారు వ్రాసిన ‘ట్రైబల్‌ హైదరాబాద్‌’ ప్రకారము ఉట్నూర్‌ కేంద్రముగా పరిపాలించిన గోండురాజులు ఆత్రం కుటుంబానికి చెందిన రాజా ఇస్రాయి జంగుబాపు, రాజా లింగాయి హన్మంతరావు, రాజా జగపతిరావు 1862 వరకు మఖ్తా, వతన్‌, జాగీరు మరియు జమీందారు హక్కులు కూడా కల్గి ఉన్నారు. రాజు నివసించే కోటకు దగ్గరి పరిసర గ్రామాలను తానే స్వయంగా తన దర్బార్‌ సిబ్బందితో వెళ్ళి అక్కడి ప్రజల సాదక బాదకాలను పర్యవేక్షించేవారు. దూరముగా ఉన్న గ్రామాలను అక్కడి గ్రామ పెద్దలైన మోఖాసీ, గ్రామపటేల్‌ల ద్వార పర్యవేక్షించే వారు. అలాంటి గ్రామాల రాజులు, మోఖాసీలు ,పటేల్లను తాలుగాల వారిగా ఇక్కడ ఉదహ రించడమైనది. ఉట్నూరు తాలుకా : ఆత్రం కుంటుంబానికి చెందిన రాజా జగపత్‌రావు, రాజాదేవుషా లక్కారాం,రాజా భీమ్‌రావుపం గిడి సిర్‌పూర్‌,రాజాభగవంతరావు కంచ నపల్లి.కుమ్ర కుటుంబానికి చెందిన లాల్‌షా మోఖాసీ పరిదిలోని గ్రామాలుఆద్మీయాన్‌, శివనార,కొత్తపల్లి, కొలామా,అర్జుని, గాదిగూడ, పిప్రీ,చిత్తగూడ,కుమ్ర జంగు మోఖాసీ పరిది లోని గ్రామాలుమాన్కపూర్‌,నాగల్‌కుండ, యేంపల్లి,బాబెజరి,గణేశ్‌పూర్‌,సాంగ్వి, ఖైర్‌ దాట్వా,లోకారీ,నర్సాపూర్‌,గుంజాల,నార్నూర్‌, గుండాల. బోథ్‌ తాలుకా : దుపార్‌పేటలోని శిడాం కుటుంబానికి చెందిన మోఖాసీ పరిది, ఇచ్చోడ నుండి కడం నది పరివాహక ప్రాంత గ్రామాలు, ఖరత్వాడలోని దుర్వ యెశ్వంత రావు మోఖాసీ అక్కడి 20 గ్రామాలకు దేశ్‌ముఖ్‌ కూడ ఈయన పూర్వీకులు ఆసిఫాబాద్‌ తాలుకాలోని మోవడ్‌ లోమ ప్రాంతానికి చెందినవారు. ఆదిలాబాద్‌ తాలుకా : మర్సుకోల కుటుంబానికి చెందిన పీప్రి లచ్చు మోఖాసీ పరిది ఆదిలాబాద్‌ పట్టణంతోపాటు పెన్‌గంగా నది పరివాహక ప్రాంత గ్రామాలు.చహ్కటి కుటుంబానికి చెందిన రాజా హన్మంతరావు పరిదిలో అంకోలి,మావాల,యాపలగూడతో పాటు ఉట్నూరు తాలుకాలోని ఇంద్రవెళ్లి, తోషం,పీప్రి,దేవాపూర్‌,ముత్నూర్‌ మరియు గిన్నెర గ్రామాలు. కొరెంగ కుటుంబానికి చెందిన యెశ్వంతరావు మోఖాసీ పరిదిలో చాంద్‌పల్లి,సర్ధాపూర్‌,ఖడ్కి,చాప్రి,సోనార్‌, రుంకుమ్‌,పాఠన్‌,సోన్‌కసా,పత్తెగామ్‌, జనోలి, కరోని మరియు వడూర్‌. భాదిలోని జుంగనక కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలో సైద్‌ పూర్‌,బోరెగామ్‌,పాటగూడ,సాంగ్వి,గార్క గూడ మరియు జామ్ని. జైనథ్‌లోని కోవ కుటుంబానికి చెందిన పోయ్‌పటేల్‌ మోఖాసీ వీరి పూర్వికులు మానిక్‌గాడ్‌ నుండి ఆదిలా బాద్‌కు వచ్చారు. కారకాన్పలోని పెందూర్‌ కుటుంబానికి చెందిన రాజా హన్మంతరావు పరిదిలో రాజురాతాలు కాలోని యేషాపూర్‌ భరిషావతన్‌, కిన్వట్‌ తాలుకాలోని పిప్పల్‌గావ్‌కోట మరియు బోథ్‌ తాలుకాలోని రaరి ప్రాంత గ్రామాలు. లక్షెటిపేట తాలుకా : వెంకట్రావుపేటలోని ఆత్రం కుటుంబానికి చెందిన సీతాగొంది ఆత్రం రాజుగారి పరిదిలో లక్షెటిపేట నుండి రాలి గడ పూర్‌ బ్లాక్‌ వరకు గల గ్రామాలు. తాళ్లపేట లోని కోవ కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలో గోదావరినది సరిహద్దు నుండి ఉట్నూర్‌ వెళ్ళెదారిలోని ఉడుంపూర్‌ వరకు గల గ్రామాలు. ముర్రిమడ్గులోని కుమ్ర కుటుంబానికి చెందిన రాజుకు కవ్వాల్‌ పట్టీ మరియు జన్నారం ప్రాంత గ్రామాలు. యాపల్‌గూడలోని చక్రం కుటుంబానికి చెందిన మోఖాసీ పరిదిలోని గ్రామాలు కూడా లక్షెటిపేటలోనివే.
చెన్నూర్‌ తాలుగా : మర్సుకోల కుటుంబానికి చెందిన పటేల్‌కు యేంపల్లి పరిదిలోని గ్రామాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ తాలుగా : కొరెంగ కుటుంబానికి చెందిన మోఖాసీకి మోవడ్‌, కోట్నాక కుటుంబానికి చెందిన మోఖాసీకి సాంగ్వి మరియు ఇందాని. మడావి కుటుంబానికి చెందిన మోఖాసీకి తిర్యాణి, పంద్ర కుటుంబానికి చెందిన మోఖాసీకి రొంపల్లి మరియు రాయిశిడాం కుటుంబానికి చెందిన పోయ్‌ పటేల్‌కు మంగి ప్రాంత గ్రామాలు ఉండేవి.
కిన్వట్‌ తాలుకా : గేడాం కుటుంబానికి చెందిన దేశ్‌ముఖ్‌కి కిన్వట్‌, పెందూర్‌ కుటుంబానికి చెందిన మోఖాసీకి రaరి,భిల్‌గామ్‌, కనక మోఖాసీకి పల్సి, వెడ్మ మోఖాసీకి మిన్కి ప్రాంతాలు వీరి ఏలుబడిలో ఉండేవి. రాజురా తాలుకా : సలాం,కుమ్ర,కుర్సెంగ,కనక కుటుంబాలకు చెందిన మోఖాసీలక పరిదిలో ఇంజాపూర్‌,చినై,టెంబర్‌వాయి,శేవ్‌గామ్‌ గ్రామాలు వీరి పరిదిలో ఉండెను. సుర్పమ్‌, కోట్నాక మరియు పెందూర్‌ కుటుంబాలకు చెందిన మోఖాసీల పరిదిలో మాల్ని, బంబార, మర్కల్‌ మెట్ట గ్రామాలు వీరి ఆదీనములో ఉండెను. నిర్మల్‌ మరియు సిర్‌పూర్‌ తాలుకాల పరిదిలో మోఖాసీలు లేరు. మోఖాసీల, గ్రామపటేల్‌ల బాధ్యతలలో ప్రధానముగా వారి గ్రామాల పరిదిలోని ప్రజలకు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడటము, కొత్తవారెవరైన ఆ ప్రాంతానికి వస్తే వారి ఆస్తిపాస్తులను కాపాడటం, వీరు ముఖ్య మైన గ్రామపెద్దలుగా నాయకత్వము వహించి సామాజిక సాంస్కృతిక వ్యవహారాలను చక్క దిద్దటం. దసరా, దీపావళి`దండారీ లాంటి పండుగలను గొప్పగా నిర్వహిస్తూ ప్రజల గౌరవమర్యాదలు పొందటం. తమ పరిదిలో పరిష్కరించలేని క్లిష్టమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మోఖాసీ ద్వారా తమ పరిది లోని రాజా కుటుంబము వారి ద్వారా పరిష్క రించటం. ఈ విధముగా గోండురాజుల పరి పాలన అనేక ప్రాంతాలకు విస్తరించింది. పటిష్ట మైన పరిపాలన జరిగింది. -డాక్టర్‌. తొడసం చందూ విశ్రాంత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సెల్‌ : 9440902142,

బాలికను బతికిద్దాం

ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతున్నది. బాలికల సంఖ్య తగ్గిపోతున్నది. స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరం పెరుగుతున్నది. గత నెలలో విడు దలైన బాలికల జననాల రేటును పరిశీలిస్తే విస్మయానికి గురి చేస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఆడపిల్లల పుట్టుక తగ్గిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది.
గోడలకే పరిమితమైన మోదీ నినాదం
జాతీయ స్థాయిలో ఆడ పిల్లల రక్షణ, సాధికారతతో పాటు జనన రేటు పెంచేందుకు బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ ఎక్కడా సత్ఫలితాలు రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్భాటంగా పిలుపునిచ్చిన నినాదం కేవలం గోడలకే పరిమితమవుతున్నది. మారుతున్న సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల్లో ఆలోచన ధోరణి మారుతు న్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించడంలో విఫలమ వుతున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యత నిస్తున్నారు. ఆడ బిడ్డలు పుట్టిన ఇంటికి ప్రోత్సా హాలు అందిస్తూ వివక్షను రూపుమాపుతున్నారు. అంతే కాకుండా విద్యావకాశాలను భారీగా కల్పిం చారు. ఇందుకోసం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తు న్నారు. తద్వారా తల్లిదండ్రులకు భారం అన్నది లేకుండా చేస్తున్నారు.పెండ్లీడుకు వచ్చిన ఆడ పిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను (రూ.లక్షా 116) అందించి కొం డంత అండగా నిలుస్తున్నారు. మన రాష్ట్రంలో ఆడిపిల్లలకు రక్షణ అన్నది లభిస్తోంది.భారీ డాంబికాలు పలికే బీజేపీ మాత్రం నినాదాలతో ప్రజలను మాయమాట లతో పక్కదారి పట్టిస్తూ నిత్యం మోసంచేస్తోంది.
పురిట్లోనే వదిలించుకుంటున్నారు..
ఆడపిల్ల అని తెలిస్తే పురిట్లోనే వదిలించు కోవడం, బలవంతంగా అబార్షన్లు చేయించు కోవడమే ప్రధానంగా బాలికల జననాల రేటు పడిపోవడానికి కారణం.ఈ పరిస్థితి తండాలు, మారుమూల గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఆడ పిల్లల జనన రేటు పడిపోవడానికి మరో కారణం ఉందన్న అభిప్రాయం ఉంది. అబా ర్షన్లు చేసే దవాఖానలు నిజామాబాద్‌, కామా రెడ్డి జిల్లాలో ఇంకా కొనసాగుతున్నాయని, తరచూ ఆరోపణలు వస్తున్నా వైద్యారోగ్య శాఖ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆడ పిల్లల సంఖ్య మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది.స్కానింగ్‌ కేంద్రాల్లో పెద్ద ఎత్తున లింగ నిర్ధార ణ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధ నలు పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దవాఖానల్లో కాన్పు జరిగి బిడ్డ పుడితే ఆ వివరాలు పురపాలిక, గ్రామ పంచాయతీ అధికారులకు అందించాలన్న నిబం ధన కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా అమలుకావడం లేదు. దీంతో ఆడ శిశువుల విక్రయాలు, పుట్టిన తర్వాత హత మార్చడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడైనా ముళ్ల పొదలు,బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో ఆడ శిశువులను వదిలి వెళ్తే శిశు గృహకు తరలించి అధికారులు చేతులు దులుపు కొంటున్నారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారు. ఎందుకు వదిలి వెళ్లారు. వారికి ఏదవాఖాన సిబ్బంది సహకారం అందించారు?అనే విష యాలపై సమగ్ర విచారణ చేపట్టకపోవడం లోటుపాట్లకు ఊతం ఇస్తోంది.
ఎగరనిద్దాం..ఎదగనిద్దాం..
ప్రపంచ జనాభాలో మూడోవంతు బాలికలే. బాలికల రక్షణ,ఎదుగుదల,ఆరోగ్యం,విద్య, సదు పాయాలన్నింటిలో అత్యంత శ్రద్ధ అవసరం. ఆరోగ్యంగా,సమాజం పట్ల అవగాహన, సమ దృష్టి పరిస్థితులలో ఎదిగినపుడే వారు నేటి సమాజానికి అవసరమైన పౌరులుగా రూపొం దుతారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విషాద కర పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. సమాజ అభివృద్ధికి విద్య చాలా కీలకమైనదని విదితమే. కొన్ని అంశాలలో గతంకంటె కొంత పురోభివృద్ధి ఉన్నప్పటికీ నేటి సమాజంలో సరికొత్త సమస్యలు, బాలారిష్టాలు కొనసాగుతున్నాయి. ప్రపంచీకరణ సంస్కర ణలు, నూతన ఆర్థిక విధానాల అమలు వలన బాలికా విద్య సజావుగా జరిగే పరిస్థితులు లేవని చెప్పవచ్చు. గడిచిన రెండేళ్లలో కోవిడ్‌ ప్రభావం ఒకవైపుఉండగా ఈరెండేళ్లలో విద్యారంగ సంస్కరణల పేరుతో క్లష్టరైజేషన్‌ పేరుతో పాఠశాలల మూత కారణంగా బాలికలు విద్యకు దూరం కానున్నారు. భారత్‌వంటి దేశంలో బేటీ బచావో బేటీ పఢావో లక్ష్యం పూర్తిగా నీరు కారుతుంది. బాలికా శిశువులకు రక్షణ కల్పించి వారికి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పే ఈ పథకం నూతన విద్యా విధానం-2020 అమలుతో నిర్వీర్యం కానుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12.9 కోట్ల మంది బాలికలు విద్యకు దూరంగా ఉన్నారని యునిసెఫ్‌ ప్రకటించింది. బాలికల విద్యకు అడ్డంకులను తొలగించే బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మీ దేశాలలో అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాలను గురించి మీ చర్యలను, నిబద్ధతను విస్తరించకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని ఐరాస హెచ్చరించింది. బాలికలకు ఉచిత నిర్బంధ విద్య, విద్యాహక్కు చట్టాలు సంపూర్ణంగా అమలు చేయాలని అడిగే హక్కు బాలికలకు ఉంది. అందుకే చదువు కోసం వీరోచితంగా పోరాడిన మలాలా బాలికల ఆలోచన కావాలి. వివక్ష అనేక రూపాలలో కనిపిస్తుంది. 2030 నాటికి ప్రపంచంలో 15.8 శాతం బాలికలు పేదరికంలోకి చేరుకుంటారని ఐరాస దక్షిణాసియా ప్రాంతాల ప్రభుత్వాలకు ముందుగానే తెలియచేస్తున్నది. ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారు. కరోనా తరువాత పురుషుల కన్నా మహిళల ఉపాధి 19 శాతం అధికంగా ప్రమాదంలో పడిరదని యు.ఎన్‌ విమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాంబో అన్నారు. ఇదే బాలికా విద్యకు విఘాతం కానుంది. నీరు, పరిశుభ్రతలలో కూడా లింగ వివక్షత కొనసాగుతున్నది. సంక్షోభాలు, సంఘర్షణలు బాలికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 33,000 మంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రణాళికలు రూపొం దించుకోవాలని ఐరాస ఆయా దేశాల పాలకులను హెచ్చరిస్తున్నది. భారతదేశంలో పద్దెనిమిదేళ్లు రాకముందే వివాహం అవుతున్న ఆడపిల్లల శాతం జాతీయ స్థాయిలో 1.9 శాతంగా వుందని (కేరళలో బాల్య వివాహాలేవీ జరగలేదని)తాజాగా కేంద్ర హోంశాఖ సర్వేలో వెల్లడైంది. బాల్య వివాహ చట్టాలయితే ఉన్నా యి కాని వాటి అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రక్షణ కల్పించాల్సిన పాలకులు నేరాలను అదుపు చేయలేక పోతు న్నారు.4.6కోట్ల మంది బాలికలు, మహిళలు మనదేశం నుండి అదృశ్యం అయ్యారని క్రైమ్‌ రికార్స్డు బ్యూరో స్పష్టం చేసింది.41లక్షలమంది బాలికలు 19రకాల హింసలకు బలైనారని యుఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక తెలియచేస్తున్నది. శరీర భాగాలపై వ్యాఖ్యల నుండి కన్యత్వ పరీక్షల వరకు అన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి. ఈ మధ్యకాలంలో హత్రాస్‌ ఘటన,హిజాబ్‌ ఘటన,బెనారస్‌ యూనివర్సిటి ఘటనలు,ఇరాన్‌లో హిజాబ్‌పై జరుగుతున్న పోరాటాలు, ప్రశ్నిస్తే అణచి వేయడం వంటివి అమ్మాయిల ఆత్మగౌర వాన్ని,జీవితాలను ఏవిధంగా ఛిద్రం చేస్తున్నాయో తెలుపు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదిమందిలో ఒకరు లేదా ఇద్దరు బాలకార్మికులు ప్రమాదకర పనులలో పనిచేస్తున్నారు. ఎక్కువ వేతనం లేని బాల కార్మికులుగా చేస్తున్నారు.5నుండి 14 సంవ త్సరాల మధ్యఉన్న బాలికలు ఎక్కువ సమయం శ్రమిస్తున్నారు. భారత దేశంలో నేటి పాలకుల పుణ్యమా అని బాల కార్మికులలో బాలికల సంఖ్య పెరగనుంది. నూతన విద్యా విధానంలో వృత్తి విద్యా కోర్సులను చిన్న తరగతులలో ప్రవేశ పెట్టడంతో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లేకుండా పోతున్నది. బాలికలను వెట్టిచాకిరీ నుండి విముక్తి చేయాలనే చట్టాలను విస్మరిస్తున్నాయి. మీకు చదువు అవసరం లేదు. పనిలోకి వెళ్లండి. డబ్బులు సంపాదించండి…అని చెప్పడమంటే ఆర్థిక సంస్కరణల అమలు ఎంత ప్రమాద కరంగా ఉందో అర్ధం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అధిక దేశాలలో విద్యకు, వైద్యానికి, సంక్షేమానికి నిధులు పూర్తిగా తగ్గించడం. లాభాపేక్ష, వ్యాపారాలకు మాత్రమే ప్రోత్స హించడం. ప్రపంచీకరణ, సరళీకరణ విధా నాలు బాలికల సమస్యలకు, సంక్షోభాలకు కారణాలుగా ఉన్నాయి. అటువంటి విధానా లకు వ్యతిరేకంగా బాలికలు,మహిళలను చైతన్యవంతులను చేయాలి. బాలికలు, మహిళలవ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. చిన్నారుల సంక్షేమంలో మనదేశంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది.చిన్నారుల మనుగడ, పోషకాహారం,తాగునీరు,శానిటేషన్‌, విద్య,ఆరోగ్యం వంటి అంశాలలో 24 సూచికలతో నిర్వహించిన సర్వేలో కేరళ నెంబర్‌1గా ఉంది. ఈస్ఫూర్తితో ఇతర రాష్ట్రాలు, దేశాలు పని చెయ్యవచ్చు.కానీ అవి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయి.చివరికి ఆడపిల్లలు వాడుకునే శానిటరీ నాప్కిన్లను కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక పోతున్నాయి. నాప్కిన్లపై జిఎస్టీలను వేయడంతో వారికి అవి మరింత భారం అవుతున్నాయి. సాధికారిత పొందిన బాలికలు సాధికారిత పొందిన మహిళలుగా ఎదుగుతారు. అందుకే వారిహక్కులు,విద్య,ఆరోగ్యం యొక్క సమా నత్వాన్ని డిమాండ్‌ చేయడానికి అవ సరమైన వేదికలను నిర్మించాలి. వారిని బల పరుస్తూ సమానత్వ సాధనకు ఉద్యమిద్దాం-వ్యాసకర్త : యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు- (కె.విజయగౌరి)

విజయం కోసం ప్రణాళిక అవసరం

జీవితంలో విజయం కోసం దైర్యం కోల్పోకుండా పోరాడాల్సిందే..జీవితంలో భారీ విజయం సాధించడానికి ఈఒక్క చిన్న మాట కూడా పెద్ద సాయం అవుతుంది. ధైర్యం ఉంటే ప్రతి కష్టమూ తేలిక వుతుంది. జీవితంలో గొప్ప విజయాల చరిత్రను లిఖించి న వారందరిలో ధైర్యం పెద్ద పాత్ర పోషించింది. జీవితం అనేది ఒక పోరాటం.. జీవిం చడం కోసం.. విజయం సాధించడం కోసం ప్రతి క్షణం పోరాడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడు వేయకుండా పోరాడాలి.. జీవించడా నికి ప్రతి క్షణం ధైర్యంగా ముందడుగు వేయాలి. కర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు..కొన్నిసార్లు ప్రయాణం తేలికగా సాగుతుంది. కొన్నిసార్లు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచి సమయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కోలుకోవడానికి,మీ ధైర్యం లేదా సాహసం ఉపయోగ పడుతుంది.ధైర్యం అనేది ఒక పదం, అది విన్నప్పుడు, వ్యక్తిలో ఉత్సాహం మొదలవు తుంది.ఒక వ్యక్తి జీవితంలో భారీ విజయం సాధించడానికి ఈ ఒక్క చిన్న మాట కూడా పెద్ద సాయం అవుతుంది. ధైర్యం ఉంటే ప్రతి కష్ట మూ తేలికవు తుంది. జీవితంలో గొప్ప విజయాల చరిత్రను లిఖించిన వారందరిలో ధైర్యం పెద్ద పాత్ర పోషించింది. ఒక వ్యక్తి ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోని ధైర్యానికి సంబంధించిన 5 అమూల్యమైన పాఠాల గురించి తెలుసుకుందాం..!(డాక్టర్‌.దేవులపల్లి పద్మజ)
జీవితంలో ఏవ్యక్తికైనా ధైర్యం అంటే ముందుకు వెళ్లడానికి ఒక శక్తి..ఎవరైనా సరే శక్తి లేకపోయినా పరిస్థితులను చక్క బెట్టుకుంటూ ముందుకు సాగడాన్నే ధైర్యం అంటారు. జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి పరిస్థి తుల్లో నైనా ఎవరు చెప్పిన మాటలను వినడానికి ఎంత ధైర్యం అవసరమో..వాటిని అంగీకరించ డానికి అంతే ధైర్యంకావాలి.జీవితంలో అన్నీ కోల్పో యిన తర్వాత కూడా..మీరు ఇంకా ఏదైనా చేయ గల శక్తినిచ్చేది దైర్యంకలిగి ఉన్నవారికి మాత్రమే.. ధైర్యం కలిగి ఉన్నవారు..తాము జీవితం లో కోల్పో యింది ఏమీ లేదని..ముందు తాము తప్పని సరిగా ఏదోసాధిస్తామని ఖచ్చితంగా ఊహించుకుంటూ ముందుకు సాగుతారు. సగానికి పైగా ప్రజలు జీవితంలో ఏదొక సందర్భంలో విఫలమవు తారు. ఎందుకంటే సరైన సమయంలో ధైర్యాన్ని కోల్పో తారు. భయంతో వెనక్కి అడుగు వేస్తారు.మీరు ఏదైనా చేయగలరని మీకు నమ్మకంకలిగి ఉంటే.. ఆక్షణంలో మీరు సగం విజయాన్ని సొంతం చేసు కున్నట్లే..
లక్ష్యసాధన కోసం సరైన ప్రణాళిక అవసరం
ఇంతకు ముందు మనము చాలా సార్లు చెప్పుకున్న విషయమే అయినా సందర్భం మరియు ప్రస్తుతం ట్రెండ్‌ ని బట్టి చెప్పాల్సి వస్తోంది. మనిషి అన్నాక అదో ఒక లక్ష్యం తోనే బ్రతుకు సాగిస్తాడు. మన ఆకాంక్ష లేదా ద్యేయమే లక్ష్యం అని అనవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. మరి కొందరు బహుళ లక్ష్యాలను కలిగి ఉంటారు. కోరుకున్న లేదా ఎంచుకున్న ఫలితాన్ని చేరుకోవడానికి, సొం తం చేసుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యం లోని చివరి స్థానానికి చేరుకోవ డానికి విజయం పొందటానికి ప్రతి ఒక్కరు ప్రయ త్నిస్తారు. అయితే అందరూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. వ్యక్తి నిర్ణీత సమయానికి తమ లక్ష్యాన్ని చేదించనంత మాత్రాన వారికి దృఢ నిశ్చ యం లేదని వారిలో పట్టుదల తక్కువ అంచనా వేయకూడదు. అలాగే ఆ వ్యక్తి కూడా తన సామర్ధ్యం గురించి తక్కువగా ఆలోచించకూడదు.. ఈ సారి అందలేదు అంటే అందుకు గల కారణాలను అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి విష యంలో చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తించు కోవాలి. గజనీ మహమ్మద్‌ 18సార్లు దండెత్తి చివరికి విజయాన్ని సాధించాడు. ఇక్కడ ఆ 17 సార్లలో ఒకసారైనా తనవల్ల ఇకకాదు అని విసుగు చెంది నిరాశ పడిఉంటే విజయం దక్కేదా…ఎన్ని సార్లు ఓడిపోయినా చివరికి దక్కే విజయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..నలుగురిలో మిమ్మల్ని గొప్పగా నిలబడుతుంది. అందుకే ధ్యేయం యొక్క ఉద్దేశం ఎపుడు స్థిరంగా ఉండాలి చివరి వరకు ప్రయత్నించాలి. ప్రయాణించే మార్గంలో అనుకూల తలతో పాటుగా ప్రతి చర్యలు కూడా ఎదురవు తాయి. కానీ అన్నిటినీ అధిగమించాలి. నిబద్దతతో ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది. అంతే కానీ ఏ ప్రణాళిక అందుకు తగిన ప్రయత్నం లేకపోతే ఎందులోనూ విజయాన్ని సాధించలేరు ప్రతి వ్యక్తి తాను తలపెట్టే పని విజయ వంతం కావాలనే సంకల్పం చేసుకుని మొదలు పెడతాడు. కానీ విజయం అనేది అంగట్లో లభించే వస్తువు కాదు.విజయం వెనుక,శ్రమ,కృషి, పట్టు దల,ఓర్పు అంతిమంగా అదృష్టం కలిస్తే..విజయం సాధించగలం.ఎంతో శ్రమకోర్చి మానసిక దృఢ త్వంతో ప్రతీ అడుగు పధ్ధతి ప్రకారం వేస్తే విజయం తనంతట తానుగా వర్తిస్తుంది. అపజయాలకి భయ పడకుండా,కృంగిపోకుండా విజయసాధన మార్గా లు అన్వేషించాలి.ఈ గమనంలో అపజయాలు కలిగిన నిరుత్సాహపడకుండా మరల మరల ప్రయ త్నించాలి…ముందు మనం చేసే పనిపై అవ గాహనఉండాలి.లక్ష్యం సరైనదై ఉండాలి. ప్రణాళిక ప్రకారం సాగుతూ ఎదురయ్యే సవాళ్ళను కూడా అంచనా వేసుకోవాలి.సంకల్పబలం పెంచు కోవాలి.విజయం ఎపుడూ ఎవరికీ శాశ్వతం కాదు, తమవద్దే నిక్షిప్తమైపోవడానికి స్థిరమైనదీ కాదు.. మహాభారత యుద్ధంలో అర్జునుడు ధనుర్భాలను జారవిడచి వెనుకంజ వేసినపుడు శ్రీ కృష్ణుడు గీతా బోధన చేసి ధైర్యం కలిగించి యుధ్ధంలో విజయం సంప్రాప్తించేలా చేసిన విషయం మనం తెలుసు కున్నాం. ఆ సమయంలో మార్గనిర్దేశం చేసి అర్జును నకు విజయమార్గం చూపాడు.భర్తృహరి సుభాషితం ఈ విషయంలో మనకి మస్తిష్కంలో మెదలాలి.
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్న విహితా విరమన్తి మధ్యాః
విఘ్నైర్ముహుర్ముహు రపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధ ముత్తమగుణా న పరిత్యజన్తి.
అనుమతులు విఘ్నములు సంభవించిన కార్యము నారంభింపరు.మధ్యములు ఆరంభించి విఘ్నములు వచ్చినపుడు విడిచివేయుదురు.ధీరులెన్ని విఘ్న ములు ఎదురైనప్పటికి విజయము చేపట్టు వరకూ కార్యమును విడువదు. మనము కూడా ఇదే విధ ముగా ఉత్తమ గుణసంపన్నులను అనుసరిం చవ లెను.ఇదే విధంగా అమృతభాండమునకు క్షీరసాగర మధనము జరుగు సందర్భంలో దేవతలు ముం దుగా వచ్చిన అశ్వము,గజము వంటి వాటికి విసుగు చెందలేదు. తరువాత వచ్చిన రత్న లాభము లకు తృప్తి చెంది విరమించలేదు.తుదకు అమృత భాండము లభించువరకూ వస్తున్న చంద్రుడు, రంభ,ఊర్వశి,మేనక,కామధేనువు,కల్పవృక్షం, పారిజాత వృక్షం,కౌస్తుభమణి, శంఖుచక్రాలు, మొద లైన అపురూపమైన వాటితో సంతృప్తి పడి లక్ష్యం మార్చుకోలేదు.. అమృతం లభించువరకూ కృషిచేసి విజయం చేపట్టారు. న్యాయమార్గం వీడక, సత్బుధ్ధితో ఎవరైతే గమనం సాగిస్తారో వారికి విజయము తద్యము.
ఇదేవిధంగా మరొక ఉదాహరణగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని తిరిగి పొంద టానికి పడిన కష్టాలు, హనుమంతుడు సీతమ్మ ఆచూకీ కనుగొనుటకు చేసిన కృషి, శ్రమ, వానరులు వారధి బంధన చేయుటలో పడిన భక్తి పూర్వక సేవ,వారి పరిశ్రమ అంతిమంగా విజయానికి దగ్గర చేసింది.ధర్మమార్గమును వీడక పాండవులు వన వాస కాలములోనూ, అ్ఞతవాస కాలంలోను పడిన కష్టం వెనుక వారికి విజయలక్ష్మి ధరించిన విషయం మనం గమనించవచ్చు. ధర్మ పోరాటానికి జయభేరి మ్రోగుతుంది.విద్యార్థులు చదువు విషయంలో వారు నిర్దేశించుకున్న లక్ష్యంకొరకు నిరంతరం ప్రయత్నం చేస్తూ గమ్యం చేరుకోవాలి. ఫలితాలపై ఆకస్మిక నిర్ణయాలు జీవితానికి భంగం కాకూడదు.. సహనముతో సమన్వయం తో జీవితాన్ని చక్కదిద్దు కోవాలి. మనకు స్వాతంత్య్రం అందించిన మహాత్ము డు పడిన,శ్రమ,ఉద్యమస్ఫూర్తి,మరువరానిది. క్రియాశీల కార్యక్రమాలతో,భారతీయులందరినీ ఐక్య మత్యంతో కలిపి ఒక త్రాటిపైకి తెచ్చి,కర్మ సిద్ధాం తాన్ని,ఆచరించడం వలన విజయం సాధించింది. నీతి నియమాలు ఆచరిస్తున్నంత కాలము, ధర్మ మార్గమును,వీడనంతవరకూ అపజయాలకు వెరపు చెందవలసిన పనిలేదు.నీతిపై ఆధారపడినపుడే జీవితంలో అభివృద్ధి గోచరిస్తుంది.నరికివేసిన వృక్షం మరల చిగురిస్తుంది. క్షీణతనొందిన చంద్రు డు తిరిగి ఎదిగి ఎదిగి సంపూర్ణ వెన్నెలను మనకు వెదజల్లుతున్నాడు. ధృడత కలిగిన వ్యక్తికి మేరు పర్వతం చిన్న రాతివలె,సింహము జింకవలె, అగ్ని జలమువలె, విషము అమృతం వలె గోచరి స్తుంది. గురితప్పని ఏకాగ్రత లక్ష్యాన్ని చేధిస్తుంది. కష్టమైన పనికూడా ఇష్టంతో చేస్తే నమ్మకం పెరుగుతుంది. అపనమ్మకం,అయిష్టతతో పనులు ప్రారంభించే కంటే చేయకపోవడం ఉత్తమం. విజ్ఞానం, వివేకం తో ధర్మ వృక్షాన్ని రెండు చేతులారా కాపాడినట్లైతే విజయం వరిస్తుంది అని అంటాడు శ్రీకృష్ణుడు అర్జనునితో.అది మనకు,మన భావితరాలకు ఆచరించమనే హెచ్చరిక.మనం ధైర్యంతో,విశ్వా సంతో,నియమ,నిబద్ధతతో ధర్మసమ్మతంగా,జీవనం సాగించి,చైతన్య వంతమైన విజయాలు చేసుకుం దాం.‘సాధనమున పనులు సమకూరు ధరలోన’అను వేమన పలుకులు స్మరిద్దాం.ప్రపంచవ్యాప్తంగా స్వాస్థ్యసంక్షోభం నుంచి త్వరలో..కోరుకుని సుసం పన్నమైన విశ్వశాంతిని పొందగలము. నిరంతర పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు విజయం లభించి, త్వరలో నేటి సమాజానికి అవసరమైన ఔషధం ఆవిష్కరింపబడాలని కోరుకుందాము. అదే నిస్వార్థమైన సేవ. జయిభవ..విజయీభవ.- , వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి,విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం
ఫోను. 9849692414

పేదల జీవితాలు ఇంతేనా..?

ఆత్మహత్యలన్నీ హత్యలే, కాకపోతే.. వీటిలో నిందితులెవరో అప్పటికప్పుడు తెలియదు, వెతికి పట్టడం అంత తేలిక కాదు. స్థూలంగా సమాజమే ముద్దాయి’ అంటాడో సామాజిక వేత్త! ఇదెంత పచ్చి నిజం! వ్యక్తులు, దంపతులు, కుటుంబాలు.. ఇలా లెక్కలేనంత మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరికీ పట్టడం లేదు. ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. చచ్చేంత దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దీనుల్ని ఆదుకునే వ్యవస్థలే లేవు. ఉన్న వ్యవస్థల్ని కూడా పాలకులు విధ్వంసం చేస్తుంటే దాదాపు అన్ని వయసుల వారూ దిక్కులేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకీ దురవస్థ? అని ఎవరూ ప్రశ్నించడం లేదు. దీని వెనుక బలమైన కారణాలేమై ఉంటాయి? ఓ శాస్త్రీయ పరిశీలన లేదు. లోతైన అధ్యయనమూ లేదు. సర్కార్లకు సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి లేదు.
డెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత…మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా కూడా…వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతిక్ఱేళ్లలో (1995-2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేళ్లలో మోడీ పాలన లోనే ఒక లక్ష మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుం బాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధా రణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30 ఏళ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమి లేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎప ˜్‌హెచ్‌ఎస్‌ వివ రాల ప్రకారం దేశంలోని భూమిలో 20 శాతం భూమి 75 ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100 రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్‌ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎం ఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరు ద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏళ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్‌ ముందు స్థితి, ఆతర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్‌ భూస్వాములను పెట్టుబడిదారీ భూస్వాములుగా మార్చి ధనిక రైతాంగాన్ని సృష్టించడం. ఇది రైతాంగంలో వర్గ విభజనను తీవ్రం చేసింది. 1950లో బి.సి.మహల్‌ నోబిస్‌ అంచనా ప్రకారం దేశంలో పున:పంపిణీకి 6 కోట్ల 30 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండాలి. కానీ, దీనిలో ఒక్క గుంట భూమి కూడా పేద రైతులకు పంచింది లేదు. దేశంలోని భూకేంద్రీకరణలో ఏ మార్పు లేకపోగా ఇటీవల కాలంలో మరింత పెరిగింది.
మొదటి దశలో వ్యవసాయ విస్తరణకు, విద్యుత్‌కు, శాస్త్ర సాంకేతిక రంగాలకు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టుబడులు ఇతోధికంగా ఉండేవి. కనీస మద్దతు ధర ద్వారా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం సహకరించేది. కొన్ని పంటలను సేకరించడం ద్వారా కూడా ఈ సహకారం ఉండేది. ప్రజా పంపిణీ వ్యవస్థకు కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉండేవి. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత రైతాంగానికి విస్తారంగా పరపతి సౌకర్యం కల్పించబడిరది. దేశీయ మార్కెట్‌ రక్షణకై వ్యవసాయ పనిముట్ల దిగుమతిపై అనేక ఆంక్షలు పెట్టబడ్డాయి. శాస్త్ర సాంకేతిక రంగా ల్లో అధిక పెట్టుబడి వల్ల మంచి దిగుబడి నిచ్చే వంగడాలు సృష్టించబడ్డాయి. ఇదంతా హరిత విప్లవానికి దారితీసింది. ఉత్పత్తి, ఉత్పాదకత మెరుగై ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించింది. అయితే ఇది రెండు రకాల అసమానతలకు దారి తీసింది. మొదటిది ప్రాంతాల మధ్య, రెండోది రైతాం గంలో అసమానత. అయినప్పటికీ 1990 వరకు వ్యవసాయ రంగంలో కొంత పురోభివృద్ధి సాధ్యమైంది. 1991లో కాంగ్రెస్‌ ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఉధృ తంగా కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాద వత్తిడితో ఆ విధానాలు అభివృద్ధి నిరోధకంగా మారాయి. ఈ దశలో ఆర్థిక లావాదేవీల నిర్వహణలో రాజ్యం తన పాత్ర ఉపసం హరించుకుంది. పూర్తి స్థాయిలో పెట్టుబడిదార్ల వత్తిడికి తలొగ్గింది. 1995లో హిస్సార్‌లో జరిగిన ఎఐకెఎస్‌ జాతీయ మహాసభ ఈ విధా నాలను విశ్లేషించి కింది హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఈ విధానాలు రైతాంగంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పేద, మధ్యతరగతి రైతాంగాన్ని మరింత నిరుపేదలుగా మారుస్తాయి. పట్టణ, గ్రామీణ నిరుద్యోగం ఎన్నడూ చూడనంతగా పెరిగి పోతున్నది. ఇతర ఎన్నో రైతు సంఘాలు ఈ వ్యవసాయ విధానాలను పొగడ్తలతో ముంచెత్తుంతుండగా ఎఐకెఎస్‌ నయా ఉదార వాద విధానాలను విశ్లేషించగలగడం ప్రత్యేకత. ఎఐకెఎస్‌ హిస్సార్‌ మహాసభ హెచ్చరికలు 30 ఏళ్ల తర్వాత ఏ విధంగా నిజమైనాయో ఇప్పుడు చూస్తున్నాం.
నూతన ఆర్థిక విధానాలు
భూ సంస్కరణలను తిరగదోడటం, భూ పరి మితి చట్టాలను నీరుగార్చటంతో పెద్ద పెద్ద భూఖండాలను భారతదేశపు బడా వ్యాపార వేత్తలకు, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అమ్మటానికి లేక లీజుకివ్వటానికి అవకాశమేర్ప డిరది. దున్నేవాడికే భూమి అనే నినాదం స్థానంలో కార్పొరేట్లకే భూమి అనే నినాదం వచ్చింది. విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్తు, ఇంకా ఇతర వ్యవసాయిక అవసరాల మీద ప్రభుత్వ సబ్సిడీలకు కోత పెట్టటంతో వ్యవసాయ సాధనాల మీద ఖర్చు విపరీతంగా పెరిగింది. ఆ ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. వ్యవసాయ దిగుమతుల పరిమితి మీదవున్న ఆంక్షలు తొలగించటం, దిగుమతులపై పన్నులు తగ్గించటంతో సబ్సిడీ కలిగిన విదేశీ వ్యవసాయ సరుకులు వరదలాగా దేశంలోకి వచ్చిపడ్డాయి. దానితో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏఎస్‌) వల్ల కలిగిన దుష్ప్రభావాలు సైతం ఇటువంటివే. వ్యవసాయం, ఇరిగేషన్‌, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలమీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడులలో భారీగా కోత పెట్టారు. ఆయువుపట్టు లాంటి విద్యుత్తు, నీటి పారుదల సౌకర్యాల ప్రయివేటీకరణతో ఈ రెండిరటికి పెట్టాల్సిన ఖర్చు బాగా పెరిగింది. అంతేగాక, నీటి మీద గుత్తాధిపత్యాలు ఏర్పడ్డాయి సంస్థా గత రుణాలలో అతి పెద్ద భాగం కార్పొరేట్లకు మళ్ళించే విధాన నిర్ణయం మూలంగా రైతులకు, వ్యవసాయ కార్మికులకు అందుబాటులో ఉన్న రుణాలలో భారీ కోత పడ్డది. దానితో రైతాం గం అధిక వడ్డీలు వసూలు చేసే ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఆహార సబ్సిడీలలో విపరీతంగా కోత విధించి, గతంలో ఉన్న సార్వత్రిక ప్రజా పంపిణీకి బదులు లక్షిత ప్రజాపంపిణీ విధానాన్ని ప్రారంభించటంతో పేద ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడ్డది. కనీస మద్దతు ధర యంత్రాంగంలో,పంటల సేకరణ వ్యవస్థలలో దేశీయ మార్కెట్టులో జోక్యం చేసు కునే చర్యలనుండి ప్రభుత్వం తప్పుకున్నది. ఎగుమతి ఆధారిత వ్యవసాయం వైపునకు, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు వైపుకు సాగును మళ్ళించటానికి ఒక విధానప రమైన ఒత్తిడి జరుగుతున్నది. సాగు నిర్వహణ లో యాంత్రీకరణ పెరుగుతున్నది. దీనితో వ్యవసాయ కార్మికుల ఉపాధి, నిజ వేతనాలు తగ్గుముఖం పట్టాయి.- (దిలీప్‌ రెడ్డి)

హరి వెంకట్‌కి అరుదైన అవకాశం

తిండికి కరువై…చదువుకు దూరమై…ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యం ఇలా మొగ్గలోనే వాడిపోతే ఎలా?ఈఆలోచనతోనే గమ్యం తెలియని వీధి బాలల కోసం‘ధరణి’ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి…వారికి ప్రాథమిక విద్యే కాదు…జీవిత పాఠాలనూ నేర్పిస్తున్న హరివెంకట్‌ రమణ ప్రయాణం ఇది…
విద్య, విజ్ఞానం… రేపటి తరానికి బంగారు భవిష్యత్తును అందించాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ప్రాథమిక విద్యను అందిస్తూనే… నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వాలి. మానవ విలువలు నేర్పించాలి. అప్పుడే వారు జీవితంలో స్థిరపడగలుగుతారు. మనమైతే సరే… మరి వీధిబాలల పరిస్థితి ఏమిటి? ఇలాంటి చదువు ఎవరు చెబుతారు? ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు హరి వెంకట్‌. ఇందులో ఎన్నో వ్యయప్రయాసలు, ఇబ్బం దులు ఉంటాయి. వద్దని వెనక్కి లాగినవారూ ఉన్నారు. కానీ అవేవీ పట్టించు కోకుండా ఆమె అడుగు ముందుకు వేశారు. తన నెలకొల్పిన సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా, విశాఖలోని వీధి బాలలు, బస్తీలు, అట్టడుగు వర్గాల పిల్లల కు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నారు. తన కళాత్మక సృజనతో కార్టూన్లు ద్వారా అవగాహన ప్రచార మాధ్యమాలు ద్వారా,వ్యాసాలు రాస్తూ చైతన్య పరు స్తున్నారు. మనుషుల అక్రమరవాణా అన్నది భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్న ఒకనేరం. ఒకసారి రవాణా బారిన పడిన తరువాత బాధితులు బలవంతంగా వ్యభిచారం, వెట్టిచాకిరీ, భిక్షాటన, పళ్లి,మత్తు పదార్ధాల చేరవేత, పిల్ల లను ఉపయో గించి చేసే లైంగిక చిత్రాల వంటి మరెన్నో దారుణ చర్యలకు గురవుతున్నారు. మన దేశంలో మను షూల అక్రమ రవాణాను నియంత్రించే చట్టాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇవి భారత శిక్షాస్మృతి (ఐపిసి), 1860లోని 370-370ఎ విభాగాలు మనుషూల అక్రమ రవాణాను నిర్వచించి శిక్షారం చేస్తున్నాయి. సెక్షన్‌ 371,ఐపిసి బానిస వ్యాపారాన్ని నేరంగా పరిగణిస్తుంది బీ సెక్షన్‌ 372-373 ఐపిసి ప్రకారం వ్యభిచారం కోసం బాలికల అమ్మకాలు, కొనుగోళ్లను నిర్వహించడం నేరంబీ అనైతిక రవాణా (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తూ బాధితులను రక్షిం చడం, పునరావాసంతోపాటు వారి నైతిక ప్రవర్తనను సరిదిద్దడం గురించి చెబుతుంది. ఈ అంశాలపై పని చేస్తున్న హరికి అరుదైన అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ లింగ ఆధారిత హింస,మానవ అక్రమ రవాణా అంశాలపై పనిచేస్తున్న కొన్ని సంస్థలు కలసి మానవ అక్రమ రవాణా అరికట్టాడానికి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై చర్చించారు. ఈనేపథ్యంలో అక్కడ చర్చించిన అంశాలు, అధ్యయన యాత్ర అనుభవాలను ఆయన కలం నుంచి జాలు వారిన వ్యాసమే ఇది..!
అమెరికా వెళ్లాలని చాలామందికిఉంటుంది. నేను నాహైస్కూల్‌,కాలేజిరోజులలో విద్యా ర్థి సంఘంలో పనిచేసాను.ఆ ప్రభావమో,సాహిత్య ప్రభా వమో వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పెట్టు బడిదారీ,బూర్జువాలాంటి పదాలువల్లెవేసిన వారి పిల్లలంతా అక్కడే ఉండటం, నాతోపాటు హైదరా బాద్‌ రూమ్‌ లోవున్న మాకజిన్స్‌ అమెరికా వెళ్ళాక అయిపూ, అజాలేక పోవడంవలన అమెరికా నాకెప్పు డూఒక ఆశ్చర్యం. డిగ్రీ తరువాత ఒకటి రెండుచిన్న ఉద్యోగాలు చేసి హైద రాబాద్‌లో యాని మేషన్‌ రంగంలో పనిచేసే వాడిని, అయితే సాహిత్యం సామజిక రంగంపై మక్కువతో 2006 సంవత్సరంలో ధరణి స్వచ్ఛంధ సంస్థను స్థాపించి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌తో కలిసి గ్రామాలలో యువజన సంఘాలు ఏర్పాటు చేయడం, గ్రామీణ గ్రంధాలయాలు, యువతకు కెరీర్‌ గైడన్స్‌ అంశాలపై పనిచేశాను.
వీధి బాలలు,బాలకార్మికులను గుర్తించి వారిని ప్రభుత్వ బడులకు పంపడం. బాల్య వివా హాల అనర్ధాలపై ప్రచారం, బాలికల విద్య ఆవశ్య కత,గుడ్‌ టచ్‌ బాడ్‌ టచ్‌ అంశాలపై ప్రభుత్వ పాఠశాలలు,హాస్టళ్లు,అంగన్వాడీల్లో తల్లులకు పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిం చి ఒక ఉద్యమంలాగ దీనిని కొనసాగించాను. దాదాపు వేలాది మందికి ఈవిషయం చేరవేసే ప్రయత్నం చేసాను.పిల్లలతో, కమ్యూనిటీతో బాల్య వివాహాలనిషేధం,పిల్లలపైలైంగిక వేధింపుల నిరో ధం,బాలల భద్రత వంటి అంశాలపై గోడ పెయిం టింగ్‌లు వేయించాను.బాలికలు అక్రమ రవాణాకు గురికాకుండాపట్టణ మురికివాడలలో, పాఠశాల లలో,కళాశాలల్లో చాలా కాలం నుంచి మానవ అక్రమ రవాణా నిరోధానికి కౌమారులు తీసుకో వలసిన జాగ్రత్తలు వివరిస్తూవొచ్చాను, ఈ అంశం పై యానిమేషన్‌, పోస్టర్లు,పిల్లలకు అర్ధం కావడానికి పోస్టర్లు, పత్రికలలో వ్యాసాలు రాసేను. ఒకానొక రోజు ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్షిప్‌ ప్రోగ్రామ్‌కి రావాలని,‘‘లింగ ఆధారిత హింస-మానవ అక్రమ రవాణా‘‘అంశంపైఈ పర్యటన ఉంటుందని ఆహ్వా నం అమెరికన్‌ ప్రభుత్వం నుంచివొచ్చింది. ఇంకే ముంది యెగిరి గంతేసి ప్రయాణ ఏర్పాట్లు చేసుకు న్నాను. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌3వ తారీఖు వరకు జరిగిన ఈ పర్యటన ఒక మంచి విజ్ఞాన అనుభవం.
అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పర్యటన
ఢల్లీి నుంచి ఆమ్స్టర్‌ డాం మీదుగా 13 ఆగస్టు నడల్లాస్‌ చేరుకున్నాము. లింగ ఆధారిత హింస, మానవ అక్రమరవాణా అంశంపై చర్చలు, మేధో మధనాలు,సలహాలు,సూచనల ఆహ్వానాలు అమె రికా రాజధాని వా షింగ్టన్‌ డి.సి.సంయుక్త రాష్ట్రా లయిన నార్త్‌ డకోటా(మైనాట్‌, బిస్మార్క్‌ నగ రాలు)సియాటల్‌(వ్వాషింగ్టన్‌ రాష్ట్రం),పెన్సో కోలా (ఫ్లోరిడారాష్ట్రం)లలో జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఓవర్‌ సీస్‌ ఎడ్యుకేషన్‌ డిపా ర్ట్మెంట్‌, డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఎక్స్టర్నల్‌ అఫైర్స్‌ (విదేశీ వ్యవహారాలు) సందర్శించడం జరిగింది అమెరి కాలో ఫెడరల్‌ వ్యవస్థ పనిచేసే విధానం,అటార్నీ జనరల్‌ అసోసియేషన్‌, గృహహింస అరికట్టడం, బాధితులకు సహాయం చేసే పనిచేసే ఎన్‌జీవోలతో వ్వాషింగ్టన్‌ డీసీలో సమావేశం అయ్యాము. నార్త్‌డ కోటా రాష్ట్రంలోట్రైబల్‌ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి ఆదిమతెగలలో లింగ ఆధారిత హింస అందుకు కారణాలు,మానవ అక్రమరవాణా జరుగుతున్న విధానం తెలుసుకున్నాము.సియాటెల్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఆ రాష్ట్ర సెనేటర్‌ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి తీసుకు వొచ్చిన పలు చట్టాలు,బాధితులతోనే (సెక్స్‌ వర్కర్స్‌) నిర్వహిస్తున్న సంస్థలు,పిల్లల కొరకు అక్కడి ప్రభు త్వం ఏర్పాటు చేసిన కార్యాలయాలు,బాలలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారినుంచి వివరా లు రాబట్టడానికి అనుసరించే సృజనాత్మక విధా నాలు తెలుసుకున్నాను.
అమెరికాలో లింగ ఆధారిత హింస
మహిళలు పురుషులపై ఆధారపడటం,ఆర్ధిక స్వేఛ్చ లేకపోవడం.ఆర్ధికంగా పతనమైన వలస కుటుం బాలు,అప్పులు,కుటుంబాలకు మిగిలిన వ్యక్తులతో డ్పాటు లేకపోవడం వలన లింగ ఆధారిత హింస అమెరికాలో ఎక్కువ.ఎక్కువ గృహ హింస కేసులు ఆసియా దేశాలు అందునా భారత్‌ వంటి దేశాల నుంచి వొచ్చిన కుటుంబాల నుంచే నమోదు కావ డం వంటివి అక్కడ గృహ హింసపై పనిచేస్తోన్న ఒకస్వచ్ఛంధ సంస్థ(ఎన్‌.జీ.ఓ)చెప్పగా ఆశ్చర్య పోయాను. చాలా సందర్భాలు,కేసులు ఆర్ధిక అస్థిరత వల్లనే అవుతున్నాయి అని నాకు అనిపించింది. ప్రతీది డబ్బుతో ముడిపడిఉండటం,భద్రత లేనిఉద్యోగాలు,వీకెండ్‌ ఎంజాయిమెంట్‌కి ఎక్కువ ప్రాధా న్యత ఇవ్వటం,పదహారు సంవత్సరాల నుంచి పిల్లలుస్వతంత్రంగాఉండటం (అందువలన తప్పు లేదు గాని,మద్యం,డ్రగ్స్‌ వంటి వాటికి అడిక్ట్‌ అయ్యే వారు ఎక్కువ)కూడా కొన్నికారణాలుగా అనిపిం చింది. మన దేశంలో కుటుంబవ్యవస్థను రక్షించడం కొరకు,మగవాడు చెప్పింది చేయాలి.స్త్రీ ఇలానేఉండాలిఅనే భావాలప్రచారం వలన మనకు మహిళలపై, పిల్లలపై హింస ఎక్కువ. ఇది మన సంస్కృతిలోబాగా వేళ్ళూనుకు పోయివుంది. చిన్న తనం నుంచే మనకు మగ,ఆడ అనే బేధాలు ఎక్కువ. ఇవి మహిళలు పిల్లలపై హింసకు,లైంగిక హింసకు కారణమవుతున్నాయి.అయితే లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి అమెరికాలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సహకారంతో క్రైసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేశాయి.వీటికి5శాతం వరకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.మిగతావి డోనర్‌ ఏజెన్సీ లు,వ్యక్తిగత డోనర్లు ఈక్రైసిస్‌ సెంటర్లలో మహిళ లు రక్షణ పొంద వొచ్చు.శిక్షణ పొందవొచ్చు ,తిరిగి తమ కుటుంబాన్ని కలవాలి అనుకున్నపుడు వెళ్ళవొచ్చు. చాలా సందర్భాలలో తిరిగి మహిళలు కుటుంబం వద్దకే వెళ్లిపోతుంటారు. అయితే ఈ బాధిత కార్యాలయాలు అత్యంత గోప్యతతో నిర్వహిస్తారు. అక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోచట్టం కనుక మనదేశంలోవలే జాతీ యస్థాయి చట్టాలు, అమలు విధానాలు వుండవు. ఇది కేంద్ర స్థాయిలో పనిచేయడానికి వారికి అడ్డంకిగా మారుతుంది. నేను సియాటెల్‌ నగరంలో ఒక రెఫ్యూజీ సెంటర్‌కు వెళ్ళాను..అది పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. అమెరికాను పీడిస్తున్న అక్రమ రవాణా అంశం తగిన లేబర్‌ లేకపోవడం, వ్యవసాయ పనులకు లేబర్‌ కావాల్సిరావడం కూడా ఈ మానవ అక్రమ రవాణాకు కారణం,అలా తీసుకువొచ్చిన వారి పాస్పోర్టుల తీసేసుకొని వారిని సెక్స్‌ ట్రేడ్‌కు వాడు తున్నారు.ఇంకా ఇక్కడప్రాస్టిట్యూట్‌ సర్వైవర్స్‌ నడుపుతున్న ఒక ఎన్‌జీఓను కలవడం జరిగింది. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మీద ఇంటర్లో గాట్‌,డంకెల్‌ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బోలెడు కార్టూన్లు వేసాను. ఇప్పుడు అదే సెంటర్లో వరల్డ్‌ అఫైర్స్‌ ఆఫీసులో మీటింగులో పాల్గొనడం ఒకచిత్రమైన అనుభూతి. ఇక్కడ కింగ్‌ కౌంటీ కౌన్సిల్‌ మెంబెర్‌ని కలిసాము,ఆమె మానవ అక్రమ రవాణా నిరోధా నికి ఎన్నోచట్టాలను గత ఇరవై ఏళ్లుగారూపొం దించి ప్రవేశ పెట్టారు. మానవ అక్రమ రవాణా నిరోధాన్ని కేవలంచట్టాలు ఎంత వరకు తగ్గిస్తా యి? అన్న నా ప్రశ్నకు సమాజంలో మానవ అక్రమ రవాణా పట్ల ఒకసాంస్కృతిక మార్పు రావాల్సి ఉంటుం దని ఆమె చెప్పారు.
ఆదిమ తెగలలో లింగ ఆధారిత హింస
లింగ ఆధారిత హింస ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. సమాన అవకాశాలు లేకపోవడం, కుటుం బాలలో ఆర్ధిక అస్థిరత,మానసిక సమస్యలు, విపరీ తమైన త్రాగుడు,డ్రగ్స్‌ తీసుకోవడం ఒక ప్రధాన కారణంగా ఇక్కడ కలిసిన వ్యక్తుల,సమూహాల చర్చలనుబట్టి అర్ధమయ్యింది. మహిళల ప్రయివసీ కాపాడటం, బహిరంగ ప్రదేశాలలో వారిని గౌరవించే విధానం ఇక్కడ చాలా బాగుంది. కానీ అటువంటి సివిక్‌ సెన్స్‌ అభివృద్ధి చెందినచోట లింగ ఆధారిత కుటుంబహింస ఎక్కువగాఉండటం ఆశ్చర్యకరం.మన దగ్గర తరాలుగా అంది పుచ్చు కున్న ‘‘మనువాద భావాలు’’ మహిళలను రెండో పౌరులుగా చూస్తే ఇక్కడ గిరిజన తెగలలో,వలస దారులలో కూడా లింగ ఆధారిత హింస ఎక్కువ ఉన్నట్లు అర్ధమవుతుంది.ఆదిమ తెగలు స్త్రీ కేంద్రం గా స్త్రీని గౌరవించే ఆచారాలు కలవి,అటువంటి చోట మెయిన్‌ స్ట్రీమ్‌సమాజం ప్రభావం పడి వాటి పై కూడా లింగఆధారిత కుటుంబ హింస పడిర ది. ఇంకా వందల ఆదిమతెగలు ఇక్కడ తమ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నాయి. ట్రైబల్‌ కోర్టులు ఉంటాయి అయితే వాటి కంటేపై స్థాయిలో స్టేట్‌, ఫెడరల్‌ కోర్టులదేపై చేయి. మిగతా సమా జంతో కలిసి అవకాశాలు అందిపుచ్చు కోవడం లో వెనుకంజ, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్లలేక పోవడం కూడా కుటుంబ,లింగ ఆధారిత హింసకు కారణంగా నాకు అనిపించింది.ఇందుకు ప్రత్యామ్నాయంగా భాషను కాపాడు కోవడం,స్కిల్స్‌ అప్‌ గ్రేడ్‌ చేసుకోవడం ఆయా తెగలు చేస్తున్నాయి. అమెరికా అనేక గిరిజన తెగలను నిర్మూలించివారి పునాదులపై సౌధాలు నిర్మించింది అన్న చరిత్ర అందరికి తెలిసిందే.
పర్యటన స్పూర్తి
ఈపర్యటన ఇచ్చిన స్పూర్తితో మానవ అక్రమ రవాణా నిరోధం అంశంపై మరింతగా పనిచేస్తాను, ముక్యంగా యువతులు,కౌమార బాలికలు, బాలురు ఈకూపంలో ఇరుక్కోకుండా వారికి విభిన్న మాధ్య మాల (మీడియా,కార్టూన్లు, పవర్‌ పాయింట్‌ ప్రెసెం టేషన్‌,యానిమేషన్‌ )ద్వారా తెలియజేస్తాను. అక్రమ రవాణాలో చిక్కుకున్న వారికి ప్రభుత్వంనుంచి సహా యం అందేలాచేయడం,ఇందుకోసం ఏర్పడిన కమి టీలు సమావేశం అయ్యేలా కృషి చేయడం, జాతీయ స్థాయి సంస్థలతో ఈఅంశంపై కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం చేస్తాను. ఇటుక బట్టీలలో పనిచేసే పిల్లలను వెట్టి నుంచివిముక్తి చేయడంకోసం ప్రత్యేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇంటి పని వారల సంఘంతో కలిసి గృహ కార్మి కులు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రచార కార్యక్రమాలు చేస్తాను. జిల్లాన్యాయ సేవాధికార సంస్థతో కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేయ టానికి కోరుతాము.యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్స్‌ ఇంకా పిల్లలు, మహిళల కోసం పనిచేసే సంస్థలతో కలిసి పని చేయడంద్వారా బాల, బాలి కలు అక్రమ రవాణాకు గురికాకుండా ప్రయత్నించ వొచ్చు. ఇంటి పనివారు, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, విదేశాలలో వెళ్లే వారికి అవగా హన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన వుంది.
వ్యాసకర్త : బాలల హక్కుల కార్యకర్త, విశాఖపట్నం-(హరి వెంకట రమణ)

పర్యావరణ వినాశనం..

విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా.. కోలుకోవ డానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. సాధారణంగా విపత్తులు రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్‌,సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌), కాలు ష్యం,అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈ రెండు రకాల విపత్తు లు ప్రాణ,ఆస్తి,పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి.కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009,డిసెంబర్‌ 21న ఒక ప్రతి పాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్‌ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ణaవ టశీతీ ణఱంaర్‌వతీ Rఱంస Rవసబష్‌ఱశీఅఅధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు,రిస్క్‌ అవేర్‌నెస్‌ గురించి ప్రమోట్‌ చేస్తుంది ఈ దినో త్సవం. మొదట్లో నేచురల్‌ డిజాస్టర్‌ రెడక్షన్‌ డేగా ఉండేది. 2002లో ఐరాస ఓరెజల్యూషన్‌ పాస్‌ చేసింది.విపత్తులు సంభ వించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’.. అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే. అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా. ఈదిశగా ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆదశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే.. ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు. రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి. ముందస్తు చర్యలు చేపట్టాలి.లోపాలను అధిగ మించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగా లను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’..ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గిం చాలనేది ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశం
మన దగ్గర..
భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ,చట్టం వచ్చింది మాత్రం 2005లో.విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం,రాష్ట్రం,జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో చాలా మార్పు వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్‌ ఎఫ్‌ (సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది. మరో వైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది.
విపత్తు నిర్వహణ
జీలం,చీనాబ్‌,రావి,సట్లెజ్‌,బియాస్‌,ఘాగ్రా నదులతో కూడిన వాయవ్య నదీపరివాహక ప్రాంతం,తపతి,నర్మద,మహానది,వైతరణి, గోదా వరి,కృష్ణా,పెన్నా,కావేరి నదులతో కూడిన ద్వీప కల్ప నదీ పరివాహక ప్రాంతాలు వరదకు ప్రభావితమవుతున్నాయి.ఏపీ,తమిళనాడు, ఒడిశా,కేరళ తీరప్రాంతాలు,అసోం,ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తరుచూ తీవ్ర వరద ముంపునకు గురవుతుంటాయి. జీవాయుధాలు కలిగించే జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించలేం. ప్లేగు,స్మాల్‌ఫాక్స్‌వంటివి వేగంగా సోకే కార కాలను గుర్తించడంలో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో శత్రుసైన్యాన్ని చంపే విధానంలో భాగంగా బుబోనిక్‌ ప్లేగు (గ్రంథులు ఉబ్బడం) వ్యాధితో మరణించిన వారి శవాలను రాజు కోటలో విసిరేవారు.ఉదా: 1346 కఫా సంఘటన. 14 22 కరోల్‌స్టీన్‌ సంఘటన. విపత్తు అనేది ఒక అపాయకరమైన స్థితి. దేనివల్ల ప్రజల ప్రాణా లు,ఆస్తులకు ముప్పు వాటిల్లుతుందో ఆ స్థితిని విపత్తు (ణIూAూుజుR) అంటారు.ఒక సమాజం తన సొంత వనరులతో కోలుకోలేని విధంగా,సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణ నష్టం,ఆస్తినష్టం,పర్యావరణ వనరులను విలు ప్తం చేసి,మౌలిక సౌకర్యాలకు,నిత్యావసర సేవలకు,జీవనోపాధికి,మానవ దైనందిన జీవి తానికి అంతరాయం కలిగించే ఒక సంఘటన లేదా వరుస ఘటనలను విపత్తు అంటారు.
ఐక్యరాజ్యసమితి
విపత్తును ఐక్యరాజ్యసమితి సమాజపు లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మా త్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపద అని నిర్వచించింది. సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి సంరక్షించడానికి అసా ధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉప ద్రవ పరిస్థితి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలు కోడానికి వెలుపలి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవరమయ్యే విధంగా నష్టానికి, ఆర్థిక విధ్వంసానికి, మానవ ప్రాణ నష్టానికి ఆరోగ్యం, ఆరోగ్య సేవలను పతనం చేసే ఏదైనా సంఘటన అని నిర్వచించింది.ఒక దుర్ఘటనను విపత్తుగా పిలవాలంటే ఎన్ను కోవాల్సిన ప్రమాణాలు లేదా ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కనిపించే లక్షణాలు
సమాజ సాధారణ మనుగడ దెబ్బతినడం
ధన,ప్రాణ,ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడం, ప్రజల జీవనోపాధి దెబ్బతినడం,విపత్తు ప్రభావానికి లోనైన సమాజానికి ఆస్తులు, అక్కడి ప్రజల పునర్నిర్మాణానికి వెలుపలి నుంచి సహా యం అవసరం అన్నంతగా దాని తీవ్రత ఉం డటం,దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమై,అక్కడి పర్యావరణం దెబ్బతిని, సుస్థిరాభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండటం.ముఖ్యంగా 1. వైపరీత్యం,2.దుర్బలత్వం,3 సామర్థ్యం, 4. ఆపద అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు, పర్యావరణానికి ప్రకృతి చేతగాని లేదా మానవ కారకంగా గాని నష్టాలు సంభ విస్తే దానిని వైపరీత్యం అంటారు.
వైపరీత్యాలను – జిఎన్‌వి సతీష్‌

కారడవులూ కార్పొరేట్లకేనా..?

కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశ నానికి శ్రీకారంచుట్టింది.2022 జూన్‌ 28న ‘ఫారెస్ట్‌ కన్సర్వేషన్‌ నిబంధనలు-2022’ను తీసుకు వచ్చిం ది.‘కన్సర్వేషన్‌’ (పరిరక్షణ)పేరుతో వచ్చిన ఈనిబం ధనలు అంతులేని విధ్వంసం చేయబోతు న్నాయి. ఆదివాసీలను,అడవులను,వన్యప్రాణులను, పర్యా వరణాన్ని ధ్వంసం చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈనిబంధనల ప్రకారం ఎంత పెద్ద అడవి నైనా అటవీయేతర భూమిగా మార్చుకోవచ్చు. వ్యా పారఅవసరాలు,లాభాల కోసం బడా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయవచ్చు. రాష్ట్రంలో స్క్రీనిం గ్‌ కమిటీ, కేంద్రంలో రీజినల్‌ ఎంపవరింగ్‌ కమిటీ, ఎడ్వైజరీకమిటీలు,మొత్తం మూడు కమిటీలు ఏర్పాట వుతాయి. వీటిలో పర్యావరణవేత్తలకు, ఆదివాసీలు, సామాజిక కార్యకర్తలకు ప్రాతినిధ్యం లేదు.కొత్త నిబంధనల కింద ఎంత అడవిని,ఎంతకాలపరి మితిలో కార్పొరేట్లకు అప్పగించాలో వివరాలు ఉండటం గమనార్హం.5 నుంచి 40హెక్టార్ల అడవిని 60 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం, మైనిం గ్‌ అవసరాల కోసం75రోజుల్లో అప్పగించాలి (హెక్టారు అంటే రెండున్నర ఎకరాలు). 41నుంచి 100 హెక్టార్ల అడవిని 75 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం,మైనింగ్‌ అవసరాలకోసం 90 రోజుల్లో ఇవ్వాలి. 100 హెక్టార్ల నుంచి ఆ పైనున్న అడవిని 120రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాల కోసం, మైనింగ్‌ అవసరాల కోసం 150రోజుల్లో ధారాదత్తం చేయాలి. పై మూడు కమిటీలు మొత్తం ప్రక్రియను ఈ కిందివిధంగా పూర్తిచేసి అడవిని కార్పొరేట్లకు అప్పగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించబడిన కాలపరిమితికి లోబడి ఎటువంటి జాప్యం చేయరాదు.ఎలాధ్వంసం చేయాలి?మొదటి దశలో ఆదివాసులను, వన్యప్రాణులను అక్కడినుంచి ఖాళీ చేయించాలి. తర్వాత అడవిని ప్రైవేటు వ్యక్తు లకు,బడాకార్పొరేట్లకు దఖలు చేయాలి. ఆ తర్వాత ఏయే పద్ధతులద్వారా అడవిని ఎంత క్రూరంగా ధ్వంసం చేయవచ్చో కూడాఈనిబంధనల్లో పేర్కొ న్నారు.1.క్లియర్‌ ఫెల్లింగ్‌ (పూర్తిగా నరికివేయడం), 2.అప్‌ రూటింగ్‌ (కూకటివేళ్ళతో పెకలించడం), 3.బర్నింగ్‌(అడవినితగలబెట్టడం).ఇలాంటి విధ్వం సకర చర్యలద్వారాఅటవీభూమిని,అందులో ఉన్న సంపదను కొల్లగొట్టడంకోసం వన్యప్రాణులను, ఆదివాసులను,ఇతర పేదలను నిరాశ్రయు లను చేస్తారు.తద్వారా అటవీయేతర భూమిగా మార్చు కొని వారి అవసరాల కోసం వాడుకుంటారు. రాజ్యాంగం-చట్టాల ఉల్లంఘన
రాజ్యాంగంలో5,6వ షెడ్యూళ్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆదివాసులకు పలు హక్కులు, రక్షణ లభిస్తున్నాయి. గిరిజన భూముల బదలాయింపు నిరోధక చట్టం, గ్రామసభలకు అధి కారాలను కలగజేస్తున్న పెసా చట్టం,అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006, భూ నిర్వాసితుల చట్టం-2013, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు, తదితర కోర్టులు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఇచ్చిన తీర్పులతో సహా అన్ని హక్కులు బుల్డోజర్‌తో నేలమట్టం చేయబడ్డాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఎంత విస్తీర్ణం గల అడవిని అటవీయేతర భూమిగా మారుస్తారో, అంత విస్తీర్ణం గల భూమిని మరోచోట కేటాయించి ప్రత్యామ్నా యంగా అడవిని పెంచాలి. కానీ కొత్త విధానం ప్రకారం ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నామ మాత్రమే. రాష్ట్రాల మీదికి ఆబాధ్యత నెట్టివేసి కేంద్రం చేతులు దులుపుకొన్నది. నష్ట పరిహారం, పునరావాసం: అడవి నుంచి, భూమి నుంచి గెంటి వేయబడిన ఆదివాసీలు, ఇతర పేదలకు పునరా వాసం గానీ, నష్ట పరిహారం గురించి గానీ కేంద్రం ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా లేవు. అడవిని పూర్తిగా వ్యక్తిగత ఆస్తిగా మార్చుకొని,ఆయజమాని లబ్ధిని పొందడం ప్రారం భమైన తర్వాతనే నిర్వాసితుల పునరావాస ప్రక్రి యపై దృష్టిపెట్టాలి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభు త్వాలు పర్యవేక్షణ చేయాలనేది ఈ నిబంధనల్లోని అంశం. బడా కార్పొరేట్లను నిలువరించటం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆదివాసులకు, హక్కుల సంఘాలకు సాధ్యమవుతుందా? ఇది కేంద్రం పలాయనవాదం కాదా?గిరిపుత్రులు అడవిలో పుట్టి, అడవినే నమ్ము కొని,అడవే జీవనాధారంగా ఏర్పరచుకొని, అడవిలో లభించే కందమూలాలు తింటూ నాగరికపు సమా జానికి దూరంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వారిని అడవి నుంచి దూరం చేయాలని, అటవీ సంపదను కార్పొరేట్‌ బడా బాబులకు, ప్రభుత్వ ఆశ్రిత పెట్టు బడిదారులకు దోచిపెట్టాలని కేంద్రం తహత హలాడుతున్నది. అనేక రాష్ట్రాల్లో అటవీ సంపదను కొల్లగొట్టడానికి బొగ్గు గనుల తవ్వకం, బా క్సైట్‌, యురేనియం లాంటి ఖనిజాల వెలికితీతకు జిం దాల్‌, వేదాంత లాంటి బహుళజాతి సంస్థలు, అంబానీ, అదానీల సంస్థలు పోటీపడుతూ గిరిజన జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రాజ్యాం గ విలువలకు ప్రాధాన్యం ఇచ్చి, ఆదివాసీల అభివృ ద్ధికి రాజ్యాంగం కల్పించిన చట్టాలను అమలు చేస్తేనే గిరిజనుల ఆకాంక్షలు నెరవేరుతాయి.
అడవుల పెంపకం కోసం నయా ప్లాన్‌.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎన్ని చెట్లు నేల కూలుతున్నాయో తెలుసా..? సుమారుగా14 వేల కోట్లుకు పైమాటేనట! మరి వీటి స్థానంలో కొత్తగా ఎన్ని మొక్కలు పుడుతున్నా అంటే..అది జస్ట్‌ సగం కూడా లేవట! అందుకే..అడవులను వేగంగా పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఉందని అటవీశాఖ అధికారులు ముందుకు వచ్చారు. అటవీశాఖ ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా డ్రోన్లతో విత్తనాలను నాటుతున్నారు. భారీగా మొక్క లుగా మొలిచేలా చేయడమే తమటార్గెట్‌ అనివాళ్లు చెప్తున్నారు. మామూలుగా మనుషులతో విత్తనాలు నాటాలంటే ఎక్కువ టైంలో తక్కువ పనైతది. ఎక్కువ మంది జనాలుదానికోసం పనిచేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఖర్చూ ఎక్కువే.అందుకే వాళ్లు డ్రోన్‌ టెక్నాలజీపై ఫోకస్‌ పెట్టారు. ముందుగా వాళ్లకు కావాల్సిన రకరకాల మొక్కల విత్తనాలను సెలెక్ట్‌? చేసుకుంటారు. వాటిని మట్టి, ఇతర న్యూట్రియెంట్స్‌ కలిపిన ఒక ముద్దలో పెడతారు.ఆముద్దలను ఉండలుగా చుట్టి సీడ్‌ బాల్స్‌గా మారుస్తారు. ఈ సీడ్‌ బాల్స్‌ను డ్రోన్‌లద్వారా పైనుంచి జార విడు స్తారు. దీంతో వానలు పడగానే సీడ్‌ బాల్స్‌ మొల కెత్తుతాయి.వాటి చుట్టూ ఉన్న మట్టి, న్యూట్రియెంట్స్‌ సాయంతో ఏడెనిమిది నెలల వరకూ మొక్కలు బతకగలవు. ఆలోపు వేర్లు పుట్టి, నేలలో బాగా పాతుకుపోతాయి. ఇలా.. డ్రోన్లతో ఈజీగా మొక్కలు పెంచొచ్చని వీరు ప్లాన్‌ చేశారు.ఫ్లాష్‌ ఫారెస్ట్‌ ప్రాజె క్టును గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు అటవీశాఖ అధి కారులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో డ్రోన్‌ ద్వారా విత్తన బాల్స్‌ వేశారు. గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఆధ్వర్యంలో విత్తనాలను సేకరించినట్లుగా చెప్పారు. అడవిలో పలుచగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కామా రెడ్డిలోనే ప్రారంభించామని వెల్లడిరచారు.
పర్యావరణంలో కలిగే దుష్పరి ణామా లను అడ్డుకోడానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారం అన్న భావన గత కొన్నేళ్లుగా బలహీనపడుతోంది. కార్బన్‌ వాయువులను పీల్చుకోవడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయని గతంలో జరిగిన పరిశోధ నలు తేల్చాయి. వాటిని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విస్తారంగా అడవులను పెంచడం ప్రారంభించాయి. మొక్కల పెంపకం మీద అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. చెట్లు పెంచితే పర్యావరణంలో దుష్పరిణామాలను ఆపవచ్చని విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చాయి. 2030 కల్లా 350 మిలియన్‌ హెక్టార్లలో నాశనమైన అడవుల ప్రాంతంలో తిరిగి పచ్చదనం తీసుకురావాలని పలు దేశాలు ప్రతిజ్జ చేశాయి. ఇప్పటి వరకు 40 దేశాలు ఈ ప్రతిజ్జను పాటిస్తు న్నాయి. కానీసైంటిస్టులు మాత్రం మొక్కలు నాట డానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. చిలేలో అడవుల పెంపకానికి ఇచ్చే సబ్సిడీలకు సంబంధించి1974 నుంచి 20 12వరకు విడుదల చేసిన డిక్రీలను పరిశీలిం చారు. వీటిని చూస్తే ప్రపంచంలో ఇదే అతి పెద్ద అడవుల పెంపకం ప్రాజెక్టు అనిఅర్ధం చేసుకో వచ్చు. కొత్తగా అడవులను పెంచడానికి ఈ చట్టం ప్రకారం 75 శాతం రాయితీలు లభిస్తాయి.వాస్తవానికి ఈ పథకం ప్రకారం అప్పటికే ఉన్న అడవులలో చెట్లు నాటకూడదు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలామంది మొక్కల పెంపకందారులు అడవు లలోనే లాభదాయకమైన పండ్లను, ఫలాలను ఇచ్చే చెట్లను నాటడం మొదలు పెట్టారు. ఈ స్కీమ్‌ను చెట్లు ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించారు, కానీ స్థానిక అడవులున్న ప్రాంతంలో తగ్గించారు చిలే లోని అడవులు పెద్దమొత్తంలో కార్బన్‌ను నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉన్నవని, కానీ కొత్తగా చేపట్టిన మొక్కల పెంపకంవల్ల అది తగ్గిపోయి, జీవవైవిధ్యం దెబ్బతిన్నదని ఈఅధ్యయనం నిర్వహించిన పరి శోధకులు అంటున్నారు. ‘’మొక్కలు పెంచడానికి చేపట్టిన పథకాలు సరిగా రూపొందించక పోయినా, అమలు చేయకపోయినా ఫలితాలు ఇలానే ఉంటా యి. డబ్బులు వృథాకావడంతోపాటు జీవవైవిధ్యం కూడా దెబ్బతింటుంది’’ అని ఈ స్టడీ పేపర్‌ సహ రచయిత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎరిక్‌ లాంబిన్‌ అన్నారు. మనం కోరుకున్న దానికన్నా పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇవి ‘ొఅని ఆయన అన్నారు. ఇక దీనిపై పని చేసిన రెండో పరిశోధనా ప్రాజెక్టు కొత్తగా నాటిన అడవులు ఎంత వరకు కార్బన్‌ వాయువులను పీల్చగలవో పరిశీ లించింది. ఇప్పటి వరకు సైంటిస్టులు మొక్కలు ఏ స్థాయిలో కార్బన్‌ వాయువులను పీల్చుకుంటాయో అంచనాలు వేసి ఒక నిర్ణీత నిష్పత్తిని నిర్ణయించారు. అయితే ఈ నిష్పత్తిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఈ పరిశోధన, పరిస్థితులను బట్టి ఈ నిష్పత్తి మారు తుందని తేల్చింది. ఈ సందర్భంగా పరిశోధకులు ఉత్తర చైనాలో ప్రభుత్వం నాటించిన చెట్లతోపాటు, గోబీ ఎడారిలో నాటిన మొక్కలను కూడా పరిశీ లించారు. ఈఅడవుల నుంచి 11,000 మట్టి నమూనాలను సేకరించారు. నేలలో కార్బన్‌ లేని ప్రాంతాలలో మొక్కలు పెంచడం వల్ల ఆ ప్రాం తంలో ఆర్గానిక్‌ కార్బన్‌ పెరుగుతుందని గుర్తిం చారు. కార్బన్‌ ఎక్కువగా ఉన్న నేలల్లో అడవులను నాటడం వవలన వాటి సాంద్రతలో తగ్గుదల కనిపించింది. మొక్కలు కార్బన్‌ను పీల్చుకునే శాతాల గురించి గతంలో వేసిన అంచనాలు కాస్త అతిశ యంగా ఉన్నాయని ఈ పరిశోధకులు తేల్చారు. ‘’కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటే దానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారంకాదని ప్రజలు అర్ధం చేసుకోవాలి’’అని ఈ పరిశోధనకు నాయ కత్వం వహించిన కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ చెందిన డాక్టర్‌ అన్పింగ్‌ చెన్‌ అన్నారు. ‘’అడవుల పెంపకంలో చాలా సాంకేతిక అంశాలను పరిశీలిం చవలసి ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ సమతుల్యం చేయాలి, ఏదో ఒక విధానమే సమస్యకు పరిష్కారం కాదు’’ అన్నారు .- (నాదెండ్ల శ్రీనివాస్‌)

1 2 3 4 5 9