నా విజయం వ్యక్తిగతం కాదు..

‘‘ నేను రాష్ట్రపతిగా
ఎన్నిక కావటం
ఆదివాసీల విజయం…’’

‘ఒడిశాలోని ఓమారుమూల ఆదివాసీ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన నేను దేశ అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా..ఇది నావ్యక్తిగత విజయం మాత్రమే కాదు…దేశ పేద ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామి నేషనే ఓరుజువు. నాకు ప్రాధమిక విద్య చదువుకోవడమే ఓకలగా ఉండేది. అలాంటిస్థాయి నుంచి ఇక్కడి దాకా రాగలిగాను…50ఏళ్ళ స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీ య జీవితం ప్రారంభమైంది.

Read more

అలుపెరగని పోరాటాలు…

కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం… – గునపర్తి సైమన్‌

Read more

ఆదివాసీల భాషా మాటేమిటి ?

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమ్కెంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడిరది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది. తెలుగు భాషాభిమానులు, పండి తులు తెలుగు భాష ఇంగ్లీష్‌ ప్రపంచంలో కొట్టుకుపోతుందని ఎక్కడలేని బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎవరి భాషను వారు అభిమానించటంలో, పరభాష నుంచి తమ భాషను రక్షించుకోవటంలో తప్పు ఏమీలేదు. నా బాధంతా తెలుగు ప్రపంచంలో ఆదివాసీ భాషలు ఏవిధంగా కొట్టుకుపోతున్నాయో ఈ పండితులు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సదస్సులో ఆదివాసులను తెలుగు ప్రజలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆదివాసీ భాషల ఉనికినే తుడిచిపట్టే ప్రమాదం ఉంది.

Read more

పథకాల మీద కన్నేసిన పాలకులు

వేళ్ళ మీదలెక్క పెట్టగలిగిన బడా కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు గత ఏడు సంవత్సరాల మోడీపాలనలో రూ.10లక్షల 72వేల కోట్లరూణాలు రద్దు చేశారు.13కంపెనీలు బ్యాం కుల్లో తీసుకున్న రూ.4లక్షల50వేల కోట్ల రుణాలను రూ.లక్ష 61వేల కోట్ల తగ్గింపుతో ‘సెటిల్‌మెంట్‌’ చేశారు.ఈ మొత్తం డబ్బు గ్రామీణపేదల ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేసి వుంటే సుమారు 14 సంవత్సరాల వరకు పేదలకు పని కల్పించి కొద్ది మేరకు ఆకలి తీర్చివుండవచ్చు. అలా చేయలేదు కాబట్టే ప్రపంచ ఆకలి సూచి 116దేశాల జాబితా లో మన దేశం101వ స్థానంలో నిలిచింది. మన కంటే ఆకలితో అల్లాడుతున్న దేశాలు కేవలం 15 మాత్రమే. ఇది మన అన్నపూర్ణకు పట్టిన ఆధోగతి.

Read more

ఊరు ఉండమంటున్నది.. గోదారి పొమ్మంటున్నది…!

ఊరు ఉండమంటున్నది,గోదారి పొమ్మం టున్నది. ఊరు ఏరు రెండు ఉనికిని ఇచ్చేవే. కానీ రెండూ ఇపుడు వేలాది మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. ఊరు మునిగి పోయింది, గోదావరి వరదై ముంచేసింది. ఇది మనసును ముల్లులా గుచ్చే సమస్య. చిత్రమయిన సమస్య. పోలవరం ప్రాజక్టు నిర్వాసితులు ఎదుర్కొం టున్న హృదయ విదారకమయిన సమస్య. కొన్ని వేల మంది ప్రజలు పోలవరం ప్రాజక్టు వల్ల నిర్వాసితుల య్యారు. వాళ్ల పునరావాసం మాత్రం జరగడం లేదు. వాళ్ల కోసం కొన్ని పునరావాస కాలనీలు కట్టారు. లెక్క ప్రకారం వాళ్లు ప్రాజక్టు ముంపునకు గురవుతున్న గ్రామాలు వదిలేసి, ఈ పునరావాలస కాలనీలలో స్థిరపడాలి.ఇది చెప్పుకునేందుకు చక్కటి మాట. అయితే,ఈ వేలాది మంది ప్రజలు.ఊ .ర్లొదలడానికి సిద్ధంగా లేరు. వరద ముంచుకొస్తున్నది. అధికారులు ఊర్లలోకి వచ్చి వెంటనే ఖాళీచేయండని హెచ్చరి స్తున్నారు.

Read more

ప్లాటీనం జూబిలీ స్వాత్రంత్య్ర సంబరాల సవివరంగా 

భారతదేశం సామ్రాజ్యవాదుల చేర నుండి బయటపడి స్వతంత్య్ర దేశంగా అవతరించి 75 సంవత్సరాలైంది. స్వాతంత్య్ర సాధన కోసం నేలకొరిగిన అసంఖ్యాకుల త్యాగనిరతికి పునరంకితమయ్యే ఉద్విగ్న సమయమిది. గాంధీ,నెహ్రూ,పటేల్‌ అకుంఠిత పోరాట పటిమకు ముందు రాణిలక్ష్మీబాయి,మంగల్‌ పాండే,భగత్‌ సింగ్‌,సుభాష్‌ చంద్రబోస్‌ అస్ఫకు ల్లా ఖాన్‌,రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్‌ మరియు ఉద్ధం సింగ్‌ వంటి ఎందరో త్యాగధనుల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈస్వాతం త్య్రం. దేశానికి స్వతంత్రాన్ని సిద్ధించి పెట్టిన అమరవీరులకు భారత జాతి సర్వదా రుణపడి ఉంటుంది. మన స్వాతంత్య్ర సంగ్రామం అజరామరమైనది.. శత్రుశేషం లేనిది. చాలా దేశాలు స్వాతంత్య్రాన్ని పొంది ఉండవచ్చు, అట్టి స్వాతంత్రం కోసం ఆదేశ సైనికులు వీరోచితంగా పోరాటం చేసి ఉండవచ్చు, కానీ మన స్వాతంత్య్ర సంగ్రామంలో అసంఖ్యాకమైన ప్రజానీకమే అన్ని రకాల సైన్యం. సత్యం, అహింసా,శాంతి ఆయుధాలుగా పోరాడి సాధించిన ప్రత్యేకత ఇది.

Read more

దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..!

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో 75 ఏళ్ల స్వాత్రంత్య్ర వేడుకలను వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపడుతోంది. పౌరుల్లో దేశభక్తి పెంపొందేలా పలు అవగాహన కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కో ఆపరేటివ్‌ సొసైటీలు ఇలా అన్నీ ప్రభుత్వ, ప్రభుత్వేయతర సంస్థలన్నీ ఈ క్యాంపెయిన్‌లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రకటనల్లో హర్‌ ఘర్‌ తిరంగా క్యాంపెయిన్‌కి విస్తృత ప్రచారం కల్పించారు.

Read more

అపూర్వ సాహితీ సింగిడి ఆదియోధులు

కప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుంటుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణ కలం నుంచి జాలువారిన ‘‘అపూర్వ సాహితీ సింగిడి ఆదియోధులు’’

Read more

బీటలు వారుతున్న రాజ్యాంగ సౌధం

ఈ ఎనిమిదేళ్ల పాలనలో దళితులకు భూములు పంచలేదు. దళితులపై జరిగే అత్యాచారాల విషయంలో ఎటువంటి విచారణ లేదు. అస్పృశ్యతా నివారణ చట్టాన్నే కాక,1989 ఎస్సీ,ఎస్టీ అత్యా చారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే సకల ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం ఈనాడు రాజ్యాంగ సంక్షోభంలో ఉంది. దేశంలోని ప్రధాన పాలక వర్గాలు నిరంతరం రాజ్యాంగ ఉల్లంఘనకై ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగం ఒక సామాజిక సాంస్కృతిక విప్లవ మార్గం. రాజ్యాంగం భారతదేశ నిర్మాణ సౌధం. భారతదేశానికి ఒక నిర్మాణాత్మక పరిపాలనా క్రమాన్ని ఇవ్వడానికి అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 20వ తేదీన దేశాన్ని సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా ప్రకటించారు. రాజ్యాంగంలో ప్రధాన సూత్రం ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం.

Read more

నిధులు లేకుండా విద్యాప్రమాణాలెలా?

‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ అంటారు. విద్యా వ్యవస్థకు ఉన్నతవిద్య ఆకాశ హర్మ్యమైతే, పాఠశాల చదువు పునాది. ఈ రెండిరటికీ సమతూ కంగా నిధుల కేటాయింపు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం. విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలు పెంచుకో వడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికపర మైన ప్రోత్సాహం అవసరం. కానీ తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నది. ఈసారైనా కేంద్రం తగిన నిధులను ఇవ్వాలి’

Read more
1 2