పర్యావరణ వినాశనం..

విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా.. కోలుకోవ డానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. సాధారణంగా విపత్తులు రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్‌,సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి. భూమి వేడెక్కటం(గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌), కాలు ష్యం,అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు. ఈ రెండు రకాల విపత్తు లు ప్రాణ,ఆస్తి,పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి.కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2009,డిసెంబర్‌ 21న ఒక ప్రతి పాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్‌ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని Iఅ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ణaవ టశీతీ ణఱంaర్‌వతీ Rఱంస Rవసబష్‌ఱశీఅఅధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు,రిస్క్‌ అవేర్‌నెస్‌ గురించి ప్రమోట్‌ చేస్తుంది ఈ దినో త్సవం. మొదట్లో నేచురల్‌ డిజాస్టర్‌ రెడక్షన్‌ డేగా ఉండేది. 2002లో ఐరాస ఓరెజల్యూషన్‌ పాస్‌ చేసింది.విపత్తులు సంభ వించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’.. అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే. అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా. ఈదిశగా ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆదశాబ్దం మొత్తాన్ని ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే.. ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు. రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి. ముందస్తు చర్యలు చేపట్టాలి.లోపాలను అధిగ మించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగా లను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’..ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గిం చాలనేది ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశం
మన దగ్గర..
భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ,చట్టం వచ్చింది మాత్రం 2005లో.విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం,రాష్ట్రం,జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో చాలా మార్పు వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్‌ ఎఫ్‌ (సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది. మరో వైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది.
విపత్తు నిర్వహణ
జీలం,చీనాబ్‌,రావి,సట్లెజ్‌,బియాస్‌,ఘాగ్రా నదులతో కూడిన వాయవ్య నదీపరివాహక ప్రాంతం,తపతి,నర్మద,మహానది,వైతరణి, గోదా వరి,కృష్ణా,పెన్నా,కావేరి నదులతో కూడిన ద్వీప కల్ప నదీ పరివాహక ప్రాంతాలు వరదకు ప్రభావితమవుతున్నాయి.ఏపీ,తమిళనాడు, ఒడిశా,కేరళ తీరప్రాంతాలు,అసోం,ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తరుచూ తీవ్ర వరద ముంపునకు గురవుతుంటాయి. జీవాయుధాలు కలిగించే జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించలేం. ప్లేగు,స్మాల్‌ఫాక్స్‌వంటివి వేగంగా సోకే కార కాలను గుర్తించడంలో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో శత్రుసైన్యాన్ని చంపే విధానంలో భాగంగా బుబోనిక్‌ ప్లేగు (గ్రంథులు ఉబ్బడం) వ్యాధితో మరణించిన వారి శవాలను రాజు కోటలో విసిరేవారు.ఉదా: 1346 కఫా సంఘటన. 14 22 కరోల్‌స్టీన్‌ సంఘటన. విపత్తు అనేది ఒక అపాయకరమైన స్థితి. దేనివల్ల ప్రజల ప్రాణా లు,ఆస్తులకు ముప్పు వాటిల్లుతుందో ఆ స్థితిని విపత్తు (ణIూAూుజుR) అంటారు.ఒక సమాజం తన సొంత వనరులతో కోలుకోలేని విధంగా,సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణ నష్టం,ఆస్తినష్టం,పర్యావరణ వనరులను విలు ప్తం చేసి,మౌలిక సౌకర్యాలకు,నిత్యావసర సేవలకు,జీవనోపాధికి,మానవ దైనందిన జీవి తానికి అంతరాయం కలిగించే ఒక సంఘటన లేదా వరుస ఘటనలను విపత్తు అంటారు.
ఐక్యరాజ్యసమితి
విపత్తును ఐక్యరాజ్యసమితి సమాజపు లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మా త్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపద అని నిర్వచించింది. సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి సంరక్షించడానికి అసా ధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉప ద్రవ పరిస్థితి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలు కోడానికి వెలుపలి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవరమయ్యే విధంగా నష్టానికి, ఆర్థిక విధ్వంసానికి, మానవ ప్రాణ నష్టానికి ఆరోగ్యం, ఆరోగ్య సేవలను పతనం చేసే ఏదైనా సంఘటన అని నిర్వచించింది.ఒక దుర్ఘటనను విపత్తుగా పిలవాలంటే ఎన్ను కోవాల్సిన ప్రమాణాలు లేదా ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కనిపించే లక్షణాలు
సమాజ సాధారణ మనుగడ దెబ్బతినడం
ధన,ప్రాణ,ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడం, ప్రజల జీవనోపాధి దెబ్బతినడం,విపత్తు ప్రభావానికి లోనైన సమాజానికి ఆస్తులు, అక్కడి ప్రజల పునర్నిర్మాణానికి వెలుపలి నుంచి సహా యం అవసరం అన్నంతగా దాని తీవ్రత ఉం డటం,దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమై,అక్కడి పర్యావరణం దెబ్బతిని, సుస్థిరాభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండటం.ముఖ్యంగా 1. వైపరీత్యం,2.దుర్బలత్వం,3 సామర్థ్యం, 4. ఆపద అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు, పర్యావరణానికి ప్రకృతి చేతగాని లేదా మానవ కారకంగా గాని నష్టాలు సంభ విస్తే దానిని వైపరీత్యం అంటారు.
వైపరీత్యాలను – జిఎన్‌వి సతీష్‌