కౌలు రైతుల క‌ష్టాలు

తగినంత భూమి లేని రైతులు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతులే పంటలు చేతికి రాక, వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. బ్యాంకుల సాయం అందక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులకు రుణాలు ఇప్పించి ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పడమే కానీ ఆచరణలో లేదు. భూమిని కౌలుకు తీసు కొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన కౌలుదారులు రైతుగా పొందవలసిన ఏ మేలు అందుకోలేక పోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు,పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో, రికార్డు లలో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతులూ నష్టపోతున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. -గునపర్తి సైమన్‌
భారతదేశంలో 60శాతం పైగా జనాభాకు ప్రధాన ఆధారమైన వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. గత మూడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఆర్థిక సంస్కర ణలు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఊబిలోకి నెట్టాయి. అనేక రాష్ట్రాలలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవటం, సబ్సిడీలలో కోత, గిట్టుబాటు ధర లభించక పోవటం, నీటిపారుదల రంగంపై నిర్లక్ష్యం మొదలగు అంశాల న్నీ సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. ఈ రెండు దశాబ్దాలలో విస్తృతంగా పెరిగిన కౌలురైతాంగం కూడా ఎటువంటి రక్షణ లు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొం టున్నది. స్వంత భూమి కలిగిన రైతులే సేద్యం లాభసాటిగా లేక సంక్షోభం ఎదుర్కొం టుంటే, కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలలో సుమారు 35లక్షల మంది కౌలు రైతులు ఉం టారని అంచనా. పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు వంటి జిల్లాలలో 70శాతం సాగు భూమిని కౌలురైతులే పండిస్తున్నారు. భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపు లేకపోవటం వలన సాగుదార్లుగా పొందవలసిన ఏ మేలు అందుకో లేకపోతు న్నారు. కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట మీదే ఇప్పటికీ జరుగుతున్నాయి. కౌలు రైతులు భూమి సాగుచేస్తున్నా పంట రుణాలు, రైతు బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట నష్ట పరిహారం-ఇలా రైతులకు అందే ఏ సహాయం వారికి అందడం లేదు. కౌలు కాగితమో,రికార్డులలో పేరో ఉం టేనే ఏమేలైనా వారికి దక్కేది. నకిలీ విత్తనాలు, ప్రకృతి బీభత్సాలు, గిట్టుబాటు ధర లేకపోవడం మొదలైన అంశాల వలన కౌలు రైతుల్షు నష్టపో తున్నారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్న వారికయ్యే సగటు ఖర్చులతో పోల్చితే కౌలు దారులకు రెట్టింపు పెట్టుబడి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో, కొన్ని పంటలకు భూయజమానికి కౌలు ముందే చెల్లించవలసి ఉంటుంది.
కౌలురైతు – సామాజిక ఆర్థిక కారణం
సాగునీటి పారుదల ప్రాంతాలలోని పెద్ద రైతులు 1970,80దశకాలలో వ్యవసాయ రంగంలో హరిత విప్లవం వలన లబ్ధి పొంది ఆపై అధిక లాభసాటైన వ్యవసాయేతర రంగా లకు వలసపోయారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అనేక మంది రైతులు సాగును వదిలి ఇతర రంగాలకు మళ్లి, భూములను కౌలుకు ఇచ్చారు. రైతుబిడ్డలు చదువుకుని తమ గ్రామంలో కాకుండా విదేశాలలో,పెద్దపెద్ద నగరాలలో స్ధిరపడి తమ భూములు కౌలుకు ఇస్తున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు తదితర కారణాల వలన కొంతమంది సంప న్నులు స్థిరాస్తులుగా భూములు కొనుగోలు చేసి కౌలుకిస్తున్నారు. కౌలు రైతులలో 80శాతం వెనుకబడిన తరగతులు,దళిత కుటుంబాలకు చెందిన వారే.ఈసామాజిక కోణాన్ని విశాల దృక్ప థంతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, అధికారులు అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో చిన్న, సన్నకార రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, పేదలు వ్యవసాయమే దిక్కుగా ఈ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని వదిలేస్తున్న భూ యాజమానుల నుండి సొంత భూమిలేని రైతులు, కూలీలు కూడా పొలాలను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నారు. పట్టా భూము లున్న రైతులకన్నా కౌలుదారుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. మొత్తం సాగుభూమిలో 50 శాతంపైగా కౌలుదారులే సాగు చేస్తున్నారని వ్యవ సాయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అనేక అధ్యయ నాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే కౌలు రైతులకు ఎటువంటి హక్కులు లేకపోవడంవలన వీరికి బ్యాంకు రుణాలు లభించలేదు. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాలు చేయవలసిన అవసరం ఏర్పడిరది.
2011-అధీకృత సాగుదారుల చట్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం కౌలు రైతుల కోసం 2011లో అధీకృత సాగుదారుల చట్టం ఆమోదించి, అమలు చేసింది. ఈచట్టం ప్రకారం కౌలు రైతులకు ఎల్‌ఇసి కార్డులు ఇచ్చి, లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చే అవకాశం బ్యాంకర్లకు ఉన్నది. ఎల్‌ఇసి కార్డు ఉన్నప్పుడే రుణం పొందడానికి,ఇన్‌పుట్‌ సబ్సిడీ,పంటల బీమా నష్ట పరిహారం పొందడానికి అర్హులు అవుతారు. కాని ఆచరణలో రుణ అర్హత కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి.ఈచట్టం ద్వారా 2011లో5లక్షల మందికి,2012లో నాలుగు లక్షల మందికి, 2016లో4లక్షల మందికి, 2018-19లో ఆరు లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వీరిలో40శాతం మందికి మాత్రమే బ్యాంక్‌ల ద్వారా రుణాలు లభించాయి.ఈరుణాలు కూడా ఎక్కువ భాగం జాయింట్‌ లైబిలిటీ గ్రూపుల ద్వారా ఇచ్చారు. ఎక్కువ సందర్భాలలో భూ యజ మాని అప్పటికే ఆ భూమిపై రుణం పొంది ఉండడం వలన బ్యాంక్‌ అధికారులు కౌలు రైతుకు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.ఆరుణాలు కూడా ఎకరానికి సగటున 5 వేలకు మించి ఇవ్వలేదు. చట్టం అమలుపై చిత్తశుద్ధి లోపించటం,రాజకీ య సంకల్పం లేకపోవడం, బ్యాంకర్ల భయాలు మొదలగు అంశాల వలన 2011-అధీకృత సాగుదారుల చట్టం తగిన ఫలితాలు ఇవ్వలేదు.
2019-కౌలు రైతుల చట్టం
వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి 2019-కౌలు రైతుల చట్టం చేసింది. ఈచట్టం వలన కౌలు రైతు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. భూయజమాని సంతకం తప్పనిసరి చేస్తూ చట్టంలో నిబంధనలు విధించటంతో సమస్య జటిలమైంది. భూ యజమానులు సంతకం పెట్టకపోవడంతో అధికారులు సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు 35లక్షల మంది కౌలు రైతులుఉండగా,ఈ సంవత్సరం 5,74,000 కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటకీ రాష్ట్రం మొత్తం 3 లక్షల కార్డులు మాత్రమే ఇచ్చారు. ఉదాహరణకు గుంటూరు విడిపోయిన జిల్లాలో లక్షమందికి పైగా కౌలు రైతులు ఉండగా 37,228 మంది రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 12,418 కార్డులు మంజూరు చేయడం జరిగింది. రైతు భరోసాలో కూడా కౌలు రైతు లకు అన్యాయం జరుగుతున్నది. భూమిలేని ఒ.సికౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వడం లేదు.ఈ సంవత్సరం కార్డు లేని కౌలు రైతులకు ‘ఇ-క్రాపింగ్‌’ కూడా చేయడం లేదు. దీని వలన కౌలు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. సిసిఆర్‌సి కార్డులను భూ యజ మానులు తమ బంధువులకు, స్నేహితులకు, అను చరులకు ఇప్పిస్తున్నారు. వాస్తవంగా కౌలు చేస్తున్న వారిలో కొద్ది మందికే సిసిఆర్‌సి కార్డులు ఇస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన కౌలు దారుల రక్షణ చట్టం ఘోరంగా విఫలమైంది. చట్టంలో అనేక నిబంధనలు మార్చాలి.
కౌలురైతులు – వివిధ కమిటీలు

  1. మారిన పరిస్థితులలో భూ యాజమాన్య హక్కులకు భంగం వాటిల్లకుండా భూకమతాల గరిష్ట పరిమితికి లోబడి కౌలుదారీ చట్టాన్ని చేయాలని, కౌలు రైతులకు బ్యాంక్‌ రుణాలతో సహా అన్ని సౌకర్యాలు అందించాలని…2016లో ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిళిత, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం వేసిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ చెప్పింది.
  2. దేశంలో వ్యవసాయ భూమి కౌలులో సమత్వం,సమర్థత లక్ష్యంగా కౌలు చట్టాలు రూపొందించాలని…నీతి ఆయోగ్‌ ప్రొఫెసర్‌ టి.హక్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ…అన్ని రాష్ట్రాలకు సూచించింది. వీరి సూచనల ప్రకారం కౌలు వలన భూమిపై యాజమాన్య హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కౌలుదారు బ్యాంక్‌ రుణం, ఇతర రాయితీలు పొందవచ్చు.
  3. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయంపై నియమించిన ప్రొఫెసర్‌ జయతీ ఘోష్‌ కమిషన్‌ కౌలురైతుల రక్షణకు అనేక సూచనలు చేసింది. ప్రభుత్వం వాటిని అధ్యయనం చేయాలి.
  4. కౌలురైతుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరపాలి.
    రాష్ట్రంలో ఏం జరగాలి?
    ఆంధ్రప్రదేశ్‌లో సాగు 70-80శాతం కౌలురైతులపై ఆధారపడి ఉన్నది.కౌలు రైతు లకు ప్రభుత్వం న్యాయం చేయటం లేదు. గుంటూరు జిల్లాలో గత నాలుగు సంవత్సరాలలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులలో 90 శాతం కౌలురైతులే. కౌలు రైతులకు న్యాయం జరగాలంటే దిగువ అంశాలను పరిశీలించాలి.ఈ నేపథ్యంలో భూ యజమానులు కౌలుపెంచి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జిఓ 425 తెచ్చి పేదలు సాగు చేస్తున్న దేవాలయ భూములకు బహిరంగవేలం పెట్టి ఎకరాకు రూ.30 వేల నుండి 60 వేలు పెంచారని పేర్కొన్నారు. దేవుని పేరు చెప్పి నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. అనాలోచితంగా తీసుకొచ్చిన నూతన కౌలుచట్టం సబ్సిడీ పథకాలు పొందడానికి అవకాశం లేకుండా చేసిందని, సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులే పంట రుణాలు పొందుతున్నారని వివరించారు. కౌలు రైతులు ఎనిమిది లక్షల మంది ఉంటే రైతు భరోసా 50 వేల మందికి మించి ఇవ్వడం లేదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ పథకాలూ కౌలు రైతులకు వర్తింపజేయడం లేదని, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు ధరలు 30 నుండి 50 శాతం పెరిగాయని తెలిపారు. ట్రాక్టర్‌ డీజిల్‌ ధరలు పెరగడంతో అద్దెలు పెరిగి సాగు ఖర్చులు గతం కంటే ఈ ఏడాది రూ.ఐదువేల నుండి రూ.ఏడువేలు అదనంగా పెరిగిందని వివరించారు. రైతులకు మాత్రం పంటలకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదని వివరించారు. రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటికే ముందుగా కౌలు చెల్లించిన వారికి వచ్చే ఏడాదికి జమచేసుకునే విధంగా చూడాలని కోరారు.
    రుణాలకు బ్యాంకుల విముఖత
    కౌలు రైతులు కష్టాల కడలిలో ఎదురీదు తున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, ప్రభు త్వాల సాయం అందక పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. వడ్డీలకు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు. కష్టాలకోర్చి పంటలు సాగు చేసినా చివరి దశలో ప్రకృతి కన్నెర్ర చేయడం, మద్దతు ధర లభించకపోవడం, ధాన్యం విక్ర యాల్లో ఇబ్బందులు ఎదురవడం వంటివి కౌలు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. రైతుబంధు, పీఎం కిసాన్‌ పథకాలు పట్టా దారులకే వరంగా మారాయి.కౌలు ధరలు కూడా పట్టాదారు రైతులకే లాభాలు చేకూరు స్తున్నాయి. భూ తల్లిని నమ్ముకున్న కౌలు రైతులు మాత్రం ఆర్థిక భరోసా లేక దిగుబడిపై నమ్మ కంలేక ప్రకృతిపై భారం వేసి సాగుబడి చేస్తు న్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 60 వేల మందికిపైగా కౌలు రైతులు ఉపాధి పొందుతున్నారు. కౌలురైతులను ప్రభుత్వ పథకాలకు పరిగణలోకి తీసుకోవడం లేదు. పంట పెట్టుబడి రుణాలు కూడా అందని పరిస్థితి. దీంతో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులను అధికారికంగా గుర్తిస్తామన్న హామీ కూడా నేరవేరడం లేదు. కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు అందజేస్తే బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టాదారులు, ధనిక రైతులు నగరాల్లో ఉంటూ భూములను కౌలుకు ఇస్తున్నారు. కనీసం కౌలు ధరలు కూడా తగ్గించడం లేదు. ఏటా పెంచుతూనే ఉన్నారు. భూమి, నీటి వసతిని బట్టి కౌలు డిమాండ్‌ పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం కౌలు విధానం కూడా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో భూములను కౌలుకు తీసుకుంటున్నారు. కౌలు ధరలతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు వరికోతలు, పత్తి ఏరడం, కలుపు తీయడం వంటి సమయాల్లో కూలీల కొరత అదనపు భారంగా మారింది. పంట చేతికి వచ్చే సమయంలో నష్టాన్ని చవిచూసే రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
    ఏడాదంతా కష్టపడి వ్యవసాయం చేసినా కౌలు రైతులకు నోటికి.. చేతికి దూరం తగ్గడం లేదు. కౌలుతో సహా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత వెచ్చించినా ప్రకృతి విపత్తులతో పంట చేతికి రాని సందర్భాలే ఎక్కువ. దీంతో భారీగా కౌలు రైతులు నష్టపోతున్నారు. వీరికి సీసీఆర్‌ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌) కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసంగా అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది కౌలు రైతులు గుర్తింపునకు నోచుకోవడం లేదు. పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడం, నష్ట పరిహారం లేదా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, పంటల రుణం ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్‌ కార్డు ఉండాల్సిందే. వీటన్నిటికి ఈ కార్డు ఉంటేనే కౌలు రైతులకు అర్హత ఉంటుంది. కానీ ఉన్నతాధికారులు జిల్లావ్యాప్తంగా కౌలు రైతులందరికీ సీసీఆర్‌ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకోవడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైందని… ఈసారైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే తమకు సీపీఆర్‌ కార్డులు అందుతాయని కౌలు రైతులు అంటున్నారు.
    సకాలంలో అందేనా?
    జిల్లాలో ఖరీఫ్‌ సాగు పనులు మొదలయ్యాయి. సొంత భూమి ఉన్న రైతులు ప్రభుత్వం అందించే అరకొర రాయితీ విత్తనాలకు తోడు, ఇప్పటికే వారి ఖాతాలో జమ అయిన రైతు భరోసా చేదోడుతో సాగుకు సిద్ధమవుతున్నారు. కానీ కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరం. వారికి ఏ ఆసరా లేదు. ప్రభుత్వం ఏటా వారికి అందించే సీసీఆర్‌సీ పత్రాలు ఇప్పటికీ అందలేదు. గతంలో కార్డులు ఉన్న రైతులు కూడా మళ్లీ రెన్యువల్‌ చేయించుకుంటేనే మనుగడలోకి వస్తుంది. భూ యజమాని అనుమతితో కార్డును రెన్యువల్‌ చేయించు కోవాలి. ఈ ప్రక్రియ మొత్తం మే నెలాఖరు వరకు ముగించి ఖరీఫ్‌ ప్రారంభమయ్యే జూన్‌ నెల మొదటి రెండు వారాల్లో రైతులకు కార్డులు ఇవ్వాలి. కానీ జిల్లా వ్యవసాయ శాఖ ఈ పనిని ఇప్పుడు మొదలుపెట్టింది. సంబంధిత పత్రా లను కౌలు రైతులు సమర్పిస్తే వీఆర్వో ఆమో దంతో కార్డులు కౌలు రైతులకు అందుతాయి. ఈ ప్రక్రియ అంతా జరిగి కార్డులు అందేసరికి జూన్‌ ముగిసిపోవడం ఖాయం. దీని వల్ల కౌలు రైతుల సాగుకు అవసరమైన రాయితీ విత్తనాలు, రైతు భరోసా సాయం కూడా అందదు. సొంత భూమి ఉన్న రైతులే ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం నానా అగచాట్లు పడుతోంటే సీసీఆర్‌ కార్డులు లేని కౌలు రైతుల కష్టాలు ఊహించవచ్చు.
    అవగాహన లేకపోవడమే..
    సీసీఆర్‌ కార్డులు అందరికీ అందకపోవడానికి కారణం భూ యజమానులకు వీటిపై అవగాహన లేకపోవడమే. కౌలుదారులకు న్యాయం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ముందు భూ యజమానులకు సీసీఆర్‌ కార్డులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. కౌలు రైతులకు ఈ కార్డు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ భూహక్కుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజెప్పాలి. ఈ కార్డు మనుగడలో ఉండేది కేవలం 11 నెలలే కాబట్టి తరువాత యజమాని కౌలుదారును మార్చుకున్నా లేక కౌలును రద్దు చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించాలి. కానీ క్షేత్ర స్థాయిలో వీటి మీద అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం అంతగా శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 10 శాతం మంది మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు పొందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే కౌలు రైతులకు మేలు జరుగుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు.
    ఏటికేడు తగ్గుతున్న కౌలు రైతులు..
    వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం దుర్భరంగా మారింది. దీని వల్ల కౌలు రైతుల సంఖ్య జిల్లాలో బాగా తగ్గిపోతోంది. నీటి సౌకర్యం బాగా ఉంటే ఎకరాకు వేలకు వేలు కౌలు కట్టాలి. తీరా ప్రకృతి విపత్తులతో నష్టం వచ్చినా కౌలు చెల్లించాల్సిందే! మార్కెట్‌లో ధర లేకపోయినా నష్టపోవాల్సిందే. ఈ బాధలు పడలేక చాలామంది కౌలు వ్యవసాయం చేయడానికి సాహసించడం లేదు.
    అంతంత మాత్రంగానే..
    జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 25 నుంచి 30 వేల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. వారిలో సీసీఆర్‌ కార్డులు చాలా కొద్ది మందికే ఉన్నాయి. గత ఏడాది ఉమ్మడి జిల్లాలోనే ఈ సంఖ్య 35 వేలు దాటలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కార్డుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో. సీసీఆర్‌ కౌలు రైతుల కష్టాలన్నింటినీ తీర్చే సంజీవని అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు మరోలా ఉన్నాయి. వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టపోతే అందించే బీమా…దిగుబడు లకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర అన్నింటికీ సీసీఆర్‌సీ లింకు తప్పనిసరి. గత ప్రభుత్వంలో ఈ మెలిక లేకపోవడంతో కౌలు రైతులకు కొన్ని ఫలాలు అందేవి. రైతు సంక్షేమమే తమ ధ్యేయ మని వల్లె వేసే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు, ప్రక్షాళనల వల్ల కనీ సంగా కూడా తమను మేలు జరగడం లేదని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు.

మానసిక ఒత్తిడిళ్లుల్లో ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల సమయమంతా ‘యాప్‌’లతోనే గడిచిపోతున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముఖ చిత్ర అటెండెన్స్‌ యాప్‌’ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యా యులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియోగించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్ర దేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండ లాల్లో ఇంటర్నెటట్‌ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యా యులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
ప్రముఖ తత్వవేత్త ఎపిక్యూరస్‌ ‘’విద్య మనిషి నుండి వేరు చేయలేని సంపద’’ అనిపేర్కొన్నా డు.‘’విద్య అనే వృక్షం వేళ్లు చేదుగాను,ఫలాలు తియ్యగాను ఉంటాయని’’ గ్రీక్‌ తత్వవేత్త అరి స్టాటిల్‌ చెప్పాడు. మనిషి తన మనుగడ కోసం ప్రకృతి శక్తులతో పోరాడే క్రమంలో పొందిన అనుభవ పూర్వకమైన జ్ఞానమే విద్య. మానవ సమాజం ఆవిర్భవించిన నాటి నుండి మాన వుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని, సాధించిన నైపుణ్యాలను తరువాత తరాలకు అందించ టానికి విద్య ద్వారా ప్రయత్నంచేస్తూనే ఉన్నాడు. మానవ సమాజం సామూహికంగా సంపా దించిన జ్ఞాన, అనుభవాలసారాన్ని అందించ టమే విద్యగా నిర్వచించవచ్చు.అటువంటి విద్య ప్రజలందరికి అందుబాటులో ఉండాలి. భారత రాజ్యాంగంలో 45వ నిబంధన ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఉచిత, నిర్బం ధ విద్య అందించాలి. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులలో 21-ఎ నిబంధన చేర్చి, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. 2010లో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా హక్కు చట్టం కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలో ఉండాలని చెప్పింది. కానీ, ప్రజలందరికి అందుబాటులో ఉండవలసిన విద్య భారత దేశంలో,ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చెందింది. ముఖ్యంగా 1991 లో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ-సరళీకరణ-ప్రపంచీకరణ విధానాల ప్రభావం విద్యారం గంపై పడి రెండు సమాంతర వ్యవస్థలు ఏర్ప డ్డాయి. పేద విద్యార్థులు, అణచివేతకు గురైన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా, ఆర్థిక సామాజిక స్తోమత కలిగిన వారి పిల్లలు ప్రైవేట్‌,కార్పొరేట్‌ పాఠశాలలో సంస్థలలో చదువుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పాఠ శాలల్లో 73 లక్షల మంది పిల్లలు చదువుతుం డగా వారిలో 40లక్షల మంది ప్రభుత్వ పాఠ శాలల్లో,33లక్షలమంది ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠ శాలల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 1,90,0 00 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశా లల్లో పనిచేస్తుండగా,1,20,000 మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. విద్యారంగంలో వచ్చిన మార్పులకు ఉపాధ్యాయులు కూడా తీవ్ర మైన ఒత్తిడికి గురవుతున్నారు.
ఉపాధ్యాయుడు -సృజనాత్మకత
ప్రాచీన కాలం నుండి ఇప్పటిదాకా విద్య నేర్పటంలో ఉపాధ్యాయుడు ప్రాధాన్యతగల సృజనాత్మక పాత్ర పోషిస్తు న్నాడు. విద్యార్థి సామాజికీకరణ చెందటంలో సామాజిక విలువ లు పెంపొందటంలో ఉపాధ్యాయుడే ముఖ్య పాత్ర కలిగి ఉంటా డు. ఉపాధ్యాయుడు ‘విద్యా ర్థి కేంద్రీకృత’ బోధన చేయడంతో పాటు విద్యార్థిలో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించాలి. తరగతి గదిలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యా యుడికి అవగాహన ఉండాలి. విద్యార్థులలో స్ఫూర్తిని కలిగిస్తూ విద్యార్థులకు లక్ష్యాలను నిర్దేశించాలి. ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచు కుంటూ, బోధన పరికరా లు, అవసరమైన టెక్నాలజీ వినియోగిం చుకో వాలి. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం,లౌకిక భావనలు, ప్రజాస్వామ్య ఆలోచనలు పెంపొం దించటానికి కృషి జరగాలి.
టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు
వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ, వర్చువల్‌ క్లాస్‌రూం విధానం ఉపాధ్యాయులకు ప్రత్యా మ్నాయంగా మారుతుందని కొంతమంది భావించారు.కాని టెక్నాలజీ ఉపాధ్యాయుడిగా సహాయకారిగా ఉపయోగపడుతుందిగాని, ప్రత్యామ్నాయం కాదని ఆచరణలో రుజువైంది. కరోనా వలన గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో ఉపయోగించిన ‘ఆన్‌లైన్‌’ టీచింగ్‌ విధానంతో విద్యార్థులలో విపరీతమైన ‘ప్రవర్తనా పరమైన’ ఇబ్బందులు తలెత్తాయి. తల్లిదండ్రులు ముక్తకంఠంతో ఆన్‌లైన్‌ విధానం కంటే ఉపాధ్యాయుల బోధనే అవసరమని అంగీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధృవీకరించాయి. అనేక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్‌ క్లాస్‌రూం’లు కూడా ఉపాధ్యా యుడు ఉపయోగిం చిన చోటే విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రపంచబ్యాంక్‌ నివేదికలో విద్యారంగంలో మానవ వనరుల కంటే టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నది. దీని అర్థం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటమే. ప్రభుత్వాలు ప్రపంచబ్యాంక్‌ విధానాలను అమలు చేస్తూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించటానికి భిన్నమైన పద్ధతులలో ప్రయత్నిస్తున్నాయి.
తీవ్ర ఒత్తిడి…
విద్యారంగంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంస్కరణల వలన ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. బోధన కంటే బోద óనేతర పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తు న్నది. ఉపాధ్యాయులు 14రకాల యాప్‌లు ఉప యోగించవలసిన పరిస్థితి ఏర్పడిరది. ఉపాధ్యా యుల సమయమంతా ‘యాప్‌’లతోనే గడిచిపో తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘ముఖచిత్ర అటెం డెన్స్‌ యాప్‌’ను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజన పనులతో ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. టెక్నాలజీ వినియో గించాలంటే ఇంటర్నెట్‌తో సహా సౌకర్యాలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో 670 మండలాలలో దాదాపు 400 మండలాల్లో ఇంటర్నెట్‌ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తులను చేయాలి.
3,4,5 తరగతుల తరలింపు
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను దగ్గరలోగల హైస్కూళ్లకు తరలించాలనే నిర్ణయం వివాదా స్పదమైనది. నిర్ణయాన్ని పేద తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాఠశాల విద్యా పరిరక్షణ కమిటీ శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అనంతపురం జిల్లా పెనుగొండ వరకు నిర్వహించిన బడి కోసం బస్సు యాత్ర కూడా ఈ ఆందోళనను గమనించింది. 3,4,5 తరగ తుల తరలింపు జాతీయ విద్యా హక్కు చట్టానికి పూర్తిగా విరుద్ధమైనది. దీని వలన బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, బాలికలు డ్రాపౌట్లు గా మారే ప్రమాదమున్నది. తరగతులు తరలించకుండా ప్రాథమిక పాఠశాలలను పటిష్టపరచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సంస్కరణల ద్వారా పాఠశాలల సంఖ్యను 45 వేల నుంచి15 వేలకు తగ్గించటానికి, 50 వేల ఉపాధ్యాయ పోస్టులు తగ్గించటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
ప్రైవేట్‌ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో దాదాపు16 వేల ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 1,20,000 వేల మంది ప్రైవేట్‌రంగ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.వీరిలో ఎక్కువ మంది అతి తక్కువ వేతనాలతో,ఉద్యోగ భద్రత లేకుండా, సామాజిక భద్రత లేకుండా పనిచేస్తున్నారు. కరోనా కాలంలో దాదాపు 15నెలలపాటు వీరికి వేతనాలు లేక కూలీలుగా మారవలసిన పరిస్థితి ఏర్పడిరది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేట్‌ ఉపాధ్యాయుల రక్షణకోసంచట్టం చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వని వారికి వేతన భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ సహాయం అందించాలి.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు
రాష్ట్రంలో 352 కస్తూరిబా విద్యాలయాలలో దాదాపు 4 వేల మంది కాంట్రాక్టు ఉపాధ్యా యులు, ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలలో 2 వేల మంది కాంట్రాక్టు, గెస్ట్‌ ఉపాధ్యాయులు గా, సాంఘిక సంక్షేమ-గిరిజన సంక్షేమ-బి.సి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేదు. తక్కువ వేతనాలతో పనిచేస్తు న్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 3,400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 1000కి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులను, అధ్యాపకులను క్రమబద్ధీకరించవలసిన అవస రమున్నది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి వాగ్దానం చేసిన విధంగా కాంట్రాక్టు ఉపా ధ్యాయులకు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం, గెస్ట్‌ ఉపా ధ్యాయులకు కూడా న్యాయం చేయాలి.
రాజ్యాంగ లక్ష్యాలు -విద్య
విద్యా రంగంలో మార్పులు,సంస్కరణలు రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చేవిగా అందరికీ విద్య అందించేవిగా ఉండాలి. కాని ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు విద్యా రంగాన్ని ‘మార్కెట్‌’ దిశగా తీసుకువెళుతున్నాయి. విద్య ద్వారా ‘సామాజిక మనుషులను’ కాకుండా ‘మార్కెట్‌ మనుషులను’ తయారుచేస్తున్నారు. మార్కెట్‌కు అవసరమైన కోర్సులు మాత్రమే ప్రవేశ పెడుతున్నారు. పాఠశాల స్థాయిలో కూడా మార్పులు, గ్రేడ్‌ పాయింట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరి ణామాల నేపథ్యంలో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యా యులను బోధనకే పరిమితం చేసి, వారి చేత సృజనాత్మకంగా బోధన చేయించే వాతావరణం నెలకొల్పాలి.- (కె.ఎస్‌.లక్ష్మణరావు)

భారత దేశంలో అమలు కానీ ఐక్య రాజ్య సమితి నియమాలు

ప్రపంచ వ్యాప్తంగా179 దేశాలలోని ఆదివాసీ ప్రజలు దట్టమైన అడవులు కొండ ప్రాంతాల్లో నది పరివాహక ప్రాంతాలలో అభివృద్ధికి దూరంగా విలక్షణమైన జీవనాన్ని అవలంబిస్తూ పకృతి పై ఆధారపడి, ప్రత్యేక సంస్కృతి సాంప్ర దాయాలు, భాష, వేషధారణ కలిగి38కోట్ల జనాభాతో7000 భాషలు మాట్లాడుతూ, 50 00 రకాల బిన్న సంస్కృతులు పాటిస్తున్నారు. భారతదేశం లో అధికారికంగా చూసినపుడు 2011జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభాలో ఆదివాసీల జనాభా 8.6శాతం కాగ అందులో10,42,81,034 జనాభాగల ఆది వాసీలు, 6,92,027 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల దట్టమైన అడవిప్రాంతంలో 26 రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో,188 ఆదివాసి జిల్లాలలో ఉన్నారు. దేశ విస్తీర్ణంలో 60శాతం అడవి ఆదివాసి ప్రాంతంలోనే ఉం డగా పకృతిలో మమేకమైన తెగలను భారత రాజ్యాంగంలో 705షెడ్యూల్‌ తెగలుగా గుర్తించింది, ఇందులో అత్యంత ఆట విక లక్షణాలు కలిగిన ప్రిమినిటివ్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పిటిజి)లు75 తెగలు కలిగి 27,68,322 జనాభా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో9రకాల ఆదిమతెగలు కోయ, గోండు, కొలం,పర్ధాన్‌,తోటి, నాయకపొడు, మన్నేవార్‌, కొలవార్‌, కొండ రెడ్డి, అంద్‌,చెంచు,గోతి కోయ, లాంటి ఆదిమ తెగలు గోదావరి పరివాహక ప్రాంతం ప్రాణహిత, కిన్నెరసాని,కృష్ణ నది లాంటి పరివాహక ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో నివాసం ఏర్పరుచు కొని,17352 చరపు కిలోమీటర్ల షెడ్యూల్‌ ఏరియా భూభాగంలో నివాసం ఉం టున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా,దేశ వ్యాప్తంగా,రాష్ట్ర వ్యాప్తంగా, ఆదిమ తెగల మనుగడ పై కొన్ని అంశాలను మి ముందు విశ్లేషణ చేయాలనేది ఈ వ్యాసం సారాంశం.
1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి(ఖచీూ) ఆధ్వర్యంలో ‘జెనీవా’లో ప్రపంచ వ్యాప్త ఆదిమ తెగల సమస్యలపై,26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్‌ గ్రూప్‌ల సమా వేశాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సమా వేశంలో 140దేశాల ప్రతినిదులు పాల్గొన్నారు. ఆదివాసీల గుర్తింపు కోసం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒకరోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి కమిటీ కోరగా,ఆదివాసుల సంరక్షణ, హక్కులు, చట్టాల రక్షణకు ఐక్య రాజ్య సమితి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ కమిటీ 1982నుండి1992 వరకు,పది సంవ్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్షేత్రపర్యటన చేసి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్య యనంచేసి,విశ్లేషించి,23 డిసెంబర్‌ 1994 నుండి 2004 వరకు ఆమధ్య కాలన్ని ఆదివాసీ అభివృద్ధి కాలంగా పరిగణించి,ఆగస్టు9వ తేది నీ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకిం చింది. ఆదివాసి తెగలలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువ జరుగుతున్నాయని మానవ హక్కుల రక్షణ కోసం హై కమిషన్‌ సెప్టెంబర్‌ 13,2007న జనరల్‌ అసెంబ్లీ ద్వారా ఐక్య రాజ్య సమితి ఒకడిక్లరేషన్‌ (ఖచీణRI) ప్రకటించింది.అందులో‘ఆర్టికల్‌ 45’లో ఆదిమ తెగల సంస్కృతి రక్షణ,సంస్కృతి రక్షణలో ఆది ఆదివాసీల అభిప్రాయాలను గౌరవించటం,తెగలభాష రక్షణ,విద్య వ్యవస్థలో ఆదివాసి భాష కూర్పు,విద్య అభివృధి లాంటివి చేర్చినారు.‘ఆర్టికల్‌ 46’లో ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాల్లో అభివృధి విషయంలోచేసే అన్ని నిర్ణయాలలో ఆదివాసీలను బాగా స్వామి చేయటం,అదే విధంగా బారిప్రాజెక్ట్‌ల మూ లంగా,ఖనిజ త్రవ్వకాల మూలంగా నిర్వాసి తులుగామారి,జీవన ఆధారం కోల్పోయిన ఆదివాసీలకు న్యాయమైన హక్కుగా నష్ట పరి హారం,రిహబిటేషన్‌ కల్పించి రక్షించటంతో పాటు, ములవాసిల పట్ల వివక్షతను చూపటం నీ నిషేధించింది,వారి యొక్క నిర్ణయం లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టడం నిషేధం, అభివృధిలో బాగంగావారి ఆర్థిక,సామాజిక, పరిస్థితులను వారి విభిన్నమైన జీవనశైలికి అను గుణంగా వ్యవహరించాలని ఈ డిక్లరేషన్‌ తెలి పింది. దీనితో పాటు2017లో ఆదివాసి పదం తోపాటు,‘ఇంటర్నేషనల్‌ ఇండిజినియస్‌ పీపిల్స్‌ డే’గా ప్రకటించింది. ఆదివాసి తెగల భాష రక్షణకు కూడా2022 నుండి 2032 కాలాన్ని ఆదిమ భాషల రక్షణకు అన్ని దేశాలకు నివేదిం చింది.2022 సంవత్సరాన్ని ఆదిమభాషల పరి రక్షణ దినోత్సవం గా ప్రకటించింది.పై తీర్మా నలపై148 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సంతకాలు చేసినవి,అందులో అమలు చేసిన దేశాలు కేవలం 60మాత్రమే. ఈ అమలు చేసిన 60దేశాల జాబితాలో భారతదేశం లేదు అంటే,ఈ దేశంకి ఆదివాసిల అభివృధిపట్ల ఎంతశ్రద్ధ ఉంది అర్థం చేసుకోవచ్చు.ఏసమా జానికి అయినబాష అనేది అత్యంతకీలకం. ప్రపంచవ్యాప్తంగాఉన్న 7000ఆదివాసీ తెగల సజీవభాషలలో,దాదాపు 3000భాషలు అంత రించిపోతున్న భాషలుగా పరిగణించబడ్డాయి. ఇప్పటి వరకు ఖచీజుూజూ ప్రపంచంలోని అంతరించిపోతున్న భాషల జాబితాలో అసుర్‌, బిర్వోర్‌,కొర్వాలను ఉంచింది,బిర్వోర్‌ను క్లిష్టంగా అంతరించిపోతున్న భాషగా వర్గీకరించారు. కేవలం 2000మంది మాత్రమే ఈభాష మాట్లా డుతారు.భారతదేశంలో ఐదు ఆదిమభాషలు అంతరించిపోతున్నాయి అని తెలిపింది. అందులో సిక్కింలోని మారిaభాష అత్యంత ప్రమాదకర భాష అనీ భాష నిపుణులు చెబు తున్నారు,‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండి యా’ నిర్వహించిన పరిశోధన ప్రకారం ప్రస్తుతం ‘‘మారిa’’ మాట్లాడే వ్యక్తులు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు, వారందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారుగా పేర్కొంది. అదేవిధంగా తూర్పు భారత దేశంలో ‘‘మహాలీ’’బాష,అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ‘‘కోరో’’,గుజరాత్‌లోని ‘‘ సిడి’’,అస్సాం లోని ‘‘దిమాస’’ భాషలు అంతరించిపోతున్నాయి అని తెలిపింది.ఖచీూ చెప్పినట్లుగా అత్యంత దారుణ పరిస్థితిలో ఈదేశంలో ఆదిమభాషల పరిస్థితిఉన్న కూడా భాషకు రక్షణ చర్యలు మాత్రం ప్రభుత్వాలు చేసే పరిస్థితులు కనిపిం చవు.ఐక్యరాజ్య సమితి నివేదించిన ఏఒక్క నియమాలను గౌరవించటం లేదు భారత దేశం,ఛత్తీస్గఢ్‌ రాష్ట్రంలో ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరిట,లక్షలాది ఆర్మీ క్యాంపులు ఏర్పాటు చేసి, పకృతి ఒడిలో జీవించే ఆదివాసీలను అడవిలోకి పశువుల్ని మేపటానికి వెళ్లిన,పకృతితో మమే కమైన పండుగలు జరిపే క్రమంలో,ఒకగూడెం నుండి ఇంకొక గూడెంకి సత్సంబంధాలు నెల కొల్పే క్రమంలో,ఎందరో సామాన్య ఆదివాసీల ను కాల్చి చంపిన ఘటనలు అనేకం.ఖనిజ త్రవ్వకాల పేరిట,టాటా,బిర్లా, ఆధానిలకు ఈ దేశ సంపదను అమ్మి వేస్తూ అడవితల్లిని, విధ్వంసంను అపమన్నదుకు అడవితల్లి నెల కోసం పోరాడినదుకు,అస్తిత్వంకోసం తిరగ బడి నందుకు,వేలాదిమంది ఆదివాసులపై అక్రమ కేసులు,ఊపాచట్టాలు,మహిళలపై అత్యాచా రాలు. సల్వా జుడుం లాంటి సంస్థలను నెల కొల్పి ఈ దేశ ములావాసులపై ఎటువంటి మారణ హోమం,లైంగిక హింస అడవిబిడ్డపై కొనసాగింది కళ్ళారా చూసాము. జంగల్‌ మహల్‌ పచింబెగాల్‌లో కానీ, కాంద మహల్‌ ఒరిస్సాలోగాని,నియంగిరి కొండలలోని బాక్సైట్‌ త్రవకంకానీ,జార్కండ్‌లో టాటా బిర్లా ఉక్కు కర్మాగారంగాని,ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పేరిట ముచిన 300గ్రామాల ఆదివాసి ప్రజల జలసమాధి కానీ,గుజరాత్‌ మధ్య ప్రదేశ్‌లో నర్మదనదిపై ఏర్పాటు చేసిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ క్రింద మునిగిన 1000గ్రామాల ఆది వాసీల ఆర్తనాదాలు కానీ, ఈదేశంలో ఆదిమ తెగలకు స్థానం లేదు వారికి బ్రతుకుకు విలువ లేదు. అసలు మనుషులుగానే చూడబడటం లేదు అనటానికి నిదర్శనం.వర్జీనియస్‌ కాక కమీ షన్‌ 2014’నివేదించిన ప్రకారం ఈదేశంలో 47శాతం ఆదివాసీలు నిర్వాసితులు అయ్యారని తెలిపింది,బారిప్రాజెక్ట్‌లు డ్యాంలు కట్టడం వలన, మైనింగ్‌ త్రవ్వకాలవలన,వైల్డ్‌ లైఫ్‌ శాంచరీ,పులుల అభయ అరణ్యాల వలన, పరి శ్రమల ఏర్పాటు వలన,స్వాతంత్య్రం వచ్చిన నుండి నేటి వరకు 21మిలియన్‌ ఆదివాసి ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పించలేదు. పైగా అసలు ఏమయ్యరో ఈప్రజలు అనేది కూడా స్పష్టత లేదు నేటి వరకు.పైగా ‘‘కేంద్ర పునరావాస చట్టం 2013’’లాంటివి ఉన్నా ఉపయోగం లేదు. ఇంకా దారిద్య్రపు రేఖకి దిగువన ఈదేశంలో 36శాతం ఆదివాసి ప్రజలు ఉన్నారు అందులో జార్ఖండ్‌ రాష్ట్రం 54.2శాతంకాగా, ఒరిస్సా 75.6శాతం అధిక స్థానంలో అత్యంత పేదరికంలో ఉంది కానీ ఈ దేశంలో అత్యధి కంగా మైనింగ్‌ కలిగిన రాష్ట్రాలు కూడా ఇవే కానీ ఆది ఆదివాసీలకు మాత్రం కడు పేదరికం వెంటాడుతుంది అనేది గ్రహించాలి. ప్రభుత్వం మైనింగ్‌ త్రవ్వకాలపై ఉన్న శ్రద్ధ ఆదివాసి కడుపు నింపటంలో లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు అనేది ఒక సహజ అంశంగా మారింది. భారత రాజ్యాం గం ఆదివాసీల రక్షణకు ఉన్న 5,6షెడ్యూల్‌ లను అందులోని సారాన్ని కూడా తొక్కి వేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆదివాసి ప్రాంతా ల్లోని నాన్‌ ట్రైబల్‌ వలసలను పూర్తిగా నిషేదం అని ఉన్న నేడు వలసలు అధికం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సొన్‌ భద్రలో జూలై 17,2018 న10 మంది ఆదివాసీలను ఇతర కులస్థులు నాన్‌ ట్రైబల్‌ క్రూరంగా ఊచకోత కోసిన,అందులో 3గురు మహిళలు ఉన్న ఇంత దురగతానీ ఏఒక్క రాజకీయపార్టీ,లేదా ప్రభు త్వం పట్టించు కోని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేకం. పార్లమెంట్‌ సమావేశం జరిగే సమయంలో ఈఘటన జరిగిన 47మంది ఆదివాసీలు ఎంపీలు ఈదేశంలో ఉన్న మాట్లాడని దుస్థితి వెలు ముద్దర రాజకీ యాలును ఈ దేశరాజకీయ పార్టీలు ప్రోత్సహి స్తున్న తీరు అర్థం అవుతుంది. కానీ ఇలాంటి ఘటనలు నిరోధించాల్సిన ప్రభుత్వాలు ‘‘నేషనల్‌ సిటిజన్‌ షిప్‌ బిల్‌ 2018,పౌర సత్వం చట్టం 2019పేరిట ఈ ప్రాంతాలను చాలా క్రింద నీరులా ధ్వంసం చేశాయి.ఈ దేశంకి నాగరికత నేర్పిన ఆదివాసి,నేడు అనాగరికునిగా ముద్ర వేయబడి వేలివేయ బడ్తున్నాడు,బ్రతుకు ధ్వంసం చేయబడి గెంటివేయ బడుతున్నాడు. ‘1996 సమత వర్సెస్‌ ఆంధ్ర ప్రదేశ్‌’కేసులో 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రభుత్వం కూడా నాన్‌ ట్రైబల్‌ గానే చూడాలని తీర్పు ఇచిన,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ‘‘గిర్‌గ్లాని కమిషన్‌ 2004,కోనేరు రంగారావు కమిటీ 2006’’లు చాలా స్పష్టంగా ఆంధ్ర వలసలు తెలంగాణ ఆదివాసి ప్రాంతంలో అత్యధికంగా పెరిగి, 7,50,000 ఎకరాల ఆది ఆదివాసీల భూము లు,దాదాపు 48శాతం ఆదివాసీల భుములు నాన్‌ ట్రైబల్‌ చేతిలో అన్యాక్రాంతం అయ్యాయి అని నివేదించిన, 1/70/ (ఎల్టిఆర్‌) లాంటి చట్టాలు పకడ్బందీగా ఉన్న ఆదివాసీలకు న్యా యం జరిగే పరిస్థితులు లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వలస ఆంధ్రలదే షెడ్యూల్‌ ఏరియాలో పెత్తనం నడుస్తుంది ఇంకా ఆది వాసీలకు దిక్కేది.ఈ దేశంలో ప్రస్తుతం అడవిపై హక్కు అనే సమస్య ఆదివాసీలకు ప్రధాన సమస్యగా మారింది. తరతరాలుగా ఆదివాసీలు జల్‌ జంగిల్‌ జమీన్‌ కోసం అడవిపై హక్కు కోసం వేలాది మంది చారిత్రక పోరాటాలు చేసి అమరులు అయ్యారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో ఎస్‌ఆర్‌ శంకరన్‌ కమిటీనీ నియమించి. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అటవీ భూములపై హక్కులు కల్పిస్తు పార్లమెంట్‌ లో ‘2006 డిసెంబర్‌13న’’ అటవీ హక్కుల చట్టంచేయబడిరది. ఈచట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 10ఎకరాల లోపు వరకు హక్కు పత్రం ఇవ్వ వచ్చు. పైగా‘‘అడవుల పై హక్కు లు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సిగ్‌ కూడా ప్రకటిం చారు’’ దానిలో భాగంగా కొంత మేరకుయుపిఎ ప్రభుత్వం ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు అందించింది. ఆదివాసీలు అడవిపై ఉమ్మడి హక్కు నీ కూడా కల్పించింది కానీ కేంద్రంలో బీజేపీ కూటమి వచ్చాక అటవీ హక్కుల చట్టం`2006కి ఎటువంటి రక్షణ ఇవ్వక పోవడం మూలంగా, సుప్రీం కోర్టు ఈచట్టానీ కొట్టి వేసింది. తదుపరి దేశ వ్యాప్త ఆందోళనతో ప్రతుతం ఈ తీర్పుపై ‘‘స్టే’’ విధించింది కానీ ఇంకా పూర్తి స్థాయి నిర్ణ యాలు ఆదివాసీల పక్షాన చేయక ముందే, నూతన అటవీ విధానం తీసుకు వచ్చి అసలు ఆదివాసీల సంబంధం లేకుండానే,అడవుల నుండి ఆదివాసీలను కాలి చేసి కార్పొరేట్‌ శక్తులకు అడవులను అమ్ముకునే కుట్రలుకు జీవం పోసింది.ఈ పోడు భూమి సమస్యనీ తెలంగాణ రాష్ట్రంలో చూసినపుడు నిజాం నిరంకుశ పాలన మళ్లీ మొదలు అయిందా అనే ప్రశ్న లు తలెత్తుతాయి, అటవీశాఖ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను టార్గెట్‌ చేసి వారి భూముల్లో హరితహరం పేరిట మొక్కలు పెట్టడం,దానికి అడ్డుగా వచ్చిన వారిపై ‘‘పిడి యాక్ట్‌’’లు పెట్టడం,మహిళలపై హింస, గర్భి ణీలకు చెట్లకు కట్టేసి కొట్టడం,10రోజుల బాలిం తలు అని చూడకుండా జైళ్లకు పంపడం, మొన్న టికి మొన్న ఆదిలాబాద్‌ జిల్లా ‘‘కోయ పోష గూడ’’లోని గోండు మహిళపైదాడి చేసి మహి ళను అర్ధనగ్నంగా గుంజుకోని పోవడం,ఇవన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు లాగే పరిగణించ బడుతాయి.ఒకపక్క ఆది వాసీ లకు పట్టలిస్తాము అని ప్రభుత్వం దరఖాస్తులు తీసుకొని,ఇంకో పక్క అటవీశాఖ వచ్చి దాడు లు చేయటం అనేది ఎంత వరకు సమంజసం? అసలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా అటవీశాఖ పాటించే పరిస్థితి లేదు ఏమైనా అంటే మావి కేంద్ర చట్టాలు అంటుంది అటవీ శాఖ, ఆదివాసీల న్యాయమైన పోడుభూములకు పట్టాలు అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలపై ఉన్న పట్టించుకునే పరిస్థితి లేక అదొక హింసల మారింది పోడు సమస్య..తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు నుండి నానాటికీ ఆదిమ తెగల మనుగడ జీవనం ప్రశ్నార్థకమే అవ్తుంది గిరిజన కేంద్రీయ విశ్వ విద్యాలయం ‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014’’తో నే వచ్చిన,దానిని గోదావరి పరివాహక ప్రాంతం లో ఆదిమతెగల జీవనం దగ్గర కాకుండా మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, ఆదివాసీలకు విద్య నీ దూరం చేయాలని చూస్తున్నారు. షెడ్యూల్స్‌ ప్రాంతంలోని ఐటీడీఏల పరిధిలో 29శాఖలలో ‘ఆర్టికల్‌ 342’ ప్రకారం షెడ్యూల్‌ ఏరియా సర్టిఫికేట్‌ల ద్వారా రావాల్సిన ఉద్యో గాలను మొత్తం కూడా నేడు నిలిపివేశారు. జీఓ నెంబర్‌ ‘3’ పేరిట సుప్రీం కోర్టు 100శాతం రిజర్వేషన్లు చెల్లవు అని తీర్పు ఇవ్వడంతో, న్యాయపరమైన అంశంగా తయారు చేసి, ఆది వాసి నిరోధ్యుగులకు చేయా ల్సిన అన్యాయం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం చెసే పరిస్థితి లేదు, 5వ షెడ్యూల్‌నీ నిర్దేశం చేసే హక్కు, దానిలో నీ నియమాలను నిరోధించే హక్కు, సుప్రీం కోర్టు లేదు. అయిన కానీ రాజకీయ కుట్రలో ఆదివాసి ప్రాంతం, భూభాగం,బందిగా మారే పరిస్థి తులు నెల కొన్నాయి. వీటికి పరిష్కారం చూపించాల్సిన కోర్టులు, ప్రభుత్వాలు,ఆదివాసిలకు వ్యతిరేకంగా ఉన్న పుడు ఇంకా ఆదివాసీ లుకు దిక్కు ఏది?.ఏది ఏమైనా ఈ దేశంలోగాని వివిధ రాష్ట్రాలలో గాని ఆదివాసిల మనుగడ నానాటికీ అంతరి స్తుంది. ఆదివాసి భూబాగాలపై ఒత్తిడి పెరి గింది.ప్రభుత్వాలు కూడా వ్యతిరేక చర్యలే చేపడుతున్నాయి అనేది వాస్తవం. అందుకే ‘‘ఆగస్ట్‌ 9’’ ని‘1982లో ఐక్యరాజ్య సమితి’’ గుర్తించిన, నేటికీ 40సంవత్సారాలు అవుతున్న కానీ భారత దేశం మాత్రం నేటికీ గుర్తించలేదు, పైగా ఐక్య రాజ్య సమితి ఆదివాసిల అభివృద్ధికి చేసే ఏనియమంని లెక్క చేయటం లేదు. తెగలు అంతరిస్తున్న ఆదివాసీల మూలాలు ధ్వంసం అవ్తున్న, అస్తిత్వం కనుమరుగు అవుతున్న, ఇంకా అనాగరిక చర్యలే చేస్తుంది ప్రభుత్వం.ఇకనైనా ఆదివాసీల దినోత్సవం గుర్తించి భారత ప్రభు త్వం అధికారికంగా నిర్వహణ చేయాలి.రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేయాలి.ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా నిర్వహించాలి. ఆదివాసీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. భూమి పుత్రుల హక్కు లను చట్టాలను రక్షించాలి. ఆదివాసిస్వయం పాలన హక్కులను రక్షించి ఆదివాసిల అస్తిత్వం నీ సుస్థిరం చేయాలి. నాణ్యమైన విద్య అందిం చాలి. మాలిక సదుపాయాలు కల్పించాలి. మానవ హక్కుల ఉల్లంఘనలు చర్యలు నిలిపివేయాలి.ఈ దేశ పౌరులు అయిన ఆదివాసిలపై హింసనీ నిలిపివేయాలి.మధ్య భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో ఆదివాసిలపై వారి స్వయంప్రతిపతి హక్కులపై అధికారాలు కల్పించి సమస్య పరిష్కారం చూపాలి. భారీప్రాజెక్ట్‌లు అక్రమ ఖనిజ తవ్వకాలు నిలిపివేయాలి,ప్రధానంగా రాష్ట్ర పతి తెగ కి చెందిన సంతాల్‌ ,ఒరాన్‌,ముండా తెగల ఆదివాసి ప్రజలను బ్రిటిష్‌ పాలనలో అస్సాం కాపీ తేయాకు తోటల లలో పని చేయటానికి 60 లక్షల మందిని బలవంతంగా తీసుకెళ్లినారు స్వాతంత్య్ర అనంతరం వారు అక్కడే ఉండి పోవడం జరిగింది కానీ వాటిని అస్సాం ప్రభుత్వం షెడ్యూల్‌ ట్రైబల్‌ గా గుర్తించలేదు వారికి ఎస్టీ హోదా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేదంటే ఈ దేశం ప్రధమ పౌరురాలు రాష్ట్రపతిగా ఆదివాసి చేయ గలిగింది కానీ దానికి ప్రయోజనం మాత్రం చేకుర్చలేదు అనేది భవిష్యత్‌లో తేలిపోతుంది అనేది గ్రహించ వలసిన విషయం.
వ్యాసకర్త : అనువర్తిత భాషశాస్త్రం,తెలుగు యూనివర్సిటీ హైద్రాబాద్‌,సెల్‌:9392283453– కాక నవ్య

సముద్రం పొండిన వేళ..

మీరు ఎప్పుడైన సముద్రాన్ని చూసారా? చాలా బాగుటుంది కదా. పెద్దగా శబ్ధం చేస్తూ పెద్ద పెద్ద అలలు ఒడ్డుకు వస్తుంటాయి. ఒక అల వచ్చి వెళ్ళిన తరువాత ఇంకొక అల వస్తుంటుంది. కంటికి కనిపించేంత దూరం నీళ్ళుంటాయి. ఇన్ని నీళ్ళు సముద్రంలోకి ఎక్కడునించి వచ్చాయి అనే అనుమానం కలుగుతుంది. మనకు తెలుసు నదులన్ని సముద్రంలో కలుస్తాయని. మనదేశంలోని జీవనదులు గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి లాంటివి, ఇంకా అమేజాన్‌, నైలు లాంటి ఇతర దేశాలలోని నదులన్ని సముద్రాలలో కలుస్తుంటాయి. మరి ప్రతి రోజు ఇన్ని నదులలోంచి నీళ్ళు కొన్నివేళ సంవత్సరాలుగా సముద్రంలో కలుస్తుంటే అందులో నీరు ఎక్కువైపోయి సముద్రం పొంగాలి కదా, ఎప్పుడు సముద్రం పొంగినట్లు మనం వార్తల్లో వినలేదు (ఒక్క సునామి వచ్చినప్పుడు తప్ప). కారణం ఏంటో చెప్పుకొందామా!
మన భూమిని నీటి గ్రహం (షa్‌వతీ జూశ్రీaఅవ్‌) అంటారు. ఎందుకంటే భూమి 70% నీటితో నిండి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97.2% సముద్రాలలోనే ఉంటుంది. మిగితా 2.8% నీరు నదులతో, చెరువుల్లో, మంచుకొండల్లో (ద్రువాలు, హిమాలయాలలో) ఉంటుంది. పర్వతాల మీద మంచు కరిగి ఆ నీరు జీవనదులుగా ప్రవహిస్తుంటుంది. సముద్రం నీరు ఉప్పుగా ఉండడానికి కారణం ఈ జీవనదులు తమ నీటితో పాటు భూమి మీది లవణాలను నిరంతరం సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు ఉప్పుగా మారింది. భూమి మీద సముద్రం చంద్రుని వైశాల్యం కంటే 9 రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత విస్తీర్ణం ఉన్న సముద్రంలోనే నీరు ప్రతిరోజు ఎండ తాకిడికి ఆవిరిగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ ఆవిరి మేఘాలుగా మారి చల్లబడి వానలుగా కురుస్తాయి. ఇలా సముద్రంలోన నీరు ప్రతినిత్యం నీటి ఆవిరిగా మారి వాతావరణంలో కలవడం వల్ల నదులు నుండి వచ్చే నీరు సముద్రంలోకి ఎక్కువ అవదు. ఈ విధంగా భూమి మీద సముద్రాలు ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు సముద్రాలలో నీటి పరిమాణం మారకుండా ప్రకృతి నియంత్రిస్తుంది. దీనినే హైడ్రోలాజిక్‌ సైకిల్‌ (నవసతీశీశ్రీశీస్త్రఱష జవషశ్రీవ) అంటారు. భూమి మీద నీరు ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఉంటుంది. అది నీరు, నీటి ఆవిరి లేక మంచు రూపంలో ఉంటుంది. ఇలా నీరు నిరంతరం తన రూపం మార్చుకోవడం వల్ల మనిషి బ్రతకగలుగుతున్నాడు. దీని కారణం ప్రకృతి. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాం.! `ఆధారం: ఆనంద్‌,(వికాస్‌పీడియో)

  • ప్రపంచమంతటా ఇదే దుస్థితి ా ఉత్తరార్ధ గోళంలో తీవ్ర దుర్భిక్షం ా 230కోట్ల మందికి నీటి కొరత
  • జర్మనీ,ఇటలీ ఫ్రాన్స్‌,స్పెయిన్‌,చైనా,అమెరికా, ఇరాక్‌ వంటి దేశాల్లో నిత్యంనిండుగా ప్రవహించే జీవ నదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి.ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల చాలాదేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరతకాస్తా ఈకరువు దెబ్బకు రెట్టిం పౖంది.2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటికొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదిక చెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో47శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకు న్నాయని గ్లోబల్‌ డ్రాట్‌ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది.
  • బయట పడుతున్న చారిత్రక అవశేషాలు
  • మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొల రాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్‌ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సె లోనా సమీపంలోని రిజర్వాయర్లో నీరు ఆవిరవ డంతో9వశతాబ్దానికి చెందిన చర్చి బయట పడిర ది.మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌ లోనే కాసెరస్‌ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్‌ నది ఎండినచోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్‌, నాటి నగరం బయట పడ్డాయి.
  • నదులన్నింటా కన్నీళ్లే…
  • జర్మనీ, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్‌ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది.
  • 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్ల సముద్రంలోకలిసే ఈనది ఎన్నోచోట్ల ఎండి పోయింది.
  • రెయిన్‌, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షలకోట్ల) విలువైన సరుకు రవాణా జరుగు తుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంత కాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు.
  • ఆల్ఫ్స్‌ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది.
  • ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడిరది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు.
  • ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్‌ వైన్‌ తయారీకి ఆధారమైన లోయెర్‌ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు.
  • యూరప్‌లో 10దేశాల గుండా పారే అతి పొడవైననది డాన్యూబ్‌కూడా చిక్కిపో తోంది.
  • అమెరికాలో డెన్వర్‌ నుంచి లాస్‌ఏంజెలెస్‌ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి!
  • 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది.
  • నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సిచువాన్‌ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడచూసినా నీరు అడుగంటి నదీ గర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది.
  • అమెరికాతో సహా యూరప్‌, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతు న్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కికొట్టుమిట్టాడుతోంది. పారిశ్రా మిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది.
  • మాయమైపోతున్న మంచినీరు
  • ప్రపంచం మీదడైబ్బైశాతం నీరే వుండి అందులో ఒక్కశాతం మాత్రమే మంచినీరుగా ఉప యోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు,వాగులు, వంకలు,వర్రెలు,బావులు,చెరువులు,నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలి పోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగు తుంటే కాపాడుకోవడానికి నగరంలో నిజాం కాలం లో హైదరాబాద్‌ నగరంలో3000పైగా వున్న చిన్న పెద్ద కుంటలు ఒక్కటికూడా ఆచూకీ లేకుండా, అందులో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయి? పై నుంచి పడ్డ నీరు నిలిచ్చే చోటు దొరకక సము ద్రం పాలవుతుంటే,వున్న కొద్ది భూగర్భ జలాలూ అడుగంటుతున్న దుస్థితి. మనం చేసిన పాప ఫలి తమే కదా ఇదంతా లేకపోతే ఏమిటి? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా780మిలియన్ల ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం అల్లాడిపోతున్నారు. ఆఫ్రికాలో ఓతెగ ప్రజలు మంచినీళ్లు దొరకక, వేకువజామునే కిలో మీటర్లకొద్దీ నడిచి అడవుల్లో ఆకుల మీద కారుతున్న మంచు బిందువులను ఒక్కొక్కటిగాసేకరించి మంచి నీరుగా వాడుకుంటారట. ఒకనాడు నదులు పొంగిన జీవగడ్డ భారతావనికూడా ఇవాళ మంచినీటి చుక్క కోసం విలవిలలాడిపోతోంది. అటుచూస్తే ఏళ్ల తరబడి నీటిజాడ కనబడక అనంతపురం జిల్లా ఎడారిదారి పట్టింది. చిత్తూరు జిల్లాలో శిలాజాల లోపలకి వెయ్యి అడుగుల లోతునబోర్లు వేస్తే తప్ప నీటి చుక్క దొరికే అవకాశం లేదు. కృష్ణానది మైళ్లకు మైళ్లు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాగొంతు తడ వడం లేదు. ఫ్లోరిన్‌నీళ్లు నల్లగొండకు నిద్ర పట్టనీ యడం లేదు. పుష్కలంగా నీటి వనరులన్న ప్రాం తాలు రసాయన ఎరువులు,పురుగు విషాలతో విష తుల్యమైపోయాయి. అసలు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నాలుగు వందల అడుగులకు మించి నీళ్లు రకర కాల రసాయనాలతో విషపూరితమైనవి కాబట్టి వాటిని మంచినీటిగా ఉపయోగించకూడదని చెప్పింది. మరోప్రక్క కలుషితమైన నీటివల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజుకు ఆరువేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే,మనం రెండు గుక్కలనీళ్లు తాగిగ్లాసు కిందపెట్టే లోపు ఒక చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతోంది.
  • అడవుల్ని కొట్టేసి,కొండల్నిపిండేసి, నదుల్నిఎండేసి,గాలినికాలుష్యంతోనింపేసి,తిండిని రసాయ నాల్తో కలిపేసి, ఇంకా ఎన్ని దుర్మార్గాలు కళ్లముందే జరుగుతున్నా ఇప్పటి దాకా మౌనంగానే వున్నాం. ఆఖరికి తాగే నీళ్లలో కూడా ఇన్ని రసాయ నాలు వున్నాయంటే చుక్క కూడా గొంతు దిగడం లేదు. అలాగని తాగకుండా వుండనూలేము, చిన్న చిన్నపిల్లలు తాగే పాలే కాదు, నీళ్లు కూడా విషమని తెలిసాక ఇక మాట్లాడకుండా ఎలా వుండగలం.
  • ఇందుకు మనమేం చేద్దాం
  • నీరు లేనప్పుడు ఇబ్బందులు పడడం కంటే అందుబాటులో వున్న చుక్కనీటిని కూడా వృధా చేయకపోవడం అవసరం. నగరాల్లో, పల్లెల్లో ఎక్కడిక్కడఇంకుడు గుంతలు,కందకాలు, చెక్‌డ్యా మ్‌లు,వాటర్‌షెడ్‌లు నిర్మించుకోవాలి. వాన నీటిని ఒడిసి పట్టుకునే చాలా వరకు మంచినీటి కొరతను అధిగమించవచ్చు. సముద్రతీర ప్రాంతం కావడం తో ప్రకాశం జిల్లాలలోని ఉప్పు నీళ్ళు ఎక్కువగా వుంటాయి కాబట్టి అక్కడ చాలా ప్రాంతాల్లో సంప్ర దాయికంగా వాననీటిని ఒడిసిపట్టి సంవత్సరమంతా మంచినీటిగా ఉపయోగిస్తారు.ఎడారి రాష్ట్రం రాజా స్థాన్‌లోని గ్రామాల్లో తరతరాలుగా వాననీటిని మంచినీటిగా వాడుకునే సంప్రదాయం వుంది.అతి తక్కువ వర్షపాతం పడే అనంతపురం ప్రాంతంలో కూడా(400-500మి.మీ.వర్షపాతం)200 చద రపు అడుగుల వైశాల్యంలో వుండే ప్రభుత్వ కట్టి చ్చిన ఇందిరమ్మ ఇంటిమీద 10000 లీటర్లు నీరు నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటిని రోజుకు 20 లీటర్ల చొప్పున వాడినా ఒక కుటుంబానికి దాదాపు 500 రోజులకు సరిపోతుంది.మహారాష్ట్రరాలెగావ్‌ సిద్దిలో అన్నాహజారే,రాజస్థాన్‌లో రాజేంద్రసింగ్‌ చేసిన నీటి సంరక్షణ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ కోవలో ఎండిపోయిన బావుల్ని, వట్టిపోయిన చెరువుల్ని,జీవం వచ్చిన నదుల్ని తిరిగి బతికించు కునే ప్రయత్నం చేయాలి. వనసంరక్షణే జన సంర క్షణగాభావించాలి. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, అడవుల ఉపయోగాలపై అవగాహన కల్పించి చిన్నప్పటి నుంచి ప్రకృతిని వాళ్ల జీవితంలో భాగం చేయాలి.అడవులు,నదులు,వానలు, రుతుపవనాలు, కాలాలు ఇలా ప్రకృతిలో ఒకదానికొకదానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని అవగాహన చేసుకుని మనం వివేకంతో వ్యవహరించాలి. నీరు లేకపోతే మనకు వర్తమానమూ లేదు, భవిష్యత్‌ అంతకన్నా లేదన్న నిజాన్ని మనమంతా నిర్భయంగా అంగీకరించాలి. నీటిని వ్యాపార వస్తువుగా మార్చిన సమస్త పరిస్థి తులను వ్యతిరేకించాలి.ప్రతి నీటి చుక్కను గుండె లకు హత్తుకుని పదిలంగా కాపాడుకోవాలి.

పర్యావరణ వినాశనం..

విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా.. కోలుకోవ డానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. సాధారణంగా విపత్తులు రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్‌,సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌), కాలు ష్యం,అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈ రెండు రకాల విపత్తు లు ప్రాణ,ఆస్తి,పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి.కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009,డిసెంబర్‌ 21న ఒక ప్రతి పాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్‌ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ణaవ టశీతీ ణఱంaర్‌వతీ Rఱంస Rవసబష్‌ఱశీఅఅధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు,రిస్క్‌ అవేర్‌నెస్‌ గురించి ప్రమోట్‌ చేస్తుంది ఈ దినో త్సవం. మొదట్లో నేచురల్‌ డిజాస్టర్‌ రెడక్షన్‌ డేగా ఉండేది. 2002లో ఐరాస ఓరెజల్యూషన్‌ పాస్‌ చేసింది.విపత్తులు సంభ వించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’.. అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే. అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా. ఈదిశగా ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆదశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే.. ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు. రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి. ముందస్తు చర్యలు చేపట్టాలి.లోపాలను అధిగ మించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగా లను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’..ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గిం చాలనేది ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశం
మన దగ్గర..
భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ,చట్టం వచ్చింది మాత్రం 2005లో.విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం,రాష్ట్రం,జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో చాలా మార్పు వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్‌ ఎఫ్‌ (సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది. మరో వైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది.
విపత్తు నిర్వహణ
జీలం,చీనాబ్‌,రావి,సట్లెజ్‌,బియాస్‌,ఘాగ్రా నదులతో కూడిన వాయవ్య నదీపరివాహక ప్రాంతం,తపతి,నర్మద,మహానది,వైతరణి, గోదా వరి,కృష్ణా,పెన్నా,కావేరి నదులతో కూడిన ద్వీప కల్ప నదీ పరివాహక ప్రాంతాలు వరదకు ప్రభావితమవుతున్నాయి.ఏపీ,తమిళనాడు, ఒడిశా,కేరళ తీరప్రాంతాలు,అసోం,ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తరుచూ తీవ్ర వరద ముంపునకు గురవుతుంటాయి. జీవాయుధాలు కలిగించే జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించలేం. ప్లేగు,స్మాల్‌ఫాక్స్‌వంటివి వేగంగా సోకే కార కాలను గుర్తించడంలో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో శత్రుసైన్యాన్ని చంపే విధానంలో భాగంగా బుబోనిక్‌ ప్లేగు (గ్రంథులు ఉబ్బడం) వ్యాధితో మరణించిన వారి శవాలను రాజు కోటలో విసిరేవారు.ఉదా: 1346 కఫా సంఘటన. 14 22 కరోల్‌స్టీన్‌ సంఘటన. విపత్తు అనేది ఒక అపాయకరమైన స్థితి. దేనివల్ల ప్రజల ప్రాణా లు,ఆస్తులకు ముప్పు వాటిల్లుతుందో ఆ స్థితిని విపత్తు (ణIూAూుజుR) అంటారు.ఒక సమాజం తన సొంత వనరులతో కోలుకోలేని విధంగా,సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణ నష్టం,ఆస్తినష్టం,పర్యావరణ వనరులను విలు ప్తం చేసి,మౌలిక సౌకర్యాలకు,నిత్యావసర సేవలకు,జీవనోపాధికి,మానవ దైనందిన జీవి తానికి అంతరాయం కలిగించే ఒక సంఘటన లేదా వరుస ఘటనలను విపత్తు అంటారు.
ఐక్యరాజ్యసమితి
విపత్తును ఐక్యరాజ్యసమితి సమాజపు లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మా త్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపద అని నిర్వచించింది. సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి సంరక్షించడానికి అసా ధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉప ద్రవ పరిస్థితి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలు కోడానికి వెలుపలి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవరమయ్యే విధంగా నష్టానికి, ఆర్థిక విధ్వంసానికి, మానవ ప్రాణ నష్టానికి ఆరోగ్యం, ఆరోగ్య సేవలను పతనం చేసే ఏదైనా సంఘటన అని నిర్వచించింది.ఒక దుర్ఘటనను విపత్తుగా పిలవాలంటే ఎన్ను కోవాల్సిన ప్రమాణాలు లేదా ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కనిపించే లక్షణాలు
సమాజ సాధారణ మనుగడ దెబ్బతినడం
ధన,ప్రాణ,ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడం, ప్రజల జీవనోపాధి దెబ్బతినడం,విపత్తు ప్రభావానికి లోనైన సమాజానికి ఆస్తులు, అక్కడి ప్రజల పునర్నిర్మాణానికి వెలుపలి నుంచి సహా యం అవసరం అన్నంతగా దాని తీవ్రత ఉం డటం,దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమై,అక్కడి పర్యావరణం దెబ్బతిని, సుస్థిరాభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండటం.ముఖ్యంగా 1. వైపరీత్యం,2.దుర్బలత్వం,3 సామర్థ్యం, 4. ఆపద అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు, పర్యావరణానికి ప్రకృతి చేతగాని లేదా మానవ కారకంగా గాని నష్టాలు సంభ విస్తే దానిని వైపరీత్యం అంటారు.
వైపరీత్యాలను – జిఎన్‌వి సతీష్‌

కారడవులూ కార్పొరేట్లకేనా..?

కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశ నానికి శ్రీకారంచుట్టింది.2022 జూన్‌ 28న ‘ఫారెస్ట్‌ కన్సర్వేషన్‌ నిబంధనలు-2022’ను తీసుకు వచ్చిం ది.‘కన్సర్వేషన్‌’ (పరిరక్షణ)పేరుతో వచ్చిన ఈనిబం ధనలు అంతులేని విధ్వంసం చేయబోతు న్నాయి. ఆదివాసీలను,అడవులను,వన్యప్రాణులను, పర్యా వరణాన్ని ధ్వంసం చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈనిబంధనల ప్రకారం ఎంత పెద్ద అడవి నైనా అటవీయేతర భూమిగా మార్చుకోవచ్చు. వ్యా పారఅవసరాలు,లాభాల కోసం బడా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయవచ్చు. రాష్ట్రంలో స్క్రీనిం గ్‌ కమిటీ, కేంద్రంలో రీజినల్‌ ఎంపవరింగ్‌ కమిటీ, ఎడ్వైజరీకమిటీలు,మొత్తం మూడు కమిటీలు ఏర్పాట వుతాయి. వీటిలో పర్యావరణవేత్తలకు, ఆదివాసీలు, సామాజిక కార్యకర్తలకు ప్రాతినిధ్యం లేదు.కొత్త నిబంధనల కింద ఎంత అడవిని,ఎంతకాలపరి మితిలో కార్పొరేట్లకు అప్పగించాలో వివరాలు ఉండటం గమనార్హం.5 నుంచి 40హెక్టార్ల అడవిని 60 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం, మైనిం గ్‌ అవసరాల కోసం75రోజుల్లో అప్పగించాలి (హెక్టారు అంటే రెండున్నర ఎకరాలు). 41నుంచి 100 హెక్టార్ల అడవిని 75 రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాలకోసం,మైనింగ్‌ అవసరాలకోసం 90 రోజుల్లో ఇవ్వాలి. 100 హెక్టార్ల నుంచి ఆ పైనున్న అడవిని 120రోజుల్లో నాన్‌మైనింగ్‌ అవసరాల కోసం, మైనింగ్‌ అవసరాల కోసం 150రోజుల్లో ధారాదత్తం చేయాలి. పై మూడు కమిటీలు మొత్తం ప్రక్రియను ఈ కిందివిధంగా పూర్తిచేసి అడవిని కార్పొరేట్లకు అప్పగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించబడిన కాలపరిమితికి లోబడి ఎటువంటి జాప్యం చేయరాదు.ఎలాధ్వంసం చేయాలి?మొదటి దశలో ఆదివాసులను, వన్యప్రాణులను అక్కడినుంచి ఖాళీ చేయించాలి. తర్వాత అడవిని ప్రైవేటు వ్యక్తు లకు,బడాకార్పొరేట్లకు దఖలు చేయాలి. ఆ తర్వాత ఏయే పద్ధతులద్వారా అడవిని ఎంత క్రూరంగా ధ్వంసం చేయవచ్చో కూడాఈనిబంధనల్లో పేర్కొ న్నారు.1.క్లియర్‌ ఫెల్లింగ్‌ (పూర్తిగా నరికివేయడం), 2.అప్‌ రూటింగ్‌ (కూకటివేళ్ళతో పెకలించడం), 3.బర్నింగ్‌(అడవినితగలబెట్టడం).ఇలాంటి విధ్వం సకర చర్యలద్వారాఅటవీభూమిని,అందులో ఉన్న సంపదను కొల్లగొట్టడంకోసం వన్యప్రాణులను, ఆదివాసులను,ఇతర పేదలను నిరాశ్రయు లను చేస్తారు.తద్వారా అటవీయేతర భూమిగా మార్చు కొని వారి అవసరాల కోసం వాడుకుంటారు. రాజ్యాంగం-చట్టాల ఉల్లంఘన
రాజ్యాంగంలో5,6వ షెడ్యూళ్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆదివాసులకు పలు హక్కులు, రక్షణ లభిస్తున్నాయి. గిరిజన భూముల బదలాయింపు నిరోధక చట్టం, గ్రామసభలకు అధి కారాలను కలగజేస్తున్న పెసా చట్టం,అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006, భూ నిర్వాసితుల చట్టం-2013, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు, తదితర కోర్టులు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఇచ్చిన తీర్పులతో సహా అన్ని హక్కులు బుల్డోజర్‌తో నేలమట్టం చేయబడ్డాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఎంత విస్తీర్ణం గల అడవిని అటవీయేతర భూమిగా మారుస్తారో, అంత విస్తీర్ణం గల భూమిని మరోచోట కేటాయించి ప్రత్యామ్నా యంగా అడవిని పెంచాలి. కానీ కొత్త విధానం ప్రకారం ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నామ మాత్రమే. రాష్ట్రాల మీదికి ఆబాధ్యత నెట్టివేసి కేంద్రం చేతులు దులుపుకొన్నది. నష్ట పరిహారం, పునరావాసం: అడవి నుంచి, భూమి నుంచి గెంటి వేయబడిన ఆదివాసీలు, ఇతర పేదలకు పునరా వాసం గానీ, నష్ట పరిహారం గురించి గానీ కేంద్రం ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా లేవు. అడవిని పూర్తిగా వ్యక్తిగత ఆస్తిగా మార్చుకొని,ఆయజమాని లబ్ధిని పొందడం ప్రారం భమైన తర్వాతనే నిర్వాసితుల పునరావాస ప్రక్రి యపై దృష్టిపెట్టాలి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభు త్వాలు పర్యవేక్షణ చేయాలనేది ఈ నిబంధనల్లోని అంశం. బడా కార్పొరేట్లను నిలువరించటం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆదివాసులకు, హక్కుల సంఘాలకు సాధ్యమవుతుందా? ఇది కేంద్రం పలాయనవాదం కాదా?గిరిపుత్రులు అడవిలో పుట్టి, అడవినే నమ్ము కొని,అడవే జీవనాధారంగా ఏర్పరచుకొని, అడవిలో లభించే కందమూలాలు తింటూ నాగరికపు సమా జానికి దూరంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వారిని అడవి నుంచి దూరం చేయాలని, అటవీ సంపదను కార్పొరేట్‌ బడా బాబులకు, ప్రభుత్వ ఆశ్రిత పెట్టు బడిదారులకు దోచిపెట్టాలని కేంద్రం తహత హలాడుతున్నది. అనేక రాష్ట్రాల్లో అటవీ సంపదను కొల్లగొట్టడానికి బొగ్గు గనుల తవ్వకం, బా క్సైట్‌, యురేనియం లాంటి ఖనిజాల వెలికితీతకు జిం దాల్‌, వేదాంత లాంటి బహుళజాతి సంస్థలు, అంబానీ, అదానీల సంస్థలు పోటీపడుతూ గిరిజన జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రాజ్యాం గ విలువలకు ప్రాధాన్యం ఇచ్చి, ఆదివాసీల అభివృ ద్ధికి రాజ్యాంగం కల్పించిన చట్టాలను అమలు చేస్తేనే గిరిజనుల ఆకాంక్షలు నెరవేరుతాయి.
అడవుల పెంపకం కోసం నయా ప్లాన్‌.. డ్రోన్ల సహాయంతో బృహత్తర కార్యక్రమం..
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎన్ని చెట్లు నేల కూలుతున్నాయో తెలుసా..? సుమారుగా14 వేల కోట్లుకు పైమాటేనట! మరి వీటి స్థానంలో కొత్తగా ఎన్ని మొక్కలు పుడుతున్నా అంటే..అది జస్ట్‌ సగం కూడా లేవట! అందుకే..అడవులను వేగంగా పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఉందని అటవీశాఖ అధికారులు ముందుకు వచ్చారు. అటవీశాఖ ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా డ్రోన్లతో విత్తనాలను నాటుతున్నారు. భారీగా మొక్క లుగా మొలిచేలా చేయడమే తమటార్గెట్‌ అనివాళ్లు చెప్తున్నారు. మామూలుగా మనుషులతో విత్తనాలు నాటాలంటే ఎక్కువ టైంలో తక్కువ పనైతది. ఎక్కువ మంది జనాలుదానికోసం పనిచేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఖర్చూ ఎక్కువే.అందుకే వాళ్లు డ్రోన్‌ టెక్నాలజీపై ఫోకస్‌ పెట్టారు. ముందుగా వాళ్లకు కావాల్సిన రకరకాల మొక్కల విత్తనాలను సెలెక్ట్‌? చేసుకుంటారు. వాటిని మట్టి, ఇతర న్యూట్రియెంట్స్‌ కలిపిన ఒక ముద్దలో పెడతారు.ఆముద్దలను ఉండలుగా చుట్టి సీడ్‌ బాల్స్‌గా మారుస్తారు. ఈ సీడ్‌ బాల్స్‌ను డ్రోన్‌లద్వారా పైనుంచి జార విడు స్తారు. దీంతో వానలు పడగానే సీడ్‌ బాల్స్‌ మొల కెత్తుతాయి.వాటి చుట్టూ ఉన్న మట్టి, న్యూట్రియెంట్స్‌ సాయంతో ఏడెనిమిది నెలల వరకూ మొక్కలు బతకగలవు. ఆలోపు వేర్లు పుట్టి, నేలలో బాగా పాతుకుపోతాయి. ఇలా.. డ్రోన్లతో ఈజీగా మొక్కలు పెంచొచ్చని వీరు ప్లాన్‌ చేశారు.ఫ్లాష్‌ ఫారెస్ట్‌ ప్రాజె క్టును గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎన్జీవోలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు అటవీశాఖ అధి కారులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో డ్రోన్‌ ద్వారా విత్తన బాల్స్‌ వేశారు. గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఆధ్వర్యంలో విత్తనాలను సేకరించినట్లుగా చెప్పారు. అడవిలో పలుచగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కామా రెడ్డిలోనే ప్రారంభించామని వెల్లడిరచారు.
పర్యావరణంలో కలిగే దుష్పరి ణామా లను అడ్డుకోడానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారం అన్న భావన గత కొన్నేళ్లుగా బలహీనపడుతోంది. కార్బన్‌ వాయువులను పీల్చుకోవడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయని గతంలో జరిగిన పరిశోధ నలు తేల్చాయి. వాటిని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విస్తారంగా అడవులను పెంచడం ప్రారంభించాయి. మొక్కల పెంపకం మీద అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. చెట్లు పెంచితే పర్యావరణంలో దుష్పరిణామాలను ఆపవచ్చని విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చాయి. 2030 కల్లా 350 మిలియన్‌ హెక్టార్లలో నాశనమైన అడవుల ప్రాంతంలో తిరిగి పచ్చదనం తీసుకురావాలని పలు దేశాలు ప్రతిజ్జ చేశాయి. ఇప్పటి వరకు 40 దేశాలు ఈ ప్రతిజ్జను పాటిస్తు న్నాయి. కానీసైంటిస్టులు మాత్రం మొక్కలు నాట డానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. చిలేలో అడవుల పెంపకానికి ఇచ్చే సబ్సిడీలకు సంబంధించి1974 నుంచి 20 12వరకు విడుదల చేసిన డిక్రీలను పరిశీలిం చారు. వీటిని చూస్తే ప్రపంచంలో ఇదే అతి పెద్ద అడవుల పెంపకం ప్రాజెక్టు అనిఅర్ధం చేసుకో వచ్చు. కొత్తగా అడవులను పెంచడానికి ఈ చట్టం ప్రకారం 75 శాతం రాయితీలు లభిస్తాయి.వాస్తవానికి ఈ పథకం ప్రకారం అప్పటికే ఉన్న అడవులలో చెట్లు నాటకూడదు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలామంది మొక్కల పెంపకందారులు అడవు లలోనే లాభదాయకమైన పండ్లను, ఫలాలను ఇచ్చే చెట్లను నాటడం మొదలు పెట్టారు. ఈ స్కీమ్‌ను చెట్లు ఉన్న ప్రాంతాలకు కూడా విస్తరించారు, కానీ స్థానిక అడవులున్న ప్రాంతంలో తగ్గించారు చిలే లోని అడవులు పెద్దమొత్తంలో కార్బన్‌ను నిల్వ చేసుకునే సామర్ధ్యం ఉన్నవని, కానీ కొత్తగా చేపట్టిన మొక్కల పెంపకంవల్ల అది తగ్గిపోయి, జీవవైవిధ్యం దెబ్బతిన్నదని ఈఅధ్యయనం నిర్వహించిన పరి శోధకులు అంటున్నారు. ‘’మొక్కలు పెంచడానికి చేపట్టిన పథకాలు సరిగా రూపొందించక పోయినా, అమలు చేయకపోయినా ఫలితాలు ఇలానే ఉంటా యి. డబ్బులు వృథాకావడంతోపాటు జీవవైవిధ్యం కూడా దెబ్బతింటుంది’’ అని ఈ స్టడీ పేపర్‌ సహ రచయిత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఎరిక్‌ లాంబిన్‌ అన్నారు. మనం కోరుకున్న దానికన్నా పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇవి ‘ొఅని ఆయన అన్నారు. ఇక దీనిపై పని చేసిన రెండో పరిశోధనా ప్రాజెక్టు కొత్తగా నాటిన అడవులు ఎంత వరకు కార్బన్‌ వాయువులను పీల్చగలవో పరిశీ లించింది. ఇప్పటి వరకు సైంటిస్టులు మొక్కలు ఏ స్థాయిలో కార్బన్‌ వాయువులను పీల్చుకుంటాయో అంచనాలు వేసి ఒక నిర్ణీత నిష్పత్తిని నిర్ణయించారు. అయితే ఈ నిష్పత్తిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఈ పరిశోధన, పరిస్థితులను బట్టి ఈ నిష్పత్తి మారు తుందని తేల్చింది. ఈ సందర్భంగా పరిశోధకులు ఉత్తర చైనాలో ప్రభుత్వం నాటించిన చెట్లతోపాటు, గోబీ ఎడారిలో నాటిన మొక్కలను కూడా పరిశీ లించారు. ఈఅడవుల నుంచి 11,000 మట్టి నమూనాలను సేకరించారు. నేలలో కార్బన్‌ లేని ప్రాంతాలలో మొక్కలు పెంచడం వల్ల ఆ ప్రాం తంలో ఆర్గానిక్‌ కార్బన్‌ పెరుగుతుందని గుర్తిం చారు. కార్బన్‌ ఎక్కువగా ఉన్న నేలల్లో అడవులను నాటడం వవలన వాటి సాంద్రతలో తగ్గుదల కనిపించింది. మొక్కలు కార్బన్‌ను పీల్చుకునే శాతాల గురించి గతంలో వేసిన అంచనాలు కాస్త అతిశ యంగా ఉన్నాయని ఈ పరిశోధకులు తేల్చారు. ‘’కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటే దానికి చెట్లు నాటడమొక్కటే పరిష్కారంకాదని ప్రజలు అర్ధం చేసుకోవాలి’’అని ఈ పరిశోధనకు నాయ కత్వం వహించిన కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ చెందిన డాక్టర్‌ అన్పింగ్‌ చెన్‌ అన్నారు. ‘’అడవుల పెంపకంలో చాలా సాంకేతిక అంశాలను పరిశీలిం చవలసి ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ సమతుల్యం చేయాలి, ఏదో ఒక విధానమే సమస్యకు పరిష్కారం కాదు’’ అన్నారు .- (నాదెండ్ల శ్రీనివాస్‌)

విఫత్తులు..మానవాళికి పెనుశాపాలు

అంతా నేతల చేతుల్లోనే : భూతాపాన్ని తగ్గించ డానికి ఏమాత్రం గడువు లేదు. వెంటనే స్పందిం చాల్సిందే.కానీ,ఇప్పుడిది ప్రభుత్వాధినేతలు, రాజ కీయ నేతల చేతుల్లో ఉంది. భూమిని రక్షించుకోవ డానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలను పట్టాలెక్కిం చడానికి ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు కానీ స్పందించకపోతే ఆ తరువాత వారు వాతావరణంలోని కర్బనాన్ని సంగ్రహించడానికి ఇంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘సత్వరం మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే. ఇంతకుముందు పారిస్‌ ఒప్పందం చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉన్నంత మాత్రానసరిపోదు’ అని ప్రొఫెసర్‌ జిమ్‌ స్కీ అన్నారు. ప్రపంచదేశాల నేతలు ఈ నివేదికను చదివి వారి లక్ష్యాలను పెంచుకోవడానికి నిర్ణయించడంతో పాటు వెంటనే కార్యరంగంలోకి దిగితే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించడం అసాధ్యమేమీ కాదని జిమ్‌ అభిప్రాయపడ్డారు. పర్యావరణవేత్తలు, భూతాప నివారణకు పనిచేస్తున్నవారు ఈ అంశంపై మాట్లాడుతూ,ముప్పు ముంచుకొస్తుండడంతో దీనిపై చర్చించడానికి కూడా సమయం లేదని, మార్పులకు సత్వరం శ్రీకారం చుట్టాల్సిందేనని చెప్పారు.

పర్యావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి ప్రళయాలు, విపత్తులు సర్వసాధారణంగా మారాయి. మండే ఎండలు, భారీ వర్షాలు, భూకంపాలు, సునామీల వంటి దుస్థితికి మానవ తప్పిదాలే ప్రధానంగా తోడవుతున్నాయనేది చేదు నిజం. ప్రభుత్వాల చొరవకు తోడు.. పౌర బాధ్యతతోనే ప్రకృతి వనరుల పరిరక్షణ, మానవ ప్రేరిత విపత్తులను నివారణ సాధ్యమవుతుంది. జిఎన్‌వి సతీష్‌
భారీవర్షాలు,వరదల ధాటికి పాకిస్తాన్‌, బెంగళూరు,కేరళ,ఉత్తరాఖండ్‌ అతలాకుతలమవు తున్నాయి.వేలసంఖ్యలో మరణాలు నమోదయ్యా యి. వేల మంది నిరాశ్రయులయ్యారు.వరద బీభ త్సం-దేశీయ ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ తీరుతెన్ను లను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. పశ్చిమ, తూర్పు కనుమల్లో విచ్చలవిడిగా సాగుతున్న వనాల విధ్వంసం,సున్నితమైన పర్యావరణ వ్యవస్థల పరి రక్షణలో అంతులేని నిర్లక్ష్యం,వాతావరణ మార్పుల చేదు ఫలితాలు ఎక్కడికక్కడ విపత్తులతాకిడిని పెంచుతున్నాయి.ముందు జాగ్రత్తల ద్వారా నష్టా లను తగ్గించే కార్యాచరణ లోపిస్తుండటమే విచా రకరం!
బుట్టదాఖలవుతున్న నివేదికలు : భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలిగిన భారతదేశంలో ఏటారుతుపవనాలు ప్రవేశించాక వరదలు, తుపా నులు సంభవించడం సర్వసాధారణం.కొన్నేళ్లుగా లెక్కకుమిక్కిలిగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు- జనజీవనాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే తుపానుల్ని ముందే పసిగట్టి హెచ్చ రించే సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. వాటి ఆసరాతో సమర్థ చర్యలు చేపడితే నష్టాలను గణనీయంగా తగ్గించ వచ్చు. కేంద్ర జల సంఘం, విజ్ఞానశాస్త్ర-పర్యావ రణ కేంద్రం(సీఎస్‌ఈ) సమాచారం మేరకు గడిచిన అరవై ఏళ్లలో వరదల మూలంగా దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోయారు. దాదాపు 62 కోట్ల ఎకరాల్లో పంటలు, ఎనిమిది కోట్లకు పైగా గృహాలు నాశనమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖ నివేదికల ప్రకారం దేశంలో అధిక శాతం నదులు 2019లో భారీ వరద ఉధృతిని చవిచూశాయి. వందేళ్లలో కనీవినీ ఎరగని స్థాయిలో ముంచెత్తిన వరదల ధాటికి 2018లో కేరళ బాగా దెబ్బతింది. ఉత్తరాఖండ్‌,గుజరాత్‌,రాజస్థాన్‌,బిహార్‌,పశ్చిమ్‌ బంగ,ఈశాన్య రాష్ట్రాలూ గడచిన కొన్నేళ్లలో భీకర వరదల తాకిడికి గురయ్యాయి. శ్రీనగర్‌,చెన్నై, హైద రాబాద్‌,ముంబై నగరాలూ అలాగే శోకసంద్రాల య్యాయి. విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు హుద్‌హుద్‌,తిత్లీ వంటి తుపానులు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దేశవ్యాప్తంగా ఏటా మూడు కోట్ల మంది వరదల బారిన పడుతున్నారు. దేశంలో జూన్‌-అక్టోబర్‌ మధ్య కాలంలో భారీ వర్షాలతో నదుల్లోకి అధికనీటి ప్రవాహంచేరుతోంది.ఆ సమ యంలో పర్వత శ్రేణులకు ఆనుకుని ఉండే ప్రదే శాలు,నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విచక్షణారహితంగా సాగు తున్న ఇసుక తవ్వకాలు నదుల సహజ ప్రవాహ గమనాన్ని దెబ్బతీస్తున్నాయి.అనేక నగరాల్లో దశా బ్దాల నాటి మురుగు నీటిపారుదల వ్యవస్థలు ఇప్ప టికీ మెరుగుపడలేదు.దాంతో వరద నీరు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.గుజరాత్‌,మహా రాష్ట్ర,గోవా,కర్ణాటక, కేరళ,తమిళనాడు రాష్ట్రాల పరిధిలో సుమారు1.60 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. అక్కడి పర్యావరణ, జీవవైవిధ్య వ్యవస్థల పరిరక్షణ కోసం 2010లోకేంద్ర ప్రభుత్వం ప్రముఖ పర్యా వరణ వేత్త మాధవ్‌ గాడ్గిల్‌ నేతృత్వంలో అధ్యయన సం ఘాన్ని నియమించింది. పశ్చిమ కనుమలను పర్యా వరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటిం చాలని ఆ సంఘం సూచించింది. నిర్దేశిత ప్రాంతా ల్లో నూతన ఆర్థిక మండళ్లు, హిల్‌స్టేషన్ల ఏర్పాటు, ఖనిజాల తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని సిఫార్సు చేసింది. కనుమల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ భూములను బదిలీ చేయ కూడదని పేర్కొంది. పశ్చిమ కనుమల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. వీటిని అమలు చేయకుండా 2012లో శాస్త్రవేత్త కస్తూరి రంగన్‌ నేతృత్వంలో కేంద్రం మరోసంఘాన్ని కొలు వు తీర్చింది.గాడ్గిల్‌ కమిటీ బాటలోనే-కనుమ లలో గనులతవ్వకం,క్వారీ కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించాలని ఆ సంఘం సిఫార్సు చేసింది. కనుమలలో37శాతం భూభాగాన్ని సున్నిత పర్యా వరణ ప్రాంతంగా గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. వీటినిఅమలు చేసి ఉంటే- వరదల తీవ్రత తగ్గి ఉండేది. ఒడిశా,ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన తూర్పు కనుమల దుస్థితీ ఇలాగే ఉంది. ఒడిశా, ఆంధ్రపరిధుల్లోని కనుమలలో లేటరైట్‌, బాక్సైట్‌ వంటి ఖనిజాల తవ్వకాల మూలంగా అడవులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నదుల గమనంలో మార్పులతో భవిష్యత్తులో వరద ప్రమాదాలు అనూహ్య స్థాయిలో ఉంటాయని నిపుణులు హెచ్చరి స్తున్నారు. వాస్తవ పరిస్థితులను మదింపు వేయ డానికి అధ్యయనాలు చేపట్టేందుకు సైతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవడం ఆందోళన కరం.
పటిష్ఠ కార్యాచరణ అవసరం : ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదాలతో సమన్వయం కొరవడుతోంది. విపత్తు లకు కారణమయ్యే వాతావరణ మార్పుల ప్రభా వాలను పరిమితం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠ ప్రణాళికలు అవసరం. వాటికి అనుగుణంగా ప్రకృతి వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వాలు ఇతోధి కంగా నిధులు కేటాయించాలి. ఖనిజ తవ్వకాలు, ఆనకట్టలు, జల విద్యుత్‌ ప్రాజెక్టులపై లోతైన చర్చ తరవాతే ముందడుగు వేయాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే వ్యవస్థలను నెలకొల్పాలి. విపత్తుల నిర్వహణ,యాజమాన్య సంస్థలను వేగంగా పటిష్ఠీకరించాలి.చాలా రాష్ట్రాల్లో వరదలు, తుపా నుల బాధితులకు దీర్ఘకాలంలో మేలు చేకూర్చేలా ప్రభుత్వాల కార్యాచరణ ఉండటం లేదు. ఈ వైఖరి లో మార్పు రావాలి. వరదలు, తుపానుల్ని ఎదుర్కొ నేలా ప్రకృతివిపత్తుల సంఘాల్లో స్థానికుల భాగస్వా మ్యాన్ని పెంచి, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలి. ప్రకృతి వనరుల వినియోగం, యాజమాన్యాలకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిం చాలి. స్థానికుల సాయంతో వాటి అమలుకు ప్రభు త్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అప్పుడే విపత్తు ల దాడిలో కకావికలమవుతున్న జనావళికి భవిష్య త్తుపై భరోసా కలుగుతుంది.విచ్చలవిడిగా ఆన కట్టలు..భారతదేశంలో ప్రధాన పర్వతశ్రేణులైన హిమాలయాలు,పశ్చిమ-తూర్పు కనుమల్లో పర్యావ రణ వ్యవస్థలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఫలితం గా వరదల తీవ్రత ఏటా అధికమవుతోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ-సామాజిక నష్ట ప్రభావాల అంచనా, నష్ట భర్తీలపై సమగ్ర చర్యలు పూజ్యమవుతున్నాయి. భవిష్యత్తు ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాల రూప కల్పనా కొరవడుతోంది. వాతావరణ మార్పులతో హిమగిరులు వేగంగా కరిగిపోతుండటంతో అక్కడి సరస్సులు,నదులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడు తోంది.దానికి మానవ తప్పిదాలుతోడై ఆ పర్వత రాష్ట్రాల్లో విపత్తుల తాకిడి పోనుపోను ఇంతలం తలవుతోంది. ముందుచూపు లేకుండా, ప్రత్యామ్నా య మార్గాలజోలికి పోకుండా సాగు,విద్యుత్‌ అవస రాల పేరుతో నదీప్రవాహాలకు అడ్డంగా నిర్మి స్తున్న భారీ ఆనకట్టల మూలంగానూ సమస్య తీవ్రత అధికమవుతోంది.
భూతాపం :
పెరుగుతున్న భూతాపం మానవజాతిని కబళించే రోజు ఎంతో దూరంలేదంటూ శాస్త్రవేత్తలు అత్యం త తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వ రాదన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేని స్థాయిలో సత్వరం ఫలితమిచ్చే చర్యలు చేపట్టా లని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.’1.5డిగ్రీల సెల్సి యస్‌కు మించి పెరగకుండా నియంత్రించడం లక్ష్య మైనప్పటికీ ఇప్పటికే ఉష్ణోగ్రతలు దాన్ని మించి పోయే దశలో ఉన్నాయి. అదే జరిగితే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను నివారించడానికి ఇప్పటికీ ప్రపంచ దేశాలకు అవ కాశముంది’’అంటూ నివారణోపాయాలనూ సూచి స్తున్నారు.
మూడేళ్ల అధ్యయనం : అనంతరం దక్షిణ కొరి యాలో వారంపాటు శాస్త్రవేత్తలు, అధికారుల మధ్య సమగ్రచర్చ తరువాత ‘ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యా నెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌’ (ఐపీసీసీ) భూఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర పెరిగితే ఆ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై కీలక నివేదిక విడు దల చేశారు.శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య చర్చల సారాంశాన్ని ఆ నివేదికలో పొందు పరిచారు.ఇందులో కొన్ని విషయాల్లో రాజీపడినట్లు గా కనిపిస్తున్నప్పటికీ పలు అంశాలపై విస్పష్టమైన సూచనలు చేశారు. ‘ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కే పరిమితం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలుం టాయి.వాతావరణ మార్పులవల్ల కలిగే దుష్ఫలి తాలను ఇది తగ్గిస్తుంద’ని ఐపీసీసీ ఉపాధ్యక్షుడు జిమ్‌ స్కీ అభిప్రాయపడుతున్నారు.‘భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలనుకుంటే చేపట్టాల్సిన మార్పులపై ఆలోచించాలి. ఇంధన వ్యవస్థలో తేవాల్సిన మార్పులు.. భూవినియోగం తీరుతెన్నుల్లో మార్పులు..రవాణా రంగంలో తీసుకు రావాల్సిన మార్పులు అన్నీ ఆలోచించాలి’ అని అభిప్రాయపడ్డారు.
టార్గెట్‌ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ : ‘తక్షణం చర్యలు తీసుకోండి’ అని పెద్దపెద్ద అక్షరాలతో రాయాలని శాస్త్రవేత్తలు అనుకునే ఉంటారు.వారువాస్త వా లను,గణాంకాలను చూపుతూ ఆ మాట చెప్పాల్సి ఉందని చర్చల్లో పరిశీలకురాలిగా పాల్గొన్న గ్రీన్‌ పీస్‌ సంస్థ ప్రతినిధి కైసా కొసోనెన్‌ అన్నారు.ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా చూస్తే వాతావరణ మార్పుల కారణంగా కలిగే ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలుగుతామన్న ఇంతకు ముందు ఉండేది.కానీ,1.5 డిగ్రీలసెంటీగ్రేడ్‌ను మించి ఉష్ణోగ్రతలుపెరిగితే భూమిపై జీవనయోగ్య త విషయంలో పాచికలాడినట్లేనని ఈకొత్త అధ్య యనం హెచ్చరిస్తోంది.
ఈపరిమితి సాధ్యమే : అయితే, ఇది అత్యవసరంగా జరగాల్సి ఉంది.ప్రభుత్వాలు,వ్యక్తులు..ఇలా ప్రతి స్థాయిలోభారీ ఎత్తున మార్పులు రావాల్సి ఉంది. అంతేకాదు,రెండు దశాబ్దాల పాటు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో2.5శాతం ఇలాంటి చర్యల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక సూచించింది. అప్పుడుకూడా వాతావరణంలోని కర్బనాన్ని సంగ్ర హించడం కోసం చెట్లు ఉండాలి, సంగ్రహణ యం త్రాలను ఉపయోగించాలి. అలా సంగ్రహించిన కర్బనాన్ని భూగర్భంలో పాతరేయాలి. ఈ ప్రక్రియ నిత్యం కొనసాగుతుండాలి.
మనమేం చేయాలి? : ప్రధానంగా ఇంధన, భూవిని యోగం,నగరాలు,పరిశ్రమల వ్యవస్థల్లో సమూల మార్పలు తెస్తేనే భూతాపాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించగలమని ఈ నివేదిక వెల్లడిరచింది. అయితే, వ్యవస్థలతో పాటు మనిషి తనకు తాను ఇలాంటి మార్పులను నిర్దేశించుకోకుంటే లక్ష్యాన్ని చేరు కోవడం కష్టం. ఇందుకు గాను వ్యక్తిగతంగా తీసుకు రావాల్సిన మార్పులనూ ఈ నివేదిక సూచించింది.
ా మాంసం,పాలు, వెన్న వంటి ఉత్పత్తులను కొనడం తగ్గించాలి. అలాగే వాటిని వృథాగా పారబోయడమూ తగ్గించాలి.
ా తక్కువ దూరాలకైతే నడుచుకుంటూ లేదంటే సైకిళ్లపై వెళ్లాలి.
ా విమాన ప్రయాణాలు తగ్గించుకుని బస్సులు, రైళ్లలో రాకపోకలు సాగించాలి.
ా వ్యాపార పరమైన సమావేశాల కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి అందరూ ఒక చోటికి వచ్చే కంటే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ా దుస్తులు ఎండబెట్టేందుకు డ్రయ్యర్లను వాడేకంటే చక్కగా తాడుకట్టి దానిపై ఆరబెట్టడం మంచిది.
ా కొనుగోలు చేసే ప్రతి వస్తువూ కర్బన రహి తమో..లేదంటే తక్కువ కర్బనాలను విడు దలచేసేదో అయ్యుండేలా చూసుకోవాలి.
ా జీవనశైలిలో ఇలాంటి మార్పులను తీసుకు రావడంవల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగు తుందని ఐపీసీసీకి చెందిన మరో ఉపాధ్యక్షురాలు డెబ్రా రాబర్ట్స్‌ చెప్పారు.
ా ఉష్ణోగ్రతలు1.5డిగ్రీలసెంటీగ్రేడ్‌కు తగ్గించ డానికి 5మార్గాలు
ా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 2010 నాటి స్థాయితో పోల్చితే 45 శాతం తగ్గాలి.
ా 2050 నాటికి ప్రపంచ విద్యుత్‌ అవసరాలలో 85 శాతం పునరుత్పాదక ఇంధన వనరులే తీర్చాలి.
ా బొగ్గు వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలి.
ా ప్రపంచవ్యాప్తంగా 70మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంధన పంటలు(జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే మొక్కలు) ఉండాలి. అంటే సుమారు ఆస్ట్రేలియా అంత విస్తీర్ణంలో జీవఇంధనాల తయారీకి ఉప యోగపడే మొక్కలను సాగు చేయాలన్నమాట.
ా 2050 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి.

ప్రామాణిక పరిశోధన కొండరెడ్డి జీవనం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుంటుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయిత్రి డా:కపిలభారతి కలం నుంచి జాలువారిన ‘‘ప్రామాణిక పరిశోధన కొండరెడ్డి జీవనం’’- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

‘‘సాధారణంగా పరిశోధన గ్రంథాలు అంటే కొన్ని పుస్త కాలు నుంచి విషయం తర్జుమా చేసుకుని వ్రాసే ఎత్తి పోతల పథకం’’అనే చిన్న చూపు ఉంది, కానీ ‘డా: కపిల భారతి‘తనదైన అధ్యాపక జీవనంసాగిస్తూ ఇష్టంతో కష్టం లేకుండా చేసిన పక్కా పరిశోధన గ్రంథం ‘ కొండరెడ్డి గిరిజనుల జీవనం’ భాషా సాహిత్యాలు’’
దీర్ఘకాల క్షేత్ర పర్యటనలు, బహుకాల అధ్యయ నంతో కలగలిపి చేసిన ప్రామాణిక పరిశో ధన ఈ గ్రంథం.గిరిజనుల జీవన విధానం సాంస్కృ తి సాంప్రదాయాల గురించి ఇప్పటివరకు చాలా పరిశోధనలు జరిగాయి, వీటికి భిన్నంగా మౌఖిక సాహిత్యం మాత్రమే గల గిరిజనుల యొక్క భాషా సాహిత్యాల గురించి పరిశోధన చేయడం నిజంగా ఒక సాహసమే.!!
భారతదేశంలోని భిన్నమైన గిరిజన తెగల్లో ఒకటైన’’కొండరెడ్డి’’గిరిజన తెగను తన పరి శోధన వస్తు వుగా ఎంచుకోవడంలో అంతరార్థం పరిశోధకురాలు జన్మభూమికి చేరువలో సంబంధిత గిరిజనతెగ ఆవాసాలుఉండటం,ప్రధాన కారణం, దరి మిల పరిశోధకురాలు స్వయంగా ఆ ప్రాంతా లు సందర్శించడమే కాక అక్కడి కొండరెడ్డి గిరిజను లతో మమేకమై వారితో తాత్కాలిక జీవనంచేసి వారి స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి వంద లాదిఫోటోలు,అనేకపాటలు,సంభాషణలు, రికార్డుల రూపంలో భద్రపరచడంతో పాటు వారితో అనేక సార్లు చర్చలు జరిపారు. ఆయా సారాంశాలను కూడా జాగ్రత్త చేసుకుని తన పరిశోధనకు అవసర మైన సరంజామా సమ కూర్చుని,ఆత ర్వాత మార్గ నిర్దేశకుల సూచనలు అనుసరి స్తూ ప్రమాణాలు పాటిస్తూ పూర్తిచేసిన సంపూర్ణ ఆదర్శవంతమైన పరిశోధనాగ్రంథం ఇది. దీనిని మొత్తం ఐదుఅధ్యాయాలు విభజిం చారు మొ దటి అధ్యాయంలో సర్వసాధారణమైన గిరిజ నుల పరిచయం,పూర్వపరిశోధనలు, పద్ధతి, లక్ష్యాలు,తెలుపుతూ కొండరెడ్డి గిరిజనులఉనికి, నివాసప్రాంతాలు,జనాభా,తదితర ప్రామాణిక లెక్కలు పొందు పరిచి తద్వారా భావి పరిశోధ కులకు సమాచార కేంద్రంగా చేశారు. ఇక రెండవ అధ్యాయం మొద లుకొని పరిశోధకు రాలు అసలు కృషిప్రారంభమై భాష విశేషాలు గల ఐదవ అధ్యాయం వరకు కొన సాగుతుంది. ఒక రకంగా చెప్పాలఅంటే దీనిని ‘కొండరెడ్ల సంపూర్ణ మార్గదర్శి’అనాలి.కేవలం కొండ ప్రాం తాల్లో మాత్రమే నివసించేవారు కనుక వీరికి ఆపేరు వచ్చిఉంటుంది అనేభావంతో సరి పెట్టు కోకుండావారి జీవనవిధానంలో ప్రధాన భూమి క గల‘నాగలి రహితవ్యవసాయం’ అయిన పోడు వ్యవసాయం గురించి ప్రస్తావన తీసుకు వచ్చా రు.నల్లమలచెంచులకు,తూర్పు కనుమ ల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ఈకొండరెడ్లకు సారూప్యత కనిపిస్తున్న ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆధునిక సమాజం ద్వారా ప్రభావితం అవుతున్న గిరిజన తెగల్లో అతిఎక్కువ ప్రభావిత గిరిజన తెగగా ,‘కొండ రెడ్లను’ పేర్కొన్నారు పరిశోధకురాలు. కొండరెడ్ల సంస్కృ తిలో వారిఇంటి పేరు గోత్రాలకు ప్రధాన పాత్ర ఉంటుంది.సాధారణంగా వాహనాలకు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉన్నట్టుగానే వ్యక్తు లకు, కుటుంబాలకు,సమూహాలకు,ఇంట పేర్లు గోత్రాలు ఉంటాయి, పండుగలు పెళ్లిళ్లు చావులు సందర్భా ల్లో వీటి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది,కొండ రెడ్డి కుటుంబవ్యవస్థ,వివాహవ్యవస్థ,గ్రామ పాల న వ్యవస్థలతో ముడిపడిఉన్న వారి ఆచార సాంప్ర దాయాలు కూలంకషంగా వివరించారు. పుట్టుక నుంచి మరణంవరకు కొండ రెడ్ల జీవన వ్యవస్థ తీరుతెన్నులు,సంతృప్తికరంగా వివరించారు. అంతే కాక ప్రాంతాలను బట్టి ఆయా గ్రామాలు పంచాయ తీల వారీగా జనాభా లెక్క లు కూడా పొందుపరచ డం ఇందులోని ప్రత్యేక తల్లో ఒకటి. ఈ కొండ రెడ్ల జీవనంలోగల సంఫీు భావంగురించి చెబుతూ వారు వారి సమీప ఇతర తెగలైన ‘నాయకపోడు’ గిరిజనతెగల వారితో కలిసి చేసే‘కొర్రాజులకోపు’ వంటి ఉత్సవాలు,పండుగలు, గురించిన ప్రస్తావన కూడా చేశారు. పోడు వ్యవ సాయం,వేట,అటవీ ఉత్పత్తుల సేకరణ,ప్రధాన పను లుగా జీవనం సాగిస్తున్న వీరు ‘సంచారజీవన విధా నం నుంచి సాగు విధానం వైపు‘మళ్ళిన వారిలో మొదటి వారుగా పేర్కొనవచ్చు.వీరు అటవీ ఉత్ప త్తుల సేకరణలో అంతర్భాగంగా వైద్యానికి అవసర మైన మూలికలు కూడా సేకరించి వైద్యం చేస్తారు, దరిమిలా వీరిని వైద్యులుగా కూడా పరిగణించ వచ్చు.జీవన విధానం మూడవ అధ్యాయంతో ముగించి,నాలుగవ అధ్యాయంలో ఈ పరిశోధనకే శిఖరాయమానం అయిన ‘కొండరెడ్డి మౌఖిక సాహి త్య ప్రస్థానం’ప్రారంభించారు.దీనిలో కథలు, పాటలు,పొడుపు కథలు,సామెతలు,భాషాంశాలు, ప్రధాన సాహిత్య అంశాలుగా చెప్పారు. ‘సాతరా లు’ అని గిరిజనులు పిలుచుకునే కథల్లో కల్పన, భావ ప్రకటన, మానసిక సంఘర్షణకు,ప్రాధాన్యత ఇవ్వబడతాయి దయ్యాలు, భూతాలు,అడవి జంతు వులు,సర్వసాధారణమే!!ఇందులోని కథలను మొదట కొండ రెడ్లు మాట్లాడే మాండలిక భాషలో రాసి తరువాత అందరికీ అర్థమయ్యే తెలుగులో వివరణ అందించారు. దీనిద్వారాసాధారణ తెలు గు భాషకు, కొండరెడ్డి గిరిజనులు ఉపయో గించే తెలుగు భాషకుగల వ్యత్యాసం సారూప్యత తెలుసు కునే అవకాశం ఉంది, వీటి సేకరణలో పరిశోధ కురాలు చేసిన పరిశ్రమ అడుగడుగునా అగుపి స్తుంది.ఇది ఆదర్శనీయమైన పరిశోధనగా చెప్ప డానికి కారణం అవుతుంది. ప్రతి కథ కొండరెడ్ల తెలుగుభాష మాడలికంలో చెప్పి అనంతరం తేట తెలుగులో వ్రాసి ఊరుకోకుండా ప్రతి కథకు చక్కని విశ్లేషణ అందించడంలో కూడా పరిశోధకురాలు సఫలీ కృతురాలు అయ్యారు. వీరి‘సాతురాలు’అన్ని భూమికి,ప్రకృతికి,సంబంధాలు కలిగి ఉన్నాయి. ఎక్కువ కథల్లో మనం అనేకసార్లు విన్న జానపద కదలే కనిపిస్తాయి. ఇక పాటలు విషయానికొస్తే కొండరెడ్లు శ్రమైక జీవన సారథులు, శ్రమను మరిపించేది పాట అలావారి శ్రమజీవనంలో పండుగలు,జాతర్లువంటి సామూహిక కార్యక్రమాల్లో పాటలు వారికి అంతర్భాగమై ఉంటాయి. ఈ పాట ల్లో కూడా జానపద బాణీలు కనిపిస్తాయి. సామూ హిక జీవనంలోని విలువలు చాటేవిగా ఈ పాట లన్నీ కనిపిస్తాయి. మన జానపద సాహిత్యంలో అనుభ వాలకు అద్దంపడుతూ ఆలోచింపజేసే ఒక రకమైన ‘అక్షరక్రీడ’ కొండరెడ్లు పొడుపు కథను వారిదైన మాండలిక ధోరణిలో ‘జిటేల్‌’అని పిలు స్తారు, వీరి జీవనశైలికి అద్దం పట్టే ఈపొడుపు కథల్లోని సంక్షిప్తీ కరణ చిత్రంగా ఉంటుంది. ‘ఎక్కలేని చెట్టుకు లెక్క లేని కాయలు’ అని అడవి మిరప చెట్టును ఉద్దేశించి చెప్పే పొడుపు కథ. ఇది చాలా చిన్నగా ఉంటుంది ఈ చెట్టు ఎక్కలేము కానీ బోలెడు మిరపకాయలు కాస్తుంది.‘గనుపు లేని గంగ వెదురు’ కనుపులు లేకుండా తలపై పెరిగేతల ‘వెంట్రుక’ను ఉద్దేశించి ఈపొడుపుకథ చెబుతారు.ఇక కొండరెడ్ల సామెతలు కూడా వారి జీవనవిధానం నుంచిఆవిర్భవిస్తాయి. ‘విరిగినకత్తి కమ్మరింటికి-మనువు చెడితే పుట్టింటికి’ ‘అందిన వానికి ఆకు వెయ్యి అందని వాడికి కేక వెయ్యి’ వంటి సామెతలు వాడుతారు,అలాగే వారి జీవనంలో అంతర్భాగమైన నృత్యంకోసం ఉపయో గించేవాయిద్యాల గురించి చెబుతూ‘దామగు త్తులు’ అనే గొట్టికాయలతో గిరిజనులు మాత్రమే తయారు చేయగల వాయిద్య విశేషాన్ని సచిత్రంగా పరిచ యం చేశారు. చివరి అధ్యాయమైన ఐదవ అధ్యా యంలో కొండరెడ్డి గిరిజనులభాషా విశేషాలు వివ రణ చేశారు.సాధారణంగా వీరు మాట్లాడేది తెలు గు భాష అయినా అందులో ప్రాచీన తెలుగు పదా లు,శాసనాల్లో కనపడే భాషా పదాలు, కూడా వీరి భాషా మాలికంలో అడుగడుగునా అగుపిస్తాయి. ఈ భాషలో‘ట’కారం బదులు ‘త ’కారం పలకడం, అచ్చులు హల్లు వాడకంలో మార్పు మొదలైన విష యాలు రేఖామాత్రంగా చర్చించి విస్తృత పరిశోధ జరగాల్సిన అవసరాన్ని ఆవిష్కరింపజేశారు.
ఇలా సాధారణ గిరిజన జనజీవనం లోని ఈపరిశోధనలో అనేక అసాధారణ అపురూప విషయాలు ఆవిష్కరించబడి విలువైన పరిశోధన గ్రంథంగా రూపొందించబడిరది. ప్రస్తుతం పరి శోధన గ్రంథాలన్నీ ఎక్కువగా విశ్వవిద్యాలయ గ్రంథాలయ గదులకే పరిమితమై వాటి విలువలు నిర్వీర్యం అవుతున్న వేళ, వ్యయ ప్రయాసలకోర్చి పుస్తక రూపంలో ప్రచురించి అందరికీ అందు బాటులోకి తీసుకువచ్చిన పరిశోధక రచయిత్రి డా: కపిల భారతి కృషి అభినందనీయం ఆచరణీయం, కొండరెడ్డి గిరిజనుల జీవనం

దళిత,ఆదివాసీలకు ప్రత్యేక మహిళా కమిషన్‌

జెండర్‌ సమానత్వ ప్రపంచాన్ని ఊహిద్దాం, కలగందాం, దానికై పనిచేద్దాం. వివక్ష లేని సమాజం, మూస లేని వైవిధ్యాన్ని ఆహ్వానిద్దాం. ఇదీ, 2022 సంవత్సర అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఇతివృత్తం. పురుష పక్షపాతం ఉన్నంత కాలం మహిళలు అన్ని రంగాలలో వెనుకబడే ఉంటారు. అందుకే ‘బ్రేక్‌ ది బయాస్‌’ అని పిలుపునిచ్చారు. ‘మేము స్వేచ్ఛగా విహరించాలని అనుకుంటున్నాం కానీ రక్షణ పేరుతో మమ్ముల్ని కట్టి పడేస్తారు. మీతో పాటు సమానంగా బ్రతకాలని ఆశిస్తున్నాం కానీ సంస్కృతి, మతం, ఆచారాల పేరుతో అణగద్రొక్కుతారు. మరి సగం సమాజం, మానవత స్వేచ్ఛగా లేక పోతే మీకు మాత్రం స్వేచ్ఛ ఎక్కడిది ? స్వేచ్ఛగా ఉన్నామన్న భ్రమ తప్ప’. మహిళా లోకం ఆత్మ ఘోషను ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా?
మనం ఒకఉదాత్త సమాజంలో ఉండే వాళ్ళం. ప్రపంచంలో మతఘర్షణలు, యుద్ధా లు, ఉద్యమాలు ఎక్కడ జరిగినా అంతిమంగా వాటి ప్రభావం మహిళలు,పిల్లలపైనే ఎక్కువగా ఉం టుంది. ఇది మనందరికీ నిత్యం అనుభవంలోకి వస్తున్న సత్యమే. సామాజిక,ఆర్థిక,రాజకీయ రం గాలలో మహిళల పరిస్థితి సింహావలోకనం చేసు కుని,ఇక ముందుఎట్లా అడుగువేయాలి అనే విష యమై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద ర్భంగా నిర్ణయాలు తీసుకోవడం,కార్యాచరణకు పూనుకోవడం పరిపాటి.మరి,మన దేశంలో మహి ళలకి సంబంధించిన గణాంకాలు చూస్తే చాలా దిగులు కలుగుతోంది. నిరుత్సాహం ఆవహిస్తోంది. ఒక్కోసారి ఈలెక్కలు తప్పేమో అనిపిస్తుంది. ప్రభు త్వాలు చాటుకునే గొప్పలు, ఇచ్చే నినాదాలు అన్ని కూడా అబద్ధం అని అనిపిస్తాయి. ఎంత నిరుత్సా హపరిచినా,ఎంత అణచివేతకు గురి అయినా, ఫీనిక్స్‌ పక్షి లాగా మళ్ళీ రెక్కలు విరుచుకుని లేవడ మే మహిళలు చేసే పని. అదే ఉత్సాహంతో మహి ళలు,మహిళా స్వేచ్ఛ కాంక్షించే వాళ్ళు ఈ అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొక్కుబడో,శాలువాలో,పురస్కారాల కోసమో,ఎదో ఒకటి జరుపుకోవడం కూడా అవసరమే. ఆ అవస రం కూడా మహిళలలో పెరుగుతున్న చైతన్యం, అన్యాయాన్ని ఎదిరిస్తున్న సందర్భం, ప్రశ్నించే సమూహాల నుంచి వచ్చిందే అని మరవద్దు. అంత ర్జాతీయ మహిళా దినోత్సవం,భారత స్వాతం త్య్ర అమృతోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షే మ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక మాధ్య మాల ద్వారా మహిళల రక్షణ, సాధికారతకు సంబంధించి అనేక అంశాలపై వివిధ కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు.ఈవారోత్సవాలకు ముగిం పుగా మార్చి8న ‘నారీశక్తి పురస్కార్‌’ పేరుతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళా పోలీసులని సత్కరించనున్నారు.
సరే,మన దేశంలో మహిళలజీవన స్థితి గతుల్లో ఏమైనా మెరుగుదల ఉందా? వాస్తవాలు సంతోషించదగినవిగా లేవు.ఇదొక కఠోర వాస్తవం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2019లో4,05,861మహిళలపై నేరాలు జరిగినట్టు ఆసంస్థ నివేదిక ఒకటి వెల్లడిర చింది. 2018లో కంటే 2019లో ఆనేరాలు 7.3 శాతం పెరిగినట్టు ఆనివేదిక వెల్లడిరచింది.ఆ తరు వాత కొవిడ్‌ కాలంలో ఈనేరాలు మరింత ఎక్కువ గా నమోదయ్యాయన్నది విస్మరించలేని వాస్తవం. ఇప్పటికీ 38శాతం స్త్రీలు పని చేసే స్థలాల్లో వేధిం పులకు గురవుతున్నారు. ప్రతిప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలో లైంగిక హింస వ్యతిరేక కమిటీలు, సాధికా రత కమిటీలు ఉండాలన్న విషయం ఇంకా పటిష్ఠం గా అమలులోకి రాలేదు, పెద్ద పెద్ద విద్యా సంస్థల లో ఈకమిటీల ఊసేలేదు! ఉన్న చోట్ల ఒక పాలసీ గా కాకుండా, మొక్కుబడిగా మాత్రమే ఉన్నాయి. సైబర్‌ కేసుల విషయం చూసినా అవి కూడా స్త్రీలకు వ్యతిరేకంగా జరిగినవే అధికం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్త్రీల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ గడ్డ మీద, తెలం గాణ ఉద్యమాలలో స్త్రీల పాత్ర తక్కువేమీ కాదు కదా.నేడు విద్యా,వ్యాపార,కళల రంగాలలో ఉన్న మహిళలు ఎక్కువే అయినా స్త్రీలపైన నేరాలు అత్య ధికంగా నమోదు అవుతున్నాయి. జాతీయ లెక్కల కంటే మనమే ముందున్నాము.2019 లెక్కల ప్రకా రం దేశంలో 7శాతం నమోదు అయితే తెలంగాణ లో 14.8శాతం నేరాలు పెరిగినాయి, ప్రతిరోజూ కనీసం ముగ్గురు మహిళలు అత్యాచారానికి గురవు తున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 18శాతం నేరాలు అత్యధికంగా నమోదయినాయి. అస్సాం తరువాత సైబర్‌నేరాలు తెలంగాణలోనే ఎక్కువ.ఇక 2022 లెక్కలు తీస్తే ఈనేరాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అధిగమిం చేందు కు ఏంచేయాలి?మహిళలను మొక్కుబడిగా, పావ లావడ్డీ పథకాలకు,ఆసరా పింఛన్‌లకి కుదించ కుండా అన్ని అభివృద్ధి పథకాల్లో, ప్లానింగ్‌లో వారిని సంపూర్ణ భాగస్వాముల్ని చేయాలి. జెండర్‌ సమా నత్వ అవగాహన పెంచటంచిన్నప్పటి నుంచే కుటుంబం,పాఠశాలలోనే మొదలు కావాలి. భేటీ పడావో,భేటీ బచావో నినాదాలకు మాత్రమే కాకుం డా ఒకఉద్యమంలాగా ఆచరణలోకి రావాలి. ఆడ పిల్లలకి,అన్నివర్గాలలోఉన్న పేదఆడపిల్లలకి చదువు కున్నంత మేరకు ఉచిత విద్య ఇవ్వాలి. కళ్యాణలక్ష్మి పథకాలకంటే విద్యకి పెద్ద పీట వేయాలి, ఒకసారి ఆడపిల్ల తనకాళ్ళ మీదతాను నిలబడితే ఈ వరక ట్నాల బెడద తగ్గుతుంది.వరకట్న,బాల్య వివాహాల నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలయేట్టు చూ డాలి. గ్రామస్థాయి నుంచి పట్టణం వరకు అన్ని ప్రదేశా లలోను ఒంటరిస్త్రీలకు రక్షణ,పిల్లలకి విద్య, పెద్ద వాళ్లకి ఉపాధికల్పించాలి. స్త్రీలకి కేటాయిం చిన నిధులు పూర్తిగాస్త్రీల మీద మాత్రమే ఖర్చు చేయాలి. వన్‌స్టాప్‌ సెంటర్ల మీద రాజకీయ,స్థాని కుల జోక్యా లని తగ్గించాలి. అవి స్వతంత్రంగా పని చేసేటట్టు చూడాలి.మహిళా కమిషన్‌తో పాటు,దళిత ఆది వాసీ మహిళలకి ప్రత్యేకమైన కమిషన్‌ ఏర్పాటు చేయాలి.దేశంలో,రాష్ట్రంలో నమోదైన నేరాలలో వీళ్ళ మీదే అత్యధిక శాతం జరిగాయి. కనీసం అవిపోలీస్‌ స్టేషన్ల దగ్గరదాకా కూడా వెళ్లవు. ఒక వేళ వెళ్లినా వివిధ ఒత్తిడుల మూలంగా శిక్ష దాకా పోకుండానే ముగుస్తున్నాయి.వీళ్ళకి ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వరమేన్యాయం జరిగేటట్టు చూడాలి. చివరగా ఈ దేశానికి సావిత్రిబాయి,ఫాతిమా టీచర్ల ని ఆదర్శ మహిళలుగా గుర్తించి,డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పిన కులనిర్మూలనకి స్త్రీల స్వేచ్ఛకి ఉన్న సంబంధాన్ని తెలుసుకొని ముం దుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే జెండర్‌ సమా నత్వం సుసాధ్యమవుతుంది.– (సుజాత సూరేపల్లి)

మనిషిని..మనిషే కాపాడుకోవాలి..!

‘‘ దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏంలాభం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా.. ఎన్ని కీర్తనలు పాడుకున్నా, …ఎన్ని సంప్ర దాయ నత్యాలు చేసినా, …. ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగి పోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది.’’-(డా.దేవరాజు మహారాజు)
ఎలక్ట్రిక్‌ బల్బు ఎంతఅందంగా ఉన్నా, లోన ఫిలమెంట్‌ పోతే బల్బు పనికిరాదు. ఫిలమెంట్‌ సైన్స్‌ ప్రిన్సిపల్‌ మీద తయారయ్యింది. గాజు బల్బూ సైన్సువల్ల వచ్చిందే.మనవాళ్ళు గుళ్ళూ,గోపురాలు చూసి ఆనాటి ఇంజనీరింగ్‌ ప్రతిభ గుర్తించరు. అందులో కల్పించుకున్న ఒక దేవుణ్ణి, శక్తిని…వారి మహత్యాల్ని ప్రవచిస్తుంటారు.వారికి వారే పరవ శించిపోతుంటారు. రామాయణ,భారత,భాగవ తాలు,పురాణాలు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అవే పాత కథలు.మనిషి ఔన్నత్యం ఎక్కడైనా కనిపి స్తుందా? మనిషి, దైవత్వానికి దాసోహం అయిన గాథలు మహోన్నతంగా చెప్పడమే గానీ మరొక టుందా?దైనందిన జీవితంలో దేవుడి ప్రసక్తి, సంభాషణల్లో దైవం,హితబోధలో దైవం,సంగీ తం లో దైవం,సాహిత్యంలో దైవం, నాట్యంలో దైవం… మనిషి ఆత్మవిశ్వాసందెబ్బతీసే కళారూపాలు శతా బ్దాలుగా కొనసాగుతున్నప్పుడు,తరతరాలకు ఆ జా ఢ్యం వ్యాపించక ఏమవుతుందీ? ఇవన్నీ చాలవన్న ట్టు ప్రవచనాల పేరుతో కొందరు తమ తుప్పుపట్టిన భావజాలం ప్రచారంచేస్తుంటారు. మనుస్మృతి లోని విషయాలే గొప్పగా చేసి వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునిక ఆలోచనా ధోరణికి ఏమాత్రం సరిపడని విషయాలు కదా? మన రోజువారీ సంభాషణల్లో ‘అంతా దేవుడి దయ’-‘అంతా పైవాడు చూసు కుంటాడు’-‘ఈశ్వరాజ్ఞ లేనిది చీమైనా కదలదు’ -లాంటి మాటలు వింటూ ఉంటాం. ఏమీ తెలి యని పసిపాపలకు ‘జేజకొడతాడు దండం పెట్టు’ -‘జేజ తీసుకు పోయాడు’-‘దేవుడి దగ్గరికి వెళ్ళి పోయింది’ లాంటి మాటలు ఆ పసితనంలోనే నూరిపోస్తుంటారు. సామాన్యుడు చస్తాడు / కన్ను మూస్తాడు/మరణిస్తాడు.కానీ ఆధ్యాత్మిక గురు వులు ఈశ్వరుడిలో ఐక్యమైపోతారు.చచ్చాడని గౌరవంగా చెప్పడం..అంతే- జీవశాస్త్ర పరంగా ఏచావైనాఒకటే! ఇంతెందుకూ నాస్తిక,హేతువాద సంఘాల్లో పనిచేస్తున్న వారందరివీ దేవుడి పేర్లే. అవన్నీ వాళ్ళు పెట్టుకున్నవి కావు. ఆనవాయితీ ప్రకారం పెద్దలుపెడుతూ,పెడుతూఉండగా వచ్చి నవి.నా ఇంటిపేరులో కూడా దేవశబ్దం ఉంది. అది నేను పెట్టుకున్నది కాదు. అంటే నిస్సహా యంగా మనం మనువాదుల కుట్రలో కూరుకు పోయాం.బయటపడే మార్గాలు వెతకాలి! ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాలు.మనకు అనుభవంలోకి వస్తున్న విషయాలు.మరి ప్రపంచమంతా ఇలాగే ఉందా-అంటే లేదు. కొంచెం స్థాయి పెంచుకుని, విశాల హృదయంతో ప్రపంచదేశాల్లోని పరిస్థితిని గమ నిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది అర్థం చేసుకో వచ్చు.ఉదాహరణకు ఒక విషయం చూద్దాం. ఒకఊళ్ళో ఒక చిన్న బళ్ళో ఒకటో తరగతిలో ఇరవై మంది పిల్లలున్నారనుకుందాం. అందులో కొందరు పదో తరగతి వరకైనా రాకుం డానే మానేస్తారు. మరికొందరు పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష పాస్‌ కాకుండా ఆగిపోతారు. ఇంకొం దరు జూనియర్‌ కాలేజిలో,కొందరు డిగ్రీలో ఆగి పోతారు.అవన్నీదాటి శాస్త్రవేత్తో,ఇంజనీరో, కంప్యూ టర్‌ నిపుణుడో,డాక్టరో,ప్రొఫెసరోఅయ్యేది అందులో ఏఇద్దరు ముగ్గురో ఉంటారు. ఇందులో పదో తర గతిలో కూడా ఉత్తీర్ణులు కానివారు ఆచారాల చాటున,పంచాంగాలచాటున,గుళ్ళచాటున,దేవుళ్ళ చాటున దాక్కుని పొట్టపోసుకుంటున్నారనుకుం దాం.వీళ్ళు సంప్రదాయంపేరుతో,విద్యావం తుల్ని, జ్ఞానవంతుల్ని,సంస్కారుల్ని అందరినీ తమ ఆధీ నంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆత్మ, పరమాత్మ,పునర్జన్మలాంటి మాటలు చెప్పి భయ పెడుతుంటారు.నిరూపణ లేని అనుభవాలు, అను భూతులు,సెంటిమెంట్లు,దేవుడితో సెటిల్‌మెంట్లు చెపుతూ,పిట్టకథలతోజనాన్ని రంజింపజేస్తుంటారు. ఇవాళ కాకపోయినా రేపు..జనం నిజం గ్రహి స్తారు. కారణాన్ని అన్వేషిస్తారు. తప్పదు-కొందరు తమ ఇంగిత జ్ఞానాన్ని వదిలేసి అజ్ఞానుల మాటల కు విలువనిస్తుంటారు. తమ కన్నా ఆ పంతుళ్ళకు, ముల్లాలకు,పోప్‌లకు,మతాధిపతులకు ఏదో ఎక్కువ తెలుసుననుకుని వారిని అనుసరిస్తుంటారు. వారు చెప్పేవన్నీ మనిషి ఎప్పుడో ప్రాథమిక దశలో ఏర్పరుచుకున్న ఆచారాలు! మరి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అవి ఎంత వరకు అనుసరణీయం? అన్న ప్రశ్న వేసుకోరు. ఏదోగుడ్డిగా, తాతలు చేశారు, తండ్రుల చేశారు, మనమూ చేసేస్తే పోదా?అని అనుకుంటూ ఉంటారు. భయస్తులు, పిరికివాళ్ళు, తమ శక్తిని తాము తెలుసుకోలేని వాళ్ళు-తమ మెదడును తాము ఉపయోగించని వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది.
మనిషికి రాయిని కూడా దేవుణ్ణి చేసే శక్తి ఉంది. మరి ఆ దేవుడు గనక ఉంటే, మనిషినైనా మనిషిగా చేస్తాడా? చేయలేడు. ఎందుకు చేయ లేడూ అంటే…అలాంటి వాడు ఎవడూ లేడు గనక చేయలేడు. మనిషి, మనిషిగా కావాలంటే మనిషి మాత్రమే ప్రయత్నించాలి. దైవ విశ్వాసంతో సమా జంలో రోజూ ఎన్ని ఘోరాలు జరుగు తున్నాయో తెలుసుకోవాలి. విశ్లేషించుకోవాలి. దైవ విశ్వాస రహిత, మానవ నైతిక సమాజానికి రూపకల్పన చేసుకోవాలి. పునర్జన్మ ఉంటుందన్న విశ్వాసంలో జనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. తమిళనాడు తిరుచ్చి జిల్లా చొక్కంపట్టికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ మేరి (75) 2021 అక్టోబర్‌ మొదటి వారంలో మరణించారు. కూతుళ్ళు జెసితా(43), జయంతి(40)ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఏడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడే అనుకోకుండావాళ్ళింటికి బంధువులు వచ్చా రు. వారికి రిటైర్డ్‌ టీచర్‌ మరణించిన సమా చారం లేదు. తమ తల్లి పునర్జన్మకోసం బైబిల్‌తో తాము ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే,బంధువులు వచ్చి అంతరాయం కలిగించారంటూ ఆకూతుళ్ళు బం ధువుల్ని తరిమికొట్టారు.మృతదేహం పక్కన ప్రార్థ నలు చేస్తున్నారని వాళ్ళు ఊళ్ళో వాళ్ళకు, పోలీసు లకు తెలిపారు.పోలీసులు రంగప్రవేశం చేసి, మృత దేహం స్వాధీనపరుచుకుని,కూతుళ్ళను వైద్య పరీ క్షలకు పంపించారు. ఇలాంటి సంచలన సంఘట నలు మనం తరచూ టెలివిజన్‌ తెర మీద చూస్తూనే ఉన్నాం.
ఉత్తరాఖండ్‌ బాగేశ్వర్‌ జిల్లా కదిరియా గ్రామంలో2021అక్టోబర్‌ మొదటి వారంలో జరి గిన సంఘటన! కుల వివక్షతో ప్రాణాలు తీయడం ఈరోజుల్లో ఎంతో సులభమైపోయింది. సోహాన్‌ రామ్‌(31)పిండిమరలో గోధుమలు ఆడిరచి పిండి తీసుకుపోతుండగా లలిత్‌ కర్నాటక్‌ అనే అగ్రకుల స్థుడు చూసిఅడ్డగించాడు. అతనువృత్తిరీత్యా ఉపా ధ్యాయుడు.పిండిమర మలినమైందని ఆక్రోశిస్తూ, దళితుడైన సోహాన్‌ని అతనికులాన్ని తీవ్రంగా దూషించాడు. అనవసరంగా ఎందుకు దూషిస్తు న్నారని సోహాన్‌ అడిగినందుకు-పిండిమర అంద రూ ఉపయోగించేదేనని గుర్తుచేసినందుకు ఉక్రోషం పట్టలేని అగ్రకులఉపాధ్యాయుడు, కొడవలితో నరికి సోహాన్‌ను హత్య చేశాడు. హంతకుణ్ణి పోలీసులు జైలుకు పంపించారు. పిండిమర మలినం కావడం ఏమిటో? వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన వాడికే సరైన ఆలోచన లేకపోవడంఏమిటో? మన పవిత్ర భార తావనిలో ఏదైనా సాధ్యమే! దేవుడనేవాడు ఉంటే ఇలాంటివి ఎందుకుఎలా జరిపిస్తున్నాడూ? ప్రపం చానికి ఆధ్యాత్మిక వెలుగులు పంచిన మన భారత దేశంలో అదేమిటో ఇలాంటి సంఘటనలు ఎక్కువ గా జరుగుతున్నాయి. అయితే ఇతర సమాజాలు ఇలాంటివి లేకుండా ఏమీ లేవు. ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఏమన్నారో చూడండి…! ‘’మసీదులో ప్రార్థన చేస్తుండగా ఆఫ్ఘనిస్తాన్‌లో షియాలను సున్నీ లు చంపుతారు.హజారా సమాజాన్నితాలిబన్‌ చంపుతుంది.పాకిస్తాన్‌లో షియాల్ని,అహ్మదీ యుల్ని, క్రైస్తవుల్ని సున్నీలు చంపుతారు.ఏదేశంలో మైనార్టీ లకు రక్షణ లేదో..ఆసమాజాలు కచ్చితంగా నాగరి కం కాదు’’ అని!
‘’నాకు ఈరోజు అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం దొరికింది’’ అన్నాడు భర్త భార్యను ఉడికిస్తూ… ‘’ఓడియర్‌ ఎంత మంచి మాట? మరి ఏమడ గాివ్‌?’’ అంది భార్య. ‘’ఏముందీ? నీ తెలివితేటలు పదింతలు పెంచుమని అడిగా!’’అన్నాడు భర్త. ‘’ఓ ధ్యాంక్యూ! డాళ్లింగ్‌!! నా గురించి నీకెంత శ్రద్ధా?’’ అంది భార్య.‘’కాని యేం లాభం సున్నాను ఎన్నిం తలు చేస్తే మాత్రం ఏం ఫలితం సున్నా-సున్నాయే కదా?’’ అని చల్లాగా చెప్పాడు భర్త లోలోన తన తెలివికి తానే మురుస్తూ! ఇది జోకేఅయినా, ఇందు లో ఒక విషయం ఉంది. భార్యా భార్తల మధ్య సరదా మాటలు పక్కనపెట్టి, మనం మతాలు-దేవుడు విషయం ఆలోచిస్తే..అదీ దాదాపు ఇలాగే ఉంటుంది. దేవుడి ఉనికే శూన్యమైనప్పుడు దాన్ని ఎన్ని ఆర్భాటాలతో హెచ్చవేస్తే మాత్రం ఏం లా భం? సున్నా సున్నాయే కదా? దైవ భావన చుట్టూ ఎన్ని శాస్త్రాలు రాసుకున్నా, ఎన్ని కీర్తనలు పాడు కున్నా, ఎన్ని సంప్రదాయ నృత్యాలు చేసినా, ఎన్ని ఆచార వ్యవహారాలకు రూపకల్పన చేసినా ఏం లాభం? పునాదిలేని భవనం కూలిపోవాల్సిందే! పుచ్చిన కర్ర విరిగిపోవాల్సిందే!! మనిషే, మనిషిని కాపాడుకోవాల్సి ఉంది- వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత,జీవశాస్త్రవేత్త

1 2