ఉపాధి బ‌హుదూరం..పెరుగుతున్న నిరుద్యోగం!

స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ.నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనించాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి.
దేశ వ్యాప్తంగా నిరుద్యోగం తాండవించడంతో ఉపాధి బహు దూరమైంది. ఈ సమస్య సమీప భవిష్యత్తులో ఓమహాఉద్యమంలా మారనున్నది. సిఎమ్‌ఐఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ) విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు పరీశీలిస్తే..దేశంలో ఎంతమంది ఉపాధిలేక రోడ్డున పడినట్టు తెలుస్తోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం..2021 డిసెంబర్‌ చివరి నాటికి దేశ వ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదైనట్టు వెల్లడిరచింది. 2021 సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెల నిరుద్యోగ రేటు పెరుగుతోందని, అందులో పట్టణ నిరుద్యోగం మరింతగా పెరిగిందని తెలిపింది. పట్టణ నిరుద్యోగ రేటు 9.30 శాతం నమోదు కాగా, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ రేటు 7.28 శాతంగా నమోదైనట్లు ఆ సంస్థ వివరించింది. దేశ ప్రజల జీవితంపై కరోనా మహమ్మారి చూపిన దుష్ప్రభావం ఇప్పుడు గణాంకాల సాక్షిగా మరోసారి ఆవిష్కృతమైంది. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. గత ఏడాది 2020-21ఏప్రిల్‌-జూన్‌ త్క్రెమాసికంలో దేశంలో ‘నిరుద్యోగ రేటు’ 20.9 శాతానికి పెరిగింది. కరోనా రాక ముందు ఏడాది 2019లో ఇదే త్క్రెమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1శాతమే. అంటే కరోనాతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగమూ విస్తరించి, రెట్టింపు అయిందన్న మాట. నిరుద్యోగ రేటు పురుషుల్లో 20.8శాతానికీ, స్త్రీలలో 21.2 శాతానికీ పెరిగింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం 21 శాతమైంది. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెప్పిన లెక్కలు. కరోనా తొలి వేవ్‌లో ఉపాధి,ఉద్యోగాలు పోయి, నెత్తి మీద తట్టాబుట్ట, చంకలో పిల్లలతో కాలిబాటన ఇంటిదోవ పట్టిన లక్షలాది కుటుంబాల విషాద దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటే, ఈ లెక్కలు ఆట్టే ఆశ్చర్యం అనిపించవు. ఇంకా చెప్పాలంటే,ఈ లెక్కల్లో కనిపించని వ్యథార్థ జీవుల యథార్థ గాథలు ఇంకెన్నో అనిపిస్తుంది. పాలకుల తక్షణ కర్తవ్యమూ గుర్తుకొస్తుంది. ఎంచుకున్న శాంప్లింగ్‌ యూనిట్లను బట్టి అంకెల లెక్కలు అన్నిసార్లూ నిజాన్ని పూర్తిగా ప్రతిఫలిస్తాయని చెప్పలేం కానీ, ఎంతో కొంత వాస్తవాల బాటలో దారిదీపాలవుతాయి. దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ అందించే లెక్కలు, చేసే సర్వేల నుంచి అసలు సూక్ష్మం గ్రహిం చడం కూడా ముఖ్యం. ఏడాది మొత్తంగా తీసుకొని 2019 జూలై మొదలు 2020-21 జూన్‌ వరకు చూస్తే మాత్రం నిరుద్యోగ రేటు నిరుటి 5.8 శాతం నుంచి 4.8శాతానికి తగ్గినట్టు పైకి అనిపిస్తుంది. కానీ, కరోనా తొలి వేవ్‌ సమయంలో 70 రోజుల లాక్‌డౌన్‌ సమయం అత్యంత కీలకం. ఆ కాలాన్ని లెక్కించిన ఆఖరు త్క్రెమాసికం చూస్తే, పట్టణ ప్రాంతాల్లో ఐటీ సహా సేవారంగాలన్నీ దెబ్బతిన్నాయి. ఫలితంగా గణనీయంగా నిరుద్యోగం పెరిగిందని అసలు కథ అర్థమవుతుంది. నిజానికి, నాలుగేళ్ళ క్రితం 2017 ఏప్రిల్‌ నుంచి ప్రతి త్క్రెమాసికానికీ మన దేశంలో ఇలా ‘శ్రామిక శక్తి సర్వే’ జరుగుతోంది. దేశంలోని నిరుద్యోగ స్థితిగతులను ఈ సర్వే రికార్డు చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెంటిలోనూ రకరకాల నిరుద్యోగాలు, వివిధ ఉద్యోగాలలో వస్తున్న వేతనాలు, పని గంటలకు సంబం ధించిన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరిస్తారు. స్త్రీ పురుషుల్లో ఎవరెంత నిరుద్యోగులో, మొత్తం మీద ‘నిరుద్యోగ రేటు’ (యూఆర్‌) ఎంతో లెక్కిస్తారు. సూక్ష్మస్థాయిలో అయితే దేశంలో నిరుద్యోగ నిష్పత్తిని ఈ ‘యూఆర్‌’ సూచిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ‘నిరుద్యోగ రేటు’ తక్కువగా ఉందంటే జనం చేతుల్లో డబ్బులు ఎక్కువున్నట్టు లెక్క. తద్వారా వస్తువుల గిరాకీ పెరుగుతుంది. అది ఆర్థికవృద్ధికి తోడ్పడు తుంది. కానీ, ద్రవ్యోల్బణం,మరింత ఉద్యోగ కల్పనను బట్టి ఉండే ఆర్థిక వృద్ధిని కరోనా బాగా దెబ్బతీసింది. ఇలా కరోనా కొట్టిన దెబ్బకూ, పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభానికీ మరిన్ని ఉదాహరణలు తాజా సర్వే లెక్కల్లో బయటకొచ్చాయి. నిరుటి జూలై నుంచి సెప్టెంబర్‌ త్క్రెమాసికంలో మహిళా శ్రామికుల భాగస్వామ్యం 16.1 శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అతి తక్కువ మహిళా భాగస్వామ్యం ఇదే. ప్రపంచ బ్యాంకు అంచనాలూ ఆ మాటే చెబుతున్నాయి. పొరు గున ఉన్న బంగ్లాదేశ్‌ (30.5 శాతం), శ్రీలంక (33.7 శాతం)ల కన్నా మన దగ్గర మహిళా శ్రామికుల భాగస్వామ్యం చాలా తక్కువైంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో మహిళలు ఎక్కువగా వ్యవసాయంలో, కర్మాగారాల్లో కార్మికులుగా, ఇంట్లో పనివాళ్ళు గానే ఉపాధి పొందుతున్నారు. దురదృష్ట వశాత్తూ, ఈ రంగాలన్నీ కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతినడం వారికి ఊహించని ఇబ్బందిగా మారింది. సర్వసాధారణంగా పట్టణాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఎక్కువ. గ్రామీణ భారతంలో దాదాపు 50శాతం పైగా తమ కాళ్ళ మీద తాము నిలబడితే, పట్టణాల్లో ఆ సంఖ్య 31శాతమే అని లెక్క. అదనుకు వర్షాలు కురిసి, పంటలు చేతికి రావడంతో ఈ సర్వే కాలంలో గ్రామీణావనిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండ వచ్చు. కానీ, దేశంలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలే పెరిగిందంటే నమ్మలేం. అధికారిక లెక్క కన్నా అసలు కథ ఎక్కువే ఉండడం ఖాయం. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కాలంతో పోలిస్తే, జూన్‌తో ముగిసిన త్క్రెమాసికం తర్వాత నిరుద్యోగం రెట్టింపు అయింది. ఆ సంగతి ఆర్థికవేత్తలే తేల్చారు. 15 ఏళ్ళు దాటిన ప్రతి అయిదుగురిలో ఒకరికి చేతిలో పనిలేదు. 15 నుంచి29ఏళ్ళ లోపు వారిలో ప్రతి మూడో వ్యక్తికీ ఉద్యోగం లేదు. షాపులు, మాల్స్‌, ఆఫీస్‌లు, స్కూళ్ళు, సంస్థలు మూతబడడంతో జనానికి చేతిలో తగినంత పని లేదు. ఇది నిష్ఠురసత్యం. కరోనా తర్వాత ఏకంగా 55లక్షల ఉద్యోగాలు పోయాయని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ సైతం అంచనా వేయడం గమనార్హం. నిజానికి, ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కరోనా కాటుతో ఈ మార్చితో ముగిసిన ఆర్థిక వత్సరంలో భారతఆర్థిక వ్యవస్థ 7.3శాతం మేర కుంచించుకు పోయింది. స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ. నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనిం చాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్త లు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీకా అస్త్రంతో అందరికీ కరోనా నుంచి ఆరోగ్య సంరక్షణ నివ్వాలి. అప్పుడు జనం సత్వర ఉపాధి అన్వేషణలో పడతారు. ఆర్థికవ్యవస్థ పురోగతిలో భాగమ వుతారు.
ఉపాధి బహుదూరం.. కోట్లలో పని లేనివారు
మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, ముద్రా యోజన తదితర పథకాలు నిరుద్యోగులకు అక్కరకు రావడం లేదా?ఉపాధి కల్పనలో కేంద్రం చెబుతున్న మాటలకు,చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా? భారతదేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) లెక్కలు! ‘ప్రపంచంలో ఉపాధి అవకాశాలు, సామాజిక కోణం సరళి’ అనే పేరుతో ఐఎల్‌వో రూపొందించిన తాజా నివేదిక భారత్‌దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. మన దేశంలో ఒక కోటీ 83 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా…2018లో అది 1.86 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. 2019 నాటికి ఇది ఇంకా పెరిగి 1.89 కోట్లకు చేరు కుంటుందనే అంచనాకు వచ్చింది ఐఎల్‌వో. 2018లో ఈ పెరుగుదల శాతం 3.4గా ఉం డొచ్చని తొలుత అంచనా వేసినా అది 3.5 శాతం దగ్గరే కొనసాగవచ్చని అభిప్రాయ పడిరది. వాస్తవానికి మన దేశంలో 2012లో 3.6 శాతంగా ఉన్న నిరుద్యోగ సమస్య 2014 నాటికి 3.4 శాతానికి తగ్గింది. కానీ 2015లో 3.5కి చేరుకుంది. అప్పటి నుంచీ అది అలాగే కొనసాగుతుండటం గమనార్హం.2017కి ముందు కూడా ఐఎల్‌వో ఈ అంశంపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో 2017 నాటికి 1.78 కోట్లు, 2018లో 1.80 కోట్లగా నిరుద్యోగుల సంఖ్య ఉంటుందని అంచనా వేసినా.. 2017లో అంచనాలకు మించి 5 లక్షలు ఎక్కువగానే నిరుద్యోగుల సంఖ్య ఉన్నట్లు గుర్తించింది. ఈ మధ్య చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఈ ఆర్థిక సంవత్సరంలో 70లక్షల ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. పైగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేయాడం లేదనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. విచిత్రం ఏమంటే ప్రధాని చెప్పిన లెక్కలకు, ఐఎల్‌వో నివేదించిన అంశాలకు ఎక్కడా పొంతన లేదు.
మొత్తంగా కొంత ఊరట!
ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం, నిరుద్యోగ సమస్య మూడేళ్లలో తొలిసారిగా కొంత తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన విషయంగా ఐఎల్‌వో పేర్కొంది.2017లో 19.27 కోట్లగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2018లో 19.23 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఉపాధి కోసం ఎదురు చూసే వారి సంఖ్య 19కోట్ల దగ్గర స్థిరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం గా పేర్కొంది.
ప్రాణాలు నిలుపుకునేంత సంపాదన
ఇండియాలో నిరుద్యగ సమస్య తీవ్రంగా వుంది. కానీ, విదేశాల్లోలాగ నిరుద్యోగానికి అద్దం పట్టే పోడవాటి క్యూలు ఇక్కడ కనబడవు.సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో దేశంలో చాలామంది ప్రజలు కేవలం తమ ప్రాణాల నిలుపుకోవడానికి అవసరమైన మేరకే సంపాదించగలుగుతున్నారు. భారతదేశంలో చాలామంది నిరుద్యోగులు తమ కుటుంబాలపైనే ఆధారపడుతున్నారు. ఉపాధి కొరత కారణంగా, తక్కువ మంది చేయగలిగిన పనిని చాలామంది పంచుకుంటున్నారు. దీంతో, వారి ఆదాయం కూడా పలుచబడుతోంది. దేశంలో దాదాపు ఎనభై శాతం మంది కార్మికులు తగు ప్రమాణాలు పాటించని పరిశ్రమలలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. వీరిలో చాలా తక్కువ మందికే ఉద్యోగ భద్రత, ఆదాయ భద్రత ఉంటోంది. దేశంలో కేవలం7శాతం మంది మాత్రమే, ఉత్తమ ప్రమాణాలున్న ఆర్థిక వ్యవస్థల్లో పనిచేస్తూ, కార్మిక ఉపకారాలు పొందుతున్నారని అంచనా.భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. కార్మిక శక్తి విపరీతంగా పెరుగుతోంది. రానున్న ముఫ్ఫై సంవత్సరాల్లో నెలకు దాదాపు పదిలక్షల మంది ప్రజలు కార్మికవర్గంలో భాగమవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా రెండంచెల ఆర్థిక వ్యవస్థను శాశ్వతపరుచుకునే క్రమంలో ఉంది అని ఇండియాస్‌ లాంగ్‌ రోడ్‌ పుస్తక రచయిత డాక్టర్‌ జోషి చెబుతున్నారు. కార్మిక శక్తిని అసంబద్ధంగా పంపిణీ చేయడం వల్లనే నిరుద్యోగ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. ఎక్కువ మంది కార్మికులు అవసరమైన రంగాల్లో ఉపాధి మందకొడిగా సాగుతుంటే, తక్కువ మంది కార్మికులు ఉత్పత్తి చేయగలిగిన చోట పెద్దమొత్తంలో పనిచేస్తున్నారు. ఈ కారణాలతో తక్కువ జీతాలతో,ఎటువంటి ప్రమాణాలు లేని పరిశ్రమల్లో పనిచేయాల్సి వస్తోంది.
భారత్‌ ఉపాధిని సృష్టించే అవకాశాన్ని కోల్పోయిందా
ఉపాధిని సృష్టించడం కోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే గార్మెంట్స్‌, లెదర్‌ మొదలైన పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. లైసెన్స్‌లేని కారణాలను చూపి కబేళాలను మూసివేయడం, గోవధను నియంత్రించడం వంటి నిర్ణయాల కారణంగా ఇండియాలో లెదర్‌ ఎగుమతులు తగ్గిపోయాయి.తక్కువ ధర కలిగిన చిన్నచిన్న బొమ్మలు,నేత వస్తువుల తయారీ లాంటి పరిశ్రమల విషయంలో భారతదేశం,తన వైఫల్యాలను ఇంకా కొనసాగిస్తూనేవుందని మోర్గాన్‌ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఛీఫ్‌ గ్లోబల్‌ స్ట్రాటజిస్ట్‌ రుచిన శర్మ అన్నారు. చైనా మార్కెట్‌పై ఇండియా ఆధారపడ్డానికి, ఇండియాలో నిరుద్యోగం పెరగడానికీ ఇదే ప్రధాన కారణం కావచ్చు అని కూడా రుచిర్‌ శర్మ అభిప్రాయపడ్డారు.బహుశాఉద్యోగాల కల్పన విషయంలో భారత్‌ తనఅవకాశాలను ఎప్పుడో వదిలేసిందేమో? – ఎన్‌.వి.సోమేశ్వరరావు