భానుడు ప్ర‌తాపం..మండుతున్న ఎండ‌లు

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూరీడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా చాలామంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమిత మవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. – సైమన్‌ గునపర్తి
భానుడు నిప్పులు కురిపిస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకసారి పలుచోట్ల జల్లుల పడి కాస్త ఉపశమనం ఇచ్చినా మళ్లీ బాదుడు కొన సాగుతూనే ఉన్నది. మే నెలంతా ఈ మండే ఎండలు తప్పవని, ఆతర్వాత కాస్త మళ్లీ జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటొచ్చని పేర్కొంది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయించిన గంటల వ్యవధిలోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం కాకముందే మాడు పగిలిపోయే నిప్పులు కురిపి స్తున్నాడు. వీటికితోడు వడగాలులు కూడా వీయడంతో దప్పికలు,నీరసం,డీహైడ్రేషన్‌లు వెంటనే చుట్టుముడుతున్నాయి. అందుకే అవసరం ఉంటే తప్పితే గడప బయట కాలు పెట్టొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు,చిన్నారులు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తాజాగా,వాతావరణ శాఖ మరో హాట్‌ న్యూస్‌ చెప్పింది. ఈఏడాది టెంపరేచర్‌లు రికార్డులు బ్రేక్‌ చేస్తాయని ఐఎండీ అంచనాలు వేసింది. ఈఏడాది వేసవి తాపం 50 డిగ్రీల సెల్సియస్‌లు దాటొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగాయని,పలు ప్రాంతాల్లో 45డిగ్రీల సెల్సి యస్‌లు క్రాస్‌ చేసి టెంపరేచర్‌లు రికార్డు అవుతున్నాయని ఐఎండీ తెలిపింది. వడగా లులు కూడా భయంకరంగా వీస్తున్నాయి. సాధారణంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటీయరాలజీ డాక్టర్‌ ఎం మోహపాత్రా తెలిపారు. కాబట్టి,పశ్చిమ రాజస్తాన్‌లోఉష్ణోగ్ర తలు 50డిగ్రీల సెల్సి యస్‌లను తాకొచ్చని వివరించారు. ఓప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మోహపాత్రా మాట్లాడుతూ,పశ్చిమ మధ్య భారతం, వాయవ్య భారతంలోనూ సాధారణానికి మించి టెంప రేచర్‌లు రికార్డు అవుతాయని తెలిపారు.ఉత్తర, ఈశాన్య భారతంలోనూ సాధారణానికి మించి వేడిగా రోజులు గడవచ్చని వివరించారు. మన దేశంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46డిగ్రీల సెల్సియస్‌ మార్క్‌ను దాటేశాయి. కాగా,ఏప్రిల్‌ నెలలో యూపీలో అలహాబాద్‌ (46.8డిగ్రీలు), రaాన్సీ(46.2డిగ్రీలు), లక్నో (45.1డిగ్రీలు)లు ఆల్‌ టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితోపాటు హర్యానాలోని గురుగ్రామ్‌ (45.9 డిగ్రీలు), మధ్యప్రదేశ్‌ సత్నా (45.3 డిగ్రీలు)లు ఆల్‌ టైం హై టెంపరేచర్‌లు ఈ నెలలో రికార్డ్‌ చేశాయి. ఇక మే నెలలో అంచనాలు చూస్తే.. మే నెలలో దేశంలో చాలాచోట్ల సాధారణం నుంచి సాధారణాని కంటే గరిష్టంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.దేశాన్ని భారీ ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రతలు122ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసి నట్టు భారత వాతావరణశాఖ వెల్లడిరచింది. మే నెలలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని పేర్కొంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ నెల ఉష్ణోగ్రతలు రికార్డుల మోత మోగించాయి. వాయువ్య భారతం,మధ్య భారతంలో ఉష్ణోగ్ర తలు సగటున 35.90డిగ్రీలు,37.78డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందని, ఫలి తంగా దేశంలో పవర్‌ కట్‌లు పెరిగాయని పేర్కొంది. దేశరాజధాని ఢల్లీిలోఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని,72ఏళ్ల రికార్డు..దేశంలో హీట్‌వేవ్‌ పరిస్థితులపై యూఎన్‌ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసిందని వివరించింది.
మునుపెన్నడూ లేనంత వేడిగాలు
మానవుని కార్యకలాపాలవల్ల ఏర్పడిన గ్లోబల్‌ వార్మింగ్‌తో ప్రాణహాని సంభవిస్తోంది. ఇది ఇప్పటికే రుజువైన సత్యం కూడా. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షులు, జంతువుల మనుగడ కష్టతరమౌతోంది. దీంతో యావత్‌ జీవరాశి దెబ్బతినడంతో పాటు… మనుషుల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే.. మన దేశంలో మే నెల రాకముందే అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల కంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇప్పటికే దేశరాజధాని ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ అమల్లో ఉంది. ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల.. ప్రపంచంలోని మిగతా దేశాలకంటే.. భారతదేశమే మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఇక భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 4.5-6.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుందని అంచనా వేసింది. బహుశా మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా వేడిగాలులు వీస్తాయని ఐఎండి పేర్కొంది.గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢల్లీి ఉష్ణోగ్ర తలను పరిశీలిస్తే..1981-2010ల మధ్య గరిష్టంగా 39.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయితే…ఈ సంవత్సరం ఏప్రిల్‌ 28 నుండే.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రోజువారీగా సగటున 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతున్నదని, ఇలా కొద్దిరోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని ఐఎండి తెలిపింది. అందుకే ఢల్లీిలో ఎల్లో అలర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక 1979 నుండి 2017 వరకు సేకరించిన వాతావారణ సమాచారం మేరకు..’తూర్పు తీర ప్రాంత భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికే మధ్య అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య, వాయువ్య-ఆగేయ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 2010 కంటే.. 2020 తర్వాతి సంవత్సరాల్లో ఉష్ణోగ్ర తల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసు కుంటు న్నాయని స్పష్టమవుతున్నది. ఇది భవిష్యత్‌ లో మరింత పెరిగే అవకాశముందని పరిశోధ కులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు సంభవిస్తోంది. పనికి వెళ్తే గాని పూట గడవని పేదలు ఎండల్లో కూడా బయటకు వెళ్లడం వల్ల.. ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజల ప్రాణాల్ని కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మే నెలలో 50డిగ్రీలు…!
వేసవి కాలంలో సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈసారి మార్చి నుంచే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఏప్రిల్‌లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు..మే నెలంటనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ‘‘వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు హిమాచల్‌, పంజాబ్‌, హైర్యానా,రాజస్థాన్గుజరాత్‌-మేలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.‘‘దేశంలో 2022 మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది’’ అని మోహపాత్ర చెప్పారు.అయితే, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర చెప్పారు.పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో 50డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోద వడాన్ని కూడా మోహపాత్ర తోసిపుచ్చలేదు. ఎందుకింత తీవ్రంగా ఉన్నాయి?
ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణం కాదు.1901 నుంచి చూస్తే, 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడో సారి.ఈ ఏడాది మార్చిలో భారత్‌లో 26 రోజులపాటు వేడిగాలులు వీచాయి. తూర్పు, మధ్య,ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్‌’ జారీ చేసింది.
కారణం ఏంటి?
ఈ రెండు నెలల్లో వానలు,ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రత లకు ప్రధాన కారణం.గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4మిల్లీ మీటర్లుఉండగా, ఈఏడాది కేవలం 8.9మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ,మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుపానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ. సాధార ణంగా,వడగాలులు దశ ఏప్రిల్‌ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరు కుంటుంది. ఈఏడాది మార్చి 11 నుంచే హీట్‌ వేవ్‌ కనిపించింది. ఇది హోలీ పండు గకు ముందే కనిపించింది.మరోవైపు, వాతా వరణ శాస్త్రవేత్తలు మార్చి, ఏప్రిల్‌లో వీచే బలమైన వేడి గాలులు అసాధారణంగా ఉంటా యని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే, వాతావరణ మార్పుల కారణంగా ఈవేడి గాలులు వాతా వరణంలో సాధారణంగా మారిపోయే అవకాశ ముందని అంటున్నారు.వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్‌ ఉండ వచ్చని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ఇనిస్టి ట్యూట్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడ రిక్‌ ఒట్టో చేసిన పరిశోధన చెబుతోంది. ‘‘ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవ్వడానికంటే ముందు, భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసిన లాంటి ఉష్ణోగ్రతలను 50ఏళ్ల క్రితమే అనుభవించాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది’’ అని మరియం జకారియా అన్నారు. ఏది ఏమైనప్పటికీ, వాతావరణం మరియు భూ వినియోగ మార్పు గతంలో భౌగోళికంగా-వివిక్త జాతుల వన్యప్రాణుల మధ్య వైరల్‌ షేరింగ్‌ కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది3,4. కొన్ని సందర్భాల్లో, ఇది జూనోటిక్‌ స్పిల్‌ఓవర్‌ను సులభతరం చేస్తుంది-ప్రపంచ పర్యావరణ మార్పు మరియు వ్యాధి ఆవిర్భావం మధ్య యాంత్రిక లింక్‌. ఇక్కడ, మేము భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ యొక్క సంభావ్య హాట్‌స్పాట్‌లను అనుకరిస్తాము, క్షీరద-వైరస్‌ నెట్‌వర్క్‌ యొక్క ఫైలోజియోగ్రాఫిక్‌ మోడల్‌ని ఉపయోగిస్తాము మరియు 2070 సంవత్సరానికి వాతావరణ మార్పు మరియు భూ వినియోగ దృశ్యాలలో 3,139 క్షీరద జాతుల కోసం భౌగోళిక శ్రేణిని మార్చాము. ఎత్తైన ప్రదేశాలలో, జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో మరియు ఆసియా మరియు ఆఫ్రికాలో మానవ జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొత్త కలయికలలో, వాటి వైరస్‌ల యొక్క నవల క్రాస్‌-స్పీసీస్‌ ట్రాన్స్‌మిషన్‌ను 4,000 సార్లు అంచనా వేస్తుంది. వాటి ప్రత్యేకమైన చెదరగొట్టే సామర్థ్యం కారణంగా,గబ్బిలాలు నవల వైరల్‌ షేరిం గ్‌లో ఎక్కువ భాగం,మానవులలో భవిష్య త్తులో ఆవిర్భావానికి దోహదపడే పరిణామ మా ర్గాల్లో వైరస్‌లను పంచుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా,ఈ పర్యావ రణ పరివర్తన ఇప్పటికే జరుగు తోందని మేము కనుగొన్నాము శతాబ్దంలో 2ళీజకంటే తక్కువ వేడెక్కడం భవిష్యత్తులో వైరల్‌ షేరింగ్‌ను తగ్గించదు. జాతుల శ్రేణి మార్పులను ట్రాక్‌ చేసే జీవవైవిధ్య సర్వేలతో వైరల్‌ నిఘా మరియు ఆవిష్కరణ ప్రయత్నాలను జత చేయాల్సిన తక్షణ అవస రాన్ని మాపరిశో ధనలు హైలైట్‌ చేస్తాయి, ప్రత్యే కించి అత్యధిక జూనోస్‌లను కలిగి ఉన్న ఉష్ణ మండల ప్రాంతాలలో వేగవంతమైన వేడెక్కడం జరుగుతోంది.
వేడి గాలుల ప్రభావం
ఈఅధిక ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా విద్యు త్‌ వినియోగం అకస్మాత్తుగా,వేగంగా పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల లో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.దీంతో బొగ్గు అవసరం విపరీ తంగా పెరిగింది. డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంవల్ల బొగ్గు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. బొగ్గు కొరత కార ణంగా,రాబోయే రోజుల్లో విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడ వచ్చని దిల్లీ ప్రభు త్వం ప్రకటించింది. ఇదే జరిగితే మెట్రో రైళ్లు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన సేవలపై కూడా ప్రభావం చూపు తుందనేది ఆందోళన కలిగించే అంశం.‘‘వేడి పెరిగినప్పుడల్లా బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం,ఆ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి పెరగకపోవడం,డిమాండ్‌-సరఫరా మధ్య అంతరం పెరగడం సహజం’’ అని ఎన్‌టీపీసీ మాజీ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ ముఖియా అన్నారు.సుదీర్ఘ వేడిగాలులు,విద్యుత్‌ సరఫరా అంతరాయాలు ప్రధానంగా పారిశ్రా మిక ఉత్పత్తి, పంటలపైనా ప్రభావం చూపి స్తాయి.వేడిగాలుల కారణంగా ఉత్పన్నమవు తున్న విద్యుత్‌ సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భారత్‌లో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి కూడా చేసుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు ధరలు కూడా పెరిగాయి. బొగ్గుకు డిమాండ్‌ కూడా పెరిగింది.వాతావరణపరంగా భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే కొన్ని వారాలు పెద్ద సవాలుగా మారవచ్చు.‘‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా బహిరంగ శీతలీ కరణ ప్రాంతాలు,తక్కువ విద్యుత్‌ కోతలు, స్వచ్ఛమైన తాగునీరు,కార్మికుల పని వేళల్లో మార్పు ఉండేలా చూసుకోవాలి. మండుతున్న వేడిలో పనిచేసే బడుగు బలహీన వర్గాల కోసం మనం ఈ చర్యలు తీసుకోవాలి’’ అని గుజరాత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ అభియంత్‌ తివారీ చెప్పారు.
వేడిని ఎలా ఎదుర్కోవాలి
ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలి: చాలా మందికి దీని గురించి తెలుసు. శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే, హీట్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగు తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, తక్షణ వైద్య సహాయం అవసరం. వైద్య సహాయం వెంటనే అందని పరిస్థితుల్లో ఒక్కోసారి అపస్మారక స్థితికి దారి తీసి అవయ వాలకు కూడా హాని కలగొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు.చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రమాద సంకేతాలే. ఆహారం,నీరు : శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. సూర్యరశ్మికి దూరంగా: మీరు ఎంత ఎక్కువ ఇంటి లోపల ఉండగలిగితే అంత మంచిది. పగటిపూట వీలైతే, బయటకు వెళ్లవద్దు. వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దుస్తులు: మీరు బయటకు వెళ్లినప్పుడు మిమ్మల్ని మీరు కప్పి ఉంచుకోండి,కానీ మీరు కాటన్‌ దుస్తులు ధరించాలని గుర్తు పెట్టుకోండి. తలపై టోపీ పెట్టుకోవడం మంచిది.చల్లదనం: ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడటంతో పాటు చల్లని నీటితో స్నానం చేస్తూ ఉండాలి.